పెద్ద నోట్ల కష్టాలు జిల్లా ప్రజలను వెంటాడాయి. బ్యాంకులు తెరచుకోవడంతో.. తమవద్ద ఉన్న పాత రూ.500, రూ.వెయ్యి నోట్లను మార్చుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. దీంతో ప్రధాన బ్యాంక్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు బ్రాంచిలు, పోస్టాఫీసులు కూడా రోజంతా కిటకిటలాడాయి. పెద్ద సంఖ్యలో జనం వస్తారన్న ఉద్దేశంతో ఆయా బ్యాంకుల్లో అదనపు కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. కానీ వచ్చిన జనానికి ఈ అదనపు కౌంటర్లు ఏమూలకూ చాలలేదు. దీంతో పలుచోట్ల ప్రజలు నోట్లు మార్చుకునేందుకు రోజంతా పడిగాపులు పడ్డారు.
Published Sat, Nov 12 2016 9:22 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement