హైదరాబాద్: జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ)కు అందిన ఫిర్యాదులపై కమిషన్ సభ్యురాలు సుష్మా సాహు గురువారం బహిరంగ విచారణ చేపట్టారు. 2016-17 కాలంలో సైబర్ క్రైం, గృహహింసకు సంబంధించి నమోదైన 58 కేసుల పరిష్కారంపై విచారణ చేపట్టి 30 వరకు కేసులను పరిష్కారించారు. మరో 10 కేసులపై విచారణ కొనసాగుతోంది.
వీటితోపాటు మరో 18 కేసులు హైదరాబాద్ న్యాయ అధికారుల పరిధికి మించినవి. తెలంగాణ ప్రాంతంలో కాంట్రాక్టు పెళ్లిళ్లు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే ఇందుకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు అందలేదని సుష్మా తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ స్వాతి లక్రా పాల్గొన్నారు.
ఎన్సీడబ్ల్యూ బహిరంగ విచారణ
Published Thu, Jun 29 2017 6:09 PM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM
Advertisement
Advertisement