పండగలు అందరూ చేసుకుంటారు. వేడుకలు అందరూ నిర్వహించుకుంటారు. సాధారణంగా పండగ రోజున ఎవరి ఇంట్లో వారికే పండగ. కానీ ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించే ఈపండగ ఇతరులకు కోసం. అందరి ఆరోగ్యం కోసం. ఆ ఆరోగ్యంపై అవగాహన కోసం. వ్యాధిబాధితులూ, రోగవేదనలూ ఎంత బాధాకరమో తెలుసు కాబట్టి; వాటి వల్ల పడే ఆర్థిక, పనినష్టభారాలు విదితం కాబట్టి అందరికీ ఆరోగ్యం పంచడానికి నడుం బిగించింది సాక్షి. అందరికీ ఆరోగ్య అంశాలపై అవగాహన కలిగించేందుకు ‘సాక్షి లివ్ వెల్ ఎక్స్పో’ పేరిట రెండు రోజుల వేడుకల్లో భాగంగా అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన కార్యక్రమం నేడు (శనివారం) ప్రారంభం కానుంది.
Published Sat, Aug 8 2015 7:29 AM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement