మళ్లీ ‘ఈడీ’ విచారణకు రాహుల్‌గాంధీ..? | Rahul Gandhi May Be Called For ED Questioning | Sakshi

మళ్లీ ‘ఈడీ’ విచారణకు రాహుల్‌గాంధీ..?

Published Mon, Aug 12 2024 7:41 AM | Last Updated on Mon, Aug 12 2024 9:02 AM

Rahul Gandhi May Be Called For ED Questioning

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మళ్లీ విచారణకు పిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాహుల్‌, సోనియాగాంధీ ప్రధానవాటాదారులుగా ఉన్న నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో ఈడీ ఇప్పటికే విచారణ జరుపుతోంది. ఈ కేసులో చార్జ్‌షీట్‌ ఫైల్‌ చేసేముందు ఈడీ రాహుల్‌ను విచారించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

దర్యాప్తునకు ముగింపు పలికి కేసు విచారణకు వెళ్లాల్సిఉందని, ఇందుకోసం కేసుతో సంబంధమున్న అందరినీ చివరిసారిగా విచారించాలనుకుంటున్నట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి.  అయితే కేసులో మరో నిందితురాలిగా ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీని ఈడీ విచారణకు పిలుస్తుందా లేదా అన్నది తెలియాల్సిఉంది. కాగా, నేషనల్‌హెరాల్డ్‌ కేసులో రాహుల్‌, సోనియాలను ఈడీ ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement