దీపావళి పండుగ వేళ సొంత వూరికి వస్తున్న వారు గమ్యం చేరుకోకుండానే బస్సు రూపంలో మృతువాత పడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం దేవుని పల్లి గ్రామానికి చెందిన కుసుమ వేదపతి ఉన్నారు. సాప్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న వేదపతికి 11 నెలల క్రితమే స్వర్ణ లత అనే యువతితో వివాహం అయింది. పండగకు వస్తానని ఫోన్ ఇంట్లో వారికి చెప్పారు. ఇంటికి వస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు, భార్యకు ప్రమాద సమాచారం తెలిసి కుప్పకూలిపోయారు. వేదపతి మరణించాడని తెలిసి గ్రామంలో విషాదం నెలకొంది.
Oct 30 2013 12:39 PM | Updated on Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement