National Herald Case: రూ. 661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు | ED Issues Notice Possession Assets Cong Linked AJL Case | Sakshi
Sakshi News home page

National Herald Case: రూ. 661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు

Published Sun, Apr 13 2025 11:36 AM | Last Updated on Sun, Apr 13 2025 11:48 AM

ED Issues Notice Possession Assets Cong Linked AJL Case

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కేసులో రూ. 661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్‌కు చెందిన ఈ ఆస్తులలో ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్, ముంబైలోని పలు ప్రాంగణాలు, లక్నోలోని ఒక భవనం ఉన్నాయి.

ఏజెఎల్‌, యంగ్ ఇండియన్‌పై మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించింది. ఏజెఎల్ నేషనల్ హెరాల్డ్ న్యూస్‌ ప్లాట్‌ఫారం (వార్తాపత్రిక, వెబ్ పోర్టల్)నకు ప్రచురణకర్తగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్‌లో 38 శాతం వాటాలతో అధిక వాటాదారులుగా ఉన్నారు. ఈడీ తన దర్యాప్తులో.. ఉద్దేశపూర్వకంగా యంగ్ ఇండియన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ప్రయోజనం చేకూర్చేదిగా పనిచేసిందని ఈడీ ఆరోపించింది.  

సంస్థ విలువను గణనీయంగా తక్కువగా అంచనా వేసి , రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను  ఏజెఎల్ సేకరించిందని ఈడీ గుర్తించింది.  రూ. 18 కోట్ల వరకు బోగస్ దానాలు, రూ. 38 కోట్ల వరకు బోగస్ అడ్వాన్స్ అద్దె, రూ. 29 కోట్ల వరకు బోగస్ ప్రకటనల రూపంలో అక్రమంగా రాబడిని సంపాదించుకునేందుకు యంగ్‌ ఇండియన్‌ ప్రయత్నించిందని ఈడీ ఆరోపించింది.  ఈ నేపధ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏజెఎల్ కేసులో రూ. 661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఏజేఎల్‌కు నోటీసులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: సియాచిన్‌ డే: అత్యంత ఎత్తయిన యుద్ధభూమిలో భారత్‌ విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement