
పవర్ రాగానే జయ మృతిపై విచారణ: స్టాలిన్
రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేదని, రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు చెల్లించి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల మద్దతుతో బినామీ ప్రభుత్వం నడుస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే అన్నాడీఎంకే ప్రభుత్వం పడిపోవడం, ప్రజాదరణతో డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. జయలలిత మరణం వెనుక కుట్రదాగి ఉన్నట్లు తేలితే దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు.