bus fire
-
జనగామ: ఎసీ బస్సులో చెలరేగిన మంటలు
-
విశాఖలో బస్సు దగ్ధం
విశాఖపట్నం: గాజువాక పోర్టు రోడ్డు పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న లారీ మెకానిక్ గ్యారేజ్లో పెనుప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మత్తుల కోసం వచ్చి గ్యారేజ్లో ఉన్న ఓ బస్సు ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో గ్యారేజ్లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీనిని గమనించిన చుట్టుపక్కల వారు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. బస్సు దగ్ధమవ్వడానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన గాజువాక పోలీసులు కేసు నమోదు చేసుకొని.. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖలో బస్సు దగ్ధం
-
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 27మంది మృతి
-
బస్సులో మంటలు
పట్నా: బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు చంపారన్ జిల్లాలో బస్సు రోడ్డుపక్కనున్న లోతైన గుంతలో పడి మంటలు చెలరేగటంతో దాదాపు 20 మంది వరకు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. అయితే, మృతుల సంఖ్య కచ్చితంగా తెలియట్లేదు. 28వ నంబర్ జాతీయ రహదారిపై కొట్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్వా గ్రామ సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ముజఫర్పూర్ నుంచి ఢిల్లీ వైపు వస్తున్న ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి రోడ్డు పక్కనున్న లోతైన గుంతలో పడింది. ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల్లో 20 మందికి పైగా చనిపోయినట్లు తూర్పు చంపారన్ కలెక్టర్ ధ్రువీకరించారని మంత్రి దినేష్ చంద్ర యాదవ్ తెలిపారు. బస్సు కిటికీ అద్దాలు పగులగొట్టుకుని గాయాలతో బయటపడిన 11 మందిని వెంటనే ఆస్పత్రికి తరలించామని డీఎస్పీ మురళి మాంఝీ చెప్పారు. అయితే, ఘటన సమయంలో బస్సులో డ్రైవర్, హెల్పర్ కాకుండా 13 మంది మాత్రమే ఉన్నారని స్థానిక టీవీ చానెల్ పేర్కొంది. -
విద్యార్థులపైకి దూసుకెళ్లిన బస్సు ; ప్రజాగ్రహం
-
విద్యార్థులపైకి దూసుకెళ్లిన బస్సు ; ప్రజాగ్రహం
కోల్కతా : కోల్కతా మహానగరంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్రాసింగ్ వద్ద బస్సు సిగ్నల్ జంప్ చేసిన ఇద్దరు విద్యార్థులపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆ మార్గంలో వెళ్తున్న మూడు ఆర్టీసీ బస్సులకు నిప్పుపెట్టారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసులపై ఎదురుదాడికి దిగిన స్థానికులు రాళ్లదాడికి దిగారు. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లు రాగా స్థానికులు వాటిపై కూడా రాళ్లు విసిరారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఆందోళనకారులపై టియర్గ్యాస్ను ప్రయోగించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. -
బస్సును తగులబెట్టిన నక్సల్స్
ఛత్తీస్గఢ్: నారాయణపూర్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఓ ప్రైవేటు బస్సును మావోయిస్టులు తగులబెట్టారు. అబూజ్మడ్-నారాయణపూర్ రహదారి నిర్మాణాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఘటనకు పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. -
చెట్టును ఢీకొంటే.. బస్సును తగులబెట్టారు!
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దివాస్ ప్రాంతంలో ఆదివారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 12 మందికి గాయాలయ్యాయి. అతివేగంతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టువైపు దూసుకెళ్లింది. చెట్టును బలంగా ఢీకొట్టడంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు గాయాలు కాగా, ఒకరు మృతి చెందారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంపై ఆగ్రహించిన అక్కడి స్థానికులు బస్సుకు నిప్పుపెట్టినట్టు తెలిసింది. దాంతో బస్సు మంటల్లో దగ్ధమైంది. -
బస్సు ప్రమాదం పై స్పందించిన యాజమాన్యం
-
అతివేగమే బస్సు ప్రమాదానికి కారణం
-
వామ్మో వోల్వో....
-
కర్ణాటకలో బస్సు ప్రమాదం, ఏడుగురు సజీవ దహనం
-
జబ్బార్ ట్రావెల్స్ ఘటనలో దోషుల పై చర్యలేవి?
-
నేడు మరో 8 మంది మృతదేహాలనివేదికలు అందే అవకాశం
-
కన్నీరు మున్నీరవుతున్న కుటుంబం
-
బస్సులో ప్రతీ సీటులోనూ ఒ బంగారు కల భస్మం
-
గాల్లో దీపాలుగా ప్రజల ప్రయాణాలు
-
యమపురి ట్రావెల్స్:పండక్కి వస్తూ తలలు వాల్చేసిన అభాగ్యులు
-
యమపురి ట్రావెల్స్
-
మృతుల బంధువుల డీఎన్ఏ నమానాల సేకరణ
-
కెమికల్స్ రవాణా చేస్తున్న ప్రైవేటు బస్సు ఆఫరేటర్లు
-
మహబూబ్నగర్ ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణీకులు సజీవ దహనమైయారు. కొత్తకోట మండలం పాలెం ఎన్హెచ్ 44పై బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాధమిక సమాచారం అందింది. వేగంగా వెళ్లి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బస్సులో ఉన్న 49 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే బతికి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణీకులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు నుంచి ఇప్పటివరకూ 45 మృతదేహాలను వెలికి తీశారు. ప్రయాణికులు సజీవ దహనం కావటంతో బస్సు కింద భాగం నుంచి కట్టర్ల సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. బస్సులో మొత్తం 49మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద మృతుల బంధువులు హైదరాబాద్ లక్డీకాపూల్లోని జబ్బర్ ట్రావెల్స్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బాధితుల సమాచారం కోసం ట్రావెల్స్ ప్రతినిధులను ప్రశ్నించారు. ట్రావెల్స్ సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బస్సు ప్రమాదంపై ట్రావెల్స్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువుల వివరాల కోసం వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ట్రావెల్స్ ప్రతినిధులు తమకు సరైన సమాచారం ఇవ్వటం లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవటంతో డీఎన్ఏ నిర్వహించిన అనంతరం చనిపోయినవారి బంధువులకు అప్పగించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని .... ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. -
బస్సు ప్రయాణికుల సంఖ్యపై గందగగోళం
-
తెలవారుతుండగానే తెల్లారిన బతుకులు
-
బస్సు యాక్సిడెంట్పై స్పందించిన బొత్స
-
భార్యను కలవాలని వెళ్ళి, మృత్యు ఒడిలోకి
-
ఆఫర్ లెటర్ ఆలస్యం కాకుంటే బతికి ఉండేవాడు
కొత్తకోట మండలం పాలెం ఎన్హెచ్ 44పై బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సులో 45 మంది ప్రయాణీకులు సజీవ దహనమైన ఘోర దుర్ఘటనలో హృదయవిదారకమైన ఉదంతాలలో కాలిబూడిదైపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆడారు రవి (27)ది భిన్నమైన ఉదంతం. అంతా సజావుగా జరిగి ఉంటే, తను కలలుగన్న మల్టీనేషనల్ కంపెనీ ఆక్సెంచుర్ (Accenture) హైదరాబాదు ఆఫీసులో ఈ పాటికి చేరి ఉండేవాడు. ఈ ఒక్క రోజు ఆగి ఉన్నట్టైతే మరో మల్టీనేషనల్ కంపెనీ కెటి & టి (KT &T) లో తానిప్పుడు చేస్తున్న బెంగలూరులోనే చేరి ఉండేవాడు. "ఒక విధంగా వాడి చావుకు నేను కూడా బాధ్యుడ్నేనేమో. వాడు ఎటూ తేల్చుకోలేక పోతుంటే కెటి & టి కంటే ఆక్సెంచుర్ పెద్ద కంపెనీ అని సలహా ఇచ్చాను. మంగళవారానికి కెటి & టి ఆఫర్ లెటర్ వస్తే, ఉండిపోతానని, లేకపోతే హైద్రాబాద్ బయిల్దేరతానని అన్నాడు," అని చెప్పుకొచ్చాడు ఆడారు రవి ప్రాణ స్నేహితుడు కె. లీలా శివ ప్రసాద్. మిత్రుడ్ని రిసీవ్ చేసుకోవాలన్న ఆత్రుతలో ఉన్న తాను, గుర్తు పట్టడం కూడా కష్టమైన ఆ మిత్రుడి శవాన్ని చూడటానికి వెళ్తున్నానని దుర్ఘటనా స్తలానికి వెళ్లబోయే ముందు 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడాడు. ప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం, విజయనగరానికి చెందిన రవి చదువులో చాలా చురుకైన వాడు. మాచర్ల న్యూటన్ కాలేజీలో ఇంజినీరింగ్ 2003- 2007 బ్యాచ్. 2007 ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, బెంగలూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాడు. రవికి ఒక అన్నయ్య, ఓ చెల్లి ఉన్నారు. అన్నయ్య విజయనగరంలోనే తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటూ, ఇంటర్నెట్ సెంటర్ నడుపు కుంటున్నాడు. రవి ఆ కుటుంబానికి ఆధారంగా ఉన్నాడు. త్వరలో చెల్లి పెళ్ళి చేయాలని, మంచి కంపెనీలో మరింత మంచి జీతం వచ్చే ఉధ్యోగంలో చేరాలని పట్టుదలగా కొన్ని పెద్ద కంపెనీలలో ప్రయత్నించి సఫలమయ్యాడు. నిజానికి కెటి & టి ఆఫర్ చేసిన జీతం ఎక్కువ అయినా, ఆఫర్ లెటర్ ఇవ్వడంలో జాప్యం జరగడం, ఆక్సెంచుర్ ఇంకా పేరున్న కంపనీ కావడంతో రవి మంగళవారం రాత్రి తన మృత్యువుని వెదుక్కుంటూ బయిల్దేరినట్టైయింది. "రాత్రి బస్సు ఎక్కిన తర్వాత కూడా ఫోన్ చేశాడు. రేపు జాయిన్ అయ్యాక, సాయంత్రం కె ఎఫ్ సీ లో పార్టీ చేసుకుందాం అన్న వాడిని ఇప్పుడు గుర్తు పట్టడానికి కూడా లేదు,' అని ఆడారు రవి స్నేహితుడు లీలా ప్రసాద్ భోరుమన్నాడు. -
44 మృతదేహాలు వెలికితీత
-
రెండేళ్ల క్రితమే బస్సు అమ్మేశాం: జేసీ ట్రావెల్స్
-
నివ్వెరపరిచే వివరాలను చేప్పిన ప్రత్యక్ష సాక్షి
-
బస్సు దగ్ధం - 44 మంది దుర్మరణం
మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి హైదరాబాద్లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు: శ్రీకర్ పద్మారావునగర్ (సికింద్రాబాద్ ), రాజేష్ బీహెచ్ఈఎల్ ఓల్డ్ ఎమ్ఐజీ (ఇన్ఫోటెక్ ఉద్యోగి), యోగేష్ గౌడ బెంగళూరు ( టోలిచౌకి ) మాదాపూర్ గోల్ప్ కోర్ట్ కోచ్, జయసింగ్, బాషా ( ఉత్తరప్రదేశ్ ) .... వీరిలో యోగేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మిగతా నలుగురు 30 శాతం గాయపడినట్లు అపోలో ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ తమిల్లా తెలిపారు. ఎమర్జెన్సీ విభాగంలో వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44 మంది ప్రయాణీకులు సజీవ దహనమైయారు. కొత్తకోట మండలం పాలెం ఎన్హెచ్ 44పై బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాధమిక సమాచారం అందింది. వేగంగా వెళ్లి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బస్సులో ఉన్న 49 మందిలో కేవలం నలుగురు మాత్రమే బతికి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణీకులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ప్రయాణీకుల ఆర్తనాదాలు విన్న సాక్షి ప్రతినిధి 108కి సమాచారం అందించారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 49 మంది ప్రయాణీకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 44 మంది సజీవ దహనమైనట్టు సమాచారం. నలుగురైదుగురు బస్సు అద్దాలు పగలకొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగే సమయంలో ప్రయాణీకులు గాఢ నిద్రలో ఉన్నారు. వారంతా నిద్రలోనే మృత్యువడికి చేరుకున్నారు. బస్సు డ్రైవర్, క్లీనర్ కూడా ప్రాణాలు దక్కించుకున్నారు. -
వోల్వో బస్పు ప్రమాదం నుంచి బయటపడ్డ నలుగురు ప్రయాణికులు
-
బాధితుల సమాచారం కోసం బంధువుల ఆందోళన
-
వోల్వో బస్సు దగ్ధం - 42మంది దుర్మరణం?
-
జాతీయ రహదారి పై అగ్నికి ఆహుతైన వోల్వో బస్సు
-
మహబూబ్ నగర్ జిల్లాలో ఘెర రోడ్డు ప్రమాదం