వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ ఈనెల 18వ తేదీకి వాయిదా పడింది. బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరటంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. సీబీఐ విచారణను తాను ఏ విధంగానూ ప్రభావితం చేయకపోయినా 'సాక్షి' పెట్టుబడుల వ్యవహారంలో 15 నెలలకు పైగా తనను జ్యుడీషియల్ రిమాండ్లో ఉంచారని... ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తనకు బెయిల్ మంజూరు చేయాలని జగన్మోహన్ రెడ్డి సీబీఐ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.