టేకులపల్లి తహసిల్దారుపై విచారణ
Published Mon, Jul 3 2017 4:33 PM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM
టేకులపల్లి: టేకులపల్లి తహసిల్దారుపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. తనను దుర్భాషలాడారని ఓ గిరిజన మహిళ తహసిల్దారు నాగేశ్వరరావుపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఏఎస్పీ సునీల్దత్ సోమవారం తహసిల్దార్ కార్యాలయానికి వచ్చి విచారణ జరిపారు. కాగా, కొత్త తహసిల్దారుగా ఎస్.అంజంరాజును నియమించారు.
Advertisement
Advertisement