enquiry
-
రేపు ‘ఈడీ‘ ముందుకు కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) గురువారం(జనవరి16) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా- ఈ రేసుల కేసు (Formula-e race case)లో జనవరి 16న విచారణకు హాజరు కావాలని కేటీఆర్కు ఈడీ ఇప్పటికే నోటీసులిచ్చింది. ఈ నోటీసుల్లో కోరిన మేరకు కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్లనున్నారు. కేటీఆర్ గురువారం ఉదయం 10.30 గంటలకు కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి ఈడీ(ED) విచారణకు వెళతారు. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న మాజీ మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్కుమార్, హెచ్ఎండీఏ ఇంజినీర్ బిఎల్ఎన్రెడ్డిని ఈడీ ఇప్పటికే విచారించింది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ను ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేటీఆర్పై ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇదే కేసులో జనవరి మొదటి వారంలోనే ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. అయితే హైకోర్టులో తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ తుదితీర్పు పెండింగ్లో ఉన్నందున విచారణకు రాలేనని తెలపడంతో ఈడీ కేటీఆర్కు సమయమిచ్చింది. అనంతరం క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఈడీ విచారణకు కేటీఆర్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బుధవారం(జనవరి 15) సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విషయంలో కేటీఆర్కు చుక్కెదురైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం చెప్పడంతో కేటీఆర్ తన క్వాష్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. కాగా, ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే ఒకసారి ఏసీబీ విచారణకు కూడా హాజరయ్యారు. విచారణ కోసం కేటీఆర్కు ఏసీబీ మళ్లీ నోటీసులిచ్చే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి: సంజయ్ని నేనేం రాళ్లతో కొట్టలేదు: కౌశిక్రెడ్డి -
కేవీరావుపై పరువు నష్టం దావా వేస్తా: విజయసాయిరెడ్డి
సాక్షి,హైదరాబాద్:కాకినాడ సీ పోర్టు అమ్మకం విషయంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ముగిసింది. విచారణ అనంతరం ఈడీ ఆఫీసు నుంచి బయటికి వచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘నన్ను మొత్తం 25 ప్రశ్నలు అడిగారు. కర్నాటి వెంకటేశ్వర్ రావు(కేవీరావు) ఫిర్యాదు మీద విచారణ చేశారు. ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ మీద ఈడీ కేసు నమోదు చేసింది. విక్రాంత్ రెడ్డికి కాకినాడ సీ పోర్ట్ గురించి కేవీ రావుతో మాట్లాడాలని నేను చెప్పినట్లు ఆరోపించారు. కేవీ రావు ఎవరో నాకు తెలియదు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు.ప్రజా ప్రతినిధిగా నా వద్దకు ఎంతో మంది వస్తారు.కానీ కాకినాడ సీ పోర్ట్ విషయంలో నేను ఎవరికి ఫోన్ చేయలేదు. కేవీరావు తిరుమలకు వచ్చి దేవుడి ముందే నిజాలు చెప్పాలి. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. కాకినాడ పోర్ట్ షేర్ ట్రాన్స్ఫర్కు నాకు సంబంధం లేదు. కేవీరావు మీద సివిల్ డిఫమేషన్ వేస్తాను. నాకు సంబంధం లేని విషయంలో నా పై ఆరోపణలు చేశారు.సండూరు పవర్ పెట్టుబడులపై వెరిఫై చేసి మళ్లీ పిలిస్తే సమాధానం చెప్తానని చెప్పను. విక్రాంత్రెడ్డి సుబ్బారెడ్డి కొడుకుగానే తెలుసు ఆయనతో నాకేం సంబంధం’అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ విచారించిందినా స్టేట్మెంట్ ఈడి అధికారులు రికార్డ్ చేశారుడిడి అధికారులు నన్ను 25 ప్రశ్నలు అడిగారుకేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసిందికేవీ రావు నాకు తెలియదు అని చెప్పానుఅతనికి నాకు ఎలాంటి సంబంధం లేదుకాకినాడ సీ పోర్ట్ విషయం లో కేవీ రావు కు ఎక్కడ నేను ఫోన్ చెయ్యాలేదుకేవీ రావు ను తిరుమల కు రమ్మని చెప్పమని చెప్పండి అని చెప్పానునేను తప్పు చేస్తే ఏ శిక్ష కైనా నేను సిద్ధంమే నెల 2020 లో నేను ఫోన్ చేసానని కేవి రావు చెపుతున్నాడుకాల్ డేటా తీసి నేను కాల్ చేశాను లేదో చూసుకోవచ్చునేను ఎక్కడ కూడా కేవీ రావు కు ఫోన్ చెయ్యాలేదుకేవీ రావు ను ఈడీ విచారణ కు పిలవండి అని కోరానురంగనాధ్ కంపెనీ నీ ప్రభుత్వం కి ఎవ్వరు పరిచయం చేసారని ఈడీ ప్రశ్నించిందినాకు సంబంధం లేదు అని చెప్పానునేను ఒక సాధారణ మైన ఎంపీ నీ మాత్రమేశ్రీధర్ అండ్ సంతాన్ కంపెనీ ఎవ్వరు ఆపాయింట్ చేసారో నాకు తెలియదు అని చెప్పానుశరత్ చంద్ర రెడ్డి తో ఉన్న సంబంధాలు కూడా అడిగారుకుటుంబ రీలేషన్ అని చెప్పానుకాకినాడ సీ పోర్ట్ విషయం లో నాకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారులుక్ ఔట్ నోటీసుల ఫై నేను ఢిల్లీ హైకోర్టు కు వెళ్ళానుకేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు కేసు అయితే నేను సివిల్ అండ్ క్రిమినల్ సూట్ వేస్తానని ఈడీ కి చెప్పానువిక్రాంత్ రెడ్డి తెలుసా అని అడిగారువిక్రాంత్ రెడ్డి తో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరుపలేదుసండుర్ పవర్ కంపెనిలో 22 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీలు గురించి అడిగారుకొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ట్రాన్సాక్షన్స్ గురించి ఇప్పుడు చెప్పడం కుదరదు అని చెప్పాను -
అమోయ్కుమార్ ల్యాండ్ కేసు: ఆర్డీవోకు ‘ఈడీ’ పిలుపు
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం ల్యాండ్ కేసులో మాజీ ఆర్డీవోకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం(నవంబర్ 5) నోటీసులు జారీ చేసింది. ల్యాండ్ స్కామ్లో శుక్రవారం తమ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో కోరింది.ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అమోయ్కుమార్,ఎమ్మార్వో జ్యోతిలను ఈడీ విచారించింది. ఈ విచారణ ఆధారంగా మాజీ ఆర్డీఓ వెంకటాచారికి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది.మహేశ్వరం నాగారంలోని సర్వేనెంబర్ 181లోని 42 ఎకరాల భూ కేటాయింపులపై ఈడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ కేసులో కలెక్టర్ అమోయ్ కుమార్,ఎమ్మార్వో జ్యోతి స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేసింది. ఇదీ చదవండి: 12 నుంచి ఐఏఎస్ల విచారణ -
‘జన్వాడ’ కేసు: రాజ్పాకాల విచారణలో కీలక విషయాలు వెల్లడి
సాక్షి,హైదరాబాద్: సంచలనం రేపిన జన్వాడ ఫామ్హౌజ్ పార్టీ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్పాకాల విచారణ ముగిసింది. రాజ్పాకాలను మోకిల పీఎస్ పోలీసులు ఎనిమిది గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం రాజ్పాకాలను పోలీసులు విడిచిపెట్టారు. రాజ్పాకాల దగ్గర లిక్కర్, గేమింగ్ మినహా డ్రగ్స్ ఆనవాళ్లు దొరలేదని సమాచారం. రాజ్పాకాల ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న అతడి స్నేహితుడు విజయ్ మద్దూరికి సంబంధించి పోలీసులు విచారణలో ఆరా తీశారు. విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో తనకు సంబంధం లేదని, అతడి ఫోన్ ఎక్కడుందో తనకు తెలియదని రాజ్పాకాల చెప్పినట్లు తెలిసింది. కాగా, విజయ్ మద్దూరి డ్రగ్స్ వినియోగంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని న్యాయవాది ద్వారా పోలీసుకు విజయ్ సమాచారమిచ్చాడు. విజయ్ కాల్లిస్ట్, సిగ్నల్ ఆధారంగా డ్రగ్స్ కేసు చేధించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.విజయ్ డ్రగ్స్ ఎక్కడ కొన్నాడు. ఎక్కడ వాడాడు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, జన్వాడలోని రాజ్పాకాల ఇంట్లో ఇటీవల జరిగిన పార్టీలో డ్రగ్స్ వాడారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పార్టీపై ఎక్సైజ్ పోలీసులతో పాటు ఎస్వోటీ పోలీసులు దాడి చేసిన అక్రమ మద్యానికి సంబంధించిన కేసులు పెట్టారు. ఇదీ చదవండి: డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్.. పోలీసుల మెరుపు దాడి -
TG: అమోయ్కుమార్ను ప్రశ్నించిన ‘ఈడీ’
సాక్షి,హైదరాబాద్: భూముల కేటాయింపుల వ్యవహారంలో తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి అమోయ్కుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. బుధవారం(అక్టోబర్ 23) ఈడీ కార్యాలయంలో అమోయ్కుమార్ను సుదీర్ఘంగా 8 గంటల పాటు విచారించిన అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. రంగారెడ్డిజిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో జిల్లాలో భూదాన్ భూముల్లో జరిగిన అవకతవకలపై అమోయ్కుమార్ను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదే అంశంలో తహసిల్దార్ జ్యోతి, ఆర్డీవో ఇతర సిబ్బంది చేసిన అవకతవకలపైనా ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. భూదాన్ భూముల్లో జరిగిన అవకతవకలపై మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వాలని అమోయ్కుమార్ను ఈడీ కోరినట్లు తెలిసింది.కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమోయ్కుమార్ రంగారెడ్డి కలెక్టర్గా పనిచేశారు. ఆయన కలెక్టర్గా ఉన్న సమయంలో భూ కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై విచారించేందుకు ఈడీ అమోయ్కుమార్కు నోటీసులిచ్చి విచారణకు పిలిచింది. -
ఫ్లిప్కార్ట్, అమెజాన్లపై దర్యాప్తు వాయిదా!
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) డైరెక్టర్ జనరల్(డీజీ) చేసిన విధానపరమైన లోపాల కారణంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్లపై జరుగుతున్న దర్యాప్తును కర్ణాటక హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ-కామర్స్ దిగ్గజాలు వివిధ నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) గతంలోనే దర్యాప్తు చేపట్టింది. ఈమేరకు డైరెక్టర్ జనరల్ ఆగస్టు 9న ప్రాథమిక దర్యాప్తు నివేదికను సమర్పించింది. అయితే దర్యాప్తు వివరాలను కోర్టులో తెలియజేసే సమయంలో జరిగిన విధానపరమైన లోపం వల్ల సమగ్ర దర్యాప్తును తాత్కాలికంగా నిలిపేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.ప్రాథమిక దర్యాప్తులోని వివరాల ప్రకారం..ఫ్లిప్కార్ట్, అమెజాన్ కంపెనీలు దేశీయంగా ఎఫ్డీఐ నిబంధనలు పాటించడంలేదు. నియమాలకు విరుద్ధంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే ప్రత్యేకంగా ప్రోడక్ట్ లాంచ్లు ఏర్పాటు చేస్తున్నాయి. మార్కెట్లో వీలుకాని రాయితీలు ఇస్తున్నాయి. ప్రధానంగా మొబైల్ ఫోన్ బ్రాండ్లపై నిర్దిష్ట విక్రయదారులతో కుమ్మక్కై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. దాంతో చిన్న రిటైలర్లు(ఆఫ్లైన్) తీవ్రంగా నష్టపోతున్నారు.ఇదీ చదవండి: యుద్ధంలో విమానాల టార్గెట్పై ఐఏటీఏ వ్యాఖ్యలుప్రాథమిక దర్యాప్తునకు సంబంధించి కోర్టుకు వివరాలు వెల్లడించే సమయంలో ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థలను ‘థర్డ్ పార్టీస్’గా డైరెక్టర్ జనరల్ వర్గీకరించింది. కానీ ఇటీవల కోర్టులో వివరాలు తెలిపే సమయంలో ‘ఆపోజిట్ పార్టీస్(విరుద్ధ సంస్థలు)’గా అభివర్ణించింది. దాంతో కోర్టు స్పందిస్తూ డైరెక్టర్ జనరల్ కంపెనీలను సంబోధించిన తీరును తప్పుపట్టింది. ఇరు సంస్థలను ఆపోజిట్ పార్టీస్ అని అభివర్ణించేందుకు కమిషన్ నుంచి ఏదైనా అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించింది. దీనిపై వివరణ కోరుతూ విచారణను ఈ నెల 21కు వాయిదా వేసింది. అప్పటివరకు డైరెక్టర్ జనరల్ నిర్వహిస్తున్న సమగ్ర దర్యాప్తును నిలిపేయాలని ఆదేశించింది. ఇదిలాఉండగా, సంస్థల వర్గీకరణకు సీసీఐ ధ్రువీకరణ తప్పనిసరి. -
ఏఆర్ ఫుడ్స్పై ఫిర్యాదులో జాప్యం ఎందుకు: ‘సిట్’ ఆరా
సాక్షి,తిరుపతి: తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్ మూడోరోజు విచారణను సోమవారం(సెప్టెంబర్30) కొనసాగిస్తోంది. లడ్డూలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై తిరుమల మార్కెటింగ్ జీఎం రెండు నెలల తర్వాత ఫిర్యాదు చేయడంపై సిట్ ఆరా తీస్తోంది.నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్పై ఫిర్యాదు చేయడంలో జాప్యంపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. లడ్డూ తయారీకి సంబంధించి భాగమైన ఫ్లోర్మిల్, ల్యాబ్, ఇతర ముడిసరుకుల నాణ్యతను సిట్ పరిశీలించింది.ఇదీ చదవండి: తిరుమల లడ్డూ వివాదం..సుప్రీంకోర్టులో విచారణ -
కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ
-
మళ్లీ ‘ఈడీ’ విచారణకు రాహుల్గాంధీ..?
న్యూఢిల్లీ: లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మళ్లీ విచారణకు పిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాహుల్, సోనియాగాంధీ ప్రధానవాటాదారులుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ ఇప్పటికే విచారణ జరుపుతోంది. ఈ కేసులో చార్జ్షీట్ ఫైల్ చేసేముందు ఈడీ రాహుల్ను విచారించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.దర్యాప్తునకు ముగింపు పలికి కేసు విచారణకు వెళ్లాల్సిఉందని, ఇందుకోసం కేసుతో సంబంధమున్న అందరినీ చివరిసారిగా విచారించాలనుకుంటున్నట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసులో మరో నిందితురాలిగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఈడీ విచారణకు పిలుస్తుందా లేదా అన్నది తెలియాల్సిఉంది. కాగా, నేషనల్హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాలను ఈడీ ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. -
TG: పవర్ కమిషన్ కొత్త చైర్మన్ జస్టిస్ మదన్ లోకూర్
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్గా తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ను నియమించింది. గతంలో పవర్ కమిషన్కు చైర్మన్గా వ్యవహరించిన జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవలే ఆ స్థానం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో కొత్త చైర్మన్గా ప్రభుత్వం మదన్ లోకూర్ను ఎంపిక చేసింది. జస్టిస్ మదన్ లోకూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జుడ్యీషియల్ ఎంక్వైరీ వేసింది. ఈ జ్యుడీషియల్ కమిషన్ ఇక ముందు జస్టిస్ మదన్ లోకూర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగించనుంది. -
పన్నూ హత్యకు కుట్ర: ‘భారత్ దర్యాప్తు వివరాలపై ఎదురు చూస్తున్నాం’
న్యూయార్క్: ఖలీస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్సింగ్ పన్నూ హత్య కుట్రలో భారత్కు చెందిన వ్యక్తి ప్రమేయం ఉందని అమెరికా ఆరోపణలు చేసింది. గత ఏడాది ఇదే అంశంపై అమెరికా సమాచారాన్ని పంపించగా దానిపై భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తున్నామని తెలిపింది. ఇటీవల అమెరికా సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ సభ్యులు పన్నూ హత్యకుట్రలో భారత్ ప్రమేయంపై దౌత్యపరమైన స్పందన కోరాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్కు లేఖ రాశారు. సెనేట్ సభ్యులు రాసిన లేఖపై మీడియా అడిగిన ప్రశ్నకు బుధవారం విదేశాంగ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు.‘ఎప్పటిలాగే ఆ సభ్యుల గురించి నేను ప్రైవేట్గా మాత్రమే స్పందిస్తాను. ప్రస్తుతం ఇక్కడ ఆ విషయంపై ఏం వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. పన్నూ హత్య కుట్ర ముందుగా మా దృష్టికి వచ్చినప్పుడు స్పష్టంగా భారత ప్రభుత్వానికి సమాచారం అందించాం. ఈ కేసులో భారత ప్రభుత్వం పూర్తి జవాబుదారితనంతో దర్యాప్తు చేస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే ఈ కేసులో భారత్ ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొంది. భారత్ దర్యాప్తు తుది వివరాలను తెలుసుకోవడానికి ఎదురుచేస్తున్నాం’’ అని మిల్లర్ తెలిపారు.పన్నూ హత్యకు భారతీయ వ్యక్తి నిఖిల్ గుప్తా ( 52 ) మరో వ్యక్తితో కలసి కుట్ర చేశారనే ఆరోపణలపై చెక్ రిపబ్లిక్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఆయన్ను విచారించేందుకు చెక్ రిపబ్లిక్ పోలీసులు.. అమెరికాకు అప్పగించగా కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. -
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా షాకిచ్చారు.ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతిస్తున్న‘సిఖ్స్ ఫర్ జస్టిస్’అనే సంస్థ నుంచి ఆప్ అధినేత కేజ్రీవాల్ నిధులు స్వీకరించారనే అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణకు గవర్నర్ సోమవారం(మే6) సిఫారసు చేశారు.ఆమ్ఆద్మీపార్టీకి సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నుంచి ఆప్కు 16 మిలియన్ డాలర్ల నిధులు వచ్చాయన్న ఫిర్యాదు ఆధారంగా ఎన్ఐఏ విచారణకు ఆదేశించినట్లు గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును వరల్డ్ హిందూ ఫెడరేషన్ అశూ మోంగియా ఇచ్చినట్లు తెలిపారు. -
రెండో రోజు విచారణ...కవిత భర్తను విచారించనున్న ఈడీ
-
‘సందేశ్ఖాలీ నిరసన: ఒక్క మహిళా ఫిర్యాదు చేయలేదు’
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని ఉత్తర పరగణాల జిల్లాలో ఉన్న సందేశ్ఖాలీ ప్రాంతంలోని మహిళలు తమపై టీఎంసీకి చెందిన నాయకులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని నిరసన తెలపుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలు బెంగాల్లో దుమారం రేపుతున్నాయి. సందేశ్ఖాలీ ఘటనపై పోలీసులు బుధవారం కీలక వివరాలు వెల్లడించారు. సందేశ్ఖాలీ ప్రాంతంలో పలు పోలీసులు బృందాలతో విచారణలు జరిపించామని పోలీసు ఉన్నతధికారులు వెల్లడించారు. అయితే పోలీసులు చేపట్టిన విచారణలో ఎక్కడ కూడా ఒక మహిళ తనపై లైంగిక వేధింపులు జరినట్లు ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. సందేశ్ఖాలీలో చోటుచేసుకున్న నిరసనలకు కారణం తప్పడు సమాచారమని తెలిపారు. ‘రాష్ట్ర మహిళా కమిషన్, పది మంది నిజనిర్ధారణ బృందం, జిల్లా పోలిసు యాంత్రాంగం నిర్వహించిన విచారణలో మహిళలపై టీఎంసీ నాయకులు లైంగికంగా వేధించినట్లు చెప్పడానికి ఒక్క మహిళ కూడా ఫిర్యాదు చేయలేదు’ అని బెంగాల్ పోలీసులు ‘ఎక్స్’ (ట్విటర్)లో వెల్లడించారు. అదేవిధంగా నేషనల్ మహిళా కమిషన్ ప్రతినిధులు ఇటీవల సందేశ్ఖాలీ పర్యటించారు. వారి విచారణలో స్థానిక మహిళల నుంచి లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు రాలేదన్నారు. ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులపై సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బుధవారం కూడా పెద్ద ఎత్తున సందేశ్ఖాలీలో మహిళలు నిరసన తెలిపారు. టీఎంసీ నేత షాజహాన్ షేక్, తన అనుచరులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతని అనుచరులు తమ భూములు లాక్కోడానికి బెదిరింపులగు దిగుతున్నారని, తమ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రేషన్ కుంభకోణానికి సంబంధించిన కేసులో షాజహాన్ షేక్ ఇంటిపై ఈడీ అధికారులు సోదాలకు ప్రయత్నించగా.. అతని అనుచరులు ఈడీ అధికారుల కారు అద్దాలు పగులగొట్టి దాడికి యత్నించారు. ఈ ఘటన జరినప్పటి నుంచి టీఎంసీ నేత షాజహాన్ షేక్ పరారీలో ఉన్నట్లు సమాచారం. చదవండి: బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ.. రాష్ట్ర అధ్యక్షుడికి గాయాలు -
కేసీఆర్ను కాపాడాలని చూస్తోంది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ వ్యవహారశైలి చూస్తుంటే మాజీ సీఎం కేసీఆర్ను కాపాడాలని చూస్తున్నట్టు అనుమానం కలుగుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభ కోణం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్పై కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడీషి యల్ ఎంక్వైరీతో కాలయాపన చేయాలని చూస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం రీడిజైన్ పేరుతో ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్ట్ వ్యయా న్ని సుమారు రూ.63 వేల కోట్ల నుంచి రూ.1.50 లక్షల కోట్లకు అంచనాలుపెంచి.. వేలకోట్ల అవినీ తికి పాల్పడిందన్నారు. ఆదివారం అరుణ మీడి యాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించడం కంటే సీబీఐ దర్యాప్తు జరి పిస్తే నిజానిజాలు బయటపడతాయన్నారు. కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్రెడ్డి ఎందుకు లేఖ రాయలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. -
నేటి నుంచి చంద్రబాబు విచారణ
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడును విచారించేందుకు సీఐడీ సన్నద్ధమవుతోంది. చంద్రబాబు అవినీతి బండారాన్ని జాతీయస్థాయిలో బట్టబయలు చేసిన ఈ కేసుపై దేశమంతటా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), జీఎస్టీ తదితర విభాగాలు కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ముసుగులో భారీగా ప్రజాధనాన్ని దోపిడీ చేశారని నిర్ధారించాయి. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ.3,300 కోట్ల నకిలీ ప్రాజెక్టును చూపిస్తూ రూ.371 కోట్లు కొల్లగొట్టిన కుంభకోణంలో మరిన్ని వాస్తవాలను రాబట్టేందుకు సీఐడీ శాస్త్రీయంగా సంసిద్ధమవుతోంది. ఈ కేసులో చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఆదేశించింది. దాంతో న్యాయస్థానం మార్గదర్శకాలను పాటిస్తూ శని, ఆదివారాల్లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే చంద్రబాబును సీఐడీ విచారించనుంది. అందుకోసం ముగ్గురు డీఎస్పీల నేతృత్వంలో నలుగురు సీఐలు, సహాయక సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం శుక్రవారం రాత్రే రాజమహేంద్రవరం చేరుకుంది. ఈ బృందంలో మొత్తం 12 మంది ఉన్నారు. సీఐడీ వాదనకు కొండంత బలం స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు కస్టడీ కోసం న్యాయస్థానం అనుమతి పొందడం ద్వారా సీఐడీ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే ఈ కుంభకోణంలో నిధులను అక్రమంగా మళ్లించిన అవినీతి నెట్వర్క్ను సీఐడీ ఛేదించింది. ఈ ప్రాజెక్టుతో సంబంధం లేదని జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసుకు మరింత బలం చేకూరింది. దాంతో ఏ–1 చంద్రబాబుతో పాటు 8 మందిని సీఐడీ ఇప్పటివరకు అరెస్టు చేసింది. చంద్రబాబు అరెస్టు సరైనదేనంటూ ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడం, తాజాగా రిమాండ్ను పొడిగించడం ద్వారా సరైన రీతిలోనే సీఐడీ కేసు దర్యాప్తు చేస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడిందన్న విషయం వెల్లడైంది. తనపై తప్పుడు కేసు పెట్టారని, ఆ కేసునే కొట్టేయాలని చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో విచారణ నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. సీఐడీ వాదనకు మరింత బలం చేకూరింది. ఈ కేసుపై టీడీపీ చేస్తున్న రాజకీయ రాద్ధాంతంతో నిమిత్తం లేకుండా సీఐడీ నిబంధనల ప్రకారం దర్యాప్తును కొనసాగిస్తోంది. కీలక దశలో దర్యాప్తు ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ.. చంద్రబాబును రెండు రోజులపాటు కస్టడీలో విచారించడం ద్వారా మరిన్ని కీలక ఆధారాలను రాబట్టాలని భావిస్తోంది. ఈ నెల 9న చంద్రబాబును అరెస్ట్ చేసి సిట్ కార్యాలయంలో విచారించిన సమయంలో ఆయన తనకు ఏమీ తెలియదని, గుర్తు లేదని, మరచిపోయాను అంటూ ముక్తసరిగా సమాధానాలిచ్చి తప్పించుకునేందుకు యతి్నంచారు. ఆ అనుభవం దృష్ట్యా ఈసారి చంద్రబాబును అడగాల్సిన ప్రశ్నలపై సీఐడీ అధికారులు తగిన కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ముగ్గురు డీఎస్పీలతో శాస్త్రీయమైన రీతిలో రూపొందించిన ప్రశ్నావళి నుంచి ఒక్కొక్కటిగా ప్రశ్నలు సంధించనుంది. ప్రధానంగా సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరిట జీవో ఎలా ఇచ్చారు? ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారు? జీవోకు విరుద్ధంగా ఒప్పందం ఉండటం ఏమిటి? రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా ఎలా నిర్ణయించారు? ప్రైవేటు వ్యక్తి గంటా సుబ్బారావును ఏకంగా నాలుగు కీలకస్థానాల్లో ఎందుకు నియమించారు? ఆర్ధిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేయమని ఎందుకు ఆదేశించారు? ఏకంగా 13 చోట్ల నోట్ఫైళ్లపై సంతకాలు చేసి మరీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేలా అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారు? డిజైన్టెక్ కంపెనీకి చేరిన నిధులు వివిధ షెల్ కంపెనీల ద్వారా తరలించడం గురించి మీకు తెలుసా? అక్రమ నిధుల తరలింపులో కీలక పాత్రధారి మనోజ్ పార్థసానితో ఉన్న సంబంధం ఏమిటి? ఆయన మీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు రూ.241 కోట్లు ఎందుకు అందించారు? ఆ నిధులను ఆయన మీకు చేర్చారా? సీఐడీ నోటీసులు అందగానే మనోజ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు పరారయ్యారు వంటి పలు కోణాల్లో చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించే అవకాశాలున్నాయని సమాచారం. ఈ కేసులో ప్రధాన సాక్షుల వాంగ్మూలాలను ప్రస్తావిస్తూ చంద్రబాబును అధికారులు ప్రశ్నించనున్నారు. విచారణ తీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తదుపరి ప్రశ్నలను సంధించనున్నారు. జైల్లోనే విచారణకు ఏర్పాట్లు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబును విచారించేందుకు జైలు అధికారులు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న స్నేహ బ్లాక్లో సీసీ కెమెరాలు ఉన్నందున అక్కడే విచారించాలా లేక వేరే గదిలో విచారించాలా అన్న విషయమై సమాలోచనలు చేస్తున్నారు. భద్రతా చర్యలు కూడా చేపట్టారు. ఇప్పటికే 300 మంది ఆక్టోపస్, ఇతర పోలీసు బలగాలతో జైలు బయట భద్రత కట్టుదిట్టం చేశారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు రిమాండ్ 24 వరకు పొడిగింపు -
కొనసాగిన ధార్మిక పరిషత్ కమిటీ విచారణ
తిరుపతి కల్చరల్: హథీరాంజీ మఠాధిపతిగా ఉన్న సమయంలో అర్జున్దాస్ పలు అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధార్మిక పరిషత్ కమిటీ సభ్యులు ఏబీ కృష్ణారెడ్డి, జోలా చైతన్య, శ్రీరామమూర్తి, విజయరాజు, రామకృష్ణారెడ్డి రెండో రోజు కూడా విచారణ నిర్వహించారు. అర్జున్దాస్ గురువారం కూడా విచారణకు హాజరవ్వలేదు. అయితే విచారణ కమిటీ సభ్యులు మఠంలోని రికార్డులను నిశితంగా పరిశీలించారు. రికార్డుల్లోని లావాదేవీలపై సిబ్బందిని ప్రశ్నించారు. అలాగే పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు, మాజీ పూజారులు అర్జున్దాస్ వల్ల తాము పడిన ఇబ్బందులను విచారణ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో మఠం భూముల విషయంలో అర్జున్దాస్ చేసిన అక్రమాలను పలువురు కమిటీకి విన్నవించారు. అనంతరం విచారణ కమిటీ సభ్యుడు ఏబీ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విచారణకు అర్జున్దాస్ సహకరించట్లేదని చెప్పారు. అర్జున్దాస్పై పలువురు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించామని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అనంతరం నివేదిక సమరిస్తామని తెలిపారు. -
‘విచారణ పేరుతో జాప్యం సరికాదు’
శ్రీరాంపూర్(మంచిర్యాల): విచారణ పేరుతో సింగరేణి యజమాన్యం జాప్యం చేయడం సరికాదని కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఎంవోఏఐ) ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంపూర్లోని ఇల్లందు క్లబ్లో బెల్లంపల్లి, రామగుండం రీజియన్ల పరిధిలోని ప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తమ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సీఎంవోఏఐ శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఓసీపీలో ఎలాంటి సంబంధం లేని 32 మంది అధికారులకు చార్జిషీట్లు ఇచ్చి ఎలాంటి చర్యలు లేకుండా నాలుగేళ్లుగా ఎంక్వయిరీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. దీంతో ఎలాంటి తప్పుచేయని అధికారులు తప్పుడు చార్జిషీట్ల కారణంగా శిక్ష అనుభవిస్తున్నారన్నారు. వెంటనే దీనిపై యజమాన్యం స్పందించి చార్జ్షీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏరియా జీఎం సంజీవరెడ్డికి దృష్టికి సమస్యలు తీసుకెళ్లగా ఉన్నతాధికారులకు నివేదించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో ఏరియా జీఎంలు చింతల శ్రీనివాస్(ఆర్జీ 1), మనోహర్(ఆర్జీ 2), అపెక్స్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఏవీ రెడ్డి, నాయకులు చిలక శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ చంద్రమౌళి రమేశ్బాబు, తదితరులు పాల్గొన్నారు. -
డీజీపీ బదిలీ.. మణిపూర్ అల్లర్ల వెనుక ఎవ్వరున్నా వదలం: అమిత్ షా
ఇంఫాల్: మే 3న దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో ఇక్కడ శాంతిని నెలకొల్పేందుకు స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. మణిపూర్లో మూడు రోజుల పర్యటన ముగిసిన తర్వాత, రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు కారణమైన వారిని వదలబోయేది లేదని అన్నారు. అలాగే విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో అల్లర్లకు కారణమైన వారిని పట్టుకునేందుకు ఒక కమిటీని, ప్రజల్లో భయాందోళనలు పోగొట్టడానికి ఒక కమిటీని, శాంతిని నెలకొల్పేందుకు మరో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు ధైర్యం చెప్పి... అమిత్ షా అల్లర్ల నేపథ్యంలో భయబ్రాంతులకు గురైన ప్రజలకు ధైర్యం చెప్పారు. చెప్పుడు మాటలను గానీ, ఎటువంటి వదంతులను గానీ నమ్మవద్దని అన్నారు. ఈ సందర్బంగా మెయితేయి, కుకీ వర్గాలవారు తొందరపడొద్దన్నారు. ప్రజాసంఘాల వారు కూడా సంయమనం పాటించాలని కోరారు. డీజీపీ బదిలీ... ప్రస్తుత డీజీపీ పి.దౌన్గల్ను హోంశాఖకు బదిలీ చేసి ఆయన స్థానంలో CRPF ఐజీగా వ్యవహరించిన త్రిపుర ఐపీఎస్ క్యాడర్కు చెందిన రాజీవ్ సింగ్ ను నూతన డీజీపీగా నియమించారు. ఇక్కడ ఉన్న గిరిజన తెగలకు ఎటువంటి సంబంధం లేని తటస్థ వర్గానికి చెందిన వారిని డీజీపీగా నియమిస్తే శాంతిభద్రతలను తొందరగా అదుపులోకి తేవచ్చనే ఉద్దేశ్యంతోనే డీజీపీని బదిలీ చేశారు. అల్లర్లకు కారణమైనవారిని వదిలే ప్రసక్తే లేదు... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయి కలిగిన విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని వేసి అల్లర్ల వెనుక ప్రధాన సూత్రధారులను కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వమే దర్యాప్తు చేస్తుందన్నారు హోంమంత్రి. ఎవరి దగ్గరైనా ఆయుధాలు ఉన్నట్లయితే వారు వాటిని వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలన్నారు.లేదంటే చాలా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించారు. శాంతిని నెలకొల్పేందుకు కమిటీ... అలాగే మణిపూర్ ప్రజల్లో భయాందోళనలను తొలగించి శాంతిని నెలకొల్పేందుకు గవర్నర్ అనసూయ ఉయికే నేతృత్వంలో మరో కమిటీని నియమించనున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, మెయితేయి, కుకీ వర్గాల ప్రతినిధులతో పాటు ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారన్నారు. చదవండి: మణిపూర్లో అమిత్ షా పర్యటన.. వారికి రూ.10 లక్షల నష్టపరిహారం -
రేపే సుప్రీంకోర్టు ముందుకు అవినాష్ రెడ్డి మ్యాటర్
ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను రేపు సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానుంది. సంఖ్య విషయం సంబంధిత సమాచారం 1 డైరీ నెంబర్ 20416/2023 2 కేసు నెంబర్ MA 00 1285 3 విచారణ తేదీ 23 మే 2023 4 CL నెంబర్ 36 5 కేటగిరీ క్రిమినల్ మ్యాటర్స్ 6 సబ్జెక్ట్ బెయిల్ 7 బెంచ్ 1. జస్టిస్ J.K.మహేశ్వరీ 2. జస్టిస్ పమిడిగంఠం శ్రీ నరసింహా 8 పిటిషనర్ సునీత నర్రెడ్డి 9 రెస్పాండెంట్స్ 1. Y.S.అవినాష్ రెడ్డి 2. డైరెక్టర్, CBI 10 సునీత తరపు న్యాయవాది జెసల్ వాహి 11 అవినాష్ తరపు న్యాయవాది ముకుంద్ P.ఉన్నీ ఈ పిటిషన్ ను సునీత నర్రెడ్డి గతంలో దాఖలు చేశారు. మరో వైపు ఇదే వ్యవహారంపై అవినాష్ రెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ విచారించేలా హైకోర్టు వెకేషన్ బెంచ్ను ఆదేశించాలని విజ్ఙప్తి చేశారు. తల్లి అనారోగ్యం వల్ల వారంపాటు సిబిఐ విచారణకు రాలేనని, సిబిఐ విచారణకు హాజరుపై మినహాయింపు కావాలని కోరారు. తన తల్లికి చికిత్స జరుగుతున్న దృష్ట్యా ఈ నెల 27 వరకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరారు అవినాష్ రెడ్డి. ఇదే విషయాన్ని సిబిఐకి కూడా లిఖిత పూర్వకంగా తెలిపారు. (చదవండి : అమ్మ పరిస్థితి సీరియస్, 7 రోజులు గడువివ్వండి : సీబీఐకి అవినాష్ విజ్ఞప్తి) -
ముగిసిన కేజ్రీవాల్ సీబీఐ విచారణ
►అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ సుమారు 9గంటల పాటు విచారించింది. ఆదివారం విచారణకు హాజరైన అరవింద్ కేజ్రీవాల్ను సుదీర్ఘంగా సీబీఐ అధికారులు విచారించారు. లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి సమాచారాన్ని సేకరించే క్రమంలో కేజ్రీవాల్పై సీబీఐ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు. సాక్షిగానే కేజ్రీవాల్ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీఆర్పీసీ 161 సెక్షన్ కింద కేజ్రీవాల్ స్టేట్మెంట్ను సైతం రికార్డు చేశారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో మౌఖిక, లిఖిత పూర్వక స్టేట్మెంట్ను సీబీఐ అధికారులు తీసుకున్నారు. ► ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి దాదాపు గంటన్నరగా ఆయనను అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1,000 మంది పోలీసులను మోహరించారు. ఆ ప్రాంతంవైపు ఎవరూ రాకుండా 144 సెక్షన్ విధించారు. సీబీఐ కార్యాలయం వద్దకు వెళ్లిన ఆప్ నేతలు రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు నిరసనకు దిగారు. న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆదివారం ఉదయం సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో కేజ్రీవాల్ పాత్రపై అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని గంటల పాటు ఈ విచారణ కొనసాగుతుంది? బీజేపీ నేతలు చెబుతున్నట్లు కేజ్రీవాల్ను అరెస్టు చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. విచారణకు హాజరయ్యేందుకు ముందు ఓ వీడియో కూడా విడుదల చేశారు కేజ్రీవాల్. సీబీఐకి పూర్తిగా సహకరిస్తానని, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తానని స్పష్టం చేశారు. అయితే బీజేపీ తనను కావాలనే లక్ష్యంగా చేసుకుని సీబీఐతో సమన్లు పంపించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. తాము చెప్పినట్టు వినకపోతే అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అయ్యాక అనేక మార్పులు తీసుకొచ్చానని, భారత్ను ప్రపంచంలో నంబర్ వన్ చేయడమే తన లక్ష్యమని చెప్పారు. అభివృద్ధిని చూసి కొన్ని శక్తులు ఓర్వలేకపోతున్నాయని ద్వజమెత్తారు. దేశం కోసమే పుట్టానని, దేశం కోసం ప్రాణాలు సైతం ఇస్తానన్నారు. మరోవైపు కేజ్రీవాల్కు మద్దతుగా ఆప్ కార్యకర్తలు ఢిల్లీలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. -
'కేజ్రీవాల్ అవినీతి పరుడైతే.. ప్రపంచంలో ఒక్క నిజాయితీపరుడు ఉండడు'
న్యూఢిల్లీ: డిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సీబీఐ కార్యాలయంలో ఆదివారం విచారణకు హాజరయ్యే ముందు వీడియో రిలీజ్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. సీబీఐ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని స్పష్టం చేశారు. తనను అరెస్టు చేస్తామంటూ బీజేపీ ప్రచారం చేస్తోందని, ఆ పార్టీ అధికార అహంకారంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 'మా మాట వినాలి లేదంటే జైల్లో పెడతాం అనే విధంగా బీజేపీ వ్యవహరిస్తోంది. దేశాన్ని ప్రేమిస్తా దేశం కోసం ప్రాణాన్ని సైతం ఇస్తా. రాజకీయాల్లోకి ఎన్నో ప్రశ్నల మధ్య పదేళ్ళ క్రితం అడుగులు వేశా. ఎన్నో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశా. జైల్లో పెడతామని చెప్పి పదేపదే బెదిరిస్తున్నారు. ఎనిమిదేళ్లలో ఢిల్లీని అభివృద్ధి చేసి చూపెట్టా. 30 ఏళ్లలో గుజరాత్లో ఏం అభివృద్ధి చేశారు. నా జీవిత లక్ష్యం భారత్ను ప్రపంచంలో నెంబర్ వన్ చేయడం. నేను షుగర్ వ్యాధిగ్రస్తుణ్ణి. ప్రతిరోజు 50 యూనిట్ల కంటే ఎక్కువ ఇన్సులిన్ తీసుకుంటున్నా. అయినా అవినీతికి వ్యతిరేకంగా ఒకసారి పది రోజులు ఇంకోసారి 15 రోజులు నిరాహార దీక్ష చేశా. సీబీఐ 100 సార్లు పిలిచినా వెళ్లి సమాధానం చెప్తా. దేశం కోసం పుట్టాను దేశం కోసం చస్తాను.' అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అలాగే ఆదాయపు పన్ను శాఖలో ఒకప్పుడు కమిషనర్గా పనిచేసిన విషయాన్ని కేజ్రీవాల్ గుర్తు చేశారు. బీజేపీ తాను అవినీతిపరుడ్ని అని ప్రచారం చేస్తోందని, అలాంటి వాడినైతే అప్పుడే రూ.కోట్లు సంపాదించేవాడినని పేర్కొన్నారు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాలే అవినీతి పరుడైతే.. ప్రపంచంలో ఒక్కరు కూడా నిజాయితీ పరుడు ఉండడని అన్నారు. చదవండి: రూ.1,000 కోట్లు ఇచ్చానని చెబితే మోదీని అరెస్టు చేస్తారా?: కేజ్రీవాల్ -
'రామోజీరావు స్టేట్మెంట్ను వీడియో రికార్డు చేశాం.. శైలజను 6న విచారిస్తాం'
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్ఫండ్ కేసులో రామోజీరావును 8 గంటలపాటు విచారించారు సీఐడీ అధికారులు. అనంతరం సీఐడీ ఎస్పీ అమిత్ బర్ధార్ మీడియాతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మార్గదర్శిపై ఇప్పటివరకు 7 కేసులు నమోదుచేసినట్లు పేర్కొన్నారు. 'ఒక కేసుకు సంబంధించి రామోజీరావును విచారించాం. ఆయన స్టేట్మెంట్ను వీడియో రికార్డు చేశాం. తన కోడలు శైలజా కిరణ్ ఇంటికి వచ్చి విచారించాలని రామోజీరావు కోరారు. అందుకే ఇక్కడే విచారణ జరిపాం. ఈ కేసులో కొత్త సాక్ష్యాధారాల ఆధారంగా రామోజీరావును మళ్లీ విచారిస్తాం. రామోజీ స్టేట్మెంట్ను అనలైజ్ చేయాల్సి ఉంది. ట్రాన్స్ఫరెన్స్ దర్యాప్తులో బాగంగా విచారణ జరిపాం. ఐవోతో సహా టెక్నికల్ స్టాఫ్ విచారణలో పాల్గొన్నారు. రామోజీరావు కోడలు శైలజాకిరణ్ను ఈనెల 6న విచారిస్తాం. ఆమెకు కూడా 160 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చాం.' అని సీఐడీ ఎస్పీ తెలిపారు. చదవండి: రామోజీరావు, శైలజా కిరణ్ల సీఐడీ విచారణ.. కీలక ఆధారాలు లభ్యం? -
ఎల్లుండి ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత
-
సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు: వైఎస్ భాస్కర్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: విచారణకు రావాలని సీబీఐ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని వైఎస్ భాస్కర్ రెడ్డి తెలిపారు. గతంలో నోటీసు ఇచ్చిన సందర్భంలో ఈ నెల 24 తరువాత అందుబాటులో ఉంటానని సమాచారం ఇచ్చానని, కానీ ఇవాళ సీబీఐ విచారణకు హాజరవుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరయ్యేందుకు తాను సిద్ధమని భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: సీబీఐ దర్యాప్తుపై సందేహాలు: ఎంపీ అవినాశ్రెడ్డి -
విశాఖ సీబీఐ అధికారులకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు వినతిపత్రం
-
గుంటూరు: చంద్రబాబు సభ తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న విచారణ
-
గుంటూరు ఘటనపై విచారణ: విసరడంతోనే తొక్కిసలాట!
‘చంద్రబాబునాయుడు వెళ్లిపోయిన తర్వాత క్యూలైన్లో నిల్చున్నాం.. లారీలపై ఉన్న వలంటీర్లు కానుకలను కిందకు విసరడంతో టోకెన్ లేకపోయినా ఇస్తున్నారంటూ అంతా ఒక్కసారిగా ఎగబడ్డారు.. కానుకలు విసరడంతోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నా కుమార్తె గాయపడగా నేను అదృష్టవశాత్తూ బయటపడ్డా...’ – విచారణ కమిటీ ఎదుట గుంటూరుకు చెందిన రాఘవి వాంగ్మూలం సాక్షి ప్రతినిధి, గుంటూరు: నూతన ఏడాది తొలిరోజు గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ సందర్భంగా తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందిన ఘటనపై బాధితులు, ప్రత్యక్ష సాక్షులు గురువారం విచారణ కమిటీ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. జనవరి 1వ తేదీన ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరైన విషయం తెలిసిందే. కందుకూరు, గుంటూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనల్లో మొత్తం 11 మంది మృత్యువాత పడ్డ నేపథ్యంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ శేషశయనారెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ను నియమించింది. గుంటూరులో ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన కమిషన్ మైదానం సామర్థ్యం, ఎంత మంది ఉన్నారు? తొక్కిసలాట ఎలా జరిగింది? అనే అంశాలపై కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్లతోపాటు బాధితులు, నిర్వాహకులను ఆరా తీసింది. సభ జరిగిన ప్రదేశం కొలతలు సేకరించింది. ఎంత మందికి కానుక టోకెన్లు ఇచ్చారు? పంపిణీ వద్ద ఎంతమంది ఉన్నారు? తదితర సమాచారాన్ని సేకరించింది. అనంతరం ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్లో విచారణ కొనసాగించారు. గాయపడ్డ వారు, మృతుల కుటుంబీకుల స్టేట్మెంట్ రికార్డు చేశారు. తక్షణమే స్పందించడంతో.. తాము 60 క్యూలైన్లు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించినట్లు పోలీసులు వెల్లడించారు. 30 ఏర్పాటు చేస్తామని చెప్పి చివరికి 12 మాత్రమే ఏర్పాటు చేశారని వివరించారు. బారికేడ్లలో ఒక్కో క్యూలైన్ వెడల్పు ఐదు అడుగులకుపైగా ఉండటంతో కానుకలు తీసుకుని వెనక్కి వచ్చే వారు ఇరుక్కుపోయి తొక్కిసలాట చోటు చేసుకుందని తెలిపారు. తాము వెంటనే స్పందించి కానుకల పంపిణీని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిందని ఘటనా స్థలంలో బాధ్యతలు నిర్వహించిన పోలీసు అధికారులు కమిషన్కు వాంగ్మూలం ఇచ్చారు. అంతా ఒకే లైన్లోనే.. చంద్రబాబు సభ ముగిసే వరకు చీరల పంపిణీ వద్దకు ఎవరిని వెళ్లనివ్వలేదు. సభ ముగిసిన తరువాత వెళితే ఒక కౌంటర్లో ఐదు వేల మందికిపైగా ఉన్నారు. ఒకే లైన్ ద్వారా వెళ్లటం, తిరిగి బయటకు రావటంతో ఇరుక్కుని తొక్కిసలాట జరిగింది. కళ్ల ముందే ఎంతో మంది గాయాలపాలయ్యారు. నిర్వహణ సరిగా లేకపోవటంతోనే తొక్కిసలాట జరిగింది. – గుంటముక్కల సౌందర్య (స్వర్ణభారతినగర్) అక్కా అంటూ ఆప్యాయంగా.. మా ఇంటి పక్క వీధిలో నివసించే షేక్ బీబీ తొక్కిసలాటలో మృతి చెందింది. అక్కా అని ఎంతో అభిమానంగా ఉండేదాన్ని. తొక్కిసలాటలో కళ్ల ముందే చనిపోవటాన్ని మరవలేకపోతున్నా. నేను స్పహ కోల్పోయి రెండు రోజుల పాటు ఐసీయూలో కోమాలో ఉన్నా. వెన్నుపూస దెబ్బతిని నరకం అనుభవిస్తున్నా. – తెల్లమేకల రంగాదేవి (మారుతీనగర్) కాలు విరిగింది.. సభకు వెళ్లిన వారిని మధ్యాహ్నం నుంచి కుర్చీల్లో కూర్చోబెట్టారు. చంద్రబాబు వెళ్లిపోయిన తరువాత ఒక్కసారిగా వదిలిపెట్టడంతో ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాటలో నాకు కాలు విరగడంతో ఆపరేషన్ చేశారు. 15 రోజుల తరువాత అడుగు కిందకు పెట్టా. మాకు న్యాయం చేయాలి. – షేక్ హుస్సేన్బీ (ఏటీ అగ్రహారం) -
ఆ శునకం ఎలా గర్భం దాల్చింది? సరిహద్దు భద్రతా దళం దర్యాప్తు!
షిల్లాంగ్: ఏదైనా శునకం గర్భం దాల్చి పిల్లలకు జన్మనిస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, ఆర్మీలోని భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఏకంగా ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టింది. మేఘాలయ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న తమ దళంలోని ఓ స్నైఫర్ డాగ్ మూడు పిల్లలకు జన్మనివ్వడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ అంశంపై డిప్యూటీ కమాండెంట్ ర్యాక్ అధికారి దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు కూడా. మేఘాలయ రాష్ట్ర బీఎస్ఎఫ్ హెడ్క్వార్టర్ షిల్లాంగ్ ఇచ్చిన ఆదేశాల కాపీని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ సేకరించింది. స్నైఫర్ డాగ్ గర్భం దాల్చడంపై డిసెంబర్ 19న బీఎస్ఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకు బార్డర్ ఔట్ పోస్టు బాఘ్మారాలో స్నైఫర్ డాగ్ లాల్సీ మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అంశంపై డిప్యూటీ కమాండెంట్ ర్యాక్ అధికారి సమ్మరీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చేయాలని పేర్కొంది. డిసెంబర్ 30, 2022 నాటికి దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు.. శిక్షణ ఇచ్చే బీఎస్ఎఫ్ శునకాలు వాటి సంరక్షకుల పర్యవేక్షణలో భద్రంగా ఉంటాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. రెగ్యులర్గా హెల్త్ చెకప్లు జరుగుతాయన్నారు. ఈ శునకాలు ఇతర వాటితో ఎప్పుడూ కలవవని, బ్రీడింగ్ చేపడితే అది పశువైద్యుల పర్యవేక్షణలోనే ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం పిల్లలకు జన్మనిచ్చిన స్నైఫర్ డాగ్ లాల్సీ భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కాపలా కాస్తోంది. ఇదీ చదవండి: Cameroon Green: వేలు విరిగిన విషయం తెలియక నాలుగు గంటలు ఓపికగా -
హీరా గోల్డ్ కేసులో ఈడీ విచారణకు నౌహీరా షేక్
-
‘లైగర్’ పెట్టుబడులపై ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: లైగర్ చిత్రానికి పెట్టుబడులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి దృష్టి సారించింది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి దర్శకుడు, నిర్మాత పూరీ జగన్నాథ్తోపాటు చార్మీని, ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నించిన సంగతి విదితమే. కాగా, శుక్రవారం సినీ ఫైనాన్షియర్ శోభన్ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సినిమాలో ఎంత మొత్తం పెట్టుబడి పెట్టారు?.. పెట్టుబడిగా పెట్టారా?.. లేక ఫైనాన్స్ చేశారా?.. చేస్తే ఆ డబ్బు ఎలా సర్దుబాటు చేశారు?.. దానికి సంబంధించిన లావాదేవీలు ఎలా జరిగాయన్న అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఈ సినిమా పెట్టుబడులపై ఇదివరకు పూరీ జగన్నాథ్, చార్మి, విజయ్ను ప్రశ్నించినప్పుడు, శోభన్ను ప్రశ్నించినప్పుడు ఈడీ అధికారులు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: విజయ్కి ‘లైగర్’ సెగ! -
మల్లారెడ్డి ఆదాయాలపై ఐటీ విచారణ: 13 మంది హాజరు.. మరో 10 మందికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థల ఆదాయం, పన్నుల చెల్లింపులకు సంబంధించి ఈ నెల 22, 23 తేదీల్లో ఐటీ అధికారులు నిర్వహించిన సోదాలపై విచారణ ప్రారంభమైంది. అధికారులు మరో పదిమందికి నోటీసులు ఇచ్చారు. మల్లారెడ్డి విద్యాసంస్థలు, ఆయన బంధువుల ఇళ్లు, ఓ సహకార బ్యాంకు చైర్మన్ ఇంటిపై ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో కోట్లాది రూపాయల నగదు స్వాధీనంతోపాటు పలు కీలకపత్రాలు, ల్యాప్టాప్లు, హార్డ్డిస్క్లు, బ్యాంకు అకౌంట్లు, లాకర్లను పరిశీలించిన విషయం తెలిసిందే. మంత్రి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి, సోదరుడు గోపాల్రెడ్డి, వియ్యంకుడు లక్ష్మారెడ్డి, వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల డైరెక్టర్లు, కొందరు ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లను మొత్తం 13 మందిని ఐటీ అధికారులు బషీర్బాగ్లోని ఐటీ కార్యాలయంలో దాదాపు ఆరు గంటలపాటు ప్రశ్నించారు. వైద్య కళాశాలల్లో డోనేషన్ల పేరుతో సుమారు వందకోట్ల రూపాయలు వసూలు చేసిన అంశానికి సంబంధించి ప్రధానంగా ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు, వస్తున్న ఆదాయానికి చెల్లించిన పన్ను మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి వాటిపై ప్రశ్నించారు. సొసైటీ పేరిట ప్రభుత్వం నుంచి రాయితీలు తీసుకుంటూ, విద్యార్థుల నుంచి నిర్దేశిత ఫీజుల కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసిన అంశంపై అధికారులకు లభించిన ఆధారాలను వారి ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించారు. సోదాల్లో లభించిన అంశాలపై విడతలవారీగా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ఐటీ సోదాలు జరిగిన సమయంలో ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన మహేందర్రెడ్డి కానీ, మంత్రి మల్లారెడ్డి కానీ సోమవారంనాటి విచారణలో లేరు. మంగళవారం మంత్రి మల్లారెడ్డి తరఫున ఆయన ఆడిటర్తోపాటు మరికొంతమంది విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చేవరకు వారిని ప్రశ్నించనున్నట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాం: రాజశేఖర్ రెడ్డి, భద్రారెడ్డి ఆదాయపన్ను శాఖ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు సోమవారం తాము, తమ సంస్థల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లు విచారణకు హాజరైనట్లు మర్రి రాజశేఖర్రెడ్డి, భద్రారెడ్డి విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సోదాల్లో స్వా«దీనం చేసుకున్న పలు పత్రాలకు సంబంధించి ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చామన్నారు. కాల్డేటాను ఓ క్రమపద్ధతిలో ఇవ్వాలని కోరగా సరేనని చెప్పామని భద్రారెడ్డి వివరించారు. కాగా, మరో పదిమందికి ఐటీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. చదవండి: టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గపోరు.. కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్ -
బీఎల్ సంతోష్కు మరోసారి నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్కు 41–ఏ సీఆర్పీసీ కింద ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రెండోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. సోమవారం ఉదయం బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరు కావాల్సిందిగా తొలిసారి జారీ చేసిన నోటీసులో సిట్ పేర్కొంది. కానీ సంతోష్ గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని విచారణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ బి.గంగాధర్ తొలి నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సంతోష్ను అరెస్టు చేయవద్దని సిట్ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సిట్ ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. అయితే సంతోష్కు నోటీసులు అందించేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించక పోవడంతో, ఢిల్లీ పోలీసు కమిషనర్కు నోటీసులు అందించాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో.. సిట్ ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. తుషార్, జగ్గుస్వామిలను అరెస్టు చేస్తారా? సంతోష్తో పాటు కరీంనగర్కు చెందిన న్యాయవాది శ్రీనివాస్, కేరళ బీడీజేఎస్ అధినేత తుషార్ వెల్లాపల్లి, ప్రధాన నిందితుడు రామచంద్రభారతి.. తుషార్కు మధ్యవర్తిత్వం వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్న కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలకూ సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే శ్రీనివాస్ మినహా మిగిలిన ముగ్గురూ విచారణకు హాజరుకాలేదు. దీంతో నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం తుషార్, జగ్గుస్వామిలను అరెస్టు చేయాలా? బీఎల్ సంతోష్కు మాదిరిగానే వారికి కూడా మరోసారి నోటీసులు జారీ చేయాలా? అనే అంశంపై న్యాయ నిపుణులతో సిట్ అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. మరోసారి కస్టడీపై నేడు విచారణ ఈ కేసుకు సంబంధించి రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత రెండురోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయితే నిందితుల నుంచి సంతృప్తికర సమాధానాలు రాలేదని, మరోసారి వారం రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ప్రస్తుతం ముగ్గురు నిందితులు చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సిట్కు స్వేచ్ఛ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం స్పష్టీకరణ -
నారాయణ కాలేజీ ఘటనపై మంత్రి సబితా సీరియస్
సాక్షి, హైదరాబాద్: రామాంతాపూర్ నారాయణ కాలేజ్ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. నారాయణ కాలేజీలో జరిగిన సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఇంటర్ బోర్డు కార్యదర్శిని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. విచారణ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సబితా పేర్కొన్నారు. భవిష్యుత్తలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆమె సూచించారు. కాగా రామంతాపూర్ నారాయణ కాలేజీలో సెంకడ్ ఇయర్ పూర్తి చేసుకున్న విద్యార్థి సాయి నారాయణ.. విద్యార్థి సంఘం నాయకుడు సందీప్తో కలిసి కాలేజ్కు వచ్చాడు. టీసీ ఇవ్వాలంటే డ్యూ ఉన్న రూ. 16 వేల ఫీజు చెల్లించాలని ప్రిన్సిపాల్ సుధాకర్ చెప్పాడు. ఈ క్రమంలో విద్యార్థి నేత, నారాయణ ప్రిన్సిపాల్ మధ్య వాగ్వాదం తలెత్తింది. ఫీజు విషయంలో ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో విద్యార్థి నేత సందీప్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మొత్తం ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థినేత సందీప్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని ముందుగా గాంధీ ఆసుపత్రికి, అక్కడి నుంచి యశోద ఆసుపత్రి పోలీసులు తరలించారు. అయితే యశోద ఆసుప్రతిలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. సందీప్ సహా వెంకటేష్చారీ, కాలేజ్ ఏవో అశోక్కు డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చదవండి: (రామంతాపూర్ నారాయణ కాలేజీలో ఎప్పుడేం జరిగింది?) -
అన్న హత్యకు సుపారీ ఇచ్చిన ఘనుడు.. మన డీటీఓ సార్ భద్రునాయక్
ఆయన జీవితం ఆద్యంతం వివాదాస్పదమే.. వృత్తిలో.. నిజ జీవితంలో.. పుట్టి పెరిగిన ప్రదేశంలో.. పనిచేసే చోట ఎక్కడైనా తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ వస్తున్న అతని నేర ప్రవృత్తి తార స్థాయికి చేరింది. పాపం పండటంతో తను పన్నిన కుట్రలన్నీ బయటపడ్డాయి. సొంత అన్నను హత్య చేసేందుకు కిరాయి హంతక ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని, ఓ యువకుడి హత్యకు కారణమైన అతను పోలీసులకు దొరికిపోయాడు. ఇదంతా చేసింది ఓ రౌడీ షీటరో.. పాత నేరస్తుడో కాదు.. ఈ ఘనతలన్నీ మన డీటీఓ సార్ భద్రునాయక్వే.. వికారాబాద్: రెండేళ్ల క్రితం వికారాబాద్ డీటీఓగా విధులు చేపట్టిన భద్రునాయక్కు వివాదాస్పదమైన వ్యక్తిగా పేరుంది. జిల్లాలో లారీల్లో ఓవర్ లోడ్ (కెపాసిటీకి రెండింతలు) వేసేందుకు ఓనర్ల నుంచి నెలనెలా మూమూళ్లు తీసుకుంటాడనే ఆరోపణలున్నాయి. ఓవర్లోడ్ కారణంగా.. వేసిన కొద్ది రోజులకే రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. ఈ విషయాన్ని ఆర్అండ్బీ, పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు బాహాటంగా చెబుతున్నారు. ఇక లైసెన్సులు, ఫిట్నెస్, ప్రధానంగా వ్యవసాయ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ల సమయంలో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పరిమిత రుసుముకు మూడు నుంచి పది రెట్లు ఎక్కువ మొత్తం వసూలు చేస్తాడని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇతని తీరును నిరసిస్తూ ఏకంగా డీటీఓ ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టారు. వాహనదారులతో దురుసు ప్రవర్తన, దుర్భాషలాడటం వంటి కారణాలతో వివాదాస్పదమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఎఫ్ఐఆర్ చేయని పోలీసులు డీటీఓ భద్రునాయక్ తనను దుర్భాషలాడారని ఇటీవల ఓ వ్యక్తి చన్గొముల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పత్రాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ వాహనాన్ని అడ్డుకుని సీజ్ చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సమయంలో పలువురు వాహనదారులు, ప్రజలు బాధితుడికి అండగా వచ్చారు. భద్రునాయక్ ఆగడాలపై మండిపడుతూ నిరసన వ్యక్తంచేశారు. ఇంత జరిగినా.. డీటీఓపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇందులో కొందరు నేతలు, పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకుని పీఎస్లోనే పంచాయితీ పెట్టి.. బాధితుడు ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా ఒప్పించారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆయనపై కేసు నమోదు కాకుండా జిల్లా పోలీసులే గట్టెక్కించారని తెలిసింది. జిల్లా రవాణాధికారిని సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారనే వార్తలు శుక్రవారం సంచలనంగా మారాయి. పోలీసులు అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయాలపై శనివారం ఉదయం వరకు స్పష్టత లేకపోవడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగింది. వసూళ్లకు ముఠా ఏర్పాటు రెండేళ్లుగా వికారాబాద్ డీటీఓగా విధులు నిర్వహిస్తు న్న భద్రునాయక్ అనేక వివాదాలకు తెరతీసినప్పటికీ ఆ శాఖ ఉన్నతాధికారులు నోరు మెదపక పోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆదాయ వనరు లు సమకూర్చుకునేందుకు తన కార్యాలయానికి చెందిన కొందరు కింది స్థాయి ఉద్యోగులు, కానిస్టేబుళ్లు, ఆర్టీఏ బ్రోకర్లతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నా యి. ఈయన క్యాడర్ ఎంవీఐ అయినప్పటికీ తన పలుకుబడితో డీటీఓగా పోస్టింగ్ వేయించుకుని రెండేళ్లుగా వికారాబాద్లో తిష్ట వేయడం గమనార్హం. విచారణలో కొత్త కోణాలు సొంత అన్నను హత్య చేయించేందుకు రూ.కోటితో పాటు ఎకరం పొలం ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్తో ఒప్పందం చేసుకున్న భద్రునాయక్ను అరెస్టు చేసిన సూర్యాపేట పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. విచారణలో ఆయన పనిచేస్తున్న రవాణా శాఖతో పాటు అవినీతి నిరోధక శాఖల పనితీరుపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. అన్నను హత్య చేసేందుకు భారీ మొత్తంలో డబ్బులు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకోవడం, భద్రునాయక్ అక్రమాస్తుల చిట్టాను ఏసీబీకి చెబుతానని సొంత అన్నే అతన్ని బెదిరిస్తూ రావడం, భద్రునాయక్ అనేక చోట్ల అక్రమ ఆస్తులు కలిగి ఉండటం అవినీతి నిరోధక, ఇన్కమ్ ట్యాక్స్ శాఖల నిఘా వైఫల్యాలను సూచిస్తోంది. తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆయన ఆగడాలను ఉపేక్షిస్తుండటం ఆర్టీఏ ఉన్నతాధికారుల డొల్లతనం, లోపాయికారీ ఒప్పందాలను ప్రస్ఫుటం చేస్తోంది. ప్రవీణ్ హత్య కేసును విచారణ చేస్తున్న సూర్యాపేట పోలీసులు భద్రునాయక్ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేయగా.. అతనిపై చేసిన ఫిర్యాదును బుట్టదాఖలు చేయించి, ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా చేసిన మన జిల్లా పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. -
ఒకే చోట 15 ఏళ్ల సర్వీసా..!
శ్రీకాకుళం న్యూకాలనీ: సమగ్రశిక్ష అభియాన్ జిల్లా కార్యాలయంలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్(ఎఫ్ఏఓ)గా ఓ వ్యక్తి 14 ఏళ్లుదాటి పనిచేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఒకే పోస్టులో ఇన్నేళ్లపాటు రిలీవింగ్, బదిలీ ఉత్తర్వులు లేకుండా పనిచేస్తున్న ఉదంతంపై కలెక్టర్ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వెంటనే సంబంధిత ఎఫ్ఏఓ పోస్టుకు సంబంధించిన ఫైల్ను సిద్ధం చేయాలని సమగ్రశిక్ష అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న కవిటి మోహనరావు మాతృశాఖ ఖజానా శాఖ. సంబంధిత మాతృశాఖ నుంచి రిలీవింగ్ ఆర్డర్ లేకుండా, సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టరేట్ నుంచి బదిలీ ఉత్తర్వులు లేకుండా 2008లో అప్పటి రాజీవ్ విద్యామిషన్ (ప్రస్తుతం సమగ్రశిక్షగా పేరు మార్చారు)లో అకౌంటెంట్గా విధుల్లో చేరారు. 8 ఏళ్లు పనిచేసిన తర్వాత అదే శాఖలో 2015 డిసెంబర్ 23 నుంచి (మధ్యలో కొన్ని నెలలు విధులకు దూరంగా ఉన్నారు) ఇప్పటి వరకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఇటీవల వ్యక్తిగత అవసరాల కోసం సెలవులు మంజూరు చేయమని ఏపీసీ జయప్రకాష్ను కోరడంతో రచ్చ మొదలైనట్టు తెలుస్తోంది. అన్ని రోజులు కుదరదని, ఖజనాశాఖ నుంచి రిలీవింగ్ లెటర్ చూపించాలని, లేదా స్టేట్ సమగ్రశిక్ష ఆఫీస్ నుంచి బదిలీ ఉత్తర్వులైనా చూపించాలని కోరగా, అవేవీ తన వద్ద లేవని మోహనరావు బదులివ్వడంతో ఇదే విషయమై ఉన్నతాధికారులకు ఏపీసీ నివేదించినట్లు తెలిసింది. ఈ ఉదంతంపై కలెక్టర్తోపాటు స్టేట్ సమగ్రశిక్ష ఎస్పీడీ వెట్రిసెల్వీ ఆరా తీసి ఫైల్ సిద్ధంచేయాలని సూచించినట్టు సమాచారం. మరోవైపు సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ రోణంకి జయప్రకాష్ శాఖాపరంగా తీసుకున్న కార్యాలయం మార్పు, నిర్ణీత గడువుకు ముందే సెక్టోరియల్ అధికారుల తొలగింపు, కొత్త నోటిఫికేషన్ తదితర నిర్ణయాలను తప్పుపడుతూ ఎఫ్ఏవో సైతం ఏపీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ రెండు ఉదంతాలపై పూర్తి నివేదిక అందజేయాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. విచారణాధికారిగా సైతం నియమించారు. -
మహేష్ బ్యాంకు హ్యాక్ కేసు.. షాకింగ్ విషయాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మహేష్ బ్యాంకు నిధుల గోల్మాల్ కేసులో కీలక పురోగతి కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు సర్వర్లను హ్యాక్ చేసి నేరగాళ్లు నిధులను కొట్టేశారు. బ్యాంకు ఖాతాలతో పాటు సర్వర్లో చొరబడి 14 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. నిధులు కాజేసిన ప్రధాన సూత్రధారిని నగర పోలీసులు గుర్తించారు. నైజీరియా నుంచే బ్యాంకు సర్వర్లను హక్ చేసి డబ్బు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఇదే తరహాలో మూడు బ్యాంకుల నిధులను నేరాగాళ్లు కొట్టేశారు. అందులో.. మహారాష్ట్రలో బ్యాంక్ ఆఫ్ బరోడా, తెలంగాణ కోపరేటివ్ బ్యాంకు, మహేష్ నిధులను లూటీ చేశారు. మహేష్ బ్యాంకు కేసులో ఇప్పటి వరకు 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్లో ఉండి నైజీరియన్ కి సపోర్ట్ చేసిన కీలక సూత్రధారి అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకుల దోపిడిలపై కీలక విషయాలను హైదరాబాద్ సీపీ వెల్లడించనున్నారు. చదవండి: Mahesh bank Fraud Case: తప్పించుకునేందుకు భవనం నుంచి దూకిన నైజీరియన్ -
భార్యను వదిలించుకోవడానికి భర్త మాస్టర్ ప్లాన్.. వైద్యం పేరుతో
ఆర్మూర్ టౌన్(నిజామాబాద్ జిల్లా): వైద్యం పేరుతో భార్యకు స్టెరాయిడ్స్ అందించిన భర్త గంగసాగర్పై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఆర్మూర్కు చెందిన ఆర్ఎంపీ గంగసాగర్ తన భార్యను వదిలించుకోవడానికి చికిత్స పేరుతో స్టెరాయిడ్స్ ఎక్కిస్తూ మట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయమై ఆయన భార్య స్రవంతి సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేసింది. చదవండి: వదినమ్మ కనిపించడం లేదని.. ఆఖరికి అతడే! దీంతో కలెక్టర్ ఈ సంఘటనపై విచారణ జరపాలని సఖీ టీంకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సఖీ టీం వారు క్షేత్ర స్థాయిలో విచారించి బాధితురాలికి న్యాయం చేయాలని ఆర్మూర్ పోలీసులకు సూచించారు. కాగా రెండేళ్ల క్రితం కులం పెద్ద మనుషుల సమక్షంలో భార్య, భర్తల మధ్య సమస్య పరిష్కారం కాక పోవడంతో ఇరువురికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. అలాగే స్టెరాయిడ్స్ కేసులో భర్త గంగసాగర్పై విచారణ చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టులో విచారణ
-
ఇప్పుడు టోనీ.. అప్పుడు చుక్స్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ టోనీని న్యాయస్థానం అనుమతితో ఐదు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన పంజగుట్ట పోలీసులు కీలకాంశాలను గుర్తించారు. దేశవ్యాప్తంగా డ్రగ్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న అతగాడు భారీ మాఫియానే నడిపాడని తేల్చారు. గతంలో టోనీ కొన్నాళ్లు హైదరాబాద్లో ఉన్నట్టు, ఎక్సైజ్ పోలీసులకు సంబంధించిన రెండు కేసుల్లో వాంటెడ్ అయినట్టు తేల్చారు. ఈ వివరాలు దర్యాప్తు అధికారులు గురువారం నాంపల్లి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. 2013 నుంచి దేశంలో అక్రమంగా నివసిస్తున్న టోనీ అనేక ప్రాంతాల్లో సంచరించాడు. తొలుత ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా.. టోనీ ఒక్కొక్కచోట ఒక్కొక్క పేరు, గుర్తింపుతో నివసించాడు. తొలుత ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా చేశాడు. ఇతడి అనుచరులు అక్కడ అరెస్టు కావడంతో తన మకాం బెంగళూరుకు మార్చాడు. ఆ నగరంలోనూ కొన్నాళ్లు డ్రగ్స్ దందా చేసిన ఇతగాడు ఎక్కడా తన ఉనికి బయటపడనీయలేదు. ఆ నగరంలోనూ మాదక ద్రవ్యాల కేసుల్లో ఇతడి అనుచరులే పట్టుబడ్డారు. దీంతో 2019లో హైదరా బాద్కు వచ్చిన టోనీ టోలిచౌకిలోని అద్దె ఇంట్లో నివసించాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఎస్కే చుక్స్ పేరుతో చెలామణి అయ్యాడు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పిస్తూ తన అనుచరులైన ఐవరీ కోస్ట్ జాతీయులు పాట్రిక్స్, అబ్దుల్యా, కెన్యాకు చెందిన సులేమాన్ ఇబ్రహీంలతో అమ్మించాడు. ఆ ఏడాది గోల్కొండ, నాంపల్లి ఎక్సైజ్ పోలీసులు వేర్వేరు సందర్భాల్లో ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు. ఆ కేసుల్లో చుక్స్గా టోనీ పేరు నమోదైంది. ఇప్పటికీ ఆ రెండు కేసుల్లోనూ ఇతడు వాంటెడ్గానే ఉన్నాడు. నిఘా పెరగడంతో ముంబైకి.. ఇలా హైదరాబాద్లోనూ టోనీపై నిఘా పెరగ డంతో మళ్లీ ముంబైకి మకాం మార్చాడు. గతంలో నివసించిన ప్రాంతానికి దూరంగా అడ్డా ఏర్పాటు చేసుకున్నాడు. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దందా చేస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. టోనీ ఐదు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో పంజగుట్ట పోలీసులు అతనితో పాటు తాజాగా అరెస్టయిన ముగ్గురు అనుచరులనూ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలిం చారు. ఈ సందర్భంగా న్యాయస్థానానికి సమర్పిం చిన రిమాండ్ రిపోర్ట్లో టోనీకి సంబంధించి కీలకాంశాలు పొందుపరిచారు. వీటి ఆధారంగా ఎక్సైజ్ పోలీసులు టోనీనీ పీటీ వారెంట్పై ఆ కేసుల్లో అరెస్టు చేయనున్నారు. ఆపై కోర్టు అనుమతితో టోనీని తమ కస్టడీలోకి తీసుకుని విచారించడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టులో విచారణ
-
Eluru Town: యువతిపై లైంగికదాడి.. సీఐపై తీవ్ర ఆరోపణలు
సాక్షి, ఏలూరు టౌన్: ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు పోలీసు శాఖలో అధికారుల అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఏలూరులో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఓ అధికారిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడిన సీఐ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించడంతో పాటు ఆమెను బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. గతేడాది ఈ కేసుకు సంబంధించి యువతి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా చర్యలేమి లేకుండా చేసుకునేందుకు సీఐ తీవ్రంగా ప్రయత్నించారు. చదవండి: (దేవుడా ఎంతపని చేశావయ్యా.. పెళ్లై నెలైనా కాలేదు.. ఇంతలోనే) అయితే యువతి ఫిర్యాదుపై రాష్ట్రస్థాయి అధికారుల విచారణ నేపథ్యంలో సీఐపై వేటు తప్పదని తెలుస్తోంది. సదరు సీఐ ఇటీవల అటాచ్మెంట్పై మరో విభాగంలో పోస్టింగ్ తెచ్చుకున్నారు. అయితే ఆరోపణల నేపథ్యంలో రెండు రోజుల క్రితం సీఐను వీఆర్కు తరలించారు. జిల్లా ఎస్పీ రాహుల్దేవ్శర్మ ఆధ్వర్యంలో సీఐపై విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఏలూరు రూరల్ స్టేషన్లో గతంలో పనిచేసిన సీఐ, ఎస్సై పై వేటు పడింది. వీరిద్దరిపై కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. చదవండి: (భార్యతో కలిసి బైక్పై వెళ్తుండగా.. గాలిపటం గొంతుకు చుట్టుకుని ప్రాణం తీసింది..) -
విజయవాడ సైబర్ మోసంపై దర్యాప్తు జరుగుతోంది: పోలీసులు
-
పిచ్చోడి చేతికి ఫోన్.. మహిళా ఏఎస్సైకి అశ్లీల ఫోటోలు!
సాక్షి,హైదరాబాద్: నగరంలో పని చేసే పోలీసు అధికారిణికి సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. కొన్నాళ్లుగా ఓ గుర్తుతెలియని వ్యక్తి అశ్లీల ఫొటోలు పంపుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. నిందితుడి కోసం కేరళకు వెళ్లిన అధికారులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. అరెస్టుకు అవకాశం లేకపోవడంతో నోటీసులు జారీ చేసి సరిపెట్టారు. రాష్ట్ర మహిళ భద్రత విభాగంలో అసిస్టెంట్ సబ్–ఇన్స్పెక్టర్గా (ఏఎస్సై) ఓ అధికారిణికి కొన్ని రోజులుగా గుర్తుతెలియని ఫోన్ నంబర్ నుంచి వాట్సాప్ ద్వారా అశ్లీల ఫొటోలు, వీడియోలు వస్తున్నాయి. తొలినాళ్లల్లో యాదృచ్ఛికంగా జరిగిందని భావించిన ఆమె సందేశాలతోనే మందలించారు. అయినప్పటికీ ఈ వేధింపులు ఆగకపోవడంతో తీవ్రంగా పరిగణించారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాధారణ మహిళలపై జరిగే నేరాలనే సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు. అలాంటిది ఓ పోలీసు అధికారిణే బాధితురాలిగా మారడంతో కేసు దర్యాప్తునకు ప్రాధాన్యం ఇచ్చారు. సాంకేతికంగా ముందుకు వెళ్లిన ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నిందితుడు కేరళ రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి తీసుకురావాలనే ఉద్దేశంతో రెండు రోజుల క్రితం ప్రత్యేక బృందంతో బయలుదేరి అక్కడకు చేరుకున్నారు. తిరువనంతపురం సమీపంలోని ఓ గ్రామంతో నిందితుడి ఆచూకీ కనిపెట్టిన ప్రత్యేక బృందం సోమవారం అతడిని అరెస్టు చేయాలని నిర్ణయించుకుంది. దీంతో నిందితుడు ఉండే ప్రాంతానికి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు నేతృత్వంలోని బృందం చేరుకుంది. అక్కడ అతగాడి పరిస్థితి చూసిన నగర అధికారులు అవాక్కయ్యారు. మహిళ ఏఎస్సైకి అశ్లీల ఫొటోలు, వీడియోలు పంపుతున్న వ్యక్తి చిన్న గుడిసెలో నివసిస్తున్న మానసిక స్థితి సరిగ్గా లేదని గుర్తించారు. దీనికి తోడు మూగ–చెవిటి వ్యక్తి కావడంతో కుటుంబీకులు సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్ కొనిచ్చారు. అత్యవసర సమయంలో తమకు సంప్రదించడానికి ఇలా చేశారు. అయితే ఈ ఫోన్ను వినియోగించే సదరు నిందితుడు అనేక మందికి అశ్లీల ఫొటోలు, వీడియోలు పంపిస్తున్నాడని తేలింది. అతడి ఫోన్ పరిశీలించిన అధికారులు అందులో అనేక ఫొటోలు, వీడియోలు గుర్తించారు. ఈ విషయం నిందితుడి కుటుంబీకులకు తెలిపారు. వారి సాయంతో ప్రశ్నించగా... తనకు మహిళ ఏఎస్సై ఎవరో తెలియదని, ఏదో ఒక ఫోన్ నెంబర్ ఎంపిక చేసుకుని ఇలా పంపిస్తుంటానని నిందితుడు చెప్పాడు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, లేదంటే అనేక సమస్యలు వస్తాయని కుటుంబీకులను పోలీసులు హెచ్చరించారు. నిందితుడిని అరెస్టు చేసే అవకాశం లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. -
జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై NCB విచారణ
-
కొలిక్కిరాని ‘కొడనాడు’ కేసు.. తలలు పట్టుకుంటున్న పోలీసులు
కొడనాడు ఎస్టేట్ కేసు ఐదేళ్లయినా ఒక కొలిక్కిరాకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే దివంగత సీఎం జయలలిత మాజీ డ్రైవర్ కనకరాజ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అతని అన్న, భార్య ఫిర్యాదు మేరకు శుక్రవారం నుంచి మళ్లీ విచారణ మొదలైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: నీలగిరి జిల్లా కొత్తేరి సమీపంలోని కొడనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళకు టీ ఎస్టేట్, బంగ్లా ఉన్నాయి. వారు ఏడాదికి రెండుసార్లు ఈ ఎస్టేట్లో కొన్నాళ్లు సేదదీరడం అలవాటు. 2016 డిసెంబర్ 5న జయలలిత మరణం తర్వాత కొడనాడు ఎస్టేట్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. 2017 ఏప్రిల్ 23వ తేదీ అర్దరాత్రి కొందరు అగంతకులు ఎస్టేట్లో ప్రవేశించి ఆస్తి పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారు. అడ్డు వచ్చిన ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు ను హతమార్చారు. జయలలిత వద్ద గతంలో కారు డ్రైవర్గా పనిచేసిన కనకరాజ్ సహా 11 మంది దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చదవండి: (ఫడ్నవీస్కు గడ్కరీ పాఠం?) ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే కనకరాజ్ అను మానాస్పద స్థితిలో మరణించాడు. అదే ఏడాది ఏప్రిల్ 27వ తేదీ రాత్రి సేలం జిల్లా ఆత్తూరు సమీపంలోని చందనగిరి అనే ప్రాంతంలో కనకరాజ్ మృతదేహం లభించగా సయాన్ అనే వ్యక్తి సహా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసును మళ్లీ మొదటి నుంచి విచారించాలని కోర్టులో సయాన్ పిటిషన్ వేయడంతో కొడనాడు లోని కొత్తేరి పోలీసులు పునర్విచారణ చేపట్టారు. దక్షిణ మండల ఐజీ సుధాకర్ నేతృత్వంలో ఐదుగురితో కూడిన ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. తన తమ్ముడు కనకరాజ్ను పథకం ప్రకారం హత్య చేశారని అన్న ధనపాల్ విచారణాధికారికి ఫిర్యాదు చేశాడు. చదవండి: (దీపావళి తర్వాత శివసేన ప్రక్షాళన) అలాగే కనకరాజ్ భార్య కలైవాణి సైతం తన భర్త మరణంలో అనుమానాలు ఉన్నాయని వాంగ్మూలం ఇచ్చింది. ఈ కారణంగా కనకరాజ్ మృతిపై పునర్విచారణ జరపాల్సిందిగా సేలం జిల్లా ఎస్పీ అభినవ్ ఆదేశాలు జారీచేశారు. అంతేగాక విచారణాధికారిగా ఆత్తూరు డీఎస్పీ రామచంద్రన్ను నియమించారు. ఆయన శుక్రవారం నుంచి విచారణ ప్రారంభించారు. 20 మందికిపైగా పోలీసులు ఐదు వాహనాల్లో ఉదయం 6.45 గంటలకు అత్తూరుకు వచ్చారు. శక్తినగర్లోని కనకరాజ్ బంధువుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. -
రేవ్ పార్టీ.. ఎవరికీ అనుమానం రాకుండా అందులో డ్రగ్స్
ముంబై: డ్రగ్స్ దందాను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, కేటుగాళ్లు సరికొత్త దారులు ఎంచుకుంటూ సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా ముంబయి క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీలో ఓ మహిళ ఏకంగా శానిటరీ న్యాప్కిన్లో డ్రగ్స్ తీసుకువెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలడంతో షాక్ గరయ్యారు. కాగా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు మొత్తం 19మందిని అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా అక్టోబర్ 11న విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ప్రొడ్యూసర్ ఇంతియాజ్ ఖత్రీకి ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్పై బయటకు వచ్చేందుకు ఆర్యన్ ఖాన్ ఇప్పటికే ప్రయత్నించగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ముంబై మెజిస్ట్రేట్ కోర్టు గురువారం ఆర్యన్ ఖాన్ సహా ఏడుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆర్యన్ ఖాన్ తరఫున వాదిస్తున్న న్యాయవాది సతీష్ మనేషిండే కోర్టులో.. ఆర్యన్ ఖాన్ను క్రూయిజ్ పార్టీకి ఆహ్వానించారు. అయితే, అతనికి బోర్డింగ్ పాస్ కూడా లేదు. రెండవది, పోలీసులు అర్యాన్ని అదుపులోకి తీసుకుంది కూడా కేవలం అతని చాట్ ఆధారంగా మాత్రమేనని మరే ఇతర బలమైన అధారాలు లేవని తెలిపారు. చదవండి: భార్యే తెగబడిందా.. ప్రియుడు సహకరించాడా..? -
Disha Case: విచారణకు హాజరైన వీసీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: దిశ నిందితుల ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న వీసీ సజ్జనార్ సోమవారం త్రిసభ్య కమిటీ (సిర్పుర్కర్ కమిషన్) ఎదుట హాజరయ్యారు. ఎన్కౌంటర్ ఘటనపై సజ్జనార్ స్టేట్మెంట్ను కమిషన్ నమోదు చేయనుంది. కాగా, ఇప్పటికే ఎన్కౌంటర్ బాధిత కుటుంబాలు, సిట్ చీఫ్ మహేష్ భగవత్, పలువురు సాక్ష్యుల వాంగ్ములాలు కమిషన్ నమోదు చేసింది. అయితే ఈ కేసులో సజ్జనార్ స్టేట్మెంట్ కీలకం కానుంది. చదవండి: (‘దిశ’ ఎన్కౌంటర్: నా కళ్లలో మట్టి పడింది) -
బుల్లెట్ల శబ్దం వినిపించిందా?.. లేదు ఆ సమయంలో నిద్రపోతున్నా!
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’హత్యాచార నిందితుల ఎన్కౌంటర్పై జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. 2019 డిసెంబర్ 5న నిందితులను గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ నుంచి రంగారెడ్డి జిల్లా చటాన్పల్లిలో దిశ మృతదేహాన్ని కాల్చే సిన ప్రాంతానికి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లిన వాహనం డ్రైవర్ యాదగిరిని గురువారం త్రిసభ్య కమిషన్ విచారించింది. ఎన్కౌంటర్ సమయంలో మీకు బుల్లెట్ల శబ్దం వినిపించిందా? అని డ్రైవర్ను ప్రశ్నించగా.. ‘లేదు, ఆ సమయంలో నేను వాహనంలోనే పడుకున్నా’అని డ్రైవర్ సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత ఎన్కౌంటర్లో మరణించిన నిందితుల మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కృపాల్ గుప్తా, బీబీనగర్లోని ఎయిమ్స్ ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ సుధీర్ గుప్తాలను కూడా కమిషన్ విచారించింది. మృతదేహాలకు పోస్ట్మార్టం ఎందుకు నిర్వహించలేదని కృపాల్ గుప్తాను ప్రశ్నించగా.. మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇవ్వలేదని పొంతనలేని సమాధానం చెప్పినట్లు తెలిసింది. మృతదేహాలపై ఏమైనా గాయాలున్నాయా అని ప్రశ్నించగా.. లేవని కృపాల్ సమాధానమివ్వగా, సుధీర్ గుప్తా మాత్రం మృతదేహాలపై పోలీసులు కొట్టినట్లు గాయాలున్నాయని చెప్పినట్లు సమాచారం. శుక్రవారం కూడా గాంధీ ఆసుపత్రి వైద్యుల విచారణ కొనసాగనుంది. దిశ ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న వీసీ సజ్జనార్ను సోమవారం విచారించే అవకాశం ఉంది. చదవండి: Tollywood Junior Artists: ప్రియుడు మోసం చేయడంతో టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య -
ఎస్ఎస్సీ బోర్డు ఉద్యోగినుల ఫిర్యాదులపై మహిళా కమిషన్ విచారణ
సాక్షి,విజయవాడ: ఎస్ఎస్సీ బోర్డు ఉద్యోగినుల ఫిర్యాదులపై మహిళా కమిషన్ సోమవారం విచారణ చేపట్టింది. ఎస్ఎస్సీ బోర్డులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు తమపై జరుగుతున్నవేధింపులపై కొద్దిరోజుల క్రితం మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. తాజాగా మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. ఎస్ఎస్సీ బోర్డులో ఉద్యోగిణులు వేధింపులపై వచ్చిన ఫిర్యాదులపై ఆరోపణల వివరాలతో కూడిన విచారణ నివేదికను త్వరలో అందజేస్తామన్నారు. వెంటనే అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా ఉద్యోగులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. వివిధ శాఖల ఉద్యోగ బాధ్యతల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కానీ మహిళలపై ఇతర వేధింపుల సంఘటనలను సీరియస్గా పరిగణిస్తామని తెలిపారు. -
కార్వీ ఎండీ పార్థసారథిపై మరో కేసు..
హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్బీఎల్)సంస్థ ఎండీ పార్థసారథి కేసుపై సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. తాజాగా, ఆయనపై మరో కేసు నమోదు చేసినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. డీమాట్ అకౌంట్ నుంచి రూ.35 కోట్లను.. తన వ్యక్తి గత ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు పార్థసారథిపై సీసీఎస్ పోలీసులు నాలుగు కేసులను నమోదు చేశారు. చదవండి: ఆడిట్ రిపోర్ట్ ముందుంచి పార్థసారథిని ప్రశ్నించిన పోలీసులు -
హృదయ విదారక ఘటన: చెట్టుకు కట్టేసి దళిత కుటుంబంపై దాడి
చండీగఢ్: పంజాబ్లో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. కొంత మంది గ్రామస్తులు దళిత దంపతుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. సదరు కుటుంబాన్ని చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా మైనర్ బాలికను, ఆమె తల్లిని లైంగిక వేధింపులకు గురిచేశారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. కాగా, పంజాబ్లోని ఫాజిల్కా గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ అమానుషాన్ని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ (ఎన్సీఎస్సీ) తీవ్రంగా పరిగణించింది. దీనిపై వెంటనే విచారణ ప్రారంభించి, నిందితులను పట్టుకోవాలని పంజాబ్ పోలీసు అధికారులను ఆదేశించింది. కాగా, విచారణ వివరాలను మెయిల్ ద్వారా తమకు నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఈ కేసుపై పోలీసు అధికారులు జాప్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని పంజాబ్ పోలీసులు తెలిపారు. చదవండి: మైనర్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి! -
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను విచారించిన ఈడీ
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించింది. మనీ లాండరింగ్ కేసుతో పాటు, ఎన్నికల కమిషన్తో సంబంధం ఉన్న లంచం కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ కేసు విషయమై సోమవారం ఫెర్నాండెజ్ విచారించిన ఈడీ.. పలు అంశాలపై ఆరా తీసింది. సుకేశ్ చంద్రశేఖర్ కేసులో కేవలం సాక్షిగా మాత్రమే ఆమెను విచారించినట్లు ఈడీ తెలిపింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆగస్టు 24న, చంద్రశేఖర్కు చెన్నైలో ఉన్న ఓ బంగ్లాను, 82.5 లక్షల నగదు, డజనుకు పైగా విలాసవంతమైన కార్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నేరపూరిత కుట్ర, మోసం, దాదాపు 200 కోట్ల రూపాయల మేరకు దోపిడీకి సంబంధించి ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు నమోదైనట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం చంద్రశేఖర్ని రోహిణి జైలులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. Enforcement Directorate (ED) is questioning Bollywood actress Jacqueline Fernandez in Delhi for the last five hours, in a money laundering case. (File photo) pic.twitter.com/ftUj2CkNcN — ANI (@ANI) August 30, 2021 చదవండి: Payel Sarkar: నటికి ఫేక్ డైరెక్టర్ అసభ్య సందేశాలు -
సినీతారల డ్రగ్స్ కేసులో రేపటి నుంచి విచారణ
-
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో లావాదేవీలపై ఈడీ దృష్టి
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల క్రితం డ్రగ్స్ కేసు టాలీవుడ్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. మరుగునపడ్డ ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అకస్మాత్తుగా దూకుడు పెంచింది. తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో జరిపిన లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. ప్రస్తుతం విదేశాలకు నిధులు ఎలా మళ్లించారనే దానిపై విచారణ చేపట్టనుంది. గతంలో డ్రగ్స్ సరఫరా, వినియోగం వరకూ ఎక్సైజ్ శాఖ దృష్టిపెట్టింది. ఈ కేసులో చికాగో ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్తో సంబంధాలు ఉన్నట్లు, ఆస్ట్రియా, దక్షిణాఫ్రికా నుంచి డ్రగ్స్ సరఫరా జరిగినట్లు అనుమానిస్తోంది. ఎక్సైజ్శాఖ్ నుంచి వివరాలు తీసుకుని ఈడీ విచారించనుంది. చదవండి: Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం.. మనీల్యాండరింగ్ కేసు నమోదు -
మధుసూదన్రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో విచారణ ముమ్మరం
హైదరాబాద్: మధుసూదన్రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. దర్యాప్తులో.. మధుసూదన్రెడ్డిని గంజాయి మాఫియానే హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులు కర్ణాటక బీదర్కు చెందిన సంజయ్, జగన్నాథ్, హరీష్, సంజీవ్గా పేర్కొన్నారు. గత నెలలో గంజాయి తీసుకొస్తుండగా సంజయ్ గ్యాంగ్ను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. కాగా గంజాయి స్మగ్లింగ్ కోసం లారీ, డబ్బుని మధుసూదన్రెడ్డి సమకూర్చారు. చదవండి: Pani Puri Man Viral Video: ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో అది కలిపావేంట్రా అనుకోకుండా గంజాయ్ గ్యాంగ్ పోలీసులకు పట్టుబడటంతో డబ్బు తిరిగి ఇవ్వాలని అతను ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో కిడ్నాప్ చేసి హత్యకు స్కెచ్ ప్లాన్ చేశారు. రౌడీషీటర్ ఎల్లంగౌడ్ హత్య కేసులో మధుసూదన్రెడ్డి నిందితుడుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మధుసూదన్రెడ్డి హత్య వెనకాల ప్రతికారం కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఇంటి నుంచి పనిచేయడానికేనా ఉద్యోగం? -
విస్కీ బాటిల్ ఎక్కడుంది? విచారణ చేపట్టిన అమెరికా
వాషింగ్టన్: విస్కీ బాటిల్ కనిపించడం లేదని అమెరికా విచారణ చేపట్టింది. ఈ విస్కీ ఖరీదు 5800 డాలర్లు (రూ.4.30 లక్షలు) కాగా, దాన్ని 2019 లో అప్పటి విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోకు జపాన్ ప్రభుత్వం బహుకరించిందని ట్రెజరీ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఆ బాటిల్ అధికారిక లెక్కల్లో కనిపించడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని సంబంధిత అధికారులు మాయమైన ఆ విస్కీ బాటిల్ ఆచూకీ కోసం విచారణ చేపట్టారు. విదేశాంగ కార్యదర్శిగా పాంపియో పని చేస్తున్నప్పుడు జూన్ 24, 2019 న సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో జపాన్ అధికారులు అమెరికా విదేశాంగ శాఖకు బహుమతి ఇవ్వగా అది పాంపియో స్వీకరించాడా లేదా అనేది అస్పష్టంగా ఉందని టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే ఈ అంశంపై పాంపియో న్యాయవాది స్పందిస్తూ.. మిస్టర్ పాంపియోకి అప్పట్లో ఈ విస్కీ బాటిల్ అందుకున్న జ్ఞాపకం లేదు, అలానే ఆ బాటిల్ ఎలా మాయమైందనేది కూడా తనకు తెలియదని వెల్లడించారు. ప్రభుత్వ అధీనంలో ఉండే ఒక వస్తువు మాయంకావడంతో ఈ వార్త అక్కడ వైరల్గా మారింది. -
ఐదున్నర గంటల పాటు తీన్మార్ మల్లన్న విచారణ
సాక్షి, చిలకలగూడ( హైదరాబాద్): క్యూ న్యూస్ ఛానల్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గురువారం చిలకలగూడ పోలీసుస్టేషన్లో హాజరయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్లో నమోదైన బెదిరింపుల కేసుకు సంబంధించి పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. దీంతో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మల్లన్న ఠాణాకు వచ్చారు. పోలీసులు సాయంత్రం 4.30 గంటల వరకు వివిధ కోణాల్లో ఆయనను విచారించారు. ఆదివారం మరోసారి తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. తనను తీన్మార్ మల్లన్నబ్లాక్ మెయిల్ చేయడంతోపాటు బెదిరించాడని, డబ్బు డిమాండ్ చేశాడని సీతాఫల్మండికి చెందిన మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిదానం లక్ష్మీకాంత్శర్మ ఈ ఏడాది ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణకు మల్లన్న గురువారం పోలీసుస్టేషన్కు వచ్చారు. మహంకాళి ఏసీపీ రమేష్ నేతృత్వంలో చిలకలగూడ ఇన్స్పెక్టర్ నరేష్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సంజయ్కుమార్ విచారించారు. అనంతరం తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ..న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానన్నారు. ఇదంతా ప్రభుత్వ కుట్ర అన్నారు. -
దొరబాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదు: కలెక్టర్ కార్తికేయమిశ్రా
సాక్షి, పశ్చిమ గోదావరి: ఆశ్రమ్ ఆస్పత్రిలో ఘటనపై కమిటీ నిజనిర్ధారణ చేసిందని కలెక్టర్ కార్తికేయమిశ్రా అన్నారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ పేషెంట్ దొరబాబు గుండెపోటుతో మృతి చెందారని తెలిపారు. డయాబెటిక్ పేషెంట్ దొరబాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదన్నారు. ఆ సమయంలో విద్యుత్, ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, కోలుకున్నాక గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని వెల్లడించారు. చదవండి: ఏపీ: 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు -
జయలలిత చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాలపై రహస్య విచారణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత చివరి రోజుల్లో తీసుకున్న అనేక నిర్ణయాల వెనుక అసలు కారణాలను వెలికితీయాలని తమిళనాడులో కొత్తగా కొలువుతీరిన డీఎంకే ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. ఆసుపత్రిలో జయలలిత చివరి ఆరునెలల కాలంలో ఫైళ్లపై సందేహాస్పద సంతకాలు, రూ.కోట్ల ఒప్పందాలు, టెండర్లు కట్టబెట్టడం తదితర అంశాలపై కూపీలాగాలని ఐఏఎస్ అధికారులను నూతన ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి స్టాలిన్ కోవిడ్ పరిస్థితులను చక్కబెట్టడంపైనే ప్రధానంగా దృష్టిసారించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వం అమలుచేసిన కోవిడ్ ఆంక్షలకు తోడుగా పూర్తి లాక్డౌన్ను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై విచారణ చేపట్టేందుకు స్టాలిన్ రహస్యంగా సమాయుత్తం అవుతున్నారు. అన్నాడీఎంకే హ యాంలో చేసుకున్న ఒప్పందాలు, జరిపిన నియా మకాలు, ఎవరెవరికి ప్రభుత్వ పనులు అప్పగించారు? ఏ పనులకు ఎంత ఖర్చు చేశారు? అనే అం శాలపై పూర్తి వివరాలు సేకరించాల్సిందిగా ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. తన చుట్టూ అత్యంత విశ్వాసపాత్రులు, నిజాయితీపరులైన ఐఏఎస్ అధికారులను నియమించుకున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకించిన ఐఏఎస్ అధికారులకు కీలక బాధ్యతలను అప్పగించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలోని అనేక వ్యవహారాలపై కూపీలాగే బాధ్యతలను సదరు ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. ఈ అంశాల్లో ప్రధానమైనది ప్రభుత్వ ఫైళ్లలో ‘జయలలిత సంతకం’. 2016 సెపె్టంబరు 23న అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన జయలలిత అదే ఏడా ది డిసెంబరు 5న తుదిశ్వాస విడిచారు. ఆమె మరణానికి అసలు కారణాలను కనుగొనేందుకు అప్పటి ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ ఇంతకాలమైనా ఇంకా నివేదిక సమరి్పంచలేదు. మరణానికి ముందు.. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్న ఆరునెలల మధ్య కాలంలో ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరపాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించుకుంది. జయ ఆసుపత్రిలో చేరేముందు కొన్ని వారాలపాటు ఫైళ్లపై ఆమె సంతకాలు చేయలేదనే ఆరోపణలు, విమర్శలు ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలో పెరిగాయి. అధికారులు కొన్ని ఫైళ్లను వెలికి తీసి పరిశీలించగా జయలలిత సంతకం చేయకుండానే నిర్ణయాలు జరిగినట్లు బయటపడింది. ఆయా ఫైళ్లలో సీఎం హోదాలో జయలలిత సంతకం చేయాల్సిన చోట ‘జే æజే’ అనే అక్షరాలే ఉన్నాయి. ఇలాంటి సంతకాలున్న ఫైళ్లపైనే ముఖ్యంగా విచారణ జరపాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. రూ.కోట్ల విలువైన కొన్ని టెండర్లు సైతం జయసంతకం లేకుండానే ఆమోదం పొందినట్లు తేలింది. జయకు తెలియ కుండానే ఈ నిర్ణయాలు జరిగాయా? లేక ఆసుపత్రిలో ఉన్న ఆమెకు చెప్పి చేశారా? అప్పట్లో అత్యున్నత బాధ్యతల్లో ఉన్న ఉన్నతాధికారుల ప్రమే యంపై సైతం దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. జె.జె. అనే అక్షరాలు జయలలిత సంతకమేనని ఆసుపత్రిలో ఉన్నపుడు ఆమె అలా సంతకం చేశా రని కొందరు చెబుతున్నారు. డీఎంకే అధికారం చేపట్టిన తరువాత అన్నాడీఎంకేను ఎ లాంటి ఒత్తిళ్లకు గురిచేయలేదు. కానీ, గత ప్రభుత్వ అవకతవకలపై నిగ్గుతేల్చేందుకు పరోక్షంగా డీఎంకే ప్రభుత్వం సిద్ధమైందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
రాసలీలల కేసు: ఇంటి యజమానిని క్షమించాలని కోరిన యువతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీలో కనిపించిన యువతిని విచారించేందుకు ‘సిట్’ పోలీసులు సన్నద్ధమయ్యారు. ఆదివారం ఆ యువతికి నోటీసులు జారీ చేశారు. విజయపుర (బిజాపుర) జిల్లా నిడగుంది పట్టణంలోని ఆమె ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఇంటికి తాళాలు వేసి ఉంది. అలాగే సదరు యువతి స్నేహితులు, బెంగళూరులో ఆమె ఉంటున్న ఇంటి యజమానులకు కూడా నోటీసులు ఇచ్చి, విచారణకు సహకరించాలని కోరినట్లు తెలిసింది. ఇంటి యజమానికి యువతి ఫోన్ బెంగళూరులోని ఆర్టీ నగరలో అద్దె ఇంట్లో ఉంటున్న యువతి రాసలీలల వీడియోలు విడుదలయిన తరువాత గోవాకు వెళ్లిపోయింది. ఆ సమయంలోనే తన ఇంటి యజమానులకు ఫోన్చేసి, తనవల్ల మీకు ఇబ్బందులు ఎదురయ్యాయని, తనను క్షమించాలని కోరినట్లు తెలిసింది. త్వరలో తిరిగి వచ్చి ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పింది. తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని శనివారం యువతి వీడియో విడుదల చేసిన నేపథ్యంలో ఈ అంశంపై సుమోటోగా కేసు నమోదు చేశామని మహిళా కమిషన్ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు తెలిపారు. యువతికి రక్షణ కల్పించాలని హోం మంత్రిని కోరతామన్నారు. ఈ కేసు వల్ల తన పరువుకు భంగం వాటిల్లిందని, ఆత్మహత్యాయత్నం కూడా చేశానని యువతి చెప్పడం ఆందోళనకరమన్నారు. చదవండి: (రాసలీలల కేసు: వీడియో రిలీజ్ చేసిన బాధిత యువతి) -
పట్టపగలే బాలికపై లైంగిక దాడికి యత్నం!
రామగుండం క్రైం: ఓ బాలికపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి యత్నించిన ఘటన గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పారిశ్రామిక ప్రాంతానికి చెందిన బాలిక(16) తనకు పరిచయం ఉన్న యువకుడితో సోమవారం సాయంత్రం టూ ఇంక్లైన్ సమీపంలోని దర్గా వద్ద మాట్లాడుతోంది. ఈ క్రమంలో బైక్పై వచ్చిన ముగ్గురు యువకులు వారిపై దాడి చేశారు. బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె కేకలు వేసింది. స్థానిక యువకులు కొందరు గమనించి, గోదావరిఖని వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు వాహనం రావడం గమనించిన నిందితులు యువతిని వదిలిపెట్టి పరారయ్యారు. సర్కిల్ ఇన్స్పెక్టర్లు రమేష్బాబు, రాజ్కుమార్గౌడ్, క్రైం పార్టీ బృందం సభ్యులు బాధితురాలిని ఠాణాకు తీసుకెళ్లారు. వివరాలు తెలుసుకొని, ఆమె కుటుంబసభ్యులను పిలిపించారు. వారి ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన ఏసీపీ సంఘటన స్థలాన్ని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ వన్ టౌన్ సీఐలు, బాధిత బాలికతో కలిసి మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను పట్టుకున్న సీఐలతోపాటు ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్సై శారద, క్రైమ్ పార్టీ బృందం సభ్యులు నిజాంపేట్ శేఖర్, ఏలియా, రహీంలను ఏసీపీ అభినందించారు. చదవండి: ‘రూ. 50 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకును కిడ్నాప్ చేస్తాం’ -
బ్యాంకు మేనేజర్కు ఇలా లిఫ్ట్ ఇచ్చి..అలా దోచేశారు!
ఖమ్మంరూరల్: కారులో లిఫ్ట్ ఇచ్చి మార్గమధ్యంలో విలువైన వస్తువులు దోచుకున్నసంఘటన ఖమ్మంలో చోటుచేసుకొంది. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను మంగళవారం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని శ్రీరాంనగర్కు చెందిన మట్టయ్య ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్. ఈయన ఫిబ్రవరి 26న ఖమ్మం వచ్చేందుకు ఎల్బీ నగర్లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా..మారుతి కారులో వచ్చిన దారావత్ కవిత, కూర అయ్యన్న అనే ఇద్దరు ఎక్కించుకున్నారు. తల్లంపాడు వద్ద ఆపి కత్తులతో బెదిరించి రెండు చేతి ఉంగరాలు, సెల్ఫోన్, రూ.600 దోచుకుని వెళ్లారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి కొత్తగూడెంలోని సుజాతనగర్లో ఉన్న నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. చదవండి: వైరల్: చేతిలో పైథాన్, భుజంపై చిలుక.. -
మీకు మాస్కు లేదు.. కేసు వాదించొద్దు
ముంబై: ఒక న్యాయవాది వాదించే కేసును విచారించేందుకు ముంబై హైకోర్టు నిరాకరించింది. కారణం.. సదరు న్యాయవాది మాస్క్ ధరించకుండా తన వాదనను వినిపించేందుకు సిద్ధం కావడమే.. నో మాస్క్ నో విచారణ అని కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టుకు చెందిన సింగిల్ బెంచీ న్యాయమూర్తి పృథ్వీరాజ్ చవాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానంలో ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయవాది తన వాదనలు వినిపించేందుకు మాస్క్ను తొలిగించి వాదనలకు ఉపక్రమించాడు. అది గమనించిన జస్టిస్ చవాన్ వెంటనే స్పందిస్తూ.. ఆ కేసును విచారించేందుకు నిరాకరించి మరో కొత్త తేదిని ప్రకటించారు. లాక్డౌన్ కాలంలో కోర్టులు ఆన్లైన్లోనే కేసుల్ని విచారించాయి. ఈ మధ్యనే కోర్టులు భౌతికంగా న్యాయవిచారణ చేపట్టాయి. అదే సమయంలో కరోనా నిబంధనల ను అనుసరించి తీరాలనీ తీర్మానించారు. ఈ ఎస్ఓపీఎస్ ప్రకారం కోర్టులో న్యాయవాదులతో సహా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం అనివార్యం చేశారు. జస్టిస్ పథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ.. ‘కోర్టులో న్యాయ విచారణ చేపట్టినప్పుడు ఆ కేసుకు సంబంధించిన వారు మాత్రమే కోర్టు హాలులో ఉండాలనీ, మిగతా న్యాయవాదులంతా పక్క రూమ్లో తమ వంతు వచ్చే వరకు ఎదురు చూడాలి, కేసు విచారణ సమయంలో సబార్డినేట్లు వాదిస్తున్నప్పుడు కోర్టులో ఉన్న సీనియర్ న్యాయమూర్తులు కూడా మాస్క్లు తప్పనిసరిగా ధరించాల్సిందే’ అని తెలిపారు. చదవండి: (మీ ఇంట్లో శుభకార్యాలకు మారువేషాల్లో అధికారులు) -
చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యంపై దాఖలైన పిటిషన్పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా చిన్నారుల మిస్సింగ్ కేసులు అధికమైన నేపథ్యంలో ఈ పిటీషన్ విచారణకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విచారణ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. చిన్నారుల ఆచూకీని కనిపెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని పెదవి విరిచింది. చిన్నారుల ఆచూకీ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, అలాగే అదృశ్యమైన చిన్నారుల వివరాలను అన్ని రాష్ట్రాలతో పంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. బాలల సంక్షేమ కమిటీల ఏర్పాటులో ప్రభుత్వ జాప్యంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. మరో రెండు వారాల్లో 33 జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. విచారణ సందర్భంగా అటార్నీ జనరల్(ఏజీ) మాట్లాడుతూ.. రాష్ట్రంలో దర్పన్ కార్యక్రమం అమలవుతుందని ధర్మాసనానికి వివరించారు. కాగా, పిటీషన్పై తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. -
స్వర్ణ ప్యాలెస్ ఘటన: మూడు రోజులపాటు కొనసాగనున్న విచారణ
-
స్వర్ణ ప్యాలెస్ ఘటన: రమేష్బాబు విచారణ
సాక్షి, విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ ఘటనలో రమేష్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎండీ డాక్టర్ పోతినేని రమేష్బాబుపై సోమవారం పోలీసు విచారణ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం న్యాయవాది సమక్షంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా విచారణ కొనసాగిస్తున్నారు. మూడు రోజుల కస్టడీ కోరిన పోలీసులు మేష్ బాబుపై ప్రశ్నల వర్షం కురిపించడానికి బెజవాడ పోలీసులు ఇప్పటికే అనేక ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. విచారణలో హోటల్ యాజమాన్యానికి రమేష్బాబుకు అగ్రిమెంట్ ఉందా.. లేదా..?. ఘటన జరిగిన వెంటనే పోలీసు విచారణకు సహకరించకుండా ఎందుకు వెళ్లిపోయారు..?. అగ్నిప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు సరైన సమాధానం చెప్పకుండా ఎక్కడకు వెళ్లారు..?. ఇప్పటి వరకు రమేష్బాబునును ఎవరు నడిపించారు..? అంటూ ఇలా అనేక ప్రశ్నలను సంధించే అవకాశం ఉంది. కోవిడ్ లేకపోయినా, లక్షణాలు ఉన్నాయంటూ రోగులను భయపెట్టి లక్షల రూపాయలు నగదు దోచుకున్నారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపైనా విచారించనున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకంటే అధికంగా డబ్బులు వసూళ్లు చేశారనే ఆరోపణలపైనా పోలీసులు విచారణ కొనసాగించనున్నారు. సీఆర్పీసీ 41, 160 కింద నోటీసులు ఇచ్చినా ఎందుకు స్పందించలేదనే విషయంపైనా పోలీసులు వివరణ కోరనున్నారు. హోటల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎందుకు పట్టించుకోలేదనే కోణంలోనూ మూడు రోజుల కస్టడీలో భాగంగా విచారణ కొనసాగనుంది. కాగా, ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో 10 మంది చనిపోగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు డాక్టర్ రమేశ్ బాబు సహా పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గంట్యాడ ఘటనపై మంత్రి ఆళ్ల నాని ఆరా
సాక్షి, విజయనగరం : గంట్యాడలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 20 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా రావడం పట్ల డిప్యూటీ సీఎం , వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం స్పందించారు. ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ అంశంపై విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ తో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కరోనా సోకిన 20 మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో మొత్తం 108 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 20 మందికి కరోనా సోకినట్లు తెలిపారు. అయితే కరోనా సోకిన విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కరోనా పరీక్షలు చేయాలని డీఎమ్హెచ్వోను కూడా సూచించినట్లు తెలిపారు. (చదవండి : ఏపీలో 60 లక్షలు దాటిన కరోనా పరీక్షలు) ఒకవేళ కరోనా సోకిన విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు లేకపోతే హోంక్వారంటైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హోమ్ క్వారంటైన్లో ఉండే విద్యార్థులకు ప్రతి రోజు వైద్య బృందం వారి ఆరోగ్యం పై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉన్న కోవిడ్ విద్యార్థులకు ప్రత్యేక మెడికల్ కిట్స్ అందచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.కరోనా సోకకుండా అన్ని పాఠశాలల్లో మాస్కులు, శానిటైజర్స్ వినియోగించే విధంగా అవగాహన కల్పించాలని కోరుతూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
కరోనా మూలాలు తేలాల్సిందే!
సిడ్నీ: కరోనా వైరస్ మహమ్మారి చైనాలోనే పుట్టిందన్న వాదనల మధ్య ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ మరోసారి చైనాపై తన దాడిని ఎక్కుపెట్టారు. కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలు తెలుసు కోవడానికి ప్రపంచ దేశాలు తమ వంతు కృషి చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి మహమ్మారి విజృంభించకుండా, ఏం జరిగిందో అర్థం చేసుకునేందుకు మనం చేయగలిగినదంతా చేయాలని చెప్పారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో మోరిసన్ మాట్లాడుతూ శనివారం ఈవ్యాఖ్యలు చేశారు. కరోనా మూలలపై విచారణ చేస్తేనే మానవాళికి మరో ప్రపంచ మహమ్మారి ముప్పు తప్పుతుందన్నారు. (కరోనా మరణాలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన) టెలికాన్ఫరెన్స్ వీడియో లింక్ ద్వారా ఐరాస్ 75 వ వార్షికోత్సవ సమావేశాల్లో ప్రసగించిన మోరిసన్ ప్రపంచ దేశాలను కరోనా వణికించిందని, మానవాళిని విపత్తులో ముంచిందని వ్యాఖ్యనిచారు. కోవిడ్-19 వైరస్ జెనెటిక్ మూలాన్ని, అది మానవులకు ఎలా వ్యాపించిందో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఎవరు టీకాను కనుగొన్నారో వారు ప్రపంచ దేశాలతో తప్పక పంచుకోవాలని ఇది నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆస్త్రేలియా వాగ్దానం చేస్తోందిని అలాగే అన్ని దేశాలు అలా చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో చైనాపై ప్రధాని దాడి తరువాత ఆస్ట్రేలియా చైనా మధ్య సంబంధాలు, వాణిజ్య యుధ్దం సెగలకు మోరిసన్ తాజా వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా విలయాన్ని సృష్టించిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తరువాత ఆస్ట్రేలియా డ్రాగన్ను టార్గెట్ చేసింది. అప్పటి నుండి చైనా ఆస్ట్రేలియాపై వాణిజ్య ఆంక్షలు విధించింది. బీఫ్ దిగుమతులను నిలిపివేసింది. వైన్ దిగుమతులపై యాంటీ డంపింగ్ దర్యాప్తును ప్రారంభించింది. చైనాలోని వుహాన్ సిటీలోని ఓ ప్రయోగశాలలో ఈ వైరస్ పుట్టిందంటూ ఇప్పటికే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీని పుట్టు పూర్వోత్తరాలపై ఓ స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్ధపై ఒత్తిడి పెరుగుతోంది. (కరోనాపై లాన్సెట్ తాజా హెచ్చరికలు) -
అంతర్వేది ఘటనపై ప్రాథమిక నిర్ధారణ
సాక్షి, విజయవాడ: అంతర్వేది రథం దగ్దమైన ఘటనలో పోలీసు శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. క్లూస్ టీమ్ ద్వారా సంఘటన స్థలాన్ని ఏలూరు రేంజి డీఐజీ కేవీ మోహన్ ఆదివారం పరిశీలించారు. అయితే రథం ఉంచిన ప్రాంతంలో పై భాగాన తేనె తుట్టె ఉన్నట్లు గుర్తించారు. రథానికి రక్షణగా తాటాకులు, సర్వే కర్రలు ఉంచగా, రాత్రి వేళ కొందరు వ్యక్తులు తేనె తుట్టెను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే తేనె తుట్టెకు నిప్పుపెట్టడంతో తాటాకులకు అంటుకుని ప్రమాదం జరిగింది. దీంతో రథం దగ్దమైనట్లు పోలీసులు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. ఇంకా ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఆ తరువాతే సుశాంత్ చికిత్స ఆపేశాడు
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు నలుగురు మానసిక వైద్యుల వాంగ్మూలాలను నమోదు చేశారు. సుశాంత్కి థెరపీ సెషన్స్ ఇచ్చిన సైకోథెరపిస్ట్ను సోమవారం ఉదయం బాంద్రా పోలీస్ స్టేషన్కు పిలిపించి ఐదు గంటలపాటు ప్రశ్నించారు. ఆయన వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. సైకోథెరపిస్ట్లను కాకుండా, పోలీసులు గత వారం ముంబైకి చెందిన మరో ముగ్గురు మానసిక వైద్యుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు. సుశాంత్ డిప్రెషన్కు చికిత్స తీసుకుంటున్నాడని, కానీ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజులు ముందు దానిని ఆపేశాడని అతని స్నేహితులు తెలిపారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. దిషా సాలియన్ మరణించినప్పటి నుంచి సుశాంత్ చికిత్స తీసుకోవడం మానేశాడు. దిషా మరణించిన తరువాత పోలీసులు సుశాంత్ను విచారించారు. దీంతో సుశాంత్ చాలా ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. దిశా సాలియన్ సుశాంత్ టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థలో ఉద్యోగిని. ఈ సంస్థను ఉదయ్ సింగ్ గౌరీ నిర్వహించేవారు. ఇదిలా ఉండగా సుశాంత్ రెండుసార్లు మాత్రమే దిశను కలిశారని గౌరీ పోలీసులకు తెలిపారు. చదవండి: ‘అమిత్షా మీరు తలుచుకుంటే నిమిషం చాలు’ జూన్ 9న 14వ అంతస్తులోని ఫ్లాట్ నుండి దూకి దిశా సాలియన్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె సుశాంత్ మాజీ మేనేజర్ అని వివిధ వార్తా కథనాల ద్వారా తెలిసింది. దీంతో పోలీసులు సుశాంత్ను పలు విధాలుగా ప్రశ్నించడంతో ఒత్తిడికి గురై డిప్రెషన్ మందులు వాడటం కూడా ఆపేశాడు. గౌరీ స్టేట్మెంట్ను రికార్డు చేసిన పోలీసులు, ఎవరైనా ప్లాన్ చేసి సుశాంత్ను బెదిరించడం వల్ల మరణించాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు. నెగిటివ్ స్టోరీ యాంగిల్లో కూడా విచారణ చేస్తున్నారు. చాలా మంది అగ్రశ్రేణి బాలీవుడ్ టాలెంట్ మేనేజర్లు, కాస్టింగ్ మేనేజర్లను కూడా పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం పోలీసులు మరికొందరు బాలీవుడ్ ప్రముఖుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు. -
ఎంక్వైరి పేరుతో మహిళకు అర్థరాత్రి ఫోన్
చెన్నై: అర్థరాత్రి మహిళకు ఫోన్ చేసి ఎంక్వైరి పేరుతో పిచ్చి వేషాలు వేసిన ఓ పోలీసు అధికారి చేత ఉన్నతాధికారులు పదవీ విరమణ చేయించారు. వివరాలు.. సదరు పోలీసు తిరుచురాపల్లి సమీపంలోని పెరంబలూర్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు ఓ కేసు నిమిత్తం పోలీసు స్టేషన్కు వెళ్లింది. అప్పటి నుంచి సదరు అధికారి ఎంక్వైరి పేరుతో రాత్రి పూట మహిళకు ఫోన్ చేసి అక్కరకు రాని విషయాల గురించి మాట్లాడుతుండే వాడు. కొద్ది రోజుల పాటు మౌనంగా ఉన్న మహిళ.. చివరకు సదరు అధికారి గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే అతడి మీద గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు రావడంతో పొన్మలై స్టేషన్ నుంచి పెరంబలూర్కు బదిలీ చేశారు. ఇక్కడ కూడా అలానే ప్రవర్తించడంతో ఉన్నతాధికారులు 1977 బ్యాచ్కు చెందిన సదరు అధికారి చేత పదవీ విరమణ చేయించారు. -
సుశాంత్ నెలకు ఎంత ఖర్చు చేస్తారంటే..?
సాక్షి, న్యూఢిల్లీ: మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉండేదని ఆయన మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోదీ పోలీసుల విచారణలో వెల్లడించారు. 2019 జులై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ శ్రుతి.. సుశాంత్ వద్ద పనిచేశారు. సుశాంత్ నెలకు 10 లక్షల రూపాయల వరకూ ఖర్చు చేసేవారని ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఆయన తన బాంద్రా అపార్ట్మెంట్కు నెలకు 4.5 లక్షల రూపాయలు అద్దె చెల్లించేవారని, లొనావాల సమీపంలో లీజుకు తీసుకున్న ఫాంహౌస్కు లక్షల రూపాయల్లో అద్దె చెల్లించేవారని శ్రుతి తెలిపారు. కార్లు, బైక్లను అమితంగా ఇష్టపడే సుశాంత్ వద్ద రేంజ్ రోవర్, మాసరెటి వంటి లగ్జరీకార్లతో పాటు బీఎండబ్ల్యూ బైక్ ఉండేదని చెప్పారు. సుశాంత్ నాలుగు ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్నారని సినిమాలతో పాటు ఆయనకు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నటనకు సంబంధించిన కోర్సులపై ఆసక్తి ఉండేదని వెల్లడించారు. తన వర్చువల్ రియాలిటీ ప్రాజెక్టు కోసం సుశాంత్ రెడ్ రియలిస్టిక్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశారని, నేషన్ ఇండియా ఫర్ వరల్డ్ అనే ప్రాజెక్టుపై పనిచేయడం ద్వారా సుశాంత్ నాసా, ఇస్రోల గురించి పలు విషయాలు తెలుసుకున్నారని శ్రుతి చెప్పారు. మరోవైపు సుశాంత్ ‘జీనియస్ అండ్ డ్రాపవుట్స్’ అనే ప్రత్యేక సామాజిక ప్రాజెక్టుపైనా పనిచేస్తున్నారని శ్రుతి తండ్రి వెల్లడించారని ఓ వార్తాసంస్థ పేర్కొంది. ప్లానెట్స్, నక్షత్రాలను ప్రేమించే సుశాంత్ ఇంట్లో ప్రత్యేక టెలిస్కోప్ ఉందని పోలీసులు తెలిపారు. చదవండి: సుశాంత్ మరణం: మరో అభిమాని ఆత్మహత్య -
రెగ్యులర్ విచారణ ఇప్పట్లో కుదరదు
న్యూఢిల్లీ: కోర్టు విచారణలను గతంలో మాదిరిగానే మళ్లీ ప్రారంభించాలన్న న్యాయవాద సంఘాల డిమాండ్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కమిటీ ప్రస్తుతానికి తోసిపుచ్చింది. కరోనా విస్తృతిని పరిశీలించి, జూన్ 30న మరోసారి భేటీ కావాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఏడుగురు సీనియర్ జడ్జీల కమిటీ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఢిల్లీలో కరోనా నేపథ్యంలో కోర్టు కార్యకలాపాలను కొనసాగించే అవకాశాలపై కమిటీ సమీక్ష జరిపింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టు కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ ప్రతిపాదనను కమిటీ తోసిపుచ్చిందని, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని స్పష్టం చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్ 30న మరోసారి సమావేశమై, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కమిటీ భావించిందని తెలిపాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆన్లైన్ విచారణలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. -
మార్చి 26న ఎన్హెచ్ఆర్సీ బహిరంగ విచారణ
సాక్షి, హైదరాబాద్: జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్చి 26న హైదరాబాద్లో బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారెవరైనా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యా నికి గురైనా, వివక్షకు గురికాబడిన వారి నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. బాధితులు రిజిస్టర్ పోస్టు లేదా ఈ మెయిల్/ ఫ్యాక్స్ ద్వారా వినతులు సమర్పించవచ్చని ఎన్హెచ్ఆర్సీ సూచించింది. ఫిర్యాదు చేయదలచిన వారు మార్చి 13వ తేదీలోపు registrar & nhrc@nic.in, jrlawnhrc@nic.in మెయిల్ చేయాలని 011–24651332, 34 నంబర్లకు ఫ్యాక్స్ చేయవచ్చన్నారు. రిజిస్టర్ పోస్టు చేయాలనుకునేవారు టు రిజిస్ట్రార్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ్ అధికార్ భవన్ బ్లాక్, జీపీఓ కాంప్లెక్స్, ఐఎన్ఏ, న్యూఢిల్లీ, 110023 చిరునామా కు పంపాలని సూచించింది. -
రాజేంద్రనగర్ పేలుడు ఘటనపై డీసీపీ దర్యాప్తు
-
మాల్యా అప్పీల్పై విచారణకు హైకోర్టు ఓకే
లండన్: బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో ఊరట లభించింది. మాల్యాను భారత్కు అప్పగించే నిర్ణయం తీసుకుంటూ గతంలో బ్రిటన్ హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులపై మాల్యా చేసుకున్న అప్పీల్ను విచారించేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది. మాల్యా అప్పీల్ను విచారణకు స్వీకరించాలా, వద్దా అన్న విషయంపై జస్టిస్ జార్జ్ లెగ్గాట్ట్, జస్టిస్ ఆండ్రూ పాపుల్వెల్ల ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం తాము అప్పీల్ను విచారణకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. మాల్యా తరఫున న్యాయవాది క్లారీ మోంట్గోమెరీ వాదనలు వినిపించగా, భారత హై కమిషన్ కార్యాలయ అధికారులు, మాల్యా భాగస్వామి పింకీ లల్వానీ, కొడుకు సిద్ధార్థ్లు కూడా కోర్టుకు వచ్చారు. మాల్యా అప్పీల్ పిటిషన్ను కోర్టు తదుపరి రోజుల్లో విచారించనుంది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం అప్పు తీసుకుని, బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రుణాన్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మాల్యాను బ్రిటన్ పోలీసులు 2017 ఏప్రిల్లోనే అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన అక్కడే బెయిల్పై ఉంటున్నారు. అప్పటి నుంచి మాల్యాను భారత్కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగానే మాల్యా రుణాలను ఎగ్గొట్టారనడానికి ఆధారాలు ఉన్నాయని గతేడాది డిసెంబర్లోనే లండన్లోని వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తేల్చింది. దీంతో మాల్యాను భారత్కు అప్పగించేందుకు బ్రిటన్ హోం శాఖ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. -
మన్యంలో యాక్షన్ టీం?
సాక్షి, మహబూబాబాద్: కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో చాలా రోజుల తరువాత మావోలు వచ్చారనే చర్చ సాగుతోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం విస్తరించి ఉండటం, చత్తీస్ఘడ్ అటవీ ప్రాంతం నుంచి నేరుగా జిల్లాలోకి వచ్చే అవకాశాలు ఉండటంతో మావోయిస్టు యాక్షన్ టీం వచ్చినట్లు చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే యాక్షన్ టీం సభ్యులు మండలాల్లో సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మండలంతో సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఇక్కడి ఆర్ఎంపీ డాక్టర్ వద్ద చికిత్స చేయించుకున్నారని సమాచారం. యాక్షన్ టీంలు వస్తే ఎందుకు వచ్చారు? ఇన్ఫార్మర్లుగా పనిచేసే వారిని గాని, అధికార పార్టీ నాయకులను గానీ టార్గెట్ చేసేందుకు వచ్చారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. టార్గెట్గా ఉన్న రాజకీయ నాయకులను, ఇన్ఫార్మర్లను కొద్ది రోజుల పాటు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఛత్తీస్ఘడ్ నుంచి మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, భద్రన్న, ధర్నన్న తదితరులతో కూడిన యాక్షన్ టీం కొత్తగూడ, గంగారం మండలాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దశలో రెండు రోజులుగా పోలీసులు మావోయిస్టు సానుభూతి పరులు, మద్దతు దారులను, అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు విచారించి, వివరాలు సేకరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో మావోల కదలికలతో కలకలం కొనసాగుతోంది. హరిభూషణ్ వచ్చాడా.. గంగారం మండలంలోని మడగూడ గ్రామానికి చెందిన మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ ఆలియాస్ హరిభూషణ్, భద్ర న్న, ధర్మన్నలు వారి యాక్షన్ టీంతో జిల్లాలోకి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. గంగారం మండలంలోని మడగూడెం గ్రామానికి చెందిన మావోయిస్ట్ అగ్ర నాయకుడు యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ 40మంది మావోలతో కలసి కోమట్లగూడెం, జంగాలపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతానికి వచ్చినట్లు చర్చ సాగుతోంది. ఈ ప్రాంతంలో స్వగ్రామమైన మడగూడెం వస్తున్నాడని, వచ్చి వెళ్లారని రక రకాల వాదనలు వినిపిస్తున్నాయి.10సంవత్సరాల క్రితం గ ట్టి నిర్భందం సమయంలో పెద్దఎల్లాపూర్ గ్రామంలో ఒక భూ వివాదాన్ని పరిష్కరించడానికి రాష్ట్ర కార్యదర్శి హోదాలో 200మంది మావోలతో గ్రా మాన్ని చుట్టుముట్టి హరిభూషణ్ సమస్యపై ప్రజా దర్భార్ నిర్వహించి సంచలనం సృష్టించారు. కేంద్ర కమిటీ నాయకుడిగా ఎదిగిన హరిభూషణ్ కొత్తగూడకు వచ్చే అవకాశాలు తక్కువనే మరో చర్చ కొనసాగుతోంది. ఈ చర్చ ఎంత వరకు వాస్తవం అనేది తేలాల్సి ఉంది. ఒక వేళ హరిభూషణ్ వస్తే ఎందుకు, ఏ విషయంపై వచ్చాడని, సాధారణంగా అతడు ఈ ప్రాంతానికి రాడు అని సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. కొత్త రిక్రూమెంట్ కోసమేనా..? తెలుగు రాష్ట్రాలలో గతంలో జరిగిన వరుస ఎన్కౌంటర్లు, వరుస లొంగుబాట్లు మావోయిస్టు పార్టీకి నష్టం చేకూర్చాయి. ప్రపంచీకరణంతో పాటు, పోలీసుల నిఘా పెరగటం, తదితర కారణాలతో గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు రిక్రూమెంట్ ఆగిపోయింది. దీంతో పార్టీ బలహీనంగా మారి, మావోయిస్టు ప్రభావం తగ్గిపోయింది. ఈ దశలో తిరిగి నూతన రిక్రూట్మెంట్ కోసం మావోయిస్టు యాక్షన్ టీం తిరిగి జిల్లాలోకి ప్రవేశించిందా..? లేకపోతే గత కొద్ది రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో పోడు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఖరీఫ్ సాగు ప్రారంభం కావటం, పోడు సాగు చేయకుండా అధికారులు అడ్డుకుంటున్నా రు. ఈ దశలో ఏజెన్సీ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా మావోలు మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించుకునేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫారెస్ట్ దాడుల్లో భూములు కోల్పోయిన వారిని దళంలో చేర్చుకుని బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో మావోలు ఉన్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. ఇదే రిక్రూట్మెంట్కు మంచి సమయం అని మావోయిస్టు యాక్షన్ టీం ఏజెన్సీ గ్రామాల్లోకి ప్రవేశించిందని పోలీసులు భావిస్తున్నారు. డేగ కన్నులతో.. యాక్షన్ టీం జిల్లాలో ప్రవేశించిందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రెండు రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు. గతంలో పార్టీలో పనిచేసిన వారు, సానూభూతి పరులను విచారిస్తున్నారు. వారి పై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. ఈ దశలో ఏ క్షణంలో ఏమి జరుగునోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సాధారణ తనిఖీలు చేస్తున్నాం ఏజెన్సీ మండలాల్లో మావోయిస్టు యాక్షన్ టీం ప్రవేశించినట్లు ఎటువంటి సమాచారం లేదు. అలాంటివి అన్ని ఊహాగానాలే. నెల రోజులుగా ఏజెన్సీలో సాధారణ తనిఖీలు చేపడుతున్నాం. అనుమానాస్పద వ్యక్తుల సంచారం ఉంటే మీ దగ్గరిలోని పోలీసులకు సమాచారం అందించండి. –నంద్యాల కోటిరెడ్డి, ఎస్పీ -
లెక్క తేలాల్సిందే!
ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలకు మంజూరైన నిధుల వినియోగంపై లెక్క తేల్చేందుకు విద్యా శాఖ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం నుంచి ఈ నెల 24 వరకు జిల్లాలోని ఉన్నత పాఠశాలలకు సంబంధించిన రికార్డులను పరిశీలించనున్నారు. రాష్ట్రీయ మాధ్యమిక విద్యా విభాగానికి చెందిన ప్రత్యేక అధికారులతో కూడిన బృందం ఇందుకోసం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ యాజమాన్యాల కింద 3,157 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 500 వరకు సెకండరీ పాఠశాలలు (హైస్కూల్ స్థాయి) ఉన్నాయి. సాక్షి, మచిలీపట్నం: పాఠశాల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి ఏటా వివిధ రకాలుగా నిధులు మంజూరు చేస్తోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సర్వ శిక్షాభియాన్ విభాగం నుంచి, ఉన్నత పాఠశాలలకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ విభాగం నుంచి నిధులు విడుదల చేస్తున్నారు. వీటితో పాటు స్కూల్ కాంప్లెక్స్(పాఠశాల సముదాయం)గా గుర్తించిన వాటికి ప్రత్యేకంగా ఏడాదికి సుమారుగా రూ. 20 వేల వరకు నిధులు మంజూరు చేస్తున్నారు. గతంలో స్కూల్ గ్రాంట్, మెయింటినెన్స్ రూపేణా వేర్వేరుగా నిధులు విడుదల చేయగా, 2017–18 విద్యా సంవత్సరంలో ఈ రెండింటినీ కలిపి, విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న సెక్షన్లను పరిగణనలోకి తీసుకుని స్కూల్ గ్రాంట్ రూపేణా నిధులు విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలలకు రూ. 12,500, ఉన్నత పాఠశాలలకు రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు ఇచ్చారు. అదేవిధంగా మండల స్థాయిలోని విద్యా వనరుల కేంద్రాల నిర్వహణ కోసం రూ. 34 వేల నుంచి రూ.50 వేల వరకు మంజూరు చేశారు. ఇవే కాకండా పాఠశాలల్లో స్వచ్ఛభారత్ పేరిట, టీఎల్ఎం మేళా, సైన్స్ఫేర్ నిర్వహణ, విద్యార్థులను ఎక్స్కర్షన్ ట్రిప్కు తీసుకువెళ్లేందుకు ఇలా వివిధ రకాలుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. వీటిని ఎలా వినియోగించారనేది తెలుసుకునేందుకు ప్రస్తుతం అధికారులు పరిశీలనకు సిద్ధమయ్యారు. షెడ్యూల్ ఇలా.. జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ, నూజివీడు. నందిగామ డివిజన్ల వారీగా ఆర్ఎంఎస్ఏ బృందం సభ్యులు పర్యటించనున్నారు. డివిజన్ కేంద్రాల్లోని ఒక చోట అందుబాటులో ఉంటారు. ఆయా డివిజన్ పరిధిలోని అన్ని పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తగిన రికార్డులు, నివేదికలతో హాజరుకావాల్సి ఉంటుంది. ఈ నెల 20న గుడివాడలోని ఎస్పీఎస్ మున్సిపల్ హైస్కూల్, 21న నూజివీడులోని డెప్యూటీ డీఈఓ కార్యాలయం, 22న విజయవాడ, నందిగామ డివిజన్లకు చెందిన పాఠశాలల రికార్డులను పరిశీలించనున్నారు. రెండు డివిజన్లకు చెందిన ఉపాధ్యాయులంతా విజయవాడలోని పటమట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. 24న మచిలీపట్నంలోని ఆర్సీఎం హైస్కూల్లో బృందం అందుబాటులో ఉండి డివిజన్లోని పాఠశాలల నివేదికలను పరిశీలించనున్నారు. సమగ్ర పరిశీలన బ్యాంక్ స్టేట్మెంట్, 2019 మార్చి 31 వరకు జరిపిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ పాస్ పుస్తకం, నిధుల మంజూరీకి సంబంధించిన అనుమతి పత్రాలు, ఇతర ఉత్తర్వులు సిద్ధం చేసుకొని తీసుకువెళ్లాలి. అదేవిధంగా లావాదేవీలకు సంబంధించిన పుస్తకం, నగదు నిల్వ పుస్తకం, ఇందుకు సంబంధించిన పత్రాలు, బ్యాంకులో కాకుండా చేతిలో ఉన్న నగదు, ఎందుకు నగదు ఉంచుకున్నారనే దానిపై తగిన ధ్రువీకరణ పత్రాలు తీసుకువెళ్లాలి. పాఠశాలల్లో చేసిన సివిల్ వర్క్స్ వివరాలు, వాటికి వెచ్చించిన నిధులు, మెజర్మెంట్ (ఎంబుక్) పుస్తకం, పాఠశాల అభివృద్ధి కమిటీ తీర్మానాల పుస్తకం, మిగులు నిధులు బ్యాంకులో చెల్లిస్తే, వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను విచారణ బృందానికి అందజేయాల్సి ఉంటుంది. వీటిని సమగ్రంగా పరిశీలన చేసి ఆర్ఎంఎస్ఏ బృందం విద్యా శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే మళ్లీ పాఠశాలలకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. నిధుల వినియోగానికి సంబంధించి సమగ్ర నివేదికలతో ఆడిట్ బృందం ముందు హాజరుకావాలని డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి జిల్లాలోని ఉన్నత పాఠశాలల హెచ్ఎంలను ఆదేశించారు. -
రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ
-
కిడ్నీ రాకెట్ వ్యవహారంలో విచారణ వేగవంతం
-
నుమాయిష్ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: నుమాయిష్ అగ్ని ప్రమాదంపై ఐఏఎస్ అధికారితో సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణం ఏమిటనే కోణంలో దర్యాప్తు చేయాలని కోరారు. బాధితులు సమస్యలు చెప్పుకుందామంటే రాష్ట్రంలో మంత్రులు లేని పరిస్థితి దాపురించిందన్నారు. వ్యాపారస్తులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సంఘటన స్థలాన్ని సీపీఐ కార్యవర్గ సభ్యులు సుధాకర్, నగర కార్యదర్శి ఈటీ నరసింహ, ఏఐటీయూసీ నాయకులు వెంకట్, గెల్వయ్య, మన్నన్ తదితరులు సందర్శించారు. -
‘ఎయిర్పోర్టులోకి కత్తి ఎలా వచ్చింది.. ఎవరు తెచ్చారు’
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఐదోరోజు విచారించింది. నిందితుడి విచారణ న్యాయవాదుల సమక్షంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఐదోరోజు విచారణలో భాగంగా నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును న్యాయవాది సలీం సమక్షంలో విశాఖపట్నంలోని కైలాసగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో విచారించారు. (కొనసాగుతున్న శ్రీనివాస్ విచారణ) శ్రీనివాస్ 20 మంది యువతులతో మాట్లాడిన కాల్ డేటా వివరాలపై ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారని న్యాయవాది సలీం తెలిపారు. ‘ఎయిర్పోర్టులోకి కత్తి ఎలా వచ్చింది. ఎవరు తెచ్చారు’ అనే అంశాలపై శ్రీనివాస్కు ప్రశ్నించారని పేర్కొన్నారు. శ్రీనివాస్ కాల్ డేటాను అధికారులు పరిశీలించారని చెప్పారు. మిగిలిన రెండు రోజులు శ్రీనివాస్ను ఎక్కడ విచారస్తారనేది ఎన్ఐఏ ఇంకా చెప్పలేదని సలీం బుధవారం మీడియాకు చెప్పారు. కాగా, వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగిన రోజు ఎయిర్ పోర్ట్ లాంజ్ వద్ద ఉన్న ఇద్దరి వ్యక్తుల నుంచి ఎన్ఐఏ అధికారులు వివరాలు సేకరించినట్టు సమాచారం. -
లోతుగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు సోమవారం హైదరాబాద్లో విచారించారు. న్యాయవాదుల సమక్షంలో అతడిని ప్రశ్నించారు. ఎన్ఐఏ డీఐజీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగింది. నిందితుడి స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేశారు. వైఎస్ జగన్పై దాడి ఎందుకు చేశావు, దాడి వెనుక ఎవరున్నారనే దానిపై లోతుగా విచారించారు. శ్రీనివాసరావు కాల్ డేటాను పరిశీలించి, దీనిపై ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. నేటితో నిందితుడి మూడో రోజు కస్టడీ ముగిసింది. క్రైం సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా రేపు మరోసారి విశాఖపట్నం విమానాశ్రయానికి తీసుకెళ్లి విచారించే అవకాశముందని తెలుస్తోంది. నిందితుడిని వారం రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం ఉదయం అతడిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం విశాఖపట్నంలో అతడిని విచారించారు. (శ్రీనివాసరావుపై ఎన్ఐఏ ప్రశ్నల వర్షం) -
రఫేల్ ప్రకంపనలు : మోదీపై రాహుల్ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని కాంగ్రెస చీఫ్ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లోక్సభలో బుధవారం రఫేల్పై చర్చను ప్రారంభిస్తూ మోదీ సర్కార్పై నిప్పులు చెరిగారు. రఫేల్పై విపక్షాల ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం ప్రధాని నరేంద్ర మోదీకి లేదని ఎద్దేవా చేశారు. రఫేల్పై తనను ఎవరూ ప్రశ్నించలేరని ప్రదాని చెప్పడం సరైంది కాదని, దీనిపై దేశ ప్రజలంతా ఆయనను ప్రశ్నిస్తున్నారన్నారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించి రూ 1600 కోట్ల నూతన ధరపై రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసింది నిజం కాదా అని నిలదీశారు. ఐఏఎఫ్ అధికారులు 126 విమానాలు కావాలని డిమాండ్ చేయగా వాటి సంఖ్యను 36కు ఎందుకు కుదించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఏఎన్ఐకి ప్రధాని ఇచ్చిన ఇంటర్వ్యూ ముందుగా సిద్ధం చేసిందేనన్నారు. ఇంటర్వ్యూలో 90 నిమిషాలు మాట్లాడిన ప్రదాని రఫేల్పై మాత్రం ఇప్పటికీ బదులివ్వడం లేదని ఆరోపించారు. రఫేల్కు సంబంధించిన ఫైళ్లనీ తన పడక గదిలో ఉన్నాయని గోవా సీఎం మనోహర్ పారికర్ చెప్పారని ఆ రాష్ట్రమంత్రి విశ్వజిత్ రాణే చెబుతున్న ఆడియో క్లిప్ను సభలో ప్రదర్శిందుకు అనుమతించాలని రాహుల్ కోరారు. దీనికి స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభ వాయిదా పడింది. జైట్లీ అభ్యంతరం.. రఫేల్ ఒప్పందంపై రాహుల్ వాదనను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. రఫేల్పై సుప్రీం కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును వెలువరించడంతో దిక్కుతోచని కాంగ్రెస్ ఆడియో టేప్ల అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. గోవా మంత్రి చెబుతున్నట్టు రూపొందిన ఆడియో క్లిప్ నకిలీదని జైట్లీ అన్నారు.రఫేల్పై మోదీ సర్కార్పై బురద చల్లేందుకు ఈ టేప్ను కాంగ్రెస్ తయారుచేసిందని దుయ్యబట్టారు. -
ఆ రెండు గంటలు ఐఆర్సీటీసీ పనిచేయదు
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేశాఖ అధికారిక వెబ్సైట్ ఐఆర్సీటీసీ కార్యకలాపాలు రెండు గంటలపాటు స్థంభించనున్నాయి. రోజువారీ సైట్ నిర్వహణలో భాగంగా రెండు గంటలపాటు టికెట్ బుకింగ్స్ నిలిచిపోనున్నాయని భారతీయ రైల్వేశాఖ వెల్లడించింది. నవంబరు10, 2018 రోజున 00.20 గంటల నుంచి 01.30 గంటల వరకు రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్ సౌకర్యం, ఎంక్వయిరీ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది. ఐఆర్సీటీసీ (irctc.co.in) సేవలు ఈ సమయంలో అందుబాటులో ఉండవనీ, రెండు గంటల సమయంలో ఇంటర్నెట్ బుకింగ్, ఫోన్ సర్వీసులు, కీలక సర్వీసులు సైతం నిలిచిపోనున్నట్టు పేర్కొంది. దీన్ని రైల్వే వినియోగదారులకు గుర్తించాలని కోరింది. రైల్వే టికెట్ బుకింగ్, టికెట్ రద్దు చేసుకునే సౌకర్యం వెబ్సైట్ నిర్వహణ కారణంగా నవంబరు 10వ తేదీ 00:20 నుంచి 01:30 గంటలు వరకు అందుబాటులో ఉండదు. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ సమయంలో రిజర్వేషన్ కార్యకలాపాలు, ఇంటర్నెట్ బుకింగ్, ఎంక్వైరీ సర్వీసులు (టెలిఫోన్ నెంబర్ 139) కూడా పనిచేయవని ఐఆర్సీటీసీ తెలిపింది. సాధారణంగా ప్రతిరోజు వెబ్సైట్ నిర్వహణ పనులు 23:30 గంటల నుంచి 00:30 గంటల మధ్యలో జరుగుతాయి. ఈ సమయంలో ఎలాంటి సమాచారం అందుబాటులో ఉండదు. -
విచారణకు హాజరుకానున్న రేవంత్రెడ్డి
-
గౌరీ లంకేష్ హత్య కుట్రను ఛేదించారిలా..
ఏడాదిక్రితం ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ ను ఆమె నివాసం వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. ఈ హత్యోదంతాన్ని ఛేదించడానికి నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సాగించిన వేట తుది ఘట్టానికి చేరుకుంది. ఏడాదిపాటు సాగిన ఈ దర్యాప్తు ఫలితంగా గౌరీ లంకేష్ హంతకులనే కాదు ఇప్పటికీ అనేక హత్యలు చేసి, మరికొన్నింటికి వ్యూహం పన్నిన ఒక అజ్ఞాత సనాతన సంస్థ కుట్రను ఛేదించింది. రాజీవ్గాంధీ హత్యను పరిశోధించడానికి అప్పట్లో కార్తికేయన్ నేతృత్వంలో ఏర్పడిన సిట్ సాగించిన దర్యాప్తు స్థాయిలో సాగిన కర్నాటక సిట్ విచారణ వూహించని మలుపులు తిరిగి చివరకి దేశంలో అనేక మంది ప్రముఖ ప్రజాస్వామిక వాదులను మట్టుపెట్టడానికి కుట్ర పన్నిన రహస్య ముఠా గుట్టు రట్టు చేయగలిగింది. మందకొడిగా మొదలయి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఒకరికొకరు తెలియకుండా ’స్లీపర్సెల్’ మాదిరిగా పనిచేస్తున్న ఈ ముఠా బండారం బట్టబయలు చేసే వరకూ సాగిన ఈ దర్యాప్తు వివరాలు ఇలా ఉన్నాయి. సీసీ ఫుటేజ్తో మొదలు... గౌరీలంకేష్ హంతకులను పట్టుకునేందుకు సిట్కు లభించిన ఏకైక ఆధారం హత్యచేస్తున్నప్పుడు రికార్డు అయిన సీసీ ఫుటేజీ. అయితే మొహం కనిపించకుండా హెల్మట్లు ధరించి ఉన్న హంతకులను గుర్తించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దర్యాప్తుని కొనసాగించడం కోసం సిట్ హత్య జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో రికార్డయిన ఫోన్ కాల్స్ను పరిశీలించడం మొదలు పెట్టింది. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న సెల్ టవర్స్ ద్వారా సాగిన దాదాపు పది లక్షల ఫోన్ కాల్స్ను పరిశీలించింది. అయినా ఫలితం దక్కలేదు. పిస్టల్ ఒకటే. గౌరీ లంకేష్ శరీరంలో దిగిన బుల్లెట్ ను పరిశీలించిన పోలీసులకు అది 7.65 ఎంఎం పిస్టల్దేనని తెలిసింది. అంతకుముందు కర్ణాటకలో హత్యకు గురైన హేతువాది నరేంద్ర దబోల్కర్ను హత్యచేయడానికి కూడా ఇదే పిస్టల్ని వాడినట్లు కనుగొన్నారు. అయితే ఈ రెండు హత్యలకు సంబంధం ఏమిటి? హంతకులు ఎవరు? అన్న విషయంలో ఆధారాలు దొరకలేదు. కీలక ఆధారం దొరికింది.. సిట్ దర్యాప్తు ఎటూ సాగక దాదాపు నిలిచిపోయే దశలో ఆసక్తికరమైన సమాచారం లభించింది. ఆ సమాచారమే సిట్ తరువాత జరిపిన పరిశోధనకు కీలకమయ్యింది. స్థానికంగా పనిచేసే ఇంటలిజెన్స్ పోలీసుల నుంచి వచ్చిన సమాచారం ఏమిటంటే గౌరీ లంకేస్ హత్య జరిగిన తరువాత నుంచి స్థానికంగా నివసించే కె.టి.నవీన్ కుమార్ అనే వ్యక్తి కనిపించడం లేదని. నవీన్ కుమార్ వివరాలు సేకరించిన సిట్ అతను మాండ్యా జిల్లా మద్దూర్ గ్రామానికి చెందినవాడని తెలిసింది. అతని ఆచూకీ కోసం శోధించగా అతను చిక్కమంగుళూరు జిల్లాలోని ఓ గ్రామంలో ఉంటున్నట్టు తెలిసింది. అతనికి తెలియకుండా పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. వారి ప్రయత్నం ఫలించింది. నవీన్ కుమార్ తరచూ కాయిన్ ఫోన్లతో ఎవరితోనో మాట్లాడుతుండడం గమనించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు 128 పబ్లిక్ ఫోన్ల నుంచి ఎవరికో ఫోన్ చేస్తుండడం గమనించారు. అందులో ఎక్కువగా ఉపయోగిస్తున్న ఆరు ఫోన్లను టాప్ చేయటం మొదలుపెట్టారు. ఈ సంభాషణల ద్వారా గౌరీ లంకేష్ హత్య గురించి నవీన్కు స్పష్టంగా తెలుసునని, అంతేకాకుండా మరొకరి హత్యకు కూడా కుట్ర జరుగుతోందని దర్యాప్తు బృందానికి అర్థం అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న పోలీసులు నవీన్ కుమార్ను అరెస్టు చేశారు. అతనివద్ద మారణాయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. రెండవ అరెస్టు... నవీన్ కుమార్ ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి సుజిత్ కుమార్ అని పోలీసులు పసిగట్టారు. శికారి పురాకు చెందిన సుజిత్కు ప్రవీణ్ అనే పేరు కూడా ఉందని తేలడంతో మే 20న అతన్ని కూడా అరెస్టు చేశారు. సుజిత్ కుమార్ను ఇంటరాగేట్ చేసిన తరువాత అసలు కుట్రదారుల గుట్టు బయటపడింది. వ్యూహకర్త అమోల్ కాలే.. గౌరీ లంకేష్ హత్యకు కుట్రపన్నింది అమోల్ కాలే అలియాస్ భాయ్సాబ్, అమిత్ దిగ్వేకర్. బెంగుళూరుకు చెందిన 37 ఏళ్ళ అమోల్ ఇంజనీరు. అతని దగ్గర లభించిన డైరీ సాయంతో ఈ ముఠా సంగతి, వారు సాగించిన హత్యోదంతాలు, నిందితుల వివరాలన్నీ ఇందులో లభించాయి. అయితే కోడ్ భాషలో ఉన్న ఈ డైరీని అర్థం చేసుకోవడానికి సిట్ బృందానికి కొంత సమయం పట్టింది. సనాతన ధర్మాన్ని విమర్శించేవారు, ప్రజాస్వామిక వాదులు అనేక మందిని మట్టుపెట్టడానికి ఈ ముఠా పన్నిన వ్యూహం మొత్తం బట్టబయలు అయ్యింది. వీరితో పాటు పనిచేసిన రెండో వ్యక్తి మహారాష్ట్రకి చెందిన 38 ఏళ్ళ అమిత్ దిగ్వేకర్ అలియాస్ ప్రదీప్ మహాజన్. ఈ మొత్తం కుట్ర వీరిద్దరికి మాత్రమే తెలుసు. ఇందులో పాల్గొన్న మిగిలిన వారికి ఒకరి గురించి ఒకరికి తెలియదు. సుజిత్ కుమార్ వెల్లడించిన విషయాల ఆధారంగా బృందం అమోల్కాలే, అమిత్ దిగ్వేకర్లను అరెస్టు చేసింది. వీరితో పాటు కర్ణాటకలోని విజయపుర కి చెందిన మనోహర్ ఎడవెను కూడా అరెస్టు చేసారు. గౌరీ లంకేష్ హంతకులను రిక్రూట్ చేసింది ఈ మనోహరే. అతని పని కర్ణాటక కేంద్రంగా ఈ ముఠాకు అవసరమైన వారిని రిక్రూట్ చేయడమే. మహారాష్ట్రలో అమోల్కాలే తో పాటు మరళి అనే వ్యక్తి, కర్ణాటకలో మనోహర్ ఎడవె, సుజిత్ కుమార్లు ఈ సంస్థ రిక్రూట్మెంట్లకు బాధ్యులు. మోహన్ నాయక్, 50. రెక్కీ నిర్వహణ, బెంగుళూరులో స్థావరాలు, వాహనాలు సరఫరా... అనుకున్న ప్లాన్ ప్రకారం హత్యచేసేందుకు వీలుగా బెంగుళూరులోనే హంతకులు మకాం వేసారు. మోహన్ నాయక్ బెంగుళూరులో ఇల్లు అద్దెకు తీసుకుని, హంతకులకు అవసరమైన వాహనాలు సరఫరా చేసేవాడు. రెక్కీ నిర్వహణ, షెల్టర్లు ఏర్పాటు చేయడం, వాహనాల సరఫరా బెంగుళూరుకి చెందిన 50 ఏళ్ళ మోహన్ నాయక్ పని. వృత్తి రీత్యా ఇతను ఆక్యుపంక్చరిస్ట్. మోహన్ నాయక్తో కాలే అనునిత్యం టచ్లో ఉంటాడు. ఈ లాజిస్టిక్ టీంలో హుబ్లీకి చెందిన అమిత్ బడ్డీ 27, బెలగాంకి చెందిన 37 ఏళ్ళ భరత్ కుర్నే, కె.టి.నవీన్ కుమార్ ఉన్నారు. మోహన్ నాయక్ తో సహా వాఘ్మేర్, మిస్కిన్, అమిత్ బడ్డిలను పోలీసులు జూలై 18న అరెస్టు చేసారు. ఆయుధ శిక్షణ రాజేష్ బంగేర... పేరులేని హంతక సంస్థలోకి వ్యక్తులను రిక్రూట్ చేసుకున్న తర్వాత వారికి ఆయుధ శిక్షణనిచ్చింది కర్నాటక లోని మడికేరికి చెందిన 38 ఏళ్ళ రాజేష్ బంగేర. ఇతనికి సనాతన్ సంస్థకి చాలా కాలంగా సంబంధం ఉందని భావిస్తున్నారు. ఇతనికి కరాటేలో బ్లాక్ బెల్టు ఉంది. ఇతని వద్ద రెండు లైసెన్స్డ్ తుపాకీలున్నాయి. ఆయుధ శిక్షణనివ్వడంతో పాటు హత్యలకు అవసరమైన తూటాలను సరఫరా చేసింది కూడా ఇతనే. కాల్పులు జరిపింది పరుశురాం వాఘ్మేర్... గౌరీ లంకేష్ హత్య సందర్భంగా రికారై్డన సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను ఒకచోట చేర్చి గుజరాత్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపగా అసలు గౌరీ లంకేష్ని హత్యచేసింది పరుశురాం వాఘ్మేర్ అని ఫోరెన్సిక్ రిపోర్ట్ తేల్చి చెప్పింది. చిట్టచివరకు బెంగుళూరు ప్రత్యేక దర్యాప్తు బృందం గౌరీ లంకే ష్ని హత్య పరుశురాం వాఘ్మేర్ అనే 26 ఏళ్ళ హంతకుడిని పట్టుకుంది. ఇతను కర్నాటకలోని విజయపురలో వ్యాపారి అని తేలింది. ఇతను చాలాకాలంగా సనాతన్ సంస్థ సభ్యుడు. హేతువాది నరేంద్ర దబోల్కర్ హత్య కేసులోనూ, గోవింద్ పన్సారీ హత్యకేసులోనూ, ఎంఎం కల్బుర్గీ హత్య కేసులోనూ, గౌరీ లంకేష్ హంతకులతోనూ ఈ సంస్థకు సంబంధాలున్నట్టు బెంగుళూరు ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. -
‘అబుదాబి మాడ్యుల్’పై రెండో రోజూ విచారణ
సాక్షి, హైదరాబాద్: ఐసీస్ అనుబంధ సంస్థ అబుదాబి మాడ్యుల్ అనుమానితుల విచారణ రెండో రోజైన బుధవారమూ కొనసాగింది. బేగంపేటలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐ ఏ) కార్యాలయంలో ఢిల్లీ నుంచి వచ్చిన డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం అను మానితుల్ని ప్రశ్నిస్తోంది. అబ్దుల్లా బాసిత్, ఖదీర్ సహా మొత్తం 8 మందిని వరుసగా రెండో రోజూ విచారించారు. ఒక్కొక్కరిని దాదాపు 6 గంటల పాటు పలు కోణాల్లో ప్రశ్నించారు. వీరి వాంగ్మూలాల్లో 4 కొత్త పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీం తో వారిని ఎన్ఐఏ కార్యాలయానికి పిలిపించిన పోలీసులు కొన్ని అంశాల గురించి ప్రశ్నించారు. రాత్రి 7కి అందరినీ ఇళ్లకు పంపిన అధికారులు మళ్లీ గురువారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. ఈ విచారణ ప్రక్రియ మరికొన్ని రోజులు సాగే అవకాశం ఉంది. -
సత్వర దర్యాప్తు..ఉరిశిక్ష పడేలా చార్జిషీట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశవ్యాప్తంగా కలకలం రేపిన చెన్నై దివ్యాంగ బాలికపై రేప్ కేసులో విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని తమిళనాడు పోలీసులు పట్టుదలగా ఉన్నారు. 3 నెలల్లోగా విచారణ ముగించి, నిందితులకు ఉరిశిక్ష పడేలా చేయాలని చూస్తున్నారు. చెన్నైలోని అయనవరం ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్కు చెందిన దివ్యాంగ బాలిక(11)పై ఏడునెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న 23 మందిలో 17 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం తెల్సిందే. ‘అయనవరం రేప్ కేసు ఒక్కటేకాదు లైంగిక నేరాల కేసులన్నీ త్వరగా∙విచారణ పూర్తి చేయాలి, కోర్టులు ఇలాంటి ఉదంతాలపై విచారణను వేగంగా ముగించి నిందితులను శిక్షించాలి’ అని మద్రాసు హైకోర్టు సీజే ఇందిరా బెనర్జీ బుధవారం పోలీసులు ఆదేశించారు. నిందితుల్లో 17 మంది నుంచి వాంగ్మూలం తీసుకుని రిమాండ్కు పంపారు. మిగతా వారి గాలింపు కోసం 50 మంది పోలీసులతో 5 బృందాలు ఏర్పడ్డాయి. రెండేళ్ల క్రితం చెన్నైకి చెందిన హాసిని అనే ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చిన దశ్వంత్ అనే యువ ఇంజనీరుకు కోర్టు ఉరిశిక్ష విధించింది. సుప్రీంకోర్టు ఉరిశిక్ష వేసింది. ఈ తరహాలో అయనవరం నిందితులకు ఉరిశిక్ష పడేలా పగడ్బందీగా చార్జిషీటు వేయాలని పోలీసులు పట్టుదలతో ఉన్నారు. నిందితులపై హత్యాయత్నం, ఫోక్సోచట్టం సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. ఈ సెక్షన్లపై కేసులు పెడితే ఉరిశిక్షకు అవకాశాలు ఎక్కువ. -
ఒకరి బుక్కు, చెక్కు మరొకరికి!
నారాయణపేట : రైతులకు అండగా ఉండాలన్న సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేస్తుంటే మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట మండల అధికారుల నిర్లక్ష్యంతో అనర్హుల చేతికి చిక్కుతోంది. నారాయణపేట మండల పరిధిలోని చోటు చేసుకుంటున ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగు చూస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మొన్న సింగారంలో రాళ్లగుట్టకు రైతుబంధు, నిన్న చిన్నజట్రంలో చనిపోయిన వారికి రైతుబంధు అందజేసిన ఘటనలు మరువకముందే.. మండలంలోని అప్పిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ఒక రైతుకు సంబంధించిన పాసుపుస్తకం, చెక్కు మరో రైతుకు అందించిన వైనం వెలుగు చూసింది. ఆ రైతు తమ పాసుబుక్కు, చెక్కు కానప్పటికి పాసుపుస్తకాన్ని ఇంట్లో భద్రపర్చుకుని చెక్కును డ్రా చేసుకోవడం గమనార్హం. ఈ విషయం అలస్యంగా వెలుగులోకి రావడంతో బాధిత రైతు మంగళవారం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఎదుట తమ గోడు వినిపించారు. ఇలాంటి ఘటనలతో నారాయణపేట మండలంలోని రెవెన్యూ అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూమి నారాయణపేట విశ్వనాథ్ది మండలంలోని అప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులో నారాయణపేటకు చెందిన విశ్వనాథ్ తండ్రి బసప్ప పేరిట సర్వే నంబర్ 269/అ, 277/అ/అ, 280/అ/అ, 281/అ/అ, 274/అ/అ, 275/అ/అ, 276/అ/అ లో మొత్తం 4.17 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి వివరాలు పట్టా నంబర్ 457 ద్వారా పాత పాసుపుస్తకంలో పొందుపర్చారు. అయితే అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలప్ప కుమారుడైన విశ్వనాథ్ ఈ కొత్త పాసుపుస్తకాన్ని, చెక్కును సంబంధిత వీఆర్ఓ నుంచి తీసుకెళ్లారు. అయితే వాస్తవానికి ఈ విశ్వనాథ్కు ఒక ఎకరా పైబడి మాత్రమే భూమి ఉన్నట్లు సమాచారం. పెట్టుబడి సాయం రూ.17,700 నారాయణపేటకు చెందిన బసప్ప కుమారుడు విశ్వనాథ్. ఈయనకు మొత్తం 4.17 భూమితో పాటు పూర్తి వివరాలు కొత్తపాసుపుస్తకంలో పొందుపర్చగా వీటిని అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలప్ప కుమారుడు విశ్వనాథ్ పాస్బుక్కు, చెక్కును తీసుకెళ్లారు. ఈ రైతుకు సంబంధించిన పెట్టుబడి కింద రూ.17,700 ప్రభుత్వం చెక్కు రూపంలో అందజేసింది. కానీ అప్పిరెడ్డిపల్లి రైతు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండగా చెక్కును బ్యాంకులో డబ్బు డ్రా చేసుకోవడమే కాకుండా పాస్బుక్కు తన వద్ద ఉంచుకుని వేధిస్తున్నాడని నారాయణపేటకు చెందిన రైతు విశ్వనాథ్, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి వారం క్రితం వెలుగులోకి రాగా అప్పిరెడ్డిపల్లి రైతు విశ్వనాథ్తో పాటు ఆ గ్రామ వీఆర్ఓ బసప్పను కలిసి తమకు న్యాయం చేయాలని కోరగా.. ‘మీరు పట్టాదారు కాదు... మీకు ఇచ్చేది లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అనే సమాధానం ఇవ్వడంతో విశ్వనాథ్ కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న విశ్వనాథ్కు సమాచారం ఇచ్చి మంగళవారం తహసీల్దార్ దగ్గరికి వెళ్లడంతో పరిశీలించి చర్యలు తీసుకుంటామని సలహా ఇచ్చారే తప్ప పాసుపుస్తకం ఇప్పించే చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఆ తర్వాత డీటీ దగ్గరకు వెళ్లి తమ దగ్గర పాసుపుస్తకాల వివరాలను ముందుంచి బోరుమన్నారు. విచారణ ప్రారంభించిన తహసీల్దార్ నారాయణపేట రూరల్ : మృతి చెందిన వ్యక్తికి సంబంధించిన చెక్కును బినామీ వ్యక్తి రెవెన్యూ సిబ్బంది సహకారంతో డ్రా చేసుకున్న వైనంపై వచ్చిన కథనాలకు రెవెన్యూ అధికారులు స్పందించారు. ‘రెవెన్యూ లీలలు’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం కథనం ప్రచురితమైంది. ఈ మేరకు నారాయణపేట తహసీల్దార్ స్పందించి విచారణ ప్రారంభించారు. చెక్కు పంపిణీ సమయంలో అనుసరించిన విధానం, తీసుకున్న చర్యలపై సంబంధిత వీఆర్వో కృష్ణారెడ్డి నుంచి వివరాలు సేకరించారు. అలాగే, వదూద్ పేరుతో చెక్కు పొందిన హైదరాబాద్ వాసితో పాటు ఆ భూమి తమదంటూ ఫిర్యాదు చేసిన రజియాబేగంకు నోటీసులు జారీ చేశారు. పూర్తి ఆధారాలతో కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. అసలు వ్యక్తులకు కొత్త పాసుపుస్తకం జారీ చేయడంతో పాటు ఫోర్జరీ చేయాలని చూసిన వారిపై క్రిమినల్ కేసు పెడుతామని తహసీల్దార్ తెలిపారు. -
జయ మరణం; ‘అమ్మ’ డ్రైవర్ కీలక సమాచారం
చెన్నై : దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న ఆర్ముగస్వామి కమిషన్ ఆసక్తికర అంశాలను బయటపెట్టింది. దర్యాప్తులో భాగంగా కమిషన్ జయలలిత నెచ్చలి శశికళ, ఆమె వ్యక్తిగత వైద్యుడు శివకుమార్తో పాటు జయలలిత దగ్గర చాలాకాలంగా డ్రైవర్గా పనిచేస్తున్న కన్నన్ని వేర్వేరుగా విచారించింది. శశికళ, వైద్యుడు, కన్నన్ చెప్పిన అంశాలకు పొంతన లేదని తెలిపింది. శశికళ, శివకుమార్ల వర్షన్... ‘ఆ రోజు అనగా 2016, సెప్టెంబర్ 22న అమ్మ(జయలలిత) బెడ్పై కూర్చుని ఉంది. అకస్మాత్తుగా పడిపోయింది. దాంతో డ్రైవర్ కన్నన్, జయ వ్యక్తిగత భద్రతా అధికారి ‘అమ్మ’ను బెడ్ మీద నుంచి వీల్ చైర్లోకి మార్చడానికి ప్రయత్నించారు. కానీ వారికి అది సాధ్యపడలేదు. దాంతో రాత్రి 9.30 గంటలకు అంబులెన్స్కు ఫోన్ చేసామని’ చెప్పారు. కన్నన్ చెప్పిన వివరాలు... ‘అమ్మ’ డ్రైవర్ కన్నన్ మాత్రం శశికళ, శివకుమార్లు చెప్పిన దానికి విరుద్ధమైన విషయాలు చెప్పాడని కమిషన్ వెల్లడించింది. కన్నన్ 1991 నుంచి జయలలిత దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కన్నన్ జయలలితను ఆస్పత్రిలో చేర్చిన రోజు జరిగిన సంఘటన గురించి కమిషన్తో చెప్పిన వివరాలు... ‘నేను ‘అమ్మ’ గదిలోకి వెళ్లేసరికి ఆమె చైర్లో కూర్చుని ఉన్నారు. అప్పటికే ‘అమ్మ’ స్పృహ కోల్పోయి ఉన్నారు. ఆ సమయంలో అక్కడ కొన్ని ఫైల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. పెన్ను కాప్ కూడా తీసి ఉంది. ‘చిన్నమ్మ’ నాతో వెంటనే వెళ్లి ఒక వీల్ చైర్ తీసుకు రా, అమ్మని ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పింది. కొంతసేపటి తరువాత నేను, పీఎస్ఓ వీరపెరుమాల్ చైర్ తీసుకువచ్చి, అమ్మను ఆ చైర్లో కూర్చొపెట్టాము. రెండడుగులు వేసామో, లేదో అమ్మ చైర్ నుంచి కింద పడింది. వెంటనే నేను, వీరపెరుమాల్ ‘అమ్మ’ను లేపడానికి ప్రయత్నించాము. కానీ మా వల్ల కాలేదు. దాంతో స్ట్రెచర్ తీసుకువస్తే బాగుంటుందని భావించామ’ని తెలిపాడు. గంట సేపు డాక్టర్ అదృశ్యం... అంతేకాక కన్నన్ చెప్పిన మరో ఆసక్తికర అంశమేంటంటే.. ‘నేను రాత్రి 8.30 గంటల సమయంలో డాక్టర్ శివకుమార్ను పోయెస్ గార్డెన్లో చూశాను. కానీ కొంతసేపటి తరువాత ఆయన బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ ఆయన తిరిగి ఎప్పుడు పోయెస్ గార్డెన్కి వచ్చాడో నాకు తెలియదు. కానీ నేను అమ్మ గదిలోకి వెళ్లినప్పుడు శివకుమార్ అక్కడే ఉన్నాడు. అంటే దాదాపు గంట తర్వాత అంటే 9.30 గంటలకు అతను తిరిగి వచ్చుంటాడని తెలిపాడు. అంతేకాక ‘ఆ రోజు(సెప్టెంబర్ 22) రాత్రి 10 గంటల ప్రాంతంలో కారును సిద్ధంగా ఉంచమని పీఎస్వో పెరుమాళ్కు చెప్పాను. అయితే లక్ష్మి (జయ ఇంట్లో పనిమనిషి) పెద్ద కారు అయితే బాగుంటుందని తనతో చెప్పింద’ని తెలిపాడు. అయితే కన్నన్ చెప్పిన ఈ రెండు విషయాలను శశికళ, శివకుమార్లు చెప్పలేదని కమిషన్ పేర్కొంది. అంతేకాక పోయెస్ గార్డెన్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, అయితే సెప్టెంబర్ 22 నాటి దృశ్యాలు అందులో రికార్డయ్యాయో, లేదో తనకు తెలియదని కన్నన్ కమిషన్తో చెప్పాడు. -
‘సామాజిక’ బాధ్యతేదీ?
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియా వల్ల మంచితోపాటు చెడు కూడా జరుగుతోంది. నిజానికి తప్పుడు సమాచారమే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తోంది. ఇటీవల జరుగుతున్న ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి సున్నితమైన అంశాల్లో నియంత్రణ చర్యలు చేపట్టేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తుంటే సోషల్ మీడియా సంస్థలు సహకరించడం లేదు. దీంతో కేసులు పెరుగుతున్నాయి.. దర్యాప్తు మాత్రం ముందుకు సాగడం లేదు. ‘బిహార్ కిడ్నాప్ గ్యాంగ్’ కలకలం ఇటీవలి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ‘బిహార్ కిడ్నాప్ గ్యాంగ్’ప్రచారం ప్రజలతోపాటు పోలీస్ శాఖను వణికించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎక్కడో జరిగిన దాన్ని రాష్ట్రంలో జరిగినట్లు సోషల్ మీడియాలో పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసులు భావించారు. ఇందుకోసం సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు సైబర్ క్రైమ్ పోలీసులు లేఖలు రాశారు. తొలుత ఆ వీడియో పోస్టు అయిన ఐపీ అడ్రస్ వెల్లడించాలని, ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి ప్రజలు భయాందోళనకు గురికాకుండా నియంత్రించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. అయితే ఈ విజ్ఞప్తిని రెండు ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు తిరస్కరించాయి. దీంతో పోలీస్ శాఖ ఆందోళనలో పడింది. ఇక చేసేది లేక.. ఆ వీడియో ఇక్కడిది కాదని, ఎక్కడో జరిగిందాన్ని ఇక్కడ ఆపాదించడం మంచిది కాదని ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. గతంలోనూ ఇదే ధోరణి రాష్ట్ర ముఖ్యమంత్రిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో హైదరాబాద్ నగర కమిషనరేట్లోని సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పోస్టుకు సంబంధించిన ఐపీ అడ్రస్ కావాలని, ఎవరు పోస్టు చేశారో తెలుసుకొని చర్యలు తీసుకోవాల్సి ఉందని సంబంధిత సోషల్ మీడియా సంస్థకు మెయిల్ పెట్టారు. కానీ ఆ సంస్థ పోలీస్ శాఖ విజ్ఞప్తిని తిరస్కరించింది. తాము ఐపీ అడ్రస్ వెల్లడించలేమని తేల్చిచెప్పింది. దీంతో ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక కేసు మూసివేయాల్సి వచ్చిందని నగర కమిషనరేట్ అధికారులు తెలిపారు. అలాగే నగర కమిషనరేట్ పరిధిలో ఓ యువతిని అసభ్యకర సందేశాలు, అశ్లీల ఫొటోలతో వేధిస్తున్న ఓ యువకుడిని పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నించగా.. సోషల్ మీడియా సంస్థ ఐపీ అడ్రస్ వివరాలిచ్చేందుకు వెనుకాడింది. దీంతో ఈ కేసునూ మూసివేశారు. కేంద్ర హోంశాఖ సమన్వయం రెండేళ్ల కిందటి వరకు ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు అధికారులు కోరిననట్లుగా సోషల్ మీడియా సంస్థలు ఐపీ అడ్రస్లు ఇచ్చేవి. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటూ సైబర్ నేరాల నియంత్రణకు లీగల్ వింగ్ను ఏర్పాటుచేసింది. అన్ని రాష్ట్రా ల్లోని సైబర్ నేరాలకు సంబంధించి కావాల్సిన సోషల్ మీడియా ఐపీ అడ్రస్లను ఈ లీగల్ విభాగం సమన్వయం చేస్తూ వచ్చింది. కానీ కొన్ని నెలల నుంచి ఈ విభాగానికి కూడా సోషల్ మీడియా సంస్థలు ఐపీ అడ్రస్ ఇవ్వడం లేదు. పెరిగిపోతున్న కేసులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయి. బ్యాంకు మోసాలు, క్రెడిట్ కార్డు లూటీ, మెయిల్ హ్యాకింగ్స్, ఫోర్స్ సైట్, చైల్డ్ పోర్నోగ్రఫీ.. ఇలా అనేక రకాల సైబర్ నేరాలు ఏటా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటి నియంత్రణకు కృషి చేయాల్సిన సోషల్ మీడియా సంస్థలు దర్యాప్తు విభాగాలకు సహకరించకపోవడంపై పోలీస్ శాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. నేరాలకు పాల్పడ్డ వారి వివరాలు మాత్రమే అడుగుతున్నామని, ఇతర సాధారణ వ్యక్తుల ఐడెంటిటీని కోరడం లేదని విన్నవించినా పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏటా వందల కేసులు పెండింగ్లో ఉండటం, ఆధారాల్లేక మూసివేయాల్సిన పరిస్థితి రావడంపై అధికారుల్లో ఆందోళన మొదలైంది. -
చమన్ మృతిపై ప్రజల్లో అనుమానాలు
సాక్షి, అనంతపురం : టీడీపీ నేత, జెడ్పీ మాజీ చైర్మన్ దూదేకుల చమన్ మృతిపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. చమన్ మృతి చెందిన రెండు రోజులకే ఆయన డ్రైవర్ నూర్ బాషా ప్రమాదంలో మరణించడం వివాదస్పదంగా మారిందని తెలిపారు. నూర్ బాషాను ఢీకొన్న కారును ఇప్పటివరకు పోలీసులు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. చమన్, పరిటాల కుటుంబం మధ్య అభ్రిప్రాయభేదాలు ఉన్నాయని.. చమన్ మృతదేహానికి వెంటనే పోస్టుమార్టం నిర్వహించాలని కోరారు. చమన్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. -
వందలాది సాక్షులు అవసరమా?: సుప్రీం
న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థలు కేసుల విచారణలో భాగంగా లెక్కలేనంత మంది సాక్షులను ఎందుకు విచారిస్తాయోనంటూ సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో 2008లో జరిగిన వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు 1,500 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ల ధర్మాసనం దీనిపై స్పందిస్తూ ‘ప్రతి కేసులోనూ కనీసం వంద నుంచి 200 మంది సాక్షులు ఉంటున్నారు. ఇటీవల వచ్చిన ఓ రోడ్డు ప్రమాద కేసులోనూ దాదాపు 200 మంది సాక్షులున్నారు. కానీ వారిలో ఒక్కరు కూడా ప్రత్యక్ష సాక్షి లేరు. ఇంతమంది సాక్షులెందుకో మాకు అర్థం కాదు’ అని వ్యాఖ్యానించింది. -
కొలిక్కిరాని దర్యాప్తు
సాక్షి,కొత్తూరు: ఇటీవల హైదరాబాద్ శివారులో ఓ గర్భిణినీ హత్య చేయడంతో పాటు శరీర భాగాలను ముక్కలుగా చేసి సంచిలో కట్టి రోడ్డు పక్కన పడేశారు. కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు నిందితులను నెల రోజుల్లోపే గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉప్పల్లో చిన్నారి నరబలి కేసును సైతం పోలీసులు సవాల్గా తీసుకొని రోజుల్లోనే చేధించారు. కాగా కొత్తూరు మండల కేంద్రంలో గతేడాది మార్చిలో టీకొట్టు ఘటనలో కాలిబూడిదైన గుర్తుతెలియని వ్యక్తి కేసు ఏడాది గడుస్తున్నా మిస్టరీగానే మిగిలింది. మంటలు అర్పిన తర్వాత మృతదేహం గుర్తింపు.... గతేడాది మార్చి 22వ తేదీన అర్ధరాత్రి సమయంలో పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న ఓ టీకొట్టుకు నిప్పంటుకుందనే సమాచారంతో పోలీసులు ఫైర్ ఇంజన్కు సమాచారం ఇచ్చి మంటలను అదుపుచేశారు. తర్వాత అక్కడ పరిశీలించగా కొట్టుతో పాటు అందులో సగానికి పైగా కాలిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి ఖంగుతిన్నారు. అప్పట్లో ఆ విషయం మండలంలో సంచలనం సృష్టించింది. కాగా పోలీసులు ఉద యాన్నే సంఘటన స్థలానికి డాగ్స్క్వాడ్, క్లూస్టీంను రప్పి ంచి కొన్ని ఆధారాలు సేకరించారు. టీకొట్టు నడిపే వ్యక్తి ఛా య్, సిగరెట్లతో పాటు కిరోసిన్, పెట్రోలు సైతం విక్రయించేవాడు. రాత్రి సమయంలో అందులో చోరీ చేయడానికి వచ్చిన వ్యక్తి అందులోకి పైకప్పు తొలగించి దూకడంతో పెట్రోలు డ బ్బాలు పగిలిపోవడం. వెలుతురు కోసం ఆగ్గిపుల్ల వెలిగించడంతో ప్రమాదం జరిగినట్లు అప్పట్లో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో టీకొట్టు నిర్వహించే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించినా ఎలాంటి ఫలితం లేదు. ప్రమాదంపై పలు అనుమానాలు.. గతేడాది మార్చి 22వ తేదీన మండలంలో సంచలనం సృష్టించిన ఘటన ఏడాది గడుస్తున్న నేటికీ మిస్టరీగానే మిగిలింది. టీకొట్టు ప్రమాదంలో మృతి చెందింది చోరీ చేయడానికి వచ్చిన వ్యక్తేనా..? మరో వ్యక్తా..? ఒకవేళ చోరీకి వస్తే ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై రూరల్ సీఐ మధుసూదన్ను వివరణ కోరగా సంఘటనకు సరైన ఆధారాలు లభించని కారణంగా దర్యాప్తు ముందుకు సాగడం లేదన్నారు. -
‘2జీ’ జాప్యంపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కేసుల దర్యాప్తులో జాప్యాన్ని తప్పుపడుతూ సీబీఐ, ఈడీలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2జీ, అందులో భాగమైన ఎయిర్సెల్–మాక్సిస్ ఒప్పందంలో అవకతవకలపై దర్యాప్తును ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ముఖ్యమైన ఇలాంటి కేసుల్లో ప్రజలకు వాస్తవాలు తెలియకుండా దాచిపెట్టకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. ‘2జీ స్పెక్ట్రం, అనుబంధ కేసుల్లో దర్యాప్తు ముగించేందుకు ఎందుకింత జాప్యం జరుగుతోంది. 2010లో సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. ఇంతవరకూ ఎందుకు విచారణ పూర్తి చేయలేదో చెప్పండి’ అని నిలదీసింది. కేసు దర్యాప్తు జాప్యం వెనుక ఏదైనా అదృశ్య శక్తి హస్తముందా? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. ‘ ఈ కేసుతో సంబంధమున్న అందరిపై కేసులు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ జరపండి. దర్యాప్తు తీరుపై అసంతృప్తిగా ఉన్నాం’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై అటార్నీ జనరల్ వేణుగోపాల్ స్పందిస్తూ.. ‘టెలికం మాజీ మంత్రి రాజాకి ప్రమేయమున్న 2జీ కేసులో నిందితుల్ని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అదేవిధంగా ఇతర అనుబంధ కేసుల్లో నిందితులపై ఆరోపణల్ని కూడా కొట్టివేశారు. కేవలం మలేసియా వ్యాపారవేత్త టీ ఆనంద కృష్ణన్కు ప్రమేయమున్న ఎయిర్సెల్–మాక్సిస్ కేసు దర్యాప్తు మాత్రమే పెండింగ్లో ఉంది. అతను మలేసియాలో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో అతన్ని భారత్కు రప్పించలేకపోయాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుంటూ... కేసు దర్యాప్తు పురోగతిపై రెండు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఆదేశించింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వాదిస్తూ.. ఎయిర్సెల్–మాక్సిస్ కేసు దర్యాప్తుపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఇంతకముందే కోర్టు ఆదేశించిందని, అయితే కేసులోని ఒక నిందితుడి బెడ్రూంలో ఆ ఫైల్ ఉందని ఆరోపించారు. ఎయిర్సెల్–మాక్సిస్ కేసు నుంచి దయానిధి మారన్, అతని సోదరుడు కళానిధి మారన్ పేర్లను ప్రత్యేక కోర్టు తప్పించినా.. ఒప్పందానికి ఎఫ్ఐపీబీ ఇచ్చిన అనుమతిపై మాత్రం సీబీఐ విచారణ కొనసాగుతోంది. -
క్యాంటీన్లో కలెక్టర్ భోజనం
వేములవాడ: జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదివారం స్వామివారి క్యాంటీన్కు చేరుకుని సామాన్య భక్తుడిలా రూ. 25 చెల్లించి టోకెన్ తీసుకుని భోజనం చేశారు. జాతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చారు. అనంతరం స్వామి వారి క్యాంటీన్ భోజనం బాగుందంటూ ఆలయ ఈవో దూస రాజేశ్వర్, డీఆర్వో శ్యాంప్రసాద్లాల్కు చెప్పారు. మెట్లపై కూర్చుండి షూ తొడుక్కుని తిరిగి వెళ్లిపోయారు. క్యాంటీన్కు చేరుకున్న కలెక్టర్ను చూసిన భక్తులు వావ్ కలెక్టర్ అంటా అని చెప్పుకున్నారు. రాజన్నను దర్శించుకున్న కలెక్టర్ వేములవాడ రాజన్నను జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్వో శ్యాంప్రసాద్లాల్ క్యూలైన్లలో వచ్చి స్వామివారిని బయట నుంచే దర్శించుకున్నారు. అనంతరం అద్దాల మండపంలో అర్చకులు ఆశీర్వదించారు. నగరపంచాయతీ కమిషనర్పై ఫైర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, ఆంధ్రాబ్యాంకు చౌరస్తా, జాతరగ్రౌండ్ ప్రాంతాల్లో ఆక్రమణలు పెరిగిపోయాయి. అలాగే ప్రైవేట్ హౌస్లను లాడ్జ్లుగా నిర్వహిస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారంటూ నగరపంచాయతీ కమిషనర్ జగదీశ్వర్గౌడ్పై జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఫైర్ అయ్యారు. వెంటనే ఆక్రమణలు తొలగించాలనీ, ప్రైవేట్ లాడ్జ్ల లిస్టును తమకు సమర్పించాలని ఆదేశించారు. తక్షణమే వాటిని తొలిగిస్తామని కమిషనర్, కలెక్టర్కు సమాధానమిచ్చారు. పోలింగ్ స్టేషన్ల ఆకస్మిక తనిఖీ పట్టణంలోని పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్వో శ్యాంప్రసాద్లాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికల హైస్కూల్లోని కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, అర్బన్ కాలనీ కేంద్రాన్ని డీఆర్వో తనిఖీ చేశారు. ఓటరు నమోదు కార్యక్రమంపై ఆరా తీశారు. అంగన్వాడీ టీచర్లకు తగు సూచనలు చేశారు. వారి వెంట తహసీల్దారు నక్క శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. వాటర్ బెడ్ పరిశీలన వేములవాడఅర్బన్: అర్బన్ మండలంలోని నాంపల్లిలో కరీంనగర్ డ్యామ్ నుంచి వేములవాడకు వచ్చే మంచినీటి వాటర్ బెడ్ను, నందికమాన్ నుంచి తిప్పాపూర్ వరకు రోడ్డును కలెక్టర్ కృష్ణ భాస్కర్, జిల్లా ఎస్పీ విశ్వజిత్ అదివారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు మంచినీటి కోరత ఉండకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం నాంపల్లి గుడికట్ట మీద ఉన్న పైపులైన్ను పరిశీలించారు. ఆలయ ఈవో దూస రాజేశ్వర్, నగరపంచాయతీ చైర్పర్సన్ నామాల ఉమ, డీఆర్వో శ్యామ్ప్రసాద్లాల్, డీఎస్పీ అవధాని చంద్రశేఖర్, పట్టణ సీఐ వెంకటస్వామి, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘లోయా మృతిపైనే మా విచారణ’
న్యూఢిల్లీ: సీబీఐ దివంగత జడ్జి బీహెచ్ లోయా మృతికి సంబంధించి మాత్రమే తమ విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ లోయా అనుమానాస్పద మృతిపై తదుపరి విచారణకు ఆదేశించాలా? వద్దా? అనేదే పరిశీలిస్తామంది. సోహ్రబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ చేసిన కేసులో బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు, నాటి గుజరాత్ హోం మంత్రి అమిత్ షాను నిర్దోషిగా ప్రకటించడం సహా...మరే ఇతర అంశాల జోలికి తాము వెళ్లబోమని తేల్చిచెప్పింది. అమిత్ షా నిందితుడిగా ఉండిన సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తుండగానే 2014 డిసెంబర్ 1న లోయా అనుమానాస్పద స్థితిలో గుండెపోటుతో మరణించారు. -
అందుబాటులో లేని ‘పేట’ ఆర్డీవో, ఎమ్మార్వో
సాక్షి, గుంటూరు: నరసరావుపేట కిడ్నీ రాకెట్ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ మంగళవారం ప్రారంభమైంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కిడ్నీ మార్పిడికి సంబంధించిన రికార్టులను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నరసరావుపేట ఎమ్మార్వో, ఆర్డీవోలను విచారించేందుకు విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శోభామంజరి, అధికారులు వారి కార్యాలయాలకు వెళ్లారు. అయితే ఆయా కార్యాలయాల్లో ఆ అధికారులు లేకపోవడంతో గుంటూరు తిరిగి వచ్చారు. -
ఒకే ఇంటికి 42 టాయిలెట్లు!
పట్నా: ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం పేరుతో ఓ ప్రబుద్ధుడు 42 సార్లు దరఖాస్తు చేసి ప్రభుత్వ ఖజానాకు లక్షలాది రూపాయలు కుచ్చుటోపి పెట్టిన ఘటన బిహార్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైశాలీ జిల్లాలోని విష్ణుపూర్ రామ్ గ్రామానికి చెందిన యోగేశ్వర్ చౌధరీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం కోసం 42 సార్లు దరఖాస్తు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రతిసారీ కొత్త గుర్తింపు పత్రాలు దాఖలుచేయడం ద్వారా దాదాపు రూ.3,49,600 తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే విశ్వేశ్వర్ రామ్ అనే వ్యక్తి మరుగుదొడ్డి కోసం 10 సార్లు దరఖాస్తు చేసి రూ.91,200 నొక్కేసినట్లు పేర్కొన్నారు. ఈ రెండు ఘటనలు 2015 ప్రథమార్ధంలో జరిగినట్లు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేయడంపై విచారణ చేయాల్సిందిగా సామాజిక కార్యకర్త రోహిత్ కుమార్ శనివారం వైశాలీ జిల్లా మేజిస్ట్రేట్ను కోరారు. ఉన్నతస్థాయి విచారణ అనంతరమే ఈ ఘటనపై స్పందిస్తామని జిల్లా ఉప అభివృద్ధి అధికారి సర్వణయాన్ యాదవ్ తెలిపారు. బిహార్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబానికి మరుగుదొడ్డి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.12,000 ఇస్తోంది. -
ప్రత్యేక బృందాలతో గాలింపు జరపండి: చినరాజప్ప
కాకినాడ: రాజమండ్రి లాలాచెరువు వద్ద ముస్లిం మత గురువు ఫారూఖ్ హత్య ఘటనపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరా తీశారు. దీనిపై జిల్లా ఎస్పీతో ఫోనులో మాట్లాడారు. హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు జరపాలని ఆదేశించారు. హత్యను ఆయన ఖండించారు. కాగా, ఫారుఖ్ హత్యను ముస్లింలు తీవ్రంగా ఖండించారు. ఈమేరకు రాజమండ్రిలో మెయిన్ రోడ్డులోని పెద్ద మసీదు మద్ద వరు నిరసన తెలిపారు. -
ఉత్తరప్రదేశ్లో జర్నలిస్ట్ దారుణ హత్య
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో మరో జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయారు. స్థానికంగా ఓ హిందీ దినపత్రికలో పనిచేస్తున్న నవీన్ గుప్తా అనే జర్నలిస్ట్ను గురువారం గుర్తుతెలియని దుండగులు తుపాకీతో దారుణంగా కాల్చిచంపారు. బిలహౌర్ నగరపాలిక సంస్థ మార్కెట్ సమీపంలోని పబ్లిక్ టాయిలెట్ నుంచి బయటకు వస్తున్న గుప్తాపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఘటనాస్థలికి చేరుకున్నారు. గుప్తా మృతిపై సంతాపం తెలిపిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. నిందితుల్ని పట్టుకునేందుకు విచారణను వేగవంతం చేయాలని రాష్ట్ర డీజీపీ సుల్ఖన్సింగ్ను ఆదేశించారు. హత్యకు పాతకక్షలే కారణమై ఉండొచ్చని పోలీసులు చెప్పారు. -
ఇక శశి, ఇళవరసిల విచారణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: మెరుపు దాడులతో శశికళ బంధువర్గాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఆదాయపు పన్నుశాఖ ఇక శశికళ, ఇళవరసిలపై దృష్టి సారించనుంది. ఐటీ దాడుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా బెంగళూరు జైలులో వీరిద్దరినీ విచారించనుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్ను పరామర్శించేందుకు శశికళ ఇటీవల పెరోల్పై చెన్నైకి వచ్చినపుడు 622 ఆస్తుల రిజిస్ట్రేషన్లలో మార్పులు, చేర్పులు చేసినట్లు ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఈ తతంగమంతా ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ ఇంట్లో జరిగినట్లు అభియోగం. దాడులు ముగిసిన నాటి నుంచి శశికళ బంధువులను ఐటీ కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. ఆస్తులు కూడగట్టడంలో ప్రధానపాత్ర పోషించిన శశికళను, ఆమె అన్న భార్య ఇళవరసిలను విచారించేందుకు ఐటీ అధికారులు బెంగళూరు జైలుకు వెళ్లనున్నట్లు సమాచారం. దినకరన్ సోదరికి శిక్ష ఖరారు టీ నగర్ (చెన్నై): శశికళ సోదరి బి.వనితామణి కుమార్తె శీతలాదేవికి మూడేళ్లు, ఆమె భర్త ఎస్ఆర్ భాస్కరన్కు ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తూ గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ మద్రాసు హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. శీతలాదేవి దినకరన్కు చెల్లెలు. భాస్కరన్ రిజర్వు బ్యాంకు మాజీ ఉద్యోగి. 1988– 97 మధ్యకాలంలో భాస్కరన్ తన భార్య పేరిట ఆదాయానికి మించి రూ.1.68కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు సీబీఐ 1998లో కేసు వేసింది. కేసు విచారించిన సీబీఐ కోర్టు భాస్కరన్కు ఐదేళ్ల శిక్ష, రూ.20 లక్షలు జరిమానా, శీతలాదేవికి మూడేళ్ల శిక్ష, రూ.10 లక్షలు జరిమానా విధిస్తూ 2008లో తీర్పుచెప్పింది. దీనిపై వీరు 2008లో హైకోర్టును ఆశ్రయించగా, శిక్షను నిలిపేసి హైకోర్టు విచారణ చేపట్టింది. తాజాగా సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు జడ్జి జయచంద్రన్ తీర్పుచెప్పారు. -
కోర్టు ఆవరణలోనే ఖైదీపై కాల్పులు
న్యూఢిల్లీ: విచారణలో ఉన్న ఖైదీపై ఢిల్లీలోని రోహిణి కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో సోమవారం ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఖైదీ వినోద్ అలియాస్ బాల్లే మృతి చెందాడు. విచారణ కోసం కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలిస్తుండగా రోహిణి కోర్టు క్యాంటీన్కు చేరువలో నిందితుడిపై కాల్పులు జరిగాయి. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. -
రాజస్తాన్లో గోరక్షకుల దురాగతం
ఆల్వార్: గోరక్షకులు మరోసారి రెచ్చిపోయారు. రాజస్తాన్లో ఆవులను తీసుకెళ్తున్న ఉమర్ ఖాన్(35) అనే వ్యక్తిని తుపాకీతో కాల్చిచంపారు. అనంతరం మృతదేహాన్ని రైల్వే ట్రాక్పై పడేశారు. భరత్పూర్ జిల్లాలోని ఘట్మిక గ్రామానికి చెందిన ఉమర్ మృతదేహాన్ని రామ్గఢ్ సమీపంలోని రైల్వే ట్రాక్పై శనివారం గుర్తించినట్లు డీఎస్పీ అనిల్ బెనివాల్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ సాగుతోందని..మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం జైపూర్కు పంపినట్లు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో ఉమర్ ఆవులను అక్రమంగా తరలిస్తున్నట్లు తేలిందన్నారు. ఉమర్తో పాటు మరో ఇద్దరు శుక్రవారం ఆవులను తరలిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి వీరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై పలు మానవహక్కుల సంఘాలు ఉమర్ మృతదేహాన్ని భద్రపరచిన ఆస్పత్రి ముందు ఆందోళన నిర్వహించాయి. స్మగ్లర్లను శిక్షించడానికి చట్టం ఉందనీ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న గోరక్షకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. -
నేటి నుంచి ‘జడ్జీల పేరుతో లంచం’ కేసు విచారణ
న్యూఢిల్లీ: కేసుల పరిష్కారానికి జడ్జీల పేరుతో లం చాలు తీసుకున్న కేసును సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం నేటి నుంచి విచారించనుంది. ఈ కేసును విచారించడానికి ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పా టు చేయాలని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్ల బెంచ్ నవంబర్ 9న ఇచ్చిన ఆదేశాలను తర్వాతి రోజు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి న్యాయవాది కామిని జైశ్వాల్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఆర్కే అగర్వాల్, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ల ధర్మాసనం మధ్యాహ్నం 3.30 గంటలకు విచారించనుంది. -
‘తెహల్కా’లో జోక్యం చేసుకోండి
న్యూఢిల్లీ: తెహెల్కా మ్యాగజైన్ ఫైనాన్సియర్స్పై విచారణలో జోక్యం చేసుకోవాలని 2004లో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. తెహెల్కా పెట్టుబడిదారులపై రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు అనుసరిస్తున్న వైఖరి అన్యాయంగా ఉందని, ఈ అంశాన్ని పరిష్కరించాలని లేఖలో సోనియా కోరారు. తెహెల్కా.కామ్ ప్రధాన పెట్టుబడిదారైన ఫస్ట్ గ్లోబల్ డైరెక్టర్ పంపిన వివరాల్ని పరిశీలించాలని అప్పట్లో నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్ చైర్పర్సన్గా కేబినెట్ మంత్రి హోదాలో సోనియా కోరారు. 4 రోజులకు యూపీఏ ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేసింది. 6 రోజులకు ఫస్ట్ గ్లోబల్పై కేసును ఉపసంహరించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన సోనియా గాంధీ లేఖపై చిదంబరం స్పందిస్తూ.. ‘ఆ లేఖను పరిశీలించిన విషయం వాస్తవం. సోనియా లేఖకు తాను ఇచ్చిన సమాధానాన్ని కేంద్రం బయటపెట్టాలి. రెండింటిని కలిపి చదివితే స్పష్టత వస్తుంది’ అని వివరణ ఇచ్చారు. అప్పట్లో తెహెల్కా పత్రిక బహిర్గతం చేసిన రక్షణ ఒప్పందాల అవినీతికి బాధ్యత వహిస్తూ వాజ్పేయ్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ రాజీనామా చేశారు. డబ్బులు తీసుకుంటూ కెమెరాకు చిక్కిన బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ను అనంతరం కోర్టు దోషిగా నిర్ధారించింది. అత్యాచారం కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న తరుణ్ తేజ్పాల్ అప్పట్లో తెహెల్కా ఎడిటర్గా వ్యవహరించారు. ఈ అవినీతి వెలుగులోకి వచ్చాక.. ఫస్ట్ గ్లోబల్ ప్రమోటర్లు దెవినా మెహ్ర, శంకర్ శర్మలపై వివిధ దర్యాప్తు సంస్థలు పలు కేసులు నమోదు చేశాయి. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చాక మెహ్ర, శర్మలు సోనియాకు లేఖ రాస్తూ దర్యాప్తు సంస్థల వేధింపులు కొనసాగుతున్నాయని, పరిష్కరించాలని కోరారు. -
జయలలిత మృతిపై విచారణ ప్రారంభం
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ఆదేశించిన న్యాయవిచారణ ప్రారంభమైంది. జయలలిత మృతిపై రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో న్యాయవిచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రిటైర్డ్ జడ్జి ఆర్ముగ సామి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా కేసులో సంబంధం ఉన్నవారికి నోటీసులు పంపనున్నారు. జయలలిత ఆస్పత్రిలో చేరిన దగ్గరనుంచి చనిపోయేవరకు దారితీసిన అన్ని పరిస్థితులపై ఆయన విచారణ జరుపుతారు. విచారణ పారదర్శకంగా జరుగుతందని, ప్రభుత్వం నిర్దేశించిన మూడు నెలల్లోనే దర్యాప్తు పూర్తి చేసి నివేదిక అందజేస్తామని ఆర్ముగ సామి చెప్పారు. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గత ఏడాది డిసెంబర్ 5 న అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. జయలలిత మృతి వెనుక ఆమె నెచ్చెలి శశికళ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. ఆమె మృతిపై అపోలో ఆస్పత్రి ఇప్పటికే వివరణ ఇచ్చింది. అయినా, జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి న్యాయవిచారణ జరపాల్సిందేనని ఆమె వీరవిధేయుడు పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం అమ్మ జయలలిత మృతిపై న్యాయవిచారణకు ఆదేశించింది. -
రాజస్తాన్ ఆర్డినెన్స్పై ఐఎన్ఎస్ ధ్వజం
న్యూఢిల్లీ: ప్రస్తుత, మాజీ ప్రభుత్వ అధికారులు, జడ్జీలకు విచారణ, వారి అవినీతిపై మీడియా కవరేజీ నుంచి రక్షణ కల్పిస్తూ రాజస్తాన్ సర్కారు ఆర్డినెన్స్ తేవడాన్ని ‘ది ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) అధ్యక్షులు అఖిల ఉరంకార్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర సర్కారు నిర్ణయం మీడియా గొంతు నొక్కేయడమేనన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలపై దాడేనని విమర్శిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదలచేశారు. ఇలాంటి ఆర్డినెన్స్ తేవడం రాజ్యాంగవిరుద్ధమన్నారు. అధికారులు, మాజీ జడ్జీలను విధి నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ముందస్తు అనుమతిలేకుండా విచారణ, అవినీతి వ్యవహారాలపై మీడియా కథనాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడాన్ని ఆమె ఆక్షేపించారు. ఆర్డినెన్స్కు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీ సెలక్ట్ కమిటీకి పంపించిన సంగతి తెలిసిందే. -
మోదీజీ..అమిత్ షా అంటే భయమెందుకు?
సాక్షి,పనాజీ: బీజేపీ చీఫ్ అమిత్ షా కుమారుడిపై వచ్చిన ఆరోపణల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మౌనందాల్చడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. జే షాపై నిష్పాక్షిక విచారణ జరిగేందుకు అమిత్ షా తన పదవి ఉంచి వైదొలగాలని డిమాండ్ చేసింది. షెల్ కంపెనీలకు వ్యతిరేకంగా ప్రధాని తీవ్ర చర్యలు చేపడుతుంటే ఆ తరహాలోనే అమిత్ షా కుమారుడు జే షాకు చెందిన టెంపుల్ ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాలకు పాల్పడిందని ఏఐసీసీ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పారదర్శకత గురించి మాట్లాడే ప్రధాని, అమిత్ షాలు ఈ ఆరోపణలపై విచారణ జరిపించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. అమిత్ షాను ప్రధాని ఎందుకు కాపాడుతున్నారని..తనకు సన్నిహితుడైన వ్యక్తిని జవాబుదారీగా ఉండాలని కోరేందుకు ఎందుకు జంకుతున్నారని నిలదీశారు. షెల్ కంపెనీలపై పోరాడుతున్నానని, డొల్ల కంపెనీలను మూసివేయిస్తానని చెబుతున్న ప్రధాని అమిత్ షా కుమారుడి డొల్ల కంపెనీలపై మౌనం దాల్చారని విమర్శించారు. జే షా డొల్ల కంపెనీలపై విచారణ చేపడితే వాటిలో డొల్లతనం నిగ్గుతేలుతుందని అన్నారు.ఈ వ్యవహారంలో విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని ఆరోపించారు. అమిత్ షా కుమారుడికి చెందిన కంపెనీ టర్నోవర్ కేవలం ఒక్క ఏడాదిలోనే (2015-16) రూ 50,000 నుంచి 80.5 కోట్లకు పెరిగిందన్న ఓ వెబ్సైట్ కథనం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఓ ఎన్బీఎఫ్సీ నుంచి హామీ రహిత రుణం పొందడం వల్లే టర్నోవర్ భారీగా పెరిగిందని దివైర్ వెబ్సైట్ పేర్కొంది. -
నవంబర్లో నిర్ణయం
అనర్హత వేటు వ్యవహారంలో నవంబర్లో తుది విచారణకు మద్రాసు హైకోర్టు నిర్ణయించింది. ఆ నెల రెండో తేదీ నిర్ణయాన్ని తుది విచారణ అంటూ అదనపు పిటిషన్లు, వివరణలన్నీ ఈనెల 13వ తేదీలోపు ముగించాలని ప్రభుత్వానికి, పిటిషనర్లకు న్యాయమూర్తి రవిచంద్ర బాబు ఆదేశాలు ఇచ్చారు. సాక్షి, చెన్నై : సీఎం పళని స్వామికి వ్యతిరేకంగా వ్యవహరించిన అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు 18 మందిపై అనర్హత వేటు పడ్డ విషయం తెలిసిందే. ఈ వేటును వ్యతిరేకిస్తూ ఆ 18 మంది మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో తమకు న్యాయం లభిస్తుందనే ఎదురుచూపులతో అనర్హత వేటు పడ్డ వారు ముందుకు సాగుతున్నారు. ఈ పిటిషన్ గత వారం న్యాయమూర్తి రవిచంద్ర బాబు నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ తరఫున వివరణతో కూడిన పిటిషన్ ఆ రోజున దాఖలైంది. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధం కావడంతోనే అనర్హత వేటు వేసినట్టుగా అందులో వివరించారు. ఈ నేపథ్యంలో సోమవారం న్యాయమూర్తి రవిచంద్ర బాబు ముందు ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. నవంబర్ 2న తుది విచారణ పిటిషనర్ల తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ హాజరై వాదనల్ని వినిపించారు. అనర్హత వేటు పడ్డ వారి తరఫున అదనపు పిటిషన్లు దాఖలు చేసినట్టు వివరించారు. ఇందుకు ప్రభుత్వం తరఫున న్యాయవాది వైద్యనాథన్ హాజరై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. అదనపు పిటిషన్లకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా, మరింత సమయాన్ని కేటాయించాలని కోరారు. ఈ సమయంలో అభిషేక్ సింఘ్వీ, వైద్యనాథన్ మధ్య వాడి వేడిగా వాదనలు సాగాయి. విచారణ త్వరితగతిన ముగించాలని, పిటిషనర్లకు న్యాయం చేయాలని బెంచ్ను సింఘ్వీ కోరారు. చివరకు వాదనల అనంతరం న్యాయమూర్తి రవిచంద్ర బాబు జోక్యం చేసుకుని, తుది విచారణ నవంబర్ రెండో తేదీన జరుగుతుందని ప్రకటించారు. అదనపు పిటిషన్లు, వివరణలన్నీ ఈనెల 13వ తేదీలోపు ముగించాలని ఆదేశించారు. నవంబర్ రెండున తుది విచారణ తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామంటూ, అప్పటివరకు బల పరీక్ష వ్యవహారంలో స్టే కొనసాగుతుందని ప్రకటించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. కాగా, అనర్హత వేటుపై కోర్టులో విచారణ మరికొన్ని వారాలకు వాయిదా పడ్డ దృష్ట్యా, నిర్ణయం కోసం ఆ 18 మంది మరి కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. ఆస్పత్రిలో తంగ తమిళ్ సెల్వన్ అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న తంగ తమిళ్ సెల్వన్ అనారోగ్యం బారిన పడ్డారు. గత కొంత కాలంగా క్యాంప్ రాజకీయాలతో పుదుచ్చేరి, బెంగళూరుల్లో తంగతమిళ్ సెల్వన్ తిష్ట వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వేటు పడడంతో మళ్లీ రాష్ట్రంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఆయన అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి తీవ్రత మరీ ఎక్కువ కావడంతో కుటుంబీకులు, సహచరులు చికిత్స నిమిత్తం గ్రీమ్స్ రోడ్డులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో మరి కొద్ది రోజులు ఉండి చికిత్స పొందాల్సి ఉన్నట్టు వైద్యులు ఆయనకు సూచించారు. దీంతో తంగ తమిళ్ సెల్వన్ను పలువురు అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు, దినకరన్ మద్దతు నాయకులు పరామర్శించే పనిలో పడ్డారు -
ఆ నలుగురిని విచారించండి
తమిళసినిమా: నటులు విశాల్, కార్తి, నాజర్, పొన్వన్నన్ను విచారించాలంటూ మద్రాసు హైకోర్టు సెంట్రల్ నేర పరిశోధన పోలీసు అధికారులకు శనివారం ఆదేశాలు జారీచేసింది. వివరాలు.. 2015లో జరిగిన దక్షిణభారత నటీనటుల సంఘం ఎన్నికల్లో పోటీ చేసిన నటుడు విశాల్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారు చేసిన వాగ్ధానాల్లో సంఘ భవన నిర్మాణం ఒకటి. ఇందుకోసం సంఘ నిర్వాహకులు స్టార్ క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఆ కార్యక్రమం ప్రసార హక్కులను ఓ ప్రైవేట్ టీవీ చానల్కు ఇచ్చారు. ఆ స్టార్ క్రికెట్ పోటీల కార్యక్రమానికి సేకరించిన నిధిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని సంఘ సభ్యుడు వారాహీ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను శనివారం విచారించిన న్యాయస్థానం తగిన ఆధారాలుంటే ఈ వ్యవహారంలో కేసు నమోదు చేయవచ్చని పేర్కొంది. అదే విధంగా దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్, ఉపాధ్యక్షుడు పొన్వన్నన్, కోశాధికారి కార్తిలను విచారించాలని సెంట్రల్ నేర పరిశోధన పోలీసు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. -
జెడ్పీ సీఈఓపై విచారణ చేపట్టండి
అనంతపురం రూరల్: నగరంలోని అంబేద్కర్ భవన్కు సంబంధించిన టెండర్లో అక్రమాలకు పాల్పడిన జెడ్పీ సీఈఓపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రెవెన్యూ భవన్లో నిర్వహించిన ఎస్సీ, ఎస్సీ గ్రీవెన్సులో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్లో కలెక్టర్ వీరపాండియన్కు వినతి పత్రం అందజేశారు. సాంఘిక సంక్షేమ శాఖ నిధులతో నిర్మించిన భవనాన్ని జెడ్పీ సీఈఓ ఎలాంటి పత్రిక ప్రకటన ఇవ్వకుండా తనకు అనుకూలమైన వ్యక్తికి ధారాదత్తం చేశాడని ఆరోపించారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీల వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా అంబేద్కర్ భవన్ అద్దెను నిర్ణయించాలన్నారు. గ్రీవెన్స్లో అందిన ఫిర్యాదులు ఇలా... నగరంలో అనేక మంది దళిత గిరిజనులు అద్దె భవనాల్లో జీవనం సాగిస్తున్నారని ప్రతి ఒక్కరికీ స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ నాయకులు చిన్న పెద్దన్న వినతి పత్రం అందజేశారు. – ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి అఖిల పక్షాన్ని ఢిల్లీకు తీసుకెళ్లి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మధు మాదిగ ఆధ్వర్యంలో మాదిగలు పెద్ద ఎత్తున కలెక్టరేట్కు చేరుకుని గ్రీవెన్స్లో వినతి పత్రం అందజేశారు. – 10 ఏళ్ల క్రితం ప్రభుత్వం తనకు 5 ఎకరాల భూమిని మంజూరు చేసింది. అయితే ఆన్లైన్లో తన భూమి సర్వేనంబర్ను తొలగించారనీ, మూడేళ్లుగా అధికారుల చుట్టు తిరుగుతున్నా.. .పట్టించుకోవడం లేదని కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన సాకే రంగమ్మ కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. వెంటనే ఆన్లైన్లో తన పేరు పొందుపరచాలని వేడుకుంది. – గోరంట్ల మండలం బండమీదపల్లి తండా, మిషన్తండా, పీపీ తండాల్లోని భూములను ఎయిర్ బస్సు పరిశ్రమ నిర్మాణానికి కేటాయించారనీ, అయితే ఇంత వరకు నష్టపరిహారం అందజేయలేని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు వారు వినతిపత్రం సమర్పించి తమకు పరిహారం తర్వతగతిన ఇప్పించాలని కోరారు. గ్రీవెన్స్లో మొత్తం 207 అర్జీలు అందాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు రమామణి, ఖాజామొహిద్దీన్తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
సిట్ విచారణకు బయల్దేరిన పూరి
-
బ్యాడ్మింటన్ కోచ్పై విచారణ
► తిరుపతిలో విచారణ చేపట్టిన నెల్లూరు డీఎస్డీవో ► శిక్షణ ఫీజు స్వాహా చేశారని ఆరోపణ తిరుపతి స్పోర్ట్స్: బ్యాడ్మింటన్ కోచ్ నిర్లక్ష్యంగా చూస్తున్నాడని, ఐదేళ్లుగా అరకొర శిక్షణ ఇస్తూ, పోటీల్లో పాల్గొనకుండా చూశాడని, పైగా విద్యార్థులు నెలనెలా చెల్లించిన ఫీజులు సైతం కార్యాలయంలో జమ చేయకుండా స్వాహా చేశాడని తల్లిదండ్రులు శాప్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై శాప్ మేనేజింగ్ డైరెక్టర్ బంగార్రాజు స్పందించారు. తక్షణమే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా డీఎస్డీవో పి.వెంకట రమణయ్యను విచారణ అధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్కు చేరుకున్న విచారణ అధికారి ఏవో వరలక్ష్మిని కలిశారు. కోచ్పై విద్యార్థుల ఫిర్యాదు ఏవో సమక్షంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాడ్మింటన్ కోచ్ జి.శివయ్యను, విద్యార్థులను విచారించారు. అంతకు ముందు ఐదేళ్లుగా విద్యార్థుల వద్ద వసూలు చేసిన ఫీజు వివరాలపై రికార్డుల ఆధారంగా విచారణ చేపట్టారు. బ్యాడ్మింటన్లో మొత్తం 180 మంది విద్యార్థులు శిక్షణ కోసం వస్తున్నారని, వారు ప్రతి నెలా ఫీజులు చెల్లిస్తున్నా ఆ డబ్బులు మాత్రం కార్యాలయంలో జమ కాలేదని, ఫీజులకు రశీదు కూడా ఇవ్వలేదని విచారణలో తేలింది. అందరికీ సమానంగా శిక్షణ ఇవ్వకపోగా, డబ్బులున్న వారి పిల్లలకు మాత్రమే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారని, అర్హులను జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించకుండా విస్మరించినట్టు విచారణలో తేలింది. ఐదేళ్లుగా బ్యాడ్మింటన్ ఫీజు నెలకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు వస్తున్నట్టు రికార్డులో పేర్కొన్నారు. అదే కొత్త ఏవో వరలక్ష్మీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి నెలకు ఫీజు రూ.90 వేల నుంచి రూ.1 లక్ష వరకు రావడంపై విచారణ అధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక్క సారిగా మూడింతలు ఆదాయం పెరగడంపై లోతుగా విచారించారు. ఇదే విషయమై శాప్ ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తానని, ఆపై చర్యలు ఉంటాయని ఆయన విలేకరులకు తెలిపారు. -
టేకులపల్లి తహసిల్దారుపై విచారణ
టేకులపల్లి: టేకులపల్లి తహసిల్దారుపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. తనను దుర్భాషలాడారని ఓ గిరిజన మహిళ తహసిల్దారు నాగేశ్వరరావుపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఏఎస్పీ సునీల్దత్ సోమవారం తహసిల్దార్ కార్యాలయానికి వచ్చి విచారణ జరిపారు. కాగా, కొత్త తహసిల్దారుగా ఎస్.అంజంరాజును నియమించారు. -
తొండంగి తహసీల్దార్పై ఏసీబీ విచారణ
తొండంగి (తుని) : తాము కొనుగోలు చేసిన జిరాయితీ భూమికి సంబంధించి ఆన్లైన్ అండగళ్లో వివరాలు నమోదు చేసేందుకు తహసీల్దార్ సొమ్ములు డిమాండ్ చేశారని బాధితుడు ఫిర్యాదుపై శనివారం రాజమండ్రి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సీఐ పి.వి.సూర్యమోహన్ తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేశారు. బాధితుడు, రిటైర్డ్ జిల్లా అగ్నిమాపక శాఖాధికారి సంకు వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి... కోన ఫారెస్టు పరిధిలో తన భార్య సంకు గిరిజ పేరున సర్వే నెంబర్ 47/18, 47/19లలో 2.05 ఎకరాల భూమిని 2006లో కొనుగోలు చేసి తుని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ భూమికి సంబంధించిన వివరాలు జిరాయితీ భూమిగా ఆన్లైన్లోని 1బీ ఫారంలో కూడా నమోదైంది. అంతేకాకుండా అప్పటి రెవెన్యూ అధికారులు గిరిజ యజమానిగా పేర్కొంటూ పట్టాదారు పాసుపుస్తకం, భూ యాజమాన్యం హక్కుపత్రాలను మంజూరు చేశారు. అయితే ఆన్లైన్ అడంగళ్ వివరాలలో సంకు గిరిజ నమోదైనట్టు రాకపోవడంతో ఆన్లైన్ చేయాలని 2016లో దరఖాస్తు చేసుకున్నారు. దీని కోసం పలు దఫాలుగా తిరిగినప్పటికీ తహసీల్దార్ టి.వి.సూర్యనారాయణ, కంప్యూటర్ సిబ్బంది కూడా పట్టించుకోలేదని, ఆన్లైన్ అడంగళ్ నమోదు చేసేందుకు తహసీల్దార్ రూ.రెండు లక్షలు సొమ్ము డిమాండ్ చేశారంటూ 2016 ఆగస్టులో ముఖ్యమంత్రికి, ఏసీబీ డీజీపీకి, ఇతర అధికారులకు భార్య సంకు గిరిజ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈనేపథ్యంలో రాజమండ్రి ఏసీబీ సీఐ పి.వి.సూర్యమోహన్ తహసీల్దార్ టి.వి.సూర్యనారాయణను విచారణ చేశారు. ఈవిచారణకు సంకు వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యారు. అయితే కోనఫారెస్టు భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులో అసైన్డ్ భూమిగా ఉందని, ఈవిధంగా చాలా మంది భూముల పెండింగ్లో ఉన్నాయంటూ తహసీల్దార్ సూర్యనారాయణ ఏసీబీ అధికారి సూర్యమోహన్కు వివరణ ఇచ్చారు. 1975 తర్వాత కోనఫారెస్టు అసైన్డ్ భూములను రైతులకు ప్రభుత్వం పట్టాలిచ్చిందన్నారు. ఈ భూములనే ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన సంస్థ) సేకరించిందన్నారు. ఆన్లైన్ అడంగళ్ చేసేందుకు తాను ఎటువంటి సొమ్ములు డిమాండ్ చేయలేదని, వాస్తవంగా ప్రస్తుతం ఉన్న రికార్డుల్లో ఉన్న విషయాన్నే తెలిపానన్నారు. కలెక్టర్, ఆర్డీవో, డీఆర్వో అధికారులతో చర్చించి ఆన్లైన్ ప్రక్రియపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. విచారణ పూర్తయిన అనంతరం సూర్యమోహన్ మాట్లాడుతూ తహసీల్దార్పై వచ్చిన ఫిర్యాదుతో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ విచారణ చేపట్టామన్నారు. విచారణ పూర్తిస్థాయిలో జరిగిన అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో కూడా భూమి రికార్డుల ప్రకారం సంబం«ధిత భూమి అమ్మిన రైతులను కూడా విచారణ చేస్తామని వివరించారు. కాగా ఇలాంటి సంఘటనపై గతంలో కూడా ఏసీబీ అధికారులు రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేపట్టినట్టు సమాచారం. వరుస ఏసీబీ అధికారుల విచారణలతో రెవెన్యూ అధికారుల్లో గుబులు మొదలైంది. -
ఎన్సీడబ్ల్యూ బహిరంగ విచారణ
హైదరాబాద్: జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ)కు అందిన ఫిర్యాదులపై కమిషన్ సభ్యురాలు సుష్మా సాహు గురువారం బహిరంగ విచారణ చేపట్టారు. 2016-17 కాలంలో సైబర్ క్రైం, గృహహింసకు సంబంధించి నమోదైన 58 కేసుల పరిష్కారంపై విచారణ చేపట్టి 30 వరకు కేసులను పరిష్కారించారు. మరో 10 కేసులపై విచారణ కొనసాగుతోంది. వీటితోపాటు మరో 18 కేసులు హైదరాబాద్ న్యాయ అధికారుల పరిధికి మించినవి. తెలంగాణ ప్రాంతంలో కాంట్రాక్టు పెళ్లిళ్లు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే ఇందుకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు అందలేదని సుష్మా తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ స్వాతి లక్రా పాల్గొన్నారు. -
పవర్ రాగానే జయ మృతిపై విచారణ: స్టాలిన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధికారంలోకి రాగానే దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ కమిషన్ వేస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ చెప్పారు. వేలూరు జిల్లా రాణీపేటలో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేదని, రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు చెల్లించి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల మద్దతుతో బినామీ ప్రభుత్వం నడుస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే అన్నాడీఎంకే ప్రభుత్వం పడిపోవడం, ప్రజాదరణతో డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. జయలలిత మరణం వెనుక కుట్రదాగి ఉన్నట్లు తేలితే దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు. -
సీఎం హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు
ముంబై : లాతూర్ జిల్లా నిలంగా తాలూకాలో ఇటీవల జరిగిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెలికాప్టర్ ప్రమాదం తరువాత తేరుకున్న హోం శాఖ ప్రముఖుల రక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అందుకు విమానం, హెలికాప్టర్ల భద్రతపై త్వరలో ఒక నియమావళి రూపొందించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ మునగంటివార్ స్పష్టం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన నిమిషం వ్యవధిలోనే విద్యుత్ తీగకు తగులకుని క్రాష్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఫడ్నవీస్ పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం ద్వారా దర్యాప్తు కొనసాగుతోంది. ఆ రోజు అసలేం జరిగింది..? తప్పు ఎక్కడ జరిగింది....? అనే వివిధ కోణాలలో విచారణ జరుగుతోంది. దీంతో హెలికాప్టర్లో బయలుదేరే ముందు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలనేది కొత్త నియమావళి రూపొందించచనున్నట్లు మంత్రి మునగంటివార్ తెలిపారు. కొందరు ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు హెలికాప్టర్ టేకాఫ్ కాగానే ఒక్కసారిగా పెద్ద ఎత్తున దుమ్ము, దూలి గాలిలో పైకి లేచింది. దీంతో పైలట్కు ముందుకు వెళ్లేందుకు దారి కనిపించక ఏం చేయాలో తెలియెక, గందగోళానికి గురై ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో అత్యవసర ల్యాండింగ్కు ప్రయత్నించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ రోజు మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్పై నీళ్లు చల్లలేదు. కాగా హెలికాప్టర్ రెక్కల గాలికి దుమ్ము, దూళి గాలిలో ఎగరకుండా హెలీప్యాడ్ను తయారు చేయాల్సి ఉంటుంది. అంతేగాకుండా హెలిప్యాడ్కు వందమీటర్ల దూరంలో విద్యుత్ తీగలు గాని, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉండకూడదు. కాని ఆ రోజు ముఖ్యమంత్రి హెలికాప్టర్ కోసం తయారుచేసిన హెలిప్యాడ్కు కొద్ది దూరంలోనే విద్యుత్ తీగలున్నాయి. అంతేగాకుండా క్రాష్ ల్యాండ్ అయిన ప్రాంతానికి కూత వేట దూరంలో ట్రాన్స్ఫార్మర్ ఉంది. అదృష్ట వశాత్తు దానిపై పడలేదు. లేని పక్షంలో ప్రాణ నష్టం జరిగేది. వీటన్నింటిని బట్టి కొన్ని నియమాలు పాటించలేదని ఈ ఘటన ద్వారా స్పష్టమైతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది. త్వరలో వాస్తవాలు బయటపడతాయి. -
యూరియా కుంభకోణంపై విచారణ
అనంతపురం అగ్రికల్చర్ : గత ఏడాది జూలైలో వెలుగుచూసిన యూరియా కుంభకోణంపై వ్యవసాయ కమిషనరేట్ జేడీఏ శ్రీధర్ గురువారం జిల్లా కేంద్రంలోని ఆ శాఖ కార్యాలయంలో విచారణ చేపట్టారు. క్రిబ్కో కంపెనీ నుంచి వచ్చిన 1,300 మెట్రిక్ టన్నుల నీమ్ కోటెడ్ యూరియాను నిబంధనలకు విరుద్ధంగా భాస్కర్ ఫర్టిలైజర్స్కు చెందిన మిక్సింగ్ ప్లాంట్కు మళ్లించారు. ఈ విషయాన్ని అప్పట్లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ అంశంపై కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేశారు. అలాగే కమిషనరేట్కు చెందిన అడిషనల్ డైరెక్టర్ వినయ్చంద్ నేతృత్వంలో మరో బృందం రెండు రోజుల పాటు విచారణ చేపట్టి.. కమిషనర్కు నివేదిక అందజేసింది. ప్రాథమిక విచారణ తర్వాత వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ - పీపీ) కె.మల్లికార్జున, అనంతపురం డివిజన్ ఏడీఏ ఎం.రవికుమార్ను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు. వీరు హైకోర్టును ఆశ్రయించడంతో ఇటీవల సస్పెన్షన్ను రద్దు చేసి.. పోస్టింగ్ ఇచ్చారు. మల్లికార్జున మడకశిర ఏడీఏగా, రవికుమార్ హిందూపురం ఏడీఏగా బాధ్యతలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా... ఈ ఇద్దరు అధికారుల పాత్రపై పూర్తిస్థాయి విచారణకు కమిషనరేట్ జేడీఏ శ్రీధర్ను నియమించిన నేపథ్యంలో ఆయన విచారణ మొదలు పెట్టారు. ప్రెజెంటింగ్ అధికారిగా నియమితులైన రైతు శిక్షణ కేంద్రం డీడీఏ డి.జయచంద్ర సమక్షంలో ఏడీఏలు మల్లికార్జున, రవికుమార్ను వేర్వేరుగా విచారణ చేశారు. వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. మరికొన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో తమ పాత్ర ఏమీ లేదని ఆ ఇద్దరూ విచారణాధికారి ముందు చెప్పినట్లు సమాచారం. ఎరువులు దారి మళ్లినట్లు తెలియగానే తనిఖీలతో పాటు ప్రాథమిక విచారణ చేశామని మల్లికార్జున చెప్పగా... రేకు ఆఫీసర్ అనే విషయం తనకు తెలియదని, అధికారం తనకుందని ఎప్పుడూ ఎవరూ చెప్పలేదని రవికుమార్ తెలిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా విచారణాధికారి శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్ని టన్నుల యూరియా దారిమళ్లింది, ఎవరు దారి మళ్లించారు, ఎవరు లబ్ధిపొందారనే విషయంపై ప్రస్తుతం విచారణ చేయడం లేదన్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఏ) నిబంధనల ప్రకారం సస్పెండైన ఇద్దరు అధికారుల విధులు, బాధ్యతలు, వారు స్పందించిన తీరు, ఇందులో వారి ప్రమేయం గురించి వివరాలు రాబట్టామన్నారు. వారం రోజుల్లో కమిషనర్కు నివేదిక అందజేస్తామని తెలిపారు. -
రాసలీలలపై రహస్య విచారణ
డీఎస్పీ సర్కారుపై బిగుసుకుంటున్న ఉచ్చు రంగంలోనికి దిగిన నిఘా బృదం జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు డీఎస్పీ సర్కార్ రాసలీలలపై రహస్య విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర స్థాయి అధికారులు ప్రత్యేక నిఘా బృందాన్ని జమ్మలమడుగుకు పంపించి విచారణ జరిపిస్తుండటంతో డీఎస్పీకి సహకరించిన సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. జమ్మలమడుగు డీఎస్పీ సర్కార్ కాలేజి అమ్మాయిలతో తన కార్యాలయంలో రాసలీలు సాగిస్తూ వచ్చిన వికృత చేష్టలను సాక్షి దినపత్రిక వెలుగులోనికి తెచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపిస్తున్నట్లు సమాచారం. దాదాపు పది మంది అమ్మాయిలను డీఎస్పీ వలలో వేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఏ ఒక్క అమ్మాయి ఫిర్యాదు చేసినా సదరు అధికారిని సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలనే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో డీఎస్పీకి సహకరించిన వారిలో సిబ్బందితో పాటు బయటి వ్యక్తులు కూడా ఉన్నట్లు సమాచారం. వారిపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. -
నకిలీ పాసు పుస్తకాలపై విచారణ
చిలమత్తూరు (హిందూపురం) : రెండేళ్ల క్రితం (2015లో) కలకలం రేపిన 35 నకిలీ పాసు పుస్తకాలకు సంబంధించి చిలమత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో సీఐడీ ఇన్స్పెక్టర్ బీవీ రమణ, ఎస్ఐ శ్రీనివాసులు (కర్నూలు) మంగళవారం విచారణ చేపట్టారు. పాసు పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తహసీల్దార్ ఇబ్రహీంసాబ్, డిప్యూటీ తహసీల్దార్ రంగనాయకులు, వీఆర్వోలతో పాసు పుస్తకాలు జారీ, అడంగళ్, సర్వే నంబర్లు తదితర అంశాలపై చర్చించారు. పాసు పుస్తకాలకు సంబంధించిన రైతులను విచారణ చేశారు. నివేదికలను సీఐడీ కోర్టుకు పంపనున్నట్లు ఇ¯న్స్పెక్టర్ తెలిపారు. -
ఎన్జీఓ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడిపై విచారణ
కర్నూలు(అగ్రికల్చర్): నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి విచారణ జరిపారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే రామచంద్రరావు.. వెంగళరెడ్డిపై వివిధ ఆరోపణలతో గతంలో లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ మేరకు లోకాయుక్త సమగ్రంగా విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. కలెక్టర్.. ప్రత్యేక కలెక్టర్ను విచారణ అధికారిగా నియమించారు. ఇందులో భాగంగా ఫిర్యాదు దారుడయిన రామచంద్రరావును సోమవారం విచారించారు. ఆయన తన దగ్గర ఉన్న ఆధారాలను విచారణ అధికారికి సమర్పించారు. అనంతరం ఆరోపణలపై వెంగళరెడ్డిని విచారించారు. ఆరోపణలకు సంబంధించి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. -
‘అరబిందో’ భూమిపై డీఎల్పీవో విచారణ
తిమ్మాపురం (కాకినాడ రూరల్) : తిమ్మాపురం పంచాయతీకి చెందిన రెండు ఎకరాల భూమిని 2000లో అప్పటి సర్పంచ్ కర్రి ఆదిలక్ష్మి అరబిందో సొసైటీ ట్రస్టుకు అతి తక్కువ ధరకు ఇచ్చారని దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాలంటూ ప్రస్తుత సర్పంచ్ అనుసూరి జగ్గారావు, ఉప సర్పంచ్ బెజవాడ సత్యనారాయణమూర్తి చేసిన ఫిర్యాదుపై సోమవారం డీఎల్పీవో నాగలత తిమ్మాపురంలో విచారణ చేపట్టారు. రికార్డులను తనిఖీ చేసిన అనంతరం ఆమె భూమిని పరిశీలించారు. డీఎల్పీవో తెలిపిన వివరాల ప్రకారం.. 2000లో అప్పటి పంచాయతీరాజ్ కమిషనర్ చెల్లప్ప ఆదేశాలపై అప్పటి కలెక్టర్ సతీష్చంద్ర ఉత్తర్వులు ఇవ్వడంతో డీపీవో శ్రీధర్రెడ్డి తిమ్మాపురంలో అరబిందో సొసైటీ ట్రస్టుకు 2 ఎకరాల భూమిని కేటాయించాలని ఉత్తర్వులు ఇచ్చినట్టు తీర్మానాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. దీనిపై అప్పటి పంచాయతీ పాలకవర్గం తీర్మానం నంబర్ 30 ప్రకారం లే అవుట్ నంబర్ 34/98లోని సామాజికి స్థలం ఎ. 0.56 సెంట్లు, లేఅవుట్ నంబర్ 130/98లోని సామాజిక స్థలం ఎ.0,58 ట్లు మొత్తం ఎ1.14 సెంట్లు భూమిని అరబిందో సొసైటీకి అప్పగించినట్టు తీర్మానాలు రాశారు. ఈ భూమి సరిపోదని స్కూల్కు ఆట స్థలం కావాలని దీనికి సంబంధించి మొత్తం 2 ఎకరాల భూమి కావాలని దరఖాస్తు చేయడంతో పంచాయతీ పాలక వర్గం ఎల్పీనంబర్ 34/98లో రూ. 60 అడుగు రోడ్డు, 40 అడుగుల రోడ్డు మధ్య ఉన్న 0.86 సెంట్లు భూమి అరబిందో సొసైటీకి ఇచ్చారు. అరబిందో సొసైటీ ట్రస్ట్కు భూమిని బదలాయించినా నేటికీ వారు ఆ భూమిని ఏ విధంగాను వినియోగించలేదన్నారు. అప్పట్లో సొసైటీకి భూమి గజాల్లో అమ్మాల్సి ఉండగా కేవలం ఎకరాల్లో అమ్మారని దీనివల్ల పంచాయతీకి రావాల్సిన ఆదాయం నష్టపోయిందని ప్రస్తుత సర్పంచ్, ఉప సర్పంచ్లు కలెక్టర్కు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రికార్డుల పరిశీలనకు వచ్చానని నాగలత తెలిపారు. అప్పట్లో ఈ భూమికి సంబంధించిన ఎల్పీలు, తీర్మానాలు తప్ప మరే ఇతర రికార్డులు సక్రమంగా లేవని, పూర్తిస్థాయిలో రికార్డులు సిద్ధం చేయాలని పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండురంగారావును డీఎల్పీవో ఆదేశించారు. ఇప్పటికైనా పోయింది ఏమీలేదని ఆ భూమిని తిరిగి తీసుకొనే అధికారం పంచాయతీ పాలకవర్గానికి ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అదే దరిమిలా ఓ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలపై కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చి భూమిని కేటాయించాలని కోరితే ప్రస్తుతం ఈ భూమిని ఏ విధంగా తిరిగి తీసుకోవాలనే దానిపై కూడా పునరాలోచించాల్సిన ఆవశ్యకతపై కూడా అధికారులు చర్చించారు. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని డీఎల్పీవో నాగలత తెలిపారు. ఈ భూమిని తిరిగి పంచాయతీకి బదలాయించాలని ఉపసర్పంచ్ బెజవాడ సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈవోపీఆర్డీ పి.మణీశ్వరరావు, సర్పంచ్ అనుసూరి జగ్గారావు, ఉప సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండురంగారావు పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
ఐసీడీఎస్ అధికారులపై విచారణ
ప్రొద్దుటూరు: ఐసీడీఎస్ ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్టు అధికారిణిపై చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి మంగళవారం కర్నూలు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ శారదాదేవి అంగన్వాడీలను విచారణ చేశారు. ప్రాజెక్టు పరిధిలోని కార్యకర్తలను హాజరు పరిచారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా తయారు చేసిన ప్రశ్నావళి పత్రాన్ని ఇచ్చి సంతకాలు చేసి నింపాలని కోరారు. ఇందులో ‘సీడీపీఓ రాజేశ్వరిదేవి, సూపర్వైజర్ సావిత్రి ప్రతి విషయానికి ఇబ్బంది పెట్టి, భయపెట్టి, డబ్బు ఇవ్వకపోతే మీపై అధికారులకు రిపోర్టు చేస్తామని మిమ్మల్ని బెదిరిస్తున్నారన్నది వాస్తవమా కాదా?, సీనియర్ అసిస్టెంట్ బాషా పనితీరు సరిగా లేదని ఆరోపణలు చేయడం జరిగింది. వివరాలు తెలపగలరు?, ప్రతి నెల ఒకటో తేదీన ప్రతి అంగన్వాడీ కార్యకర్త రూ.1000 అందించాలని సీడీపీఓతోపాటు సూపర్వైజర్లు మిమ్మల్ని ఆదేశించారా లేదా?, ఆరోపణ నిజమైనచో మీరు ఎంత మొత్తం, ఎవరికి చెల్లించారో తెలపగలరు?, సీడీపీఓ ట్రైనింగ్ పేరిట మీతో సంతకాలు తీసుకుని మీకు డబ్బు చెల్లించలేదన్న ఆరోపణ నిజమా కాదా? నిజమైనచో ఆ ట్రైనింగ్ వివరాలు, తేదీలతోపాటు హాజరయ్యారో లేదో తెలపగలరు?, ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ను ఏర్పాటు చేశామని ప్రతి నెల రూ.6 వేలు మీ వద్ద నుంచి వసూలు చేయడం జరిగిందా లేదా? మీరు ఆ సొమ్ము ఎవరికి ఇచ్చారో తెలపగలరు?, అర్బన్ ప్రాజెక్టులోని మురికి వాడల్లో ఉన్న ఎస్సీ అంగన్వాడీ కార్యకర్తలను సూపర్వైజర్ సావిత్రి నోటికి వచ్చినట్లు కులం పేరుతో దూషించడం జరిగిందన్న ఆరోపణలపై మీరు వివరణ ఇవ్వడంతోపాటు ఎవరిని దూషించారో తెలపగలరు?’ తదితర ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సమాధానాలు రాసిన అనంతరం పత్రాలను తీసుకున్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఫిర్యాదు సమావేశం అనంతరం కొంత మంది అంగన్వాడీలు ఆర్డీడీని కలిశారు. సీడీపీఓ తాము చెప్పినట్లు వినలేదనే కారణంతో యూనియన్ నేతలు కొంత మంది ఉద్దేశ పూర్వకంగానే ఈ విధంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆరోపణలకు సంబంధించి ఫిర్యాదు చేసిన వారిని ఆమె పిలిపించారు. యూనియన్ నేతల ఒత్తిడి వల్లే తాము ఫిర్యాదు చేశామని వారు కూడా ఆర్డీడీకి వివరించారు. అనంతరం యూని యన్ నేతలను పిలిపించి మాట్లాడారు. తర్వాత లెటర్ హెడ్పై ఫిర్యాదు చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వరదరాజులరెడ్డిని కలిశారు. అలాగే అధికారులను విచారణ చేశారు. ఆర్డీడీ వెంట ఆర్డీడీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరమ్మ, సూపరింటెండెంట్ పద్మిని ఉన్నారు. -
గంజాయి రవాణాలో సీఐ పాత్ర
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గంజాయి రవాణాలో పోలీసుల పాత్ర ఆ శాఖకు చెడ్డపేరు తెస్తోంది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి రవాణా వెనుక అక్కడి సర్కిల్ ఇన్స్పెక్టర్ హస్తం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. మన జిల్లాలోని మెట్ట ప్రాంతంలో పనిచేస్తున్న మరో సర్కిల్ ఇన్స్పెక్టర్కూ ఈ వ్యవçహారంతో సంబంధాలు ఉన్నట్టు తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై గంజాయి రవాణాను అడ్డుకోవడం కోసం నియమిం చిన ప్రత్యేక బృందాలు విచారణ జరుపుతున్నాయి. ఈ విచారణలో నిందితుడు జిల్లాలోని పోలీస్ అధికారితో తమకున్న సంబంధాలను పూర్తిగా వివరించినట్టు తెలుస్తోంది. గత నెల 21న జిల్లాలో ఒక గంజాయి లారీని పట్టుకున్న సంగతి తెలిసిందే. అందులో ప్రధాన నిందితుడిని వదిలేసేందుకు ఓ పోలీస్ అధికారి రూ.4 లక్షలు లంచం తీసుకున్నట్టు సమాచారం. దీనికి స్థానికంగా ఉన్న కొందరు ఛానల్ విలేకరులు డీల్ కుదిర్చారని, ప్రధాన నిందితుడు ప్రతినెలా ప్రతి లోడుకు కొంత మామూలు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని తెలిసింది. ఫిబ్రవరి 21న గంజాయి లారీ పట్టుకున్న సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో జాప్యంపై కూడా విచారణ చేసినట్టు సమాచారం. పైస్థాయి అధికారులకు సమాచారం అందడంతో లారీని పట్టుకున్నట్టు చూపించారని తెలి సింది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పండించిన గంజాయిని హైదరాబాద్, మహారాష్ట్రకు రవాణా చేయడంలో భాగంగా జిల్లాలోని చింతలపూడి మండలం నుంచి రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్నారు. అయితే గంజాయి లారీని జిల్లాలో ఎక్కడా ఆపకుండా ఉండేందుకు ప్రతి లోడుకు ఇంతని మామూలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. గతనెల గంజాయి కేసులో ప్రధాన నిందితుడు గన్నవరం సబ్ జైల్ వద్ద ప్రత్యేక బృందాలకు దొరికిపోయాడు. అక్కడ గంజాయి కేసులో సబ్జైల్లో ఉన్న ఒక నిందితుడిని కలిసేందుకు అతను వస్తున్నట్టు నిఘా విభాగం సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు మాటువేసి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ నిందితుడిని రహస్య స్థావరానికి తరలించి తమదైన శైలిలో విచారించగా ఎవరెవరికి నెల మామూళ్లు ఇచ్చేది, దీనిలో పోలీసు అధికారులు ఎవరున్నారు, రాజకీయ నాయకులు ఎవరున్నారనేది వెల్లడించినట్టు సమాచారం. మెట్ట ప్రాంతానికి చెందిన ఒక సీఐ కీలక పాత్ర పోషిస్తున్నాడని, కొందరు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు కూడా సహకరిస్తున్నట్టు తెలియటంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు సదరు సీఐ పేరు చెప్పడంతో పాటు ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చింది వివరించినట్టు తెలిసింది. విచారణాధికారులు ఈ విషయాన్ని డీజీపీ సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లగా, ప్రధాన నిందితుడిని పూర్తిస్థాయిలో విచారించి ఇంటి దొంగలను పట్టుకుని జిల్లా ఎస్పీకి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లా ఉన్నతాధికారులు కూడా సదరు అధికారిపై ఇప్పటికే పలు నివేదికలు పంపినట్టు తెలిసింది. ధర్మాజీగూడెంలో ఓ ప్రేమజంట వ్యవహారంలో ఆ అధికారి అధీనంలో ఉన్న యువతిని అమె తరుఫువారు సినీ ఫక్కీలో తీసుకెళ్లిపోయారు. ఆ అధికారే సరిహద్దులో గ్రానైట్ లారీలను దాటించే పనిలో ఉండటంతో రవాణా శాఖాధికారులు అతనిపై చర్యలకు ఎస్పీకి సిఫార్సు చేశారు. అధికార పార్టీ అండదండలు ఉండటంతో అతనిపై చర్యలు తీసుకుంటారా? వదిలేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. -
పోలీసులపై కలెక్టర్ వర్షిణి ఆగ్రహం
పెద్దపల్లి: రాత్రివేళ పొలానికి నీళ్లు పెట్టేందుకు వ్యవసాయబావి వద్దకు వెళ్లిన దళిత దంపతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, పోలీస్స్టేషన్కు తరలించి చితక్కొడుతూ పోలీసులు సాగించిన దౌర్జన్యకాండపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అలగు వర్షిణి సీరియస్గా ఉన్నారు. బాధితురాలు అరికెల్ల శ్యామల నిన్న కలెక్టర్ను కలిసి తనగోడు వెళ్లబోసుకున్న విషయం తెలిసిందే. దీన్ని సీరియస్గా తీసుకున్న కలెక్టర్ మహిళ హక్కులకు, పిల్లల హక్కులను భంగం కలిగిందని నిర్ధారణకు వచ్చారు. సోమవారం రాత్రే రామగుండం పోలీస్ కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్కు లేఖ రాశారు. తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వమని కోరారు. మహిళా పోలీసులు ఏరీ? బాధితురాలు జిల్లా కలెక్టర్ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అర్ధరాత్రి పోలీసు జీపులో తనను, భర్త, పిల్లలను పోలీస్ స్టేషన్కు తరలించారని వివరిస్తుండగా.. ఆ సమయంలో మహిళా పోలీసులు ఉన్నారా..? అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. లేరని శ్యామల సమాధానం ఇవ్వడంతో ఒకింత ఆశ్చర్చానికి గురయ్యారు. సీపీకి రాసిన లేఖలోనూ పోలీసులు భార్యాభర్తలతోపాటు పిల్లలను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారని వివరించారు. మహిళా పోలీసులు లేకుండా ఒక మహిళను రాత్రంతా పోలీస్స్టేషన్లో ఎలా ఉంచారని పేర్కొన్నారు. మహిళా హక్కులకు భంగం కలగడంతోపాటు ఇది పిల్లలను మానసికంగా వేధించడమే అని భావించిన కలెక్టర్ మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, ఎస్సీ,ఎస్టీ కమిషన్, పిల్లల సంక్షేమ బోర్డు, కరీంనగర్ జిల్లా పిల్లల సంక్షేమ కమిషన్లకు లేఖలు రాశారు. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోం శాఖ కార్యదర్శి, డీజీపీలకు లేఖలు పంపారు. ఈ లేఖలు అధికార వర్గాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. పోలీసుశాఖలో గుబులును రేకెత్తిస్తున్నాయి. ఆ ఎస్ఐపై గతంలోనే ఇలాంటి ఫిర్యాదు.. కలెక్టర్ వర్షిణి రామగుండం సీపీకి రాసిన లేఖలో పెద్దపల్లి ఎస్ఐ శ్రీనివాస్పై గతంలోనే ఇలాంటి ఫిర్యాదు వచ్చిందని పేర్కొన్నారు. గోదావరిఖని చెందిన బి.గణేశ్ పెద్దపల్లిలో బస్టాండ్ సమీపంలో రోడ్డును దాటుతుండగా.. ఎస్ఐ అదుపులోకి తీసుకొని రాత్రంతా స్టేషన్లో ఉంచి, మరుసటి రోజు వదిలేశారని వివరించారు. దీనిపై గణేశ్ తనకు ఫిర్యాదు చేశారని, దీనిపై గతనెల 14తేదీన బాధితుడిని డీసీపీ వద్దకు పంపానని, దీనిపై ఏం చర్య తీసుకున్నారో, అసలు ఏం జరిగిందో ఇంత వరకు సమాధానం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. కాగా, విచారణ అధికారిగా నియమించిన పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మ శిక్షణ నిమిత్తం హైదరాబాద్లో ఉండడంతో గోదావరిఖని ఏసీపీ అపూర్వారావు మంగళవారం బాధితురాలి స్వగ్రామమైన పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. -
నిలోఫర్ ఘటనపై ఐఏఎస్తో విచారణ
హైదరాబాద్ : నిలోఫర్ ఘటన మీద ఐఏఎస్ అధికారితో విచారణకు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ రాహుల్ బొజ్జా కి విచారణ బాధ్యతలు అప్పగించింది. నిలోఫర్ ఘటన మీద ఇప్పటికే అంతర్గత విచారణ జరగగా, ముగ్గురు సభ్యుల విచారణకు డీఎమ్ఈ ఆదేశించారు. దీనికి కొనసాగింపుగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ విచారణ జరగనుంది. మంగళవారం మీడియాతో మాట్లాడిన అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి మరోసారి అధికారులతో భేటి అయ్యారు. నిలోఫర్ ఘటనను సీరియస్ గా తీసుకున్న మంత్రి, ఉన్నత అధికారులతో మరోసారి సమీక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, అలాగని ప్రస్తుతం జరిగిన తప్పును గుర్తించి సరిదిద్దడం, తప్పు చేసినవాళ్ళను గుర్తించి శిక్షించడం తప్పనిసరిగా జరగాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఒక ఐఏఎస్ అధికారితో విచారణ జరిపిస్తే, వాస్తవాలు వెలుగు చేస్తాయని, నిష్పాక్షికత ఉంటుందని భావించారు. ప్రజారోగ్యం తో, వారి ప్రాణాలతో ముడిపడి ఉన్న ఇలాంటి ఘటనలు సమాజానికి మంచిది కాదని చెప్పారు. రోగుల ఆరోగ్య భద్రత కు మరింత భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. దీనితో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రాజేశ్వర్ తివారి వెంటనే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ రాహుల్ బొజ్జా ని నిలోఫర్ ఘటన మీద విచారణ చేపట్టాలని ఆదేశించారు. పరిపాలన మరియు సాంకేతిక అంశాలు పరిశీలించాలని చెప్పారు. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. -
ఏపీ పోలీసులపై పీసీఐ ఆగ్రహం
కోల్కతా: ఆంధ్రప్రదేశ్ పోలీసులపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని భూముల కొనుగోలు స్కామ్ వెలుగులోకి తెచ్చినందుకు నలుగురు సాక్షి దినపత్రిక జర్నలిస్టులకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. కుంభకోణాలు వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టులకు సమన్లు ఇవ్వడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనంటూ ఐజేయూ ప్రధానకార్యదర్శి దేవులపల్లి అమర్ పీసీఐ చైర్మన్ జస్టిస్ ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పీసీఐ పోలీసులను విచారణకు హాజరుకావాలంటూ ఆదేశించింది. సీఎం పర్యటనను సాకుగా చూపుతూ సోమవారం జరిగిన విచారణకు పోలీసులు హాజరుకాకపోవడంపై జస్టిస్ ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. తర్వాతి విచారణకు పోలీసులు హాజరుకాకపోతే కఠినచర్యలు తప్పవని పీసీఐ హెచ్చరించింది. -
జయలలిత మృతిపై విచారణకు సిద్ధం
-
జయలలిత మృతిపై విచారణకు సిద్ధం: అపోలో చైర్మన్
చెన్నై: అస్వస్థతకుగురై ఆస్పత్రిలో చేరి, 74 రోజుల చికిత్స అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5న కన్నుమూశారు. అయితే ఆమెకు అందించిన చికిత్సపై సొంత పార్టీ ఏఐడీఎంకేలోని కొందరు నాయకులు సహా ప్రతిపక్ష డీఎంకే సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. డీఎంకే చీఫ్ కరుణానిధైతే ఒక అడుగు ముందుకేసి జయ ఫొటోలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఎలాంటి ఫొటోలు విడుదలకాకుండానే జయ పరమపదించారు. ఆమె మరణానంతరం చికిత్సకు సంబంధించిన కొన్ని వివరాలను ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ కొంతమంది ఈ విషయంపై మాట్లాడుతూనేఉన్నారు. అలాంటివాళ్లందరికీ సమాధానంగా జయకు చికిత్స అందించిన అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్.సి.రెడ్డి శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంపై ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రతాప్ సి రెడ్డి అన్నారు. శుక్రవారం చైన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొని, ప్రసంగించిన ఆయన.. విచారణ జరిపితేగనుక, మాజీ సీఎం మరణానికి సంబంధించిన అన్నివివరాలను అందజేస్తామని చెప్పారు. ఈ విషయంలో దాగుడుమూతలకు తావులేదని తెలిపారు. తాను మొదటి నుంచి చెపుతున్నట్లే.. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత గుండెపోటుకు గురికావడం వల్లే జయ చనిపోయారని మరోసారి స్పష్టంచేశారు. చికిత్సలో భాగంగా జయలలిత కాళ్లు తొలిగించారనే వార్తలు నిజం కావని ప్రతాప్.సి.రెడ్డి పేర్కొన్నారు. -
జంట హత్యలపై విచారణ
శింగనమల : మండల కేంద్రం సమీపంలోని రుష్యశృంగుని కొండపై జరిగిన జంట హత్యలపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఆదివారం కొండపైకి వెళ్లి సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. హత్యకు గురైన వారిది బత్తలపల్లి, గాయపడిన మహిళది ధర్మవరం కావడంతో ఆ రెండు మండలాల్లోనూ శింగనమల పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతి చెందిన పెద్దన్న ఎప్పటి నుంచి గంగమ్మ పూజారిగా ఉన్నారు, వీరి మేనల్లుడు ఈశ్వరయ్య, ధర్మవరానికి చెందిన సావిత్రికి పరిచయాలున్నాయా లేక గుప్తనిధుల కోసం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
పుష్కర ఘటనపై సా..గుతున్న విచారణ
రాజమహేంద్రవరం క్రైం : పుష్కర తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్ సోమయాజులు కమిష¯ŒS విచారణ కొనసాగుతూనే ఉంది. విచారణ ఈ నెల 28 కి వాయిదా వేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథిగృహంలో పుష్కర తొక్కిసలాట ఘటనపై జస్టిస్ సోమయాజులు కమిష¯ŒS విచారణ నిర్వహించింది. పుష్కరాల సమయంలో తీసిన ఫొటోలు, సీడీలు, కొన్ని డాక్యుమెంట్లను సమాచార శాఖ కమిషన్కు సమర్పించింది. వాటిని తమకు ఇవ్వాలని కమిష¯ŒSను పౌరహక్కుల సంఘం నాయకుడు, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అభ్యర్థించారు. అనంతరం ఈ నెల 28 కి విచారణను వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ సోమయాజులు ప్రకటించారు. కమిష¯ŒS గడువు ఈ నెల 29 తో ముగియనుంది. అనంతరం న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ పుష్కర తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం కమిష¯ŒS వేస్తూ 6 నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని గడువు విధించి ఏడాదిన్నర కావస్తున్నా అధికారులు కమిష¯ŒSకు పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించలేదన్నారు. ఈ సంఘటన కు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు ఇవ్వలేదని, నేషనల్ జియోగ్రఫీ చానల్లో కూడా పూర్తిస్థాయి ఆధారాలు సమర్పించకుండా ఎడిట్ చేసి ఇచ్చారన్నారు. సీఎం స్నానానికి అనుమతి ఇచ్చిందెవరు? వీఐపీ ఘాట్ ఉండగా పుష్కర ఘాట్ లో సీఎం చంద్రబాబు నాయుడు స్నానం చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారని ముప్పాళ్ల ప్రశ్నించారు. పుష్కర ఘాట్ లో బారికేడ్లు ఎవరి ఆదేశాల మేరకు తొలగించారో చెప్పాలన్నారు. సంఘటన సమయంలో పుష్కర ఘాట్లో ఆక్సిజ¯ŒS అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కువ మంది మృత్యువాతపడ్డారని అన్నారు. ఈ సంఘటనలో 170 మంది బాధితులను విచారించామని చెబుతున్న పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించలేదని అన్నారు. కమిష¯ŒS గడువు ఈనెల 29 తో ముగుస్తున్నందున ఆ లోగా అన్ని శాఖలు పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించి బాధ్యులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది సీహెచ్ ప్రభాకరరావు, కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మ¯ŒS కూనపురెడ్డి శ్రీనివాస్, డీపీఆర్ఓ వెంకటేశ్వరరావు, రాజమహేంద్రవరం రూరల్ తహసీల్దార్ కె.భీమారావు, డీఎస్పీ రామకృష్ణ, ఎ.వి.స్వరూప్, త్రీటౌ¯ŒS సీఐ శ్రీరామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ కేసులను సత్వరం పరిష్కరించండి
– ఆర్డీఓలు, డీఎస్పీలకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు కర్నూలు(అగ్రికల్చర్): ఎస్సీ, ఎస్టీ కేసులను జాప్యం లేకుండా సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. బుధవారం తన చాంబరులో ఎస్పీ ఆకె రవికృష్ణ, డీఎస్పీలు, ఆర్డీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసుల విచారణలో బాధితులకు సకాలంలో పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా మొత్తం మీద 201 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కలసి సమీక్షించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ వివరించారు. సమావేశంలో జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్గౌడ్, ఆర్డీఓలు రఘుబాబు, సుధాకర్రెడ్డి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకుల్లో కొనసాగుతున్న సోదాలు
అక్రమ లావాదేవీలపై కూ ఇద్దరు ఎమ్మెల్యేల పాత్రపై ఆరా తణుకు : పాతనోట్ల మార్పిడి వ్యవహారం నేపథ్యంలో ఆర్బీఐ అధికారులు బ్యాంకుల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీల్లో అక్రమార్కుల వివరాలు బయటపడుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో తణుకు ఎస్బీఐ ఏజీఎం కృష్ణారావుపై సస్పెన్షన్ వేటు వేసిన ఆర్బీఐ అధికారులు తాజాగా తణుకులోనే మరో రెండు జాతీయస్థాయి బ్యాంకుల్లోనూ అవకతవకలు జరిగినట్టు గుర్తించినట్టు సమాచారం. వీటిల్లోనూ వారంగా తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇద్దరు ఎమ్మెల్యేల పాత్రపై ఆరా ఎస్బీఐ ఏజీఎం సస్పెన్షన్ వ్యవహారం వెనుక పెద్దమొత్తంలో నల్లధనం తెల్లగా మారినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల పేర్లు బయటకు రాగా, వీరితోపాటు ఇద్దరు ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆర్బీఐ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. డెల్టా ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బినామీ పేర్లుతో ఖాతాలు తెరిచి వారి ద్వారా పెద్ద మొత్తంలో రూ. 500, రూ. 1000 నోట్లు మార్చినట్టు సమాచారం. ఈ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు బ్యాంకు మేనేజర్లపైనా ఆర్బీఐ అధికారులు నిఘా ఉంచినట్టు తెలుస్తోంది. వీరు సెలవుపై వెళ్లేందుకు యత్నించినా.. ఉన్నతాధికారులు మాత్రం ససేమిరా అన్నట్టు విశ్వసనీయ సమాచారం. -
‘ఉపాధి’ అక్రమాలపై విచారణకు ఆదేశం
కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం : నియోజకవర్గంలో ఉపాధి హామీ పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని కేంద్ర ప్రభు త్వం ఆదేశించినట్లు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలంయలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉపాధి హామీ నిధులతో నీరు–చెట్టు కార్యక్రమం కింద యంత్రాలతో పనులు చేపట్టారన్నారు. కూలీల కడుపు కొడుతున్న నీరు–చెట్టు పనులు, పక్క దారి పడుతున్న ఉపాధి హామీ బిల్లులపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తాను గత నెలలో ప్రధానమంత్రికి లేఖ రాశానన్నారు. స్పందించిన ప్రధానమంత్రి కార్యాల యం ఈ అక్రమాలపై సమగ్ర విచార ణకు ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీకి లేఖ రాసిందన్నారు. ఆ ప్రతిని తనకు కూడా పంపిందని చెప్పారు. సమావేశంలో బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు నభీష్, ప్రధానకార్యదర్శి అబ్బాస్, మండల కన్వీనర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఉపాధ్యాయుడిపై శాఖాపర చర్యలు తీసుకోండి
జిల్లా ఉన్నతాధికారులకు పోలీసుల నివేదిక అమలాపురం టౌన్ : అమలాపురంలో ఓ ఇంటిపై రౌడీల దాడి ఘటనతో హత్యాయత్నం, మారణాయుధాల కేసులో నిందితుడిగా ఉన్న పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు ఆచంట వీరవెంకట సత్యనారాయణమూర్తిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు పోలీసులు గురువారం నివేదికలు పంపారు. ఇంటి విక్రయంతో అతని పని పూర్తయినా ఇంటిపై రౌడీలు దాడి చేస్తున్నప్పుడు వారితో పాటు ఉండడంతో ఈ కేసులో నిందితుడయ్యారు. ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈవో, డీఈఓ, అమలాపురం డీవైఈవో, ఉప్పలగుప్తం ఎంఈవోలకు వేర్వేరుగా ఎఫ్ఐఆర్లో నమోదైన సెక్షన్లతో నివేదికలు పంపించారు. ఆ ఉపాధ్యాయుడిపై ఉప్పలగుప్తం ఎంఈవో ఇచ్చే నివేదిక మేరకు తాము డీఈవోకు నివేదిక పంపనున్నానని అమలాపురం డీవైఈవో ఆర్ఎస్ గంగా భవాని తెలిపారు. ప్రస్తుతం ఉపాధ్యాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. రౌడీల దౌర్జన్యం దారుణం ఆర్య వైశ్య మహా సభ ప్రతినిధుల బృందం అమలాపురం టౌన్ : ఇటీవల అమలాపురంలో రౌడీలు ఓ ఇంటిపై దాడి చేసి ప్రింటింగ్ ప్రెస్ను ధ్వంసం చేయడం దారుణమని.. ఇది పూర్తిగా అనాగరిక చర్య అని ఆల్ ఇండియా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు కాళ్లకూరి నాగబాబు, ఏపీ ఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యంలతో కూడిన వైశ్య నాయకుల బృందం పేర్కొంది. ఘటన ప్రదేశాన్ని ఆ బృందం గురువారం పరిశీలించింది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ప్రింటింగ్ ప్రెస్ యజమాని కాళ్లకూరి బుజ్జి సోదరులను బృందం ప్రతినిధులు పరామర్శించి సంఘీభావం తెలిపారు. నిందితులను ప్రభుత్వం తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల తరపున ఆర్యవైశ్య మహాసభ అండగా ఉండి వారికి న్యాయం జరిగే వరకూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మాజీ కోశాధికారి పల్లపోతు బంగారం, కంతేటి కాశి, అమలాపురం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు యెండూరి నాగేశ్వరరావు, కార్యదర్శి నంబూరి మూర్తి, కోశాధికారి వరదా సూరిబాబు, పచ్చిగోళ్ల నాగబాబు, యక్కల కుమార్ ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధుల బృందం వెంట ఉన్నారు. -
శిశుమరణాలపై తూతూ మంత్రంగా విచారణ
సాక్షి కథనాలకు స్పందన ఉర్లాకులపాడు (రాజవొమ్మంగి) : రాజవొమ్మంగి మండలం ఉర్లాకులపాడు, జడ్డంగి గ్రామంల్లో సంభవిస్తున్న శిశుమరణాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గురువారం విచారణ చేపట్టారు. శిశుమరణాలపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన వార్తలకు అధికారులు స్పందించారు. అయితే పత్రికలలో వచ్చిన వార్తలకు తప్ప స్పందించని అధికారులు ఈసారి కూడా తూతూమంత్రంగా తమ విచారణ పూర్తయిందనిపించారు. జడ్డంగి పీహెచ్సీ, శిశుమరణాలు సంభవించిన ఇళ్లకు వెళ్లి మరణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇటీవల ఉర్లాకులపాడు, జడ్డంగి గ్రామంల్లో వరుసగా మరణించిన శిశుమరణాల బాధిత కుటుంబాల వారిని అధికారులు పరామర్శించి తల్లీపిల్లలకు జడ్డంగి పీహెచ్సీ ద్వారా అందిన, అందని వైద్యం గురించి అడిగి తెలుసుకొన్నారు. వారి నుంచి లిఖితపూర్వక వాంగ్మూలం సేకరించారు. అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్సెంటర్ల పనితీరు పరిశీలించారు. శిశుమరణాలు సంభవించిన గిరిజన కుటుంబాల ఆహారనియమాలను అడిగి తెలుసుకొన్నారు. ఈ అంశాలను క్రోడీకరించి నివేదికను జిల్లాకలెక్టర్కు నివేదిస్తామని విచారణలో పాల్గొన్న ఏడీఎంఅండ్హెచ్ఓ పవన్కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి అనిత విలేకరులకు తెలిపారు. -
బ్యాంకులపై ఈడీ ముమ్మర దాడులు
న్యూఢిల్లీ: నగదు బదిలీ, హవాలా వ్యవహారాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చురుగ్గా కదులుతోంది. అక్రమ లావాదేవీల నేపథ్యంలో వివిధ బ్యాంకుల కార్యాలయాల రికార్డుల పరిశీలన, తనిఖీని వేగవంతం చేసింది. తాజాగాదేశవ్యాప్తంగా 50కిపైగా బ్యాంకుల్లో దాడులు నిర్వహించింది. బుధవారం ఆయా బ్యాంకు శాఖల్లో రికార్డుల విచారణ నిర్వహిస్తోంది. డీమానిటైజేషన్ తరువాత బ్యాంకు ఉన్నతాధికారులే అక్రమాలకు తెరలేపడం, నగదు అక్రమ లావాదేవీలు భారీగాపెరిగిన నేపథ్యంలో ఈడీ సీరియస్ గా స్పందిస్తోంది. నవంబర్ 30న దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) పీఎంఎల్ఏ ఈ రెండు చట్టాలను అమలు చేసే కేంద్ర సంస్థ ఈడీ. పెద్ద నోట్లు రద్దు తర్వాత బ్యాంకుల్లో మేనేసర్లు సహా, ఇతర బ్యాంకు సిబ్బంది అనేక అక్రమాలకు పాల్పడుతుండడంతో ఇప్పటికే రంగంలోకి దిగింది.ఈ నేపథ్యంలో ఇప్పటికే యాక్సిస్ బ్యాంకు కు చెందిన ఇద్దరు బ్యాంక్ మేనేజర్లను అరెస్ట్ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద కేసులునమోదు చేసింది. అలాగే సుమారు 19 మంది ని యాక్సిస్ బ్యాంక్ ఉన్నతాధికారులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. -
ఇండో–జర్మన్ ప్రాజెక్టుపై ఆరా
బుక్కపట్నం : మండలంలోని బుక్కపట్నం, అగ్రహారం పంచాయతీ పరిధిలో ఇండో–జర్మ¯ŒS ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో ప్రజల భాగస్వామ్యంపై ఢిల్లీ ప్రతినిధి బృందం సభ్యులు గురువారం ఆరా తీశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఉపాధి సిబ్బందితో సమావేశమయ్యారు. బృంధం సభ్యులు వివేకానంద, నీతు తదితరులు ఎంపిౖకెన పల్లెల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల భాగస్వామ్యం కల్పిస్తున్నారా? అని ఉపాధి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పనులకు సంబంధించిన సాఫ్ట్వేర్ను పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీఓ అనిల్కుమార్రెడ్డి, సర్పంచ్ యశోద తదితరులు పాల్గొన్నారు. -
నగల మాయంపై మరో కోణం!
విచారణకు రమ్మంటూ ఆలయ సిబ్బందికి పిలుపు అవుట్ సోర్సింగ్ అర్చకుల నుంచి వివరాలు సేకరణ హైదరాబాద్ స్థాయిలో ఓ ఉన్నతాధికారి అండదండలున్నట్లు ప్రచారం భద్రాచలం: రామాలయంలో నగల మాయంపై విచారణ మళ్లీ మొదటికొచ్చింది. నివేదిక సిద్ధమవుతుందని అంతా భావిస్తున్న తరుణంలో ఆలయ సిబ్బందిని కూడా విచారణకు పిలవటంతో ఇది ఇప్పట్లో తేలేలాలేదని భక్తులు అంటున్నారు. ఆలయంలో పనిచేసే ఇద్దరు అవుట్ సోర్సింగ్ అర్చకులను తన చాంబర్లో విచారించారు. నగల మాయమై, తిరిగి ప్రత్యక్షమైన రోజు వరకూ అసలేం జరిగిందనే దానిపై అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఇద్దరు అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అర్చకులు తెలిపిన వివరాలను రికార్డు చేయటంతో పాటు, వారి నుంచి రాతపూర్వకంగా వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అదేవిధంగా ఆలయ సూపరింటెండెంట్ నర్సింహరాజు, మరో ఇద్దరు ఉద్యోగులు రామారావు, సాయిబాబాలను కూడా విచారణకు హాజరు కావాలని విచారణాధికారి రవీందర్ వారికి నోటీసులు అందజేశారు. ఇప్పటి వరకూ ఇద్దరు ప్రధానార్చకులతో పాటు, 11 మంది అర్చకుల నుంచి వివరాలను సేకరించిన డీఈ రవీందర్ వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నేడో, రేపో నివేదికను ఈవో రమేష్బాబుకు అందజేసే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ మరికొంత మంది ఉద్యోగులను కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించటంతో ఇది మరికొంతకాలం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగదీతలో ఆంతర్యమేమిటో.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నగల మాయంలో దోషులెవరో తెలుసుకునేందుకు భక్తులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సీతమ్మ వారి పుస్తెలతాడును మాయం చేసి పది రోజుల తరువాత అక్కడ పెట్టినప్పటికీ, అది వాస్తవమైనది కాదనే ప్రచారం ఉంది. మాయమైన రెండు బంగారు నగలు అమెరికాకు తరలించి వాటి స్థానంలో కొత్తవి చేయించి పెట్టారని అర్చకుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీసీతారాముల ఉత్సవమూర్తులను బేరం పెట్టింది మొదలు, నగల మాయం వరకూ జరిగిన మొత్తం ఎపిసోడ్లో ’ప్రధాన’ భూమిక పోషించిన అర్చకుడికి, హైదరాబాద్ స్థాయిలో ఓ ఉన్నతాధికారి అండదండలు ఉన్నాయనే ప్రచారం ఉంది. దీనిని ఏదో రీతిన మరుగనపరిచి, నగల మాయం వ్యవహారాన్ని భక్తులు మరిచిపోయేలా చేసేందుకే విచారణను సాగదీస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పెద్దఎత్తున దుమారం రేపిన నగల మాయంలో వాస్తవాలు బయటకు వచ్చేలా విచారణను ఏదో ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించకుండా, ఆలయంలో పనిచేసే అధికారితో మమ అనిపించేలా ఉన్నతాధికారులే తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లుగా భక్తులు అంటున్నారు. -
పోలీసుల అదుపులో బంగారు వ్యాపారి
ప్రొద్దుటూరు క్రై ం: బంగారు వ్యాపారి సుదర్శన్రెడ్డి ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కాడు. అతను విశాఖపట్టణంలో ఉండగా ప్రొద్దుటూరు పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సుదర్శన్రెడ్డి ఈ నెల 7న నాలుగు కిలోల బంగారుతో ఉడాయించిన విషయం తెలిసిందే. డీఎస్పీ పూజితానీలం అతని కోసం ప్రత్యేక బందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం సుదర్శన్రెడ్డి రాసిన ఆరు పేజీల లేఖలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఫేస్బుక్, వాట్సప్ ద్వారా అతను మిత్రులకు, సన్నిహితులకు లేఖలను పోస్టు చేశాడు. ఉత్తరాలే దారి చూపాయా..! అతను పోస్టు చేసిన వాట్సప్ నెంబర్ ఆధారంగా సుదర్శన్రెడ్డిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగానే అతను విశాఖపట్టణంలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లి మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతను తీసుకొని వెళ్లిన బంగారులో కొంత మేర ఖర్చుపెట్టినట్లు సమాచారం. సుదర్శన్రెడ్డిని పోలీసులు డీఎస్పీ పూజితానీలం ఎదుట హాజరు పరిచారు. అతను పెద్ద మొత్తంలో బంగారుతో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఏది ఏమైనా బంగారుతో అతను తిరిగి రావడంతో బాధితుల్లో సంతోషం వ్యక్త మవుతోంది. -
రేపే విచారణకి ఓటుకు కోట్లు కేసు
-
ఆకాశరామన్న ఉత్తరాలపై విచారణ
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యవసాయశాఖకు సంబంధించి కొందరు అధికారులు ఆకాశరామన్న పేరుతో పరస్పరం ఉత్తరాల ద్వారా కమిషనరేట్ కార్యాలయానికి ఫిర్యాదులు సమర్పించిన నేపథ్యంలో వాటిపై విచారణ చేయడానికి శనివారం కమిషనరేట్ నుంచి అడిషినల్ డైరెక్టర్ సుశీల జిల్లాకు వచ్చినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, సస్పెన్షన్లో ఉన్న ఏడీఏ కె.మల్లికార్జున, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ బాలభాస్కర్, మరికొందరు అధికారులతో పాటు కార్యాలయ సిబ్బందిని కూడా పిలిపించి ఉత్తర ఫిర్యాదులపై ఆరాతీసినట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యవహారాలను సీరియస్గా తీసుకోవాలని జేడీఏను ఆదేశించినట్లు సమాచారం. ఏదైనా ఉంటే నేరుగా ఫిర్యాదులు చేస్తే సముచితంగా ఉంటుందని, పేరు ఊరు లేకుండా ఫిర్యాదులు చేయడం వల్ల వ్యవసాయశాఖ పరువు బజారున పడుతుందని హితోపదేశం చేశారని తెలుస్తోంది. ఈ అంశంపై అడిషినల్ డైరెక్టర్ వివరణ కోరిని సమాచారం వెల్లడించేందుకు నిరాకరించారు. -
మదాసి కురువ కుల ధ్రువీకరణపై కలెక్టర్ విచారణ
కర్నూలు(అగ్రికల్చర్): మదాసి కురువ కులధ్రువీకరణ పత్రం జారీపై వచ్చిన అప్పీల్పై సోమవారం జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ విచారణ చేపట్టారు. పగిడ్యాలకు చెందిన శివలింగం మదాసి కురువ ఎస్సీ కులధ్రువీకరణ పత్రం కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ ధ్రువపత్రం ఆర్డీఓ జారీ చేయాల్సి ఉండగా తహసీల్దారు ఏకపక్షంగా తిరస్కరించారు. దీనిపై శివలింగం తగిన న్యాయం చేయాలని కలెక్టర్ కోర్టులో న్యాయవాది ద్వారా తగిన ఆధారాలతో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై కలెక్టర్ విచారణ జరిపారు. శివలింగం తన న్యాయవాది ద్వారా హజరయ్యారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో మదాసి కురువలు ఉన్నారా..ఉంటే వారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు తదితరవాటిపై విచారణ జరిపిస్తానని తెలిపారు. కులాన్ని నిరూపించుకునేందుకు తగిన ఆధారాలతో రావాలని సూచిస్తూ విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు. అనంతరం శివలింగం విలేకర్లతో మాట్లాడుతూ.... మదాసి కురువ అని నిరూపించుకునేందుకు తగిన ఆధారాలతో అంటే గురవయ్యలు, తదితరులను తీసుకొని వచ్చామని తెలిపారు. అయితే కలెక్టర్ పరిశీలించలేదని వివరించారు. ఈ కార్యక్రమంలో మదాసి కురువల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
1994 కాపు ఉద్యమ కేసులపై ఆరా
నవంబర్ 16 ముద్రగడ పాదయాత్రపై ముందస్తు విశ్లేషణl నివేదికలపై జిల్లా పోలీసు శాఖ కసరత్తు అమలాపురం టౌన్: వచ్చే నవంబర్ 16వ తేదీ నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నిర్వహిస్తారన్న ప్రకటన ప్రభుత్వంలో కదలిక తీసుకుని వచ్చింది. 1994లో కాపు రిజర్వేషన్ల కోసం ఆయన కిర్లంపూడి నుంచి తిరుపతి వరకూ సైకిల్ యాత్ర నిర్వహించినప్పుడు కాపుల నుంచి అనూహ్య స్పందన రావటమే కాకుండా జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ దారి పొడవునా ఆందోళనలు, కొన్ని విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో పోలీసులు కాపులపై అనేక కేసులు నమోదు చేశారు. మళ్లీ 22 ఏళ్ల తర్వాత ముద్రగడ పాదయాత్రకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం నాటి యాత్ర ప్రభావాలు, పరిస్థితులపై ఆరా తీస్తూ ఒక అంచనాకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పోలీసు ఉన్నతాధికారుల నుంచి జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లకు శనివారం అత్యవసర ఆదేశాలు వచ్చాయి. 1994లో ముద్రగడ సైకిల్ యాత్ర నిర్వహించినప్పుడు ఏఏ పోలీసు స్టేషన్లలో... ఏఏ కేసులు నమోదయ్యాయి. ఉద్యమ తీవ్రత, ఏయే సెక్షన్లపై నమోదు చేశారు వంటి వివరాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో శనివారం రాత్రి వరకూ జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో నాడు నమోదైన కేసుల వివరాలను పంపారు. నాడు ముద్రగడతో పాటు రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేతలు దివంగత నల్లా సూర్యచంద్రరావు, ఆయన సోదరుడు ప్రస్తుత ఆ సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, నాటిæ ఉద్యమ నేతలు దివంగత సలాది స్వామినాయుడు, నేటి రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ తదితరులు నాటి సైకిల్యాత్రలో కిర్లంపూడి నుంచి తిరుపతి వరకూ సాగారు. అప్పట్లో కాపుల జన సాంద్రత ఎక్కువగా ఉండే కోనసీమలోని పలు పోలీసు స్టేషన్లలో దాదాపు 50 కేసులు నమోదయ్యాయి. రావులపాలెంలో ఐదు కేసులతో పాటు సామర్లకోటలో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆయా కేసుల ప్రభావం, నివేదికలు ప్రస్తుత త్వరలో జరగనున్న పాదయాత్రపై ఎలా ఉంటాయనేది విశ్లేషిస్తున్నారు. పాదయాత్రపై పోలీసుల స్పందన ఎంత వరకూ ఉండాలి. పాదయాత్ర సమయంలో కాపులు ఏదైనా ఆందోళనలు, విధ్వంసాలకు పాల్పడే పరిస్థితులు ఉంటే వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై పోలీసు శాఖ ఇప్పటి నుంచే అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. -
చీకటి పత్రం
– తాజాగా జేసీ విచారణతో ఊరట – రూ.33 కోట్ల నష్టపరిహారం చెల్లింపునకు మార్గం సుగమం – అనుమతివ్వాలని ప్రభుత్వానికి వినతి – గతంలో హడావుడిగా ఆర్డీఓల నివేదికలు – వీటి ఆధారంగా కోర్టులో తేల్చుకోవాలన్న కలెక్టర్ – గత నివేదికలు తప్పని తేల్చిన జేసీ విచారణ సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇప్పటికే పలు పార్టీలు, ప్రజా సంఘాలు అసంతప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా మరోసారి కలెక్టర్ వైఖరి చర్చనీయాంశమయింది. గని, శకునాల రైతులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో వివాదాలు ఉన్నాయనే కారణంగా కోర్టు ద్వారానే తేల్చుకోవాలంటూ స్వయంగా కలెక్టర్ సమర్పించిన నివేదిక తప్పని తేలింది. అందులో అనేక మంది రైతుల భూముల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని.. వారికి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని జాయింట్ కలెక్టర్(జేసీ) పునర్విచారణలో స్పష్టమైంది. ఈ నేపథ్యంలో కోర్టులో తేల్చుకోవాలంటూ గతంలో సమర్పించిన నివేదికను పక్కనపెట్టి.. అర్హులని తేలిన రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని తాజాగా ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగం కోరింది. ఇన్ని రోజులుగా మెగా సోలార్ ప్లాంటు ఏర్పాటు పనులకు అడ్డంకిగా మారిన గని, శకునాల భూముల వ్యవహారం తాజాగా జేసీ విచారణతో తేలనుంది. మొత్తం మీద అర్హులైన రైతులకు త్వరలో పరిహారం అందనుంది. మొత్తం రూ.33 కోట్ల మేరకు పరిహారం చెల్లించాల్సి ఉంటందని జేసీ విచారణలో తేలినట్టు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటు విషయంలో కలెక్టర్ వైఖరితోనే ఇన్ని రోజులుగా పనులు జరగడం లేదనే ఆరోపణలకు తాజా విచారణ బలం చేకూరుస్తోంది. 66 శాతం మంది అర్హులే.. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంటును జిల్లాలోని గని, శకునాల వద్ద ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం భూసేకరణను చేపట్టారు. అయితే, కొద్ది మంది రైతుల భూముల వ్యవహారంలో ఎవరు అర్హులో? ఎవరు కాదో అనే తకరారు ఏర్పడింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆర్డీఓలను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ నుంచి వచ్చిన ఆదేశాలు, ఒత్తిడితో ఆర్డీఓలు హడావుడిగా నివేదికలు తయారుచేశారు. మొత్తం 1,300 ఎకరాలపై నెలకొన్న వివాదంపై సుమారు 600 మంది రైతులను విచారించి ఇందులో 60 శాతానికి పైగా రైతులు(సుమారు 360 మంది రైతులు) పరిహారం పొందేందుకు అర్హులని జేసీ విచారణలో తేలింది. వీరందిరికీ రూ.33 కోట్ల పరిహారం చెల్లించాలని జేసీ సూచించారు. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి.. రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని తాజాగా ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగం కోరింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే రైతులకు నష్టపరిహారం అందనుంది. మొత్తం మీద జేసీ విచారణతో గని, శకునాల రైతులకు కాస్తా ఊరట లభించనుంది. సోలార్ కంపెనీ ఫిర్యాదు ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా అతి పెద్ద సోలార్ ప్లాంటు ఏర్పాటుకు చేపట్టిన ప్రయత్నాలకు మొదటి నుంచీ అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. భూ సేకరణ కోసం అవసరమయ్యే మొత్తాన్ని తాము కలెక్టర్ వద్ద డిపాజిట్ చేసినప్పటికీ పనులు మాత్రం ముందుకు కదలడం లేదని సోలార్ కంపెనీ యాజమాన్యం వాపోతోంది. హక్కుదారులమైనా వివాదం పేరిట కోర్టులో తేల్చుకోవాలన్న కలెక్టర్ నివేదికపై రైతులు మండిపడ్డారు. పనులు జరుగనిచ్చేది లేదని భూమి పూజ కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)కి కంపెనీ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఒకవైపు భూసేకరణ పూర్తయ్యిందని కలెక్టర్ చెబుతున్నప్పటికీ పనులు చేసేందుకు వెళితే మాత్రం రైతులు అడ్డుకుంటున్నారని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో భూసేకరణ వ్యవహారంపై తేల్చాలని కలెక్టర్ను సీఎస్ ఆదేశించారు. పైగా వాస్తవానికి విరుద్ధంగా నివేదికలు ఇవ్వడంపై ఆయన మండిపడినట్టు సమాచారం. ఫలితంగా జేసీ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేసి అర్హులైన రైతులెవరో తేల్చాలని కలెక్టర్ కోరారు. ఇందుకు అనుగుణంగా గతంలో ఇచ్చిన ఆర్డీఓల నివేదికకు భిన్నంగా అనేక మంది రైతులు పరిహారానికి అర్హులని తేలడంతో ఇప్పటికైనా వ్యవహారం సద్దుమణిగి సోలార్ ప్లాంటు పనులు ముందుకు సాగుతాయో లేదో చూడాల్సి ఉంది. -
గల్లంతైన యువకుడి కోసం గాలింపు
నర్సంపేటరూరల్: మండలంలోని మాదన్నపేట మత్తడి వద్ద బల్సూకూరి కృష్ణ (35) మూడు రోజుల క్రితం గల్లంతైన విషయం తెలిసిందే. అతడి ఆచూకీ ఆదివారం నర్సంపేట టౌన్ సీఐ జాన్దివాకర్, ఎస్సై హరికృష్ణతో పాటు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండి అలుగులు పడుతున్నాయని, యువకులు, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన సంఘాల సమాఖ్య జిల్లా అ«ధ్యక్షుడు ఆబోతు రాజు, కార్యదర్శి ఆబోతు సతీష్, సంగినేని లకన్, నిఖిల్, పైండ్ల గగన్, కుమార్, దాసరి శ్రీకాంత్, రాజేష్, రమేష్, యేగేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.