bomb blast
-
Brazil: సుప్రీంకోర్టు వద్ద పేలుడు.. ఒకరు మృతి
బ్రసీలియా: బ్రెజిల్ సుప్రీంకోర్టు వద్ద భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. రెండు సార్లు పేలుడు సంభవించగా ఒకరు మృతి చెందారు. దీంతో, అప్రమత్తమైన సిబ్బంది కోర్టు లోపల ఉన్న జడ్జీలు, ఇతర సిబ్బందిని ఖాళీ చేయించారు. పేలుడు కారణంగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది.వివరాల ప్రకారం.. బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలోని సుప్రీంకోర్టు వద్ద భారీ పేలుడు సంభవించింది. కోర్టు ప్రాంగణంలో రెండుసార్లు పేలుడు జరగడంతో ఒకరు మృతి చెందారు. దీంతో, అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు.. సుప్రీంకోర్టు లోపల ఉన్న జడ్జీలు, ఇతర సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించారు. అనంతరం, కోర్టు సమయం ముగిసిన వెంటనే భారీ స్థాయిలో పేలుళ్లు జరిగాయని అధికారులు ప్రకటన విడుదల చేశారు. పేలుళ్ల ఘటనలో చనిపోయిన వ్యక్తి ఎవరనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. పేలుడు ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. అయితే, పేలుడు సంభవించిన ప్రాంతానికి దగ్గరలోనే ప్రెసిడెంట్ లూలా డెసిల్వా భవనం కూడా ఉంది. పేలుడు జరిగిన సమయంలో ప్రెసిడెంట్ భవనంలో లేరని అధికారులు వెల్లడించారు.🚨🇧🇷 EXPLOSIONS ROCK BRAZIL’S SUPREME COURT, 1 DEADTwo blasts near Brazil's Supreme Court left one dead. Justices safely evacuated as police secure the area. Investigations are ongoing.pic.twitter.com/g6CRmcL6CT— Mario Nawfal (@MarioNawfal) November 13, 2024 -
ఢిల్లీలో 'ముంబై అండర్వరల్డ్' పరిస్థితి: సీఎం అతిషి
ఢిల్లీ: ఢిల్లీ రోహిణిలోని ఓ పాఠశాల సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై అతిషి కేంద్రంలో ఉన్న బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితి.. అండర్వరల్డ్ కాలంతో ముంబైలా మారిపోయిందని ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు.‘ఢిల్లీలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉంది. కానీ బీజేపీ శాంతిభద్రతలను పట్టించుకోదు. ఢిల్లీ ప్రభుత్వాలు చేస్తే.. పనికి అంతరాయం కలిగించడానికి మాత్రం తన పూర్తి సమయాన్ని ఉపయోగిస్తుంది. అందుకే ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి.. అండర్ వరల్డ్ కాలంలో ముంబైలా తయారైంది. బహిరంగంగా బుల్లెట్లు పేల్చుతున్నారు. గ్యాంగ్స్టర్లు డబ్బు వసూలు చేస్తున్నారు. నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. శాంతి భద్రతలను కాపాడే ఉద్దేశం లేదా అదుపులోకి తీసుకువచ్చే సామర్థ్యం బీజేపీకి లేదు’ అని అన్నారు.रोहिणी स्थित एक स्कूल के बाहर Bomb Blast की घटना दिल्ली की चरमराती सुरक्षा व्यवस्था की पोल खोल रही है। दिल्ली में लॉ एंड ऑर्डर की जिम्मेदारी भाजपा की केंद्र सरकार के पास है। लेकिन भाजपा अपना ये काम छोड़कर सारा समय दिल्ली की चुनी हुई सरकार के कामों को रोकने में लगाती है। यही…— Atishi (@AtishiAAP) October 20, 2024ఇక.. పొరపాటున ఢిల్లీ వాసులు బీజేపీకి ప్రభుత్వ బాధ్యతలు అప్పగిస్తే.. ఆసుపత్రులు, విద్యుత్, నీటి సరఫరా పరిస్థితి ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి మాదిరిగానే దారుణంగా మారుతుందని సీఎం అతిషి ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని రోహిణిలో ప్రాంతం ఓ పాఠశాల గోడపై బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. పేలుడు ధాటికి పాఠశాల గోడను ద్వంసమై.. సమీపంలోని కార్లు దెబ్బతిన్నాయి.చదవండి: ఢిల్లీ పేలుడు: ఖలిస్తానీ హస్తంపై టెలిగ్రామ్కు లేఖ -
ఢిల్లీ పేలుడు: ఖలిస్తానీ హస్తంపై టెలిగ్రామ్కు లేఖ
ఢిల్లీ ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. అయితే.. ఈ ఘటనకు నాటు బాంబే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ), సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)ల బృందాలు విచారణ చేపట్టాయి.ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాదులను భారత ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ.. ప్రతీకారంగా ఈ పేలుడు జరిగిందని టెలిగ్రామ్లో ఓ పోస్ట్ వెలుగులోకి వచ్చింది. ‘జస్టిస్ లీగ్ ఇండియా’ పేరుతో ఓ టెలిగ్రామ్ ఛానెల్ ఈ పోస్ట్ను పెట్టినట్లు పోలీసులు గురించారు. దీంతో ఈ దాడికి ఖలిస్థాన్ వేర్పాటువాదులు పాల్పడి ఉంటారని దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఘటనకు ఖలిస్తాన్ వేర్పాటవాదులకు ఉన్న లింక్ను పరిశీలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. తాజాగా ‘జస్టిస్ లీగ్ ఇండియా’ పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఛానెల్కు సంబంధించిన వివరాలను ఇవ్వాలని దర్యాప్తు బృందం లేఖలో కోరింది. అయితే.. టెలిగ్రామ్ నుంచి దర్యాప్తు సంస్థలకు ఇంకా ఎంటువంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు.ఇక.. ఈ పేలుడు తీవ్రతకు స్కూలు ప్రహరీ, ఆ సమీపంలోని దుకాణాల అద్దాలు, ఒక కారు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. మరోవైపు.. పండగ సీజన్లో ఇప్పటికే రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్నాయి. ఘటన నేపథ్యంలో మరింత అప్రమత్తత ప్రకటించారు. -
ఢిల్లీలో సీఆర్పీఎఫ్ స్కూలు వద్ద పేలుడు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద ఆదివారం ఉదయం 7.50 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కలకలం రేపిన ఈ ఘటనకు నాటు బాంబే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ), సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)ల బృందాలు విచారణ చేపట్టాయి. అక్కడ లభించిన తెల్లటి పదార్థం అమోనియం నైట్రేట్, క్లోరైడ్ల మిశ్రమం కావచ్చని భావిస్తున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. ఇంకా పేలుడు పదార్థాలుండొచ్చనే అనుమానంతో ఎన్ఎస్జీ కమాండోలు సమీప ప్రాంతాల్లో రోబోలతో గాలింపు జరిపారు. ‘పేలుడు తీవ్రతకు స్కూలు ప్రహరీ, ఆ సమీపంలోని దుకాణాల అద్దాలు, ఒక కారు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. పేలుడుకు కొద్ది క్షణాల ముందే ఘటనాస్థలి మీదుగా కొన్ని ద్విచక్ర వాహనాలు వెళ్లాయని, లేకుంటే పెనుప్రమాదమే జరిగి ఉండేది’ అని అధికారులు వివరించారు. పేలుడుతో మంటలు చెలరేగలేదని ఫైర్ అధికారులు తెలిపారు. రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ పోలీసులు పేలుడు పదార్థాల చట్టం తదితర వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పండగ సీజన్లో ఇప్పటికే రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్నాయి. ఘటన నేపథ్యంలో మరింత అప్రమత్తత ప్రకటించారు. -
డెన్మార్క్లో వరుస బాంబు పేలుళ్లు
కోపెన్హాగన్:డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. బుధవారం(అక్టోబర్2)ఉదయం జరిగిన ఈ పేలుళ్లలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని డెన్మార్క్ పోలీసులు ప్రకటించారు.పేలుళ్లపై ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధవాతారణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుళ్లు చోటు చేసుకోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ చదవండి: ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైళ్ల దాడులు -
తమిళనాడు ప్రజలకు కేంద్ర మంత్రి క్షమాపణలు
చెన్నై: రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటనను తమిళనాడు ప్రజలతో ముడిపెడుతూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే చేసిన వ్యాఖ్యలు గతంలో వివాదాస్పదం అయ్యాయి. ఈ ఏడాది మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడు ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.అయితే.. రామేశ్వరం కెఫే బాంబు పేలుడులో నిందితుడు మల్నాడు వాసి అని, గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఆయుదాల వినియోగంపై శిక్షణ తీసుకున్నాడంటూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే అన్నారు. దీంతో కేంద్ర మంత్రిపై మధురైలో కేసు నమోదు అయింది. తాజగా ఆమె తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెబుతూ మద్రాస్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇక.. గతంలోనూ సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను న్యాయమూర్తి జస్టిస్ జీ. జయచంద్రన్ సెప్టెంబర్ 5 తేదీకి వాయిదా వేశారు. -
కాబూల్లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు ధాటికి ఆరుగురు మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. గాయపడ్డవారని ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. ఆత్మాహుతిదాడికి తామే కారణమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. దాడిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఒక మహిళ ఉన్నట్లు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్లో 2021 నుంచి తాలిబన్ల పాలన కొనసాగుతోంది. ఇక్కడ తాలిబన్లకు వ్యతిరేకంగా పనిచేసే ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థ తరచు స్కూళ్లు, ఆస్పత్రులపై ఆత్మాహుతి దాడులకు పాల్పడుతోంది. -
మణిపూర్లో బాంబు పేలుడు.. మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతి
ఇంపాల్: ఈశాన్య రాష్ట్రంలో మణిపూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మణిపూర్లో బాంబు పేలుడు ఘటనలో మాజీ ఎమ్మెల్యే భార్య మృతిచెందారు. మరోవైపు.. తెంగ్నౌపాల్ జిల్లాలో ఉగ్రవాదులకు, గ్రామ వాలంటీర్లకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకరాం.. మణిపూర్లోని కాంగ్పోక్పి జిల్లాలో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి సైకుల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యమ్థాంగ్ హౌకిప్ ఇంటి పక్కనే బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో హౌకిప్ రెండో భార్య సపం చారుబాలా తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. అయితే, పేలుడు ఘటన సమయంలో హౌకిప్ కూడా ఇంట్లోనే ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. తాజాగా మణిపూర్లోని తెంగ్నౌపాల్ జిల్లాలో ఉగ్రవాదులకు ,గ్రామ వాలంటీర్లకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. యునైటెడ్ కుకీ లిబరేషన్ ఫ్రంట్కు చెందిన ఒక ఉగ్రవాది, ముగ్గురు గ్రామ వాలంటీర్లు శుక్రవారం మోల్నోమ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో మరణించారు. కాగా గత ఏడాది మే నుండి మణిపూర్లోని ఇంఫాల్ వ్యాలీకి చెందిన మెయిటీస్ , పక్కనే ఉన్న కొండల ఆధారిత కుకీల మధ్య జరిగిన జాతి హింసలో వందల సంఖ్యలో ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. -
బెడ్రూంలో బాంబు
‘జింకను వేటాడేప్పుడు పులి ఓపికగా ఉంటది. అదే పులినే వేటాడాల్సొస్తే?! ఇంకెంత ఓపిక కావాలి?’ ఇది ఓ సినిమాలోని డైలాగ్. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేపై దాడి కోసం ఇజ్రాయెల్ నిఘా విభాగం మొసాద్ కూడా అచ్చం అలాగే ఓపిక పట్టింది. అది కూడా ఒక రోజో, రెండ్రోజులో కాదు.. ఏకంగా రెండు నెలలకు పైగా! ఆయన బస చేస్తారని భావించిన ఇంట్లో అప్పటికే బాంబు అమర్చి ఉంచింది. ఏ బెడ్రూంలోకి వెళ్తాడో పక్కాగా తెలుసుకుని మరీ అందులోనే బాంబును సిద్ధం చేసి పెట్టింది. అలా హనియే కోసం ముందస్తుగానే కాచుకుని కూచున్న మృత్యువు, సమయం రాగానే అమాంతంగా మింగేసింది...!ఇరాన్ రాజధాని టెహ్రాన్లో గత బుధవారం తెల్లవారుజామున జరిగిన పేలుడులో హనియే మరణించారు. అత్యంత కచి్చతత్వంతో కూడిన ఇజ్రాయెల్ క్షిపణి దాడే అందుకు కారణమని తొలుత వార్తలొచ్చాయి. క్షిపణిలాంటి వస్తువేదో హనియే గది కిటీకిని తాకడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారని కొందరు చెప్పారు. అది క్షిపణి దాడేనని ఇరాన్ కూడా ఆరోపించింది. టెహ్రాన్లో కట్టుదిట్టమైన రక్షణలో ఉండే గెస్ట్ హౌస్ను హనియేకు కేటాయించారు. అలాంటి గెస్ట్ హౌస్పై సుదూరం నుంచి అంతటి కచి్చతత్వంతో క్షిపణి దాడి సాధ్యమేనా? పైగా క్షిపణి దాడితో భారీ విధ్వంసం జరుగుతుంది. కానీ ఆ గెస్ట్ హౌస్కు అంతటి నష్టమేమీ జరగలేదు. గది, పరిసర భాగాలే బాగా దెబ్బతిన్నాయి. అదే భవనంలో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ నాయకుడు జియాద్ అల్ నఖలా బస చేసిన పక్క గది కూడా దెబ్బ తినలేదు. కనుక ఎలా చూసినా జరిగింది క్షిపణి దాడి కాదు.వామ్మో ఇజ్రాయెల్! హనియే మృతికి గది లోపలి పేలుడే కారణమని ఇరాన్ అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. ఆ గదిలో రెండు నెలల కిందే బాంబు పెట్టారని తెలుస్తోంది. ఇరాన్ భద్రతలోని లోపాలనే అందుకు అనువుగా మార్చుకున్నారు. బాంబు పెట్టి రెండు నెలలపాటు ఓపికగా నిరీక్షించారు. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు హనియే టెహ్రాన్ చేరుకున్నారు. అది ముగిశాక గెస్ట్హౌస్కు చేరుకుని ఆ గదిలోకే వెళ్లినట్టు పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతే రిమోట్తో బాంబు పేల్చారు. పేలుడు ధాటికి భవనం ఒక్కసారిగా కదిలిపోయింది. గోడలో కొంత భాగం కూలింది. కిటికీలు పగిలాయి. పేలుడు తీవ్రతకే హనియే మృతి చెందారు. ఈ కోవర్ట్ ఆపరేషన్ వివరాలన్నింటినీ పాశ్చాత్య అధికారులతో మొసాద్ పంచుకుందని న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక పేర్కొంది. దేశం వెలుపల రాజకీయ ప్రత్యర్థులు తదితర టార్గెట్ల ఏరివేతకు మొసాద్ పాల్పడుతోంది. ఇజ్రాయెల్పై హమాస్ అక్టోబర్ 7 దాడుల తర్వాత దాని అగ్ర నేతలందరినీ వేటాడతామని ప్రధాని నెతన్యాహూతో పాటు మొసాద్ చీఫ్ డేవిడ్ బరి్నయా కూడా ప్రతిజ్ఞ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నైజీరియాలో బాంబు పేలుడు
అబూజ: నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో ఒక దుకాణసముదాయంలో అమర్చిన బాంబు పేలిన ఘటనలో 16 మంది చనిపోయారు. డజన్ల మంది గాయపడ్డారు. బుధవారం ఉదయం 8 గంటలకు కవోరీ ప్రాంతంలోని ఒక టీ దుకాణంలో ఈ పేలుడు సంభవించింది. దాడి చేసింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రసంస్థా ప్రకటించుకోలేదు. కానీ చాన్నాళ్లుగా పలు దాడులకు కారణమైన బోకో హరామ్ ఉగ్రసంస్థే ఈ దాడికి పాల్పడి ఉంటుందని స్థానిక అధికారులు అనుమానిస్తున్నారు. బోకో హరామ్, దాని చీలిక వర్గం ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ల దాడులు, అంతర్యుద్ధం కారణంగా నైజీరియా, కామెరూన్, నైజర్, చాద్ దేశాల్లో గత 15 సంవత్సరాల్లో 35,000 మందికిపైగా ప్రజలు చనిపోయారు. -
ఇజ్రాయెల్పై డ్రోన్ దాడి.. భారీ పేలుడు
టెల్ అవీవ్: ఇజ్రాయెల్లో శుక్రవారం(జులై 19) తెల్లవారుజామున బాంబు పేలుడు కలకలం రేపింది. రాజధాని టెల్ అవీవ్లోని అమెరికా రాయబార కార్యాలయ సమీపంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడులో ఏడుగురికి గాయాలయ్యాయి. Initial Reports suggest a Car Bomb has Exploded in the Ben Yehuda Area of Tel Aviv, near several Embassies and Diplomatic Sites including the U.S. Consulate. It is Unknown if any Building was Damaged, but Emergency Services are on Scene. pic.twitter.com/u2eig5O714— OSINTdefender (@sentdefender) July 19, 2024 గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాంబు స్వ్కాడ్ ఘటనాస్థలానికి చేరుకుంది. డ్రోన్ దాడి వల్లే పేలుడు జరిగిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) నిర్ధారించింది. పేలుడు జరిగిన పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఘటనా స్థలానికి ఎవరూ రావొద్దని సూచించారు. పేలుడుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత ఏడాది అక్టోబర్7న ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో వందల మంది మృతి చెందారు.అప్పటి నుంచి ఇజజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. మరోవైపు లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్పై అప్పుడప్పుడు రాకెట్ దాడులు చేస్తోంది. ఇటీవల ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై డ్రోన్ దాడులు చేసిన విషయం తెలిసిందే. -
సోమాలియాలో బాంబు పేలుడు.. ఐదుగురి మృతి
మొగదీషు: సోమాలియా రాజధాని మొగదీషులోని రద్దీగా ఉండే ఓ కేఫ్ బయట ఆదివారం(జులై 14) బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరో 20 మంది దాకా గాయపడ్డారు. కేఫ్ లోపల కొంత మంది టీవీలో యూరో కప్ ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ చూస్తుండగా బయట కారులో పేలుడు సంభవించింది. పేలుడు తర్వాత జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పేలుడుకు కారణం తామే అని ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదు. సోమాలియా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపు అల్షబాబ్ మొగదీషులో తరచూ బాంబు పేలుళ్లకు పాల్పడుతుంటుంది. -
నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు
-
‘రాయదుర్గం’లో ఎన్ఐఏ సోదాలు!
రాయదుర్గం: రాయదుర్గం పట్టణంలోని ఉర్దూ (ఏఏఐ) పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ సాహెబ్ నివాసంలో మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించడం అనంతపురం జిల్లాలో కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటలకే రాయదుర్గంలోని నాగులబావివీధిలో ఉన్న అబ్దుల్ సాహెబ్ ఇంటికి చేరుకున్న ఎన్ఐఏ అధికారులు ఉదయం తొమ్మిది గంటల వరకూ ఇంట్లోనే విచారణ చేశారు. అనంతరం అబ్దుల్ సాహెబ్ కుమారుడు సుహేల్ను అదుపులోకి తీసుకుని పటిష్ట పోలీసు భద్రత నడుమ రాయదుర్గం అర్బన్ పోలీసు స్టేషన్కు తరలించారు. అక్కడ అతని వాట్సాప్ చాటింగ్, ల్యాప్ట్యాప్లో ఫైళ్లు, ఆన్లైన్ లావాదేవీలపై మరో మూడు గంటలపాటు క్షుణ్ణంగా విచారించారు. అనంతరం సుహేల్ను అరెస్టు చేసి బెంగళూరు ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా అబ్దుల్ సాహెబ్ ఇంట్లో విచారణ సమయంలో ఆ వీధిలోకి ఎవరూ రాకుండా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు.సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ..విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ సాహెబ్కు సుహేల్, మాతిన్ సంతానం. పెద్ద కుమారుడు సుహేల్ బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. మాతిన్ స్థానికంగా బిస్కెట్ల వ్యాపారం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే తన మకాంను హైదరాబాద్కు మార్చిన సుహేల్ తరచూ బెంగళూరు వెళ్లి వచ్చేవాడు. నెలరోజుల క్రితమే బళ్లారికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్న సుహేల్ అప్పటి నుంచి రాయదుర్గంలోని తన స్వగృహంలోనే ఉంటున్నాడు. కేఫ్లో బాంబు పేలుడుపై అనుమానాలు..కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఇటీవల రద్దీగా ఉండే రామేశ్వరం కేఫ్లో బాంబు బ్లాస్ట్ కలకలం రేపింది. ఈ ఘటనతో ఆ రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. సీసీ పుటేజీ ఆధారంగా 30 ఏళ్ల వయసు కలిగిన యువకుడు కేఫ్లోని హ్యాండ్వాష్ వద్ద ఉన్న చెత్తబుట్టలో ఒక బ్యాగు పడేసి వెళ్లినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అది పేలడంతోనే ప్రమాదం జరిగినట్టు తేల్చారు. దీనికి ఐఈడీ బాంబే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రధాన నిందితుడితో రాయదుర్గం పట్టణానికి చెందిన సుహేల్ వాట్సాప్ చాటింగ్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇరువురి సంబంధాలపై మరింత లోతుగా విచారణ చేసేందుకే సుహేల్ను అరెస్టు చేసి బెంగళూరుకు తరలించినట్లు తెలిసింది. అయితే నిందితుడు ఎక్కడా మీడియా కంటపడకుండా పోలీసులు జాగ్రత్త వహించారు. ఎన్ఐఏ అదుపులో వికారాబాద్ పండ్ల వ్యాపారి?వికారాబాద్: బెంగళూరు రామేశ్వరం కేఫ్లో ఈ ఏడాది మార్చి 1న జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు మంగళవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. వికారాబాద్లో ఒక పండ్ల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇతని స్వస్థలం పూణే అని, నాందేడ్లోనూ పండ్ల వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది. అతడిపై కర్నాటకలో పలు కేసులు నమోదయ్యాయని, ఒక కేసులో శిక్ష సైతం పడినట్టు ఎన్ఐఏ అధికార వర్గాల తెలిపాయి. -
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. కీలక నిందితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం మూడు రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టింది. కర్ణాటక(12ప్రాంతాలు), తమిళనాడు(5 ప్రాంతాలు), ఉత్తరప్రదేశ్లో ఒక చోట.. మొత్తం 18 ప్రదేశాల్లో దాడులు చేసింది. ఈ దాడుల్లో కీలక నిందుతుడు ముజ్మిల్ షరీఫ్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుడు ముజ్మిల్ మరో ఇద్దరు నిందితులకు పేలుడు పదార్ధలు , సాంకేతిక పరికరాలు సరాఫరా చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. సోదాల్లో నగదుతోపాటు, వివిధ ఎలక్ట్రానిక్ డివైజ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన సూత్రధారులు సాజీబ్ హుస్సేన్, అబ్దుల్ మంతెన్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఇక రామేశ్వరం పేలుడు వెనకాల భారీ కుట్ర ఉందని ఎన్ఐఏ వెల్లడించింది. కాగా మార్చి 1న బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్లో బాంబు బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుడుకు తక్కువ తీవ్రత ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (IED) ను ఉపయోగించారు. ఈ సంఘటనలో తొమ్మిది మంది వ్యక్తులు గాయపడ్డారు. దీనిపై ఎన్ఐఏ దర్యాప్తుజరుపుతోంది. ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుంది. చదవండి: శివసేనలో చేరిన నటుడు గోవిందా.. ముంబై నార్త్ వెస్ట్ నుంచి పోటీ? Rameshwaram Café blast case: National Investigation Agency (NIA) arrested a key conspirator following massive raids across multiple locations in three states. Muzammil Shareef was picked up and placed in custody as a co-conspirator after NIA teams cracked down at 18 locations,… pic.twitter.com/TEzXTXpSv3 — ANI (@ANI) March 28, 2024 -
బెంగళూర్ కేఫ్ పేలుడుతో జగిత్యాలకు లింక్?
సాక్షి, బెంగళూరు: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసుతో.. తెలంగాణ జిల్లా జగిత్యాలకు సంబంధం ఉందా?.. తాజా అరెస్టుతో ఆ దిశగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ NIA మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. అయితే అతని స్వస్థలం జగిత్యాల కావడం.. పైగా అతనొక మోస్ట్ వాంటెడ్ కావడంతోకీ అంశం తెర మీదకు వచ్చింది.. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో.. నిషేధిత పీఎఫ్ఐ కీలక సభ్యుడు సలీం హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్న అతన్ని ఎన్ఐఏ వైఎస్సార్ జిల్లా(ఏపీ) మైదుకూరు మండలం చెర్లోపల్లి ప్రాంతంలో అరెస్ట్ చేసింది. బెంగళూరు పేలుడు కేసులో.. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. సలీం స్వస్థలం జగిత్యాల కేంద్రంలోని ఇస్లాంపురా. చాలాకాలంగా పరారీలో ఉన్న అతన్ని.. NIA సెర్చ్ టీం మైదుకూరులో అదుపులోకి తీసుకుంది. రామేశ్వరం కెఫ్ బాంబు పేలుడులో.. ఇతని హస్తమున్నట్టు ఎన్ఐఏ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అలాగే సలీంతో పాటు ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎండీ అబ్దుల్ అహ్మద్, నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ ఇలాయస్ అహ్మద్ పేర్లు కూడా ఉన్నాయి. వీళ్లిద్దరి కోసం ఇప్పుడు ఎన్ఐఏ టీంలు గాలింపు చేపట్టాయి. ఇదిలా ఉంటే.. గతంలో ఉగ్రమూలాలకు కేరాఫ్గా జగిత్యాల పేరు పలుమార్లు వినిపించింది. ఇప్పుడు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల కేసు లింకుతో మరోసారి జగిత్యాల్లో ఉగ్రమూలాలపై చర్చ నడుస్తోంది. గతంలో జగిత్యాలతో పాటు కరీంనగర, నిజామాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు, పలువురి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
Rameswaram Cafe Blast: నిందితుడి జాడ చెప్తే రూ.10 లక్షలు
న్యూఢిల్లీ: బెంగళూరులో మార్చి ఒకటో తేదీన రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడి సమాచారం అందిస్తే రూ.10 లక్షల బహుమతి ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బుధవారం ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్చేసింది. కేఫ్లోకి అడుగుపెట్టేటపుడు ఆ వ్యక్తి క్యాప్, మాస్్క, కళ్లద్దాలు ధరించి ఉన్నాడని ఎన్ఐఏ పేర్కొంది. నిందితుడు జాడ తెలిపిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఎన్ఐఏ హామీ ఇచి్చంది. ఈస్ట్ బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లో జరిగిన ఈ పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. శక్తివంత పేలుడు పదార్ధం(ఐఈడీ) వాడటంతో కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏకు అప్పగించడం తెల్సిందే. మొదట కర్ణాటక పోలీసులు కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం, పేలుడు పదార్ధాల చట్టాల కింద కేసు నమోదుచేశారు. ముంబైలో నవంబర్ 26న ఉగ్రదాడి తర్వాత ప్రత్యేకంగా ఉగ్రసంబంధ ఘటనలపై దర్యాప్తు కోసం ఎన్ఐఏను 2008లో ఏర్పాటుచేశారు. -
రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో కీలకంగా AI
బెంగళూరు: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) తన పరిశీలనాంతరం ఇది ఉగ్రదాడిగా భావిస్తుండగా.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సైతం పేలుడు ఘటనాస్థలాన్ని పరిశీలించింది. తాజాగా ఈ కేసు దర్యాప్తు కోసం సిటీ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీనే ఈ కేసు మొత్తానికి కీలకంగా మారింది. బాంబ్ పేలుడు ఘటనకు సంబంధించి.. ప్రధాన అనుమానితుడి ఫుటేజీ ఒకటి బయటకు వచ్చింది. ఆ నిందితుడి కదలికలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఐఈడీ(Intensive Explosive Device)ను బ్యాగ్లో తీసుకెళ్లిన ఆ వ్యక్తి.. ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతన్ని పట్టుకునేందుకు ఎనిమిది బృందాలు రంగంలోకి దిగాయి. అయితే.. ముసుగు తొలగించి.. ఇందుకోసం భద్రతా సంస్థలు ఏఐ(Artificial Intelligence) సాయం తీసుకుంటున్నాయి. ఏఐ ఆధారిత ఫేషీయల్ రికగ్నిషన్ సాంకేతిక సాయంతో.. బ్యాగ్ను వదిలి వెళ్లిన వ్యక్తి ఆచూకీ కనిపెట్టబోతున్నారు. అనుమానితుడెవరో తెలిసిపోయిందని.. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ను ఉపయోగించి ఆ వ్యక్తిని వీలైనంత త్వరలోనే పట్టుకుంటామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెబుతున్నారు. మరోవైపు ఏఐ టెక్నాలజీ సాయంతో అతని ముఖానికి ఉన్న ముసుగును తొలగించారు. అతని ఫొటోల్ని సేకరించుకుని ఆచూకీ కనిపెట్టే పనిలో ఉంది బెంగళూరు నగర నేర పరిశోధన విభాగం. Bengaluru blast: Suspected accused captured in CCTV #Bengaluru #Karnataka #Blast #RameshwaramCafe #RameshwaramCafeBlast pic.twitter.com/jNM6BFnPVH — Fresh Explore (@explorefresh24) March 2, 2024 బెంగుళూరులో.. అదీ టెక్నాలజీ కారిడార్లోనే ఈ పేలుడు జరగడం ఆందోళనలను రేకెత్తిస్తోంది. భద్రతాపరంగా మరింత నిఘా, చర్యలు పెంచాల్సిన అవసరాన్ని ఈ పేలుడు ఘటన తెలియజేస్తోందని నిపుణలు అంటున్నారు. అలాగే.. అనుమానిత వ్యక్తులను పట్టుకునేందుకు AI లాంటి అత్యాధునిక సాంకేతికతను అధికారికంగా వినియోగించడం ఎంత అవసరమో కూడా చెబుతోందంటున్నారు. రెండేళ్ల కిందటి.. రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో.. మొత్తం 10 మంది గాయపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. 2022 నవంబర్లో మంగళూరులో ఇదే తరహాలో కుక్కర్ బాంబు పేలింది. దీంతో.. ఈ రెండు ఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో.. బృందం ధార్వాడ్, హుబ్లీ, బెంగళూరుకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. విచారణకు పూర్తి సహకారం: కేఫ్ యాజమాన్యం తమ ప్రాంగణంలో బాంబు దాడి జరగడంపై రామేశ్వరం కేఫ్ యాజమాన్యం స్పందించింది. విచారణలో దర్యాప్తు సంస్థలకు పూర్తి సహాకారం అందిస్తామని.. అలాగే పేలుడులో గాయపడిన వాళ్లకు తాము అండగా నిలుస్తామని కేఫ్ ఎండీ దివ్య రాఘవేంద్ర రావు ప్రకటించారు. ఏం జరిగిందంటే.. శుక్రవారం ఉదయం.. బ్రూక్ఫీల్డ్ ఐటీపీఎల్ రోడ్లో ఉన్న రామేశ్వరం కేఫ్. నెత్తిన క్యాప్.. ముఖానికి ముసుగు.. భుజాన బ్యాగ్తో ఆ ఆగంతకుడు కేఫ్కు వచ్చాడు. అతని వయసు 25-30 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 11గం.30.ని. ప్రాంతంలో బస్సు దిగి నేరుగా కేఫ్లోకి వెళ్లిన ఆ వ్యక్తి ఇడ్లీ ఆర్డర్ చేశాడు. పావు గంట తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ మధ్యలో తన భుజానికి ఉన్న బ్యాగ్ను కేఫ్లోని సింక్ వద్ద ఉన్న డస్ట్బిన్ పక్కన పెట్టి వెళ్లిపోయాడు. సరిగ్గా అతను వెళ్లిపోయిన గంటకు ఆ బ్యాగ్లో ఉన్న ఆ బాంబు పేలింది. ఫొటోలు వచ్చాయి: సీఎం సిద్ధరామయ్య ఈ ఘటనలో నిందితుడు ప్రెజర్ కుక్కర్ బాంబు వాడాడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్కు వచ్చాడు. రవ్వఇడ్లీని ఆర్డర్ చేసుకొని ఒక దగ్గర కూర్చున్నాడు. తర్వాత బాంబుకు టైమర్ సెట్ చేసి, వెళ్లిపోయాడు. అతడు ఎవరో తెలీదు. ఫొటోలు వచ్చాయి. సాధ్యమైనంత త్వరగా నిందితుడిని అదుపులోకి తీసుకుంటాం అని అన్నారాయన. #Marksmendaily : #JustiIn #Karnataka CM #Siddaramaiah visits #RameshwaramCafe, a day after an explosion took place here in #Bengaluru @siddaramaiah #RameshwaramCafeBlast #BengaluruCafeBlast #bombblast pic.twitter.com/ptoGaYePHL — Marksmen Daily (@DailyMarksmen) March 2, 2024 అలాగే.. రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు.‘‘ఈ విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తోంది. వారి హయాంలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయి. అప్పుడు వారు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారా..? నేను ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిపై రాజకీయాలు చేయకూడదు’’ అని అన్నారు. అలాగే ఘటనాస్థలానికి వెళ్లిన సీఎం సిద్ధరామయ్య.. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారాయన. -
రామేశ్వరం కేఫ్లో జరిగింది బాంబు పేలుళ్లే
-
బెంగళూరు కేఫ్లో బాంబు పేలుడు
సాక్షి, బెంగళూరు: బాంబు పేలుడు ఘటనతో బెంగళూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలో నిత్యం రద్దీగా ఉండే వైట్ఫీల్డ్ పరిధిలోని బ్రూక్ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్లో మధ్యాహ్నం వేళ ఈ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కేఫ్ సిబ్బందిసహా 10 మంది గాయపడ్డారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా పేలుడు సంభవించిందని తొలుత అందరూ భావించారు. 30 ఏళ్లలోపు వయసు వ్యక్తి ఒకరు ఆ కేఫ్లోని హ్యాండ్వాష్ వద్ద ఉన్న చెత్తబుట్టలో ఒక బ్యాగును పడేసి వెళ్లినట్లు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. అత్యాధునిక పేలుడు పదార్థం(ఐఈడీ) వల్లే ఈ పేలుడు సంభవించిందని బాంబు నిరీ్వర్య బలగాలు, ఫోరెన్సిక్స్ ల్యాబోరేటరీ, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందాలు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించారు. టోకెన్ కౌంటర్ వద్ద రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసిన ఆ వ్యక్తి తర్వాత తినకుండా వెళ్లిపోయినట్లు సీసీటీవీలో రికార్డయింది. పోయేముందు ఒక బ్యాగును అక్కడి హ్యాండ్వాష్ దగ్గరి చెత్తబుట్టలో పడేసినట్లు కనిపిస్తోంది. ఒక గంట తర్వాత బాంబు పేలింది. ఐఈడీ బాంబును టైమర్ సాయంతో పేల్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలిని కర్ణాటక డీజీపీ సందర్శించారు. ‘ ఈ బాంబు పేలుడు ఘటనలో ఇప్పటికే లభించిన ఆధారాల సాయంతో దర్యాప్తు ముమ్మరం చేశాం’ అని రాష్ట్ర డీజీపీ అలోక్ మోహన్ చెప్పారు. ‘‘కేఫ్లో తినేందుకు అప్పుడే అక్కడికొచ్చాం. 40 మంది దాకా ఉన్నాం. ఒక్కసారిగా భారీ పేలుడు జరగడంతో ప్రాణభయంతో పరుగులు తీశాం’’ అని ప్రత్యక్ష సాక్షులు ఎడిసన్, అమృత్ చెప్పారు. ఎన్ఐఏ బృందం ఘటనాస్థలిని సందర్శించింది. పేలుడు స్థలంలో బ్యాటరీ, వైర్లను గుర్తించారు. కేవలం పది సెకండ్ల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయని కెఫే ఎండీ, సహ వ్యవస్థాపకురాలు దివ్య చెప్పారు. దుండగులను వదలిపెట్టం కేఫ్లో పేలుడుకు ఐఈడీ బాంబే కారణమని ఆ రాష్ట్రముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ‘‘నిందితులను గుర్తించి చట్టం ముందు నిలబెడతాం. ఈ ఘటన వెనుక ఉన్నది ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదు’ అని శుక్రవారం మైసూరులో వ్యాఖ్యానించారు. ‘‘ ఘటనపై పోలీసు శాఖ దర్యాప్తు చేపట్టింది. సీసీకెమెరాల ద్వారా నిందితుల ఆచూకీ గుర్తించేందుకు చర్యలు చేపట్టాం. ఇది ఉగ్రవాదుల పనిలా లేదు. పేలుడు ఘటన వెనుక ఉన్నవారిని కఠినంగా శిక్షిస్తాం’ అని సీఎం అన్నారు. -
Bengaluru Cafe Bomb Blast Video: బెంగళూర్ రామేశ్వరం కేఫ్లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబ్
-
హైదరాబాద్లో హైఅలర్ట్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. శుక్రవారం సాయంత్రం నగరంలో హైఅలెర్ట్ ప్రకటించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అప్రమత్తం చేశామని.. కీలక ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. బెంగళూరు కేఫ్ పేలుడు కారణాల గురించి ఆరా తీస్తున్నామని చెప్పారాయన. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి.. అనుమానాస్పద వెహికిల్స్ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం మధ్యాహ్నాం బెంగళూరులోని కుండలహళ్లిలోని ఫేమస్ రామేశ్వరం కేఫ్ వద్ద టిఫిన్ బాక్స్ బాంబ్తో ఆగంతకులు బ్లాస్ట్ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. ఐఈడీతో దాడి జరిపారని.. పేలుడు ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని చెప్పారాయన. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించారాయన. ఇదీ చదవండి: బెంగళూర్ కేఫ్లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబ్ -
Watch Video:బెంగళూర్ కేఫ్లో పేలిన టైం బాంబ్
సాక్షి, బెంగళూరు: నగరంలో సంభవించిన భారీ పేలుడు.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కుండలహళ్లిలోని ఫేమస్ రామేశ్వరం కేఫ్ వద్ద టైం బాంబ్తో ఆగంతకులు బ్లాస్ట్ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. టిఫిన్ బాక్స్లో ఐఈడీతో దాడి జరిపారని.. పేలుడు ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని చెప్పారాయన. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించారాయన. తొలుత బ్లాస్ట్కి సిలిండర్లు కారణమని అంతా భావించారు. అయితే బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీం సేకరించిన ఆధారాలతో ఇది ఉద్దేశపూర్వకంగానే జరిపిన పేలుడుగా గుర్తించారు. కేఫ్లో సిలిండర్లు డ్యామేజ్ కాలేదని గుర్తించింది. అదే సమయంలో.. బోల్ట్లు, నట్లు, ఎలక్ట్రిక్ వైర్లను.. వాచ్ను(టైం బాంబ్ కోసం ఉపయోగించేది) గుర్తించింది. మరోవైపు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుంది. సీసీఫుటేజీ ఆధారంగా ఉదయం 11 గం. ప్రాంతంలో కేఫ్లోని సింక్ వద్ద ఓ ఆగంతకుడు బ్యాగ్ను వదిలివెళ్లినట్లు గుర్తించారు. ఆ తర్వాత అతను వెళ్లిపోయాక.. 12గం.46ని. సమయంలో బాంబు పేలింది. ఆ బ్యాగ్లోని టిఫిన్ బాక్స్లోని బాంబ్ పేలుడుకు కారణమని.. ఇది ఉగ్రదాడే అయ్యి ఉంటుందని ఎన్ఐఏ ప్రాథమిక అంచనాకి వచ్చింది. ఏం జరిగిందంటే.. రామేశ్వరం కేఫ్కు నిత్యం నాలుగు నుంచి ఐదు వేల మంది కస్టమర్లు వస్తుంటారు. శుక్రవారం మధ్యాహ్నాం ఒంటి గంట ప్రాంతంలో రామేశ్వరం కేఫ్లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. మొత్తం తొమ్మిది మందిని బ్రూక్ఫీల్డ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. అందరికీ ప్రాణాపాయం తప్పిందని కర్ణాటక డీజీపీ అశోక్ మోహన్ చెప్పారు. అంతకు ముందు.. ‘‘సిలిండర్ పేలిందన్న సమాచారంతో మేం ఇక్కడికి చేరుకున్నాం. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించాం. భారీ శబ్ధంతో పేలుడు సంభవించే సరికి భయంతో పరుగులు తీసినట్లు స్థానికులు చెబుతున్నారు. సిలిండర్ పేలుడా? ఏదైనా కుట్ర ఉందా? అనేది పోలీసులు తేలుస్తారు’’ అని వైట్ఫీల్డ్ ఫైర్ స్టేషన్ అధికారి చెప్పారు. ఇదీ చదవండి: కలాం స్ఫూర్తి.. రామేశ్వరం కేఫ్ నెల బిజినెస్ 4 కోట్లపైనే! An explosion occurred at The Rameshwaram Cafe in Whitefield, Bengaluru. Injuries reported. Details awaited. #Karnataka pic.twitter.com/7PXndEx2FC — ANI (@ANI) March 1, 2024 #WATCH | Karnataka | An explosion occurred at The Rameshwaram Cafe in Whitefield, Bengaluru. Injuries reported. Details awaited. Whitefield Fire Station says, "We received a call that a cylinder blast occurred in the Rameshawaram cafe. We reached the spot and we are analysing… pic.twitter.com/uMLnMFoHIm — ANI (@ANI) March 1, 2024 Just spoke to Rameshwaram Café founder Sri Nagaraj about the blast in his restaurant. He informed me that the blast occurred because of a bag that was left by a customer and not any cylinder explosion. One of their employees is injured. It’s seems to be a clear case of bomb… — Tejasvi Surya (@Tejasvi_Surya) March 1, 2024 ఇదిలా ఉంటే.. రామేశ్వరం కేఫ్ వ్యవస్థాపకుడు నాగరాజ్తో తాను మాట్లాడానని.. పేలుడు గురించి ఆరా తీశానని బీజేపీ నేత, ఎంపీ తేజస్వి యాదవ్ ట్వీట్ చేశారు. ఇది సిలిండర్ బ్లాస్ట్ కాదని.. కస్టమర్ ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి వదిలేసి వెళ్లిన బ్యాగ్ వల్లే పేలుడు జరిగిందని.. ఇది ముమ్మాటికే బాంబు పేలుడంటూ పోస్ట్ చేశారాయన. -
పాక్లో పేలుళ్లు.. 30 మంది బలి
కరాచీ: సార్వత్రిక ఎన్నికలకు పాకిస్తాన్ సిద్ధమవుతున్న వేళ బుధవారం జంట పేలుళ్లతో పాకిస్తాన్ దద్దరిల్లింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ బాంబు పేలుడు ఘటనల్లో మొత్తంగా 25 మంది మరణించారు. 42 మంది గాయపడ్డారు. పర్వతమయమైన బలూచిస్తాన్ ప్రావిన్స్లోని వేర్వేరు పార్టీ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఈ జంట పేలుళ్లు జరిపారని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఈ పేలుళ్లు జరిపింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటించుకోలేదు. తొలి పేలుడు పిషిన్ జిల్లాలోని స్వతంత్ర అభ్యర్థి అస్ఫాందర్ ఖాన్ కకర్ ఆఫీస్ బయట జరిగింది. ఈ పేలుడులో 20 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. ఒక గంట తర్వాత కిల్లా అబ్దుల్లా ప్రాంతంలోని జమియత్ ఉలేమా ఇస్లామ్–పాకిస్తాన్ పార్టీ కార్యాలయం బయట జరిగింది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల ప్రక్రియల్లో పౌరుల భాగస్వామ్యాన్ని తగ్గించేందుకే ఇలా ఉగ్రవాదులు బాంబు దాడులతో భయపెడుతున్నారని బలూచిస్తాన్ పంజ్ఘర్ సీనియర్ పోలీసు అధికారి అబ్దుల్లా చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బాంబుపేలుళ్ల జరగడంతో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను పటిష్టం చేశారు. బలూచిస్తాన్లో పెరిగిన దాడులు అఫ్గానిస్తాన్, ఇరాన్లతో సరిహద్దులు పంచుకుంటున్న పర్వతమయ బలూచిస్తాన్లో ఇటీవల బాంబు దాడులు ఎక్కువయ్యాయి. మంగళవారం సైతం 10 గ్రనేడ్ దాడులు జరిగాయి. వేర్వేరు ప్రావిన్స్లలోని భద్రతా పోస్ట్లు, ఎన్నికల ప్రచార కార్యాలయాలు, ర్యాలీలపై ఈ దాడులు జరిగాయి. ఆదివారం నుంచి లెక్కిస్తే ఈ సంఖ్య ఏకంగా 50కి చేరింది. చాన్నాళ్ల నుంచి బలూచిస్తాన్లో వేర్వేరువాద శక్తుల క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. సైన్యం ఏరివేత చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జనవరిలో 24 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. చదవండి: పాక్ ఎన్నికల బరిలో...ఆమె అంతంతే -
మసూద్ అజార్ హతం?
ఇస్లామాబాద్: కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి మసూద్ అజార్ బాంబు పేలుడులో హతయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్గా మారాయి. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో పాకిస్తాన్లోని భావల్పూర్ మసీదు నుంచి వస్తుండగా బాంబు పేలిన ఘటనలో అతడు హతమైనట్లు ధ్రువీకరించని ట్వీట్ల ద్వారా తెలుస్తోంది. పేలుడుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అనంతరం పాక్ ఆర్మీ దావూద్ ఇబ్రహీం సహా పలువురు ఉగ్రవాదులపై దాడులు చేపట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తోంది. భారత్లో మోస్ట్ వాంటెడ్గా ఉండి పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తదితర రెండు డజన్ల మంది వరకు ఉగ్రవాదులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 2001 పార్లమెంట్పై దాడి ఘటనకు సంబంధించిన కేసుల్లో అజార్ను భారత్ వాంటెడ్గా ప్రకటించింది. 2008లో నేపాల్ నుంచి భారత్కు బయలుదేరిన ఇండియన్ఎయిర్ లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, అఫ్గానిస్తాన్లోని కాందహార్కు తీసుకెళ్లారు. హైజాకర్ల డిమాండ్ మేరకు జైళ్లలో ఉన్న అజార్ సహా ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులను భారత్ ప్రభుత్వం విడిచిపెట్టింది. విమాన ప్రయాణికుల్లో ఒకరిని పొడిచి చంపిన ఉగ్రవాదులు, మరికొందరిని గాయపరిచారు. వారంపాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ అనంతరం అందులోని 176 మందిని ఉగ్రవాదులు సురక్షితంగా విడిచిపెట్టారు. -
ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీపై బాంబు పేలుడు? లేఖ లభ్యం
ఢ్లిలీ: ఢ్లిలీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద బాంబు బెదిరింపుల ఘటనలో ఢిల్లీ పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించారు. దీంతోపాటు గాజాపై ఇజ్రాయెల్ దాడులను విమర్శిస్తూ ఓ లేఖ కూడా లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. లేఖను ఇజ్రాయెల్ జెండాలో చుట్టారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ చర్యను ఎండగడుతూ ఢిల్లీలో ఆదేశ దౌత్యవేత్తకు దుండగులు లేఖ రాశారని వెల్లడించారు. ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు పెద్ద శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఎంబసీపై బాంబు పేలుళ్లు జరుపుతామని బెదిరింపు కాల్ప్ వచ్చాయి. పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. కానీ ఆ శబ్దం పేలుళ్లకు సంబంధించిందేనని ఇజ్రాయెల్ ఎంబసీ స్పష్టం చేసింది. ఎంబసీపై దాడిగానే పరిగణించింది. ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేసింది. #WATCH | Forensic teams and Dog squad of NSG carry out an investigation near the Israel Embassy. As per the Israel Embassy, there was a blast near the embassy at around 5:10 pm yesterday pic.twitter.com/X4lMPD2FR8 — ANI (@ANI) December 27, 2023 ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు సహా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) విస్తృతంగా గాలింపు చేపట్టగా ఓ లేఖ లభ్యమైంది. గాజాపై ఇజ్రాయెల్ చర్యను విమర్శిస్తూ అందులో పేర్కొన్నారు. అయితే.. ఈ ఘటనపై నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఎంబసీ ప్రాంతంలో శబ్దం రసాయన పేలుడు అయి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎన్ఐఏ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. సమగ్రంగా దర్యాప్తు చేపడుతోంది. ఇదీ చదవండి: అమ్మోనియా గ్యాస్ లీక్.. 12 మందికి అస్వస్థత -
కేరళ పేలుళ్ల ఘటనలో లొంగిపోయిన వ్యక్తి అరెస్టు
తిరువనంతపురం: కేరళ వరుస పేలుళ్ల కేసులో డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు నిందితుడు ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం, హత్యా నేరాల కింద అతడిని సోమవారం అరెస్టు చేశారు. కన్వెన్షన్ సెంటర్లో బాంబులు పెట్టినట్లు మార్టిన్ ఒప్పుకుని త్రిసూర్ జిల్లాలో పోలీసులకు లొంగిపోయాడు. లొంగిపోయే ముందు మార్టిన్ ఫేస్బుక్లో ఒక వీడియోను విడుదల చేశాడు. యోహూవా క్రిస్టియన్ శాఖ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో వరుస పేలుళ్లను ఎందుకు పాల్పడ్డాడో వివరించాడు. క్రిస్టియన్ శాఖ (యెహూవా సాక్షులు) బృందంతో తనకు కొన్నేళ్లుగా సంబంధం ఉందని పేర్కొన్న మార్టిన్.. వారి బోధనలతో మాత్రం ఏకీభవించలేదు. వారి బోధనలు తప్పుడు మార్గంలో ఉన్నాయని పలుమార్లు హెచ్చరించినట్లు కూడా చెప్పాడు. వారి బోధనలు దేశ వ్యతిరేకమని తెలిపిన మార్టిన్.. బోధనల్లో మార్పును కోరుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ అందుకు వారు సిద్ధంగా లేదని స్పష్టం చేశాడు. ఈ కారణంగానే తాను పేలుళ్లకు పాల్పడ్డట్లు వెల్లడించాడు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని కొచ్చి నగర సమీపంలో వరుస పేలుళ్ల ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మతపరమైన వేడుక జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లో చోటుచేసుకున్న ఈ పేలుళ్లలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో 51 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మూడు రోజులుగా జరుగుతున్న ఈ వేడుకల ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మంది పాల్గొన్న కలామాస్సెరీలోని జామ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ పేలుళ్లు జరిగాయి. ఇదీ చదవండి: Kerala Blast: కేరళలో వరుస పేలుళ్లు -
కేరళ బాంబు పేలుళ్ల ఘటనలో విస్తుపోయే నిజాలు..!
తిరువనంతపురం: కేరళ పేలుళ్ల ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రార్థన సెంటర్లో టిఫిన్ బాక్స్లో పేలుడు సంభవించినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రార్థనలు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లోకి దుండగులు పేలుడు పదార్ధాలను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. పేలుడు సంభవించిన అనంతరం సెంటర్లో దట్టమైన పొగ కమ్ముకుందని స్థానికులు తెలిపారు. భయాందోళనకు లోనైన ప్రజలు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగిందని వెల్లడించారు. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారిందని తెలిపారు. కేరళలో ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లల్లో ఒకరు మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ప్రేయర్ మీట్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రార్థన సమయంలో అందరూ కళ్లు మూసుకొని ప్రార్థనలు చేస్తుండగా ఉదయం 9:47 సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు 2,000 మందితో ప్రార్థనలు జరుగినట్లు స్థానికులు తెలిపారు. ఎన్ఐఏ యాంటీ టెర్రర్ ఏజెన్సీ కేసును విచారిస్తోంది. జాతీయ భద్రతా దళం బృందం కూడా కేరళకు రానుంది. ఈ పేలుళ్లకు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రదాడి అని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో హమాస్ నాయకుడు పాల్గొనడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించింది. It's a very unfortunate incident. We are collecting details regarding the incident. All top officials are there in Ernakulam. DGP is moving to the spot. We are taking it very seriously. I have spoken to DGP. We need to get more details after the investigation: Kerala CM Pinarayi… https://t.co/4utwtmR9Sl pic.twitter.com/GHwfwieRLB — ANI (@ANI) October 29, 2023 పేలుడు ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. 'ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నాం. ఉన్నతాధికారులందరూ ఎర్నాకులంలో ఉన్నారు. ఘటనా స్థలానికి డీజీపీ వెళ్లారు. పేలుడు ఘటనను చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. డీజీపీతో మాట్లాడాను. దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని అన్నారు. అటు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా కేరళ సీఎం విజయన్తో ఫొన్లో మాట్లాడారు. ఇదీ చదవండి: కేరళలో భారీ పేలుడు.. ఉగ్రదాడి కలకలం! -
కేరళలో భారీ పేలుడు.. ఉగ్రదాడి కలకలం!
తిరువనంతపురం: కేరళలో ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లల్లో ఒకరు మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ పేలుళ్లను ఉగ్రదాడిగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ప్రేయర్ మీట్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వరపుజ, అంగమలి, ఎడపల్లి ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. ఆదివారం ఉదయం 9.20కి ప్రార్థన ప్రారంభమైంది. ప్రార్థన సమయంలో అందరూ కళ్లు మూసుకొని ప్రార్థనలు చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుడు కారణంగా అక్కడున్నవారు భయాందోళనకు గురై హాలు నుంచి బయటకు పరుగులు తీశారు. #WATCH | Kerala: Outside visuals from Zamra International Convention & Exhibition Centre, Kalamassery; one person died and several others were injured in an explosion here. pic.twitter.com/RILM2z3vov — ANI (@ANI) October 29, 2023 ఇక, పేలుళ్లలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 30 మందికి పైగా గాయాలు కాగా.. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తీవ్రమైన గాయాలతో వున్న క్షత్రగాత్రులను కొచ్చి మెడికల్ కాలేజీ నుంచి కొట్టాయం ప్రభుత్వ ఆసుపత్రికి అధికారులు తరలిస్తున్నారు. అయితే, ఈ పేలుళ్లకు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రదాడి అని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో హమాస్ నాయకుడు పాల్గొనడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించింది. It's a very unfortunate incident. We are collecting details regarding the incident. All top officials are there in Ernakulam. DGP is moving to the spot. We are taking it very seriously. I have spoken to DGP. We need to get more details after the investigation: Kerala CM Pinarayi… https://t.co/4utwtmR9Sl pic.twitter.com/GHwfwieRLB — ANI (@ANI) October 29, 2023 ఇక, పేలుడు ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నాం. ఉన్నతాధికారులందరూ ఎర్నాకులంలో ఉన్నారు. ఘటనా స్థలానికి డీజీపీ వెళ్లారు. పేలుడు ఘటనను చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. డీజీపీతో మాట్లాడాను. దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది కూడా చదవండి: డీకే శివకుమార్ వెంట 70 మంది ఎమ్మెల్యేలు..! -
దాడి ఘటనపై మోదీ దిగ్బ్రాంతి
న్యూఢిల్లీ: గాజా ఆసుపత్రిలో బాంబు పేలుడులో పెద్ద సంఖ్యలో జనం మరణించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణలో సాధారణ ప్రజలు బలి కావడం దురదృష్టకరమని వాపోయారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇప్పటికైనా గాజాలో హింసకు తెరపడాలని ఆకాంక్షించారు. ఆసుపత్రిలో బాంబు పేలుడుకు బాధ్యులైన వారిని తప్పనిసరిగా శిక్షించాలని నరేంద్ర మోదీ డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రారి్థస్తున్నట్లు తెలిపారు. -
జపాన్ ప్రధానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
-
కొత్త పెళ్లికొడుకును చంపింది మాజీ ప్రియుడే!
క్రైమ్: ప్రేమించానంది. వెంట తిరిగింది. కానీ, చివరకు తనను కాదని మరో వ్యక్తిని వివాహమాడింది. అది తట్టుకోలేకపోయాడు. మరిచిపోలేని గుణపాఠం నేర్పాలనుకున్నాడు. డేంజరస్ కానుకతో మాజీ ప్రేయసి సహా ఆమె అత్తింటివాళ్లందరినీ చంపాలని ప్లాన్ వేశాడు. కానీ, అది వికటించి కొత్త పెళ్లి కొడుకు, అతని సోదరుడు చనిపోయారు. చివరకు సైకో ప్రియుడు పోలీసులకు దొరికిపోయాడు. ఛత్తీస్గఢ్ ఖబిర్దామ్ హోం థియేటర్ పేలుడు ఘటనలో మిస్టరీని స్థానిక పోలీసులు చేధించారు. అది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన కాదని.. కావాలనే చేసిన పని అని తేల్చారు పోలీసులు. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. ఆమె అత్తింటి కుటుంబాన్ని మొత్తాన్ని చంపేయాలని ప్లాన్ వేసినట్లు పోలీసులు తేల్చారు. ఏప్రిల్ 1వ తేదీన హేమేంద్ర మేరావికి స్థానికంగా ఉండే ఓ యువతితో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా భారీగా కానుకలు వచ్చాయి. ఆ మరుసటి రోజు కానుకలు ఉంచిన గదిలోకి హేమేంద్ర, కుటుంబ సభ్యులు వెళ్లారు. అందులోంచి హోం థియేటర్ను తీయగా.. అది భారీ విస్పోటనంతో పేలిపోయి హేమేంద్ర అక్కడికక్కడే మరణించాడు. పేలుడు ధాటికి ఆ గది గోడలు, పైకప్పు సైతం కూలిపోయాయి. హేమేంద్ర సోదరుడు రాజ్కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయగా.. మరో నలుగురు(ఏడాదిన్నర బాలుడు కూడా) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ హోం థియేటర్ ఇచ్చింది సార్జూ అనే యువకుడని, అతనికి నవవధువుకి గతంలో ప్రేమ వ్యవహారం నడిచిందని తేల్చారు. మరో వ్యక్తిని వివాహం చేసుకుందన్న కోపంలో అతను ఆ కుటుంబం మొత్తాన్ని చంపేయాలని ప్లాన్ వేశాడట. హోం థియేటర్లో బాంబు ఫిక్స్ చేసి ఇచ్చాడట. అలా చివరకు రెండు ప్రాణాలు పోవడంతో పాటు నిందితుడు కటకటాల పాలయ్యాడు. ఇదీ చదవండి: ఊయలలో బొమ్మ.. కాలువలో నిహారిక -
జమ్ముకశ్మీర్లో మరో పేలుడు.. 24 గంటల్లో మూడోది..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మరో పేలుడు ఘటన జరిగింది. శనివారం రాత్రి బజల్తాలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఓ డంపర్ను ఆపగా.. అందులోని యూరియా ట్యాంక్ పేలింది. ఈ ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ పేలుడుపై విచారణ జరిపిన పోలీసులు ఉగ్రచర్యగా అనుమానిస్తున్నారు. అంతకుముందు శనివారం ఉదయం నర్వాల్ ప్రాంతంలో అరగంట వ్యవధిలో రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు పౌరులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ పేలుళ్లను ఉగ్ర దాడిగా అధికారులు పేర్కొన్నారు. ముష్కరులు ఐఈడీలు ఉపయోగించి ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కశ్మీర్లో కొనసాగుతున్నందున అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సమయంలో వరుస పేలుళ్లు జరుగుతుండటంతో మరింత అప్రమత్తమయ్యారు. చదవండి: మోదీ, దీదీ మధ్య 'మో-మో' ఒప్పందం.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు.. -
అఫ్గనిస్తాన్: ఫారిన్ మినిస్ట్రీ వద్ద భారీ పేలుడు.. 20 మంది మృతి
కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో విదేశాంగ శాఖ కార్యాలయం సమీపంలో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. కాబూల్ ఈ ఏడాదిలో ఇది రెండో అతిపెద్ద పేలుడు. ఈ ఘటనలో 20 మందికిపైగా జనం మృతి చెందారు. అయితే, పేలుడుకు పాల్పడింది ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. కానీ, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)కు అనుబంధ సంఘమైన ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖోరాసన్ ప్రావిన్స్’ 2021 ఆగస్టులో తాలిబాన్ పాలన మొదలయ్యాక అఫ్గాన్లో వరుసగా దాడులకు పాల్పడుతోంది. -
Targeted Attacks: నిన్న ఇంట్లోకి చొరబడి కాల్పులు.. నేడు బాంబు దాడి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని సరిహద్దు జిల్లా రాజౌరిలో మైనారిటీ వర్గం లక్ష్యంగా ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. రాజౌరికి 8 కిలోమీటర్ల దూరంలోని అప్పర్ డాంగ్రి గ్రామంలో ఆదివారం ఇళ్లల్లోకి చొరబడి కాల్పులు జరిపిన సంఘటన నుంచి తేరుకోకముందే మరోమారు దాడి చేశారు. బాధితుల ఇంటి సమీపంలోనే సోమవారం భారీ పేలుడు జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం నాటి కాల్పుల్లో మొత్తం నలుగురు మృతి చెందగా.. సోమవారం నాటి బాంబు దాడిలో ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ‘మొదటి కాల్పుల ఘటన జరిగిన ప్రాంతంలోనే పేలుడు జరిగింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పాత్రికేయులు అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రాంతంలోనే మరో ఐఈడీని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశాం.’అని స్థానిక పోలీసులు తెలిపారు. ఆదివారం నాటి ఘటన బాధ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలోనే ఈ భారీ పేలుడు జరగటం తీవ్ర కలకలం రేపింది. రూ.10లక్ష పరిహారం, ప్రభుత్వం ఉద్యోగం.. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం, ఇంట్లో అర్హులైన వారికి ప్రభుత్వం ఉద్యోగం ప్రకటించారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. గాయపడిన వారికి రూ.1 లక్ష సాయం అందిస్తామని తెలిపారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, కారకులను చట్టంముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఆందోళనలు.. మైనారిటీలే లక్ష్యంగా ఉగ్రదాడులు జరగటంపై రాజౌరీలో ఆదివారం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు స్థానికులు. తమ ప్రాణాలు రక్షించటంలో ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేశారు. నిరసనకారులను కలిసేందుకు వెళ్లిన క్రమంలో జమ్ముకశ్మీర్ బీజేపీ చీఫ్ రవిందర్ రైనాను అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, లెఫ్టినెంట్ గవర్నర్ తమ వద్దకు వచ్చి డిమాండ్లు వినాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు పౌరులు మృతి -
ఆర్మీ ఎయిర్పోర్ట్ వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి!
కాబూల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో మరోమారు భారీ పేలుడు సంభవించింది. ఆర్మీ ఎయిర్పోర్ట్ సమీపంలో ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దంతో పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటనలో 10 మంది పౌరులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. పేలుడు జరిగిన క్రమంలో ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకుని రోడ్లను మూసివేశాయి. ‘కాబూల్ మిలిటరీ ఎయిర్పోర్ట్ వెలుపల ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. దాంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.’ అని తెలిపారు ఆర్మీ ప్రతినిధి అబ్దుల్ నాఫీ టకోర్. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. అంతకు ముందు గతేడాది డిసెంబర్ 12న ఓ గుర్తు తెలియని సాయుధుడు కాబూల్లోని ఓ హోటల్లో కాల్పులకు పాల్పడ్డాడు. ఆ హోటల్లో చైనా పౌరులు ఉండటం కలకలం సృష్టించింది. తాలిబన్ భద్రతా దళాలు అక్కడికి చేరుకునే ముందు హోటల్ నుంచి భారీగా పొగలు వచ్చినట్లు పలు వీడియోల్లో కనిపించింది. ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో చైనాలో రోజుకు... 25 వేల కోవిడ్ మరణాలు -
నిజామాబాద్ నగరంలో భారీ పేలుడు!
ఖలీల్వాడి: నిజామాబాద్ నగరం రెండో పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్దబజార్లో శనివారం రాత్రి 10.30 గంటలకు భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా పేలుడుతో అక్కడి శివసాయి వైన్స్, ఫ్యాషన్ స్టోర్, లక్ష్మీనర్సింహస్వామి జనరల్ స్టోర్లకు సంబంధించిన షెడ్లు ధ్వంసమయ్యాయి. చెత్త ఏరుకునే వ్యక్తి కెమికల్ పదార్థాలను తీసుకురావడంతో పేలుడు సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు. కెమికల్ పదార్థాలు ఉన్న బాక్సును ఊపడంతో పేలుడు జరిగిందని వెల్లడించారు. స్థానికులు పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ పేలుడులో చేతికి తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని జీజీహెచ్కు తరలించినట్లు రెండో టౌన్ ఎస్సై పూర్ణేశ్వర్ తెలిపారు. ఇది బాంబు పేలుళ్లా.. లేక రసాయినిక చర్య కారణంగా జరిగిన పేలుడా అనేది దర్యాప్తులో తేలనుందని చెప్పారు. Telangana| 1 person injured in a blast in Bada Bazar area,Nizamabad We received info about a blast.The injured in the incident told that the blast happened when he shook a box of chemicals. Fire brigade was called.Injured was taken to hospital,he is fine now:SHO One Town(10.12) pic.twitter.com/HVY9K1n51E — ANI (@ANI) December 11, 2022 ఇదీ చదవండి: అమ్మో పులి...! జిల్లాలో మళ్లీ చిరుతల అలజడి -
టీఎంసీ నేత ఇంట్లో బాంబు పేలుడు.. బీజేపీ ఆరోపణలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంట్లో బాంబు పేలి.. ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుకాగా, ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. పూర్బా మేదినీపూర్ తూర్పు ప్రాంతం నార్యబిలా గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో టీఎంసీ నేత ఇంట్లో ఈ పేలుడు సంభించింది. సదరు నేత టీఎంసీ బూత్ ప్రెసిడెంట్ రాజ్కుమార్ మన్నాగా నిర్ధారణ అయ్యింది. పేలుడు ధాటికి ఇల్లు ముక్కలైపోయింది. ఇప్పటివరకు మూడు మృతదేహాలను(రాజ్కుమార్ సహా) ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాంబు పేలుడుకి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే పేలుడు తీవ్రత.. భారీగా ఉందని, చుట్టుపక్కల మేర కొంత నష్టం వాటిల్లిందని పోలీసులు చెప్తున్నారు. బీజేపీ నేత సువేందు అధికారి ఇలాకాగా పేరున్న కొంతాయ్ ప్రాంతంలో టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ ఇవాళ సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దాడి జరగడంతో రాజకీయ దుమారం చెలరేగింది. అయితే.. నాటు బాంబులు తయారు చేసే క్రమంలోనే ఈ పేలుడు సంభవించి ఉంటుందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో బాంబుల తయారీ పరిశ్రమ మాత్రమే అభివృద్ధి చెందుతోంది అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్.. అధికార టీఎంసీని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత సువేందు అధికారి సైతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ట్విటర్లో పోస్ట్ చేసి.. పలు అనుమానాలు వ్యక్తం చేశారు. TMC Booth President Rajkumar & 2 others died last evening while urgently making the bombs, as these bombs were intended to be hurled at Contai. Bombs are WB's most successful Cottage Industry products & are widely produced in TMC leaders' homes across Bengal.@AmitShah@HMOIndia — Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) December 3, 2022 మరోవైపు సీపీఐ(ఎం) నేత సుజన్ చక్రవర్తి స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలపై సీఎం మమతా బెనర్జీ ఎందుకు మౌనం వహిస్తున్నారని, ఆమె స్పందించాలంటూ డిమాండ్ చేశారు. ఈ పరిణామలపై టీఎంసీ రాష్ట్ర కార్యదర్శి కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. బెంగాల్లో అధికార పక్షాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు ఎలాంటి ఆధారాలు లేని వ్యవహారాలు భలే దొరుకుతున్నాయని పేర్కొన్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని, వాస్తవాలు అతిత్వరలోనే తెలుస్తాయని కునాల్ అన్నారు. ఇదీ చదవండి: తండ్రి వెంటే తనయుడు.. బీజేపీలోకి! -
పాఠశాలలో భారీ పేలుడు.. 16 మంది మృతి
కాబుల్: తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అఫ్గానిస్థాన్లో సామాన్య ప్రజలే లక్ష్యంగా దాడులు పెరిగిపోయాయి. తాజాగా అయ్బక్ నగరంలోని ఓ మదర్సాలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మంది చిన్నారులు సహా మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. దేశ రాజధాని కాబుల్కు 200 కిలోమీటర్ల దూరంలోని అయ్బక్ నగరంలో పేలుడు జరిగినట్లు తెలిపారు డాక్టర్. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులేనని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మృతుల్లో మొత్తం చిన్నారులు, సామాన్య ప్రజలే.’ అని ఏఎఫ్పీ న్యూస్తో వెల్లడించారు. మరోవైపు.. పేలుడు జరిగినట్లు అధికారులు ధ్రువీకరించినప్పటికీ మృతుల సంఖ్యపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్! -
బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు: సద్గురు
సాక్షి, చెన్నై: పలుమార్లు తనకు బెదిరింపులు వచ్చాయని, అయితే వాటికి తాను భయపడే ప్రసక్తే లేదని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు కేసు నిందితుడు సారిక్ తన మొబైల్ డీపీగా ఈషా యోగా కేంద్రంలోని ఆది యోగి విగ్రహం ఫొటోను కలిగి ఉన్నట్లు బయటపడిన విషయం తెలిసిందే. ఇతడు ఈషాయోగా కేంద్రాన్ని సందర్శించి రెక్కీ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఓవైపు మంగళూరు పోలీసులు, మరోవైపు తమిళ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కోయంబత్తూరు, మదురై, కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ కేంద్రంగా ఈ విచారణ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆంగ్ల మీడియాతో జగ్గీ వాసుదేవ్ మాట్లాడారు. వాట్సాప్ డీపీగా సారిక్ ఆదియోగి విగ్రహాన్ని భక్తితో పెట్టుకున్నాడో లేదా.. తన మతాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాడో స్పష్టంగా తెలియ లేదన్నారు. బెదిరింపులు తనకు కొత్త కాదని, ప్రాణానికి హాని కల్గిస్తామనే బెదిరింపులు ఎన్నోసార్లు వచ్చాయన్నారు. అయినా తాను ఇంకా జీవించే ఉన్నానని చమత్కరించారు. చదవండి: జయలలితకు సరైన చికిత్స అందలేదు.. ఆర్ముగ స్వామి సంచలన వ్యాఖ్యలు -
హుస్నాబాద్లో నాటుబాంబుల కలకలం.. పేలుడుతో ఉలిక్కిపడ్డ జనం..
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ ఆర్డీసీ బస్టాండ్ ఆవరణలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. రెండు బాంబులు పేలగా ఐదు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పేలుడుతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం బస్టాండ్లోని పార్కింగ్ స్థలం పక్కన ఒక్కసారిగా పేలుడు శబ్ధం రావడంతో ప్రయాణికులు, అక్కడున్న జనం ఉలిక్కిపడ్డారు. తోపుడు బండి కార్మికుడు బస్టాండ్లోని తన తోపుడు బండిని బయటకు తీస్తుండగా అక్కడే చెల్లాచెదురుగా పడి ఉన్న నాటుబాంబులకు తగిలి పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో ఆ కార్మికుడు ఆర్టీసీ సిబ్బందికి విషయాన్ని తెలియజేశాడు. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ సతీశ్, ఎస్సై శ్రీధర్ వెంటనే బాంబ్ స్క్వాడ్ సిబ్బందిని రప్పించారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ, పార్కింగ్ స్థలంలో తనిఖీలు చేపట్టారు. బాంబులు ఉన్న స్థలం వద్దకు ఎవర్నీ రానివ్వకుండా కట్టడి చేశారు. అయితే బస్టాండ్ ఆవరణలోకి నాటు బాంబులు ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారన్న విషయంపై స్పష్టత రాలేదు. ఈ నాటు బాంబులు ఊర పందులు, అడవి పందులను అరికట్టేందుకు వినియోగిస్తారని తెలుస్తోంది. గన్పౌడర్ (నల్ల మందు)తో వీటిని తయారు చేస్తారని సమాచారం. ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ బస్టాండ్ ఆవరణలోకి గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులను పడేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తున్నామన్నారు. -
మంగళూరు పేలుడు: షరీఖ్ కళ్లు తెరవాలని పోలీసులు..
బెంగళూరు: శనివారం సాయంత్రం మంగళూరు మైసూర్ శివారులో ఓ ఆటోలో ఉన్నట్లుండి పేలుడు సంభవించిన ఘటన.. ప్రమాదం కాదని, ఉగ్రకోణం ఉందని తేలడంతో కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పైగా అంతర్జాతీయ ఉగ్రసంస్థ ప్రమేయం బయటపడడంతో.. విస్తృత దర్యాప్తు ద్వారా తీగ లాగే యత్నంలో ఉంది కర్ణాటక పోలీస్ శాఖ. ఈ క్రమంలో.. పేలుడులో గాయపడ్డ మొహమ్మద్ షరీఖ్ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. కర్ణాటక పోలీసుల కథనం ప్రకారం.. శివమొగ్గ జిల్లా తీర్థాహల్లికి చెందిన షరీఖ్.. ఆటోలో డిటోనేటర్ ఫిక్స్ చేసిన ప్రెషర్కుక్కర్ బాంబుతో ప్రయాణించారు. మంగళూరు శివారులోకి రాగానే అది పేలిపోయింది. దీంతో ఆటో డ్రైవర్తో పాటు షరీఖ్ కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం నగరంలోని ఓ ఆస్పత్రిలో అతనికి చికిత్స అందుతోంది. ఇక ఇది ముమ్మాటికీ ఉగ్ర చర్యగానే ప్రకటించిన కర్ణాటక పోలీసు శాఖ.. కేంద్ర సంస్థలతో కలిసి దర్యాప్తు చేపడుతోంది. నగరంలో విధ్వంసం సృష్టించే ఉద్దేశంతోనే షరీఖ్ యత్నించినట్లు భావిస్తున్నామని అదనపు డీజీపీ అలోక్ తెలిపారు. 24 ఏళ్ల వయసున్న షరీఖ్పై ఓ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ప్రభావం ఉందని శాంతి భద్రతల అదనపు డీజీపీ అలోక్ కుమార్ సోమవారం వెల్లడించారు. అంతేకాదు.. కర్ణాటక బయట అతనికి ఉన్న లింకులను కనిపెట్టేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. బెంగళూరు సుద్ధాగుంటెపాళ్యాకు చెందిన అబ్దుల్ మాటీన్ తాహా.. షరీఖ్కు గతంలో శిక్షకుడిగా వ్యవహరించాడు. అంతేకాదు అతనిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఐదు లక్షల రివార్డు ప్రకటించింది అని అడిషినల్ డీజీపీ వెల్లడించారు. అతను(షరీఖ్) ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని, తద్వారా అతన్ని విచారించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన అంటున్నారు. సుమారు 45 శాతం కాలిన గాయాలతో.. మాట్లాడలేని స్థితిలో చికిత్స పొందుతున్నాడు ఆ యువకుడు. ఇక.. మైసూర్లో షరీఖ్ అద్దెకు ఉంటున్న ఇంట్లో అగ్గిపెట్టెలు, పాస్పరస్, సల్ఫర్, గీతలు, నట్లు-బోలట్లు లభించాయి. ఆ ఇంటి ఓనర్ మోహన్ కుమార్కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారు. ఇక ప్రేమ్ రాజ్ అనే పేరుతో ఫేక్ ఆధార్కార్డు తీసి.. ఆ గుర్తింపుతో దాడులకు యత్నించి ఉంటాడని, ఇంట్లోనే ప్రెషర్ కుక్కర్ బాంబ్ తయారుచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మంగళూరు, శివమొగ్గ, మైసూర్, తీర్థహల్లితో పాటు మరో మూడు చోట్ల ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. #Mangaluru மங்களூர் ஆட்டோவில் குண்டு வெடிப்பு பயங்கரவாத செயல் என்று டிஜிபி அறிவிப்பு pic.twitter.com/rPDLRHgLMY — E Chidambaram. (@JaiRam92739628) November 20, 2022 మరికొందరికి బ్రెయిన్వాష్..? ఇదిలా ఉంటే 24 ఏళ్ల షరీఖ్.. ఓ బట్టల దుకాణంలో పని చేసేవాడు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు గానూ UAPA కింద అతనిపై కేసు కూడా నమోదు అయ్యింది. మంగళూరులో గతంలో మత సంబంధిత అభ్యంతరకర రాతలు, బొమ్మలు గీసి.. జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు. శివమొగ్గలో పంద్రాగష్టున జరిగిన మత ఘర్షణల్లోనూ ఇతని పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ సమయంలో ఒకతన్ని కత్తితో పొడిచిన కేసులో సహ నిందితుడిగా ఉండడమే కాదు.. ఆ కేసులో పరారీ నిందితుడిగా ఉన్నాడు షరీఖ్. ఈ కేసులో అరెస్ట్ అయిన యాసిన్, ఆమాజ్లు.. షరీఖ్ తమకు బ్రెయిన్వాష్ చేశాడని వెల్లడించారు. అంతేకాదు.. అతనికి సంబంధాలు ఉన్న ఉగ్ర సంస్థ కోసం ఇక్కడా షరీఖ్ పని చేశాడని వాంగ్మూలం ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ల నుంచి భారత్కు సిద్ధించింది నిజమైన స్వాతంత్రం కాదని..ఇస్లాం రాజ్య స్థాపనతోనే అది పూర్తవుతుందని ఇతరులకు షరీఖ్ బోధించేవాడని పోలీసులు వెల్లడించారు. Karnataka | Mangaluru Police displays the material recovered from the residence of Mangaluru autorickshaw blast accused, Sharik. pic.twitter.com/y3Atxfi96p — ANI (@ANI) November 21, 2022 సిరియాకు చెందిన ఆ మిలిటెంట్ సంస్థ నుంచి ఓ మెసేజింగ్ యాప్ ద్వారా సందేశం అందుకున్న షరీఖ్.. అందులోని పీడీఎఫ్ ఫార్మట్ డాక్యుమెంట్ ద్వారా బాంబు ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాడని కర్ణాటక పోలీసులు ట్రేస్ చేయగలిగారు. అంతేకాదు తుంగ నది తీరాన బాంబు పేలుడు తీవ్రతను తెలుసుకునేందుకు.. ట్రయల్ను సైతం నిర్వహించారని పోలీసులు తెలిపారు. -
ఇస్తాంబుల్ బాంబ్ బ్లాస్ట్: అనుమానితుడి అరెస్ట్
అంకారా: టర్కీ ప్రధాన నగరం ఇస్తాంబుల్లో చోటు చేసుకున్న భారీ పేలుడు ఘటన.. ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఆదివారం సాయంత్రం ఇస్తిక్లాల్ అవెన్యూ రద్దీ మార్కెట్లో పేలుడు సంభవించగా.. ఆ ధాటికి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఇక ఈ పేలుడు ఘటనలో మరో 81 మంది గాయపడ్డారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడిని టర్కీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అత్యంత రద్దీ ఉండే ఆ వీధిలో సదరు దుండగుడు బాంబును వదిలేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. అనుమానితుడి అరెస్ట్ విషయాన్ని టర్కీ మంత్రి సులేమాన్ సోయ్లూ సోమవారం ధృవీకరించారు. #URGENT Person who left bomb that caused explosion Sunday on Istanbul’s Istiklal Avenue arrested by police, says Interior Minister Suleyman Soylu pic.twitter.com/I08OTC4rPb — ANADOLU AGENCY (@anadoluagency) November 14, 2022 మరోవైపు ఈ దాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్.. ఇదొక ఉగ్రవాద దాడనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారాయన. ఇదిలా ఉంటే.. 2015-2016లో ఇస్తిక్లాల్ స్ట్రీట్లో పేలుడు జరిగి సుమారు 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ❗Blast hits central #Istanbul, local media report. pic.twitter.com/s95VcL1BRr — NonMua (@NonMyaan) November 13, 2022 ఇదీ చదవండి: ఇస్తాంబుల్ పేలుడు.. చెవులు పగిలిపోయేలా సౌండ్ -
షాపింగ్ స్ట్రీట్లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. 53 మందికి గాయాలు
ఇస్తాంబుల్: టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో ఆదివారం సాయంత్రం భారీ పేలుడు కలకలం సృష్టించింది. నిత్యం పర్యాటకులు, స్థానికులతో రద్దీగా ఉండే బెయోగ్లూ జిల్లాలోని ఇస్తిక్లాల్ షాపింగ్ స్ట్రీట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం 4.00 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పేలుడు జరిగిన క్రమంలో ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో పరుగులు పెడుతున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, ఆరోగ్య విభాగం, ఏఎఫ్ఏడీ బృందాలు సంఘటానా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పేలుడు జరిగిన క్రమంలో ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేపట్టారు పోలీసులు. నగరంలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే, పేలుడుకు గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. రెండో పేలుడు జరుగుతుందనే అనుమానంతో ఆ ప్రాంతాన్ని మూసివేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. మార్కెట్ ప్రవేశ మార్గాల్లో భారీగా బలగాలను మోహరించినట్లు వెల్లడించింది. ‘ఘటనాస్థలానికి నేను 50-55 మీటర్ల దూరంలోనే ఉన్నాను. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వచ్చింది. ముగ్గురు-నలుగురు పడిపోయి కనిపించారు. భయంతో అక్కడి వారంతా పరుగులు పెట్టారు. నల్లటి పొగ కమ్ముకుంది. శబ్దం చెవులు పగిలిపోయేలా భారీగా వచ్చింది’ అని ప్రత్యక్ష సాక్షి, 57 ఏళ్ల కెమాల్ డెనిజ్కి తెలిపారు. ఇస్తిక్లాల్ షాపింగ్ వీధిలో ఆదివారం భారీగా జనం ఉంటారు. ఈ క్రమంలో పేలుడు జరగటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2015-2016లో ఇస్తిక్లాల్ స్ట్రీట్లో పేలుడు జరిగి సుమారు 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ❗Blast hits central #Istanbul, local media report. pic.twitter.com/s95VcL1BRr — NonMua (@NonMyaan) November 13, 2022 విద్రోహ చర్య.. ఖండించిన ప్రెసిడెంట్.. రద్దీగా ఉండే ప్రాంతంలో సామాన్యులే లక్ష్యంగా చేసిన దాడిని ఖండించారు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయీప్ ఎర్డోగాన్. ఇది ఉగ్రవాదులు చేసిన విద్రోహ చర్యేనని పేర్కొన్నారు. దుండగులను పట్టుకునేందుకు సంబంధిత విభాగాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. Police cordon off the scene of the explosion in #Istanbul. pic.twitter.com/m0XtxNNa9T — NEXTA (@nexta_tv) November 13, 2022 ఇదీ చదవండి: ‘పులిని చూసిన మేకల్లా పారిపోయారు’.. రష్యా సేనలపై ఉక్రెయిన్ పౌరుల సెటైర్లు -
'చదువును చంపకండి'.. రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో గత శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అభం శుభం తెలియని విద్యార్థులు చనిపోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఒక ఆగంతకుడు బాంబు ధరించి క్లాస్రూంకు వెళ్లాడు. విద్యార్థులు మధ్య కూర్చున్న తర్వాత తనను తాను పేల్చుకున్నట్లు తెలిసింది. ఆత్మాహుతి దాడిలో 46 మంది బాలికలతో పాటు ఒక మహిళ మరణించినట్లు ఐక్యరాజ్యసమితి ద్రువీకరించింది. ఆ తర్వాత మరణించిన వారి సంఖ్య 53కు చేరుకోగా.. 110 మంది గాయపడినట్లు ఐరాస తన ట్విటర్లో ప్రకటించింది. కాగా కాబుల్ ఆత్మాహుతి ఘటనపై అఫ్గనిస్తాన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, రహమత్ షాలు స్పందించారు. ''దయచేసి చదువును చంపేయకండి.. ఏమి తెలియని పిల్లలేం చేశారు.. వారిని ఎందుకు పొట్టబెట్టుకున్నారు.. ఇది చాలా బాధాకరం'' అంటూ పేర్కొన్నారు. ఇక కాబుల్లోని ఆసుపత్రిలోని ఐసియు వెలుపల తన సోదరి స్కూల్ బ్యాగ్తో బాధతో కూర్చున్న టీనేజర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ''ది మోస్ట్ హార్ట్బ్రేకింగ్ ఫోటో'' అంటూ కామెంట్ చేశారు. Kabul Suicide Attack: కాబూల్లో ఆత్మాహుతి దాడి.. 100 మంది చిన్నారులు మృతి Kabul 💔💔 😢😢🤲🏻🤲🏻 #DontKillEducation 🙏🙏 pic.twitter.com/mxmRFsswmc — Rashid Khan (@rashidkhan_19) September 30, 2022 💔💔💔😭😭😭🤲🏻🤲🏻🤲🏻…. pic.twitter.com/tqDGtAVbIv — Rahmat Shah (@RahmatShah_08) October 1, 2022 -
కాబూల్లో ఆత్మాహుతి దాడి.. 100 మంది చిన్నారులు మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఓ విద్యాసంస్థ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ దర్ఘటనలో 100 మంది విద్యార్థులు చనిపోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే పేలుడుకు పాల్పడింది ఎవరో తెలియాల్సి ఉందని అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం 7:30గంటలకు ఓ వ్యక్తి కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్కు బాంబు ధరించి వెళ్లాడని, అనంతరం విద్యార్థుల మధ్యకు చేరుకుని తనను తాను పేల్చుకున్నాడని అధికారులు తెలిపారు. వాజిర్ అక్బర్ ఖాన్ ప్రాంతంలో ఇటీవలే భారీ పేలుడు సంభవించి పదుల సంఖ్యలో మరణించారు. ఇప్పుడు మరో ఘటన జరగడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. అఫ్గానిస్తాన్ల ోతాలిబన్లు అధికారంలోకి వచ్చి ఆగస్టుతో ఏడాది పూర్తయింది. ఆ తర్వాత నుంచి వరుసుగా బాంబు దాడులు జరుగుతున్నాయి. తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగానే ఉగ్రసంస్థలు ఈ దారుణాలకు పాల్పడుతున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. Each number on those chairs represented one human being. Each number, and their families, had dreams to come here and take the university preparation entrance examination. Those dreams are dashed with fatal consequences for them, the families, communities , and the country. pic.twitter.com/CnphF6tgd9 — BILAL SARWARY (@bsarwary) September 30, 2022 చదవండి: టీ రెక్స్ అంటే.. డైనోసార్ సినిమాల్లో హీరో లెక్క -
రష్యా ఎంబసీ వద్ద టెన్షన్.. ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి!
తాలిబన్ పాలిత ఆప్ఘనిస్తాన్లో కొద్దిరోజులుగా వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం కాబూల్లో భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మందికిపైగా మృతిచెందినట్టు ఆ దేశ మీడియాలో ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాల ప్రకారం.. కాబూల్లోని రష్యా రాయబార కార్యాలయం సమీపంలో సోమవారం బాంబ్ బ్లాస్ట్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడి కారణంగా బ్లాస్ట్ జరిగింది. సదరు వ్యక్తి రష్యా రాయబార కార్యాలయంలోని ప్రవేశించి లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందే ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తిని తాలిబాన్ గార్డులు గుర్తించి కాల్చిచంపినట్టు పోలీసు అధికారి మవ్లావి సాబిర్ తెలిపారు. కాగా, ఈ పేలుడు ఘటనలో దాదాపు 25 మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు రష్యా దౌత్యవేత్తలు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. ఇటీవలే హెరాత్ ప్రావిన్స్లో గుజార్గా మసీదులోనూ శుక్రవారం ప్రార్థనల సమయంలో పేలుడులో మతపెద్ద ముజీబ్ ఉల్ రెహ్మాన్ అన్సారీ, అతని భద్రతా సిబ్బంది సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. At least 25 people were killed and injured in an explosion near the #Russian embassy in #Kabul. Russian Foreign Ministry says 2 employees of the Russian Embassy in Kabul were killed today's bomb blast on Darulaman road in Kubal.#Afghanistan#KubalBlast pic.twitter.com/EYlWEGaNGi — Kamran Khan Afridi (@Kamrankhan1432) September 5, 2022 ఇది కూడా చదవండి: అమెరికాలో భారత మహిళలపై జాతివివక్ష దాడి.. ఇండియాకు వెళ్లిపోండి అంటూ.. -
ఆప్ఘన్లో బాంబు పేలుళ్లు.. తాలిబన్లు అలర్ట్
కాబూల్: అఫ్గానిస్థాన్లో ఐఎస్ఐఎస్(ISIS) తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర అఫ్గానిస్థాన్లో గురువారం రాత్రి మినీ బస్సుల్లో బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ రెండు బాంబు పేలుళ్లలో 9 మంది మృతిచెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ-షరీఫ్లో రెండు మినీ బస్సులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు పేలుళ్లు జరిపారని తాలిబన్ అధికారులు తెలిపారు. దీంతో తాలిబన్ బలగాలు ఘటనా స్థలాన్ని చుట్టుముట్టాయి. గత వారమే మసీదు, మతపరమైన పాఠశాలలో జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించిన విషయం తెలిసిందే. షియాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు ముష్కరులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, తాజాగా జరిగిన దాడికి తామే కారణమంటూ ఐఎస్ఐఎస్(ISIS) తెలిపింది. ఇది కూడా చదవండి: చెప్పినట్లు వింటావా.. లేదంటే మరో 20 మంది మగాళ్లను తీసుకురమ్మంటావా? -
పాకిస్తాన్లో మహిళా సూసైడ్ బాంబర్.. షాకింగ్ విషయాలు వెల్లడి
పాకిస్థాన్లోని కరాచీ విశ్వవిద్యాలయంలో చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులతోపాటు నలుగురు మృత్యువాతపడ్డారు. దీనికి తామే బాధ్యులమని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే ఓ మహిళా సుసైడ్ బాంబర్ ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడించింది. తాజాగా హ్యుమన్ బాంబర్గా మారిన మహిళ గురించి షాకింగ్ వివరాలు వెల్లడయ్యాయి. BREAKING 🇵🇰 Pakistan🇵🇰 : Warning Graphic Content ‼️ ♦️Video footage shows the moment of suicide attack on Chinese national’s vehicle in Karachi university ♦️Footage shows the suicide bomber blew herself when the Van arrived #Karachi #Sindh #China #University #Blast #Explosion pic.twitter.com/7qLSDCS0vh — Zaid Ahmd (@realzaidzayn) April 26, 2022 బలూచిస్తాన్లోని నియాజర్ అబాద్కు చెందిన 30ఏళ్ల షరి బలోచ్ ఈ దాడికి పాల్పడింది. ఆమె ఎంఎస్సీ జువాలజీ పూర్తిచేసి.. సైన్స్ టీచర్గా విధులు నిర్వహిస్తోంది. ఓ వైద్యుడిని వివాహం చేసుకున్న ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. వారిలో ఒకరికి ఎనిమిదేళ్లు పేరు మహర్రోష్.. మరొకరికి నాలుగేళ్లు పేరు మీర్ హాసన్. రెండేళ్ల క్రితమే బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీలోని మజీద్ బ్రిగేడ్కు చెందిన స్పెషల్ సెల్ఫ్ శాక్రిఫైజ్ (ఆత్మ బలిదానం) బృందంలో చేరింది. చదవండి👉 Viral Video: పెను ప్రమాదం నుంచి బిడ్డను కాపాడిన తల్లి.. క్షణం ఆలస్యమైనా.. Shari Jan,your selfless act has left me speechless but I am also beaming with pride today. Mahroch and Meer Hassan will grow into very proud humans thinking what a great woman their mother https://t.co/xOmoIiBPEf will continue to remain an important part of our lives. pic.twitter.com/Gdh2vYXw7J — Habitan Bashir Baloch (@HabitanB) April 26, 2022 తొలి మహిళా బాంబర్ అయితే తనకు ఇద్దరు పిల్లలు ఉండడంతో దీని నుంచి తప్పుకోవడానికి అవకాశం కల్పించినా ఆమె ఒప్పుకోలేదు. షరి మిలిటెంట్ గ్రూప్లో తొలి మహిళా బాంబర్. ఆరు నెలల క్రితమే తాను ఆత్మబలిదాన దాడికి కట్టుబడి ఉన్నానని ఆమె ధ్రువీకరించింది. ఆత్మాహుతి దాడికి బాధ్యత ప్రకటించుకున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ విషయాలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. #Karachi suicide bomber was highly educated mother of two. M.Phil, MSc wife of a doctor: Shari #Baloch, fighting for liberation of #Balochistan from #Pakistan army atrocities. Part of the #MajeedBrigade of Baloch Liberation Army #BLA. Spl wing created in BLA to target #China Pak pic.twitter.com/nkmM1SzHxg — GAURAV C SAWANT (@gauravcsawant) April 26, 2022 చైనా స్పందన మరోవైపు చైనీయులే లక్ష్యంగా జరిగిన కరాచీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఆత్మాహుతి దాడిని ఆ దేశం తీవ్రంగా ఖండించింది. ఘటనపై లోతుగా విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. అదే విధంగా పాకిస్థాన్లో నివసిస్తున్న చైనీయులకు మరింత భద్రతను అందిచాలని కోరింది. ఈ ఘటన వెనక బాధ్యులు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని చైనా విదేశాంగ వాఖ హెచ్చరించింది. -
ప్రధాని మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందే పేలుడు
జమ్మూ: జమ్ముకశ్మీర్లో ప్రధాని పర్యటనకు కొన్నిగంటల ముందు సభావేదికకు 12 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించింది. జమ్ము జిల్లాలోని లాలియాన గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఒక పొలంలో పేలుడు చోటు చేసుకొంది. ప్రధాని బహిరంగ సభ జరగనున్న సాంబా జిల్లాలోని పల్లీ గ్రామానికి ఇది సమీపంలోనే ఉంటుంది. సమాచారం అందుకొన్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇది ఉగ్రదాడి కాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. జమ్మూ-కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి హోదానిచ్చే 370 అధికరణం ఉపసంహరణ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ నేడు జమ్మూ-కశ్మీర్లో పూర్తిస్థాయి పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో ఆయన బనిహాల్-కాజీగుండ్ సొరంగ మార్గంతో పాటు, రూ.20 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లాలోని పల్లీ గ్రామం నుంచి దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ సౌర విద్యుత్ ప్లాంట్ను కూడా ప్రారంభించనున్నారు. సుంజ్వాన్ ప్రాంతంలో మొన్న ఇద్దరు జైషే-మహమ్మద్ తీవ్రవాదుల ఎన్కౌంటర్ నేపథ్యంలో ప్రధాని భద్రతను అధికారులు మరింత పటిష్ఠం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ.. ఎన్ఐఏ అధిపతి కుల్దీప్ సింగ్ సుంజ్వాన్ ప్రాంతానికి చేరుకున్నారు. మోదీ పర్యటించనున్న పల్లీ గ్రామానికి కూడా చేరుకొని అక్కడి భద్రతా పరిస్థితినీ సమీక్షించారు. చదవండి: (ఏప్రిల్ 27న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ) -
కాబుల్లో బాంబు పేలుడు.. ఆరుగురి మృతి
కాబుల్:ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. పశ్చిమ కాబూల్లోని ఓ పాఠశాలలో బాంబు పేలుడు జరిగిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 11 మంది గాయపడినట్లు ఆఫ్ఘన్ పోలీసు అధికారులు వెల్లడించారు. మరణించిన, గాయపడినవారు షియా హజారా కమ్యూనిటీకి చెందినవారని పోలీసులు గుర్తించారు. వీరు తరచు ఇస్లామిక్ స్టేట్, సున్నీ తీవ్రవాద గ్రూపులచే టార్గెట్ అవుతున్నారు. పేలుడు మూడు చోట్ల జరిగిందని, షియా ప్రజలు కొంత మంది ప్రాణాలు కోల్పోయారని కాబూల్ కమాండర్ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. -
పెషావర్లో బాంబు దాడి; ఆందోళనలో క్రికెట్ ఆస్ట్రేలియా
24 ఏండ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ తీవ్రవాదులు బాంబు దాడితో కంగారెత్తించారు. పెషావర్లోని ఒక మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారమే పెషావర్కు 187 కిమీ దూరంలో ఉన్న రావల్పిండి వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లలో కంగారు మొదలైంది. ఉగ్రవాదుల దాడుల భయంతో పాకిస్తాన్లో పర్యటించేందుకు ఏ జట్టు ఇష్టపడలేదు. దీనికి తోడూ 2009లో పాక్ పర్యటనకు వచ్చిన లంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. ఈ దాడిలో లంక క్రికెటర్లు సమరవీర, జయవర్దనే, సంగక్కర సహా తదితర క్రికెటర్లు గాయపడ్డారు. ఆరుగురు పాకిస్తాన్ పోలీసులతో పాటు ఇద్దరు దేశ పౌరులు కాల్పులకు బలయ్యారు. దీంతో పాక్లో క్రికెట్ ఆడేందుకు ఇతర దేశాలు నిరాకరించాయి. అయితే ఇటీవలే మా దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేశాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ సహా పీసీబీ స్వయంగా వెల్లడించింది. కాగా తమ దేశంలో సిరీస్ ఆడేందుకు రావాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరింది. ఆ దేశం కోరికను మన్నించి ఇక్కడకు వచ్చింది. 1998లో ఆఖరుసారిగా పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా.. పాక్ను చిత్తుగా ఓడించింది. మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన ఆసీస్.. ఆ తర్వాత ఐదు టెస్టుల సిరీస్ను 1-0తో గెలుచుకుంది. తాజాగా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడడానికి ఆస్ట్రేలియా పాకిస్తాన్పై మరోసారి అడుగుపెట్టింది. సిరీస్ నిర్వహణ సజావుగా సాగుతుందా..? అని క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ భయపడినట్లే జరిగింది. శుక్రవారం పెషావర్లోని కిస్సా ఖవానీ బజార్ ఏరియాలోని మసీదులో బాంబు పేలుడు కలవరం రేపింది. పెషావర్ బాంబు దాడి నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన జరిగిన ప్రాంతం రావల్పిండికి ఏమంత దూరం కాకపోవడంతో సీఏ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అయితే పాక్ లో ఉన్న తమ ఆటగాళ్ల భద్రత గురించి ఆసీస్ ఎప్పటికప్పుడూ ఆరా తీస్తున్నది. భద్రతకు సంబంధించి ఏ ఆటగాడికి ఇబ్బంది కలిగినా తిరిగి స్వదేశానికి రావొచ్చని సీఏ సూచించినట్టు సమాచారం. అయితే బాంబు దాడి నేపథ్యంలో సీఏ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ విషయం పక్కనబెడితే.. తొలి టెస్టు మొదటి రోజున పాకిస్తాన్ పట్టుబిగించింది. రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. 80 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ కోల్పోయి 235 పరుగులు చేసింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (127 బ్యాటింగ్) సెంచరీతో కదం తొక్కగా మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (44)ఫర్వాలేదనిపించాడు ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 105 పరుగులు జోడించారు. అబ్దుల్లా నిష్క్రమణతో వచ్చిన అజర్ అలీ (59 బ్యాటింగ్) కలిసి ఇమామ్ ఇన్నింగ్సును నడిపిస్తున్నాడు. ఇక శుక్రవారం కావడంతో ప్రార్థనలకు వెళ్లిన చాలా మంది అమాయకులు బాంబుదాడిలో మరణించారు. అయితే సాయుధులై ఉన్న తీవ్రవాదులు.. ముందు ప్రజలపై కాల్పులు జరుపుదామని ప్రయత్నించినా.. అది వీలుకాకపోవడంతో ఆత్మాహుతికి దిగారని తెలుస్తున్నది. ఈ ఘటనను పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు ప్రతిపక్ష నాయకుడు షాబాజ్ షరీఫ్ కూడా ఖండించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించారు. గాయపడిన మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులన ఆస్పత్రులకు తరలించి తగిన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. Suicide bombing at Shi'ite mosque in Pakistan's Peshawar kills at least 30 https://t.co/yL6Ssty5f7 pic.twitter.com/rGgAXAimG8 — Reuters (@Reuters) March 4, 2022 -
పాకిస్తాన్లో ఉగ్ర ఘాతుకం: 56 మంది మృతి
Peshawar Explosion:పెషావర్: వాయవ్య పాకిస్తాన్లో.. అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పెషావర్ నగరంలో ఉగ్రవాదులు తీవ్ర ఘాతుకానికి ఒడిగట్టారు. మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 194 మంది గాయాల పాలయ్యారు. ఖైబర్–పఖ్తూంక్వా ప్రావిన్స్లో ఇప్పటిదాకా జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడుల్లో ఇది కూడా ఒకటని అధికారులు చెప్పారు. పెషావర్లోని ఖిస్సా ఖ్వానీ బజార్ ఏరియా సమీపంలో ఇమామ్బర్గా వద్ద షియా వర్గానికి చెందిన జామియా మసీదులో పేలుడు జరిగిందని తెలిపారు. ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థే కారణమని నిర్ధారణకు వచ్చారు. షియావర్గం ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ కొంతకాలంగా భీకర దాడులకు పాల్పడుతోంది. జామియా మసీదులో పేలుడు ఘటనలో ఉగ్రవాదులు పాల్గొన్నారని ఖైబర్–పఖ్తూంక్వా ప్రభుత్వ అధికార ప్రతినిధి బారిస్టర్ మొహమ్మద్ అలీ సైఫ్ చెప్పారు. ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పాల్గొన్నప్పటికీ.. వారిలో ఒక్కడు మాత్రమే ప్రార్థనలు జరుగుతున్న సమయంలో తనను తాను పేల్చేసుకున్నాడని పెషావర్ పోలీసు ఉన్నతాధికారి హరూన్ రషీద్ ఖాన్ తెలిపారు. నల్ల రంగు దుస్తులు ధరించిన వ్యక్తిని సూసైడ్ బాంబర్గా ఓ ప్రత్యక్ష సాక్షి గుర్తించారు. సదరు ముష్కరుడు తొలుత మసీదు సెక్యూరిటీ గార్డును తుపాకీతో కాల్చి చంపాడని, తర్వాత మసీదు లోపలికి ప్రవేశించి, తనను తాను పేల్చుకున్నాడని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. జామియా మసీదులో ఆత్మాహుతి పేలుడు గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. పెషావర్లో పేలుడు ఘటనపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అమాయకుల ప్రాణాలను బలిగొన్న దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని ఖైబర్–పఖ్తూంక్వా ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రార్థనల్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం అమానవీయం, రాక్షస కృత్యం అని చెప్పారు. -
అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 38 మందికి మరణ శిక్ష
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యం చేసుకుని జరిగిన 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మంది ఇండియన్ ముజాహిదీన్ ముష్కరులకు మరణశిక్ష పడింది. వాళ్లను చనిపోయేదాకా ఉరి తీయాలని ప్రత్యేక కోర్టు జడ్జి ఏఆర్ పటేల్ ఆదేశించారు. మరో 11 మందికి జీవితఖైదు విధించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన 7,000 పేజీల పై చిలుకు తీర్పు వెలువరించారు. ఒకే కేసులో ఏకంగా ఇంతమందికి మరణ శిక్ష పడటం మన దేశ న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసులో 26 మందికి మరణ శిక్ష విధించడమే ఇప్పటిదాకా రికార్డు. ఈ పేలుళ్ల ద్వారా అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని చంపాలన్నది కూడా కుట్రదారుల లక్ష్యమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధీర్ బ్రహ్మభట్ తీర్పు అనంతరం మీడియాకు చెప్పారు. 2010లో నమోదు చేసిన చార్జిషీట్లో ఒక నిందితుడు ఈ విషయాన్ని ఒప్పుకున్నాడని ఆయన వివరించారు. ఈ విషయాన్ని జడ్జి తన తీర్పులో కూడా పొందుపరిచారని చెప్పారు. ‘‘పేలుళ్ల ద్వారా మోదీని కూడా చంపాలని కుట్రదారులు ప్రయత్నించారని జడ్జి తన తీర్పులో ప్రస్తావించారు. నాటి గుజరాత్ హోం మంత్రి, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు అప్పటి మోదీ మంత్రివర్గ సహచరులు ఆనందీబెన్ పటేల్, నితిన్ పటేల్, స్థానిక ఎమ్మెల్యే ప్రదీప్సింగ్ జడేజా తదితరులను కూడా చంపాలన్నది ఉగ్రవాదుల ప్లాన్ అని వివరించారు’’ అని ఆయన పేర్కొన్నారు. 14 ఏళ్ల పాటు విచారణ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో 2009లో విచారణ మొదలైంది. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన 78 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వారిలో ఒకరు 2019లో అప్రూవర్గా మారారు 49 మందిని దోషులుగా ఫిబ్రవరి 8న కోర్టు తేల్చింది. మరో 28 మందిని వదిలేసింది. దోషుల్లో 48 మందికి రూ.2.85 లక్షలు, మరొకరికి రూ.2.88 లక్షలు జరిమానా విధించారు. మరణశిక్ష పడ్డ వాళ్లలో ప్రధాన కుట్రదారులైన మధ్యప్రదేశ్కు చెందిన సఫ్దర్ నగోరీ, కమ్రుద్దీన్ నగోరీ, గుజరాత్కు చెందిన ఖయాముద్దీన్ కపాడియా, జహీద్ షేక్, షంషుద్దీన్ షేక్ తదితరులున్నారు. తీర్పు వెలువడ్డాక ప్రధాన కుట్రదారు సఫ్దర్ నగోరీలో పశ్చాత్తాప ఏ మాత్రమూ కన్పించలేదని పోలీసులు చెప్పారు. అతను ప్రస్తుతం భోపాల్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని దోషుల తరఫున లాయర్లు తెలిపారు. ఏం జరిగింది? ∙2008 జూలై 26న గుజరాత్లోని అహ్మదాబాద్ను వరుస బాంబు పేలుళ్లు వణికించాయి. ∙సాయంత్రం 6.45 నుంచి గంటంపావు పాటు 14 చోట్ల 21 పేలుళ్లతో నగరం దద్దరిల్లిపోయింది. ∙56 మంది చనిపోగా 200 మందికి పైగా గాయపడ్డారు. మరో రెండు బాంబులు పేలలేదు. ∙ఇది తమ పనేనని సిమి కనుసన్నల్లో నడిచే ఇండియన్ ముజాహిదీన్ ప్రకటించుకుంది. ∙తర్వాత రెండు రోజుల్లో సూరత్లో 29 లైవ్ బాంబులు దొరకగా నిర్వీర్యం చేశారు. ∙2002 గోధ్రా అనంతర అల్లర్లకు ప్రతీకారంగా పేలుళ్లకు పాల్పడ్డట్టు నిందితులు పేర్కొన్నారు. ∙పేలుళ్ల కుట్ర 2007లో కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో అడవుల్లో ఐఎం క్యాంపులో జరిగింది. ∙దేశవ్యాప్తంగా రిక్రూట్ చేసుకున్న 50 మందికి అక్కడ పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చారు. ∙పేలుళ్లకు పాల్పడుతున్నట్టు సరిగ్గా 5 నిమిషాల ముందు మీడియా సంస్థలకు ఉగ్రవాదులు ఇ–మెయిళ్లు పంపారు. విచారణ–విశేషాలు ∙అహ్మదాబాద్లో నమోదైన 20 ఎఫ్ఐఆర్లు, సూరత్లో నమోదైన 15 ఎఫ్ఐఆర్లను కలిపి విచారణ చేపట్టారు. ∙ప్రస్తుత గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా సారథ్యంలో విచారణ మొదలైంది. ∙విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. బేలా త్రివేది నుంచి ఏఆర్ పటేల్ దాకా మొత్తం 9 మంది జడ్జీలు విచారణ జరిపారు. ∙నిందితుల్లో 24 మంది 213 అడుగుల సొరంగం తవ్వి పారిపోయే ప్రయత్నం చేశారు. -
ఒడిశాలో బాంబు పేలుడు.. జర్నలిస్టు మృతి
భవానీపట్నం/భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కలహండీ జిల్లాలో శనివారం బాంబు(ఐఈడీ) పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రముఖ పత్రిక జర్నలిస్టు, ఫొటోగ్రాఫర్ రోహిత్కుమార్ బిశ్వాల్(46) మరణించాడు. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఈ బాంబు పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెలలో జరగబోయే ఐదు దశల పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిస్తూ మావోయిస్టులు మదన్పూర్ రాంపూర్ బ్లాక్లోని దోమ్కర్లకుంటా గ్రామం వద్ద ఓ చెట్టుకు అతికించిన పోస్టర్లు, బ్యానర్ను రోహిత్కుమార్ తిలకిస్తుండగా అక్కడే బాంబు పేలిందని కలహండీ ఎస్పీ డాక్టర్ వివేక్ చెప్పారు. జర్నలిస్టు మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించారు. రోహిత్కుమార్ కుటుంబానికి రూ.13 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. -
పాకిస్తాన్లో భారీ బాంబు పేలుడు.. ఆస్ట్రేలియా పర్యటన ఇక..!
Australias tour of Pakistan: పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో భారీ బాంబు పేలుడు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 30 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ దేశ కేంద్ర మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంచలన వాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్తో పాటు ఆస్ట్రేలియా పర్యటనను అడ్డుకోవడమే బాంబు పేలుళ్ల ప్రధాన ఉద్దేశ్యమని అతను అభిప్రాయపడ్డారు. కాగా పాకిస్తాన్ సూపర్ లీగ్-2022 జనవరి 27న ప్రారంభం కానుంది. "దేశంలో శాంతి నెలకొనడంతో పాకిస్తాన్ను అస్థిరపరిచేందుకు ముష్కరులు ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్, చారిత్రాత్మక ఆస్ట్రేలియా పర్యటనను అడ్డుకోవడమే ఈ పేలుడు ముఖ్య ఉద్దేశ్యం. కానీ మేము దానిని జరగనివ్వము" అని రషీద్ అహ్మద్ పేర్కొన్నారు. ఇక 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు తొలి సారిగా పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మార్చిలో ఆస్ట్రేలియా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ను పాకిస్తాన్తో ఆడనుంది. అయితే ఈ పేలుడుతో ఆసీస్ పర్యటన మరోసారి సందిగ్ధంలో పడింది. చదవండి: హైదరాబాదీ ఆల్రౌండర్కి బంఫర్ ఆఫర్.. భారత జట్టులో చోటు! -
పాకిస్తాన్: కరాచీలో భారీ పేలుడు.. 10 మంది మృతి, 13 మందికి గాయాలు
కరాచీ: పాకిస్తాన్లోని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. గ్యాస్ పైపలైన్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఓ ప్రైవేటు బ్యాంకు భవనం భారీగా ధ్వంసమైంది. ప్రమాదంలో ఇప్పటివరకు 10మంది మృతి చెందగా, 13 మందికి గాయాలైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో ధ్వంసమైన భవన శిథిలాల కింద పలువురు చిక్కుకోగా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. -
గ్రహాంతరవాసులను చూసేందుకు వెళ్తున్నా.. విమానాన్ని హైజాక్ చేస్తున్నా!
కొంతమంది చేసే పనులు చాలా విచిత్రంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటాయి. పైగా వాళ్లు చేసే విచిత్రమైన పనులతో అందర్నీ ఇబ్బందులకు గురి చేసి కటకటాలపాలవుతుంటారు కూడా. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి గ్రహాంతర వాసులును చూసేందుకు అంటూ హాస్యగాడి వలే విచిత్రమైన ముసుగు ధరించి ఎయిర్పోర్టుకు వెళ్లి అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తాడు. (చదవండి: వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే!) అసలు విషయంలోకెళ్లితే... మాథ్యూ హాన్కాక్ అనే వ్యక్తి గ్రహాంతరవాసులను చూసేందుకు వెళ్తున్నానంటూ నెవెడాలో లాస్ వేగాస్లోని మెక్కారన్ అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతా నియమాలను ఉల్లంఘిస్తాడు. పైగా విమానాశ్రయంలోకి నిబంధనలకు విరుద్ధంగా చొరబడబటమే కాక గ్రహాంతర వాసలు ఉండే ప్రసిద్ధ ప్రాంతం అయిన ఏరియా 51కి వెళ్లేందుకు విమానాన్ని హైజాక్ చేస్తున్నాను అని అక్కడ ఉన్న పోలీసులతో చెబుతాడు. అంతేకాదు అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్న భద్రతా విభాగాన్ని నకిలీ బాంబుతో బెదిరిస్తాడు. ఈ మేరకు హాన్కాక్ కారుతో సహా ఎయిర్పోర్ట్లోని విమానాల పార్కింగ్ వద్దకు వచ్చేయడమే కాక తన కారులో షాట్గన్, గ్యాసోలిన్ వంటి ఆయుధాలు ఉన్నాయంటూ అక్కడ ఉన్నవారందర్నీ ఒక్కసారిగా భయబ్రాంతులకు గురిచేస్తాడు. దీంతో ఎయిర్పోర్ట్లో ఉన్న ఉద్యోగులంతా భయంతో పరుగులు పడుతుంటారు. అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. పైగా లాస్వేగస్లోని రద్దీ వీధుల్లో ఒక లగ్జరీ కారుని నిర్లక్ష్యంగా నడుపుత్నుట్లు టిక్టాక్లో వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తిని తానెనంటూ అక్కడ ఉన్న పోలీసులకు చెబుతాడు. అంతేకాదు తనను గ్రహాంతర వాసులు ఎంచుకున్న వ్యక్తిగా సంబోధించండి అంటూ పోలీసులకు విజ్ఞప్తి కూడా చేస్తాడు. దీంతో పోలీసులు హాన్కాక్ని అదుపులోకి తీసుకోవడమే కాక నకీలి బాంబుతో బెదిరింపులకు పాల్పడినందుకు ఉగ్రవాద చర్యగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. (చదవండి: ఒంటెల అందాల పోటీలు.. రూ. 500 కోట్ల ప్రైజ్మనీ!!) -
రైల్వే ట్రాక్పై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన డీజిల్ ఇంజన్
Bomb Blast On Rail Tracks: జార్ఖండ్లోని ధన్బాద్ డివిజన్లో శనివారం తెల్లవారుజామున బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఫలితంగా డీజిల్ ఇంజన్ పట్టాలు తప్పింది. పేలుడు వల్ల రైలు ట్రాక్లో కొంత భాగం దెబ్బతిన్నది. ధన్బాద్ డివిజన్లోని గర్వా రోడ్ , బర్కానా సెక్షన్ మధ్య ఈ "బాంబు పేలుడు" జరిగింది అని రైల్వే శాఖ తెలిపింది. (చదవండి: టాక్సీ డ్రైవర్ సాహసం.. సూసైడ్ బాంబర్ని కారులోనే బంధించి ) ‘‘ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా అసాధారణంగా ఉండటమే కాక దుండగులు కావాలనే రైలు పట్టాల మీద పేలుడుకు పాల్పడటంతో ధన్బాద్ డివిజన్లో డీజిల్ లోకో పట్టాలు తప్పింది" అని రైల్వేశాఖ తెలిపింది. ఈ సంఘటన వెనక నక్సల్స్ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడులో ఎవరు గాయపడలేదు.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. చదవండి: ప్రభుత్వం కూల్చేందుకు భారీ కుట్ర? జార్ఖండ్లో కలకలం -
టాక్సీ డ్రైవర్ సాహసం.. సూసైడ్ బాంబర్ని కారులోనే బంధించి
లండన్: రిమెంబరెన్స్ డే సర్వీస్ సందర్భంగా లివర్పూల్ నగరంలోని మెటర్నటీ ఆసుపత్రి వెలుపల జరిగిన కారు పేలుడులో ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ పేలుడు సంభవించడానికి ముందు ఓ టాక్సీ డ్రైవర్ చాకచక్యంగా వ్యహరించి.. ఉగ్రవాదిని అడ్డుకోవడంతో ఒక్కరు మాత్రమే మరణించారు. లేదంటే డజన్ల కొద్ది జనాల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ప్రస్తుతం సదరు టాక్సీ డ్రైవర్ని హీరోగా కొనియాడుతున్నారు లండన్ వాసులు. ఆ వివరాలు.. బాంబర్ లివర్పూల్లో రిమెంబరెన్స్ డే సర్వీస్ వద్దకు చేరుకుని.. తనను తాను పేల్చుకుని మారణహోమం సృష్టించాలని భావించాడు. ఈ క్రమంలో తన శరీరం మీద పేలుడు పదార్థాలను అమర్చుకుని లివర్పూల్కు వెల్లడానికి క్యాబ్ ఎక్కాడు. అయితే ట్రాఫిక్లో చిక్కుకోవడంతో.. క్యాబ్ను లివర్పూల్ మెటర్నటీ ఆస్పత్రి వద్దకు డైవర్ట్ చేశారు. (చదవండి: యూకే లివర్పూల్ నగంలో కారు బ్లాస్ట్...ఒకరు మృతి) ఆస్పత్రి వద్దకు వెళ్తుండగా.. తన కారులో కూర్చున్న వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో టాక్సీ డ్రైవర్ అతడిని ఓ కంట కనిపెడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆస్పత్రి వద్దకు వచ్చే లోపు తన కారులో ఉన్న వ్యక్తి సూసైడ్ బాంబర్ అని టాక్సీ డ్రైవర్కు అర్థం అయ్యింది. మెటర్నటీ ఆస్పత్రి వద్దకు చేరుకోగానే టాక్సీ డ్రైవర్ వెంటనే కిందకు దిగి బాంబర్ని క్యాబ్లో లాక్ చేశాడు. (చదవండి: కాబుల్ మరోసారి దద్దరిల్లింది.. రాకెట్ దాడిగా అనుమానం) అనంతరం బాంబర్ల కారులో ఉండే తనను తాను పేల్చుకున్నాడు. ఈ ప్రమాదంలో బాంబర్ మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తన సమయస్ఫూర్తి, సాహసంతో ఎందరో ప్రాణాలు కాపాడిన టాక్సీ డ్రైవర్కు చిన్న చిన్న గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. టాక్సీ డ్రైవర్ చూసిన సాహసం తెలుసుకున్న ప్రజలు అతడిని నిజమైన హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: భారీ పేలుడు.. రద్దీమార్కెట్ మొత్తం రక్తసిక్తం -
2013 పట్నా పేలుళ్ల కేసు..దోషులకు శిక్ష ఖరారు
-
ఆఫ్గానిస్తాన్ పేలుడు.. 47కు చేరిన మృతుల సంఖ్య
కాబూల్:ఆఫ్గానిస్తాన్లోని కాందహార్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 47కు చేరింది. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు చేస్తున్న షియాలే లక్ష్యంగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పేలుడు ఘటనపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ స్పందిస్తూ.. దాడికి తామే బాధ్యులమని పేర్కొంది. -
ఆఫ్ఘనిస్తాన్లో భారీ పేలుడు, 32 మంది మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో కాందహార్లోని షియా మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 32 మంది మరణించగా, 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షియాలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
మసీదులో మారణకాండ
కాబూల్: పశ్చిమ అఫ్గానిస్తాన్ కుందుజ్ ప్రావిన్సులోని గోజార్ ఇ సయీద్ అబాద్ మసీదులో శుక్రవారం సంభవించిన పేలుడులో 60మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు ప్రముఖ మీడియా సంస్థ అల్జజీరా వెల్లడించింది. అయితే కుందుజ్ ఆస్పత్రి అధికారి ఒకరు పేలుడులో 25మంది మరణించారని, 51మంది గాయపడ్డారని చెప్పారు. మరోవైపు అధికారిక బఖ్తార్ న్యూస్ ఏజెన్సీ ఈ పేలుళ్లలో 46మంది మరణించారని, 140మంది గాయపడ్డారని తెలిపింది. ఇవన్నీ ప్రాథమిక గణాంకాలేనని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. దేశ పాలనపగ్గాలు తాజాగా చేపట్టిన తాలిబన్లకు ఈ పేలుడు సవాలుగా మారింది. పేలుడులో మొత్తం 100 మంది మరణించడం లేదా గాయపడడం జరిగిందని కుందుజ్ ప్రావిన్స్ తాలిబన్ పోలీసు అధికారి ఒబైదా ప్రకటించారు. గాయపడినవారి కన్నా మరణించినవారే ఎక్కువగా ఉండొచ్చన్నారు. షియాల రక్షణకు తాలిబన్లు కట్టుబడిఉన్నారని భరోసా ఇచ్చారు. అఫ్గాన్ పగ్గాలు తాలిబన్ల చేతికి వచ్చాక జరిగిన పెద్దదాడిగా దీన్ని భావిస్తున్నారు. దాడిని షియాల మతపెద్ద అలిమి బల్ఖి ఖండించారు. తాలిబన్లు షియాలకు రక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రార్ధనాస్థలాల రక్షణకు ఉంచిన ఆయుధాలను తాలిబన్లు తీసుకుపోయినందున, వీటిని రక్షించాల్సిన బాధ్యత కూడా వాళ్లదేనన్నారు. ఐసిస్ హస్తం మసీదులో జరిగిన ఘోర పేలుడుకు కారకులెవరో తొలుత తెలియరాలేదు. అయితే పేలుడు జరిగింది షియా ముస్లింలకు చెందిన మసీదు కావడంతో ఐసిస్పైనే అందరికీ తొలుత అనుమానం వచ్చింది. ఇందుకు తగ్గట్లే తామే ఈ పేలుళ్లు జరిపామని ఐసిస్ అనుబంధ సంస్థ ఐసిస్– కే వారి మీడియా ఏజెన్సీ అమాక్ న్యూస్లో ప్రకటించింది. ఇదే అంశాన్ని ఎస్ఐటీఈ ఇంటిలిజెన్స్ గ్రూపు నిర్ధారించింది. షియా హజారాలను లక్ష్యంగా చేసుకొనే ఆత్మాహుతి దాడి చేసినట్లు ఐసిస్–కే టెలిగ్రామ్ ఛానెల్లో ప్రకటించుకుంది. గతంలో పలుమార్లు షియా మైనారీ్టలపై ఐసిస్ దాడులు చేసిన చరిత్ర ఉంది. అమెరికా సైన్యాలు వైదొలిగిన అనంతరం ఐసిస్ ఉగ్రవాదులు అఫ్గాన్లో దాడులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా షియాలపై ఐసిస్–కే యుద్ధాన్నే ప్రకటించింది. తాజాదాడులను ఐరాస ఖండించింది. పేలుడుపై తమ పత్య్రేక దళాలు దర్యాప్తు జరుపుతున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా చెప్పారు. ప్రస్తుతం పోలీసులు అక్కడ ఆధారాలను సేకరిస్తున్నారు. ఒకప్పుడు కొన్నిప్రాంతాలకే పరిమితమైన ఐసిస్ దాడులు ఇప్పుడు పలు చోట్ల జరగడం తాలిబన్లతో పాటు అఫ్గాన్ పొరుగుదేశాలను కూడా కలవరపరుస్తోంది. -
అఫ్గనిస్తాన్లో భారీ బాంబు పేలుడు.. 100 మందికి పైగా మృతి
కాబుల్: ఉత్తర అఫ్గనిస్తాన్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. కుందూస్ నగరంలోని షియా మసీదులో పేలుడు చోటుచేసుకుంది. ఈ బాంబు పేలుడులో 100 మందికి పైగా మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు.శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా పేలుడు సంభవించింది. దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్గా అనుమానం వ్యక్తమవుతోంది. కొద్దిరోజులుగా షియాలకు ఐసిస్ ఖొరాసాన్ హెచ్చరికలు చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఐసిస్ ఖొరాసాన్.. తాలిబన్ల నాయకుడి తలనరికిన విషయం తెలిసిందే. -
కాబూల్లో బాంబ్ పేలుడు.. 14 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో మరోసారి బాంబు పేలుడు చోటు చేసుకుంది. కాబూల్లోని ఈద్ గాహ్ మసీదు ప్రవేశద్వారం జరిగిన బాంబ్ పేలుడులో 14మంది మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనపై తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ స్పందిస్తూ.. మసీదు వెలుపల బాంబ్ పేలుడు జరిగినట్లు వెల్లడించారు. -
పాక్లో ఆత్మాహుతి దాడి.. ఐదుగురు జవాన్లు మృతి
క్వెట్టా: పాకిస్తాన్లో నైరుతి ప్రావిన్స్ బలూచిస్తాన్ లోని క్వెట్టా నగరంలో పారా మిలటరీ సైనికులపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో పాక్ జవాన్లు ఐదుగురు మరణించగా.. 20 మంది వరకూ గాయపడ్డారు. కాగా తెహ్రీకె తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. క్వెట్టా-మాస్తంగ్ రోడ్డులోని చెక్పాయింట్ దగ్గర ఈ దాడి జరిగింది. చెక్పోస్ట్ దగ్గర ఉన్న పోలీసులపైకి ఓ వ్యక్తి బైక్పై దూసుకొచ్చి తనను తాను పేల్చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ దాడిలో ముగ్గురు పారామిలిటరీ సిబ్బంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విటర్ ద్వారా ఈ ఘటనను ఖండించారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. బలూచిస్తాన్ హోంమంత్రి మీర్ జియావుల్లా కూడా ఈ దాడిని ఖండించారు. చదవండి: Panjshir: పంజ్షీర్ ప్రతిఘటన దళాల దెబ్బ?.. గందరగోళంగా అఫ్గన్ ఆధిపత్యపోరు -
కామారెడ్డి జిల్లాలో నాటు బాంబు పేలుడు కలకలం
-
కాబుల్ మరోసారి దద్దరిల్లింది.. రాకెట్ దాడిగా అనుమానం
-
కాబుల్ మరోసారి దద్దరిల్లింది.. రాకెట్ దాడిగా అనుమానం
Kabul Rocket Attack: అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్లో హమీద్ కార్జాయ్ విమానాశ్రయానికి అతి సమీపంలో గల జిల్లాలో మరోసారి పేలుడు సంభవించింది. కాబుల్ పరిసరాల్లో మరో ఉగ్రదాడి జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటన జారీ చేసిన గంటల వ్యవధిలోనే ఈ పేలుడు సంభవించడం కలకలం రేపుతోంది. కాబుల్ 11వ సెక్యూరిటీ జిల్లాలో జరిగిన ఈ పేలుడు రాకెట్ దాడిగా అనుమానిస్తున్నారు. Missile strike on a house near Kabul Airport, nature of the strike unclear pic.twitter.com/wFdhCkHSwn — ELINT News (@ELINTNews) August 29, 2021 అమెరికా సైనికులే లక్ష్యంగా ఈ పేలుడు జరిగివుండవచ్చని అంతర్జాతీయ మీడియా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనలో చిన్నారి సహా ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో ముగ్గురు గాయపడినట్లుగా సమాచారం. కాగా, కొద్ది రోజుల కిందట కాబుల్ ఎయిర్పోర్ట్కు అతి సమీపంలో ఐసిస్ ఖోరసాన్(కె) గ్రూపు మానవ బాంబు దాడులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో 100 మందికి పైగా చనిపోగా, మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. చదవండి: మహిళలపై తాలిబన్ల అరాచకం.. మరో హుకుం జారీ -
కాబూల్ రక్తసిక్తం:100 మందికి పైగా మృతి!
-
కాబుల్ పేలుళ్లకు తామే కారణమని ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్
-
మారణహోమం: పాక్లో ప్రతీకార దాడులు
పాకిస్థాన్లో చైనీయులపై ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ తీర నగరం గ్వాడర్లో భారీ ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృత్యువాత పడినట్లు, ముగ్గురు గాయపడినట్లు సమాచారం. ఈస్ట్ బే రోడ్డులో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో చైనీయులతో వెళ్తున్న ఓ కారుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆత్మాహుతి దాడిని పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది. ఘటన సమాచారం అందుకోగానే క్షతగాతత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు బెలూచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ది బెలూచిస్థాన్ పోస్ట్ మాత్రం మరోలా కథనం ప్రచురించింది. పేలుడులో తొమ్మిది మంది చైనా ప్రజలు మృత్యువాతపడ్డట్లు కథనం వెలువరించింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్(CPEC) రోడ్డు నిర్మాణ ప్రాంతం వద్ద వెళ్తున్న చైనా సైట్ ఇంజినీర్లపై దాడి జరిగిందని, తొమ్మిది మంది మృతి చెందారని కథనంలో పేర్కొంది. ఈ కథనంపై స్పష్టత రావాల్సి ఉంది. Strongly condemn suicide attack on Chinese nationals Vehicle in #Gwadar. 2 children died who were playing nearby & one Chinese sustained minor injuries. 3 persons injured including driver Police & CTD teams are on the crime scene. Investiga launched. Innocent Children,Afsos — Liaquat Shahwani (@LiaquatShahwani) August 20, 2021 బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణం పూర్తి కాకుండా అడ్డుకుంటామని ఎప్పటి నుంచో చెప్తోంది కూడా. చైనాలో మైనారిటీ వర్గం ఉయిగుర్ల ఉచకోత ఘటనలకు ప్రతీకారంగానే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నట్లు బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. పోయిన నెలలో ఖైబర్-ఫంక్తువా ప్రోవిన్స్ వద్ద చైనా వర్కర్లతో వెళ్తున్న ఓ బస్సుపై ఆత్మాహుతి దాడి జరగ్గా.. 9మంది చైనీయులు, మరో నలుగురు పాక్ పౌరులు మృత్యువాత పడ్డారు. అయితే బస్సు గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని పాక్ ప్రకటించగా.. చైనా మాత్రం అది ఆత్మాహుతి దాడేనని వాదించింది. ఈ తరుణంలో పాక్ ప్రభుత్వం ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది కూడా. చదవండి: ముగ్గురు పిల్లలు ముద్దు!!-చైనా -
దర్భంగా పేలుళ్ల విచారణ... కీలక అంశాలు వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: దర్భంగా పేలుడు ఘటనపై జరుగుతున్న విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. దర్భంగా పేలుడు సూత్రధారులకు హవాలా రూపంలో డబ్బులు అందినట్లు తెలిసింది. పేళుళ్లలో ప్రధాన సూత్రధారులైన మాలిక్ సోదరులకు హాజీ సలీం హవాలా రూపంలో డబ్బులు అందించినట్లు సమాచారం. పదేళ్ల క్రితం పాకిస్తాన్లో ఇక్బాల్ ఖానాని నాసిర్, మాలిక్ కలిశారు. ఆ సమయంలోనే నాసిర్, మాలిక్లు కెమికల్ బాంబుల తయారీ విధానాన్ని నేర్చుకున్నారు. ఆ తర్వాత సొంత జిల్లా కైరానాలో హాజీ సలీంతో కలిసి పేలుళ్లకు కుట్ర పన్నారు. దీని కోసమే నాసిర్, మాలిక్లకు హవాలా రూపంలో డబ్బులు సరఫరా జరిగింది. హాజీ పంపిన డబ్బులతోనే నాసిర్, మాలిక్లు కెమికల్ బ్లాస్ట్కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు లష్కరే తొయిబా ఉగ్రవాది ఇక్బాల్ పాక్లోనే ఉండి పెద్ద ఎత్తున్న బ్లాస్ట్లకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ బ్లాస్టింగ్స్ కోసం లష్కరే తొయిబా ఆర్థిక కష్టాల్లో ఉన్నవారిని ఎంపిక చేసింది. -
పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
సుకుమా (చత్తీస్గడ్): మావోయిస్టు కమాండర్ టైగర్ హుంగా సుక్మా పోలీసులకు చిక్కడు. చత్తీస్గడ్ కేంద్రంగా మావోయిస్టులు చేపట్టిన అనేక ఆపరేషన్లలో హుంగా కీలకంగా వ్యవహరించాడు. మావోయిస్టుల పార్టీలో హుంగాను టైగర్గా పిలుచుకుంటారు. అయితే టైగర్ హూంగాను అరెస్టు చేసినట్లు సుకుమా ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు. టైగర్ హుంగా దాడుల్లో దిట్ట చత్తీస్గడ్లోని సుకుమా జిల్లా కిస్టారం ప్రాంతంలో మావోయిస్టులు దాడికి సంబంధించి 17 ప్రధాన ఘటనల్లో టైగర్ హుంగా కీలక పాత్ర పోషించాడు. దీంతో పాటు పాలోది ప్రాంతంలో ల్యాండ్ మైన్ ప్రూఫ్ వాహన పేల్చివేతలో టైగర్ హూంగా ప్రధాన బాధ్యత తీసుకున్నాడు. ఈ పేలుడులో 9 మంది జవాన్లు చనిపోయారు. 2020లో టైగర్ హూంగా నేతృత్వంలో జరిగిన ఐఈడీ పేలుడు ఘటనలో సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ మరణించారు. ఇటీవల దండకారణ్యంలో జరిగిన పలు ప్రధాన ఘటనల్లో టైగర్ హుంగా కీలకపాత్ర పోషించినట్లు ఎస్పీ తెలిపారు. -
ఈద్ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి.. రద్దీతో భారీగా మృతులు
-
భారీ పేలుడు.. రద్దీమార్కెట్ మొత్తం రక్తసిక్తం
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో మరో మారణ హోమం చోటు చేసుకుంది. ఈద్ లక్క్ష్యంగా చేసుకుని భారీ కుట్రకు పాల్పడ్డారు మిలిటెంట్లు. బాగ్దాద్ శివారు నగరం సద్ర్లోని ఓ రద్దీ మార్కెట్లో భారీ బాంబు పేలుడుకు పాల్పడగా.. ఆ ప్రాంతం రక్తపు ముద్దలతో భీకరంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటిదాకా 35 మంది చనిపోగా, 60 మందికిపైగా గాయపడ్డారు. సద్ర్ సిటీ వహాయిలత్ మార్కెట్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బక్రీద్ కోసం మార్కెట్లకు క్యూ కట్టిన జనాలను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. రద్దీ మార్కెట్ కావడంతో ఎటు చూసినా తెగిపడిన అవయవాలు, రక్తపు ముద్దలే కనిపిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారు. గాయపడ్డ వాళ్లలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఘటనకు స్థానికంగా తయారుచేసిన పేలుడు పదార్థాన్నే ఉపయోగించినట్లు అధికారులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ఈ దాడి తమ పనేనని ఐఎస్ఐఎల్(ఐఎస్ఐఎస్) ప్రకటించుకుంది. ఇరాక్ అధ్యక్షుడు బర్హమ్ సాలి ఈ దాడిని ‘క్రూరమైన నేరం’గా అభివర్ణించాడు. కాగా, ఈ ఏడాదిలో ఈ తరహా దాడి ఇది మూడోది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. -
దర్భాంగా బ్లాస్ట్ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ
-
ఢిల్లీకి ‘దర్భంగ ఉగ్రవాదులు’
సాక్షి, హైదరాబాద్: బిహార్లోని దర్భంగ రైల్వే స్టేషన్లో జరిగిన విస్ఫోటనం కేసులో నిందితులుగా ఉన్న లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఢిల్లీకి తరలించారు. ఇద్దరినీ హైదరాబాద్లోని మల్లేపల్లి ప్రాంతంలో పట్టుకున్న విషయం తెలిసిందే. వీరి కస్టడీ గడువు పూర్తి కావడంతో శుక్రవారం బిహార్ రాజధాని పట్నాలో ఉన్న ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. వీరి నుంచి మరికొంత సమాచారం సేకరించాల్సి ఉందని, మరో పది రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం ఈ నెల 16 వరకు అనుమతించింది. దీంతో ఇద్దరినీ కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు సోమవారం బిహార్ నుంచి ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఈ ఉగ్రవాద కుట్రలో కీలకంగా వ్యవహరించిన ఉత్తరప్రదేశ్లోని ఖైరానా వాసి సలీంను సైతం కస్టడీలోకి తీసుకోవాలని ఎన్ఐఏ భావించింది. అనారోగ్య కారణాలతో అతగాడు పట్నా హాస్పిటల్లో చేరడంతో సాధ్యం కాలేదు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఓ ప్రత్యేక బృందం సిటీకి వచ్చే అవకాశం ఉంది. -
దర్భంగ కేసు’.. ఎవరీ ఇక్బాల్ ఖానా?
సాక్షి, హైదరాబాద్: దర్భంగ ఎక్స్ప్రెస్ దహ నానికి కుట్ర కేసుతో ఇక్బాల్ ఖానా పేరు దక్షిణాదిలో వెలుగులోకి వచ్చింది. ఉత్తరాది పోలీసులు, కేంద్ర నిఘా వర్గాలకు ‘సుపరిచితుడైన’ ఇతడే ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా(ఎల్ఈటీ) తరఫున పనిచేస్తూ మల్లేపల్లిలో నివసించిన అన్నదమ్ములు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్లతో పాటు ఉత్తరప్రదేశ్కు చెందిన హాజీ, ఖఫీల్ను ఉగ్రవాదులుగా మార్చాడు. వీరి ద్వారానే దర్భంగా ఎక్స్ప్రెస్లో భారీ అగ్ని ప్రమాదం సృష్టించడానికి కుట్రపన్నాడు. జాతీయ దర్యాప్తు సంస్థకు(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్గా మారిన ఇక్బాల్ ఖానా నేపథ్యమిది.. ►ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ సమీపంలో ఉన్న ఖైరానా ప్రాంతానికి చెందిన ఇతడి అసలు పేరు మహ్మద్ ఇక్బాల్ మాలిక్. పుట్టుకతోనే కుడి కంటిలో లోపం ఉండటంతో ఇక్బాల్ ఖానాగా మారాడు. ►ఖైరానా ప్రధాన రహదారిపై కూరగాయల దుకాణం నిర్వహించే ఇక్బాల్కు ఆది నుంచి ధనార్జనపై ఆశ ఎక్కువగా ఉండేది. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి తమ ప్రాంతానికే చెందిన గోల్డ్ స్మగ్లర్ హాజీ అనీస్ ముఠాలో చేరాడు. ►1980 నుంచి బంగారం స్మగ్లింగ్ చేసిన ఈ గ్యాంగ్ 1990లో ఇక్బాల్ చేరిన తర్వాత మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కూడా ప్రారంభించింది. దీంతో ఖైరానా ప్రాంతానికి చెందిన మిగిలిన ముఠాలతో వైరం ఏర్పడింది. ►ఇక్బాల్ 1992లో యూపీలోని సహరన్పూర్కు చెందిన ముస్తారీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. 1993–94లో రెండుసార్లు ప్రత్యర్థి వర్గాలు ఇక్బాల్పై దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నం చేశాయి. ►మరోపక్క పోలీసు నిఘా కూడా ముమ్మరం కావడంతో 1995 జూన్లో పాక్కు మకాం మార్చిన ఇక్బాల్ అక్కడి లాహోర్లో ఉన్న బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందాడు. కొన్నాళ్లకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెల్నీ అక్కడకు రప్పించుకున్నాడు. ►లాహోర్ చేరిన తొలినాళ్లలో ఇక్బాల్ ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడలేదు. అక్కడి యతీంఖానా ప్రాంతంలో నివసించే ఐఎస్ఐ ఏజెంట్ తారిఖ్తో పరిచయం ఏర్పడిన తర్వాత స్మగ్లర్గా మారాడు. ►ఇక్బాల్ నేరచరిత్ర, ఖైరానా ప్రాంతంలో అతడికి ఉన్న పరిచయాలు, భారత్లో ఉన్న నెట్వర్క్ తెలుసుకున్న తారిఖ్ అతడి ద్వారా ఆయుధాలను అక్రమ రవాణా చేయించాడు. వీటిని ఖైరానాలో ఉన్న ఇక్బాల్ గ్యాంగ్ ఉత్తరాదిలో విక్రయించేది. ►1996 నుంచి భారీస్థాయిలో ఆయుధాల సరఫరా స్మగ్లింగ్ చేయాలని తారిఖ్–ఇక్బాల్లు భావించారు. అందుకోసం అప్పట్లో పాకిస్థాన్లో నివసించిన స్విస్ జాతీయుడు క్రిస్టోఫర్ను వాడుకున్నాడు. ►అతడి కార్వ్యాన్లో రహస్య అరలు ఏర్పాటు చేసి వాటిలో ఆయుధాలు మందుగుండు సామాగ్రి నింపారు. ఖర్చుల కోసం రూ.లక్ష ఇచ్చి భారత్కు పంపారు. ఆయుధాల డెలివరీ పూర్తయిన తర్వాత మరో రూ.35 వేల డాలర్లు ఇస్తామన్నారు. ►ఇతగాడిని ఢిల్లీ పోలీసులు 1996 ఫిబ్రవరి 17న అరెస్టు చేసి భారీస్థాయిలో ఆయుధాలు స్వాదీనం చేసుకున్నారు. క్రిస్టోఫర్కు సహకరిస్తున్న హసన్ పోద్దార్ను పట్టుకున్నారు. ►వీరి విచారణలోనే ఇక్బాల్ లాహోర్ కేంద్రంగా చేస్తున్న కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇతగాడు భారత ఏజెన్సీలకు మోస్ట్ వాంటెడ్గా మారాడు. 1999 తర్వాత ఐఎస్ఐకి మరింత సన్నిహితంగా మారాడు. ►భారత సైనిక రహస్యాలను అందించడానికి అవసరమైన ఏజెంట్లను రిక్రూట్ చేసుకోవడం ప్రారంభించాడు. ఇలా ఇతడి కోసం పనిచేస్తున్న ఖైరానావాసి సమయుద్దీన్ 2001 డిసెంబర్లో పట్టుబడ్డాడు. ►ఆ తర్వాత నుంచి భారత్కు నకిలీ కరెన్సీ సరఫరా, చెలామణి కోసం ఐఎస్ఐ ఇక్బాల్ను వాడుకుంది. ఏటా వందల కోట్ల నకిలీ కరెన్సీని తన అనుచరుల ద్వారా చెలామణి చేయించాడు. ► పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐఎస్ఐ ఆదేశాల మేరకు ఇక్బాల్ మాలిక్ నకిలీ కరెన్సీ చెలామణి నుంచి ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ వైపు మారాడు. తాజాగా లష్కరే తొయిబా కోసం కొందరిని రిక్రూట్ చేసి దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు ప్లాన్ చేశాడు. -
హైదరాబాద్ కు దర్భాంగా పేలుడు కేసు నిందితులు
-
అందుకే ‘దర్భంగ బాంబు’ విస్ఫోటనం ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: లాహోర్లోని ఇక్బాల్ ఖానా న్యూస్ పేపర్ వాడమంటే.. నగరంలో నివసిస్తున్న లష్కరేతొయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు అట్టముక్క వినియోగించారు. ఇదే దర్భంగా ఎక్స్ప్రెస్ అగ్నికి ఆహుతి కాకుండా కాపాడింది. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో ఉన్న ఉగ్రవాదులు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ అధికారుల విచారణలో ఈ విషయం బయటపెట్టారు. మరోపక్క కేసు దర్యాప్తులో భాగంగా క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం ఇద్దరు ఉగ్రవాదుల్నీ అధికారులు సోమవారం నగరానికి తీసుకువచ్చారు. ఉగ్రవాద సంస్థ ఎల్ఈటీ తరఫున పని చేస్తున్న ఇక్బాల్ ఖానా ఉత్తరప్రదేశ్కు చెందిన తండ్రీకొడుకులు హాజీ, ఖఫీల్ ద్వారా నగరంలోని మల్లేపల్లిలో నివసిస్తున్న యూపీ వాసులైన అన్నదమ్ములు ఇమ్రాన్, నాసిర్లను రంగంలోకి దింపారు. దర్భంగ ఎక్స్ప్రెస్లో రసాయనాల బాటిల్ ద్వారా విస్ఫోటనం కలిగించి భారీ అగ్ని ప్రమాదం సృష్టించడమే వీరి కుట్ర. దీనికోసం స్థానికంగా లభించే రసాయనాలతోనే బాంబు మాదిరి తయారు చేయాలని అన్నదమ్ములకు ఆదేశాలు జారీ చేశారు. వీరిద్దరు హబీబ్నగర్, చిక్కడపల్లిలోని దుకాణాల నుంచి సల్ఫ్యూరిక్, నైట్రిక్ యాసిడ్స్, పంచదార తదితరాలు ఖరీదు చేశారు. ఈ రసాయనాలతో విస్ఫోటనం ఎలా సృష్టించాలో వివరించే యూ ట్యూబ్ లింకుల్ని షేర్ చేశారు. దర్భంగ ఎక్స్ప్రెస్లో పంపాల్సిన పార్శిల్ ఉంచాల్సిన ‘బాటిల్ బాంబు’ తయారీపై ఇక్బాల్ ఈ అన్నదమ్ములకు సూచనలు చేస్తూనే ఉన్నాడు. ఓ టానిక్ సీసాలో ఈ మూడింటినీ నేర్పుగా, వేర్వేరుగా ఏర్పాటు చేయించాడు. సిడ్స్ను వేరు చేయడానికి మందంగా మడతపెట్టిన న్యూస్ పేపర్ వాడాలంటూ ఇక్బాల్ స్పష్టం చేశాడు. పంచదార కరిగి రసాయనాల్లో కలవడానికి చిన్న సిరంజీతో నీళ్లు ఉంచి చుక్కలు పడేలా ఏర్పాటు చేయాలని సూచించాడు. ‘బాటిల్’ను సిద్ధం చేస్తున్న ఇమ్రాన్, నాసిర్లు ఎన్నిసార్లు ప్రయత్నించినా న్యూస్ పేపర్ ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదు. దీంతో మందమైన అట్ట ముక్కను వినియోగించి యాసిడ్స్ను వేరు చేశారు. దీన్ని వ్రస్తాల పార్శిల్ మధ్యలో పెట్టారు. దీంతో ఆ అట్టముక్క పూర్తిగా కరిగి రెండు యాసిడ్స్ కలవడానికి ఎక్కువ సమయం పట్టింది. ఫలితంగా రైలు నడుస్తుండగా కాజీపేట– రామగుండం స్టేషన్ల మధ్య జరగాల్సిన విస్ఫోటనం దర్భంగ స్టేషన్లో పార్శిల్ దింపిన తర్వాత చోటు చేసుకుంది. క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం ఎన్ఐఏ అధికారులు నగరంలో అరెస్టు చేసిన ఇద్దరు ఉగ్రవాదులను సోమవారం ఇక్కడకు తీసుకువచ్చారు. -
దర్భంగా కేసు : హైదరాబాద్ కేంద్రంగా ఎన్ఐఏ విచారణ
సాక్షి, హైదరాబాద్: దర్భంగ రైల్వే స్టేషన్లో జరిగిన విస్ఫోటం కేసులో హైదరాబాద్ కేంద్రంగా విచారణ కొనసాగనుంది. నలుగురు ఉగ్రవాదులు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్, హాజీ సలీం, ఖాఫిల్ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కస్టడీలోకి తీసుకున్నారు. ఈనెల 9 వరకు ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్ఐఏ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా బాంబు తయారుచేసిన నేపథ్యంలో.. హైదరాబాద్ నుంచే ఎన్ఐఏ విచారణ చేపట్టనుంది. బాంబు తయారీ, అమర్చిన తీరుపై ఎన్ఐఏ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ రెండ్రోజుల్లో నిందితులను హైదరాబాద్కు తీసుకురానుంది. ఇప్పటికే ఢిల్లీ ఎన్ఐఏ బృందం హైదరాబాద్కు చేరుకుంది. -
దర్భంగా కేసు: "రా" ఏజెంట్ను అంటూ..
సాక్షి, హైదరాబాద్ : దర్భంగా బ్లాస్ట్కు సంబంధించి మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాలిక్ తరచూ ఫోన్లో మాట్లాడుతుండటంపై కుటుంబ సభ్యుల ఆరా తీయగా.. తాను ఇండియన్ ‘‘రా’’ ఏజెంట్ను అంటూ కుటుంబ సభ్యులను నమ్మించాడు. నాసిర్ మాలిక్, ఇమ్రాన్ ఖాన్లు కుటుంబాన్ని మోసం చేసి ఉగ్ర కార్యాచరణ చేపట్టారు. తాను "రా" పనిపై పాక్ వెళ్తున్నట్లు చెప్పి.. పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు. 2012లో 4 నెలలపాటు పాకిస్తాన్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఐఈడీ అమర్చడంలో నాసిర్ మాలిక్ మాస్టర్ మైండ్. సోదరులిద్దరూ 2016లో దుబాయ్ వెళ్లారు. కాగా, ఢిల్లీ ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఈ కేసును దర్యాప్తు చేయనున్నారు. దర్భంగా బ్లాస్ట్ వెనుక భారీ కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్లాస్ట్కు ముందు మాలిక్ సోదరుల కదలికలపై ఎన్ఐఏ విచారణ చేస్తోంది. -
దర్భంగ పేలుడు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే ‘పార్సిల్’
సాక్షి, సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ‘పార్సిల్ వ్యవస్థ’ అస్తవ్యస్థంగా మారిందని, ఎలాంటి భద్రతా చర్యలు ఇక్కడ తీసుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 17న బిహార్లోని దర్భంగ రైల్వే స్టేషన్లో పేలిన బాంబు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని పార్సిల్ సర్వీస్ కేంద్రం నుంచే వెళ్లినట్లు తేలడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. బుక్ చేసిన పార్సిల్స్ను స్కానర్ యంత్రం ద్వారా తనిఖీ చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే ఇష్టారాజ్యంగా పార్సిల్స్ను డిస్పాచ్ చేస్తున్నారు. ఈ విషయంలో రైల్వే అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆదాయంపైనే దృష్టి... అటు లీజు హోల్డర్లు, ఇటు నగర ప్రజల నుంచి వచ్చిన పార్సిళ్లను ఎడాపెడా స్వీకరించి ఆదాయం రాబట్టుకుంటున్న రైల్వే అధికారులు అందులో ఏముందనే విషయంలో మాత్రం దృష్టి సారించడం లేదు. దర్భంగ రైల్వేస్టేషన్లో పేలిన బాంబు సికింద్రాబాద్ పార్సిల్ సర్వీసు నుంచి వెళ్లిందేనని తేలాక అనుమానాస్పద వ్యక్తుల సంచారం పట్ల రైల్వే రక్షక దళం పోలీసులు గస్తీ పెంచారే తప్ప రవాణా చేయాల్సిన పార్సిళ్లను తనిఖీ చేసే విషయంలో మాత్రం ఎటువంటి చర్యలు లేవు. ఒక్క సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం సుమారుగా 130 వరకు ఎక్స్ప్రెస్ రైళ్లు బయలుదేరుతున్నాయి. ఒక్కో రైలులో రెండు బోగీలను పార్శిల్ సర్వీసు సేవలకు వినియోగిస్తున్నారు. ఈ బోగీల్లో సరుకులు రవాణా చేసేందుకు 29 మంది లీజుదారులు ఉన్నారు. వారు చేస్తున్న బుకింగ్ల ఆధారంగానే సరుకులు వెళ్తుంటాయి. స్కానర్లు లేని కారణంగానే.. ఒక లీజుదారు బుక్ చేసుకున్న పార్సిల్లోనే బాంబు ఉంచారు. రాత్రి 10.40 గంటలకు బయలుదేరాల్సిన దర్భంగా రైలులో పార్సిల్ పంపించాలని ఒక వ్యక్తి లీజుదారుడిని రాత్రి 8.30 గంటలకు సంప్రదించడంతో హడావుడిగా బుక్ చేసుకుని రైల్లో పంపించగా..ఆ పార్శిల్లోని బాంబే దర్భంగ స్టేషన్లో పేలింది. ప్యాసింజర్ రైళ్లలో పార్సిళ్లను పంపించడానికి కాంట్రాక్టు దక్కించుకున్న 29 మంది లీజుదారుల్లో ఏ ఒక్కరి వద్ద పార్సిళ్లు తనిఖీ చేసేందుకు స్కానర్లు లేవు. టెండరు సొమ్ము, లాభాన్ని రాబట్టుకోవడం కోసం స్కానింగ్ తదితర భద్రతా చర్యలు చేపట్టకుండానే బుకింగ్లు చేసుకుంటున్నారు. బుకింగ్దారుల వద్దకు ప్రైవేటు వాహనాలు, వ్యక్తులు పంపిస్తున్న లీజుదారులు దుస్తులు, వస్తువులతో కూడిన పార్సిళ్లను నేరుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పార్సిల్ కార్యాలయానికి చేరవేస్తున్నారు. అన్ని స్టేషన్లలోనూ అదే పరిస్థితి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తోపాటు నగరంలో పార్సిల్ సేవలు అందిస్తున్న అన్ని రైల్వేస్టేషన్లలో ఎక్కడా స్కానింగ్ మెషిన్లు లేవు. అటు లీజుదారుల నుంచి, ఇటు నగర ప్రజల నుంచి వస్తున్న అన్ని రకాల వస్తువులతో కూడిన పార్సిళ్లను స్వీకరిస్తున్న పార్సిల్ కార్యాలయ సిబ్బంది నేరుగా రైళ్లకు ఎక్కించేస్తున్నారు. రైల్వేస్టేషన్లలో స్వీకరించిన బాక్సులు, లగేజీలకు తూకం వేయడం, బిల్లులు రాయడం మినహా వేరే ఎటువంటి భద్రతా చర్యలు ఇక్కడ తీసుకోవడం లేదు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పార్శిల్ సేవలను వినియోగించుకునేందుకు వందల సంఖ్యలో వ్యక్తులు బారులు తీరుతున్నారు. బుకింగ్ కోసం వచ్చే వ్యక్తుల నివాస ధృవీకరణలు, ఫోన్ నెంబర్లు స్వీకరించడం మినహా వారు వెంట తెచ్చిన పార్శిల్లో ఏముందన్న విషయాన్ని పట్టించుకునేవారు లేరు. గస్తీ పెంచాం..లేఖలు రాశాం దర్భంగ ఘటన నేపథ్యంలో పార్సిల్ కేంద్రాల వద్ద గస్తీ ముమ్మరం చేశాం. పార్సిల్ సర్వీసు లీజుదారులకు అవగాహన సదస్సులు నిర్వహించాం. పార్సిల్ సేవలను వినియోగించుకునేందుకు వచ్చే వ్యక్తుల వివరాలు పూర్తిగా తీసుకోవాలని సూచించాం. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు పోలీసులకు అందించాలని తెలియజెప్పాం. పార్సిల్ కార్యాలయాల వద్ద స్కానర్ల ఏర్పాటు కోసం రైల్వే అధికారులకు లేఖలు రాశాం. – కె.బెన్నయ్య, ఇన్స్పెక్టర్ రైల్వే రక్షణ దళం చదవండి: దర్భంగ పేలుడు: తండ్రికి తగని కుమారులు! -
దర్భంగ పేలుడు: తండ్రికి తగని కుమారులు!
సాక్షి, సిటీబ్యూరో: దర్భంగ రైల్వే స్టేషన్లో జరిగిన విస్ఫోటం కేసులో అరెస్టు అయిన లష్కరేతొయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్లు తండ్రికి తగని కుమారులని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. వీరి తండ్రి మూసా ఖాన్ ఆర్మీలో పనిచేసి చైనాపై పోరాడగా.. ఈ ద్వయం హైదరాబాద్లో ఉండి పాకిస్థాన్ కోసం పని చేశారని వివరిస్తున్నారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శుక్రవారం పట్నాలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో పట్నా సెంట్రల్ జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. 1962 యుద్థంలో పాల్గొన్న మూసా... ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లా ఖైరానానగర్లో ఉన్న మొహల్లా ఖయాస్తవాడ ప్రాంతానికి చెందిన మూసా ఖాన్ది వ్యవసాయ కుటుంబం. చిన్న వయస్సులోనే ఆర్మీలో సైనికుడిగా చేరిన మూసా 1962లో జరిగిన ఇండో–చైనా యుద్ధంలో పాల్గొన్నాడు. భారత సైనికుల తరఫున కీలకపాత్ర పోషించిన ఈయన ఆ యుద్ధం తర్వాత పదవీ విరమణ పొందారు. ఆపై ఖైరానానగర్లోనే వంట సామాగ్రి విక్రయించే దుకాణం ఏర్పాటు చేసుకున్నారు. తన కుమారులను లష్కరేతొయిబా ఉగ్రవాదులుగా ఆరోపిస్తూ ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారనే విషయం మీడియా వచ్చిన బుధవారం నుంచి ఇల్లు, దుకాణానికి తాళం వేసిన మూసా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. ఉగ్రవాదులు, సికింద్రాబాద్ స్టేషన్ వద్ద కారు నుంచి పార్శిల్ దింపుతున్న సీసీ టీవీ ఫుటేజ్ అటు ఉగ్రవాదులు..ఇటు మాఫియా... రెండు నెలల క్రితం వరకు ఇమ్రాన్ ఖాన్ తండ్రి దుకాణంలోనే ఉంటూ ఆ వ్యాపారంలోనే ఉంటూ సహకరించాడు. కొన్నాళ్ల క్రితం ఇతడికి పాకిస్థాన్లో ఉంటున్న ఇక్బాల్ ఖానాతో పరిచయమైంది. కొన్నేళ్లుగా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం పని చేస్తున్న ఇతగాడు భారత్ ఏజెన్సీలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన ఇక్బాల్పై నకిలీ నోట్ల సరఫరా, ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించడం వంటి అనేక కేసు లు నమోదై ఉన్నాయి. ఇతడి ఆదేశాలతో 2012లో తన బంధువుల వద్దకు వెళ్తున్నట్లు వీసా తీసుకున్న ఇమ్రాన్ పాకిస్థాన్కు వెళ్లాడు. అక్కడి ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఎల్ఈటీ ట్రైనింగ్ క్యాంప్లో నాలుగు నెలల పాటు ఉగ్రవాద శిక్షణ పొందాడు. ఖైరానాలో జరిగిన కుట్ర... దర్భంగ విస్ఫోటనానికి సంబంధించిన కుట్ర ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్ధారించింది. ఉత్తరప్రదేశ్లోని ఖైరానాలో ఉన్న లష్కరేతొయిబా ఉగ్రవాది మహ్మద్ సలీం అహ్మద్ అలియాస్ హాజీ సలీం ఇంట్లో సమావేశమైన ఉగ్రవాదులు ఈ మేరకు కుట్ర చేశారు. ఈ మీటింగ్లో హాజీతో పాటు అతడి కుమారుడు ఖఫీల్, నగరం నుంచి వెళ్లిన ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ పాల్గొన్నారు. కదిలే రైలుకు మంటలు అంటుకునేలా చేస్తే అది ఆగేలోపే భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలు ఉంటాయని ఇలా చేశారని ఎన్ఐఏ పేర్కొంది. పాకిస్థాన్లో ఉండి కథ నడుపుతున్న ఇక్బాల్ ఖానాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న హాజీనే ‘దర్భంగ కుట్ర’కు సూత్రధారని స్పష్టమైంది. ఇక్బాల్ నుంచి హాజీకి రూ.1.6 లక్షలు కోల్తాలోని హవాలా వ్యాపారి ద్వారా అందినట్లు దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. దాదాపు వారం రోజులుగా బీహార్ ఏటీఎస్ కస్టడీలో ఉన్న హాజీ, ఖఫీల్లను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. చదవండి: ఫ్యాషన్ డిజైనింగ్ ముసుగులో వ్యభిచారం.. బిల్ కలెక్టర్ బాగోతం -
దర్భంగా పేలుడు కేసులో సంచలన విషయాలు
-
దర్బంగా పేలుడు కేసు నిందితుల అరెస్ట్
-
దర్బంగా పేలుడు కేసు మరో ఉగ్రవాదిని గుర్తించిన NIA
-
దర్బాంగా ఎక్స్ప్రెస్ పేలుడు కేసులో ఉగ్రకుట్ర
-
దర్భంగా పేలుడు కేసులో ఉగ్ర కుట్ర..!
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్భంగా పేలుడు కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఈనెల 17న బీహార్లోని దర్భంగా రైల్వేస్టేషన్లో పార్సిల్ పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనక ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇప్పటికే హైదరాబాద్లో ఉంటున్న ఇద్దరిని అరెస్ట్ చేసింది. నిందితులైన అన్నదమ్ములు ఇమ్రాన్, నాసిర్ బిహార్ నుంచి కొన్నాళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పెద్దమొత్తంలో పేలుడు పదార్ధాలు తరలించారు. ఈ క్రమంలో అధికారులు సికింద్రబాద్ స్టేషన్లో అన్నదమ్ముల సీసీఫుటేజ్ని సేకరించారు. వీరు ఈ నెల 15న సోఫియాన్ పేరు మీద పార్శిల్ బుక్ చేశారు. ఇక నిందితులు దర్భంగా రైలును పేల్చేయాలని కుట్ర పన్నారని.. తద్వారా భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం కలిగించాలని భావించినట్లు అధికారులు తెలిపారు. అర్షద్ కోసం ఎన్ఐఏ అధికారులు గాలింపు చర్యలు ప్రారంభిచారు. అతడు దర్భంగా రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 17న బిహార్లోని దర్భంగా రైల్వే స్టేషన్లో పార్సిళ్లు దింపుతుండగా పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. దుస్తుల మధ్యలో ఉంచిన చిన్న సీసా నుంచి తొలుత పొగలు వచ్చి తర్వాత పేలుడు జరిగింది. దర్యాప్తులో ఈ దుస్తుల పార్సిల్ సికింద్రాబాద్లో బుక్ చేసినట్లు గుర్తించి ఇక్కడి నుంచీ దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో ఉగ్రకుట్ర ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఢిల్లీ ఎన్ఐఏకు కేసు బదిలీ చేశారు. తెలంగాణ పోలీసులు, బిహార్, యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) సిబ్బంది వీరికి సహకరిస్తున్నారు. ఈ కేసులో రెండు రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు శామిలీ జిల్లాలోని ఖైరానా అనే ఊర్లో మహ్మద్ హజీ సలీమ్ ఖాసీం, మహ్మద్ కాఫిల్ అనే తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం హైదరాబాద్ ఆసిఫ్నగర్లో ఇమ్రాన్, నాసిర్ అనే ఇద్దరు అన్నదమ్ముల్ని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు విచారణ కోసం ఢిల్లీ తీసుకెళ్లారు. వీరిద్దరూ ఉత్తరప్రదేశ్కు చెందిన వారేనని, చాలాకాలంగా హైదరాబాద్లోని ఆసిఫ్నగర్లో అద్దెకు ఉంటూ రెడీమేడ్ దుస్తులు విక్రయిస్తున్నారని తేలింది. చదవండి: ముంబై నుంచి తీసుకెళ్తేనే.. స్టేట్మెంట్ ఇస్తా -
జమ్ము విమానాశ్రయం లో జంట పేలుళ్లు
-
ఇజ్రాయెల్ ఎంబసీ పేలుడు; ఎన్ఐఏ అదుపులో నలుగురు
ఢిల్లీ: ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద చోటుచేసుకున్న పేలుడు కేసులో నలుగురు యువకులను ఎన్ఐఏ గురువారం అదుపులోకి తీసుకుంది. కాగా జనవరి 29న ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. హై సెక్యూరిటీ జోన్లోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో సంభవించిన ఈ ఘటనలో అప్పట్లో ఎవరు గాయపడలేదు. కాగా ఆరోజు సాయంత్రం 5 గంటల సమయంలో దౌత్య కార్యాలయం సమీపంలోని ఓ పూలకుండీలో ఉంచిన ఐఈడీ పేలింది. దాని తీవ్రతకు దగ్గర్లో పార్కు చేసిన మూడు కార్ల అద్దాలు మాత్రం పగిలిపోయాయి. -
హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో పేలుడు, ఇద్దరు మృతి
కరాచీ: ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ నివాసానికి సమీపంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్లోని జోహర్ టౌన్లో మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. హఫీజ్ సయీద్ను లక్ష్యంగా చేసుకొని పేలుడు జరిగినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడిగా ఉన్న హఫీజ్ సయీద్.. ప్రస్తుతం జమాత్ ఉద్ దువాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇండియన్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్న హఫీజ్ సయీద్పై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. 2008 ముంబై దాడుల వెనుక ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ అమెరికా 10 లక్షల డాలర్లు వెల కట్టింది. కాగా కశ్మీర్ అంశంపై కేంద్రం రేపు శాంతియుతంగా చర్చలు జరపనున్న నేపథ్యంలో బాంబు దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. చదవండి: విషాదం: ప్రపంచ రికార్డ్ కోసం ఫీట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు -
బస్సులో బాంబు పేలుడు.. 11 మంది మృతి
కాబూల్: అమెరికా దళాలు వెనుదిరుగుతున్న వేళ ఆఫ్ఘనిస్థాన్లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని జరిపిన బాంబు దాడిలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 11 మంది మృతి చెందారు. బాంబు పేలిన వెంటనే బస్సు పక్కనే ఉన్న లోయలో పడిపోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని స్థానిక అధికారి ప్రకటించారు. ఆఫ్ఘనిస్థాన్లోని పశ్చిమ ప్రావిన్స్ అయిన బాద్ఘిస్ నగరంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఘటనకు ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదు. కాగా, ఇది తాలిబన్ల పనేనని బాద్ఘిస్ గవర్నర్ హెసాముద్దీన్ షామ్స్ ఆరోపించారు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్థాన్లో బస్సుపై బాంబు దాడి జరగడం ఈ వారంలో ఇది రెండోసారి. చదవండి: India: ఆకలి రాజ్యం -
ఆఫ్ఘనిస్తాన్లో వరుస బాంబు దాడులు..
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ వరుసగా రెండోరోజు బాంబుల మోతతో దద్దరిల్లింది. తాజాగా బుధవారం జలాలాబాద్ నగరంలో కారు బాంబు దాడి జరిగింది. మిలిటరీ కాన్వేను లక్ష్యంగా చేసుకొని జరిపిన ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందగా.. పది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. కాగా ఇదే విషయమై అఫ్ఘన్ ప్రతినిధి అతాహుల్లా కోగియాని స్పందించారు. కారు బాంబు దాడి ఉదయం 10. 10 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సాధారణంగానే బిజీగా ఉండే రోడ్డుపై ఆ సమయంలో మిలిటరీ కాన్వేకు చెందిన వాహనం వెళ్లింది. దీనిని లక్ష్యంగా చేసుకొని దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందనేది త్వరలోనే తేలుస్తాం. అని పేర్కొన్నారు. కాగా గాయపడిన వారిని జలాలాబాద్లోని రీజినల్ ఆసుపత్రికి తరలించారు. కాగా మంగళవారం రాత్రి ఇదే తరహాలో ప్రజలు ప్రయాణించే బస్సుల్లో బాంబులు పెట్టిన దుండగులు 8 మంది చావుకు కారణం కాగా.. ప్రమాదంలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా
గాజా సిటీ: ఇజ్రాయిల్– పాలస్తీనాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. జెరూసలేంలో కొద్దివారాలుగా నెలకొన్న ఉద్రిక్తతలు పెరిగి... యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. సోమవారం సూర్యాస్తమయం నుంచి గాజాలోని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పైకి వందలకొద్ది రాకెట్ బాంబులను ప్రయోగించారు. ఈ దాడుల్లో ఇద్దరు ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. దీంతో ఇజ్రాయిల్ వైమానిక దాడులకు దిగింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రోజంతా ఎడతెగకుండా గాజాపై బాంబుల వర్షం కురిపించింది. ఉగ్రవాదులు లక్ష్యంగా సాగిన ఈ దాడుల్లో 28 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 16 మందిని ఉగ్రవాదులేనని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. హమాస్ దాడులపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఊహించని స్థాయిలో హమాస్పై దాడులుంటాయని హెచ్చరించారు. 5000 మంది రిజర్వ్ సైనికులను గాజా సరిహద్దుకు తరలించాల్సిందిగా రక్షణ మంత్రి ఆదేశాలిచ్చారు. జెరూసలేంలోని అల్ అక్సా మసీదు వద్ద సోమవారం ఇజ్రాయిల్ సైనికుల, పాలస్తీనియన్లకు మధ్య జరిగిన గొడవలు చెలరేగిన విషయం తెలిసిందే. ఇవి కాస్తా ముదిరి పరస్పర దాడులకు దారితీశాయి. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను ముస్లిం దేశాలు మంగళవారం తీవ్రంగా ఖండించాయి. ఇజ్రాయెల్ చర్యను పాశవికమని పేర్కొన్నాయి. చదవండి: కరోనా ఫండ్తో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా చదవండి: తుపాకీకి భయపడి బిల్డింగ్ పైనుంచి దూకిన చిన్నారులు -
హైదరాబాద్లో పేలుడు.. అదుపులో అనుమానితుడు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పేట్ బషీర్బాద్ పీఎస్ పరిధిలోని జయరాం నగర్ చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి పేలుడు చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చేతిలో ఉన్న బ్యాగులో ఒక్కసారిగా పేలుడు జరిగింది. కాగా పేలుడు శబ్ధంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని బ్యాగ్తో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకి గల కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు ప్రాణనష్టం లేకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా పేలుడుకు బ్యాగులో ఉన్న కెమికల్ డబ్బానే కారణం అని పోలీసులు భావిస్తున్నారు. -
అఫ్గాన్లో స్కూల్ వద్ద భారీ పేలుడు, 55 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్లోని కాబూల్ పశ్చిమ ప్రాంతంలో శనివారం తీవ్ర బాంబు పేలుడు సంభవించింది. అఫ్గాన్లో మైనారిటీలైన షియాలు అధికంగా నివసించే ప్రాంతంలోని ఓ బాలికల స్కూల్ వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. కడపటి వార్తలు అందేసరికి ఈ ఘటనలో 53 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరో 150మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది 11-15 ఏళ్ల మధ్య విద్యార్థినులే అని అధికారులు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది తాము కాదం టూ తాలిబాన్ ప్రకటించింది. మరే ఇతర ఉగ్రసంస్థ ఈ పేలుడుకు ఇంకా బాధ్యత వహించుకోలేదు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించగా, వారికి రక్తదానం చేసేందుకు భారీ స్థాయిలో ప్రజలు ఆస్పత్రుల వద్దకు చేరారు. మరణించిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అఫ్గాన్లో మైనారిటీ షియాలపై ఉగ్రసంస్థ ఐసిస్ విరుచుకుపడుతోంది. ఇటీవలే ఓ బాంబు పేలుడు జరిపి పలువురు ప్రాణాలను బలిగొంది. ఈ నేపథ్యంలో తాలిబాన్ స్పందిస్తూ, ఇలాంటి హీనమైన పేలుళ్లకు పాల్పడేది ఐసిస్ మాత్రమే అని పేర్కొంది. అఫ్గాన్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ సైతం ఐసిస్కు సాయపడుతోందని ఆరోపించింది. (చదవండి: అమెరికా సంచలన ప్రకటన: అఫ్గాన్ నుంచి బలగాలు వెనక్కి) -
ముగ్గురాయి గనుల్లో పేలుడు: 5 మంది మృతి
-
ముగ్గురాయి గనుల్లో పేలుడు, సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కలసపాడు మండలం మామిళ్ల పల్లె శివారులో భారీ పేలుడు సంభవించింది. ముగ్గురాయి గనుల్లో జిలెటిన్స్టిక్స్ పేలి తొమ్మిది మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురాయి గనుల్లో బ్లాస్టింగ్ కోసం వాహనంలో జిలెటిన్స్టిక్స్ తరలించారు. అన్లోన్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. పేలుడు ధాటికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిని ఎస్పీ అన్బురాజన్, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పరిశీలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. క్వారీలో పేలుడు ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి క్వారీలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన కారణాలను సీఎం.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది.. పేలుడు ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలను కలెక్టర్, ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సురేష్ హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ జిల్లాలో పేలుడు ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ దిగ్భ్రాంతి పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ మద్యం మత్తులో దారుణం.. -
పాక్లో బాంబు పేలుడు: నలుగురు మృతి
పాకిస్థాన్: నైరుతి పాకిస్తాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో బాంబు పేలుడు సంభవించింది. బలూచిస్థాన్లోని క్వెట్టా నగరంలో ఉన్న ఓ హోటల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. హోటల్ కారు పార్కింగ్ స్థలంలో బాంబు పేలింది. ఈ ఘటనపై స్పందించిన పాక్ హోంశాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్, నలుగురు మరణించినట్లు తెలిపారు. ఈ హోటల్లో చైనా రాయబారులకు ఆతిథ్యమిచ్చినట్లు తెలిపారు. ఈ బాంబు పేలుడు ఘటనను ఉగ్రవాద చర్యగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఎవరు ముందుకు రాకపోవడం గమనార్హం. చదవండి: ఉన్నట్టుండి పేలిన ఫోన్, షాకైన జనం: వైరల్ వీడియో -
కారు బాంబు పేలుడు.. 20 మంది మృతి
మొగాదీషు: సోమాలియా రాజధాని మోగదిషులో బాంబు దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. ఓ రెస్టారెంట్లోకి బాంబుతో కూడిన వాహనం దూసుకెళ్లి పేలిపోయింది. దీంతో హోటల్తోపాటు సమీప ఇళ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. సుమారు 30 మందికి గాయాలు కాగా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాంబు దాడి వెనుక అల్-షహబ్ సంస్థ హస్తం ఉందని సోమాలియా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అల్-షహబ్ సంస్థకు అల్ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు గుర్తించారు. దేశంలో జరగాల్సిన ఎన్నికలపై ప్రతిపక్ష కూటమి శనివారం మొగాదీషులో సమావేశం కావల్సి ఉండగా బాంబ్ పేలుడు ఘటనతో ఆ సమావేశాన్ని వాయిదా వెసినట్లు తెలుస్తోంది. చదవండి: కూలిన ఆర్మీ హెలికాప్టర్.. చదవండి: ‘దెయ్యం’ పట్టింది; దెబ్బలు తాళలేక నిజం చెప్పింది! -
ఢిల్లీలో కలకలం రేపుతున్న టెర్రర్ నోట్
ఢిల్లీ: ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ పేలుడు చోట ఓ లేఖ లభ్యమైంది. అది హెచ్చరిస్తూ కావాలనే వదిలివెళ్లినట్లు తెలుస్తోంది. ఆ లేఖలో ‘రోజులు లెక్కపెట్టుకోండి.. పెద్ద పత్రీకారం కోసం సిద్ధంగా ఉండండి’ అని రాసి ఉండడంతో కలకలం రేపుతోంది. అంటే రానున్న రోజుల్లో మరిన్ని దాడులు జరిపే అవకాశం ఉందని ఆ రాతను బట్టి చెప్పవచ్చు. దీనిపై ఇప్పటికే ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా హైఅలర్ట్ విధించిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం బయట జనవరి 29వ తేదీన అత్యల్ప తీవ్రత కలిగిన ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే ఇది ముందస్తుగా హెచ్చరిస్తూ జరిపిన దాడిగా పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడుపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ పేలుడు చోట ‘ఇండియా హిజ్బుల్లా’ పేరుతో ఉన్న ఒక లేఖ లభించింది. దీనిలో ఇజ్రాయెల్ రాయబారి రాన్ మాల్కాను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఇజ్రాయెల్ రాయబారి కదలికలను పరిశీలిస్తున్నట్లు, ఇరాన్ అణు శాస్త్రవేత్త మొహ్సేన్ ఫఖ్రిజాదే, ఇరాన్ కమాండర్ ఖాసిమ్ సోలైమానితో సహా కొంతమంది ఉన్నత ఇరానియన్ల హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం. మీ రోజులను లెక్కపెట్టుకోండి’ అని చేతితో రాసిన లేఖలో ఉందని తెలుస్తోంది. ‘మీ ప్రతి క్షణం మాకు తెలుసు. మీరు మీ చివరి రోజులను లెక్కించడం ప్రారంభించండి. మీరు మాత్రమే కాదు, మీ భాగస్వాములు కూడా మా రాడార్లో ఉన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే’ అని ఆ లేఖలో హెచ్చరించారు. ఈ లేఖను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు సంస్థలు దీనిపై ఆరా తీస్తున్నాయి. ఈ బాంబు దాడిని ఇజ్రాయెల్ దేశం కూడా ఖండించిన విషయం తెలిసిందే. దర్యాప్తుకు సహకరిస్తామని తెలిపింది. -
ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు: ప్రతీకారచర్యే!..
సాక్షి, న్యూఢిల్లీ : రాజధానిలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద శుక్రవారం సంభవించిన పేలుడు ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సీసీ టీవీ కెమెరాల ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించారు. ప్రైవేట్ క్యాబ్లో ఎంబసీ వద్దకు వెళ్లిన నిందితులు.. అక్కడి ఓ పూల కుండీలో బాంబు పెట్టినట్లు కనుగొన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం వద్ద పేలుడు పదార్థాలకు ఉపయోగించే సామాగ్రి.. తీగలు, బాల్ బేరింగ్, ఇతర వస్తువులను, ఓ లేఖను కూడా గుర్తించారు. చదవండి : ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు ఇజ్రాయెల్ రాయబారిని హెచ్చరిస్తూ లేఖ రాశారు నిందితులు. ఇరాన్ అణు శాస్త్రవేత్త, జనరల్ అధికారిని చంపిన విషయం లేఖలో ప్రస్తావించారు. అందుకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్ ఎంబసీని లక్ష్యంగా చేసుకున్నట్లు లేఖలో వెల్లడించారు. నిందితులు ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. -
ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు
న్యూఢిల్లీ: ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఎదుట శుక్రవారం సాయంత్రం ఐఈడీ పేలుడు సంభవించింది. హై సెక్యూరిటీ జోన్లోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో సంభవించిన ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. సాయంత్రం 5 గంటల సమయంలో దౌత్య కార్యాలయం సమీపంలోని ఓ పూలకుండీలో ఉంచిన ఐఈడీ పేలింది. దాని తీవ్రతకు దగ్గర్లో పార్కు చేసిన మూడు కార్ల అద్దాలు మాత్రం పగిలిపోయాయని పోలీసులు తెలిపారు. సంచలనాన్ని సృష్టించేందుకు చేసిన ప్రయత్నమని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తినష్టం వాటిల్లలేదు. అయితే, అదే సమయంలో కొద్ది కిలోమీటర్ల దూరంలో రాజ్పథ్లో రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ తదితరులు రాజ్పథ్లో గణతంత్ర వేడుకల ముగింపు ఉత్సవాల్లో పాల్గొనడం గమనార్హం. ఘటన నేపథ్యంలో విదేశాంగ మంత్రి జై శంకర్ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గబి అష్కెనాజీతో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందికి పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామనీ, బాధ్యులను వదిలిపెట్టబోమని ప్రభుత్వం ట్విట్టర్లో తెలిపింది. విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రోతోపాటు ముఖ్యమైన, కీలక ప్రభుత్వ విభాగాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సీఐఎస్ఎఫ్కు ఆదేశాలు అందాయి. -
ఫేమస్ అవ్వాలని బాంబు పెట్టాడు!
వాషింగ్టన్: క్రిస్టమస్ పర్వదినం నాడు అమెరికా టెన్నెసీ రాష్ట్రం నాష్విల్లే నగరంలో ఓ వాహనంలో అమర్చిన బాంబు పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తి మరణించగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇక దాడికి పాల్పడిన వ్యక్తిని ఆంథోనీ క్విన్ వార్నర్గా గుర్తించారు. అయితే ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతోనే క్విన్ వార్నర్ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. బాంబ్ బ్లాస్ట్ జరగడానికి వారం ముందు క్విన్ వార్నర్ ‘ప్రపంచం తనను ఎన్నటికి మర్చిపోదని’ ఇరుగుపొరుగు వారితో అన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా క్విన్ వార్నర్ ఇంటి పక్క నివసించే రిక్ లాడ్ అనే వ్యక్తి బాంబ్ బ్లాస్ట్కు వారం ముందు నిందితుడికి, తనకు మధ్య జరిగిన సంభాషణను వెల్లడించాడు. ‘క్రిస్టమస్కు వారం రోజుల ముందు నేను, క్విన్ వార్నర్ కాసేపు పండగ గురించి ముచ్చటించుకున్నాం. మాటలో మధ్యలో క్విన్ వార్నర్ క్రిస్టమస్ సందర్భంగా శాంటా తన కోసం ఏదైనా మంచిది తీసుకురాబోతన్నాడు అని అన్నాడు. అంతేకాక ప్రపంచం తనను ఎన్నటికి మర్చిపోదని వ్యాఖ్యానించాడు. అయితే అతడి మాటల వెనక ఇంత దారుణమైన ఆలోచన దాగుందని నాకు ఆనాడు తెలియలేదు. అసలు అతడి మీద ఎలాంటి అనుమానం కలగలేదు’ అన్నాడు లాడ్. ప్రస్తుతం అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాంబ్ బ్లాస్ట్ వెనక గల ప్రధాన ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇప్పటికే క్విన్ వార్నర్ కంప్యూటర్, హార్డ్డ్రైవ్ని స్వాధీనం చేసుకున్నారు. (15 మంది చిన్నారులను బలిగొన్న రిక్షా బాంబు) గత శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో టెన్నెసీ రాష్ట్రం నాష్విల్లే నగరంలోని ఓ ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనంలో దుండగులు అమర్చిన బాంబు పేలింది. అయితే పేలుడు జరగడానికి ముందు ఆ ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నట్లు గుర్తు తెలియని దుండగుల నుంచి సమాచారం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అప్రమత్తమవుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా.. అక్కడే నిలిపి ఉంచిన ఓ రిక్రియేషనల్ వ్యాన్ నుంచి బాంబు పేలుడుకు సంబంధించిన ప్రకటన తమకు వచ్చినట్లు తెలిపారు. మరో 15 నిమిషాల్లో ఈ ప్రాంతంలో బాంబు పేలే ప్రమాదం ఉంది అంటూ రికార్డు చేసి ఉంచిన సందేశం తమకు వినపడిందని తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దగ్గర్లోని భవనాలు, ఇళ్ల నుంచి అందరినీ ఖాళీ చేయించామని, దీంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు. -
15 మంది చిన్నారులను బలిగొన్న రిక్షా బాంబు
కాబూల్ : అఫ్గానిస్తాన్లో జరుగుతున్న అంతర్యుద్ధం అభంశుభం తెలియని చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. రిక్షాకు అమర్చిన బాంబు పేలడంతో 15 మంది బాలలు మృత్యుఒడికి చేరగా మరో 20 మంది క్షతగాత్రులయ్యారు. తాలిబన్ అదీనంలో ఉన్న ఘజ్ని ప్రావిన్స్ గిలాన్ జిల్లాలోని ఓ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. చిరు వ్యాపారి ఒకరు రిక్షాలో రకరకాల వస్తువులను తీసుకుని ఓ గ్రామానికి వెళ్లగా పిల్లలంతా అతడి చుట్టూ మూగారు. ఇంతలోనే, రిక్షాకు అమర్చిన బాంబు పేలి 15 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. మరో 20 మంది వరకు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ దాడికి బాధ్యులుగా ఎవరూ ప్రకటించుకోలేదు. -
నిర్వీర్యం చేస్తుండగా పేలిన మందుపాతర
సాక్షి, చర్ల: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరను నిర్వీర్యం చేస్తుండగా అది పేలిపోవడంతో తీవ్రంగా గాయపడిన డిప్యూటీ కమాండెంట్ మృతి చెందాడు. సుకుమా జిల్లా పాలోడి క్యాంపునకు సమీపంలో గల కాసారం మార్గంలో పోలీసు బలగాలను హతమార్చేందుకు మావోయిస్టులు గతంలో మందుపాతర ఏర్పాటు చేశారు. పోలీసులు ఆదివారం దానిని గుర్తించి.. నిర్వీర్యం చేస్తున్న సందర్భంలో పేలింది. పాలోడి క్యాంపునకు చెందిన 208 కోబ్రా విభాగం డిప్యూటీ కమాండెంట్ వికాస్కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. చదవండి: మంత్రి పువ్వాడ అజయ్కు కరోనా.. చదవండి: పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య -
ఆప్ఘనిస్తాన్లో పేలుడు..ఇద్దరు పోలీసులు హతం
కాబూల్ : ఆప్ఘనిస్తాన్ దక్షిణ ప్రావిన్స్లో శుక్రవారం జరిగిన పేలుడు ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రావిన్సు పరిధిలోని కందహార్లో రోడ్సైడ్ బాంబును పోలీసు వాహనం ఢీ కొనడంతో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ పేలుడు ఘటన వెనుక ఎవరున్నారన్న దానిపై ఆప్ఘనిస్తాన్ అధికారులు కానీ తాలిబన్ ఇస్టామిస్ట్ కానీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దాదాపు రెండు దశాబ్దాల అనంతరం రాజకీయ పరిష్కార మార్గం దిశగా రెండు వైపులా చర్చలు కొనసాగుతున్నాయి. ఇకవైపు చర్చలు అంటూ శాంతియుతంగా మాట్లాడుతునే..మరోవైపు దేశ వ్యాప్తంగా తాలిబన్ దాడులు చేస్తోంది. దీంతో ఆప్ఘనిస్తాన్ వ్యాప్తంగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుండంతో భద్రతా దళాలు నిఘా ఉంచారు. (కాబూల్:యూనివర్సిటీపై ఉగ్రదాడి: 19 మంది మృతి) -
పాక్లో పేలుడు
పెషావర్: పాకిస్తాన్లో మంగళవారం ఉదయం జరిగిన బాంబు పేలుడులో 8 మంది చిన్నారులు మృతి చెందగా, 120 మంది గాయపడ్డారు. పెషావర్లోని డిర్ కాలనీలో ఒక మత పాఠశాల వద్ద ఉదయం ప్రార్ధనల అనంతరం ఈ ఘటన జరిగింది. పేలుడులో 4–5 కిలోల పేలుడు పదార్ధాలు వినియోగించినట్లు అధికారులు చెప్పారు. పేలుళ్లను పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్, ఖైబర్ పక్తున్క్వా ముఖ్యమంత్రి మెహ్మద్ఖాన్ ఖండించారు. పేలుడు జరిగినప్పుడు పాఠశాలలో దాదాపు 40–50 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిసింది. పేలుడుకు ఏ ఉగ్ర సంస్థ బాధ్యత వహించలేదు. -
అఫ్గాన్లో ఆత్మాహుతి దాడి; ఏడుగురి మృతి
కాబూల్ : అఫ్గానిస్తాన్లో మంగళవారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. పోలీసు కమాండర్ను లక్ష్యంగా చేసుకొని తూర్పు నంగర్హార్ ప్రావిన్స్లో ఉగ్రవాది కరు బాంబర్తో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో పోలీసు కమాండర్తో సహా నలుగురు అధికారులు మృతి చెందినట్లు స్థానిక అధికారి పేర్కొన్నారు. మరోవైపు అఫ్గాన్ దక్షిణ భాగంలో ఉన్న ఖేవా జిల్లాలోని ఒక మార్కెట్ వద్ద జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో మరో ముగ్గురు అధికారులు మరణించగా, 11 మంది గాయపడినట్లు ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి అట్టాహుల్లా ఖోగ్యాని తెలిపారు. అయితే ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే దానిపై అధికారిక సమాచారం లేదు. గత కొన్ని రోజులుగా తాలిబన్ , ఇస్లామిక్ స్టేట్ గ్రూఫ్ ఆఫ్ఘన్లో వరుస దాడులకు పాల్పడుతున్నాయి. -
రెండేళ్లైన ఇంకా ఆరని మంటలు!
సాక్షి, వరంగల్ రూరల్ : చెవులు చిల్లులు పడేలా శబ్దం, ఆకాశాన్ని అంటేలా కమ్ముకున్న పొగలు, మూడు కిలోమీటర్ల పరిధి వరకు కంపించిన ఇళ్లు, కూలిపోయిన గోడలు, వందల మీటర్ల దూరం వరకు ఎగిరిపడిన కార్మికుల శరీర భాగాలు.. ఇదీ వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి ఫైర్ వర్క్స్లో జరిగిన అగ్నిప్రమాదం ఘటన నాటి పరిస్థితి. రెండేళ్ల క్రితం అంటే 2018 జూలై 4న ఉదయం 11 గంటల సమయంలో జరిగిన బాంబుల పేలుళ్ల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిబంధనలు తుంగలోకి తొక్కి అధికారుల కళ్లు కప్పి నడుస్తున్న ఫైర్వర్క్స్లో జరిగిన ప్రమాదం పది నిండు ప్రాణాలను బలి తీసుకోగా మరో ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. టపాసుల తయారీ, విక్రయం.. వరంగల్ నగరానికి చెందిన గొల్లపల్లి కుమార్(బాంబుల కుమార్) కాశిబుగ్గ సమీపంలో కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్వర్క్స్ పేరుతో టపాసుల తయారీ, విక్రయాలు చేశారు. ఈ వర్క్షాప్లో రెండేళ్ల క్రితం జరిగిన పేలుళ్ల ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఐదురుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగి రెండేళ్లు అవుతున్నా బాధిత కుటుంబాలు ఇంకా తేరుకోలేదు. ఆ కుటుంబాలను కదిలిస్తే కన్నీరు మున్నీరవుతున్నారు. పరిహారం పెండింగ్లోనే.. ఎంప్లాయిస్ కంపర్జేషన్ యాక్ట్ 1932 ప్రకారం కంపెనీలో పని చేస్తున్న వారికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి పది మంది మరణించడంతో కార్మిక శాఖ ఈ కేసును సుమోటగా స్వీకరించి జైలులో ఉన్న భద్రకాళి ఫైర్ వర్క్స్ యజమాని బాంబుల కుమార్కు 2018 జూలై 20న నోటీసులు పంపించారు. అయినా స్పందన లేకపోవడంతో కార్మిక శాఖే బాధితుల్లో ఒక్కొక్కరికి రూ.6 లక్షల నుంచి రూ.9లక్షల వరకు మొత్తం రూ.68లక్షలు పరిహారం చెల్లించాలని ఆర్డర్ జారీ చేసింది. ఈ నగదును 30 రోజుల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించగా.. భద్రకాళి ఫైర్ వర్క్స్ను 2016లోనే తన బావమరిది, ఈ ఘటనలో చనిపోయిన రఘుపతికి అప్పగించానని కుమార్ సమాధానం ఇచ్చారు. ఈ సమాధానాన్ని డిస్మిస్ చేస్తూ బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సిందేనని కార్మికశాఖ మరో ఆర్డర్ జారీ చేసింది. అయితే, పరిహారం చెల్లించకుండా తప్పించుకునేందుకే చనిపోయిన తన బావమరిదికి వర్క్షాప్ అప్పగించానని చెప్పినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత కార్మిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా కార్మిక శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు వెలువడింది. దీంతో రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం యజమాని ఆస్తులను జప్తు చేసి చనిపోయిన కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేలా చూడాలని జిల్లా కలెక్టర్ను కార్మిక శాఖ కోరింది. అయితే, ఇది ఇంకా పెండింగ్లోనే ఉండడంతో బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నారు. అంతా కూలీలే.. ఆ రోజు బాంబుల తయారీ కోసం 14 మంది కూలీలు వర్క్షాప్కు వచ్చారు. అక్కడ జరిగిన పేలుడులో కాశిబుగ్గ తిలక్ రోడ్డుకు చెందిన గాజుల హరికృష్ణ(38), సుందరయ్య నగర్ ఓంసాయి కాలనీకి చెందిన కోమటి శ్రావణి(33), బేతి శ్రీవాణి(25), ఏనుమాముల మార్కెట్ రోడ్ బాలాజీ నగర్కు చెందిన రంగు వినోద్(24), కాశిబుగ్గకు చెందిన వల్దాసు అశోక్కుమార్ (30), కాశిబుగ్గ సాయిబాబా గుడి సమీపానికి చెందిన బాలిని రఘుపతి(40), కీర్తి నగర్ కాలనీకి చెందిన కందకట్ల శ్రీదేవి(34), సుందరయ్య నగర్కు చెందిన బాస్కుల రేణుక(39), కొత్తవాడకు చెందిన వడ్నాల మల్లికార్జున్(35), కరీమాబాద్కు చెందిన వంగరి రాకేష్ (22) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. వీరిలో మల్లికార్జున్, రాకేష్ మృతుదేహాలు గుర్తు పట్టలేని విధంగా చిధ్రం కావడంతో డీఎన్ఏ పరీక్ష చేయించాల్సి వచ్చింది. ఇక బాలాజీనగర్కు చెందిన కొండపల్లి సురేష్, గొర్రెకుంటకు చెందిన బందెల సారంగపాణి, కాశిబుగ్గకు చెందిన పరికెరాల మోహన్, హన్మకొండకు చెందిన బాతింగ్ రవి, కోటిలింగాలగుడి సమీపంలోని సైలేంద్ర శివ తీవ్రంగా గాయపడ్డారు. అలాగే, పేలుడు ఘటనతో ఫైర్ వర్క్స్ చుట్టుపక్కల సమారు 300 మీటర్ల దూరం వరకు ఉన్న గృహాల పైకప్పు రేకులు పగిలిపోయాయి. కొందరు మరమ్మతులు చేసుకుని ఉంటుండగా, మరికొందరు ఆ ఇళ్లను వదిలేశారు. -
పాకిస్తాన్లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో శుక్రవారం జరిగిన బాంబు దాడిలో ముగ్గురు మృతి చెందారు. సింధ్ సింధ్ ప్రావిన్స్లోని రైల్వే స్టేషన్ సమీపంలో భద్రతా వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో పాకిస్తాన్ భద్రతా దళానికి చెందిన ఇద్దరు సహా, ఒక పౌరుడు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగ్రాతులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన గోట్కీ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రసంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సాధారణంగా అయితే బలూచిస్తాన్ ప్రావిన్స్ లక్ష్యంగా ఉగ్రదాడులు జరుగుతాయని, సింధ్ ప్రావిన్స్లో ఇలాంటి ఘనలు అరుదు అని పాకిస్తాన్ అధికారులు పేర్కొన్నారు. (వ్యాక్సిన్ అన్ని దేశాలకూ అందివ్వాలి: పాకిస్తాన్) At least three people including a Sindh Rangers personnel were dead on Friday in a blast targeting a vehicle of the Rangers in Ghotki: Pakistan media — ANI (@ANI) June 19, 2020 -
అక్కంపల్లెలో పేలుడు
కర్నూలు, సంజామల: మండలంలోని అక్కంపల్లెలోమంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తికి చెందిన నరేష్రెడ్డి అనే కూలీ గాయపడ్డాడు. పాత ఇల్లు తీసేసే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు.. అక్కంపల్లెకు చెందిన చెంచిరెడ్డి తన పాత ఇంటిని తీసేసి, నూతన గృహాన్ని కట్టుకోవాలనుకున్నాడు. మంగళవారం ఉదయం నలుగురు కూలీలతో పాత ఇంటిని తొలగిస్తుండగా.. గోడకు ఉన్న గూటిలో ఏదో వస్తువు కనిపించింది. దాన్ని కూలీ నరేష్రెడ్డి చేత్తో పట్టుకుని పక్కన పడేశాడు. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నరేష్రెడ్డి చేతికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని వెంటనే చికిత్స నిమి త్తం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగుకు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు, సంజామల ఎస్ఐ ప్రియతంరెడ్డి పే లుడు జరిగిన ఇంటిని పరిశీలించారు. నాటుబాంబు పేలి ఉండొచ్చనే అనుమానంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
దిల్సుఖ్నగర్ బాంబ్ పేలుళ్లకు నేటితో ఏడేళ్లు
-
లక్నో కోర్టు వద్ద బాంబు పేలుడు
-
లక్నో కోర్టు వద్ద బాంబు పేలుడు
లక్నో : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఓ కోర్టు వద్ద బాంబు పేలుడు కలకలం రేపింది. రాష్ట్ర విధానసభకు కేవలం కిలో మీటర్ దూరంలోనే ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు లాయర్లు గాయపడినట్టుగా తెలుస్తోంది. దీంతో కోర్టు పరిసరాల్లో ఆందోళకర వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అలాగే ఘటన స్థలంలో మరో మూడు పేలని నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడి తనను లక్ష్యంగా చేసుకునే జరిగిందని లక్నో బార్ అసోషియేషన్ జాయింట్ సెక్రటరీ సంజీవ్ లోధి చెప్పారు. జీతూ యాదవ్ అనే లాయర్ ఈ పేలుడుకు కారణమని ఆరోపించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విమానం పేలుస్తానని మహిళ బెదిరింపు
కోల్కతా: బాంబులతో విమానాన్ని పేలుస్తానని ఓ ప్రయాణికురాలు బెదిరించడంతో ముంబైకి వెళ్తున్న విమానం వెనుదిరిగి కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది. 114 మంది ప్రయాణికులతో ఉన్న ఎయి ర్ ఏషియా విమానం శనివారం రాత్రి 9.57 గంటలకు కోల్కతా విమానాశ్రయం నుంచి బయలుదేరింది. కొద్దిసేపటికే అందులోని ఓ ప్రయాణికురాలు విమాన సిబ్బ ందికి ఓ నోట్ను అందించింది. తన వద్ద బాం బులున్నాయని, వాటిని పేల్చేస్తానని అందులో ఉంది. పైలట్ వెంటనే విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)కి చేరవేశారు. ఏటీ సీ ఆదేశాల మేరకు విమానాన్ని తిరిగి కోల్కతా ఎయిర్పోర్టుకు తీసుకొచ్చాడు. ఆమె వద్ద కానీ, విమానంలో కానీ ఎక్కడా బాంబులు లేవని సోదాల అనంతరం భద్రతాధికారులు నిర్ధారించారు. ఆ ప్రయాణికురాలు మత్తులో ఉన్నట్లు తేలిందని తెలిపారు. -
ఉలిక్కిపడ్డ గెద్దలపాడు
శ్రీకాకుళం, సంతబొమ్మాళి: అంతవరకు అమ్మఒడి కార్యక్రమ సంబరాల్లో మునిగి తేలిన ఇద్దరు విద్యార్థులు మూత్ర విసర్జన కోసం పాఠశాల సమీపాన సరుగుడు తోటలోకి వెళ్లారు. అక్కడ బంతి ఆకారంలో వస్తువు కనిపించగా ఆతృతగా తీసుకున్నారు. అది నాటుబాంబు అని తెలియని ఆ పసివాళ్లు ఆనందంగా ఆడుతు న్నారు. ఇంతలో ఒక్కసారిగా పేలడంతో గాయాల పాలయ్యారు. దీని పేలుడు శబ్దానికి ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన సంతబొమ్మాళి మండలం లక్కివలస పంచాయతీ గెద్దలపాడు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు... గెద్దలపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో అమ్మఒడి కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. ఆ సమయంలో 6వ తరగతికి చెందిన విద్యార్థులు బొంగు తిరుపతిరావు, చింతల రాజు మూత్ర విసర్జన కోసం సమీప సరుగుడు తోటలోకి వెళ్లారు. అక్కడ బంతి ఆకారంలో కనిపించిన నాటుబాంబుతో ఆడారు. ఆ క్రమంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలి గాయాలై స్పృహ తప్పి పడిపోయారు. ఈ శబ్దానికి ఉపాధ్యాయులు, స్థానికులు పరుగున అక్కడకు చేరుకున్నారు. గాయాలతో పడి ఉన్న వారిని గుర్తించారు. వెంటనే 108కి ఫోన్ చేసి శ్రీకాకుళం రిమ్స్కు, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం రాగోలు జెమ్స్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల ముఖం, కాలు, చేతులపై గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి తహసీల్దార్ సోమేశ్వరావు, ఎంఈవో జే చిన్నవాడు, సంతబొమ్మాళి పోలీసులు చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని సంతబొమ్మాళి ఎస్ఐ కామేశ్వరరావు తెలిపారు. అడవి పందులను సంహరించడానికేనా? కొంతమంది వేటగాళ్లు అడవి పందులను సంహరించడానికే ఇక్కడ తోటల్లో నాటుబాంబులు వేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తోటలోకి అడవి పందుల వచ్చి వాటిని తినే ప్రయత్నంలో పేలి చనిపోతాయి. చనిపోయిన అడవి పందులను మాంసంగా చేసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై విచారణ చేపడితే వాస్తవాలు బయట పడతాయని స్థానికులు కోరుతున్నారు. తాజా ఘటనతో సముద్ర దిబ్బల్లో, తోటల్లో ఎక్కడైనా నాటుబాంబులు ఉంటాయేమోనని, తీర ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నా... పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నాయి. వీటికి నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయటకు వెళ్తున్నారు. పరిసర ప్రాంతాలు కూడా అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. అయినప్పటికీ గత్యంతరం లేక మల, మూత్ర విసర్జనల సమయంలో బయటకు వస్తున్నారు. ఇలా రావడంతోనే నాటుబాంబు పేలుడికి విద్యార్థులు గాయాల పాలయ్యారు. -
బాంబు పేలుడు కలకలం.. ఒకరి మృతి
-
ఆదిలాబాద్లో బాంబు పేలుడు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ పేలుడు ధాటికి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతుడి శరీరభాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడిన క్షత్రగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ మీదుగా ఉట్నూరుకు ఇద్దరు వ్యక్తులు బైక్పై ప్రయాణిస్తున్నారు. అయితే ఉట్నూర్ ఎక్స్ రోడ్ దగ్గర గల పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగానే బైక్ నుంచి ఒక్క సారిగా పేలుడు సంభవించింది. దీంతో ఏం జరిగిందో అర్థం కాక స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. అంతేకాకుండా ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పేలిన బాంబుతో పాటు బైక్లో మరో బాంబు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా పేలుడు సంభవించడానికి గల కారణం నాటు బాంబు లేక గనుల్లో వాడే జిలితెన్ స్టిక్స్ అయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
సోమాలియాలో మారణహోమం
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో శనివారం సంభవించిన భారీ కారు బాంబు పేలుడులో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధానికి నైరుతి ప్రాంతంలోని చెక్పోస్ట్ వద్ద ట్రాఫిక్ భారీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. పేలుడు ధాటికి ఘటనా ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని మృతదేహాలు గుర్తు పట్టడానికి కూడా వీల్లేకుండా కాలిపోయాయి. కొన్ని వాహనాలు మంటల్లో పూర్తిగా కాలిపోగా మరికొన్ని నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో కళాశాల బస్సు పేలిపోవడంతో మృతుల్లో అత్యధికులు విద్యార్థులే ఉన్నారు. ప్రస్తుతానికి మృతులు 78 మంది, క్షతగాత్రులు 125 వరకు ఉన్నప్పటికీ ఈ సంఖ్య ఇంకా పెరిగే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యత తమదేనంటూ ఏ ఉగ్ర సంస్థా ఇప్పటివరకు ప్రకటించుకోలేదు. అల్ ఖాయిదా అనుబంధ అల్ షబాబ్ దేశంలో తరచూ కారు బాంబు దాడులకు పాల్పడుతోంది. శనివారం జరిగిన పేలుడు రెండేళ్లలోనే అత్యంత తీవ్రమైంది. 2017లో మొగదిషులో ట్రక్కు బాంబు పేలి 512 మంది చనిపోగా 300 మంది గాయపడ్డారు. నెత్తురోడుతున్న బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తున్న స్థానికులు -
యూపీ మసీదు పేలుడు కేసులో సిటీ డాక్టర్
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ కుషినగర్ జిల్లాలోని తుర్కుపట్టి పోలీస్స్టేషన్ పరిధిలోని బైరాగిపట్టి మసీదు బాంబు పేలుడు కేసులో హైదరాబాద్లో ఉంటున్న ఆర్మీ మాజీ వైద్యుడు అష్వఖ్ ఆలం అరెస్టయ్యాడు. టోలిచౌకిలో గురువారం ఇతడిని అదుపులోకి తీసుకున్న ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ప్రత్యేక బృందం విచారణ అనంతరం శనివారం అరెస్టు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పేలుడు పదార్థాల సమీకరణకు సూత్రధారిగా ఉన్న హాజీ ఖుద్భుద్దీన్కు అష్వఖ్ మనుమడు అవుతాడు. బుధవారం ఖుద్భుద్దీన్ చిక్కగా.. విచారణలో అష్వఖ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆర్మీలో వీఆర్ఎస్.. సివిల్స్కు ప్రిపరేషన్ ఆర్మీ మెడికల్ కార్ప్లో (ఏఎంసీ) కెప్టెన్ హోదాలో అష్వఖ్ ఆలం, ఆయన భార్య ఎస్జే ఆలం పని చేశారు. హైదరాబాద్లో పని చేస్తుండగా 2017లో అష్వఖ్ వీఆర్ఎస్ తీసుకోగా.. ఎస్జే ఆలం హైదరాబాద్లోని ఆర్మీ వైద్యశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. అష్వఖ్ ప్రస్తుతం సివిల్స్కు సిద్ధమవుతున్నాడు. వీరి పూర్వీకులకు బైరాగిపట్టిలో ఆస్తులుండటంతో తరచూ అక్కడకు వెళ్లి వస్తుంటాడు. ఓ స్నేహితుడి వివాహానికి హాజరుకావడానికి ఈ నెల 8న అక్కడకు చేరుకున్న అష్వఖ్ 10న ఫంక్షన్కు హాజరయ్యాడు. ఆ మరుసటి రోజే (నవంబర్ 11న) బైరాగిపట్టిలోని మసీదులో పేలుడు జరిగింది. తక్కువ తీవ్రత కలిగిన దీని ప్రభావంతో అష్వఖ్ తాత ఖుద్భుద్దీన్ స్వల్పంగా గాయపడ్డాడు. ఆ గాయాలతోనే అక్కడ నుంచి పరారయ్యాడు. బ్యాటరీ పేలిందంటూ పక్కదారి.. పేలుడు జరిగిన వెంటనే పోలీసులకు ఫోన్ చేసిన అష్వఖ్ ఆలం మసీదులో ఉన్న ఇన్వర్టర్ బ్యాటరీ పేలిందని, అందుకే శబ్ధం, పొగ వచ్చాయని చెప్పి కేసును తప్పుదోవ పట్టించాలని చూశాడు. ఘటనాస్థలికి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు బ్యాటరీ కాదని, పేలుడు పదార్థాల కారణంగానే విధ్వంసం చోటుచేసుకుందని తేల్చారు. దీంతో తుర్కుపట్టి పోలీసుస్టేషన్ నమోదైన ఈ కేసు దర్యాప్తు కోసం ఏటీఎస్ అధికారులు రంగంలోకి దిగారు. ఓ పక్క ఖుద్భుద్దీన్ కోసం గాలిస్తూనే అష్వఖ్ను ప్రాథమికంగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఏటీఎస్ అధికారులు గోరఖ్పూర్లో ఖుద్భుద్దీన్ను అరెస్టు చేశారు. ఇతడి విచారణ నేపథ్యంలోనే అష్వఖ్కు ఈ కుట్రలో ప్రమేయం ఉందని బయటపెట్టాడు. అనుకోకుండా జరిగిన ఈ పేలుడు తర్వాత అక్కడ సాక్ష్యాధారాలను అతడే నాశనం చేశాడని చెప్పాడు. ఏటీఎస్ టీమ్ విమానంలో హైదరాబాద్కి వచ్చి గురువారం రాష్ట్ర పోలీసుల సాయంతో అష్వఖ్ను అదుపులోకి తీసుకుని అక్కడకు తరలించింది. వివిధ కోణాల్లో ప్రశ్నించిన నేపథ్యంలో శనివారం అరెస్టు చేసి ఖుద్భుద్దీన్తో సహా జ్యుడీషియల్ రిమాండ్కు తరలించింది. ఆ ప్రార్థనా స్థలమే కారణం.. ఈ కేసులో అరెస్టయిన ఏడుగురి విచారణలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ఏటీఎస్ అధికారులు చెబు తున్నారు. ఖుద్భుద్దీన్ బైరాగిపట్టిలో ఉన్న ఓ ప్రార్థనా స్థలాన్ని టార్గెట్ చేశాడని చెబుతున్నారు. వీరి పూర్వీకులు దానం చేసిన భూమిలో అది కొనసాగుతోందని.. దీనిపైనే వివాదం తలెత్తిందని ఏటీఎస్ చెబుతోంది. టార్గెట్ చేసిన స్థలంలో భారీ విధ్వంసాల కోసం దాచి ఉంచిన ఈ పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలాయని దర్యాప్తులో తేల్చారు. పేలుడు తర్వాత గోరఖ్పూర్కు పారిపోయిన ఖుద్భుద్దీన్ను కలి సేందుకు అష్వఖ్ ఆలం విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈలోపే ఇద్దరూ తమకు చిక్కారని చెబుతున్నారు. వీరిద్దరినీ తదుపరి విచారణ కోసం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరు తూ ఏటీఎస్ అధికారులు అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అష్వఖ్తోపాటు అతడి భార్య సైతం ఆర్మీ డాక్టర్లు కావడంతో మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు, కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ విభాగాలకు చెందిన ప్రత్యేక బృందాలు అష్వఖ్తో పాటు అతడి భార్యను ప్రశ్నించాలని నిర్ణయించాయి. -
అమ్మో డబ్బా!
సాక్షి, సిటీబ్యూరో: ‘పేలుడు’.. చిన్నదైనా, పెద్దదైనా ఆ పేరు వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఇటీవల రాజధాని నగరంలో తరచుగా చిన్నస్థాయి పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. అత్యధిక ఉదంతాల్లో క్షతగాత్రులే ఉండగా కొన్ని సందర్భాల్లో మాత్రం మరణాలు సంభవిస్తున్నాయి. ఈ బ్లాస్ట్లకు ప్రధానంగా గృహ, వాణిజ్య అవసరాలకు వినియోగించే ‘ఆర్గానిక్ సాల్వెంట్స్’ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ సమ్మిళిత పదార్థాలు ఉండే పెయింట్స్ను కొన్ని స్థితుల్లో ఇళ్లల్లో పెట్టుకోవడం ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. శుక్రవారం మీర్పేట్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ తరహా ఆర్గానిక్ సాల్వెంట్ పేలుడులో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. నగరంలో చోటు జరుగుతున్న చిన్న స్థాయి పేలుళ్లకు ఎక్కువగా పెయింట్ డబ్బాలే కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. రంగుల్లో వాడే థిన్నర్లలో ‘వలటైల్ ఆర్గానిక్ సాల్వెంట్స్’గా పిలిచే ఎసిటోన్, ఈ రసాయనం కలిపిన టాల్విన్, ఈథర్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఓ పెయింట్ డబ్బా సీల్ తెరిచిన తర్వాత సగం వినియోగించి మిగిలిన సగాన్ని మూతపెట్టి అలాగే ఉంచడం పరిపాటి. ఇలా దాచి పెట్టే డబ్బాల్లో ఉండే రంగుల్లోని ఆవిరి స్వభావం కలిగిన రసాయనాలు.. డబ్బాలోని ఆక్సిజన్తో కలిసి వ్యాకోచించేందుకు ప్రయత్నిస్తాయి. గట్టిగా మూత పెట్టి ఉండటంతో అది సాధ్యంకాక డబ్బా లోపలి భాగంలో వాక్యూమ్ ఏర్పడుతుంది. ఈ స్థితిలో ఉన్న డబ్బా మూతలు సైతం బిగుసుకుపోతాయి. అలాంటి వాటిని తెరవడానికి రాపిడి కలిగించినా, గట్టిగా కొట్టినా చిన్నస్థాయి పేలుడు సభవిస్తుంది. వారే ఎక్కువ మంది బాధితులు ఇలాంటి డబ్బాల పేలుడులో క్షతగాత్రులు, మృతులుగా మారుతున్న వారిలో ఎక్కువగా చెత్త ఏరుకునే వారే ఉంటున్నారు. మొన్నటి రాజేంద్రనగర్ ఘటన, తాజాగా మీర్పేట ప్రమాదం ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. సగం వాడిన పెయింట్ డబ్బాలను సాధారణంగా ఆ వినియోగదారులు కొన్నిరోజుల పాటే భద్రపరుస్తుంటారు. డబ్బా తుప్పు పడుతున్నప్పుడో, కదిల్చినప్పుడు పెయింట్ కదలిక లేకున్నా గడ్డ కట్టేసిందనో, మూత తీయడం సాధ్యం కానప్పుడో వాటిని బయట ఎక్కడో పారేస్తుంటారు. అలా అవి చెత్త ఏరుకునేవారు తీసుకుని వాటిని తెరిచే ప్రయత్నాలు చేసే క్రమంలో పేలుడు జరిగి కొన్నిసార్లు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ప్లాస్టిక్ డబ్బాలతో మరింత ప్రమాదం గతంలో పెయింట్స్ను ఇనుప డబ్బాల్లో ఉంచేవారు. అయితే ఇటీవల దాదాపు అన్ని రకాల రంగులను ప్లాస్టిక్ డబ్బాల్లోనే ఉంచి విక్రయిస్తున్నారు. ఇనుప వాటి కంటే ఇవి అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. సగం ఖాళీ అయిన ఇనుప డబ్బాలోని రంగుకు ఆక్సిజన్ అందక రసాయన క్రియ జరగదు. కేవలం గడ్డ కట్టడం మాత్రమే జరుగుతుంది. అదే ప్లాస్టిక్ డబ్బాలో ఉంటే ఉన్న చిన్నపాటి సందుల నుంచి ఆక్సిజన్ వెళ్తుంది. దీంతో పాటు ఆర్గానిక్ సాల్వెంట్స్ కొన్ని రోజులకు ప్లాస్టిక్తో కలిసి పాలిమరైజేషన్ జరుగుతుంది. ఈ కారణంగా ఏర్పడే వేఫరైజర్ల కారణంగా దాన్ని తెరిచే ప్రయత్నం చేసినప్పుడు పేలుడు జరిగే ప్రమాదముంది. ఇలాంటి డబ్బాలు ఇంట్లో ఉన్నప్పటికీ ప్రమాదాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సీల్ తీస్తే వాడేయాలి ఆర్గానిక్ సాల్వెంట్స్ ఉండే పెయింట్స్ను డబ్బా సీల్ తీసిన తర్వాత పూర్తిగా వాడేయడం ఉత్తమం. అలా కాకుండా కొంత మిగిలితే బయట పారబోయాలి. తర్వాత వినియోగిద్దామనే ఉద్దేశంతో దాచి పెట్టినా, కొన్నాళ్లకు పారేసినా ప్రమాదాలకు ఆస్కారముంటుంది. ఇలాంటి డబ్బాలు అన్ని సమయాల్లోనే పేలేకపోవచ్చు. పేలుడుకు అవసరమైన స్థాయిలో సాల్వెంట్స్ రేషియో తయారైతేనే అలా జరుగుతుంది. ఒకవేళ ఇలా సగం ఖాళీ అయిన డబ్బాలు ఇంట్లో తెరవాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా వాటిని తెరవకుండా కనీసం గంట సేపు చల్లని నీటిలో ఉంచాలి. ఫ్రిజ్ వాటర్ను బక్కెట్లో పోసి అందులో ఈ డబ్బాలను వేయాలి. ఇలా చేస్తే అందులో ఉన్న ఆవిరి చల్లబడి మళ్లి పెయింట్గా మారుతుంది. అప్పుడు రాపిడి కలిగిస్తూ తెరిచినా ఎలాంటి ప్రమాదం ఉండదు.– డాక్టర్ ఎన్.వెంకన్న, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్,హైదరాబాద్ క్లూస్ టీమ్స్ ఈ ఏడాది జరిగిన ఉదంతాలివీ.. ♦ మీర్ పేట్ పోలీసుస్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ పోష్ కాలనీలో శుక్రవారం చెత్త ఏరుకునే నిర్మల ప్లాస్టిక్ డబ్బాను తెరిచే ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపడింది. ♦ ఆక్టోబర్ 19: నాచారంలో చేతితో ఆడుకుంటున్న రసాయనంతో కూడిన డబ్బా పేలడంతో ఓ చిన్నారికి గాయాలయ్యాయి. ♦ సెప్టెంబర్ 8: రాజేంద్రనగర్లో టిన్ పేలి అలీ అనే వ్యక్తి మరణించాడు. పీవీ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నెం.279 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. -
బాంబు పేలుడుతో కలకలం
ఇంఫాల్ : మణిపూర్ రాజధాని ఇంఫాల్లోని తంగల్ బజార్ వద్ద మంగళవారం ఉదయం బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. బాంబు పేలడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఐదుగురు పోలీసులున్నారు. బాంబు పేలుడు అనంతరం ఘటనా ప్రాంతాన్ని పోలీసులు స్వాధీనం చేసుకని విస్తృత తనిఖీలు చేపట్టారు.గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, పేలుడు ధాటితో సమీపంలో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. బాంబు పేలుడుకు కారణాలేమిటనేది ఇంకా వెల్లడికాలేదు. -
ఆ ఆపరేషన్తో ఇక కొత్త జీవితం!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా నౌకా దళానికి చెందిన ‘రే’ (పూర్తి పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడ లేదు) 2010లో అఫ్ఘానిస్థాన్లో సైనిక విధులు నిర్వర్తించారు. ఆ సందర్భంగా ఓ రోజు పొరపాటున రోడ్డు పక్కన తాలిబన్లు అమర్చిన మందు పాతర మీద కాలు పెట్టారు. అది పేలి పోవడంతో రెండు కాళ్లు తెగి పోయాయి. ఆయన్ని హుటిన అమెరికాలోని సైనిక ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత ఆయన రెండు కృత్రిమ కాళ్లను అమర్చుకొని నడవడం మొదలు పెట్టారు. అయినప్పటికీ ఆయన లోలోల ఎందుకో కుములి పోసాగారు. ఆ తర్వాత కొంత కాలానికి అతి సన్నిహితులకు అసలు విషయం చెప్పారు. నాటి బాంబు పేలుడులో తన పురుషాంగం, బీజావయ సంచీ పూర్తిగా దెబ్బతిన్నాయని, వైద్యులు వాటిని ఆపరేషన్లలో తీసివేశారని ‘రే’ చెప్పుకున్నారు. ఇక తనకు సంసార సుఖం లేనట్లేనా ? అంటు బాధ పడ్డారు. పేలుడు జరిగినప్పుడు ‘రే’ వయస్సు 30 ఏళ్లు. ఈ విషయం వెల్లడించినప్పుడు ఆయన వయస్సు 33 ఏళ్లు. పురుషాంగం మార్పిడికి అవకాశం ఉందా ? అన్న అంశంపై అప్పటి నుంచి వైద్యులను సంప్రతించడం మొదలు పెట్టారు. 2013లోనే బాల్టిమోర్లోని ‘జాన్ హాప్కిన్స్ మెడిసిన్’ ఆస్పత్రిలో ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రిచర్డ్ రెడిట్ను కలుసుకున్నారు. తన బాధ గురించి ఆయనకు చెప్పుకున్నారు. పురుషాంగం దాత దొరికనప్పుడు తప్పకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అప్పటి వరకు ప్రపంచలో ఎవరు కూడా పురుషాంగం మార్పిడి ఆపరేషన్ చేయక పోవడంతో డాక్టర్ కూడా ఆ విషయం అధ్యయనం చేయడం మొదలు పెట్టారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న ‘రే’ ఆ తర్వాత ఐదేళ్లకు 2018లో మేరీలాండ్ రాష్ట్రంలో మెదడు చచ్చుపడిన ఓ రోగి పురుషాంగం దానం చేయడానికి ఆయన కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. మేరీలాండ్ నుంచి బాల్టిమోర్కు అద్దె జెట్ విమానంలో అవయవాన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆపరేషన్కు సిద్ధం చేసిన ‘రే’కు 14 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి విజయవంతంగా పురుషాంగాన్ని అతికించారు. అలాంటి ఆపరేషన్ ప్రపంచంలో విజయవంతం అవడం అదే మొదటి సారి. దాంతో ఆ వైద్య బృందానికి అంతర్జాతీయంగా ప్రశంసలు వచ్చాయి. ఇప్పటి వరకు కూడా మూడంటే మూడే పురుషాంగం మార్పిడి ఆపరేషన్లు విజయవంతం అయ్యాయి. 2006లో చైనా వైద్యు పురుషాంగం మార్పిడికి మొదటి సారి ప్రయత్నించి విఫలమయ్యారు. పురుషాంగంలో తల వెంట్రుకలకన్నా సన్నని రక్త నాళాలతోపాటు, సంక్లిష్టమైన రక్త నాళాల వ్యవస్థ ఉంటుందట. అందుకనే ఆపరేషన్ చాలా క్లిష్టమట. ‘రే’కు పురుషాంగంతోపాటు బీజాల సంచిని కూడా దాత నుంచే సేకరించి అతికించారు. సంచిలోని బీజాలను మాత్రం తొలగించారు. బీజాల్లోనే ‘వీర్యం’ ఉత్పత్తి అవుతుంది కనుక, వాటిని కూడా అమర్చినట్లయితే సంతానం దాతకు చెందినది అవుతుందన్న భావంతో కుటుంబ సభ్యుల అనుమతి తీసుకొని బీజాలను తొలగించారు. వాటి స్థానంలో కృత్రిమ బీజాలను అమర్చే అవకాశం ఉంది. అలా చేశారా, లేదా అన్నది తెలియలేదు. ఈ విషయాన్ని ‘రే’ కూడా వెల్లడించలేదు. గత కొన్ని రోజులుగా తన పురుషాంగం స్తంభిస్తోందని, వైద్య సహాయం లేకుండానే తాను మూత్రం పోయగలుగుతున్నానని ఆయన చెప్పారు. లైంగిక వాంఛ ఉద్దీపన కోసం తనకు వైద్యులు ‘టెస్టోస్టెరోమ్’ ఎంజైమ్ ఇస్తున్నారని అన్నారు. ఇప్పటి నుంచి తాను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని, ఈ అవకాశం కల్పించిన వైద్య బృందానికి తన ధన్యవాదాలని ‘మిట్ టెక్నాలజీ రివ్యూ’ మాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘రే’ ఈ వివరాలు వెల్లడించారు. ‘రే’ తనకు పెళ్లయిందో, లేదో వెల్లడించలేదు. అయితే ఆయన కొత్త సంసార జీవితాన్ని సంపూర్ణంగా ఆశిస్తున్నారు. అయితే ఇందులో కొన్ని చిక్కుముడులు ఉన్నాయన్న విషయం ఆయనకు తెలిసినట్లు లేదు. కృత్రిమ బీజాలు అమర్చకపోతే ఆయనలో ‘వీర్యం’ ఉత్పత్తి అవకాశమే లేదు. కృత్రిమ బీజాలు అమర్చినా సక్సెస్ రేటు తక్కువే. వీర్యం ఉత్పత్తి లేకున్నా పురుషాంగం స్తంభిస్తుందని, లైంగిక వాంఛ తీర్చు కోవచ్చని, అయితే ‘స్కలనం’ ఉండదని వైద్యులు తెలిపారు. ఫలితంగా ‘రే’కు స్కలనానుభూతి దక్కదన్న విషయం సన్నిహితులెవరూ ఆయనకు చెప్పలేదని అర్థం అవుతుంది. -
నా జీవితంలో ఇంకెప్పుడూ సంతోషంగా ఉండలేను
కాబూల్ : ‘‘బంధువుల సందడి, అతిధుల పలకరింపులు ఇవన్నీ గుర్తుచేసుకుంటుంటే ఎంతో బాధగా ఉంది. ఈ సంఘటన నన్ను సంతోషం నుంచి దూరం చేసి విషాదంలోకి నెట్టివేసింది. నా కుటుంబం, పెళ్లి కూతరు అందరూ షాక్లో ఉన్నారు. పెళ్లి కూతురైతే ఇప్పటికీ వణికిపోతోంది. నా తమ్ముడ్ని, స్నేహితులను, బంధువులను కోల్పోయాను. నా జీవితంలో ఇకపై నేనెప్పుడూ సంతోషంగా ఉండలేను. గాయపడిన వారిలో ఆడవాళ్లు, పిల్లలు కూడా ఉన్నారు. దాడి జరగటానికి ముందు పెళ్లికి వచ్చిన అతిధులు ఆనందంతో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. క్షణాల్లో అంతా నాశనమైపోయింది. అందరూ కేకలు వేస్తూ తమ వాళ్లకోసం ఏడుస్తూ వెతుకుతూ ఉన్నారు. దాడి జరిగిన తర్వాత మేము స్పృహలో లేము! మమ్మల్ని ఎవరు ఆసుపత్రికి తీసుకొచ్చారో కూడా తెలియదు.’’ అంటూ తన పెళ్లి వేడుకలో చోటు చేసుకున్న తీరని విషాదంపై పెళ్లికుమారుడు మిర్వేస్ ఆవేదన వ్యక్తం చేశాడు. దాడికి ముందు చోటుచేసుకున్న మధురమైన సంఘటనలను నెమరువేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యాడు. కాగా, అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో శనివారం రాత్రి పెళ్లి వేడుకల్లో జరిగిన ఆత్మాహుతి దాడి పెను విషాదం మిగిల్చిన సంగతి తెలిసిందే. పేలుడు దాటికి 63 మంది మరణించగా.. 182 మంది తీవ్రంగా గాయపడటం అందరినీ కలిచివేసింది. చదవండి : పెళ్లిలో ఆత్మాహుతి దాడి..!; 63 మంది మృతి -
పెళ్లిలో ఆత్మాహుతి దాడి..!; 63 మంది మృతి
కాబూల్: ఓ పెళ్లి వేడుకల్లో తీరని విషాదం చోటుచేసుకుంది. ఆనందోత్సాహాల్లో సాగిపోతున్న ఆ కార్యక్రమంలో భారీ బాంబు విస్పోటనం సంభవించింది. ఈ ఘటన అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పేలుడు ధాటికి 63 మంది మరణించగా.. 182 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పెళ్లి వేడుకల్లో సుమారు 1200 మంది పాల్గొన్నట్టు సమాచారం. భారీ ఎత్తున ప్రాణ నష్టం జరగడంతో ఫంక్షన్ హాల్ ప్రాంతమంతా శవాల దిబ్బను తలపిస్తోంది. ఓ పెండ్లి వేడుకలో ఈ ఘటన జరిగిందని దేశ అంతర్గత వ్యవహారాలశాఖ ప్రతినిధి నస్రత్ రహీమి వెల్లడించారు. ఇది ఆత్మహుతి దాడి కావొచ్చునని అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రతినిధి సెడిడ్ సిద్దిఖీ ట్విటర్లో అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు. పశ్చిమ కాబూల్లోని ‘దుబాయ్ సిటీ’ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో షియా హజారా జాతికి చెందినవారు ఎక్కువగా నివసిస్తుంటారు. షియా హజారా ప్రజలపై కావాలనే ఎవరైనా కక్ష పూరితంగా వ్యవహరించారా తెలియాల్సి ఉంది. -
కాబూల్లో భారీ బాంబు పేలుడు
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో బుధవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. స్థానిక పోలీస్స్టేషన్కు దగ్గర్లోనే ఈ దాడి చోటుచేసుకుంది. ఈ దాడికి తమదే బాధ్యత అని తాలిబన్ ఉగ్రవాదులు ప్రకటించారు. కారు బాంబుతో దాడి జరిగిందని ప్రభుత్వం చెప్పినప్పటికీ, తాలిబన్ మాత్రం ట్రక్ బాంబ్తో ఈ పేలుడు జరిపినట్లు ప్రకటించారు. ఈ దాడిలో 14 మంది అక్కడిక్కడే మృతి చెందగా, 145 మంది గాయపడ్డారు. అమెరికా సైన్యాలు అఫ్గాన్ విడిచి వెళ్లేందుకు, దోహాలో తాలిబన్లకు, యూఎస్ బలగాలకు మధ్య ఎనిమిదో దఫా చర్చలు జరుగుతుండగానే ఈ దాడి జరగడం గమనార్హం. స్థానిక కాలమానం ప్రకారం రద్దీగా ఉండే ఉదయం 9 గంటల సమయంలో పేలుడు సంభవించింది. బాంబు పేలుడు శబ్దం పశ్చిమ కాబూల్ అంతా మారు మోగింది. పేలుడు అనంతరం చాలా మంది మహిళలు తమ భర్తల కోసం, పిల్లల కోసం ఏడుస్తూ కనిపించారంటూ స్థానిక జర్నలిస్ట్ జకేరియా హసాని తెలిపారు. పేలుడు ధాటికి కిలోమీటరు పరిధిలోని దాదాపు 20 దుకాణాల గాజు కిటికీలు పగిలిపోయానని దుకాణదారుడు అహ్మద్ సాలేహ్ తెలిపారు. గాయపడిన 145 మందిలో దాదాపు 92 మంది సాధారణ పౌరులు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. ఈ దాడితో మరణించిన, గాయపడిన వారి సంఖ్య ఒక్క నెలలోనే దాదాపు 1500కు చేరింది. ఈ దాడికి ముందుగా కాబూల్లో ఐఎస్ ఉగ్రవాదులు తలదాచుకుంటున్న ఇళ్లను అఫ్గాన్ బలగాలు ధ్వంసం చేశాయి. -
బాంబు పేలుడు..34 మంది మృతి!
కాబూల్: ఆఫ్గనిస్తాన్లో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. హరాత్-కాందహార్ జాతీయ రహదారిపై బాంబులతో విరుచుకుపడ్డాయి. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో సుమారుగా 34 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. కాగా అఫ్గాన్ ప్రభుత్వం, దాని మిత్ర దేశాలకు తాలిబన్లకు జరుగుతున్న యుద్ధంతో... గత కొన్ని రోజులుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో మంగళవారం తాలిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మరణించగా.. మరో 23 మంది తీవ్రగాయాలపాలయ్యారు. -
సిటీలో విస్ఫోటనం
సాక్షి, బెంగళూరు: సమయం.. ఆదివారం ఉదయం 9.45 గంటలు.. ప్రాంతం.. బెంగళూరులోని వయ్యాలికావల్ 11వ బీ క్రాస్ రాజరాజేశ్వరి నగర ఎమ్మెల్యే మునిరత్న నివాసం వద్ద భారీ విస్ఫోటం.. ఈ సంఘటనలో ఎమ్మెల్యే అనుచరుడు వెంకటేష్ (45) అక్కడికక్కడే మరణించారు. పేలుడుకు మృతదేహం గుర్తుపట్టలేనంతగాచితికిపోయింది. నగరం నడిబొడ్డున పేలుడు జరగడంతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. మూడు నాలుగు వందల మీటర్ల వరకు పేలుడు శబ్ధం ప్రతిధ్వనించింది. దీంతో జనం ఏం జరిగిందోనని కలవరపాటుకు గురయ్యారు. పేలుడు సంగతి దావానలంలా వ్యాపించడంతో ఘటనాస్థలికి తరలివచ్చారు. ఎమ్మెల్యేకు ఉన్న పలు నివాస భవనాల్లో ఇది కూడా ఒకటి. పేలుడు తీవ్రతకు గోడలకు పగుళ్లు వచ్చాయి. ముమ్మరంగా పరిశోధన సంఘటన స్థలంలో బాంబు స్క్వాడ్ బృందం, జాగిలాలను వెంటనే పిలిపించి పరిశీలించారు. న గర పోలీస్ కమిషనర్ సునీల్కుమార్ ఘటనాస్థలికి చేరుకుని పర్యవేక్షించారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాతే పేలుడుకు కారణాలు తెలిసే అవకాశం ఉందని ఆయన అన్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఎవరు సంచరించకుండా గట్టి పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ సిబ్బంది పేలుడు శకలాలను, మృతదేహం నమూనాలను సేకరించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ ముమ్మరంగా శోధించింది. సంఘటనాస్థలంలో ఫోరెన్సిక్, బాంబు నిపుణుల తనిఖీలు భారీశబ్ధం, జనం భయభ్రాంతులు పేలుడుతో ప్రభావంతో చుట్టుపక్కల ప్రాంతాలైన మల్లేశ్వరం, వయ్యలికావల్, ఇతరత్ర చుట్టుపక్కల ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది. పరిసర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అసలు పేలుడు వెనుక కారణాలు ఏంటో తెలియక తికమకపడ్డారు. వెంకటేశ్ వృత్తిరీత్యా ఒక ధోబీ– టైలర్ అని సమాచారం. ఆయనకు ఇద్దరు అన్నలు, ఒక తమ్ముడు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం నుంచి వయ్యాలికావల్లో ఉంటున్న వెంకటేశ్కు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆయన కొత్త ఇల్లు కట్టే ప్రయత్నాలు ఉండేవారు. ఎమ్మెల్యే మునిరత్నకు వెంకటేష్ ఒక బాల్య స్నేహితుడు కావడం గమనార్హం. ఎమ్మెల్యే విచారం ఎమ్మెల్యే మునిరత్న మాట్లాడుతూ ఎవరూ ఎలాంటి ఊహాగానాలను, పుకార్లను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వెంకటేష్ మరణం తననెంతో కలచి వేసిందన్నారు. వెంకటేష్, తాను కలసి చిన్నతనంలో ఆడుకునేవారమని చెప్పారు. ఏమిటీ కారణం పాత ఇంటిని కూల్చి కొత్త ఇంటిని నిర్మాణ పనిలో వెంకటేశ్ ఉన్నాడు. ఆదివారం ఉదయం కొత్త ఇంటికి అమర్చే కిటికీలు, తలుపులు, తదితర వస్తువులను పరిశీలించేందుకు వచ్చిన వెంకటేశ్ పేలుడుకు బలయ్యారు. ఎమ్మెల్యే నివాసం ఎదురుగా సుమారు 400 చ.అ ఖాళీ స్థలం ఉంది.అందులో కొత్త కట్టడానికి సంబంధించిన సామగ్రి ఉంది. ప్లాస్టిక్ మౌల్డింగ్ కోసం వినియోగించే ఉద్ధేశంతో తీసుకొచ్చిన కొన్ని రసాయనాల వల్ల పేలుడు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. రసాయనాల డబ్బాలను తెరిచే ప్రయత్నంలో పేలుడు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ రసాయనాలను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిని సరఫరా చేసిన వ్యక్తిని విచారిస్తామని చెప్పారు. లేక నిజంగా బాంబులే పేలాయా? అన్నది విచారణలో తెలుస్తుందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
భద్రతా వలయంలో భాగ్యనగరం
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలోని మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగిన రోజైన మే 18 (శనివారం) నేపథ్యంలో నగర పోలీసు విభాగం పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేపట్టింది. చార్మినార్ సమీపంలోని మక్కా మసీదులో 2007 మే 18న బాంబు పేలుడు జరిగిన విషయం విదితమే. నగరంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో గతానికి భిన్నంగా జాగ్రత్తలు తీసుకుంటోంది. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బందోబస్తు కోసం సీసీఎస్, సిట్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్ఫోర్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, టీఎస్ఎస్పీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్ఏఎఫ్, క్యూఆర్టీ బలగాలను మోహరిస్తున్నారు. బందోబస్తు ఏర్పాట్ల నేపథ్యంలో నగర పోలీసు విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. వీరికి తోడు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న సాయుధ బలగాలను రంగంలోకి దింపుతున్నారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు. అనుమానిత ప్రాంతాలు, వ్యక్తులపై నిఘా ఏర్పాటుకు పెద్ద ఎత్తున పోలీసులను మఫ్టీలో మోహరిస్తున్నారు. గతంలో సమస్యాత్మక పరిణామాలకు ఒడిగట్టిన వ్యక్తులను అనునిత్యం వెంటాడేందుకుగాను షాడో టీమ్లను ఏర్పాటు చేశారు. క్విక్ రియాక్షన్ టీమ్తో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రైకింగ్ ఫోర్స్లను అన్ని వేళలా అందుబాటులో ఉంచుతున్నారు. లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తూ నిఘా ఉంచారు. పాతబస్తీతో పాటు దక్షిణ మండలం, పశ్చిమ మండలం, తూర్పు మండలాల్లోనూ అడుగడుగునా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఇందుకుగాను అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. నగర వ్యాప్తంగా బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీలు చేయనున్నాయి. ఈ బందోబస్తు పర్యవేక్షణ కోసం కొందరు ఐపీఎస్ అధికారులు, ఇతర సీనియర్ అధికారులకు ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనికి సంబంధించిన జాబితాను కమిషనర్ కార్యాలయం సిద్ధం చేసింది. వీరు శనివారం ఆద్యంతం ఆయా ప్రాంతాలకు బాధ్యత వహించనున్నారు. అధికారి ఇన్చార్జ్ శికా గోయల్, అదనపు సీపీ ⇔ సౌత్ జోన్ డీఎస్ చౌహాన్, అదనపు సీపీ ⇔ నగరం మొత్తం పర్యవేక్షణ టి.మురళీకృష్ణ, అదనపు సీపీ⇔ మాదన్నపేట, సైదాబాద్ అవినాష్ మహంతి, సంయుక్త సీపీ⇔ గోషామహల్, ఆసిఫ్నగర్ డివిజన్లు బీఎస్పీ రవికుమార్, కమాండెంట్⇔మీర్చౌక్, చార్మినార్ డివిజన్లు ఐఆర్ఎస్ మూర్తి, కమాండెంట్ ⇔సంతోష్నగర్ డివిజన్ ఎంఏ బారీ, అదనపు డీసీపీ ⇔ అంబర్పేట జి.జోగయ్య, అదనపు డీసీపీ ⇔ మొఘల్పుర, భవానీనగర్ ఎంఆర్ బేగ్, కమాండెంట్ ⇔ చార్మినార్/మక్కా మసీదు ఎం.కృష్ణారెడ్డి, అదనపు డీసీపీ ⇔ టప్పాచబుత్ర, కుల్సుంపుర వి.దేవేందర్కుమార్, అదనపు డీసీపీ ⇔ బాంబు నిర్వీర్య బృందాలు మద్దిపాటి శ్రీనివాసరావు, అదనపు డీసీపీ ⇔ మంగళ్హాట్, షాహినాయత్గంజ్ కేఎన్ విజయ్కుమార్, ఏసీపీ⇔ అంబర్పేట్ ఎన్బీ రత్నం, ఏసీపీ ⇔ హుస్సేనిఆలం, షాలిబండ -
కొడుకా సురేశా..
సిద్దిపేటరూరల్: కట్టుకున్న భార్య అనారోగ్యంతో మృతి చెందింది. చెట్టంత ఎదిగిన కొడుకు చదువుకొని ప్రయోజకుడిగా మారి అండగా నిలుస్తాడని ఆ తండ్రి కన్న కలలు ఒక్క క్షణంలో అడియాశలయ్యాయి. మరో రెండు రోజుల్లో సెమిస్టర్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థి పేలుళ్ల రాయి మృత్యు రూపంలో కబలించింది. కళ్లముందే చెట్టంత కొడుకు విగతజీవిగా పడి ఉండడం చూసిన ఆ తండ్రి కన్నీరు మున్నీరయ్యాడు. స్థానికంగా ఒక ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్న సురేశ్ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు వసతి గృహంపై అంతస్తులో చదువకుంటున్నాడు. ఇదే సమయంలో సమీపంలోనే ప్రాజెక్టు కెనాల్ పనులు కొనసాగుతున్నాయి. బండలను బ్లాస్టింగ్ చేసే క్రమంలో సిబ్బంది జిలెటెన్ స్టిక్కులను అమర్చి బండలను పేల్చివేశారు. పేలుళ్ల తాకిడికి ఒక రాయి ఎగిరి వచ్చి వసతి గృహంపైన ఆరుబయట చదువుకుంటున్న సురేశ్ తలపై పడింది. వెంటనే తీవ్ర రక్త స్రావంతో సురేశ్ అక్కడికక్కడే మృతి చెందడం, మరో విద్యార్థికి గాయాలయ్యాయి, విషయం తెలసుకున్న విద్యార్థి కుటుంబ సభ్యులు రోదిస్తూ సంఘటన స్థలానికి చేరుకొని వసతిగృహం ముందు ఆందోళన చేపట్టారు. చదువుకునేందుకు అంతస్తుపైకి.. ప్రత్యక్ష సాక్షుల, పోలీసుల కథనం ప్రకారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన చిట్ల సురేశ్(19) సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నాడు. వెనకబడిన తరగతులకు చెందిన సురేశ్ సిద్దిపేట మండలం తోర్నాల శివారులోని బీసీ సంక్షేమ వసతి గృహంలొ ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఈనెల 20 నుంచి సెమిస్టర్పరీక్షలు కొనసాగనున్న క్రమంలో సురేష్ సహచర విద్యార్థులతో కలిసి తోర్నాల వసతి గృహంలోనే ఉండి ప్రతీ రోజు పునశ్చరణ చేస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వసతి గృహంపై అంతస్తుపై చదువుకుందామని తన స్నేహితుడైన శ్రీనివాస్తో కలిసి వెళ్లాడు. ఈ సమయంలో సమీపంలోనే ప్రాజెక్టు కెనాల్కు సంబంధించిన నిర్మాణంలో భాగంగా బండరాళ్లను పగల కొట్టేందుకు జిలెటిన్ స్టిక్లతో పేలుళ్లకు పాల్పడ్డారు. పెద్ద ఎత్తున పేలుళ్లకు బండరాళ్లు గాలిలోకి ఎగిరి చెల్లాచెదురుగా పడ్డాయి. అందులో ఒక పెద్దరాయి సమీపంలోని వసతి గృహంపైన చదువుకుంటున్న చల్మెడకు చెందిన సురేశ్ తలపై పడింది. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి సురేశ్ అక్కడికక్కడే కిందపడి మృతి చెందాడు. సురేశ్పై పడిన రాయి పక్కనే చదువుకుంటున్న మరొక విద్యార్థి శ్రీనివాస్చేతిపై పడి తీవ్ర గాయం చేసింది. విషయాన్ని సహచర విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన, అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ రామేశ్వర్ బలగాలతో తోర్నాల వసతి గృహానికి చేరుకున్నారు. అప్పటికే తండ్రి, కుటుంబీకులు వసతి గృహం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని శాంతింప జేసే ప్రయత్నం చేసినప్పటికి కుటుంబీకులు ఆందోళనను విరమించలేరు. ఒకదశలో న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అందుబాటులో ఉండని వార్డెన్.. వసతి గృహానికి చెందిన వార్డెన్ సరైన క్రమంలో విధులు హాజరుకాలేడని, గతంలో కూడా ఇదే విధంగా సరిగ్గా విధులకు హాజరు అయ్యేవాడని విద్యార్థులు పేర్కొన్నారు. ఒక వేళ వార్డెన్ ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి జరిగేది ఉండేది కాదని విద్యార్థులు, మృతుని కుటుంబీకులు ఆవేద«న వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటాం సిద్దిపేట నియోజకవర్గం తోర్నాల గ్రామ పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా జరిగిన సంఘటనపై మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్కాలువ పనులు కోసం రాళ్లను బ్లాస్టింగ్ చేసే సమయంలో మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర దిగ్భాంతికి లోనయ్యారు. సంఘటన బాధకరమని జరిగిన సంఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన విద్యార్థి« కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించి అన్ని విధాల ఆదుకుంటామని ప్రభుత్వం ఆండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. – ఎమ్మెల్యే హరీశ్రావు చల్మెడలో విషాద ఛాయలు రామాయంపేట, నిజాంపేట(మెదక్): సిద్దిపేట జిల్లా తోర్నాలవద్ద శుక్రవారం బ్లాస్టింగ్లో నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన చిట్టె సురేశ్(19) అనే విద్యార్థి మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సురేశ్ మృతి విషయం తెలుసకున్న గ్రామ సర్పంచ్ నర్సిహారెడ్డి, మృతుని కుటుంబసభ్యులు, అతని స్నేహితులు సంఘటనాస్థలికి తరలివెళ్లారు. మృతుడు సురేశ్ కుటుంబానికి ఆర్థికసాయం అందజేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
లాహోర్లో పేలుడు, పోలీసులు మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లోని లాహోర్లో బుధవారం ఉదయం జరిగిన పేలుళ్లలో ముగ్గురు పోలీస్ అధికారులుతో సహా తొమ్మిదిమంది మృతి చెందారు. మరో 24మంది గాయపడ్డారు. ప్రసిద్ధిగాంచిన దాతా దర్బార్ షరీన్ వెలుపల ఈ పేలుళ్లు సంభవించాయి. పోలీసులను లక్ష్యంగా చేసుకుని... పోలీస్ వాహనాలకు దగ్గరలో బాంబు పేలింది. బాంబు పేలుడు ధాటికి పలు వాహనలు ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల భవనాలు అద్దాలు పలిగిపోయాయి. ఇవాళ ఉదయం 8:45 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. గాయపడినవారిలో ఎనిమిదిమంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా పోలీసులే లక్ష్యంగా దాడి జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదని పంజాబ్ ఐజీ ఆరీఫ్ నవాజ్ తెలిపారు. కాగా అత్యంత ప్రసిద్ధి గాంచిన దాతా దర్బార్ షరీన్ను సందర్శించుకునేందుకు ప్రతి ఏడాది పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడకు తరలివస్తారు. తాజా దాడుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. -
పొలంలో పేలిన నాటుబాంబు
చీడికాడ(మాడుగుల): అర్జునగిరిలో అడవిపందుల వేటకోసం పొలంలో అమర్చిన నాటుబాంబు పేలింది. ఈ ప్రమాదం నుంచి రైతులు త్రుటిలో తప్పించుకోగా, పెంపుడుకుక్క మృతి చెందింది. దీనికి సంబంధించి స్థానిక రైతులు అందించిన వివరాలిలా ఉన్నాయి.గ్రామానికి చెందిన అప్పన్నబంద ఇస్తువా కళ్లాలకు సమీపంలో గల గరువుల్లోకి సోమవారం సాయంత్రం రైతులు గెంజి అక్కులు,పెంటకోట చిన్నారి,శ్రీనులు... పశువులను మేతకు తోలుకెళ్లారు. వీరితో పాటు చిన్నారి పెంచుకుంటున్న కుక్క వెళ్లింది. పెంటకోట సూరిబాబుకు చెందిన చెరకుతోట నరికి వేసిన గరువు గట్టు పక్కన అడవి పందుల వేటకోసం అమర్చిన నాటుబాంబును కుక్క నోటకరిచింది. వెంటనే అది పెద్ద శబ్దంతో పేలింది. దీంతో కుక్క ఎరిగిపడింది. సమీపంలో ఉన్న రైతులు ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. వారు వెంటనే వెళ్లి పరిశీలించగా కుక్క తలభాగం తునాతునకలైంది. అప్పటి వరకు అదే గరువులో చిన్నారి మనమరాలైన మేఘన,ఆశిన్ తిరిగారు.వీరితో పాటు పశువులు ఉన్నాయి.అదృష్టం కొద్దీ ఆబాంబును వీరు తొక్కలేదని రైతులు తెలిపారు. అడవి పందుల వేట కోసమే..: అడవి పందులను వేటాడడానికే వేటగాళ్లు బాంబులను అమర్చారని రైతులు ఆరోపించారు. పక్క గ్రామమైన తురువోలుకు చెందిన నలుగురు అడవిపంది వేటగాళ్లు వారం రోజుల కిందట ఎక్కడో హతమార్చిన రెండు పందులను తెచ్చి ఈ కళ్లాల వద్దే మాంసం విక్రయాలు సాగించారన్నారు. అప్పడే వారిని హెచ్చరించామన్నారు.అయినా పట్టించుకోకుండా తమ పొలాల్లోనే బాంబులు అమర్చారన్నారు. ఆ నలుగురు వేటగాళ్లను మంగళవారం పంచాయతీకి రప్పించి ప్రశ్నంచామన్నారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు.దీనిపై పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేయనున్నట్టు రైతులు తెలిపారు. -
శ్రీకాకుళంలో పేలిన మందుగుండు సామాగ్రి
-
శ్రీకాకుళంలో పేలిన మందుగుండు సామాగ్రి
సాక్షి, శ్రీకాకుళం: ఓ ఇంట్లో దాచి ఉంచిన ముందుగుండు సామాగ్రి పేలడం జిల్లాలో కలకలం రేపింది. లక్ష్మీ టాకీస్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి జనావాసాలు మధ్య ఉన్న ఇళ్లు కుప్పకూలింది. పరిసరాల్లోని మరో నాలుగైదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నాటు బాంబులు తయారు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అడవి పందులను వేటాడం కోసం ఆ ఇంట్లో ఉంటున్నవారు ఈ బాంబులు తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ ఇంట్లో నివసిస్తున్నవారికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున నాటు బాంబుల తయారీ జరుగుతున్న అధికారులు గుర్తించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
శ్రీలంకలో మరో పేలుడు
కొలంబో: శ్రీలంక వరుస పేలుళ్లతో అతలాకుతలమవుతోంది. గురువారం ఉదయం మరో బాంబు పేలుడు సంభవించింది. శ్రీలంక రాజధాని కొలంబోకి 40కిలోమీటర్ల దూరంలో పుగోడా జిల్లాలో జరిగిన ఈ పేలుడు మెజిస్ట్రేట్ కోర్టుకు చెందిన ఖాళీ ప్రదేశంలో సంభవించిన ఈ పేలుడుతో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఉదయం 9.30కు బాంబు పేలిందని, ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని శ్రీలంక పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. గత ఆదివారం జరిగిన ఎనిమిది బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 359కి పెరిగింది. -
కూతవేటు దూరంలో పేలుళ్లు
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: శ్రీలంకలో పేలుళ్లకు ముందు రోజు ఆ దేశానికి కర్ణాటక నుండి టూర్ వెళ్లిన సుమారు 15 మంది మంగళవారం సాయంత్రం శ్రీలంక నుండి తిరిగివచ్చారు. కెంపేగౌడ ఎయిర్పోర్టులో దిగిన వారందరినీ కుటుంబ సభ్యులు ఆనందభాష్పాలతో స్వాగతించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బెంగళూరు బాగలగుంటె నివాసులయిన నవీన్, ప్రవీణ్, కిట్టి తదితరులు ప్రాణాలతో ఇండియాకు తిరిగి వస్తామనుకోలేదన్నారు. బ్లాస్ట్ జరిగిన షాంగ్రిల్లా హోటల్ పక్కనే మరో హోటల్లో తామంతా దిగామని, పేలుళ్లు సంభవించడానికి 20 నిమిషాల ముందు బయటకు వచ్చి తిరగడానికి బయలుదేరామన్నారు. ట్యాక్సీలో కొంతదూరం వెళ్లగానే ట్యాక్సీ డ్రైవర్కు ఫోన్ వచ్చిందని, వెంటనే తామంతా సంఘటనాస్థలానికి వచ్చామన్నారు. పేలుళ్లలో మృతి చెందిన ఏడుగురు జేడీఎస్ నాయకుల మృతదేహాలను తామే గుర్తించామని చెప్పారు. తమకు భారత రాయబారి కార్యాలయం వారు సహాయం చేసారని, జీవితంలో ఆ సంఘటనను మర్చిపోలేమన్నారు. -
త్రుటిలో తప్పించుకున్న అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: శ్రీలంకలో ఉగ్రవాదుల పేలుళ్ల ఘటనను ప్రత్యక్షంగా చూడటంతో పాటు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్. శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ ప్రార్థనలు జరిగిన చర్చితో పాటు కింగ్స్జ్యూరీ హోటల్లో ఉగ్రవాదుల దుశ్చర్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ మారణహోమంలో సుమారు 300 మంది మృత్యువాత పడగా, 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన సమయంలో అమర్నాథ్ అక్కడే ఉన్నారు. స్నేహితులతో టూర్కి వెళ్లిన ఆయన కింగ్స్జ్యూరీ హోటల్కు చెందిన ఫ్లాట్లోనే బసచేశారు. పేలుళ్ల సమయంలో కూడా ఫ్లాట్లోనే ఉన్నారు. ఈయన బసచేసిన పక్క అపార్ట్మెంట్లో కూడా పేలుళ్లు జరిగాయి. ఘటన జరిగిన వెంటనే ఆయన స్నేహితులతో కలిసి ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. వాస్తవానికి టూర్ షెడ్యూల్ ప్రకారం సోమవారం రాత్రి శ్రీలంక నుంచి బయలుదేరాలి. కాని ఈ ఘటనతో ఆదివారం ఉదయమే ఎయిర్పోర్ట్కు చేరుకోగా అక్కడ కూడా బాంబులు పెట్టారన్న సమాచారంతో విమాన రాకపోకలను నిలిపివేశారు. దీంతో రాత్రంతా ఎయిర్పోర్ట్లోనే ఉండి ఉదయం చెన్నై విమానం ఎక్కి అక్కడి నుంచి సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఈ ఘటనపై అమర్నాథ్ సాక్షితో మాట్లాడుతూ దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానమే తమను ఆ ఘటన నుంచి రక్షించాయన్నారు. అమర్తో పాటు శ్రీలంక వెళ్లిన వారితో వైఎస్సార్సీపీ నేత శ్రీకాంత్రాజు కూడా ఉన్నారు. -
విహార యాత్ర.. విషాదఘోష
విహారయాత్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విదేశంలో కులాసాగా గడిపివద్దామని బయల్దేరి మిత్రబృందం అదే చివరియాత్రగామారుతుందనుకోలేదు. మృతులు: కేజీ హనుమంతరాయప్ప, రమేశ్ గౌడ, కేఎం లక్ష్మీనారాయణ, శివణ్ణ, రంగప్పమిస్సయినవారు: . మారేగౌడ, పుట్టరాజు సాక్షి బెంగళూరు/తుమకూరు/ దొడ్డబళ్లాపురం: శ్రీలంకలో బాంబు పేలుళ్లలో బెంగళూరు, తుమకూరు ప్రాంతాలకు చెందిన ఐదుగురు జేడీఎస్ నాయకులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు ఆచూకీ తెలియడం లేదు. కర్ణాటకలో ఎన్నికలప్రచారం అనంతరం జేడీఎస్ నేతలు శ్రీలంకకు వెళ్లారు. రాజధాని కొలొంబోలో ని షాంగ్రి లా హోటల్లో రెండుగదుల్లో బస చేసినట్లు సమాచారం. 21వ తేదీన ఆ హోటల్లో పేలుడు సంభవించాయి. తుమకూరులో విషాదం తుమకూరు నగరంలో సరస్వతిపురంలో నివసిస్తున్న జేడీఎస్ పార్టీ నేత రమేశ్గౌడ (48) పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపారు. ఎన్నికలు ముగియగానే కొందరు స్నేహితులు, జేడీఎస్ నేతలతో కలసి శ్రీలంక పర్యటనకు వెళ్లారు. షాంగ్రి లా హోటల్లో పేలుడుకు బలయ్యారు. రమేశ్గౌడ మృతి చెందినుట్ల ప్రసార మాధ్యమాల్లో వార్తలతో భార్య మంజుళ పిల్లలు దిశ, శోభిత్లు కన్నీరుమున్నీరుగా విలపించారు.నగర జేడీఎస్ నేతలతో పాటు ఇతరపార్టీల నేతలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. జేడీఎస్ నేతలతో పాటు బీజేపీ ఎమ్మెల్యే జ్యోతిగణేశ్ రమేశ్గౌడ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బెంగళూరు రూరల్లో నలుగురు బెంగళూరు ఉత్తర తాలూకా అడకిమారనహళ్లికి చెందిన మారేగౌడ, హారోక్యాతనహళ్లి పుట్టరాజు, నెలమంగల తాలూకా గోవేనహళ్లి గ్రామం నివాసి శివణ్ణ, కాచనహళ్లి గ్రామం నివాసి మునియప్ప, లక్ష్మినారాయణ, బెంగళూరు 8వ మైలు హనుమంతరాయప్పలు శ్రీలంక టూర్కి వెళ్లారు. షాంగ్రిలాలో హోటల్లో మకాం వేశారు. పేలుడు ఘటనలో హనుమంతరాయప్ప, లక్ష్మినారాయణ, మునియప్ప, శివణ్ణ మృతి చెందారని తెలిసింది. మారేగౌడ, పుట్టరాజుల ఆచూకీ తెలియడం లేదు. సోమ వారం మాజీ సీఎం వీరప్ప మొయిలీ, నెలమంగల ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి, ఇతర జేడీఎస్ నేతలు మృతుల కుటుంబాలను పరామర్శించారు.సోమవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఇ.కృష్ణప్ప, ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి, జేడీఎస్ నాయకులు తిమ్మరాయ ప్ప, మృతుల కుటుంబ సభ్యులు మొత్తం 8 మంది శ్రీలంక బయలుదేరి వెళ్లారు. ఉపరాష్ట్రపతి ఖండన శ్రీలంకలోని కొలంబోలో జరిగిన బాంబు దాడులను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదుల నిర్మూలనకు అందరు ఏకం కావాలని సోమవారం బెంగళూరు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పిలుపునిచ్చారు. శ్రీలంక పర్యటనలో ఉన్న చాలామంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఉగ్రవాదుల దాడులతో ఏ దేశమూ సురక్షితంగా ఉండబోదన్నారు. దేవెగౌడ, కుమారస్వామి ఆవేదన కొలంబోలో అదృశ్యమైన భారతీయులు సురక్షితంగా తిరిగి రావాలని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అన్నారు. బాంబు పేలుళ్లలో సుమారు 300 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. జేడీఎస్ నేతల మృతిపై సీఎం కుమారస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తోడుగా ఉంటామని , గల్లంతైన నేతల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సహాయక చర్యలకు సీనియర్ ఐఏఎస్ అంజుమ్ ఫర్వేజ్ను నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన డీసీఎం తుమకూరు : శ్రీలంక రాజధానిలో సంభవించిన బాంబు పేలుళ్లలో మృతి చెందిన జేడీఎస్ నేత రమేశ్గౌడ కుటుంబ సభ్యులను ఉపముఖ్యమంత్రి పరమేశ్వర్ పరామర్శించారు. రమేశ్గౌడ మరణం తమను కలచివేసిందని రమేశ్గౌడ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే జ్యోతిగణేశ్ మాట్లాడుతూ... రమేశ్, తాను కళాశాల స్నేహితులమని, శ్రీలంక పేలుళ్లలో తాన ఆప్తుడిని కోల్పోవడం తీవ్రంగా బాధిస్తోందన్నారు. రమేశ్ మృతి వార్తతో రమేశ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల రోదనలతో సరస్వతీపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
దివ్య సందేశంపై రాక్షస కృత్యం!
కొలంబో: ద్వీపదేశం శ్రీలంక నెత్తురోడింది. క్రైస్తవులకు ప్రధానమైన ఈస్టర్ పండుగనాడు నరహంతకులు మారణహోమం సృష్టించారు. రాజధాని కొలంబోతోపాటు నెగొంబో, బట్టికలోవా పట్టణాల్లో బాంబుల మోత మోగించారు. చర్చిలు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఆదివారం జరిగిన మొత్తం 8 వరుస పేలుళ్లలో 215మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికిపైగా గాయపడ్డారు. పేలుళ్ల అనంతరం ప్రభుత్వం నిరవధిక కర్ఫ్యూ విధించింది. ఈ పేలుళ్లలో మొత్తం 33 మంది విదేశీ యులు మరణించారు. చనిపోయిన వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ధ్రువీకరించారు. లక్ష్మి, నారాయణ్ చంద్రశేఖర్, రమేశ్ అనే ముగ్గురు భారతీయులు మరణించారనీ, వీరి గురించిన అధిక వివరాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని సుష్మ తెలిపారు. మిగిలిన 21 మంది విదేశీయుల మృతదేహాలను గుర్తించేపనిలో ఉన్నా మని శ్రీలంక అధికారులు వెల్లడించారు. ఈస్టర్ సందర్భంగా చర్చిల్లో సామూహికంగా ప్రార్థనలు చేసుకుంటుండగా ఈ పేలుళ్లు సంభవించాయి. మొత్తం 3 చర్చిలు, మూడు హోటళ్లు, జూ వద్ద, మరో ఇంట్లో దుండగులు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడులను పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా ఖండించారు. వాటికన్ సిటీలో ఇచ్చిన సందేశంలో ఈ ఘటనను దారుణ హింసగా అభివర్ణించారు. ఆదివారం ఉత్తర కొలంబోలోని సెయింట్ సెబాస్టియన్స్ చర్చిలో ప్రార్ధనల సమయంలో చోటుచేసుకున్న భారీ పేలుడుతో బీతావాహ దృశ్యం.. దశాబ్దం తర్వాత మళ్లీ విధ్వంసం ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్)తో అంతర్యుద్ధం ముగిశాక గత దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న శ్రీలంకలో తాజా పేలుళ్లు మళ్లీ రక్తపాతాన్ని సృష్టించాయి. చర్చిలో ప్రార్థనలు చేస్తున్నవారితోపాటు, శ్రీలంకకు వచ్చి విలాసవంతమైన హోటళ్లలో ఉంటున్న విదేశీయులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. కొలంబోలోని సెయింట్ ఆంథోని చర్చి, నెగొంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చి, బట్టికలోవాలోని జియోన్ చర్చిలో ముందుగా ఉదయం 8.45 గంటలకు పేలుళ్లు సంభవించాయి. ప్రజలు ప్రశాంతంగాప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఈ పేలుళ్లు జరిగాయని పోలీస్ శాఖ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర చెప్పారు. పేలుళ్లలో విదేశీయులైన ఇద్దరు చైనీయులు, పోలండ్, డెన్మా ర్క్, జపాన్, పాకిస్తాన్, అమెరికా, మొరాకో, బంగ్లాదేశ్ల నుంచి ఒక్కొక్కరు కూడా మృతి చెందినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కొలంబో లోని ఐదు నక్షత్రాల హోటళ్లైన షాంగ్రీలా, సినమన్ గ్రాండ్, కింగ్స్బరిల్లోనూ ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారన్నారు. ఈ దాడికిపాల్పడింది తామేనని ఇంతవరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. శ్రీలంకలో గతంలో ఎల్టీటీఈ భయానక దాడులకు పాల్పడేది. శ్రీలంక నుంచి విడదీసి తమిళుల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఎల్టీటీఈ దాదాపు మూడు దశాబ్దాలు పోరాడింది. చివరకు 2009తో ఎల్టీటీఈ అధ్యక్షుడు వేళుపిళ్లై ప్రభాకరన్ను శ్రీలంక ఆర్మీ మట్టుబెట్టడంతో ఇక ఆ సంస్థ అంతరించిపోయింది. ఆత్మాహుతి దాడులేనని చెప్పలేం.. ఆదివారం జరిగిన ఎనిమిది బాంబు దాడులూ ఆత్మాహుతి దాడులేనని చెప్పడానికి పోలీసుల వద్ద ప్రస్తుతం ఎలాంటి ఆధారాలూ లేవనీ, అయితే నెగొంబో చర్చిలో పేలుడు తీరును పరిశీలిస్తే అది ఆత్మాహుతి దాడిలా అనిపిస్తోందని గుణశేఖర చెప్పారు. మరో అధికారి మాట్లాడుతూ సినమన్ గ్రాండ్ హోటల్ లోని రెస్టారెంట్ వద్ద ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నట్లు వెల్లడించారు. కొలంబోలోని జాతీయ ఆసుపత్రిలో 66 మృతదేహాలను ఉంచామనీ, గాయపడిన 260 మందికి అక్కడే చికిత్స అందిస్తున్నామని గుణశేఖర తెలిపారు. అలాగే నెగొంబో లోని మరో వైద్యశాలలో 104 మృతదేహాలు ఉండగా, 100 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. అనుమానంపై ఏడుగురిని అరెస్టు చేశా మని శ్రీలంక రక్షణ మంత్రి రువాన్ విజెవర్ధనే తెలిపారు. ఈ ఎనిమిది దాడులనూ ఒకే సంస్థ చేసిందని తాము భావిస్తున్నామన్నారు. దాడుల్లో మొత్తం 27 మంది విదేశీయులు చనిపోయారని శ్రీలంక విదేశాంగ కార్యదర్శి రవీంద్ర అరియసింఘె వెల్లడించారు. గాయపడిన విదేశీయుల్లో భారత్తోపాటు అమెరికా, మొరాకో, బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నారని మీడియా తెలిపింది. రాజధాని కొలంబోలోని జూ వద్ద జరిగిన మరో పేలుడులో ఇద్దరు మరణించారు. కొలంబో శివార్లలోని ఓ ఇంట్లో సోదాలు జరిపేందుకు పోలీసులు వెళ్లినప్పుడు మరో వ్యక్తి ఆత్మాహుతి దాడి చేసుకున్న ఘటనలో ముగ్గురు పోలీసు సిబ్బంది చనిపోయారు. ముందే హెచ్చరించినా.. శ్రీలంకలో త్వరలో ప్రధాన చర్చిలు లక్ష్యంగా బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని ఆ దేశ పోలీస్ చీఫ్ 10 రోజుల ముందుగానే హెచ్చరించారు. ఏప్రిల్ 11నే ఆయన నిఘా హెచ్చరికలను ఉన్నతాధికారులకు పంపారు. ‘నేషనల్ తోహీత్ జమాత్ (ఎన్టీజే) అనే సంస్థ చర్చిలు, కొలంబోని భారత దౌత్యకార్యాలయం లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు ప్రణాళికలు రచించినట్లు ఓ విదేశీ నిఘా సంస్థ నుంచి సమాచారం అం దింది’అని పోలీస్ చీఫ్ పుజుత్ జయసుందర ఆ హెచ్చరికలో పేర్కొన్నారు. అయినా శ్రీలంక పోలీసులు దాడులను ఆపలేకపోయారు. ముస్లిం సంస్థ అయిన ఎన్టీజే గతేడాది బౌద్ధ విగ్రహాలను ధ్వంసం చేయడంతో దాని పేరు వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ప్రధాని విక్రమసింఘే నిరవధిక కర్ఫ్యూ విధింపు ఎనిమిదో పేలుడు సంభవించిన వెంటనే శ్రీలంక ప్రభుత్వం నిరవధిక కర్ఫ్యూ విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇది అమల్లో ఉంటుందంది. ప్రజలు శాంతిని పాటించాలని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కోరారు. ‘ఈ అనూహ్య పరిణామాల వల్ల నేను విస్మయానికి గురయ్యాను. అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భద్రతా దళాలను కోరాం’అని ఆయన చెప్పారు. శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘె మాట్లాడుతూ ఇవి పిరికిపందలు చేసిన దాడులనీ, పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రజలు ఐక్యంగా, ధైర్యంగా ఉండాలని కోరారు. సెలవులో ఉన్న పోలీసులు, వైద్యులు, నర్సులు, వైద్యాధికారుల అందరి సెలవులను రద్దు చేసి తక్షణం విధుల్లో చేరాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. రాజధానిలోని మతపరమైన ప్రదేశాలతోపాటు బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను మరింత పెంచారు. తాత్కాలికంగా అన్ని సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారు. పాఠశాలలను సోమ, మంగళవారాల్లో, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు నిరవధికంగా మూసివేశారు. కొలంబో జిల్లాలో ఈస్టర్ ప్రార్థనలను రద్దు చేస్తున్నట్లు కార్డినల్ (క్రైస్తవ మతంలో ఓ పదవి) మాల్కొమ్ రంజిత్ చెప్పారు. ఎల్టీటీఈని అణచివేసిన నాటి అధ్యక్షుడు మహిందా రాజపక్స మాట్లాడుతూ ఇది ఆటవిక దాడి అని పేర్కొన్నారు. ఇలాంటి హింసాత్మక, ఉగ్రవాద, పిరికిపందల చర్యలను తాము సహించబోమనీ, దేశమంతా ఏకతాటిపైకి వచ్చి వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. ఎన్టీజే..హింసామార్గం శ్రీలంకలో చర్చిలపై నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్టీజే) దాడులు చేసే అవకాశముందని ఓ విదేశీ నిఘా సంస్థ శ్రీలంక ప్రభుత్వాన్ని 10రోజుల క్రితమే హెచ్చరించినట్లు విశ్వసనీయవర్గాలు తెలి పాయి. అయితే ఈ హెచ్చరికల్ని శ్రీలంక ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ముస్లిం అతివాదులు సభ్యులుగా ఉన్న ఎన్టీజే తొలి సారి 2013లో వెలుగులోకి వచ్చింది. 2013, జూన్లో ఎన్టీజే కార్యదర్శి అబ్దుల్ రెహ్మానీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గౌతమబుద్ధుడు నరమాంస భక్షకుడనీ, బౌద్ధమతం నరమాంస భక్షణను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. బౌద్ధుల ఆరాధనా విధానంపై విమర్శలు చేశారు. దీంతో 2014 మార్చిలో శ్రీలంకలో బౌద్ధులు–ముస్లింల మధ్య హింస చెలరేగడంతో ప్రభుత్వం 10 రోజుల పాటు ఎమర్జెన్సీని విధించాల్సి వచ్చింది. అక్కడితో ఆగకుండా ప్రజలను రెచ్చగొట్టేలా పలు వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ను 2016లో శ్రీలంక ప్రభుత్వం అరెస్ట్చేసింది. 2018లో ఈ సంస్థకు చెందిన కొందరు సభ్యులు గౌతమబుద్ధుని విగ్రహాలను ధ్వంసం చేసినట్లు స్థానిక మీడియాలో వార్తలు కూడా వచ్చా యి.వీరి వ్యవహారశైలి హద్దుదాటడంతో ఎన్టీజేపై నిషేధం విధించాలని పీస్ లివింగ్ ముస్లిమ్స్ ఇన్ శ్రీలంక(పీఎల్ఎంఎంఎస్ఎల్) డిమాండ్ చేసింది. కేవలం హిం సను ప్రోత్సహించడమే కాకుండా ఇస్లాంలో అతివాద వహాబీ భావజాలాన్ని ఎన్టీజే వ్యాప్తిచేస్తోందని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం శ్రీలంకలో 22 లక్షల మంది ప్రజలు ఉండగా వీరిలో బౌద్ధులు 70%, హిందువులు 12.5%, ముస్లింలు 10%, క్రైస్తవులు 7.5%ఉన్నారు. శ్రీలంకను వరుస బాంబు పేలుళ్లు అతలాకుతలం చేసిన నేపథ్యంలో కొలంబో బిషప్ దిలొరాజ్ కనగసబే భావోద్వేగంతో స్పందించారు. ‘30 ఏళ్ల పాటు అంతర్యుద్ధంతో సతమతమైన అనంతరం మన ప్రజలంతా కలసిమెలసి, ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. తమ–తమ జీవితాలను పునర్నిర్మించుకుంటున్నారు. ఇలాంటి సందర్భంగా చోటుచేసుకున్న ఈ దారుణ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. జీసస్ పునరుత్థానమైన రోజున తమ ప్రియమైనవారిని కోల్పోయి మనోవేదనను అనుభవిస్తున్న ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నా. శ్రీలంక లాంటి దేశంలో ఇలాంటి దుర్ఘటన జరగడం నిజంగా దురదృష్టకరం’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రజలంతా శాంతియుతంగా ఉండాలనీ, భగవంతుడిని ప్రార్థించాలని బిషప్ కనగసబే పిలుపునిచ్చారు. ‘ఈ దుర్ఘటనతో అల్లాడిపోతున్న ప్రతీఒక్కరి బాధను తగ్గించాలనీ, వారిపై దయ చూపాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. అలాగే విధ్వంసానికి వ్యతిరేకంగా, ప్రాణాలకు విలువ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని పేర్కొన్నారు. - కొలంబో బిషప్ భావోద్వేగ సందేశం హెల్ప్లైన్లు ప్రకటించిన భారత హైకమిషన్ శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని కొలంబోలోని భారత హైకమిషన్ తెలిపింది. బాంబు పేలుళ్లు, దాడులకు సంబంధించి ఎలాంటి సహాయం, సమాచారం, స్పష్టత కావాలన్నా భారతీయులు సంప్రదించవచ్చంటూ 5 హెల్ప్లైన్ నంబర్లను ప్రకటించింది. +94777902082, +94777903082, +94112422788, +94112422789, +94772234176 నంబర్లకు ఫోన్ చేసి భారతీయులు వివరాలు అడగొచ్చని హైకమిషన్ ట్విట్టర్లో తెలిపింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్పై శ్రీలంక ఆంక్షలు కొలంబో: వరుస బాంబు పేలుళ్లపై సోషల్ మీడియా లో విస్తృతమవుతున్న వదంతులను నిరోధించేందుకు శ్రీలంక ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లను ఆదివారం బ్లాక్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వదంతులు చెలరేగుతుండటంతో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని శ్రీలంక అధ్యక్ష కార్యాలయం తెలిపింది. బాంబు పేలుళ్లపై భద్రతాదళాల విచారణ సాగుతోందని, విచారణ కొలిక్కి వచ్చేదాగా సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు కొనసాగుతా యని ప్రకటించారు. ప్రజలు సహనంతో వ్యవహరిం చాలని, వదంతులను నమ్మవద్దని, వాటిని ప్రచారం చేయవద్దని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కూడా ట్వీట్ చేశారు. ఫేస్బుక్ కూడా బాంబు పేలుళ్లపై స్పందించేందుకు వీలుగా ఒక మాధ్యమాన్ని ప్రవేశ పెట్టిందని సీఎన్ఎన్ వర్గాలు వెల్లడించాయి. ప్రజలు ఘటనకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేం దుకు, తమ వారిని గుర్తించేందుకు, పేలుళ్ల ప్రభావానికి గురైన సన్నిహితులను చేరుకునేందుకు వీలుగా ఈ టూల్ ఉపయోగపడుతుం దని ఫేస్బుక్ వెల్లడించింది. ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, బాంబు పేలుళ్లకు అవకాశమున్న ప్రాంతాలలో గుంపులుగా ఉండవద్దని, ఆసుపత్రుల పరిసరాలకూ ప్రజలు రావొద్దని శ్రీలంక హోంశాఖ వర్గాలు ప్రజలకు పిలుపునిచ్చాయి. ఈస్టర్ రోజున జరిగిన ఉగ్ర దాడులు.. 2017 ఈజిప్టు 2017 ఏప్రిల్ 9న ఈజిప్ట్లోని టాంట, అలెగ్జాండ్రియా నగరాల్లో ఈస్టర్ పండగ రోజు జరిపిన బాంబు దాడిలో 45 మంది మరణించారు. ఈ దాడి నుంచి కాప్టిక్ పోప్ తవడ్రోస్ ఐఐ క్షేమంగా బయటపడ్డారు. దాడికి పాల్పడింది తామే అని డాయిష్ ప్రకటించింది. 2016 పాకిస్తాన్ లాహోర్లోని ఓ పార్క్లో ఈస్టర్ వేడుకలను జరుపుకుంటున్న వారిపై బాంబు దాడి జరిగింది. చిన్న పిల్లలు సహా మొత్తం 75 మంది ప్రాణాలు విడిచారు. వందల మంది గాయపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టింది తామే అని పాకిస్తానీ తాలిబన్ శాఖ జమత్–ఉల్–అహ్రార్ ప్రకటించుకుంది. 2012 నైజీరియా ఉత్తర నైజీరియాలో సాం స్కృతిక, ఆర్థిక నగరమైన ఖడునాలో 2012 ఏప్రిల్ 8న చర్చి వద్ద కారు బాంబుతో దాడి చేశారు. ఈ ఘటనలో 41 మంది మరణించారు. ఇస్లామిక్ సంస్థ బొకొ హరమ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. క్రిస్టియన్స్పై దాడులు.. 2019 ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్లో ముస్లిం ప్రాబల్యం ఉన్న జోలో ప్రాంతంలోని ద్వీపకల్పంలో 2019 జనవరి 27న క్యాథలిక్లపై జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 21 మంది మృత్యువాత పడ్డారు. ఈ దాడికి డాయిష్ బాధ్యత వహించింది. కానీ దాడికి పాల్పడింది అజంగ్–అజంగ్ సంస్థగా అధికారులు పేర్కొనారు. 2017 ఈజిప్ట్ 2017 మే 26న సెంట్రల్ మిన్య వద్ద సెయింట్ సామ్యూల్ ఆశ్రమానికి బస్సులో వెళ్తున్న కాప్టిక్ క్రిస్టియన్స్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది చనిపోయారు. కాల్పులకు తెగబడింది తామే అని డాయిష్ ప్రకటించుకుంది. 2016 కైరో చర్చిలో పార్థనలు చేస్తున్న కాప్టిక్ క్రిస్టియన్స్ లక్ష్యంగా 2016 డిసెంబర్ 11న జరిగిన ఆత్మాహుతి దాడిలో 29 మంది ప్రాణాలు వదిలారు. ఈ దాడికి సైతం డాయిష్ బాధ్యత వహించింది. 2016 యెమెన్ ఉగ్రవాదులు యెమెన్లోని అడెన్లో క్యాథలిక్ వృద్ధాశ్రమంపై జరిపిన దాడిలో 16 మంది చనిపోయారు. మరణించిన వారిలో కోల్కతాలోని మిషనరీ ఆఫ్ చారిటీకి చెందిన నలుగురు నన్లు కూడా ఉన్నారు. డాయిష్ ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. 2015 పాకిస్తాన్ 2015 మార్చి 15న ఆదివారం రోజు లాహోర్లోని చర్చిల్లో రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనతో 17 మంది మృత్యువాత పడగా, 70 మంది గాయపడ్డారు. దాడి చేసింది తామే అని తెహ్రీక్–ఇ–తాలిబన్ ప్రకటించింది. -
మార్కాపురంలో పేలిన బాంబు
ప్రకాశం, మార్కాపురం టౌన్: పట్టణంలోని తర్లుపాడు రోడ్డు మాగుంట సుబ్బరామిరెడ్డి మెమోరియల్ పార్కు సమీప మెయిన్ రోడ్డులో ఆదివారం రాత్రి బాంబు పేలడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. దుండగులు నలుగురు ఆటోలో ప్రయాణిస్తూ పార్కు సమీపంలో ఆగారు. అదే సమయంలో వారి నుంచి బాంబు జారి నేలపై పడింది. ఆ సమయంలో అటుగా మోటార్ సైకిల్పై వెళ్తున్న ఎం.ఖాశింపీరా తన కుమార్తెతో షాపింగ్ కోసం పట్టణంలోకి వస్తున్నాడు. ఈయన పంచాయతీరాజ్ ఈఈ వాహనానికి డ్రైవర్గా పని చేస్తున్నారు. బాంబు పేలడంతో డ్రైవర్ ఎడమ కాలికు బాంబులోని గాజు ముక్కలు గుచ్చుకోవడంతో గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స కోసం స్థానిక ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. స్వల్ప గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి పరిశీలించి వివరాలు సేకరించారు. బాంబు పేలిన సమయంలో ఆటోలో ఉన్న దుండగులు చెల్లాచెదురుగా పరారైనట్లు తెలుస్తోంది. బాంబు కలకలం 2019 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న ముగియడం.. పాతకక్షల నేపథ్యంలో పట్టణంలో బాంబు వేసేందుకా లేక ఇతర ప్రాంతాలకు తరలించేందుకా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇటీవల మార్కాపురం మండలంలోని పలు గ్రామాల్లో çఘర్షణలు చోటు చేసుకోవడంతో వీటిని వినియోగించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకుని తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో పేలాయా అనే సందేహం నాయకులు, ప్రజల్లో వ్యక్తమవుతోంది. బాంబు పేలిన సమీపంలో వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు స్వగృహాలకు వెళ్లే మార్గంలో సంఘటన చోటుచేసుకుంది. నాయకులు అలర్ట్గా ఉండి భద్రత చర్యలు తీసుకుంటున్నారు. సదరు సంఘటనపై సీఐ శ్రీధర్రెడ్డితో మాట్లాడగా బాంబా, లేక గాజు సీసాలో ద్రావణంతో కిందపడి పేలి ఉంటుందని భావిస్తున్నాం. పేలిన సమయంలో శబ్ధంతో పాటు లైటింగ్ వచ్చినట్లు ఆ ప్రాంత ప్రజలు తమ దృష్టికి తెచ్చారు. సదరు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. -
బాంబు పేలి 16 మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో విషాదం చోటుచేసుకుంది. క్వెట్టా పట్టణంలో బాంబు పేలిన ఘటనలో 16 మంది మృతి చెందగా.. 30 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. శుక్రవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో కూరగాయల మార్కెట్లో ఘటన జరిగినట్లు పోలీసులు అధికారులు తెలిపారు. బాంబు దాటికి కొన్ని భవనాలు కూలిపోయానని.. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా బెలూచిస్తాన్లోని క్వెట్టాలో నివసించే మైనార్టీ వర్గం హజారా(షియా ముస్లింలు)లే లక్ష్యంగా ముష్కరులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పక్కాగా రిక్కీ నిర్వహించి జనసమ్మర్థం ఎక్కువగా ఉండే చోట ఐఈడీ పేలేలా ప్రణాళిక రచించారని స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇంతవరకు ఏ గ్రూప్ కూడా దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేయలేదు. ఇక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇందుకు కారణమైన వారిని గుర్తించి త్వరితగతిన నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
జమ్మూ బస్టాండ్లో బాంబు పేలుడు
శ్రీనగర్ : జమ్మూ బస్టాండ్ సమీపంలో ఓ బస్సులో గురువారం మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది. బస్సులో బాంబు పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ఘటనపై సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఇది ఉగ్రవాదుల దుశ్చర్యా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు. కాగా, బాంబు పేలుడు ఘటనలో 30 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. బస్సుపై గ్రనేడ్ దాడి జరిగిందని జమ్మూ ఐజీ నిర్ధారించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కాగా పుల్వామా ఉగ్రదాడి, ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ బస్టాండ్లోని బస్సులో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు, పోలీసు సిబ్బంది పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. -
బోధ్ గయ పేలుళ్లకు హైదరాబాద్లోనే కుట్ర!
సాక్షి, సిటీబ్యూరో: బీహార్లోని బోధ్ గయలో ఏడాది క్రితం చోటు చేసుకున్న మూడు పేలుళ్లకు కుట్ర హైదరాబాద్ నుంచే జరిగిందా..? ఔననే అంటున్నారు దర్యాప్తు అధికారులు. అప్పట్లో మారేడ్పల్లి ప్రాంతంలో తలదాచుకున్న సూత్రధారి కౌసర్ పర్యవేక్షణలోనే ఈ పేలుళ్లు జరిగాయని పేర్కొంటున్నారు. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం పట్నాలోని ప్రత్యేక న్యాయస్థానంలో సప్లిమెంటరీ చార్జ్షీట్ దాఖలు చేసింది. అందులోనే హైదరాబాద్ ప్రస్తావన తీసుకువచ్చింది. మయన్మార్లో రోహింగ్యాలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రతీకారం తీర్చుకోవాలని జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) ఉగ్రవాద సంస్థ భావించింది. బౌద్ధుల ప్రార్థన స్థలాలను టార్గెట్ చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతో పాటు తమ ప్రతీకారం తీర్చుకోవాలని వీరు భావించారు. బంగ్లాదేశ్కు చెందిన మహ్మద్ జహీదుల్ ఇస్లాం అలియాస్ కౌసర్ జేఎంబీలో కీలకపాత్ర పోషించారు. ఆ సంస్థ తరఫున బంగ్లాదేశ్లో అనేక పేలుళ్లకు పాల్పడటంతో కొన్నేళ్ల క్రితం అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. రెండేళ్ల క్రితం జైలు నుంచి తప్పించుకున్న ఇతను పశ్చిమ బెంగాల్లోని మాల్దా మీదుగా భారత్లోకి చేరుకున్నాడు. అనేక ప్రాంతాల్లో తలదాచుకున్న అనంతరం చెన్నైతో పాటు హైదరాబాద్లోని మారేడ్పల్లిలోనూ కొన్నాళ్లు వ్యాపారిగా షెల్టర్ తీసుకున్నాడు. అక్కడ ఉండగానే బీహార్లోని బోధ్గయను టార్గెట్గా ఎంచుకున్నాడు. దీనిపై తనకు జేఎంబీ కేడర్కు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించిన దిల్వార్ హోస్సేన్కు సమాచారం ఇచ్చాడు. రెండు రోజులకే మారేడ్పల్లికి వచ్చిన హోస్సేన్ నేరుగా వెళ్లి కౌసర్ను కలిశాడు. వీరిద్దరూ చర్చించిన తర్వాత బోధ్గయలోనే పేలుళ్లకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తమ అనుచరులైన ఆదిల్ షేక్, అబ్దుల్ కరీం, రెహ్మాన్, ఆరిఫ్లకు తెలిపి హైదరాబాద్ రప్పించారు. నవంబర్ 20న సిటీకి వచ్చిన వీరు డిసెంబర్ 15 వరకు ఇక్కడే ఉన్నారు. ఆ మధ్య కాలంలోనే కుట్రను పూర్తి చేసిన కౌసర్ పేలుడు పదార్థాల సమీకరణ, రెక్కీ నిర్వహించడం, బాంబులు తయారు చేయడం, వాటిని నిర్దేశిత ప్రాంతాల్లో అమర్చడం వంటి బాధ్యతలు అప్పగించాడు. డిసెంబర్ 16న కౌసర్, హోస్సేన్ చెన్నైకు మిగిలిన వారు పట్నాకు వెళ్లిపోయారు. పథకం ప్రకారం ఈ ఉగ్రవాదులు గత ఏడాది జనవరి 19న బోధ్గయలోని మూడు చోట్ల తక్కువ తీవ్రతగల బాంబులను అమర్చారు. వీటిలో ఒకటి పేలగా... మరో రెండింటిని పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాల్లో నిందితును అరెస్టు చేసింది. వీరి విచారణలోనే సిటీ కోణం వెలుగులోకి వచ్చింది. దీంతో దర్యాప్తులో భాగంగా గత ఏడాది హైదరాబాద్కు వచ్చి ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాలను పరిశీలించి వెళ్లింది. -
తప్పిన ముప్పు
ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు, పోలీసులకు మద్ధ సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం అలజడి రేపుతోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమలను మావోయిస్టులు హత్యచేసిన నాటి నుంచి కూంబింగ్ నిరంతరం కొనసాగుతోంది. దళసభ్యుల గాలింపులో భాగంగా భద్రత బలగాలు ఏవోబీని జల్లెడ పడుతున్నాయి. పోలీసులపై దాడికి మావోయిస్టులు కూడా అదను కోసం ఎదురు చూస్తున్నట్లు అప్పుడప్పుడు చోటుచేసుకుంటున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య సాగుతున్న వార్తో మన్యం నివురుగప్పిన నిప్పులా ఉంటోంది. కూంబిం గ్కు వెళ్లి వస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలను లక్ష్యంగా చేసుకుని రెండు మందుపాతరలను జి.మాడుగుల మండలం నుర్మతి ఔట్ పోస్టుకు అతి సమీపంలో బుధవారం ఉదయం దళసభ్యులు పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లకు, బైకుపై వెళుతున్న ఒక పౌరునికి గాయాలయ్యాయి. మందుపాతరలు కొంచెం ముందుగా పేలడంతో పోలీసులకు పెనుముప్పు తప్పినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం, పాడేరు/జి.మాడుగుల : పోలీస్ ఔట్పోస్టుకు సమీపంలో మందుపాతరలు పేల్చడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం ఉలిక్కిపడింది. ఈ సంఘటనతో ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని ఈ ప్రాంత గిరిజనులు భయాందోళనలు చెందుతున్నారు. కూంబింగ్కు వెళ్లిన సుమారు 30 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు కొండదిగి నుర్మతి పంచాయతీ గాదిగుంట రోడ్డులో కాలినడకన వస్తుండగా మావోయిస్టులు మందుపాతరలు పేల్చారు. ఈ ఘటనలో కేంద్ర బలగాలకు చెందిన జగదీష్, ఆనంద్లతో పాటు అటుగా బైక్పై వస్తున్న డిప్పలగొంది గ్రామానికి చెందిన గిరిజనుడు సన్యాసిరావుకు గాయాలయ్యాయి. నుర్మతి పంచాయతీ గాదిగుంట–తిప్పలగొంది గ్రామాల మధ్య వండ్రుంగుల వద్ద కొత్తగా నిర్మించిన మట్టి రోడ్డులో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి సమీపంలో రెండు చోట్ల అమర్చిన క్యారేజి మందుపాతరలను పేల్చారు. రెండూ ఒకేసారి పేలడంతో ముందుగా నడుస్తున్న ఇద్దరికి గాయాలు కాగా, కాస్తా వెనుకన ఉన్న పోలీసులు కొండపైకి వెనుదిరిగి తప్పించుకున్నారు. వెంటనే ఎదురుకాల్పులు చేపట్టారు. మావోయిస్టుల గురి తప్పడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన పోలీస్లను జి.మాడుగుల స్టేషన్కు తీసుకొచ్చి అక్కడి నుంచి పాడేరు ఆస్పత్రికి.. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖపట్నం తరలించారు. ప్రతీకారంతోనే.. ఏవోబీలోని రాంగుడ ఎన్కౌంటర్లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవడం, ఇటీవల మహిళా మావోయిస్టును పోలీస్లు ఎన్కౌంటర్ చేయడం, ఇన్ఫార్మర్లు పేరుతో గిరిజనులను అరెస్టు చేయాన్ని దళసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. రగిలిపోతున్న వీరు ప్రతీకారంగా అదును చూసి దెబ్బకొట్టడానికి యత్నిస్తున్నట్టు ఈ ఘటనతో అర్థమవుతోంది. మన్యంలో ఔట్పోస్టుల ఏర్పాటును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. వీటిని ఎత్తివేయాలని పెద్ద ఎత్తున ప్రకటనలు ద్వారా డిమాండ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. నుర్మతి గెడ్డకు కాలకృత్యాలకు వెళ్లిన కానిస్టేబుల్పై కాల్పులు జరిపి చంపడం, మద్దిగరువులో ఔట్పోస్టుపై కాల్పులతో నుర్మతి, మద్దిగరువు ఔట్పోస్టులను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. చింతపల్లి మండలం లోతుగెడ్డ బ్రిడ్జి వద్ద అన్నవరం పోలీస్లు వస్తున్న జీపు లక్ష్యంగామందుపాతరలు పేల్చడంతో కానిస్టేబుల్ను మృతి చెందిన సంఘటన తెలిసిందే. నుర్మతి, దాని పరిసర ప్రాంతాల్లో 8నెలలు క్రితం బీబీఎన్ఎల్ పనులు చేస్తున్న నాలుగు పొక్లెయిన్లను మావోయిస్టులు ధ్వంసం చేశారు. పోలీస్ ఇన్ఫార్మర్లు పేరుతో మండలంలోని బొయితిలి పంచాయతీ మద్దిగరువుకు చెందిన సూర్యం, కిశోర్లను 2017 సెప్టెంబర్12న తుపాకీతో కాల్చిచంపారు. పార్టీ అగ్రనేతలు కోల్పోతుండడంతో పోలీస్లపై మందుపాతర దాడులకు దళసభ్యులు పాల్పడుతున్నారన్న వాదన వ్యక్తమవుతోంది. గాయపడిన వారికి విశాఖలో చికిత్స విశాఖ క్రైం: మందుపాతర పేలుడులో గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్లను విశాఖలోని సెవెన్హిల్స్ ఆస్పత్రికి తరలించారు. చిన్నపాటిì గాయాలు కావడంతో వారికి ఎటువంటి ప్రాణపాయాంలేదని సమాచారం. -
సినిమాను తలపించేలా ప్లాన్ చేశారు..
కోల్కతా : వారంతా కరుడుగట్టిన నేరస్తులు.. విచారణ నిమిత్తం జైలులో ఉన్నారు. కానీ అక్కడి నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నారు. దాంతో వారికో ఉపాయం తట్టింది. ఎలాను విచారణ నిమిత్తం తమను కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టు ఆవరణ కాబట్టి జనాలు కూడా బాగానే ఉంటారు. ఇలాంటి సమయంలో కోర్టు ఆవరణలోకి వచ్చినప్పుడు పోలీసుల మీద బాంబ్ దాడి చేశామనుకో.. అక్కడ తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. అంతే ఈ హాడావుడిలో మనం తప్పించుకోవచ్చు అని ప్లాన్ వేశారు. చదువుతుంటూ ఇదేదే పాత సినిమాల్లో కనిపించే సీన్లా అనిపించినా ఇదంతా నిజంగానే జరిగింది. సినిమాను తలపించేలా జరిగిన ఈ ఎస్కేపింగ్ డ్రామా పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ముగ్గురు కరుడుగట్టిన నేరస్తులు జైలు నుంచి తప్పించుకోవడానికి ఇలా కోర్టు ప్రాగంణంలో పోలీసుల మీద బాంబ్ దాడి పథకం రచించారు. దాన్ని పక్కగా అమలు జరిపారు కూడా. కానీ ముగ్గురు నేరస్తుల్లో ఇద్దరూ మాత్రమే తప్పించుకోగలిగారు. కర్ణ బేరా అనే నేరస్తుడు పోలీసులకు చిక్కడంతో వీరి ప్లాన్ గురించి తెలిసింది. పోలీసులు మిగతా ఇద్దరు నేరస్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
మరోసారి రక్తమోడిన అఫ్గాన్
కాబుల్ : ఆత్మాహూతి దాడులతో అఫ్గానిస్తాన్ మరోసారి రక్తమోడింది. మంగళవారం కాబుల్ సమీపంలోని జలాలాబాద్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏడుగురు మృతి చెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. జలాలాబాద్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఆఫ్గానిస్తాన్లో అక్టోబర్ 20న దేశ వ్యాప్తంగా పార్లమెంట్, జిల్లా కౌన్సిల్స్కు ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రచారంలో భాగంగా ప్రజలు గుమ్మిగూడి ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఆఫ్గాన్లోని 33 ప్రావిన్స్లకు, 249 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి. వీటి కోసం పోటీలో 2691 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా ఎన్నికల నేపథ్యంలో ఆఫ్గాన్లో ఉగ్రవాదులు ప్రజా ప్రతినిధులను, అధికారులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకూ జరిగిన దాడుల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో సహా, అధికారులతో కలుపుని 50 మంది మృతి చెందారు.