Health
-
ఆగ్రహం.. ఆరోగ్యానికి అనర్థం
సాక్షి, హైదరాబాద్: భావోద్వేగాల పరంగా చూస్తే.. ఆయా సందర్భాలు, సంఘటనలను బట్టి కోపం రావడాన్ని సహజ లక్షణంగానే పరిగణిస్తుంటారు. కానీ కోపాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైతే మాత్రం.. దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటున్నాయనేది అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఎవరైనా తమ కోపాన్ని ఆపుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటే.. దాని ప్రతికూల ప్రభావం వారి ఆరోగ్యంపై పడుతోందని స్పష్టమౌతోంది.ఆగ్రహాన్ని ఆపుకోలేకపోతే వివిధ రూపాల్లో ఆరోగ్యంపై ప్రభావంపడడంతో పాటు, ఏదైనా ధ్వంసం చేయాలనే ఆలోచన లేదా ఎవరిపై దాడికి పాల్పడటం, స్వీయ నియంత్రణ కోల్పోవడం, తదితర రుగ్మతలకు దారితీయడం, వ్యక్తుల మధ్య సంబంధాలు దెబ్బ తినడానికి కారణమౌతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. చిన్నచిన్న విషయాలకే కోపం రావడం వంటివి దీర్ఘకాలం కొనసాగితే.. వ్యక్తిగతంగా ఆరోగ్యంపై, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపి.. అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.ట్రాఫిక్లో ఇరుక్కుని వెళ్లాల్సిన ముఖ్యమైన సమావేశానికి లేదా ఫంక్షన్కు ఆలస్యం కావడం, చిన్న విషయానికే చిరాకు పడటం, అపరాధ భావం, కొందరిపై లేదా పరిస్థితులపై వ్యతిరేక భావం, ఏదైనా విషయమై తోటివారు, స్నేహితులు, బంధువులు, సహచరులతో భిన్నాభిప్రాయాలు ఎదురుకావడం, మానసికంగా కుంగుబాటు, కూడా కోపం రావడానికి కారణాలుగా విశ్లేష్టిస్తున్నారు. పలు ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వహించిన అధ్యయనాల్లోనూ కోపం వల్ల ఆరోగ్యంపై పడే ప్రభావం, ఇతర అంశాలను పరిశీలించారు. కోపోద్రిక్తులు కావడం వల్ల వెంటనే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. రక్తపోటు పెరగడం వల్ల గుండెపై (కార్డియోవాసు్క్యలర్ స్ట్రెయిన్) ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. గుండెజబ్బుల ముప్పు కూడా 19 శాతం పెరుగుతుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తన పరిశీలనలో పేర్కొంది. ఏదైనా సంఘటన లేదా కారణంతో అధికంగా ఉద్రేక పడితే.. ఆ తర్వాత రెండుగంటల వ్యవధిలోనే గుండెపోటు వచ్చే అవకాశం ఎనిమిదన్నర రెట్లు పెరుగుతుందని యూరోపియన్ హార్ట్ జనరల్ వెల్లడించింది. రక్తపోటు పెరిగిపోయి ‘క్రానిక్ హైపర్టెన్షన్’గా మారితే హార్ట్స్ట్రోక్తో పాటు మూత్రపిండాల వ్యాధులకు దారితీయొచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కోపంపై నియంత్రణ కోల్పోతే రోగనిరోధక సామర్థ్యం 30 శాతం తగ్గిపోతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కోపానికి గురైనపుడు కొన్ని గంటల పాటు రోగనిరోధక వ్యవస్థ బలహీనమౌతుందని వెల్లడిస్తున్నాయి. 24 గంటల పాటు ‘స్లీప్ సైకిల్స్’లో ఇబ్బందులు, కేవలం రెండు నిమిషాల కోపం అనేది 7 గంటల పాటు ‘కోర్టిసోల్’స్థాయిల్లో పెరుగుదలకు కారణమౌతుందని హెచ్చరిస్తున్నాయి.ఆగ్రహం నియంత్రణకు ఏం చేయాలంటే.. ⇒ కోపం వచ్చే సూచనలను ముందుగానే గమనించి.. దాని నియంత్రణకు అవసరమైన విధంగా స్పందించాలి ⇒ వెంటనే ప్రతిస్పందించకుండా.. ఏం చేయాలనే దానిపై కొంత సమయమిచ్చి ఆలోచించాలి. ఒకటి నుంచి పది దాకా లెక్క పెట్టడంతో పాటు కామింగ్ బ్రీథింగ్ ఎక్సర్సైజులు చేయాలి ⇒ కోపానికి కారణం ఏమిటో తెలియజేయాలి. అందుకు కారణమైన వ్యక్తితో కాకుండా మిత్రుడు లేదా ఆప్తులతో మాట్లాడాలి ⇒ పరుగు, నడక, ఈత, యోగ వంటి ఒత్తిళ్లను తగ్గించే కార్యకలాపాలు చేయాలి ⇒ ఏదైనా సంఘటనకు వెంటనే ప్రభావితమై స్పందించకుండా.. ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టాలి.యాంగర్ మేనేజ్మెంట్ కేసులే ఎక్కువమా దగ్గరకు ‘యాంగర్ మేనేజ్మెంట్’కు సంబంధించిన కేసులు ఎక్కువగానే వస్తున్నాయి. వైవాహిక బంధంలో తలెత్తే సమస్యలతో దంపతులిద్దరిలో ఎవరో ఒకరు కోపోద్రిక్తులు కావడం, రోడ్డుపై వెళ్తునపుడు ఎదురయ్యే ఘటనలతో, వ్యక్తిత్వాల్లో వచ్చిన మార్పులతో ఆవేశాలు, ఇలా వివిధ కారణాలు, సంఘటనలతో ప్రభావితమై తమ ఆగ్రహాన్ని నియంత్రించుకోలేని వారు వస్తున్నారు. వారికి ఆయా సమస్యలకు అనుగుణంగా మందులు ఇవ్వడం, కౌన్సెలింగ్, యాంగర్ మేనేజ్మెంట్ క్లాసెస్ తీసుకుంటున్నాం. అప్పుడప్పుడు ఏదైనా సందర్భంలో లేదా ఏదైనా అనుకోని ఘటన జరిగినప్పుడు ఆగ్రహానికి గురైతే మంచిదే.కానీ ఏ చిన్న సంఘటనకైనా, చిన్నపాటి వాగ్వాదానికి ఇతరులపై కోపగించుకోవడం, రుస రుసలాడటం వంటివి చేస్తే మాత్రం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కోపం అనేది ‘నెగిటివ్ ఎమోషన్’అయినప్పటికీ.. ఆగ్రహం రావడానికి భావోద్వేగపరమైన అంశాలు మెదడుపై ప్రభావం చూపి (నెర్వస్ సిస్టమ్పై) శరీరంలోని అన్ని భాగాలను ప్రభావితం చేసి ఒక్కసారిగా రక్తప్రసారం పెరిగిపోతుంది. వెంటనే ఏదో రూపంలో శరీరం స్పందించేలా చేస్తుంది. మామూలుగా చూస్తే ఇదొక రక్షణ వ్యవస్థ (డిఫెన్న్ మెకానిజం)గా ఉన్నా.. ఒకస్థాయి దాటాక కోపాన్ని నియంత్రించుకోలేకపోతే దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. అందువల్ల కోపంపై నియంత్రణ ఎంతైన అవసరం. – డాక్టర్ ఎమ్మెస్ రెడ్డి, సీనియర్ సైక్రియాట్రిస్ట్–డైరెక్టర్, ఆశా హాస్పటల్స్చేయకూడనివి..⇒ అన్నింటినీ ఒకేసారి చేయా లని ప్రయత్నించొద్దు. అందుకోగలిగే చిన్న లక్ష్యాలను ముందు నిర్దేశించుకోవాలి ⇒ మనం మార్చలేని వాటిపై దృష్టి కేంద్రీకరించొద్దు. సమయాన్ని, శక్తియుక్తులను నిర్దేశిత లక్ష్యంపై పెట్టాలి. ఎవరికి వారు స్వాంతన చేకూర్చుకుంటే మంచిది ⇒ ఏకాకిగా ఉన్నాననే భావన రానివ్వొద్దు. మిత్రులు, సహచరుల సహకారం, మద్దతు తీసుకోవాలి ⇒ కోపాన్ని తగ్గించుకునేందుకు మద్యం, సిగరెట్, గ్యాంబ్లింగ్, డ్రగ్స్ వంటి వాటిని ఎప్పటికీ ఆశ్రయించవద్దు. ఇవన్నీ కూడా మానసికంగా మరింతగా క్షీణించేలా చేస్తాయి. -
చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలతో రాజీ పడకూడదనుకుంది..కట్చేస్తే..!
చుట్టుముట్టే ఆరోగ్య సమస్యలు మనకు పరోక్షంగా మంచి జీవనశైలి అవలంభించమని సంకేతమిస్తుంటాయి. మన శరీరం చెప్పే మాట వింటే ఆరోగ్యం, బరువు మన చేతిలో ఉంటుంది. లేదంటే అధిక బరువుతో లేనిపోని అనారోగ్య సమస్యలతో సతమతమవ్వక తప్పదు. కనీసం అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడే మేల్కొని మంచి ఆహారపు అలవాట్లతో బరువు తగ్గేందుకు ఉపక్రమించి ఎందరికో స్ఫూరిగా నిలుస్తున్నారు కొందరు. అచ్చం అలానే బరువు తగ్గి ఆరోగ్యంలో రాజీ ఉండకూడదని చాటి చెప్పి శెభాష్ అనిపించుకుంది ఈ మహిళ. ఆ మహిళ పేరు రాజీ ఘంఘాస్. ఆమె జనవరి 2024లో సుమారు 155 కిలోల బరువుతో పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతుండేది. భారీకాయం వల్ల కొద్ది దూరం నడకకే ఆయాస పడిపోతుండేది. అలాగే ఈ అధిక బరువు కారణంగా ఆమె రూపం అసహ్యంగా మారడమే గాక ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయి. అధిక బరువు, హర్మోన్ల అసమతుల్యత, క్రమరహిత రుతుక్రమం, ప్రీ డయాబెటిక్ వంటి సమస్యలను ఎదుర్కొంది. ఆమెను చూస్తే పెద్దన్నాళ్లు ఈ బరువుతో బతకదేమో అనేంతలా ఇబ్బందులుపడింది. అప్పుడే రాజీ అనుకుంది భగవంతుడి ఇచ్చిన రూపం మార్చలేను, కానీ అనారోగ్యాన్ని భరిస్తూ మాత్రం చావలేను అని గట్టిగా నిర్ణయించుకుంది. ముందు అందం కంటే ఆరోగ్యంగా ఉండటమే ప్రధానం, పైగా అది తన చేతిలో ఉన్న అవకాశం అని గ్రహించింది రాజీ. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మంచి ఆహారపు అలవాట్లను అనుసరించింది. ముఖ్యంగా ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చింది. "రోజుని మెంతులు, యాలకులతో ఉడికించిన గోరువెచ్చని డిటాక్స్ వాటర్తో ప్రారంభించేది. అల్పహారంగా కూరగాయలతో నిండిన పోహా వంటివి తీసుకునేది. మధ్యాహ్నం చియా గింజల నీరు, ఓట్స్ తీసుకునేది. సాయంత్రం: గ్రీన్ టీ, మొక్కజొన్న చాట్. ఇక రాత్రికి కూరగాయలతో చేసిన శాండ్విచ్లు, డిటాక్స్ నీరు తీసుకునేది. క్రమం తప్పకుండా ఈ డైట్ని అనుసరించింది. తన అధిక బరువుతో ఎదురవ్వుతున్న ఆరోగ్య సమస్యలు గుర్తొచ్చి చీట్మీల్కి చోటివ్వకుండా నిబద్ధతతో ఆరోగ్యకరమైన డైట్ని అనుసరించింది రాజీ". అలా ఒక్క ఏడాదికే 60 కిలోలు తగ్గి 95కిలోల బరువుకి చేరింది. అయితే వెయిట్ లాస్ జర్నీ మగియలేదని అంతలా 155 కిలోల బరువు ఉన్న తాను ఇంతలా బరువు తగ్గుతానని కలలో కూడా ఊహించలేదని ఆనందంగా చెబుతోంది రాజీ. ఆరోగ్యకరమైన బరువు చేరుకునేవరకు తన వెయిట్ లాస్ జర్నీ ఆగదని సోషల్ మీడియా వేదికగా తన అనుభవాల్ని షేర్ చేసుకుంది. View this post on Instagram A post shared by Rajii Ghanghas (@rajiighanghas) (చదవండి: సింగిల్ పేరెంటింగ్ సవాలుని సులభంగా అధిగమించండిలా..!) -
అప్స్టాక్ సీఈవో వెయిట్ లాస్ జర్నీ: పదివేల అడుగులతో పది కిలోల బరువు..!
బరువు తగ్గేందుకు ఏదో ఒక రీజన్ ఉంటుంది. కొందరికి ఎదుర్కొన్న బాడీ షేమింగ్ అవమానాలు, అనారోగ్యాలు తదితర కారణాలతో బరువు తగ్గడం జరుగుతుంది. మరికొందరూ సెలబ్రిటీలు, ప్రముఖులు స్ఫూర్తితో బరువు తగ్గించుకునే యత్నం చేస్తుంటారు. అయితే ఈ అప్స్టాక్(Upstox) సీఈవో వెయిట్ లాస్ జర్నీ మాత్రం కాస్త విభిన్నం. ఎందుకంటే తండ్రి అవ్వాలన్నా ఆలోచనే.. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా చేసి, ఇలా స్మార్ట్గా మారేందుకు కారణమైంది అని అంటారాయన. మరీ ఆయన ఎలాంటి డైట్, వర్కౌట్లు ఫాలో అయ్యారో చూద్దామా..!.అప్స్టాక్స్ సహ వ్యవస్థాపకుడు(UpStox Co-founder) శ్రీని విశ్వనాథ్(Shrini Viswanath,) తాను తండ్రి అవ్వాలనే కోరిక తన ఫిట్నెస్, ఆరోగ్యంపై దృష్టిసారించేలా చేసిందట. ఆ కొత్త బాధ్యతను తీసుకునేటప్పడు తాను మరింత ఆరోగ్యంగా, ఫిట్గా ఉండటేమ కాకుండా తన బిడ్డకు గ్రేట్గా కనిపించాలనే పిచ్చి కోరిక వల్లే కిలోలు కొద్దీ బరువు తగ్గానంటారు. ప్రస్తుతం తన భార్య ప్రెగ్నెంట్ అని ఆమె కూడా తన ఈ వెయిట్ లాస్(weight loss) జర్నీలో ఎంతో తోడ్పాటును అందించిందని అన్నారు. ఆయన 68 కిలోలు బరువు ఉండేవారట. ఈ వెయిట్ లాస్ జర్నీకి కీలకమైంది అంకితభావం అని అంటారు విశ్వనాథ్. సరైన డైట్, వ్యాయమం క్రమంతప్పకుండా చేస్తే కచ్చితం వందరోజుల్లో పది కిలోలు బరువు తగ్గిపోతారంటున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, బయటి ఫుడ్ఆర్డర్ పెట్టుకోవడం తగ్గిస్తే బరువు అదుపులోనే ఉంటుందట. అలాగే షుగర్కి సంబంధించిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. వాటికి బదులు యాపిల్స్, బేరి, పీచెస్, డ్రైప్రూట్స్ వంటి తీసుకునేవాడినన్నారు. విశ్వనాథ్ ఇష్టమైన కర్రీలను తీసుకున్నాను కానీ వాటిలో వెన్న లేదా నెయ్యి లేకుండా చూసుకున్నానని అన్నారు. భారతీయ ఆహరం సుగంధద్రవ్యాలతో అత్యంత రుచికరంగా ఉంటుంది. ఆ రుచిని ఆరోగ్యప్రదంగా తీసుకుంటే చాలు అని చెబుతున్నారు విశ్వనాథ్. అలాగే తన బరువు గణనీయంగా తగ్గడానికి బాగా ఉపయోగపడింది ఎనమిది వేల నుంచి పది వేల అడుగుల వాకింగ్ అని చెప్పారు. చాలామంది మాత్రం బరువు తగ్గడానికి విపరీతమైన వ్యాయామాలు, గంటలు కొద్ది జిమ్లో గడిపితే చాలనుకుంటారు. కానీ అది సరైంది కాదట. ఆహారపు అలవాట్లలో మంచి స్థిరమైన మార్పులే గణనీయంగా బరువు తగ్గేందుకు తోడ్పడతాయట.వర్క్లైఫ్ బ్యాలెన్స్, ఫిట్నెస్..జీవితం అనేది వ్యక్తిగత శ్రేయస్సు. దీన్ని వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే బ్యాలెన్సు చేయాలి. వ్యాపారం లేదా ఉద్యోగం, కుటుంబం, ఫిట్నెస్ - ఇలా ప్రతిదానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి. కానీ ఏ పనిపై ఉంటే దానిపై మొత్తం దృష్టిని కేంద్రీకరించాలి. ప్రస్తుతం డెస్క్ఉద్యోగాల వల్ల గంటలకొద్దీ కూర్చోవడం ఎక్కువైపుతోంది. అందువల్లే ఆరోగ్య సమస్యలు, అధిక బరువు వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. చిన్న సర్దుబాటుతో ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని అంటున్నారు విశ్వనాథ్. (చదవండి: అంతరిక్షంలోనే ఏడు నెలలు..నడక మర్చిపోయా..!) -
ఆహారంలోని పోషకాలు ఒంటబట్టాలంటే..!
ఆహారం తీసుకున్న తర్వాత అందులోని పోషకాలు ఒంటికి పట్టకపోవడం అన్న కండిషన్ను ‘మాల్ అబ్జార్ప్షన్’ అంటారు. జీర్ణవ్యవస్థలోని ఇన్ఫెక్షన్లు లేదా ఇతర అనేక కారణాల వల్ల ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియలో అందులోని పోషకాలు ఒంటికి పట్టకపోవచ్చు. కొన్నిసార్లు ప్రత్యేకంగా ఏదో ఓ అంశమే ఒంటికి పట్టకపోవచ్చు కూడా. ఉదాహరణకు లాక్జేజ్ అనే ఎంజైము లోపం వల్ల పాలు ఒంటికి పట్టకపోవచ్చు. ఈ కండిషన్ను లాక్టోజ్ ఇన్టాలరెన్స్ అంటారు. కొందరిలో ‘సీలియాక్ డిసీజ్’ లేదా ‘క్రోన్స్ డిజీస్’ అనే రుగ్మతలు ఉన్నప్పుడు ఆహారంలోని అన్ని పోషకాలూ ఒంటికి పట్టకపోవచ్చు. అయితే కారణాలను బట్టి మాల్ అబ్జార్ప్షన్కు చికిత్స అందించాల్సి ఉంటుంది. పోషకాలు ఒంటికి పట్టని ఈ కండిషన్ గురించి తెలుసుకుందాం. ఒంటికి పట్టకపోవడం అనే కండిషన్ కొన్ని సాధారణ పరిస్థితుల కారణంగా రావచ్చు లేదా కొన్నిసార్లు కొన్ని శరీర నిర్మాణపరమైన కారణాలతోనూ ఇలా జరగవచ్చు. మాల్ అబ్జార్ప్షన్ ఎందుకు, ఎలా? తిన్న ఆహారం ఒంటికి పట్టకపోవడం ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు పేగుల్లో ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ ఎలా జరుగుతుందనే పరిజ్ఞానం కొంత అవసరం. సాధారణ పరిస్థితుల్లో ఆహారం జీర్ణమై, ఒంటికి పట్టడాన్ని మూడు దశలుగా చెప్పవచ్చు. అవి... 1) ల్యూమినల్ 2) మ్యూకోజల్ 3) పోస్ట్ అబ్జార్ప్టివ్ ఈ మూడు దశల్లో ఎక్కడ లోపం జరిగినా అది మాల్ అబ్జార్ప్షన్కు దారితీయవచ్చు. ల్యూమినల్ దశలో..ఆహారంలోని కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు... ఇవన్నీ జీర్ణవ్యవస్థల్లోని ఎంజైములు, బైల్లో కలిసి, దాదాపు కరిగిన స్థితిలో ఉంటాయి. ల్యూమినల్ దశలో లోపాలకు ఈ దశలో లోపాలకు ప్రధానంగా ప్రాంక్రియాస్ గ్రంథికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రాంక్రియాటైటిస్, ఏవైనా కారణాలతో ప్రాంక్రియాస్ గ్రంథి తొలగింపు, ప్రాంక్రియాటిక్ క్యాన్సర్ లేదా దేహంలోని కణాలను దెబ్బతీసే సిస్టిక్ ఫైబ్రోసిస్ కారణంగా జరుగుతుంది. దీనివల్ల కొవ్వులను జీర్ణం చేసే లైపేజ్ అనే ఎంజైము తగ్గడంతో కొవ్వులు, ప్రోటీన్లు ఒంటికి పట్టవు.అలాగే ఏవైనా చిన్నపేగు సర్జరీలు జరగడం వల్ల... పైత్యరసం (బైల్)తోపాటు ప్రాంక్రియాటిక్ ఎంజైములు... జీర్ణం కావాల్సిన ఆహారంతో సరిగా, పూర్తిగా కలవకపోవడంతోనూ జీర్ణప్రక్రియలో అంతరాయంతో ఆహారం ఒంటికి పట్టకపోవచ్చు.ఇక చాలా అరుదుగా కొన్నిసార్లు ట్రిప్సినోజెన్, ఎంటెరోజైనేజ్ అనే ఎంజైములను ప్రేరేపించాల్సిన ప్రోఎంజైములు చురుగ్గా లేనందువల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం (అజీర్తి) లేదా తిన్నది ఒంటికి పట్టక΄ోవడం జరగవచ్చు. ఆహారపు ముద్ద... ఓ అరిగిపోయే ద్రవంగా రూపొందకపోవడం (ఇంపెయిర్డ్ మిసెల్లీ ఫార్మేషన్) : ఇది అనేక కారణాల వల్ల జరగవచ్చు. ఉదాహరణకు... కాలేయం దెబ్బతినడం వల్ల లేదా సిర్రోసిస్ కారణంగా తగినంత బైల్ సాల్ట్స్ ఉత్పన్నం కాకపోవడం. స్రవించాల్సిన పైత్య రసానికి (బిలియరీ జ్యూసెస్కు) ఏదైనా అడ్డంకి ఏర్పడటం లేదా కోలోయోస్టాటిక్ జాండీస్ అనే కామెర్ల కారణంగా. ఏవైనా కారణాలతో చిన్న పేగులను శస్త్రచికిత్సతో తొలగించిన పరిస్థితుల్లో పైత్యరస ప్రవాహం సరిగా లేకపోవడం (ఎంటరోపాథిక్ బైల్ సర్క్యులేషన్) చిన్నపేగుల్లో బ్యాక్టీరియా చాలా ఎక్కువగా పేరుకుపోవడంతో పైత్యరసంలో ఉండే సంక్లిష్టమైన నిర్మాణంలోంచి గ్లైసిన్ / టారిన్ అనే అమైనో యాసిడ్స్ తాలూకు మాలెక్యూల్స్ను తొలగించడం. దీన్నే బైల్ సాల్ట్ డీ కాంజ్యుగేషన్ అంటారు. ఇక కొన్నిసార్లు చిన్నపేగుల నిర్మాణ లోపాలతో అక్కడ జీర్ణమైన ఆహారపు కదలికలు సరిగా లేకపోవడం వల్ల, ఆహారపు ముద్ద ఏదైనా కారణాలతో కలుషితం కావడం వల్ల (స్మాల్ బవెల్ కంటామినేషన్), ఆ ప్రాంతంలో బ్యాక్టీరియా అనూహ్యంగా చాలా ఎక్కువగా పెరిగి΄ోవడం వల్ల జరిగే అంతరాయాలతో... ఈ అన్ని కారణాలతో తిన్నది ఒంటికి పట్టకపోవచ్చు. జీర్ణమైన ఆహారాన్ని తీసుకునే లోపలి పొరలోని లోపాలతో లేదా అక్కడ ఉండే బ్యాక్టీరియా (ల్యూమినల్) పెరిగిపోయి, ఆహారం ఇంకడానికి అడ్డంకిగా మారడంతో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు (ఉదాహరణకు విటమిన్–బి12, ఫోలేట్) లాంటివి జీర్ణమయ్యే సామర్థ్యం తగ్గడంతోనూ తిన్నది ఒంటికి పట్టకపోవచ్చు. ఇక విటమిన్ బి12 ఒంటికి పట్టకపోవడం అన్నది ప్రాంక్రియాటిక్ ఎంజైముల లోపం వల్ల జరగవచ్చు.మ్యూకోజల్ దశలో..ఆహారాన్ని దేహంలోకి ఇంకింపజేసుకునేందుకు / లాక్కునేందుకు వీలుగా పేగుల్లోని ఎపిథీలియమ్ కణాలనేవి ఓ పొరలా ఏర్పడి ఉంటాయి. ఇవన్నీ మైక్రో విల్లై అనే చేతివేళ్లలాంటి నిర్మాణాలపై అమరి ఉంటాయి. ఆహారం జీర్ణమయ్యేందుకు చాలా ఎక్కువ ఉపరితలం అవసరమయ్యేలా మైక్రోవిల్లీ అనే వేళ్లవంటి నిర్మాణాల్లో లోపం వల్ల. డైశాకరైడేజ్ అనే ఎంజైము లోపం వల్ల డైశాకరైడ్స్ అనే చక్కెరలు సరిగా జీర్ణకాకపోవడం. ల్యాక్జేజ్ అనే ఎంజైము లోపంతో పాలు సరిగా అరగకపోవడం.ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఎ లోపం వల్ల కొన్ని రకాల పిండి పదార్థాలు జీర్ణం కాకపోవడం. కార్బోహైడ్రేజ్ అనే ఎంజైము లోపం (సుక్రేజ్, ఐసోమాల్జేట్ వంటి వాటి లోపం)తో పిండిపదార్థాల్లోని చెక్కరలు సరిగా అరగకపోవడం.పోషకాలు ఇంకే ప్రక్రియ సరిగా జరగకపోవడం (ఇంపెయిర్డ్ న్యూట్రియెంట్ అబ్జార్ప్షన్) : పుట్టుకతో వచ్చే కొన్ని జన్యులోపాలతోను లేదా ఆ తర్వాత వచ్చే మరికొన్ని సమస్యలతోనూ ఇలా పోషకాలు దేహంలోకి ఇంకే ప్రక్రియ సరిగా జరగకపోవచ్చు. పుట్టుకతోనే వచ్చే లోపాల గురించి చెప్పాలంటే అది గ్లుకోజు–గెలాక్టోజు సరిగా ఒంటబట్టకపోవడం వంటివి. ఇక ఆ తర్వాత వచ్చే సమస్యలంటే... జీర్ణమైన ఆహారాన్ని ఒంటిలోకి ఇంకేలా చేసే ఉపరితలం తగ్గిపోవడం. జీర్ణమైన ఆహారాన్ని దేహంలోకి ఇంకేలా చేసుకునే ఉపరితలం దెబ్బతినడం. (సీలియాక్ స్ప్రూ, ట్రాపికల్ స్ప్రూ, క్రోన్స్ డిసీజ్, ఎయిడ్స్ ఎంటెరోపతి అనే జబ్బుల్లోనూ అలాగే రేడియేషన్ చికిత్స తీసుకునేవారిలో ఇలా జరగవచ్చు. లింఫోమా వంటి కేన్సర్లలో దేహంలోకి జీర్ణాహారం ఇంకడం తగ్గుతుంది. జియార్డియా అనే పరాన్న జీవులూ లేదా ఇతర బ్యాక్టీరియా అనూహ్యంగా అపరిమితంగా పెరిగినప్పుడు జీర్ణమైన ఆహారం ఒంటికి పట్టదు. అలాగే విపుల్ డిసీజ్, క్రి΄్టోస్పోరాడోసిస్, మైక్రోస్పోరిడియోసిస్ వంటి రుగ్మతల్లోనూ తిన్నది ఒంటికి పట్టదు.అబ్జార్ప్టివ్ దశలో..కొవ్వులూ ఇంకా ఇతర కీలకమైన పోషకాలన్నీ లింఫాటిక్ ప్రవాహం నుంచి అలాగే ఎపిథీలియల్ కణాల ద్వారా రక్తప్రవాహంలోకి చేరి దేహంలోని అన్ని భాగాలకూ చేరుకునే ప్రక్రియ జరుగుతుంది. ఒంటికి పట్టే దశ తర్వాతి అంశాల్లో (పోస్ట్ అబ్జార్ప్టివ్ ఫేజ్)...లింఫాటిక్ ప్రవాహంలో ఏవైన లోపాలు ఉన్నప్పుడు (ఇలా పుట్టుకతోనే వచ్చే ఇంటస్టినల్ లింఫాంజియెక్టాసియా, మిల్రాయ్ డిసీజ్ వంటి వ్యాధుల కారణంగా జరగవచ్చు). అలాగే కైలోమైక్రోన్స్, లైపోప్రోటీన్స్ వల్ల తిన్నది ఒంటబట్టక ప్రోటీన్లను కోల్పోవాల్సి రావచ్చు.మాల్ అబ్జార్ప్షన్ లక్షణాలు...కడుపు ఉబ్బుగా మారడం కడుపు పట్టేసినట్లుగా ఉండటం బరువు తగ్గడం కొన్నిసార్లు నీళ్ల విరేచనాలు (డయేరియా) విటమిన్లు, ఖనిజ లవణాల లోపం వల్ల రక్తహీనత (అనీమియా) చర్మం రంగు పాలిపోయి కనిపించడం ∙జుట్టు ఊడి΄ోవడం రే–చీకటివిటమిన్ కె లోపం కారణంగా రక్తస్రావం జరగటం తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ / మానసికంగానూ అలసట ఎముకలు గుల్లబారడం (ఆస్టియోపోరోసిస్) డాక్టర్ విక్టర్ వినోద్ బాబు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ (చదవండి: భారత్ యువకుడిని పెళ్లాడిన గ్రీకు అమ్మాయి) -
ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే ఇలా చేయండి!
శరీరం తేలికగా కదలటానికి, చురుకుగా ఉండటానికి ఎముకలు బలంగా ఉండటం ఎంతైనా అవసరం ఎముకలు బలహీనపడితే.. విరగడం, ఆస్టియోపోరోసిస్ ముప్పు పెరుగుతుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవన శైలిమార్పులతోపాటు, వ్యాయామాన్ని కూడా క్రమం తప్పకుండా చేయాలి. ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి, అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదాన్ని నివారించగల శక్తి అధో ముఖానికి ఉంది. రోజూ ఈ ఆసనాన్ని దినచర్యలో భాగం చేస్తూ ఉంటే మైండ్, బాడీ చురుకుదనం పెరుగుతుంది. ఇలా వేయాలి....∙మ్యాట్ పైన లేదా నేలపైన నిటారుగా నిల్చొని చేతులను పైకి స్ట్రెచ్ ఉంచాలి. తర్వాత నడుం భాగం వంచుతూ, చేతులను పూర్తిగా నేలమీద ఆనించాలి. ∙చేతులను పాదాలకు దూరంగా తీసుకెళుతూ త్రికోణాకారంలో ఉండాలి.కాలి వేళ్ల మీద ఉంటూ మడమలను పైకి లేపాలి. శరీర బరువు చేతులు, కాలి ముని వేళ్ల మీద ఉంటుంది. ∙నిమిషం సేపు ఇదే భంగిమలో ఉండాలి. తిరిగి యధాస్థితికి రావాలి. ఇలా ఒకటి నుంచి 3 సార్లు ఈ ఆసనాన్ని పునరావృతం చేయాలి.ఈ ఆసనం వేయటానికి మొదట్లో కాస్త కష్టంగా వున్నా రోజూ సాధన చేస్తూ ఉంటే సులువవుతుంది. వెన్నెముక, కాళ్ళను బలోపేతం చేస్తుంది. అదే విధంగా ఏకాగ్రత పెంచి, ఒత్తిడి నుండి రిలీఫ్ని ఇస్తుంది. అజీర్తి సమస్యలు దూరమవుతాయి. నడుము నొప్పి తగ్గుతుంది. ఆస్టియోపోరోసిస్ సమస్య నుండి రక్షిస్తుంది. సైనస్, ఆస్తమా, పీరియడ్స్లో వచ్చే సమస్యల నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇన్ని ప్రయోజనాలని ఈ ఆసనం ద్వారా పొందవచ్చు. ఎముకలు దృఢంగా ఉండటానికి ఏం చేయాలి?ఎముకలు దృఢంగా ఉండాలంటే.. సమతుల్య, పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి.కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు సమృద్ధిగా లభించే ఆహారం తినాలి.పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు తినాలి.విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారాలు తినాలి.బాల్యంలో ఎముకలు దృఢంగా ఉండటానికి పోషకాలు తీసుకోవడం ముఖ్యం.వ్యాయామం చేయడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.మెనోపాజ్ దాటిన స్త్రీలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.ఎముకలు, కండరాలను బలోపేతం చేసేలా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.ఇదీ చదవండి: టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి -
సంక్రాంతికి వస్తున్నాం ‘అప్పడాలు’ కాదు... సోషల్ మీడియాను షేక్ చేస్తున్నవీడియో!
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కామెడీ పండించిన ‘బుల్లిరాజు’ గుర్తున్నాడా? ‘‘అప్పడాలు వడియాలు అయ్యాయా’’అంటూ చెప్పిన కొన్ని డైలాగులు సోషల్ మీడియాను షేక్ చేశాయి. థియేటర్ లో నవ్వులు పూయించిన బుల్లిరాజు క్యారెక్టర్ విమర్శల పాలయ్యింది. పిల్లాడితో బూతు డైలాగులా అంటూ జనం మండిపడ్డారు. ఇప్పుడు ఇదంతా ఎందుకూ అంటే...అక్కడికే వస్తున్నా... అప్పడాలు, వడియాలతోపండగ చేసుకుంటున్న నెటిజనుల దృష్టిలో అప్పడాలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. పప్పు, సాంబారు, అప్పడాలు కాంబినేషన్ ఎంత ఫ్యామస్సో తెలుసు కదా. చాన్స్ దొరికితే కరకరమనే అప్పడాలను ఇంకో రెండు వేసుకుని మరీ లాగించేస్తాం. అయితే ఈ అప్పడాలను ఎలా తయారు చేస్తారో ఎపుడైనా ఆలోచించారా? దీనికి సంబంధించిన ఒక వీడియోపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది.అప్పడాల్లో చాలా రకాలు మార్కెట్లో లభిస్తుంటాయి. బియ్యం పాపడ్, మసాలా పాపడ్, కలి మిర్చ్ పాపడ్, రాగి పాపడ్, వెల్లుల్లి పాపడ్, సాబుదానా పాపడ్, అబ్బో ఇలా చాలా రకాలే ఉన్నాయి. ఈ అప్పడాలు లేనిదే ఫంక్షన్స్, పార్టీలు సంపూర్ణం కాదంటే అతిశయోక్తి కాదు. అయితే అప్పడాలను తయారు చేస్తున్న వీడియో ఒకటి ట్విటర్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం ఒక పెద్ద గిన్నెలో అప్పడాల పిండి కలిపి ఉంది. దీని ఆవిరి మీద ఉడికేలా.. వేడినీటి గిన్నెపై ఉన్న మూతపై పూతలా వేసింది ఒక మహిళ.దాన్ని తీసి ఒకచోట పేర్చింది. ఆ తర్వాత వరుసగా పేర్చిన వాటిపై పదునైన గుండ్రటి స్టీల్ డబ్బాల సాయంతో కాళ్లతో తొక్కుతూ పెద్ద అప్పడంపై ఒత్తిడి పెంచి, దాన్ని గుండ్రటి అప్పడాలుగా తయారు చేశారు. అలా ఒక్కోటి వేరు వేరుగా తీసి వాటిని ఎండబెట్టడం ఈ వీడియోలు చూడవచ్చు.తేజస్ పటేల్ అనే యూజర్ దీన్ని ఎక్స్లో షేర్ చేశారు. కష్టపడి పనిచేస్తున్నారు... కానీ శుభ్రతగురించి పట్టించుకోవడం లేదు అన్నట్టుగా కమెంట్ చేశారు. ఇలాంటి వాటిని తినడం తినకపోవడం మీ ఇష్టం అన్నట్టుగా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు విభినంగా స్పందించారు. కాళ్లతో తొక్కడం తప్ప అంతా బానే ఉందని కొందరు, అప్పడం రుచిలోని రహస్యం అదే అంటూ వ్యాఖ్యానించారు. ( టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి)Very hardworking ppl, let's support. Why care about hygiene🤡 pic.twitter.com/4HmsxZIgWC— Tejas Patel (@237Stardust) January 22, 2025ఫాస్ట్ ఫుడ్, హోటల్స్లో పాటించే శుభ్రత కంటే బెటరేగా?గతంలో ఇలాంటి వీడియో ఒకటి ఇన్స్టాలో చర్చకు తెరతీసింది. దీనిపై చాలామంది విమర్శలు గుప్పించినప్పటికీ, చాలామంది సమర్ధించారు. "ఫాస్ట్ ఫుడ్" కంటే మెరుగే అని కొందరు "చాలా హై-ఎండ్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ కంటే ఇది చాలా బెటర్ అని ఒకరు,"కనీసం ఈ మహిళ అప్పడాలపై డైరెక్ట్గా పాదం పెట్టకుండా తగినంత జాగ్రత్త పడుతోంది.. ఇంత కంటే ఘోరంగా చాలా హోటల్స్ ఉంటాయి అంటూ ఇంకొందరు అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. View this post on Instagram A post shared by Karansingh Thakur (@dabake_khao)అప్పడం ఒక ఎమోషన్సౌత్ ఇండియాలో అప్పడాలు, వడియాలు విందు భోజనాన్ని అస్సలు ఊహించలేం. అప్పడాలలో ఫైబర్, ప్రోటీన్, ఇతర మంచి పోషకాలు వుంటాయి. జీవక్రియను ప్రోత్సహించేందుకు అప్పడాలు దోహదపడతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించగల శక్తి అప్పడాలకు వుంది.అయితే ఇటీవల ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో ఆయిల్ లేకుండా వేయించుకునే అప్పడాలు కూడా వచ్చాయి ఎందుకంటే అప్పడాలతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వున్నాయి ముఖ్యంగా ఆయిల్లో వేయించడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. రక్తపోటు, గుండె జబ్బుల నుంచి క్యాన్సర్ వరకు ముప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. సో.. చాయిస్ ఈజ్ యువర్స్. -
బరువు తగ్గాలనుకుంటున్నారా..? హెల్ప్ అయ్యే టిప్స్ ఇవిగో..
బరువు తగ్గాలని(Losing weight) చాలామంది అనుకుంటారు. అయితే కొత్తగా ప్రారంభించేవారికి ఏది మంచిది, ఎలాంటి డైట్ బెటర్ అనే గందరగోళానికి గురవ్వతుంటారు. అందుకు తగ్గట్టుగానే విభిన్నమైన డైట్లు సోషల్ మీడియాల్లో ఊదరగొట్టేలా వైరల్ అవుతున్నాయి. దీంతో సవ్యంగా సరైనది ఎంచుకోలేక తంటాలు పడుతున్నారు. అలాంటి వాళ్లు ఇన్స్టాగ్రామ్ యూజర్ భవ్య చెప్పే డైట్ అండ్ ఫిట్నెస్ హెల్ప్ అవుతాయి. అందుకు ఆమె అనుభవమే ఓ ఉదాహరణ. ముఖ్యంగా కొత్తగా వెయిట్ లాస్ జర్నీ(Weight loss journey)కి ఉపక్రమించేవాళ్లకు మరింత ఉపయోగపడతాయని నమ్మకంగా చెబుతోంది భవ్య. అవేంటో చూద్దామా..!.భవ్య కూడా దగ్గర దగ్గర 75 కేజీల బరువు ఉండేదట. తాను ఎలాగైన బరువు తగ్గాలని శ్రద్ధగా తీసుకున్న బేసిక్ డైట్, వర్క్ట్లు ప్రభావవంతంగా పనిచేశాయట. దీంతో ఆమె ప్రస్తుతం 60 కేజీల బరువుతో ఫిట్గా కనిపిస్తోంది. తాను ఎలాంటి డైట్, ఫిట్నెస్ వర్కౌట్లు ఫాలో అయ్యిందో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. వెయిట్ లాస్ జర్నీకి ఉపకరించే బేసిక్స్..డైట్ ఎలా ఉండాలంటే..కలర్ఫుల్ ఫ్రూట్స్, కూరగాయాలను తప్పనిసరిగా ప్రతీ భోజనంలో ఉండేలా చూసుకోవడం. లీన్ ప్రోటీన్ కోసం చికెన్, చేప, టోఫు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ ప్రోటీన్లు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.బియ్యం, క్విననో, ఓట్స్ వంటి వాటిని తీసుకోవాలి. వర్కౌట్లు..వామ్ అప్ వ్యాయామాలతో ప్రారంభించి, ఐదు నుంచి పదినిమిషాలు కార్డియో ఎక్సర్సైజులు చేయాలి. ముప్పై నుంచి నలభై నిమిషాలుపుష్అప్, స్క్వాట్స్, లేదా శక్తిమంతమైన వ్యాయామాలు చేయాలి. ఈ వర్కౌట్లు పూర్తి అవ్వగానే బాడీ ఫ్లెక్సిబిలిటీ, మానసిక ప్రశాంతత కోసం యోగా వంటివి చేస్తే బెటర్ అని చెబుతోంది భవ్య.వీటన్నింటి తోపాటు బాడీ హైడ్రేటెడ్గా ఉండేలా రెండు నుంచి మూడు లీటర్లు నీళ్లు తీసుకోవాలి. అలాగే తక్కువ క్వాండిటీలో ఎక్కువ సార్లు తీసుకుంటే అలసటకు గురవ్వమని చెబుతోంది భవ్య. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవతోంది. View this post on Instagram A post shared by Bhavya .ೃ࿔ ✈︎ *:・ (@avgeek.bhavya) (చదవండి: ఆ డాక్టర్ డేరింగ్కి మతిపోవాల్సిందే..! వామ్మో మరీ ఇలానా..) -
ఏజ్.. ఇక్కడ జస్ట్ నంబరే!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి / జహీరాబాద్: జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పులతో నేడు మూడు పదుల వయసు వచ్చేసరికే బీపీ, షుగర్, గుండె సంబంధ ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కానీ, కొన్ని గ్రామీణ ప్రాంతాలు నేటికీ ఆరోగ్య సిరులతో విలసిల్లుతున్నాయి. పది పదుల వయసు దాటిన వృద్ధులు సైతం నవ యువకుల్లా పనులు చేసుకుంటున్నారు. తమ ఆహారపు అలవాట్లే అందుకు కారణమని వారు చెబుతున్నారు. చిరు ధాన్యం మహాభాగ్యండెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) స్వచ్ఛంద సంస్థ 4 దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ వస్తోంది. ఝరాసంగం, రాయికోడ్, న్యాల్కల్, కోహీర్, మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాల్లోని సుమారు 40 గ్రామాల్లో 5 వేల మంది మహిళా రైతులను సంఘటితం చేసి సేంద్రియ విధానంలో చిరుధాన్యాలను సాగు చేసేలా ప్రోత్సహిస్తోంది. కొర్రలు, సామలు, అండుకొర్రలు, పచ్చ జొన్నలు, సాయిజొన్నలు, కంది, మినప, పెసర వంటి పంటలు సుమారు రెండు వేల ఎకరాల్లో సాగు చేయిస్తున్నారు. ఇందులో పోట్పల్లి, మోడ్ తండా గ్రామాలూ ఉన్నాయి.ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ సిరిధాన్యాల (మిల్లెట్స్)ను సాగు చేయడంతో పాటు, వాటినే నిత్యం ఆహారంగా తీసుకుంటున్న ఆ గ్రామాల వాసులు సంపూర్ణ ఆరోగ్యంతో జీవనం కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఏటా జరిగే పాత పంటల జాతర నేపథ్యంలో ఝరాసంఘం మండలం పోట్పల్లి, జహీరాబాద్ మండలం మోడ్ తండా గ్రామాల్లో ‘సాక్షి’బృందం నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. పాత పంటల జాతరఈ ప్రాంతంలో ఏటా నిర్వహించే పాత పంటల జాతర ఈ నెల 14న న్యాల్కల్ మండలంలోని వడ్డీ గ్రామం నుంచి ప్రారంభమైంది. ఫిబ్రవరి 11న ఝరాసంగం మండలం మాచ్నూర్లో ముగుస్తుంది. జాతర 24 గ్రామాల్లో జరగనుంది. ఎడ్ల బండ్లలో చిరుధాన్యాలను ప్రదర్శిస్తూ వాటి ప్రాధాన్యత గురించి ఈ జాతరలో ప్రచారం చేస్తున్నారు.విలేజ్ ప్రొఫైల్స్.. గ్రామం: పోట్పల్లి (ఝరాసంఘంమండలం,సంగారెడ్డి జిల్లా) జనాభా:2,263 ప్రధాన వృత్తి: వ్యవసాయం (సుమారు 90 శాతం) బీపీ, షుగర్ ఉన్నవారు సుమారు పదిమంది లోపే..గ్రామం:మోడ్ తండా (జహీరాబాద్ మండలం,సంగారెడ్డి జిల్లా) జనాభా: 192 ప్రధాన వృత్తి : వ్యవసాయం బీపీ, షుగర్ ఉన్న వారు కేవలం ఇద్దరే.వారికి రోగాలు తక్కువే.. పోట్పల్లి, ఎల్గొయ్ గ్రామాల్లో వ్యాధుల బారిన పడినవారి సంఖ్య చాలా తక్కువ. వీరు నిత్యం జొన్నరొట్టె, కందిపప్పుతో పాటు, కొర్రలు, సామలు తింటుంటారు. అందుకే వయసు మీదపడినా ఆరోగ్యంగా ఉంటున్నారు. – ఆలీస్, ఏఎన్ఎం, ఎల్గొయ్ సబ్ సెంటర్అత్తల నుంచి కోడళ్లకు బదిలీ చిరుధాన్యాల సాగును ముందుకు తీసుకెళ్లేందుకు అత్తల నుంచి కోడళ్లకు వ్యవసాయాన్ని బదిలీ చేయించుకున్నాము. వేయి మందికి పైగా కోడళ్ల సంఘంలో సభ్యులు ఉన్నారు. భూమి కౌలుకు తీసుకుని మూడు ఎకరాల్లో సాయిజొన్న పంట వేసుకున్నా. –మొగులమ్మ, పోట్పల్లి, కోడళ్ల సంఘం అధ్యక్షురాలుఈయన పేరు బోంగూరు స్వామిదాసు. సంగారెడ్డి జిల్లా పోట్పల్లికి చెందిన స్వామిదాసు వయసు 75 ఏళ్లు. దశాబ్దాలుగా తన పొలంలో పాత పంటలు (మిల్లెట్స్) సాగు చేస్తూ, వాటినే ఆహారంగా తీసుకుంటుండటంతో ఎలాంటి అనారోగ్యం లేకుండా ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటున్నానని చెబుతున్నారు. కొర్రబువ్వ, జొన్నరొట్టెను ఆహారంగా తీసుకుంటున్నానని చెప్పారు.వందేళ్ల వయసు దాటిన ఈయన పేరు గర్మూనాయక్. భార్య జాలీబాయికి కూడా తొంౖభైæ ఏళ్లు ఉంటాయి. మోడ్ తండాకు చెందిన ఈ దంపతులు ఇప్పటికీ స్వయంగా మేకలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్ననాటి నుంచి పచ్చజొన్న, సాయిజొన్న, సజ్జరొట్టెలు, తైద అంబలి, కంది, మినప పప్పు తినడమే తమ ఆరోగ్య రహస్యమని చెబుతున్నారు.ఇంటి ముందు సానుపు (కల్లాపి) చల్లుతున్న ఈ వృద్ధురాలు మన్నెల్లి దానమ్మ. సుమారు 70 ఏళ్ల వయసున్న ఈమెకు సంతానం లేదు. ఇప్పటికీ తన పని తాను చేసుకుంటోంది. చిన్నప్పటి నుంచి కొర్రబువ్వ, సామలు, తైద అంబలి, సాయిజొన్న రొట్టెలు తినటం వల్లనే ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నట్లు చెబుతోంది. -
మూడు పూటలా భోజనం, నడకతో ఏకంగా 124 ఏళ్లు..!
అత్యంత కాలం బతికిన శతాధిక వృద్ధులను చూస్తే..వారి ఆరోగ్య రహస్యం ఏంటని కుతూహలంగా ఉంటుంది. వారి దీర్ఘాయువుకి కారణం.. క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని క్లియర్గా స్పష్టమవుతోంది. ఇంతవరకు జపాన్, బ్రెజిల్లోని శతాధిక వృద్ధ మహిళలు, వారి హెల్త్ సీక్రెట్ల గురించి విన్నాం. ఇప్పుడు వారందర్నీ వెనక్కినెట్టి అత్యంత శతాధిక వృద్ధురాలికి నిలిచి ఆశ్చర్యపరుస్తోంది ఈ చైనా బామ్మ. అయితే ఈ బామ్మ ఇప్పటికీ తన పనులను తానే చేసుకుంటోందట. మిగతా శతాధిక వృద్ధ బామ్మల మాదిరిగా ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో జాయిన్ అవ్వకపోవడం విశేషం. అయితే ఈ బామ్మ ఆరోగ్య రహస్యం ఏంటో తెలిస్తే విస్తుపోవడం ఖాయం. ఆ బామ్మ ఎవరంటే..చైనా(China)కు చెందిన క్వి చైషి(Qiu Chaishi) అనే బామ్మ. ఆమె వలసవాద సెమీ ఫ్యూడల్ పాలనకు గుర్తుగా నాటి క్వింగ్ రాజవంశ పాలకుల హయాంలో 1901లో జన్మించింది. జనవరి 1న 124వ పుట్టిన రోజున జరుపుకుంది. అప్పుడే రుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో ఉన్న నాన్చాంగ్ నగరం అత్యంత శతాధిక వృద్ధులలో ఆమె కూడా ఒకరిగా క్విచైషి బామ్మను గుర్తించింది.ఆమెకు ఏకంగా 60 ఏళ్ల వయసున్న మనవరాలు ఉంది. తన తరంలోని అత్యంత చిన్న కుటుంబ సభ్యురాలు వయసు ఎనిమిది నెలల చిన్నారి అట. ఇక ఆమె సుదీర్ఠకాల ఆరోగ్యం రహస్యం ఏంటంటే..హెల్త్ సీక్రెట్..తన సుదీర్ఘకాల(Longevity) జీవన రహస్యం క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అని నమ్మకంగా చెబుతోంది. రోజూ మూడుపూటల భోజనం(Lard Rice) చేస్తుందట. అయితే భోజనం తర్వాత నడక(Walks) తప్పనిసరి అని చెబుతోంది క్విచైషి. అలాగే రాత్రి 8 కల్లా నిద్రపోతుందట. ఇప్పటకీ తన పనులన్నీ చకచక చేసుకుంటుందట. తల దువ్వుకోవడం దగ్గర నుంచి స్టవ్ వెలిగించడం, పెంపుడు జంతువులను పెంచడం, మెట్లు ఎక్కడం తదితర అన్ని పనులను సునాయాసంగా చేసేస్తుందట. తనకు ఇష్టమైన వంటకాల గురించి కూడా షేర్ చేసుకుంది. ఆమెకు గుమ్మడికాయ, శీతాకాలపు పుచ్చకాయ, మొక్కజొన్న పిండితో చేసే గంజి, పందికొవ్వు అంటే మహా ఇష్టమట. కానీ పంది కొవ్వుని మాత్రం వైద్యుల సలహా మేరకు మితంగా తీసుకుంటున్నట్లు తెలిపింది. నిజంగా ఈ బామ్మ ఆరోగ్యపు అలవాట్లు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఈ బామ్మ మాములు గ్రేట్ కాదు, అంతకు మించి అని ప్రశంసించకుండా ఉండలేం కదా..!.(చదవండి: ఇంతలా 'కృతజ్ఞత' చూపించడం అందరి వల్ల కాదేమో..!) -
2025లో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ..బెస్ట్ టిప్స్!
చిరకాలం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం చాలా ముఖ్యం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. 2025లోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, జీవనశైలి మార్పులు ఆరోగ్యంపై ఎంత ప్రభావితం చేస్తాయనే దానిపై పెరుగుతున్న అవగాహనతో, ప్రోటీన్లు, ఒమేగా-3లు, విటమిన్లు , ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలకు ప్రాధాన్యత గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఇదే మన భవిష్యత్ ఆనందానికి, ఆరోగ్యానికి బలమైన పెట్టుబడి.పోషకాహారం అంటే కేలరీలను లెక్కించడం గురించి మాత్రమే కాదు. అది శరీరానికి ఎంత అవసరమో తెలుసుకోవడం. ఆరోగ్యంగా ఉండటానికి శక్తితోపాటు సూక్ష్మపోషకాల కోసం సరైన మాక్రోన్యూట్రియెంట్లు ఉండేలా చూసుకోవాలంటున్నారు. అబాట్, న్యూట్రిషన్ బిజినెస్, మెడికల్ & సైంటిఫిక్ అఫైర్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతి ఠాకూర్. ఆహారపు అలవాట్ల పట్ల మరింత శ్రద్ధ వహిస్తున్నందున, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇది ఆరోగ్యకరమైన ఆహార విధానాలకు దారితీస్తుంది. ముఖ్యంగా నోటి పోషక పదార్ధాలు (ONS) పోషకాహార లోపాలను పూరించడానికి, పోషకాహార లోపాన్ని నివారించడానికి సహాయపడుతంది. ముఖ్యంగా ఆకలి లేని వారికి, పోషకాహార లోపం ఉన్నవారికి,పోషకాలను గ్రహించడంలో ఇబ్బంది ఉన్న వ్యక్తులకు ఇది సాయపడుతుంది.పోషకాహారం & అభివృద్ధి చెందుతున్న పోషక అవసరాలను అర్థం చేసుకోవడంపోషకాహారం అంటే ఏంటి అనేది అస్పష్టంగా ఉండిపోతున్నప్పటికీ, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి పోషకాహారం చాలా అవసర అనేది మనందరికీ తెలుసు. శాకాహారం పాలియో డూట్, గ్లూటెన్-రహిత , కీటో డైట్ వంటివి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇందులో దేన్ని ఎంచుకోవాలనేది కష్టంగా అనిపించినా, సమతుల్యమైన ఆహారం అందరికీ శ్రయస్కరం అనేది అధ్యయనాలతోపాటు అందరూ అంగీకరించే విషయం.ఎదుగుతున్న క్రమంలో వివిధ దశల ఆధారంగా పోషక అవసరాలు పెరుగుతాయి. ఉదాహరణకు, పిల్లలకు పెరుగుదలకు అధిక మొత్తంలో కొన్ని పోషకాలు అవసరం, పెద్దలు కండబలం, ఎముక సాంద్రతను నిర్వహించడంపై దృష్టి పెట్టాలి. అదే వద్ధులైతే కండరాల నష్టాన్ని నివారించేలా, ఎక్కువ ప్రోటీన్ , అభిజ్ఞా పనితీరును నిర్వహించడానికి విటమిన్డీ, బీ 12 అదనపు విటమిన్లు అవసరం పడుతుంది. ఈ మార్పులను గుర్తించడం అనేది చాలా ముఖ్యమైనది.పెద్దల ఆహారం-ముఖ్యమైన పోషకాలుప్రోటీన్: ఇది కండరాల మరమ్మత్తుకు పెరుగుదలకు మద్దతు ఇస్తుంది . పప్పు (కాయధాన్యాలు), చిక్పీస్, కిడ్నీ బీన్స్ (రాజ్మా), పనీర్ (కాటేజ్ చీజ్), గుడ్లు ,చికెన్ ద్వారా దీన్ని పొందవచ్చు.కార్బోహైడ్రేట్లు: శరీరానికి ప్రాథమిక శక్తి వనరు అయిన కార్బోహైడ్రేట్లు సాధారణంగా బియ్యం, గోధుమ రోటీ, పోహా, ఓట్స్, చిలగడదుంపల్లో లభిస్తాయి.ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు: గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంతోపాటు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి అవిసె గింజలు (ఆల్సి), వాల్నట్లు, ఆవనూనె , ఇండియన్ మాకేరెల్ (బంగ్డా) లేదా రోహు వంటి చేపల ద్వారా అందుతాయి.ఫైబర్: ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. బ్రౌన్ రైస్, మిల్లెట్ వంటి తృణధాన్యాలు, జామ ,ఆపిల్ వంటి పండ్లు, పాలకూర , బ్రోకలీ వంటి కూరగాయలు, ఇంకా సైలియం పొట్టు (ఇసాబ్గోల్)లో లభిస్తుందివిటమిన్లు:విటమిన్ డి: ఎముకల ఆరోగ్యానికి కాల్షియం శోషణకు సహాయపడుతుంది. పాలు, పెరుగు,సూర్యకాంతి ద్వారా పొందవచ్చువిటమిన్ ఇ: యాంటీఆక్సిడెంట్, కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. బాదం, పొద్దుతిరుగుడు గింజలు, ఆవ ఆకూరలో ఉంటుంది.విటమిన్ సి: రోగనిరోధక పనితీరుకు,ఆరోగ్యానికి అవసరం, నారింజ ,యు నిమ్మకాయలు, ఆమ్లా (ఇండియన్ గూస్బెర్రీ), జామ వంటి సిట్రస్ పండ్లలో లభిస్తుందివిటమిన్ బి6: మెదడు ఆరోగ్యం , జీవక్రియకు ముఖ్యమైనది, అరటిపండ్లు, బంగాళాదుంపలు, పొద్దుతిరుగుడు విత్తనాలలో లభిస్తుందివిటమిన్ బి12: నాడీ పనితీరుకు, రక్త కణాల ఉత్పత్తికి ముఖ్యమైనది, పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు,బలవర్థకమైన తృణధాన్యాలలో లభిస్తుందిఖనిజాలు:కాల్షియం: ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది, పాలు, పెరుగు, రాగి (Finger millets) నువ్వుల గింజల్లో ఎక్కువ లభిస్తుంది.ఐరన్: జీవక్రియ ప్రక్రియలకు మద్దతు ఇస్తుంది. పాలకూర, మెంతి ఆకులు ((Fenugreek), బెల్లం (గుర్), పప్పుధాన్యాలు (పప్పు) ద్వారా లభిస్తుందిజింక్: రోగనిరోధకశక్తి, గాయాలను నయం చేయడంలో సాయపడుతుంది. గుమ్మడికాయ గింజలు, చిక్పీస్ . బజ్రా వంటి తృణధాన్యాలలో లభిస్తుంది.రోజువారీ భోజనం ఎలా ఉండాలంటే..సామెత చెప్పినట్టుగా "రాజులాగా అల్పాహారం, యువరాజులాగా భోజనం, బిచ్చగాడిలా రాత్రి భోజనం’’ ఉండాలి. కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్లు ఎక్కువ ఉండాలి. కొవ్వులు జీర్ణం కావడం కష్టం కాబట్టి, వాటిని అల్పాహారం , భోజనంలో తీసుకోవాలి. అరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి భోజనం తేలిగ్గా ఉండాలి. ఆహారానికి మధ్యలోచాలా విరామం తర్వాత తీసుకునే భారమైన అల్పాహారం శక్తివంతమైందిగా ఉండాలి. అయితే పరగడుపున శరీరంలోని మలినాలను బైటికి పంపేందుకు గోరువెచ్చని నీరుతాగిలి. సీజన్ను బట్టి కూరగాయలు, పప్పుధాన్యాల నుండి తయారు చేసిన పోహా, ఉప్మా, దోస, ఇడ్లీ లేదా చీలా పవర్పేక్డ్ కార్బోహైడ్రేట్స్ను తీసుకోవచ్చు.2025లో చిన్న చిన్న మార్పులు, భారీ లాభాలు చిన్న మార్పులు మన మొత్తం ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలకు దారితీస్తాయిసమతుల ఆహారంపై దృష్టిపెట్టడంప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడంహైడ్రేడెట్గా ఉండటం, అంటే రోజుకు సరిపడినన్ని నీళ్లు తాగడం.పోషకాహారం తీసుకుంటూ ఎముకలు కండరాల బలాన్ని పెంచుకునేందుకు క్రమం తప్పని వ్యాయామం. ఆరోగ్య సంరక్షణలో శారీరక శ్రమ చాలా కీలకం. వారానికి కనీసం రెండుసార్లు బలమైన వ్యాయామాల వల్ల సమతుల్యత మెరుగుపడుతుంది. నడక, ఈత లేదా యోగా వంటివి ఫిట్నెస్కు దోహదం చేస్తాయి.ఈ ఏడాదిలో ఆరోగ్యకరమైన జీవనంపై దృష్టి పెడదాం. శరీరానికి బలాన్నిచ్చే ఆహారాన్ని, చురుకునిచ్చే వ్యాయామాలను, సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించే మార్పులను స్వీకరిద్దాం. తద్వారా సమిష్టిగా జీవితాన్ని ఆరోగ్యకరంగా, సంతోష కరంగా మార్చుకుందాం. ఇదీ చదవండి: కొత్త బంగారు లోకం.. అనాథ చిన్నారులకు ఆహ్వానం -
ఆరోగ్య.. సంతాన ప్రదాత : మల్లూరు నరసింహస్వామి
హిరణ్యకశిపుడి ఆగడాలను అంతమొందించడానికి భక్త ప్రహ్లాదుడికి ముక్తిని ప్రసాదించడానికి శ్రీహరి ఎత్తిన అవతారమే నరసింహావతారం. ఆ నృసింహ దేవుడు తన ఉనికిని చాటుకోవడానికి అనేక క్షేత్రాలలో అవతరించాడు. అలాంటి పుణ్య క్షేత్రాలు తెలుగు రాష్ట్రాలలో తొమ్మిది ఉన్నాయి. వాటినే మనం నవ నరసింహ క్షేత్రాలని పిలుస్తున్నాం.. ఆ నవ నరసింహ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా మల్లూరు హేమాచల లక్ష్మి నరసింహ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. వరంగల్ జిల్లా మంగ పేట మండలంలో ఉన్న ఈ క్షేత్రంలో స్వామి హేమాచల లక్ష్మి నరసింహస్వామిగా పూజాదికాలు అందుకుంటున్నాడు. సంతాన, ఆరోగ్య ప్రదాతగా విశేష ఖ్యాతిగడించాడు స్వామి. వరంగల్ పట్టణానికి 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అటవీ వనాలు కొండలు మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోంది. మల్లూరు గ్రామానికి ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ ఆలయం హేమాచలం అనే కొండ మీద అలరారుతోంది. హేమాచల నరసింహ స్వామిని దర్శించుకోవడం వల్ల సమస్త శత్రు బాధలు తీరుతాయంటారు.ఇక్కడి స్వామి వారి మూర్తి అయిదు వేల సంవత్సరాల నాటిదని ఇక్కడి ఆధారాల ద్వార తెలుస్తోంది. సాక్షాత్తు దేవతలే ఇక్కడ స్వామివారిని ప్రతిష్టించినట్లు చెబుతారు. గర్భాలయంలో స్వామి వారి మూర్తి మానవ శరీరంలా మెత్తగా దర్శనమిస్తుంది . స్వామి వారి ఛాతీ మీద రోమాలు దర్శనమిస్తాయి. అలాగే స్వామి వారి శరీరాన్ని ఎక్కడ తాకినా మెత్తగా ఉంటుంది. ఉదర భాగం కూడా మానవ శరీరంలా మెత్తగా ఉండి.. మనుషులకు వచ్చినట్టే చెమట కూడా వస్తుంది. స్వామి వారి నాభి భాగంలో ఓ రంధ్రం దర్శనమిస్తుంది. దీనినుంచి నిరంతరం ఓ ద్రవం కారుతుంటుంది. దీనిని అదుపు చేయడానికి ఆ భాగంలో గంధాన్ని పూస్తారు. పూర్వకాలంలో స్వామి వారి విగ్రహాన్ని తరలించినపుడు, బొడ్డు దగ్గర ఇలా రంధ్రం పడిందంటారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆ బొడ్డు భాగంలో ఉంచిన గంధాన్నే ప్రసాదంగా ఇస్తారు.ఆరోగ్యామృతం ఆ నీరుఇక స్వామివారి పాదాల చెంత నుంచి నిత్యం ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది. దానినే చింతామణి జలధారగా పిలుస్తారు. ఈ నీరు కొద్ది కొద్దిగా కొన్ని రోజుల ΄ాటు తాగితే అన్ని రోగాలూ తగ్గిపోతాయనీ ఆ జలం సర్వ రోగ నివారిణి అనీ, భక్తులు విశ్వసిస్తారు స్వామి పాదాల నుంచి వచ్చే ఆ నీరు చింతామణి జల పాతాన్ని సమీపించే లోపు అనేక ఔషధ విలువలు గల చెట్ల క్రింది నుండి రావడం వల్ల ఆ నీటికి అంతటి శక్తి పెంపొందిందని అంటారు. రాణి రుద్రమదేవి అనారోగ్యానికి గురైన సమయంలో ఈ జలపాతంలోని నీటిని తాగడంతో ఆమె అనారోగ్యం నుంచి కోలుకుందని, ఆ తర్వాత అక్కడి నీటి విశిష్ఠత తెలుసుకున్న రుద్రమదేవి ఆ జలపాతానికి చింతామణి అనే పేరు పెట్టింది. చింతామణి జలధార నీటిని ఇప్పుడు కూడా విదేశాలలో ఉన్న తమ వారికి కూడా పంపిస్తూ ఉంటారు స్థానికులు, క్షేత్రాన్ని సందర్శించిన వారు. ఈ జలపాతానికి సమీపంలో మహా లక్ష్మి అమ్మవారి పురాతన మందిరం ఉంది. చింతామణి జల పాతానికి సమీపంలో మరో చిన్ని జల పాతం ఉంది.ఎలా చేరుకోవాలి?ములుగు జిల్లాలోని మల్లూరు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో హేమాచల నరసింహస్వామి ఆలయం ఉంది. మల్లూరు క్షేత్రానికి వరంగల్ నుంచి నేరుగా చేరుకోవచ్చు. అలాగే ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణానికి కూడా ఇది సమీపంలో ఉండడం వల్ల మణుగూరు నుంచి కూడా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.– భాస్కర్ -
అది ఒబెసిటీ కాదట..!15 ఏళ్ల తర్వాత..
ఇన్నాళ్లుగా అనుకున్నట్లుగా ఒబెసిటీ అంటే అది కాదట. దశాబ్దాలు అలానే తప్పుగా భావించమని తేల్చి చెప్పారు వైద్యులు. అసలు ఒబెసిటీ అంటే ఏంటో..అందుకు సంబంధించిన సరికొత్త మార్గదర్శకాలను అందించారు నిపుణులు. మరీ ఒబెసిటీ అంటే ఏంటంటే..దశాబ్దాలుగా వైద్యులు ఊబకాయాన్ని(obesity) కొలవడానికి బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ)(body mass index (BMI))సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ బీఎంఐ అనేది వ్యక్తి బరువును కిలోగ్రాముల్లోనూ, ఎత్తు చదరుపు మీటర్లలో భాగించగా వచ్చిన దాన్ని శరీర కొవ్వు కొలతగా నిర్వచించేవారు. దీంతో బీఎంఐ 30 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయంగా పరిగణించారు. అయితే కొందరిలో మాత్రం అధిక శరీర కొవ్వు ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ 30 కంటే ఎక్కువ బీఎం ఉండదు. అలాంటప్పుడూ రాబోయే ఆరోగ్య ప్రమాదాలు గుర్తించలేమని వైద్యులు చెబుతున్నారు. అదీగాక ప్రస్తుత జనాభా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఊబకాయం. అలాంటప్పుడు కాలం చెల్లిన బీఎంఐలతో బరువు, ఎత్తు నిష్పత్తిలతో అంచనా వేస్తే సరిపోదని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ ఒబెసిటీకి సరికొత్త నిర్వచనాన్ని మార్గదర్శకాలను అందించింది. అవేంటంటే..ఊబకాయం అనే అధిక శరీర కొవ్వు. ఇది అనేక వ్యాధులకు కారణమయ్యే దీర్ఘకాలిక వ్యాధి. అలాగే ఇక్కడ బీఎంఐ అనేది శరీర కొవ్వును అతిగా లేదా తక్కువగా అంచనా వేయవచ్చు. అంతే తప్స స్పష్టమైన అంచనా మాత్రం ఇవ్వదు. అందుకని ఈ ఊబకాయాన్ని దీర్ఘకాలిక వ్యాధికి సరిగ్గా సరిపోయేలా అనారోగ్య స్థితిగా నిర్వచించారు. ఇది అవయవాలు, కణజాలల పనితీరుపై నేరుగా ప్రభావం చూపే అధిక కొవ్వుగా పరిగణించారు. దీన్ని బయో ఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ లేదా డీఈఎక్స్ఏ స్కాన్లు వంటి ప్రత్యేక యంత్రాలతో కచ్చితంగా నిర్థారించగలమని అన్నారు. అయితే ఇవి ఖరీదైనవి కావడంతో క్లినిక్లలో అందుబాటులో లేవు. ఇక ఊబకాయం ఉన్నవారికి శరీరంలో కొవ్వు ఎక్కడ పేరుకుపోయిందనేది ముఖ్యమట. అంటే బొడ్డు చుట్టూ ఉంటే ఇది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. ప్రస్తుత మార్గదర్శకాలు బెల్లీఫ్యాట్(Belly Fat)ని తీవ్రమైన ఒబెసిటీ పరిగణించమని చెబుతోంది. అలాగే ఆయా వ్యక్తులకు మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనేది కూడా పరిగణలోనికి తీసుకోవాలట. కొత్త మార్గదర్శకాల్లో ఒబెసిటీని రెండు దశల్లో వర్గీకరించారు. దశ1: అవయవ పనితీరుపై లేదా సాధారణ రోజువారీ కార్యకలాపాలపై స్పష్టమైన ప్రభావాలు లేకుండా పెరిగిన కొవ్వు (BMI > 23 kg/m². ఈ దశ ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలు చూపించకపోయినా..భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుందట. దశ2: బీఎంఐ 23 కిలోలు/మీ2 కంటే ఎక్కువ ఉండి, పొట్ట చుట్టూ కొవ్వు, అధిక నడుము చుట్టుకొలత ఉంటే దీన్ని ఊబకాయంగా పరిగణిస్తారు. ఇది శారీరక అవయవ విధులను ప్రభావితం చేస్తుంది. టైప్2 డయాబెటిస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఈ మార్గదర్శకాలను అక్టోబర్ 2022 నుంచి జూన్ 2023 వరకు ఐదు సర్వేలు నిర్వహించి మరీ అందిచినట్లు నిపుణుల చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత అందించిన ఈ మార్గదర్శకాలు ఆచరణాత్మకమైనవి, అలాగే ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించి నివారించడానికి ఉపయోగపడతాయని చెప్పారు.(చదవండి: 32 ఏళ్లు ద్వీపంలో ఒంటరిగా బతికాడు! సడెన్గా జనాల్లోకి తీసుకురాగానే..) -
మీల్ మేకర్ ఆరోగ్యానికి మంచి 'గేమ్ ఛేంజర్'..!
బిర్యానీలో వేసే సోయా చంక్స్ లేదా మీల్ మేకర్(Soya chunks) ఆరోగ్యానికి ఎంతో మంచివట. వీటిని మన ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇవి మొక్కల ఆధారిత ప్రోటీన్గా పిలుస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యానికి మంచి గేమ్ ఛేంజర్(Game-changer)గా చెబుతున్నారు. అదెలాగో సవివరంగా చూద్దాం..!.సోయా ముక్కలు (సోయా చంక్స్) సోయాబీన్స్ నుంచి తయారైన మొక్కల ఆధారిత ప్రోటీన్ మూలం. కొవ్వు శాతం తక్కువ, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శాకాహారులకు ప్రత్యామ్నాయమైన సాంప్రదాయ మాంసం ఆధారిత ప్రోటీన్గా పనిచేస్తుంది. తినేందుకు రుచిగానూ, శరీరానికి అవసరమైన విటమిన్లను అందిస్తుంది. తృప్తికరమైన భోజనానికి చిహ్నంగా ఉంటుంది. ఆరోగ్య స్ప్రుహ ఉన్న వ్యక్తులకు ఇది బెస్ట్ సూపర్ ఫుడ్. ఆహార ప్రియలు ఈ మీల్ మేకర్ని పలు విధాల రెసిపీలతో ఆస్వాదిస్తున్నారు. వంట చేసే నేర్పు లేనివారైనా..సులభంగా వండుకోగలరు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే..గుండె ఆరోగ్యానికి మంచిది..మీల్ మేకర్లో ప్రొటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా, సంతృప్త కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పోషకాలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగుతుంది.బరువు తగ్గుతారు..మీల్ మేకర్లో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు నిండుగా ఉంచుతాయి. మీరు తరచుగా తినాలనే కోరికలను తగ్గిస్తుంది. మీల్ మేకర్లోని ప్రొటీన్కు శరీరం కొవ్వు, బరువును తగ్గించే లక్షణాలు ఉంటాయి. మనం శరీరంలో కార్బోహైడ్రేట్ల కంటే సోయా చంక్స్ను జీర్ణం చేయడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు ఈజీగా కరుగుతుంది, బరువు కూడా సులభంగా తగ్గుతారు.మెనోపాజ్ లక్షణాలను తగ్గిస్తుంది..మెనోపాజ్ దశలో మహిళలు యోని పొడిబారడం, వేడి ఆవిర్లు, మూడ్ స్వింగ్స్, నిద్రాభంగం, రాత్రిపూట చెమటలు పట్టడం వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతుటుందారు. సోయా చంక్స్లో ఐసోఫ్లేవోన్స్ అనే ఫైటోఈస్ట్రోజెన్ ఉంటుంది, ఇది మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది.హార్మోన్ల సమతుల్యతవీటిలోని ఫైటోఈస్ట్రోజెన్ కంటెంట్ పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా చేస్తుంది. ముఖ్యంగా PCOS, పోస్ట్ మెనోపాజ్ లక్షణాలతో బాధపడేవారికి మీల్ మేకర్ మేలు చేస్తాయి.యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి..మీల్ మేకర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, కొన్ని రకాల కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.జీర్ణక్రియకు..మీల్ మేకర్ పేగులలో లాక్టోబాసిల్లి, బైఫిడోబాక్టీరియా పరిమాణం పెంచుతుంది. ఈ రెండు సూక్ష్మజీవులు జీర్ణక్రియకు సహాయపడతాయి.మధుమేహ రోగులకు మంచిది..మీల్ మేకర్లో ఐసోఫ్లేవోన్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటే గుండె సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది.(చదవండి: జపాన్లో ఇంత క్లీన్గా ఉంటుందా..!) -
గట్ బయోమ్ 'పవర్ హోమ్'..!
ఒకప్పుడు జీర్ణవ్యవస్థ అంటే ఆహారాన్ని జీర్ణం చేయడం వరకే దాని పని అనుకునేవారు. కానీ... దాని పని ‘అంతకు మించి’అంటూ ఇటీవలి ఎన్నో పరిశోధనలు తెలుపుతున్నాయి. జీర్ణ వ్యవస్థ అనేది చాలా సంక్లిష్టమైన వ్యవస్థ అంటూ కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో కోటాను కోట్ల (ట్రిలియన్ల కొద్దీ) బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగీ వంటి జీవులు నివసిస్తుంటాయి. వాటినే సంక్షిప్తంగా ‘గట్ బయోమ్’గా పేర్కొంటున్నారు. ఈ జీవులే మానవుల సంపూర్ణారోగ్య నిర్వహణకు తోడ్పడుతున్నాయనీ, ఇవి కేవలం ఒక జీర్ణం(Digestion) చేసే పనే కాకుండా... ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ, మానసిక ఆరోగ్యం వంటివాటినీ సమర్థంగా నిర్వహిస్తున్నాయని అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు... ఓ వ్యక్తికి వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు(రిస్క్)లు కూడా ఆ బయోమ్పైనే ఆధారపడి ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. దీన్నిబట్టి తెలిసేదేమిటంటే... ఓ వ్యక్తి తీసుకునే ఆహారంపైనే అతడి గట్ బయోమ్ ఆధారపడి ఉండటం, ఇక దాని మీదనే అతడి సంపూర్ణ ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటోంది. సూక్ష్మ సమాచార వారధిజీర్ణవ్యవస్థలో ఉండే గట్ బయోమ్ అన్నది దేహానికి మేలు చేసే అనేక రకాల సూక్ష్మజీవుల సముదాయం. ఈ అనేక రకాల సూక్ష్మజీవుల సముదాయం తాలూకు సమతౌల్యత మీదే ఓ వ్యక్తి తాలూకు సంపూర్ణ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆ జీవవైవిధ్యత వల్లనే ఆహారం సరిగా జీర్ణం కావడం, జీర్ణమైనది ఒంటికి పట్టడం, జీవక్రియలన్నీ సక్రమంగా జరగడం.అన్నిటికంటే ముఖ్యంగా ఆ బయోమ్ కారణంగానే అతడి వ్యాధి నిరోధక శక్తి ఇనుమడించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ బయోమ్ వల్లనే జీర్ణవ్యవస్థకూ, మెదడుకూ మధ్య నిరంతరం ఓ సమాచార వ్యవస్థ (గట్–బ్రెయిన్ ఏక్సిస్) నడుస్తుంటుంది. ఈ బయోమ్ వ్యవస్థ బాగుంటేనే... ఓ వ్యక్తితాలూకు భావోద్వేగాలు (మూడ్స్), నిద్ర, అతడి మానసిక ఆరోగ్యం ఇవన్నీ బాగుంటాయి.నేచురల్ సమతౌల్యంమంచి సమతులాహారం తీసుకుంటూ గట్ మైక్రోబయోమ్(Gut Micorbiome) తాలూకు సమతౌల్యతను కాపాడుకోవడం ద్వారా ఓ వ్యక్తి తాలూకు జీవనశైలిని సానుకూలంగా అంటే పాజిటివ్గా మలచేందుకు ఆస్కారముంటుంది. భారతీయ సంప్రదాయ ఆహారంలోనివి... అంటే ముఖ్యంగా మొక్కలు, వృక్షాల నుంచి లభ్యమయ్యే చిరుధాన్యాలు, సుగంధద్రవ్యాలు, పులవడానికి సిద్ధంగా ఉన్న ఆహారాల వంటివి ఈ గట్బయోమ్ సమతౌల్యాన్ని స్వాభావికంగా (నేచురల్గా) నిర్వహితమయ్యేలా చేస్తాయి. మన జీర్ణవ్యవస్థలోని గట్ బయోమ్ సరిగా వృద్ధిచెందడానికైనా లేక అవి సరిగా అభివృద్ధి చెందకపోవడానికైనా మన ఆహారమే కారణమవుతుంది. మంచి ఆహారం తీసుకుంటే అవి సానుకూలంగా అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకు పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారాలు, పప్పులు (దాల్), శెనగలు, ఆకుపచ్చరంగులో ఉండే పాలకూర, గోంగోర వంటి ఆకుకూరల వల్ల జీర్ణవ్యవస్థలో మనకు మేలు చేసే బ్యాక్టీరియా వృద్ది చెందుతాయి.మంచి ఆరోగ్యం కోసం...కేవలం ఆహారంపైనే కాకుండా మన జీవనశైలి కూడా గట్ మైక్రోబియమ్ మీద ప్రభావం చూపుతుంది. మన ప్రపంచంలోని వివిధ ఖండాల్లో చాలా ఆరోగ్యకరమైన రీతిలో ప్రజలు నివసించే ప్రాంతాలను బ్లూ జోన్స్గా పరిగణిస్తుంటారు. ఈ బ్లూ జోన్స్లో నివసించే వారు మిగతా ప్రజల కంటే సుదీర్ఘ కాలం జీవిస్తుంటారు. అలాగే వారు సంపూర్ణారోగ్యంతో జీవనం సాగిస్తుంటారు. ఈ బ్లూ జోన్స్గా గుర్తించిన ప్రాంతాలు... సార్డీనియా (ఇటలీ), నికోయా (కోస్టా రికా), ఇకారియా (గ్రీస్), లోమా లిండా (కాలిఫోర్నియా) వంటివి. వీటిల్లో నివసించే వాళ్లను, వారి జీవనశైలిని పరిశీలించినప్పుడు... వారి జీవనశైలి మూలంగా జీర్ణవ్యవస్థ తాలూకు ఆరోగ్యం మెరుగుపరుచుకోడానికి అవలంబించాల్ని కొన్ని పద్ధతులు తెలిశాయి. అవి...నిద్రపోదాంనాణ్యత లేని నిద్ర, తరచూ నిద్రాభంగం కావడం వంటి సమస్యల వల్ల జీర్ణవ్యవస్థలోని గట్ బయోమ్ దెబ్బతింటుంది. దాంతో జీర్ణసమస్యలు వస్తాయి. బ్లూజోన్లోని ప్రజలు కంటి నిండా నిద్రపోవడంతోపాటు వేళకు నిద్రకు ఉపక్రమిస్తారు. ఇది కూడా వాళ్ల ఆరోగ్యానికి కావడం వల్ల ఆరోగ్యాన్ని కోరుకునేవారంతా రోజూ కనీసం 7 – 8 గంటల నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యమివ్వాలి. దీనివల్ల వాళ్లకు గట్ ఆరోగ్యంతోపాటు సంపూర్ణ ఆరోగ్యమూ సిద్ధిస్తుంది.చురుగ్గా ఉందాం...మనలో రోజువారీ కదలికలు ఎక్కువగా ఉంటే... అలా ఉండటం వల్ల సమకూరే వ్యాయామం కారణంగా జీర్ణవ్యవస్థలోని మైక్రోబయోమ్ ఆరోగ్యంగా ఉండటం, ఆహారం బాగా జీర్ణం కావడం జరుగుతుంది. బ్లూజోన్లోని ప్రజలు తమ స్వాభావికమైన కదలికలతోనే తమ రాకపోకలు సాగిస్తుంటారు. ఉదాహరణకు నడక, సైక్లింగ్ వంటివి. అలాగే తోటపని లాంటి పనుల వల్ల దేహపు కదలికలు బాగా చురుగ్గా జరుగుతుంటాయి. అంతేకాకుండా నడక, యోగా, వంటి తేలికపాటి వ్యాయామాలు, దేహపు కదలికల వల్ల... వాళ్ల జీర్ణవ్యవస్థ మరింత మెరుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది.నీళ్లు తాగుదాం...నీళ్లు తాగడమన్నది మంచి జీర్ణవ్యవస్థకూ, ఆహారం బాగా జీర్ణం కావడానికీ, తిన్నవి బాగా ఒంటికి పట్టడానికి తోడ్పడుతుంది. బ్లూజోన్లోని ప్రజలు కూడా నీళ్లు తాగడాన్ని ఓ మంచి అలవాటుగా పాటిస్తారు. వాళ్లు చక్కెరతో కూడిన తియ్యటి పానీయాలను చాలా పరిమితంగా తీసుకుంటారు. మంచి ఆరోగ్యం కోసం రోజంతా తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తాగుతూ ఉండటం, అలాగే తీయ్యటివీ, కెఫిన్తో కూడిన పానీయాలు చాలా పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. పులవడానికి సిద్ధంగా ఉండే ఆహారాలైన పెరుగు, ఇడ్లీ, దోశ వంటివి ప్రోబయాటిక్ ఆహారాలుగా పనిచేస్తూ... గట్లో ఉండే సూక్ష్మజీవరాసుల వృద్ధికీ, సమతౌల్యతకూ తోడ్పడతాయి. మళ్లీ వీటి కారణంగానే వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. వీటితోపాటు ప్రీ–బయాటిక్ సమృద్ధిగా ఉండే వెల్లుల్లి, ఉల్లి, అరటి, ఓట్స్ వంటి ఆహారాలతో గట్లో ఉండే సూక్ష్మవృక్షజీవరాసులు అభివృద్ధి చెందుతాయి. అలాగే పసుపు, అల్లం, జీలకర్ర వంటి వాటితో దేహంలోని వాపు, మంట తగ్గించే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) ప్రక్రియ జరుగుతుంది.మరీ ముఖ్యంగా చెప్పాలంటే పసుపులో ఉండే కర్కుమైన్ అనే సంక్లిష్ట పోషకాలు దేహంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. ఇక కాయధాన్యాలైన వరి, బార్లీతో తోపాటు చిరుధాన్యాల్లో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇవన్నీ జీర్ణవ్యవస్థలో ఉండే గట్ బయోమ్ను ఆరోగ్యకరంగానూ, సమతౌల్యంతోనూ పెరిగేలా చూస్తాయి.ఒత్తిడిని ఎదుర్కొందాం...దీర్ఘకాలికమైన ఒత్తిడి జీర్ణవ్యవస్థలో ఇన్ఫ్లమేషన్కూ, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడానికీ... అది మళ్లీ జీర్ణవ్యవస్థలో మైక్రోబియమ్ బలహీనపడటానికి దారితీస్తుంది. ధ్యానం, బాగా లోతుగా శ్వాస తీసుకోవడం, ప్రకృతితో సమన్వయమై వీలైనంత ఎక్కువసేపు గడపటం వంటి అంశాలు ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తాయి. ఉదాహరణకు జపాన్లోని ‘ఒకినవా’ అనే ప్రాంతంలోని ప్రజలు ‘ఇకిగయి’ అనే జీవనవిధానం ద్వారా ఒత్తిడి తగ్గించుకుని, మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇలాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాలను అనుసరించడం ద్వారా మానసిక ఆరోగ్యమూ సమకూరుతుంది. తద్వారా జీర్ణవ్యవస్థ ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.విచక్షణతో తిందాం...బ్లూ జోన్లో ఉన్న ఆరోగ్యవంతులైన ప్రజలు తమ కడుపు 80 శాతం నిండగానే తినడం ఆపేస్తారు. దీనివల్ల తిన్నది బాగా జీర్ణమవుతుంది. వాళ్లు భోజనాన్ని బాగా ఆస్వాదిస్తూ, మెల్లమెల్లగా నములుతూ హాయిగా తింటారు. దీనివల్ల కడుపుబ్బరం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలేవీ రావు. గట్కూ, మెదడుకూ మంచి సమన్వయమూ ఉంటుంది.టేక్...కేర్భోజనంలోని ఆహారాల్లో... తగినన్ని కాయధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, పప్పులు, పండ్లు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి∙ పులవడానికి సిద్ధంగా ఉన్న ఆహారాలను ఆహారంలో భాగం చేయాలి. ప్రాసెస్డ్ ఆహారాలూ, చక్కెరతో కూడిన ఆహారాలు గట్ మైక్రోబయోమ్ను దెబ్బతీస్తాయి కాబట్టి వాటిని చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి ఒళ్లంతా మంచి కదలికలతో రోజంతా చాలా చురుగ్గా ఉండాలి∙ స్ట్రెస్ను అదుపులో ఉంచుకోడానికి మంచి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి వేళకు కంటి నిండా నిద్రపోతూ గట్ – బ్రెయిన్ ఆరోగ్యం కోసం ప్రయత్నించాలి.దీర్ఘాయుష్మాన్భవ...జీర్ణాశయం ఆరోగ్యం కోసం ప్రయత్నించడమంటే అది కేవలం గట్ తాలూకు ఆరోగ్యం కోసం మాత్రమే కాదు... నిజానికి అది సంపూర్ణారోగ్యం కోసం చేసే ప్రయత్నమని గుర్తుంచుకోవాలి. బ్లూజోన్లో నివసించేవాళ్ల నుంచి స్ఫూర్తి ΄పొందుతూ అందరమూ మన జీవనశైలినీ, భారతీయ సంప్రదాయ ఆహారాలైన మొక్కల నుంచి లభ్యమయ్యేవీ, పులిసేందుకు సిద్ధంగా ఉండేవీ, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇది కేవలం జీర్ణవ్యవస్థ ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా ఓ వ్యక్తి తాలూకు సంపూర్ణారోగ్యానికి దోహదపడుతుంది.ప్రో బయాటిక్పులవడానికి సిద్ధంగా ఉండే ఆహారాలైన పెరుగు, ఇడ్లీ, దోశ వంటివి ప్రో బయాటిక్ ఆహారాలుగా పనిచేస్తూ... గట్లో ఉండే సూక్ష్మజీవరాసుల వృద్ధికీ, సమతౌల్యతకూ తోడ్పడతాయి. మళ్లీ వీటి కారణంగానే వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. వీటితో పాటు ప్రీ–బయాటిక్ సమృద్ధిగా ఉండే వెల్లుల్లి, ఉల్లి, అరటి, ఓట్స్ వంటి ఆహారాలతో గట్లో ఉండే సూక్ష్మవృక్షజీవరాసులు అభివృద్ధి చెందుతాయి.అలాగే పసుపు, అల్లం, జీలకర్ర వంటి వాటితో దేహంలోని వాపు, మంట తగ్గించే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) ప్రక్రియ జరుగుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పసుపులో ఉండే కర్కుమైన్ అనే సంక్లిష్ట పోషకాలు దేహంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. ఇక కాయధాన్యాలైన వరి, బార్లీతోపాటు చిరుధాన్యాల్లో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇవన్నీ జీర్ణవ్యవస్థలో ఉండే గట్ బయోమ్ను ఆరోగ్యకరంగానూ, సమతౌల్యంతోనూ పెరిగేలా చూస్తాయి. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఛైర్మన్ అండ్ చీఫ్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఏఐజీ హాస్పిటల్స్,హైదరాబాద్ (చదవండి: సాత్విక ఆహారంతో బరువుకి చెక్పెట్టండిలా..!) -
జీన్స్ తొడుక్కుని స్క్వాటింగ్ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్
ఆధునిక కాలంలో జీన్స్ ప్యాంట్లు లేనిదే కాలం గడవదు. ట్రెండ్కు,ఫ్యాషన్కు తగ్గట్టు అనేక రకాల జీన్స్ ప్యాంట్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. మహిళలతో పోల్చితే పురుషులే ఎక్కువగా జీన్ ప్యాంట్లను వినియోగిస్తారు. ఆఫీసులకు, బయటికి వెళ్లినప్పుడు, పార్టీలకు ఇలా ఏదైనా జీన్స్ ప్యాంట్లకే ప్రాధాన్యత ఉంటుంది. అన్ని వయసుల వారికి ఫిట్ అయ్యే జీన్స్ అనేవి చాలా పాపులర్. అనేక రకాల మోడల్స్లో ఇవి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ధరించడం వలన చాలా కంఫర్ట్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. వీటిని ఉతుక్కోవడం ఈజీ కావడం కూడా వీటికి ఆదరణ ఎక్కువ. కానీ జీన్స్పాంట్లు వేసుకున్నపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.జీన్స్ వేసుకొని కింద కూర్చోవడం, అందునా జీన్స్ ప్యాంట్లు తొడిగి బాసిపట్లు వేయడం (సక్లముక్లం వేసి కూర్చోవడం) ఆరోగ్యానికి అంత మేలు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీన్స్ ప్యాంట్ తొడుక్కొని ఇలా కూర్చోవడం వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయనీ, ఇది మరీ విషమిస్తే ఒక్కోసారి జీన్స్ ప్యాంట్లతో బాసిపట్లు వేసుకుని కూర్చునేవారు పైకి లేవగానే నడవలేని పరిస్థితి వచ్చేందుకూ అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇక వ్యాయామం చేసే సమయంలోనూ జీన్స్ అస్సలు తొడుక్కోవద్దనీ, వాటిని తొడిగి ‘స్క్వాటింగ్’ ఎక్సర్సైజ్ చేయడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఈ అంశాలన్నింటినీ ‘జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ’ అనే మెడికల్ జర్నల్లోనూ ప్రచురితమయ్యాయి. అవే కాకుండా బాగా బిగుతుగా ఉండే జీన్స్ వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశముందని కూడా మరికొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.జీన్స్ ప్యాంట్లు బాగా టైట్గా ఉండే జీన్స్ ప్యాంట్ ధరించి పడుకుంటే చర్మంపై బ్యాక్టీరియా పెరుగుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీంతో దురదలు, చర్మంపై ర్యాషెస్, దద్దుర్లు వస్తాయి. రక్తప్రసరణకు కష్టం : జీన్స్ ప్యాంట్ బిగుతుగా ఉండటంతో రక్తప్రసరణకు ఇబ్బంది కలుగుతుంది. దీంతో కొన్ని అవయవాలకు రక్తం సరిగా అందదు. జీన్స్ ప్యాంట్ ధరించి నిద్రించడం వల్ల శరీరంలోని వేడీ పెరుగుతుంది. పేగుల కదలికకు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియపై దుష్ప్రభావం పడుతుంది. -
కాలుష్యం కాటేస్తది.. చెవి, ముక్కు, గొంతు జాగ్రత్త!
ఇటీవల వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముక్కు ఆరోగ్య సంరక్షణ చాలా కీలకంగా మారుతోంది. అంతేకాదు.. ఈమధ్యకాలంలో శబ్దకాలుష్యం కూడా అనూహ్యంగా పెరిగి పోతోంది. వాహనాల పెరుగుదల వల్ల శబ్ద, వాయు కాలుష్యాలు... ఈ రెండూ ఏకకాలంలో పెరిగి రెండు జ్ఞానేంద్రియాలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. ఇక ఈ ముక్కు, చెవులు రెండూ గొంతుతో అనుసంధానమై ఉంటాయి. ఈ నేపథ్యంలో చెవులు,ముక్కు, గొంతు ఆరోగ్య పరిరక్షణ ఎంతో కీలకం. అందుకే వాటి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను తెలుసుకోవడం తప్పనిసరి. ముక్కు చెవులనూ, అలాగే తలను మిగతా దేహంతో అనుసంధానం చేసే కీలక అవయవ భాగమే మెడ. వీటన్నింటి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకు పాటించాల్సిన కొన్ని సూచనలివి... చెవుల సంరక్షణ కోసం... ∙పెద్ద పెద్ద చప్పుళ్ల నుంచీ, శబ్దకాలుష్యం నుంచి చెవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇయర్ ఫోన్స్తో మొబైల్ వాడేటప్పుడు, కంప్యూటర్ను ఉపయోగిస్తూ హెడ్ఫోన్స్ పెట్టుకున్న సమయంలో పెద్దగా వాల్యుమ్ పెట్టుకోకుండా చెవికి తగినంత వాల్యుమ్తో జాగ్రత్తగా చెవులను కాపాడుకోవాలి. ∙పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే చోట్లలో / పనిప్రదేశాలలో ఇయర్ ప్లగ్స్ వాడుకోవాలి.చెవుల్లో హోరు శబ్దాలు గానీ, ట్రాన్స్ఫార్మర్ దగ్గరి గుయ్మనే శబ్దాలుగాని వినిపిస్తుంటే అది టినైటస్ అనే సమస్య కావచ్చని భావిస్తూ సర్టిఫైడ్ ఆడియాలజిస్ట్ దగ్గర వినికిడి పరీక్షలు చేయించుకోవాలి. ∙చెవులు వినబడుతుంటేనే చిన్నారులు మాటలు నేర్చుకునేది. అందుకే చిన్నారి పుట్టగానే ఆ పిల్లలకు వెంటనే వినికిడి పరీక్షలు చేయించాలి. ఇలా పరీక్షించి చికిత్స చేయిస్తే... అటు వినికిడి సమస్యనూ, ఇటు మాటలు రాక΄ోవడాన్నీ ఏకకాలంలో అరికట్టవచ్చు. కాక్లియర్ ఇం΄్లాంట్స్ వంటి చికిత్సలతో మాటలూ, వినికిడీ వచ్చేలా చేయవచ్చు సైనస్ ఇన్ఫెక్షన్లూ, సమస్యల నుంచి కాపాడుకోవడానికి... ఒక్కోసారి చేతుల్లో ఉండే హానికరమైన సూక్ష్మజీవులు ఏదైనా తింటున్న సమయంలో గొంతులోకి వెళ్లి అక్కణ్నుంచి ముక్కు, నోరు, గొంతు ద్వారా (ఒక్కోసారి కళ్ల నుంచి కూడా) లోనికి ప్రవేశించి ముక్కు, నోరు, గొంతు, కళ్ల ఇన్ఫెక్షన్లతో పాటు సైనసైటిస్ వంటి సమస్యలకూ కారణమవుతాయి. కానీ చేతులు శుభ్రంగా కడుక్కుంటూ మంచి హ్యాండ్ హైజీన్ను పాటించడం మేలు. అందుకే కేవలం చేతులు శుభ్రంగా కడుక్కోవడం (హ్యాండ్ వాష్)తో ఎన్నో సమస్యలను నివారించవచ్చునని గుర్తుంచుకోవాలికొన్ని అలర్జీ సమస్యలను, మనకు సరిపడని అలర్జెన్స్ వల్ల ముక్కు, గొంతు, కళ్ల అలర్జీలూ, సైనస్ సమస్యలతో ΄ాటు ఊపిరితిత్తులకు సంబంధించిన మరికొన్ని రుగ్మతలూ రావచ్చు. అందుకే మనకు సరిపడని వాటికి దూరంగా ఉండాలి వేడినీటితో ఆవిరిపట్టడం అనే ఓ చిట్కాతో ముక్కు, గొంతు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఈ జాగ్రత్తలతోపాటు మంచి సమతులాహారం, విటమిన్–సి సమృద్ధిగా ఉండే నిమ్మజాతి పండ్లైన నారింజ, బత్తాయి వంటివి వాడటం, జింక్ మోతాదులు ఎక్కువగా ఉండే నట్స్, గింజధాన్యాలు, పప్పుధాన్యాలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు నివారితమవుతాయి. ఈ జాగ్రత్తలతోపాటు మసాలాలు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల గొంతులో ఇరిటేషన్లు, యాసిడ్ గొంతులోకి వచ్చి గొంతు మండటం అనే సమస్యలు నివారితమవుతాయి. ఇక వీటితోపాటు ఈ చలి సీజన్లో మరింత చల్లటి గాలికీ, నీటికి దూరంగా ఉండటం, కాలుష్యానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తవహించడం వంటి జాగ్రత్తలు మేలు చేస్తాయనే అంశాన్ని గ్రహించాలి. గొంతు ఆరోగ్యం (థ్రోట్ హైజీన్) కోసంస్మోకింగ్, మద్యం అలవాటు మానుకుంటే కేవలం గొంతు ఆరోగ్యం మాత్రమే కాదు... మొత్తం దేహం ఆరోగ్యమంతా బాగుంటుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలూ, జబ్బులూ, రుగ్మతలూ నివారితమవుతాయి. గొంతు ఆరోగ్యం కోసం గొంతును శుభ్రంగా ఉంచుకోవడం మేలు చేస్తుంది. ఇందుకు గోరువెచ్చని నీటిలో కాస్తంత ఉప్పు వేసుకుని పుక్కిలించడం ఓ మంచి ఇంటి చిట్కా. దీనివల్ల గొంతుకు వచ్చే అనేక ఇన్ఫెక్షన్లూ, ఇన్ఫ్లమేషన్లూ, సోర్ థ్రోట్ వంటి సమస్యలు దూరం కావడమే కాకుండా అనేక రకాల గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది. ఇది చాలా సులువైన, నమ్మకమైన, ప్రభావపూర్వకమైన చిట్కా ∙ఇక నీళ్లు ఎక్కువగా తాగుతుండటమనేది ఇటు గొంతుతోపాటు పూర్తి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతూ అనేక సమస్యల నుంచి రక్షణ కల్పించే అంశం. (భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!)ముక్కు ఆరోగ్యం కోసం...ముక్కు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం మనందరి మొదటి ప్రాధాన్యత. అన్ని అవయవాలనుంచి తేమను లాగేసినట్టే... ముక్కు నుంచి కూడా తేమను లాగేస్తుంది ఈ సీజన్. అందుకే ముక్కు తాలూకు తేమ బాగానే నిర్వహితమయ్యేలా చూసుకోవాలి ∙ఈ సీజన్లో బాగా నీళ్లు తాగుతూ ఉంటే అది ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్ను ΄పొడిబారకుండా తేమగా ఉండేలా చూడటంతో పాటు... మిగతా దేహమంతా బాగా హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకునేందుకు ఉపయోగపడుతుంది.ముక్కులు బిగదీసుకుపోయే తత్త్వం ఉన్నవారు (ఇది ఈ సీజన్లో మరీ ఎక్కువ) సెలైన్ నేసల్ స్ప్రేలు వాడటం వల్ల ముక్కు ఆరోగ్యం బాగుంటుంది. ఇక చీదే సమయంలో బలంగా చీదడం సరికాదు. ఒక్కోసారి దీంతో ముక్కులోని అతి సన్నటి రక్తనాళాలు (క్యాపిల్లరీస్) చెదిరి రక్తస్రావం కూడా అయ్యే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: మహిళలకు ఫ్రీ బస్సా? ఇదెక్కడి న్యాయం అంటూ ట్వీట్ : ఇచ్చిపడేసిన నెటిజనులు -
బరువు నిర్వహణకు ది బెస్ట్ 30-30-30 రూల్ డైట్..!
ఎన్నో రకాల డైట్ల గురించి విన్నాం. కానీ ఏంటిది 30-30-30 డైట్..?. కీటోజెనిక్ డైట్ నుంచి వీగన్ ప్లాన్స్, అడపాదడపా ఉపవాసం, అధిక-ప్రోటీన్ నియమాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ భోజనం ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఇలా నెంబర్ల రూల్తో కూడిన డైట్ ఏంటి..? మంచిదేనా అని సందేహించకండి. ఎందుకంటే పోషకాహార నిపుణులు ఈ డైట్ నూటికి నూరు శాతం మంచిదని కితాబిస్తున్నారు. మరీ ఆ డైట్ ఏంటి..? అందులో ఎలాంటి ఆహారం తీసుకుంటారో చూద్దామా...ప్రస్తుతం తీసుకునే డైట్లలో ఎక్కువగా అధిక బరువు సమస్యను తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండటం కోసం అనుసరించేవి. అయితే కొన్ని డైట్లతో తొందరగా ఫలితాలను అందుకోగలం. అదేవిధంగా అందరికీ అన్ని డైట్లు సరిపడవు కూడా. అయితే పోషకాహార నిపుణురాలు లోవ్నీత్ బాత్రా చెప్పే 30-30-30 డైట్ మాత్రం సత్వర ఫలితాలను ఇవ్వడమే గాక తొందరగా వెయిట్ లాస్ అవ్వుతారట. నిపుణుల సైతం నూటికి నూరు మార్కుల ఇస్తున్నారు ఈ డైట్కి. పైగా ఇది సమర్థవంతమైనది, ఆరోగ్యకరమైన వెయిట్ లాస్ డైట్ అని చెబుతున్నారు. ఈ డైట్ ఎలా ఉంటుందంటే..ఉదయం మేల్కోగానే 30 నిమిషాలలోపు 30 గ్రాముల ప్రోటీన్ తీసకోవాలి. ఆ తర్వాత 30 నిమిషాల పాటు తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేయాలి. మనం ఎప్పుడైతే కేలరీలను తగ్గిస్తామో.. అప్పుడు శరీరంలో ఉన్న వేస్ట్ కొవ్వు అదనపు శక్తి కోసం ఖర్చువుతుంది. దీనివల్ల చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి. అలాగే ఈ డైట్ పరంగా చేసే శక్తిమంతమైన వ్యాయామాలు కండరాలను బలోపేతం చేస్తాయి. ఇది ఒకరకంగా తినాలనే కోరికను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. అదీగాక ప్రతి ఉదయాన్ని 30 నిమిషాలలోపు 30 గ్రాముల ప్రోటీన్తో ప్రారంభిస్తారు కాబట్టి ఎక్కువ ఫుడ్ తీసుకోవాలనే ధ్యాస తెలియకుండానే తగ్గుతుందట. ఆటోమేటిగ్గా ఈ రూల్ గుర్తొచ్చి చకచక మన పనులు పూర్తిచేసుకునేలా మన మైండ్ సెట్ అయిపోవడంతో త్వరితగతిన ఫలితాలు అందుకుంటామని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. View this post on Instagram A post shared by Lovneet Batra (@lovneetb) (చదవండి: దీర్ఘాయువు మందులతో దుష్ప్రభావాలే ఎక్కువ..!: టెక్ మిలియనీర్) -
'గోంద్ లడ్డు'..పోషకాల గని..!
కావలసినవి: గోంద్ (ఎడిబుల్ గమ్) – ము΄్పావు కప్పు; బాదం పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; పిస్తా – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు; రైజిన్స్ – 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము– 2 కప్పులు; బెల్లం పొడి– ఒకటింపావు కప్పు; ఖర్జూరాలు (గింజలు తొలగించినవి) – అర కప్పు; గసగసాలు– 2 టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి– అర టీ స్పూన్; నెయ్యి – టేబుల్ స్పూన్. తయారీ: మందపాటి బాణలిలో నెయ్యి వేడి చేసి గోంద్ను వేయించాలి. చల్లారిన తర్వాత చిదిమి పొడి చేయాలి లేదా చపాతీలు చేసే పీట మీద వేసి చపాతీల కర్రతో ΄పొడి చేయవచ్చు. చిన్న రోలు ఉంటే అందులో వేసి దంచి పొడి చేసుకోవచ్చు. ఒక బాణలిలో కొబ్బరి తురుము, గసగసాలు, కిస్మిస్, మిగిలిన గింజలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా వేయిస్తూ, వేయించిన దినుసులన్నింటినీ ఒకే పాత్రలో వేయాలి. అందులో యాలకుల పొడి, ఖర్జూరాలు, గోంద్ పొడి వేసి సమంగా కలిసే వరకు స్పూన్తో కలపాలి. మరొక పాత్రలో బెల్లం పొడి వేసి మూడు టేబుల్ స్పూన్ల నీటిని ΄ోసి తీగ పాకం వచ్చేవరకు మరిగించాలి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి అందులో గోంద్పొడి తోపాటు దినుసులన్నింటినీ కలిపిన మిశ్రమాన్ని వేసి కలపాలి. వేడి తగ్గే వరకు ఆగాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని లడ్డులు చేయాలి. పై కొలతలతో చేస్తే 16 లడ్డులు వస్తాయి. గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి. గమనిక: ఇది గోధుమ జిగురు. మార్కెట్లో గోంద్ కటిరా పేరుతో దొరుకుతుంది. ఒక్కో లడ్డులో పోషకాలు ఇలా ఉంటాయి..కేలరీలు – 120–130; కార్బోహైడ్రేట్లు – 15–18 గ్రాములు; ప్రోటీన్లు – 2–3 గ్రాములు;ఫ్యాట్ – 6–7 గ్రా.; ఫైబర్– 1–2 గ్రాములుప్రయోజనాలు..గోంద్ దేహంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, ఎముకలను శక్తిమంతం చేస్తుంది. చల్లటి వాతావరణంలో దేహానికి తగినంత వెచ్చదనాన్నిస్తుంది. గింజల నుంచి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, దేహానికి అవసరమైన మైక్రో న్యూట్రియెంట్స్ అందుతాయి.బెల్లంలో ఐరన్, జీర్ణశక్తిని పెంచే లక్షణం ఉంటుంది. కొబ్బరి తురుములో ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్ ఉంటుంది. ఖర్జూరాలు, రైజిన్స్లోని యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ఉండటంతోపాటు అవి శక్తినిస్తాయి. (చదవండి: భారతదేశపు తొలి స్టంట్ విమెన్..ధైర్యానికి కేరాఫ్ అడ్రస్..!) -
కొంచెమైనా.. ముంచేస్తుంది!
అతిగా మద్యం తాగడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అందరికీ తెలిసిందే. కానీ కొందరు వైద్యులు, సైంటిస్టులు, డైటీషియన్లు వంటివారు రోజూ స్వల్ప మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లాభం ఉంటుందని, గుండె జబ్బులను దూరం పెడుతుందని చెబుతూ ఉంటారు. కానీ దీనికి పక్కా ఆధారాలేమీ లేవని, రోజూ కాస్తంత ఆల్కహాల్ తీసుకున్నా కేన్సర్ బారినపడే ముప్పు పెరిగిపోతుందని అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి పలు అధ్యయనాలు, గణాంకాల్లో తేలిన అంశాలను ఆధారంగా చూపుతున్నారు. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై అవి కేన్సర్కు దారితీస్తాయంటూ ఎలా హెచ్చరికలు ముద్రిస్తారో.. అలా ఆల్కహాల్ ఉత్పత్తులపైనా ముద్రించాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆయన నివేదిక ప్రకారం..ఆల్కహాల్కు కేన్సర్కు లింకేమిటి?⇒ తగిన జాగ్రత్తలు తీసుకుని నివారించుకునే అవకాశమున్న కేన్సర్లలో.. పొగాకు, ఊబకాయం తర్వాత ఎక్కువగా నమోదవుతున్నవి ఆల్కహాల్ కారణంగానే. ప్రపంచ ఆరోగ్య సంస్థ కేన్సర్ రీసెర్చ్ విభాగం కూడా ఆల్కహాల్ను ప్రధానమైన కేన్సర్ కారకాల్లో (గ్రూప్ 1 కార్సినోజెన్) ఒకటిగా గుర్తించడం గమనార్హం. ⇒ అమెరికాలో ఏటా ఆల్కహాల్ కారణంగా కేన్సర్ బారినపడి మరణిస్తున్నవారు.. 20 వేల మంది ⇒ 2020లో ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ వినియోగం కారణంగా నమోదైన కేన్సర్ కేసులు... 7.4 లక్షల మంది.(ఒక డ్రింక్ అంటే సుమారుగా.. 330 మిల్లీలీటర్ల బీరు లేదా 35 మిల్లీలీటర్ల విస్కీ)7 ఆల్కహాల్తో రకాల కేన్సర్ల ముప్పుపొగాకు నేరుగా కేన్సర్లకు కారణమైతే.. ఆల్కహాల్ ఏడు రకాల కేన్సర్లకు దారితీస్తుంది. మన దేశంలో కాలేయ కేన్సర్కు ముఖ్య కారణంగా ఆల్కహాల్ నిలుస్తోంది. ఇక ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు రెండూ కలిస్తే కేన్సర్ల ముప్పు మరింత తీవ్రమవుతుందని కేన్సర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఆల్కహాల్ కేన్సర్కు దారితీసేదిలా.. 1. శరీరంలో ఆల్కహాల్ అసిటాల్డిహైడ్గా మారుతుంది. ఇది మన కణాల్లోని డీఎన్ఏను దెబ్బతీసి, కేన్సర్ ముప్పును పెంచుతుంది. 2. ఆల్కహాల్ శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ను పెంచుతుంది. ఇది శరీరంలో కణాలు, ప్రొటీన్లు, డీఎన్ఏను దెబ్బతీసి కేన్సర్కు కారణమయ్యే ఇన్ఫ్లమేషన్కు కారణమవుతుంది. 3. ఆల్కహాల్ కారణంగా శరీరంలో వివిధ హార్మోన్లలో విపరీతమైన హెచ్చుతగ్గులు వస్తాయి. ఇది కేన్సర్కు దారితీస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్పై ప్రభావం పడి రొమ్ము కేన్సర్ ముప్పు పెరుగుతుంది. 4. కేన్సర్కు కారణమయ్యే పదార్థాలను (కార్సినోజెన్లు) శరీరం ఎక్కువగా సంగ్రహించడానికి ఆల్కహాల్ కారణమవుతుంది.ఎంత తాగితే.. అతిగా తాగినట్టు? ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పలు అధ్యయనాల మేరకు.. రోజూ కనీసం ఒక డ్రింక్ ఆల్కహాల్ తాగేవారిలో కేన్సర్ల ముప్పు 10 నుంచి 40% వరకు పెరుగుతుంది. డ్రింక్స్ సంఖ్య పెరిగిన కొద్దీ.. ముప్పు అదే స్థాయిలో పెరుగుతూ పోతుంది. అక్కడి అధ్యయనం మనకెందుకు? ప్రపంచంలోనే అత్యధిక జనాభాకు తోడు ఆల్కహాల్ వినియోగం కూడా ఎక్కువగానే ఉండటంతో.. భారత్లోనూ ఈ కేన్సర్ల ముప్పు ఎక్కువ. ‘ది లాన్సెట్ అంకాలజీ’ జర్నల్లో ప్రచురితమైన పరిశోధన వివరాల మేరకు... 2020లో భారత్లో కొత్తగా 62,100 ఆల్కహాల్ ఆధారిత కేన్సర్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేన్సర్ కేసుల్లో ఇవి 5 శాతానికన్నా ఎక్కువే కావడం గమనార్హం.మన దేశంలో కొన్నేళ్లుగా పెరిగిపోతున్న ఊబ కాయం సమస్యకు తోడుఆల్కహాల్, పొగాకు ఉత్పత్తుల వినియోగం ఈ పరిస్థితికి దారితీస్తోందని అంకాలజీ నిపుణులు చెబుతున్నారు.మరి ఈ కేన్సర్ల ముప్పు నుంచి బయటపడేదెలా?రోజూ స్వల్ప మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నా కేన్సర్ ముప్పు తప్పదని ఈ అధ్యయనం తేల్చింది. అంటే ఈ ముప్పు నుంచి బయటపడటానికి ఉన్న ఏకైక మార్గం... ఆల్కహాల్కు పూర్తిగా దూరంగా ఉండటమేనని అంకాలజీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కసారిగా అలవాటు మానుకోలేనివారు.. స్వల్పంగా తీసుకుంటూ మానేయాలని, అదే సమయంలో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులకు కచి్చతంగా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. –సాక్షి,సెంట్రల్ డెస్క్ -
హైదరాబాద్లో కొత్త జీసీసీ ఏర్పాటుకు ప్రణాళికలు
హైదరాబాద్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు హబ్గా మారుతోంది. హెల్త్ సెక్టార్లో సేవలందిస్తున్న ఎలీ లిల్లీ అండ్ కంపెనీ హైదరాబాద్లో కొత్తగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్(GCC)ను ఏర్పాటు చేసే ప్రణాళికలను ప్రకటించింది. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇంజినీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్లో ఎలీ లిల్లీ సేవలందిస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే 2016లో బెంగళూరులో జీసీసీను ఏర్పాటు చేసింది. త్వరలో హైదరాబాద్లో ప్రారంభించబోయే జీసీసీ ఇండియాలో రెండోది కావడం విశేషం. కొత్త జీసీసీ(Global Capability Center)ను హైదరాబాద్కు ఆహ్వానించడం సంతోషంగా ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హెల్త్ కేర్ ఇన్నోవేషన్లో హైదరాబాద్ ఖ్యాతి పెరుగుతోందని చెప్పారు.లిల్లీ కెపాసిటీ సెంటర్ ఇండియా (ఎల్సీసీఐ)గా పిలవబడే ఈ కొత్త జీసీసీ ద్వారా స్థానికంగా మరింత సాంకేతిక సేవలు అందించడంతోపాటు అంతర్జాతీయంగా కూడా ఈ సెంటర్ సేవలు ఎంతో కీలకం కానున్నాయని కంపెనీ తెలిపింది. ఈ సెంటర్లో టెక్నాలజీ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులతో సహా సుమారు 1,000 నుంచి 1,500 మంది నిపుణులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఎలీ లిల్లీ(Eli Lilly) తెలిపింది. ఈ జీసీసీ 2025లోనే అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరుఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిజిటల్ ఆఫీసర్ డియోగో రావ్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించే ప్రణాళికలను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను మెరుగ్గా మార్చాలనుకునే సాంకేతిక నిపుణులను ఏకతాటిపైకి తీసుకొస్తాం’ అని చెప్పారు. కొత్త సాంకేతిక పురోగతిని ఉపయోగించుకుంటూ వినూత్న ఆవిష్కరణలతో సంస్థ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి హైదరాబాద్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త ఎల్సీసీఐ వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. -
విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు.. అసలు విషయం ఇదీ: ఖుష్భూ
కోలీవుడ్ హీరో విశాల్( Vishal) అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ‘మదగజరాజ’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన వణుకుతూ మాట్లాడారు. అంతకు ముందు కొన్నాళ్ల పాటు కెమెరాకు కనిపించలేదు. సడెన్గా ఈవెంట్లో కనిపించి.. అలా వణుకుతూ మాట్లాడడంతో తమ హీరోకి ఏమైందోనని అభిమానులు కంగారు పడ్డారు. ఆయన జ్వరంతో బాధపడుతన్నాడని వైద్యులు చెప్పినప్పటికీ.. విశాల్ హెల్త్పై రకరకాల పుకార్లు వస్తున్నాయి. అసలు విశాల్కి ఏమైందనే విషయాన్ని తాజాగా నటి ఖుష్బూ(khushboo sundar) వివరించింది.కంగారు పడాల్సిన అవసరం లేదుతాజాగా ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..విశాల్ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పారు. ‘ఢిల్లీలో ఉన్నప్పుడే విశాల్కి జ్వరం వచ్చింది. కానీ 12 ఏళ్ల తర్వాత ‘మదగజరాజ’ రిలీజ్ అవుందుని ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఈవెంట్కి వచ్చాడు. అప్పటికే విశాల్ డెంగీ ఫీవర్తో బాధపడుతున్నాడు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోయారు. ‘ఇంత జ్వరంతో ఎందుకు వచ్చావు?’అని అడిగితే.. ‘నేను నటించిన చిత్రం 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ఈవెంట్కి కచ్చితంగా రావాలనుకున్నాను. అందుకే బాడీ సహకరించకపోయినా వచ్చేశాను’ అని విశాల్ చెప్పారు. ఈ ఈవెంట్ పూర్తయిన వెంటనే విశాల్ని ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కంగారుపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. అయినా కూడా కొంతమంది యూట్యూబర్స్ విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. సెలబ్రిటీల గురించి నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచారం చేయకండి’ అని ఖుష్భూ విజ్ఞప్తి చేశారు.కాగా, విశాల్, ఖుష్భూ మధ్య మంచి స్నేహబంధం ఉంది. కలిసి సినిమాలు చేయకపోయినా.. చాలా క్లోజ్గా ఉంటారు. మదగజరాజు సినిమాకు ఖుష్భూ భర్త సుందర్.సి దర్శకత్వం వహించారు. విశాల్తో తనకున్న అనుబంధం గురించి ఖుష్భూ మాట్లాడుతూ.. ‘మేమిద్దరం కలిసి సినిమాలు చేయలేదు. కానీ మొదటగా ఇద్దరం కలిసి ఓకే పార్టీలో పని చేశాం. ఆ కారణంగానే మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. విశాల్ నటించిన సినిమాల్లో కొన్ని నాకు చాలా ఇష్టం. మంచి టాలెంట్ ఉన్న నటుడు ఆయన. సినిమా కోసం చాలా కష్టపడతాడు’ అని ఖష్భూ చెప్పుకొచ్చింది.12 ఏళ్ల తర్వాత రిలీజ్విశాల్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘మదగజరాజ’(Madha Gaja Raja). 2013లో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పలు కారణాల వల్ల వాయిదా పడి దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ మూవీలో అంజలి, వరలక్ష్మీ శరత్కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఆర్య, సదా అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారు. ఈ సినిమా కోసం విశాల్ ఎయిట్ ప్యాక్ చేశాడట. షూటింగ్ ఆసల్యం అయినా కూడా మరో సినిమా చేయకుండా.. ఈ మూవీ కోసం కష్టపడ్డాడని ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుందర్ చెప్పారు. అంతేకాదు విశాల్ తనకు సొంత తమ్ముడి లాంటి వాడని చెప్పాడు. మొదట్లో విశాల్ని అపార్థం చేసుకున్నానని, అతనితో పరిచయం ఏర్పడిన తర్వాత అతను ఎంత మంచి వాడనే విషయం తెలిసిందన్నాడు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో పని చేసినప్పటికీ.. కార్తిక్ తర్వాత విశాల్తోనే తను బాగా క్లోజ్ అయ్యానని చెప్పారు. #Vishal na get well soon.. #MadhaGajaRajapic.twitter.com/I2K3lTRR0Q— Tamil Cinema Spot (@tamilcinemaspot) January 5, 2025 -
శారీరక శిక్షణే అతిపెద్ద 'గేమ్ ఛేంజర్'.!: విశ్వనాథన్ ఆనంద్
మాజీ చెస్ గ్రాండ్మాస్టర్(Chess Grandmaster) విశ్వనాథన్ ఆనంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. 16వ ఏటనే జాతీయ ఛాంపియన్ షిప్ చేజిక్కించుకున్నాడు. 1987లో ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆ నేపథ్యంలోనే ఆయన గ్రాండ్మాస్టర్గా అవతరించారు. ఎంతటి విజేతకైనా అప్పడప్పడూ ఓటమి పలకరిస్తుంటుంది. తడబాటులు తప్పవు. అలాంటప్పుడూ ఒక్కసారిగా ఎదురయ్యే నైరాశ్యం నుంచి బయటపడేందుకు తన భార్య ఇచ్చిన పనిష్మెంట్ తనకు ఉపకరిస్తుందని అంటున్నారు ఆనంద్. అది తనకు పెద్ద 'గేమ్ ఛేంజర్' అని చెబుతున్నారు. అదేంటో తెలుసుకుందామా..!విశ్వనాథన్ ఆనంద్(Vishwanathan Anand) అర్జెంటీనాలో ఒక టోర్నమెంట్ (Tournament)లో ఆడుతున్నాడు. ఆ టోర్నమెంట్ గెలిచాడు కానీ ప్రారంభంలో రెండు పరాజయాలను ఎదుర్కొనక తప్పలేదు. అయితే అక్కడ ఆనంద్ చేసినవి చాలా సిల్లీ తప్పులట. దీంతో అతడి భార్య అరుణకు ఆయన మీద పిచ్చకోపం వచ్చి..ఈ రాత్రికి డిన్నర్ కావాలంటే.. ముందు చకచకా 50 పుష్అప్లు(Pushups) చేయండని ఆదేశించిందట. అసలే ఓటమితో భారంగా ఉన్న ఆనంద్ చేసేదేమిలేక మారు మాట్లాడకుండా పుష్అప్లు చేసి తర్వాత డిన్నర్ కానిచ్చారట. ఆ తర్వాత బాడీ అలసిపోవడంతో మంచి నిద్ర పట్టేసిందట. మరుసటి రోజు ఆ ఓటమి తనని శారీరకంగా గానీ మానసికంగా(Mental) డిస్ట్రబ్ చేయలేదట.దీంతో రిఫ్రెష్గా కొత్త ఎత్తులతో గేమ్ ఆడి ప్రత్యర్థిని మట్టికరిపించాడట. అందుకే ఆయన శారీరక శిక్షణ అనేది చాలా పెద్ద గేమ్ ఛేంజర్ అని నమ్మకంగా చెబుతున్నారు. నిజానికి అందరూ చదరంగం ఒక మానసిక గేమ్ అని భావిస్తారు కానీ అది తెలియకుండానే ఫిజికల్ గేమ్గా మారుతుందని తన భార్య తరచు చెబుతుంటుందని అన్నారు. ఇక్కడ రికార్డులు బ్రేక్చేసే క్రీడాకారుడికి తప్పనిసరిగా శారీక బలం తోపాటు, మానసిక దృఢత్వం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఆటల్లో ఓటమి తెలియని ఒత్తిడికి గురయ్యేలా చేసి అలసట తెప్పిస్తుందట. చెప్పాలంటే ఇక నావల్ల కాదనేలా కుంగిపోతారట. అలాంటప్పుడు శారీరక శిక్షణ వారిని ఉత్సాహవంతుడిగా మార్చి విజయాన్ని కైవసం చేసుకునేలా ప్రేరేపిస్తుందని వెల్లడించారు నిపుణులు. ఆ పనే ఇక్కడ ఆనంద్ భార్య అరుణా చేశారు. ఇక్కడ ఆతడి భార్య తన ఆర్థిక లావదేవీలు చూసే మేనేజర్గానే కాకుండా వ్యక్తిగతంగా స్ట్రాంగ్ ఉండేలా చేసే శిక్షకురాలిగా సూచనలిచ్చింది. ఫిట్నెస్, ఆరోగ్యం అనేవి మానసిక క్షేమంతో ముగిపడి ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ అరుణ చెప్పిన పుష్ అప్లు ఏకగ్రాతతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మెదడు సహజ స్థితి పెంచేలా ఎండార్ఫిన్లను విడుదల చేసి ఒత్తిడి, ఆందోళనలను నివారిస్తుందని తెలిపారు. తద్వారా ఆయా వ్యక్తుల్లోని ఆత్మవిశ్వాసం పుంజుకుని, మనసును లక్ష్యంపై స్థిరంగా ఉండేలా చేస్తుందట. ప్రయోజనాలు..ఇది ఆటగాళ్లకే ఇంత ప్రయోజనాలందిస్తే..రోజువారీ టెన్షన్లు, ఆందోళనలతో నలిగిపోయే సామాన్యులకు కూడా ఇంకెన్ని ప్రయోజనాలను ఇవ్వగలదో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కోర్ కండరాలను బలోపేతం చేయడమే గాక మొత్తం శరీరం, మనసును బలోపేతం చేసే వ్యాయామం ఇది. అయితే దీనిని సరైన విధంగా చేయాలి. ఇప్పుడే కొత్తగా మొదలుపెడుతున్నవారు.. వ్యాయామ నిపుణుల సలహాలు సంప్రదింపులతో చేయడం మంచిది. View this post on Instagram A post shared by CircleChess (@circlechess) (చదవండి: ముంచుకొస్తున్న హెచ్ఎంపీవీ..నఖ శిఖం పరిశుభ్రంగా ఉందామిలా..!) -
ఆరోగ్య ఆసియా
సాక్షి, అమరావతి: ఆసియా దేశాల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. చిన్న దేశాల్లోనూ ఉత్తమ ఆహార అలవాట్లు, వ్యాయామ విధానాలతో ప్రజలు జీవన ప్రమాణాలను పెంచుకుంటున్నారు. ఎంతో అభివృద్ధి చెందినట్టు భావిస్తున్న అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గుతున్నట్టు గుర్తించారు. ప్రపంచంలోని 200 దేశాల్లో ఆహార అలవాట్లు, ఆరోగ్య శ్రద్ధపై చేసిన సర్వే నివేదిక ‘బ్లూమ్బర్గ్, గ్లోబల్ హెల్త్ ఇండెక్స్–2024’ను ఇటీవల విడుదల చేశారు. ఇందులో ప్రపంచంలో టాప్–3 హెల్త్ ర్యాంకులు ఆసియా దేశాలైన సింగపూర్, జపాన్, దక్షిణ కొరియావే. తొలి స్థానం సింగపూర్ది కాగా.. జపాన్, దక్షిణ కొరియా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో స్థానంలో తైవాన్ ఉంది. భారత దేశం 112వ స్థానంలో నిలిచింది. బ్లూమ్బెర్గ్ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ దేశ ప్రజల వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు, ప్రభుత్వాలు కల్పిస్తున్న సదుపాయాలను అన్ని కోణాల నుంచి అధ్యయనం చేయగా, గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ సంస్థ ప్రజల వ్యాధి నిరోధక శక్తి సామర్థ్యాలపై అధ్యయనం చేసింది. ఈ రెండు సంస్థలుసంయుక్తంగా గ్లోబల్ హెల్త్ ఇండెక్స్–2024 నివేదికను విడుదల చేశాయి.ఆరోగ్య ప్రగతికి ప్రత్యేక కొలమానం ఒక దేశ ఆరోగ్యాన్ని కొలవడానికి ప్రత్యేకంగా రూపొందించిన మెట్రిక్ విధానాన్ని బ్లూమ్బర్గ్ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ వినియోగించింది. దేశ ప్రజల్లో పొగాకు వినియోగం, అధిక రక్తపోటు, ఊబకాయం, స్వచ్ఛమైన నీటి లభ్యత, సగటు ఆయుర్దాయం, పోషకాహార లోపం, మరణానికి కారణాలను ప్రామాణికంగా తీసుకుంది. తీవ్రమైన రోగాలు ప్రబలినప్పుడు ఆ దేశంలో చేపట్టే నివారణ చర్యలు, ప్రజల శ్రేయస్సు కోసం తీసుకునే విధానాలపై గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ నివేదిక రూపొందించింది.ఇందులో వ్యాధి నివారణ చర్యలు, అంతర్జాతీయ అంటు వ్యాధులను ముందస్తుగా గుర్తించి నిరోధించడం, వ్యా«ధులు వ్యాప్తి చెందకుండా వేగంగా చర్యలు చేపట్టడం (ర్యాపిడ్ రెస్పాన్స్), ఆ దేశ ఆరోగ్య వ్యవస్థ, అంతర్జాతీయ నిబంధనల అమలు వంటి అంశాల ఆధారంగా నివేదిక తయారు చేసింది. 2019 ర్యాంకింగ్ ప్రకారం స్పెయిన్ 92.75 స్కోరుతో ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన దేశంగా ఉండగా, అప్పట్లో 4వ స్థానంలో ఉన్న సింగపూర్ 2024లో 95.3 స్కోర్తో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. జపాన్ 95.1 స్కోరుతో రెండో స్థానంలో, 94.3 స్కోరుతో దక్షిణ కొరియా మూడో స్థానంలో నిలిచాయి.అభివృద్ధి చెందిన దేశాలు వెనుకే..అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకొంటున్న యునైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్) 88.8 స్కోరుతో 34వ ర్యాంకులో ఉంది. అమెరికాది 2019లో 35వ ర్యాంక్ కాగా, ఇప్పుడు 69కు పడిపోయింది. ఇక మన పక్కనున్న పాకిస్తాన్ 61.3 స్కోరుతో 124వ ర్యాంకు, చైనా 46.3 స్కోరుతో 163వ ర్యాంక్ పొందాయి. భారతదేశం 61.5 స్కోరుతో 112వ ర్యాంకులో ఉంది. కాగా, కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2021లో ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయని, అయినప్పటికీ భవిష్యత్లో ఇలాంటి ఉపద్రవాలు ఎదురైతే మహమ్మారిని నిరోధించడానికి ఏ దేశమూ తగిన చర్యలు తీసుకోలేదని నివేదిక పేర్కొంది.ఆరోగ్యం, ఆయుర్దాయంలో సింగపూర్ టాప్ఆరోగ్యం, ఆయుర్దాయంలో సింగపూర్దే అగ్రస్థానమని నివేదిక తెలిపింది. అక్కడి ప్రభుత్వం ప్రత్యేక సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి, పెద్దలు, పిల్లల కోసం పలు రకాల ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొంది. ఈ దేశ జనాభాలో 14 శాతం మందే ధూమపానం చేస్తున్నట్టు గుర్తించింది. ప్రపంచంలో అత్యధిక ఆయుర్దాయం 84.8సంవత్సరాలతో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. జపాన్ 84 సంవత్సరాలతో రెండో స్థానంలో ఉంది.ప్రస్తుతం స్పెయిన్ ప్రజల సగటు ఆయుర్దాయం 83.5 సంవత్సరాలు కాగా, ఇది 2040 నాటికి 85.8కి పెరిగి ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్దాయం గల దేశంగా నిలుస్తుందని నివేదిక పేర్కొంది. ఇక్కడి ప్రజలు మాంసాహారం కంటే ఆరోగ్యకరమైన కొవ్వులు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకుంటారని, తక్కువ మొత్తంలో రెడ్ మీట్, ప్రాసెస్డ్ పదార్థాలు తింటున్నట్టు వివరించింది. ఐరోపాలోనే స్పెయిన్లో అత్యధిక శాతం వాకర్లు ఉన్నారని, ఇక్కడ 37 శాతం మంది ఉద్యోగాలకు నడిచే వెళతారని పేర్కొంది. అందుకు భిన్నంగా అమెరికాలో 6 శాతం మంది మాత్రమే పనికి నడిచివెళుతున్నట్టు పేర్కొంది. -
ఈ పప్పు మనిషి మాంసాన్ని తింటుందట! ఇది ప్రోటీన్ కాదట..
భారతీయ ఇళ్లలో పప్పులు లేనిదే వంట సంపూర్ణం కాదు. ఏదో ఒక విధంగా పప్పులను వినియోగిస్తాం. అలాగే వారంలో ఏ రెండు లేదా మూడు రోజులైనా భోజనంలో పప్పు ఉండాల్సిందే. అయితే పప్పు అనేది ప్రోటీన్ల మూలకమని, ఎన్నో మాంసకృత్తులు ఉంటాయని విన్నాం. కానీ ఈ పప్పు మనిషి మాంసాన్ని తింటుందట. ఇది ప్రోటీన్ మూలం కాదట. వాట్ పప్పులు మనిషి మాంసాని తినడం ఏమిటి..? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఐఏఎస్ ఇంటరర్వ్యూలో ఓ అభ్యర్థికి ఎదురైన ప్రశ్న ఇది. ఔను మనిషి మాంసాన్ని తినేసే పప్పు ఏది అని ప్రశ్నించారట. కాబట్టి ఆ పప్పు రకం ఏంటి..?దాని కథాకమామిషు గురించి చూద్దామాభారతీయ ఇళ్లలో సాధారణంగా పెసర పప్పుని ఎక్కువగా వినియోగిస్తారు. ముఖ్యంగా పండుగల టైంలో ఈ పప్పుతో చేసే వంటకాలను దేవుడికి నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా ఏకాదశి వ్రతాలు చేసేవాళ్లు నియమానుసారంగా నీళ్లు, పాలు, పండ్లు తప్ప ఘన పదార్థాలు తీసుకోకూడదు. కానీ నిష్టగా చేయలేని వాళ్లు లేదా ఉపవాసానికి ఆగలేని వాళ్లు ఈ పెసరపప్పుతో చేసిన అత్తెసర లేదా హవిష్యాన్నం తిని ఉండొచ్చని వేదాలు చెబుతున్నాయి. అంతలా భారతీయ వంటకాల్లో అగ్రస్థానంలో ప్రాధాన్యత కలిగినది ఈ పెసరపప్పు. ఇంతకి పెసరపప్పు(Moong Dal) మనిషి మాంసాన్ని తింటుదా..? అని విస్తుపోకండి. ఎందుకంటే దీన్ని అలా అనడానికి వెనుకున్న శాస్త్రీయ కోణం గురించి సవివరంగా తెలుసుకుందాం."ప్రోటీయోలైటిక్ ఎంజైమ్లు"గా పలిచే ఒక ప్రత్యేక రకం ప్రోటీన్ ఉంది. ఈ ఎంజైమ్లు మన జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. స్తంభించి ఉన్న కొవ్వు, చనిపోయిన కణాల రూపంలో ఉండే అశుద్ధ మూలకాలు, చెత్తని తొలగించడం వాటి ప్రధాన విధి. పెసర పప్పు "మానవ మాంసాన్ని తింటాయి" అనగానే మన శరీర మాంసాన్ని తింటుందని కాదు, శరీరంలోని టాక్సిన్స్, వ్యర్థ పదార్థాలు, అదనపు కొవ్వును తినేస్తుందని అర్థం. బరువు తగ్గడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా మార్చడానికి పెసరపప్పు చాలా మంచిదని చెప్పడానికీ ఇదే రీజన్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారుఆరోగ్య ప్రయోజనాలు:బరువు తగ్గడం: ఊబకాయం ఉన్నవారికి పెసర పప్పు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తొలగించడానికి పనిచేస్తుంది. ఈ చెడు కొలెస్ట్రాల్, వ్యర్థపదార్థాలు చూడటానికి మాంసం మాదిరిగా కనిపిస్తాయి. అందుకని ఇలా అనడం జరిగిందని చెబుతున్నారు నిపుణులు. ఇది శరీరాన్ని మంచి ఆకృతిలో ఉండేలా చేస్తుంది. పైగాఎక్కువ కాలం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.ఇది అతిగా తినే అలవాటును తగ్గిస్తుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.రక్తపోటును నియంత్రిస్తుంది: పెసర పప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో పొటాషియం , మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి.పోషణ , జీర్ణశక్తి: పెసర పప్పు చాలా పోషకమైనది, సులభంగా జీర్ణమయ్యేదిగా పరిగణిస్తారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉపయోగపడే బలవర్ధకమైన పప్పు ఇది. అన్ని వయసుల వారు హాయిగా తీసుకోవచ్చునని చెబుతున్నారు నిపుణులు. తేలికగా జీర్ణమయ్యే ఆహారంగా పేర్కొంటారు. శరీరంలోని కొవ్వు, మలినాలను తొలగిస్తుందని ఇలా మానవ మాంసాన్ని తినేసే పప్పుగా పేర్కొన్నారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది, సురక్షితమైనది కూడా. ముఖ్యంగా శాకాహారులు హాయిగా తీసుకునే మంచి బలవర్ధకమైన పప్పు ధాన్యంగా చెబుతున్నారు నిపుణులు.(చదవండి: నిజమైన ప్రేమ అంటే ఇది కదా..!) -
ఈ విటమిన్లు తీసుకోండి
విటమిన్లు అందరికీ అవసరమే అయినా మహిళల ఆరోగ్యంలో ఇవి మరింత కీలక పాత్ర పోషిస్తాయి. 25 ఏళ్ల తరువాత మహిళల శరీరంలో పలు మార్పులు ప్రారంభమవుతాయి. ఇలాంటి కీలక దశలో పోషకాహారం, ఎక్సర్సైజులను నిర్లక్ష్యం చేస్తే విపరిణామాలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల ప్రకారం 25 దాటిన మహిళల ఆహారంలో కొన్ని విటమిన్స్ తప్పనిసరిగా ఉండాలి. అవేంటంటే..విటమిన్ డి...ఎముకలు, రోగనిరోధక శక్తి బలోపేతానికి అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్లను శరీరం సులువుగా గ్రహించేందుకు విటమిన్ డీ అవసరం. మహిళల్లో మరణాలకు ప్రధాన కారణాల్లో ఆస్టియోపోరోసిస్, ఫ్రాక్చర్ల ప్రమాదం ఎక్కువ కాబట్టి విటమిన్ డీ ఆహారంలో ఉండేలా చేసుకోవాలి. ఎందులో ఉంటుందంటే...ఫార్టిఫైడ్ పాలు, గుడ్లు, సాల్మన్ లాంటి ఫ్యాటీ ఫిష్లో ఇది పుష్కలంగా ఉంటుంది.విటమిన్ బి12...ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కీలకమైన విటమిన్ బీ12 మహిళ ఆరోగ్యానికి ఎంతో కీలకం. ఈ విటమిన్ లోపం తలెత్తితే మెగాలోబ్లాస్టిక్ అనేమియా అనే రక్తహీనత తలెత్తుతుంది. సంతానోత్పత్తికి, ప్రెగ్నెన్సీ సమయంలో ఇబ్బందులను అడ్డుకునేందుకు కూడా ఈ విటమిన్ కీలకం. ఎందులో లభిస్తుందంటే... అన్ని రకాల మాంసాహారాలలో... పాలు, పెరుగు, నెయ్యి, కివీ, అరటి వంటి పండ్లలో విటమిన్ బి 12 లభిస్తుంది. విటమిన్ సి...మహిళలకు కావలసిన అతి ముఖ్యమైన విటమిన్లలో ఇది కూడా ఒకటి. ఇది శరీరంలో ఉత్పత్తి కాదు కాబట్టి ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలకు రోజుకు 75 మిల్లీ గ్రాముల విటమిన్ సీ కావాలి. ఇది రక్తపోటు, కొలెస్టెరాల్ స్థాయులను నియంత్రించేందుకు అవసరం. వయసు పెరిగే కొద్దీ గుండె జబ్బులు అడ్డుకునేందుకు కూడా ఇది కీలకం. విటమిన్ సి సమృద్ధిగా తీసుకుంటే ఐరన్ లోపం తలెత్తే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఎందులో ఉంటుంది?నిమ్మ జాతికి చెందిన పండ్లు, కీవీ పళ్లల్లో ఈ విటమిన్ సమృద్ధిగా ఉంటుంది.విటమిన్ ఈయాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న విటమిన్ ఈ చర్మ ఆరోగ్యానికి కీలకం. అతినీలలోహిత కిరణాలు, కాలుష్యం కారణంగా చర్మానికి జరిగే నష్టాన్ని ఇది తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి కూడా బలోపేతమయ్యేలా చేస్తుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, ఇతర అసౌకర్యాల నుంచి కూడా విటమిన్ ఈ ఉపశమనం కలిగిస్తుంది.ఎందులో ఉంటుందంటే... విత్తనాలు, గింజలు, పాలకూర, పొద్దుతిరుగుడు పువ్వు నూనెలో ఈ విటమిన్ పుష్కలంగా ఉంటుంది.విటమిన్ కే...బ్లడ్ క్లాటింగ్కు కీలకమైన విటమిన్ కే గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికీ ఇది కీలకం. మహిళల్లో ఉదయం పూట కలిగే అసౌకర్యాల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. మెదడు ఆరోగ్యానికీ ఇది అవసరమే. ఆకుకూరలు, ఆవకాడో లాంటి పండ్లు, చేపలు, లివర్, మాంసం గుడ్లల్లో ఇది పుష్కలంగా ఉంటుంది.