problems
-
Visakhapatnam: తాగునీరు ‘మహా’ ప్రభో..
వేసవి ఇంకా పూర్తిగా మొదలుకాక ముందే నగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా హెచ్.బి.కాలనీలోని శ్రీ లక్ష్మీ నరసింహనగర్ కాలనీలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇక్కడ బిందెడు నీటి కోసం మహిళలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. కాలనీలో అనధికార కుళాయిలు పదుల సంఖ్యలో ఉండటంతో నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా కాలనీలోని ప్రతి ఇంటికి సరిగా నీరు అందడం లేదని వాపోతున్నారు. ఈ సమస్యపై స్థానికులు ఇప్పటికే పలుమార్లు జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఉంటే.. రానున్న వేసవిలో ఇంకెంత కష్టం వస్తుందోనని వారు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనేస్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
Women's Day Special: సాక్షి సత్యమేవ జయతే
-
టీడీపీ కోసం పనిచేస్తున్నట్లుగా పోలీసుల వైఖరి ఉంది: YS Jagan
-
నంద్యాల జిల్లాలో మిర్చి రైతు కష్టాలు
-
మగ దేవుళ్ళను కూడా పూజించొద్దు అంటున్నాడు మా ఆయన
మా పెళ్ళయి 15 సంవత్సరాలయింది. ఇద్దరు పిల్లలు. మొదటి నుంచి మా ఆయన నన్నెంతో ప్రేమించేవారు. కానీ ఇటీవల 2 సంవత్సరాల నుండి అనుమానంతో వేధిస్తున్నాడు. ప్రత చిన్న విషయానికీ ఆయనకు నాపైన అనుమానమే! చివరకు నా అన్నా తమ్ముడితో మాట్లాడినా అనుమానమే! ఒకప్పుడు తరచు సినిమాకో, హోటల్కో తీసుకెళ్ళే ఆయన, ఇపుడు అవన్నీ పూర్తిగా మానేశారు. నన్ను ఒక విధంగా హౌస్ అరెస్ట్ చేసి, బయట లోకమే లేకుండా చేశారు. చివరకు ఇంట్లో మగ దేవుళ్ళ పటాలు కూడా తీసివేసి, పూజలు కూడా చేసుకోనివ్వడం లేదు. ప్రమాణంగా చెప్తున్నాను. నాకసలు అలాంటి ఆలోచనలే లేవు. ఈ విషయాలు ఎవరితో చెప్పుకోలేక ఆయన బాధలు పడలేక ఒక్కోసారి చచ్చిపోదామనిపిస్తోంది. నన్ను బయటకు కదలనివ్వడం లేదు. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపిస్తారనే ఆశిస్తున్నాను.– ఒక సోదరి విజయవాడజ. మీ మనోవేదనను అర్థం చేసుకున్నాను. మగవారినే కాదు, మగ దేవుళ్ళను కూడా చూడొద్దు, పూజించొద్దు అనే స్థాయికి వెళ్ళాడంటే అది ఖచ్చితంగా మానసిక జబ్బే! ‘డెల్యూజనల్ డిసాస్టర్’ లేదా ‘΄ారనాయిడ్ సైకోసిస్’ అనే ఈ తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మెదడులోని సెరటోనిన్ అనే ఒక ప్రత్యేక రసాయనిక పదార్థం సమతుల్యంలో తేడాలొచ్చినప్పుడు లేదా వారసత్వంగా కూడా కొందరికి ఇలాంటి మానసిక జబ్బు వచ్చే అవకాశముంది. ఇలాంటి ప్రవర్తన కూడా ఒక మానసిక రుగ్మతేనన్న విషయం తెలియక కొందరు మానసిక వ్యాధి అంటే ‘పిచ్చి’ పట్టిందని అంటారనే భయంతో బయటకు చెప్పుకోలేకపోవడం లేదా ఆ వ్యక్తి డాక్టరు దగ్గరకు చికిత్సకు వచ్చేందుకు సహకరించకపోవడం వల్ల జబ్బు ముదిరిపోయి, తీవ్రస్థాయికి వెళ్ళే ప్రమాదముంది. మీ దగ్గరి బంధువుల సహాయం తీసుకొని, ఏదో ఒకవిధంగా ఒకసారి మీరు హాస్పిటల్కి రాగలిగితే పూర్తి వివరాలు తీసుకుని, ఇలాంటి వారికి ఎలాంటి వైద్యం చేయాలో మీతో వివరంగా చర్చించడానికి వీలవుతుంది. కొత్త మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం ప్రకారం అయన ఒప్పుకోకపోయినా వైద్యం చేసే అవకాశముంది. ఆలస్యం చేయకుండా ముందుకెళ్ళండి!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
Satyameva Jayate: చిదిమేస్తున్న చదువులు.. ప్రతిభకు కొలమానం ర్యాంకులేనా?
-
Meetho Sakshi: ఫ్రీ బస్సు.. మా ఆటోలన్ని ఖాళీ.. జర మా గోడు వినండి..
-
కువైట్ ఎయిర్ పోర్ట్ లో 13 గంటల పాటు భారతీయుల అవస్థలు
-
వీపు ‘మోత’ మోగుతోంది
దాదర్: విద్యార్ధులు మోస్తున్న బరువైన స్కూలు బ్యాగుల వల్ల వారికి భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదముందని ఆర్థోపెడిక్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చాలా సందర్భాల్లో విద్యార్ధుల కంటే వారి సంచీ బరువే ఎక్కువగా ఉంటోందని ఇది వారి ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రముఖ ఆర్థోపెడిక్, స్పైన్ సర్జన్ డాక్టర్ సమీర్ రూపరేల్ పేర్కొన్నారు. పది మంది విద్యార్ధుల్లో ఎనిమిది మంది భుజం, వెన్ను, నడుము నొప్పులతో బాధపడుతున్నారని, ప్రతీరోజు అన్ని సబ్జెక్టుల అచ్చు, నోటు పుస్తకాలు స్కూలుకు తీసుకెళ్లడం, తిరిగి ఇంటికి తీసుకురావడమే ఈ సమస్యలకు ప్రధాన కారణమని ఓ అధ్యయనంలో తేలిందని, కాబట్టి సాధ్యమైనంత వరకు సంచీ బరువు తగ్గించే ప్రయత్నం చేయాలని పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు... విద్యార్ధుల బ్యాగుల బరువు తగ్గించే విషయంపై అనేక సంవత్సరాల నుంచి చర్చలు జరుగుతున్నాయి. స్కూలు సంచీల బరువు మోయలేక విద్యార్ధుల వెన్ను వెనక్కు వాలిపోతోంది. వెన్ను నొప్పితో సతమతమవుతూ చికిత్స చేయాల్సిన పరిస్థితులు కూడా చోటుచేసుకుంటుండటంతో ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది. బ్యాగు బరువు తగ్గించే విషయంపై అన్ని పాఠశాలల యాజమాన్యాలు స్పందించాలని సూచించింది. టైం టేబుల్ ప్రకారం పుస్తకాలు తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించాలని హోంవర్క్ మినహా ఇతర నోటు పుస్తకాలు తరగతి గదిలోనే భద్రపరచుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని గతంలోనే ఆదేశించినప్పటికీ అన్ని తరగతి గదుల్లో ర్యాక్లు నిరి్మంచడం లేదా అందుబాటులో ఉండేలా చూడాల్సిరావడం ఒకింత భారం కావడంతో అనేక పాఠశాలల యాజమాన్యాలు ఈ ఆదేశాలను అటకెక్కించాయి. దీంతో గత్యంతరం లేక విద్యార్ధులు అన్ని నోటు, అచ్చు పుస్తకాలను మోసుకెళ్లడంవల్ల బ్యాగు బరువు ఎక్కువవుతోంది. దీనికి తోడు ఒక్కో సబ్జెక్టుకు ఒక అచ్చు పుస్తకం, రెండు నోటు పుస్తకాలు, ఒక వ్యాసం లేదా గ్రామర్ పుస్తకం, ఇలా కనీసం నాలుగైదు పుస్తకాలుంటున్నాయి. మొత్తం ఆరు సబ్జెక్టులకు కలిపి సుమారు 20–25 పుస్తకాలను రోజూ మోయాల్సి రావడం వల్ల విద్యార్ధులు వెన్ను, నడుం భుజాల నొప్పితో బాధపడుతున్నారు. నిబంధనల ప్రకారం స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల శరీర బరువుకంటే 15 శాతం తక్కువగా ఉండాలి. ఒకటి, రెండో తరగతి విద్యార్ధుల బ్యాగు బరువు సుమారు కేజీ, మూడు నుంచి ఐదో తరగతి విద్యార్ధుల బ్యాగు బరువు రెండున్నర నుంచి మూడు కేజీల మధ్య, ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్ధుల బరువు మూడు నుంచి నాలుగు కేజీల మధ్య ఉండాలి. ఇక తొమ్మిది, పదో తరగతి విద్యార్ధుల బ్యాగు బరువు సుమారు ఐదు కేజీల కంటే ఎక్కువ ఉండరాదని సమీర్ రూపరేల్ తెలిపారు. కానీ అనేక కారణాల వల్ల పరిమితిని మించి విద్యార్థులు స్కూ లు బ్యాగుల బరువును మోస్తున్నారని దీనివల్ల వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విపరీతమైన బరువు కారణంగా విద్యార్ధులు పూర్తిగా ఎదగలేక పోతున్నారని ఈ కారణంగా వారు నిలుచునే భంగిమలో కూడా మార్పు వస్తోందని ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో వారికి మరింత ఇబ్బంది కలిగే ప్రమాదముందని రూపరేల్ ఆందోళన వ్యక్తం చేశారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
డిచ్పల్లి: మండలంలోని ధర్మారం(బి) గ్రామాని కి చెందిన దుబ్బాక ఉమా మహేశ్వరి(32) అనే వివాహిత శుక్రవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఉమామహేశ్వరి 13 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన బాలస్వామిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. బాలస్వామి పెయింటర్గా, ఉమామహేశ్వరి టైలరింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కొంత కాలంగా ఉమామహేశ్వరి మైగ్రేన్(ఒకవైపు తలనొప్పి)తో బాధపడుతోంది. అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నాయి. శుక్రవారం భర్త బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన భర్త విషయం గమనించి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి మృతదేహాన్ని కిందికి దించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
హిందువుల రక్షణ మన బాధ్యత: మోహన్ భగవత్
బంగ్లాదేశ్లో హింసకు బలవుతున్న హిందువులను రక్షించాల్సిన బాధ్యత భారత్పై ఉన్నదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. బంగ్లాదేశ్లోని హిందువులను లక్ష్యంగా చేసుకున్నారంటూ వస్తున్న వార్తలపై మోహన్ భగవత్ స్పందించారు.అక్కడ నివసిస్తున్న హిందువులను అకారణంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడున్న హిందువులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మన దేశంపై ఉందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు.ఇతరులకు సహాయం చేసే సంప్రదాయం భారతదేశంలో ఉందన్నారు. గత కొన్నేళ్లుగా భారత్ ఎవరిపైనా దాడి చేయలేదని, అందుకు బదులుగా కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందించామన్నారు. బంగ్లాదేశ్లో నెలకొన్న అస్థిరత, అరాచకాల వల్ల అక్కడున్న హిందువులు అవస్థల పాలవుతున్నారని అన్నారు. అందుకే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు. -
తండ్రి మృతదేహాన్ని 20 కి.మీ. మోసుకెళ్లి..
దుమ్ముగూడెం: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అనారోగ్యంతో మృతి చెందిన తండ్రి మృతదేహాన్ని ఆయన కుమారులు 20 కిలోమీటర్లు జట్టీలపై మోసుకెళ్లారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పంచాయతీ పరిధి ఆర్లపెంట గ్రామానికి చెందిన రవ్వా భీముడు కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనను తొలుత భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచగా రానురాను ఖర్చు పెరగడంతో కుమారులు సుక్మా జిల్లా పాలచల్మలో ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న భీముడు సోమవారం మృతి చెందాడు. అయితే, పాలచల్మ నుంచి స్వగ్రామమైన ఆర్లపెంట 20 కి.మీ. దూరం ఉండగా మార్గమధ్యలో పలుచోట్ల రహదారులపైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భీముడి కుమారులిద్దరు జట్టీ కట్టి తమ తండ్రి మృతదేహాన్ని దట్టమైన అటవీ ప్రాంతంలోనుంచి జోరువానలో 20 కి.మీ. మేర నడుస్తూ తీసుకెళ్లారు. ఆర్లపెంట చేరుకున్నాక అంత్యక్రియలు నిర్వహించారు.అంత్యక్రియలకు వరద అడ్డంకి నిండుగా ప్రవహిస్తున్న ప్రాణహిత వేమనపల్లి: ఆఖరి మజిలీకి వరద అడ్డొచ్చింది. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వైకుంఠధామం ఉన్నా నిరుపయోగంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రంలో రెండు రోజుల వ్యవధిలో వగావత్ సాలక్క, ఎల్లెల గంగయ్య వృద్ధాప్యంతో మృతిచెందారు. వేమనపల్లిలో వైకుంఠధామం ఉన్నా నీళ్లు, కరెంటు, బాత్రూం సౌకర్యాలు లేక, శిథిలావస్థకు చేరి నిరుపయోగంగానే మారింది.ఎవరూ అక్కడ అంతిమ సంస్కారాలు చేసేందుకు వెళ్లరు. ప్రాణహిత నదికి తీసుకెళ్లి అంతిమ సంస్కారా లు నిర్వహిస్తుంటారు. కాగా, నాలుగు రోజులుగా ప్రాణహిత నది నిండుగా ప్రవ హిస్తోంది. సోమవారం పుష్కరఘాట్, రోడ్డుపూర్తిగా మునిగిపోవడంతో నదికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆదివారం గంగయ్యను కుటుంబీకులు మత్తడివాగు వైపు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయగా.. సోమవారం సాలక్క మృతదేహాన్ని సైతం అటువైపే తీసుకెళ్లారు. మార్గమధ్యలో అంపుడొర్రె వరకు ప్రాణహిత ముంపు నీరు ఆవరించి ఉండటంతో మృతదేహంతో అంపుడొర్రె దాటి అవతలి వైపు వెళ్లారు. మత్తడి ఒర్రెలో దహన సంస్కారాలు పూర్తి చేశారు.వరద ‘గుండాల’ గుండాల: అయిదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అత్యవసర పని ఉండి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే వాగులు దాటుకుంటూ ప్రాణాలకు తెగించి సాహసం చేయాల్సిందే. మండలంలోని గుండాల – కొడవటంచ గ్రామాల మధ్య లోలెవెల్ వంతెన ఉన్నా.. వరదలు పెరగడంతో దానిపై నుంచి అధికారులు రాకపోకలు నిలిపివేశారు. దీంతో కొడవటంచ గ్రామస్తులు అధికారుల కళ్లుగప్పి ఇలా ఏడుమెలికల వాగు దాటుకుంటూ వెళ్లాల్సి వచి్చంది. తప్పని డోలీ ఇక్కట్లు జ్వరంతో ఉన్న మహిళను మూడు కిలోమీటర్లు మోసుకుంటూ.. ఆ తర్వాత అంబులెన్స్లో భద్రాచలం ఆస్పత్రికి తరలింపు బూర్గంపాడు: వానాకాలం వచి్చందంటే ఆ గ్రామస్తులకు డోలీల ఇక్కట్లు తప్పడం లేదు. జబ్బు చేసినా, ఏదైనా ఆపద వచి్చనా డోలీ కట్టాల్సిందే. సరైన రహదారి లేక వారు కష్టపడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీ పరిధిలోని శ్రీరాంపురం ఎస్టీకాలనీకి చెందిన సొడే రాజు నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే గ్రామస్తులు డోలీ కట్టి మూడు కిలోమీటర్లు మోసుకొచి్చ, ఆ తర్వాత ఆటోలో భద్రాచలం ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.మళ్లీ అదే గ్రామంలోని నర్సమ్మ అనే మహిళ జ్వరం బారిన పడగా సోమవారం ఆమెను కుటుంబసభ్యులు డోలీ కట్టి మూడు కిలోమీటర్లు మోసుకుంటూ వచ్చారు. సమాచారం తెలిసిన బూర్గంపాడు ఎస్సై రాజేశ్ స్పందించి వెంటనే అంబులెన్స్ను పంపించగా అందులో నర్సమ్మను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై సహకారంతో తమకు కొంతమేర డోలీ బాధ తప్పిందని బాధితులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. భద్రాచలం ఐటీడీఏకు కూతవేటు దూరంలోనే ఉన్న తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు. అంబులెన్స్ లేక.. మోటారు బైక్పై...రాజవొమ్మంగి: అభాగ్యురాలైన ఓ గిరిజన మహిళ ఆస్పత్రిలో కన్నుమూస్తే ఆమెను మోటారుసైకిల్పై ఇంటికి తరలించిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో జరిగింది. మిరియాలవారి వీధి గ్రామానికి చెందినకుంజం అన్నపూర్ణ (60) అనారోగ్యంతో సోమవారం జడ్డంగి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లింది.పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె వెంట కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేకపోవడంతో మృతదేహాన్ని తరలించేవారు కరువయ్యారు. ఆస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో చేసేదిలేక జడ్డంగి లారీఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గణజాల మల్లికార్జున్ చొరవచూపి మృతదేహాన్ని యువకుల సహాయంతో మోటారు సైకిల్పై 5 కిలోమీటర్ల దూరంలోని మిరియాలవారి వీధి గ్రామానికి చేర్చారు. -
మగ్గానికి మంచి రోజులు ఎప్పుడు ?
-
గన్నవరం ఎయిర్పోర్ట్లో భారీ వర్షం.. ల్యాండింగ్కు అంతరాయం
సాక్షి,కృష్ణాజిల్లా: గన్నవరం విమానాశ్రయంలో సోమవారం(జులై 15) భారీ వర్షం పడింది. వర్షం కారణంగా విమానాల ల్యాండింగ్కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. వర్షం కారణంగా ల్యాండింగ్కు ఏటిసి అధికారులు అనుమతి ఇవ్వపోవడంతో పైలట్ విమానాన్ని కొద్దిసేపు గాల్లోనే తిప్పాల్సి వచ్చింది. -
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. వర్షాలు, ఈదురుగాలుల మూలంగా చెట్లు విరిగిపోవడం, స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు ఊడిప డటం లాంటి ఘటనలు జరుగుతుంటాయని, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమస్య వచి్చన వెంటనే స్పందించాలని సూచించారు. శని వారం సచివాలయంలో ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘ప్రజలు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ అందుబాటులో ఉంది.సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టండి. లైన్స్ క్లియరెన్స్ (ఎల్సీ) విషయంలో జాగ్రత్త వహించాలి. ఒకేసారి పలు ప్రాంతాల్లో ఎల్సీలు ఇవ్వొద్దు. ఎల్సీ తీసుకునే సమయంలో స్థానిక వినియోగదారులకు ముందస్తు సమాచారం ఇవ్వండి. వర్షాకాలంలో కరెంటు సరఫరా, మరమ్మతులు, పునరుద్ధరణ విషయంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి నుంచి క్షేత్రస్థాయిలోని లైన్మెన్ వరకు అప్రమత్తంగా ఉండాలి. నిరంతరం సమీక్షలు నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకోండి’అని భట్టి ఈ సమీక్షలో సూచించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం.ఎ.రిజ్వి, ఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ, ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆలోచనల మేరకు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చారని శనివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయాలు, ఆకాంక్షలు పదేళ్లుగా ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన మొదలయ్యాక ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపారు. -
నిద్రను దూరం చేసేవి ఇవే! నివారించాలంటే..!
నగరజీవితం ప్రతి మారుమూల పల్లెల్నీ తాకాక, జీవితాల్లోకి సెల్ఫోన్ దూసుకువచ్చాక ప్రధానంగా మొన్న కరోనా అందరినీ తాకి వెళ్లాక నిద్రలేమి ఓ పెద్ద సమస్యగా మారింది. రాత్రి ఒంటిగంటా, రెండు వరకూ నిద్రపట్టకపోవడం మామూలేంది. వైద్యపరిభాషలో ‘ఇన్సామ్నియా డిజార్డర్’ అని పిలిచే ఈ సమస్య ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుంది. నిద్రను దూరం చేసే అంశాలేమిటో, నిద్రపట్టేదెలాగో తెలిపేదే ఈ కథనం. నిద్రలేమి సమస్య అందరిలో ఒకలా ఉండదు. కొందరికి రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపట్టవచ్చు. కొందరికి త్వరగా నిద్రపట్టినప్పటికీ, కాసేపటికే మెలకువ వచ్చి... ఇక ఆపైన ఎంత ప్రయత్నించినా నిద్రరాక΄ోవచ్చు. కొందరికి ఏ తెల్లవారుజామున మూడు, మూడున్నరకు మెలకువ వచ్చాక... మళ్లీ ఏ ఆరు, ఏడు గంటలప్పుడో నిద్ర రావడం, కానీ ఎలాగూ తెల్లవారి΄ోయింది కదాని బలవంతంగా నిద్రలేస్తే... రోజంతా డల్గానూ ఉండవచ్చు. ఇవన్నీ నిద్రలేమి సమస్యలే. నిద్రలేమి రెండు రకాలుగా ఉండవచ్చు. మొదటిది తాత్కాలిక నిద్రలేమి, రెండోది దీర్ఘకాలిక నిద్రలేమి. మొదటిది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అదే మూడువారాల కంటే ఎక్కువకాలంగా బాధిస్తుంటే దాన్ని క్రానిక్ ఇన్సామ్నియాగా చెప్పవచ్చు. కారణాలను బట్టి నిద్రలేమిలో మరో రెండు రకాలుంటాయి. అవి... ప్రైమరీ ఇన్సామ్నియా: నిర్దిష్టమైన ఎలాంటి కారణాలూ లేకుండా మామూలుగా నిద్రపట్టక పోవడాన్ని ‘ప్రైమరీ ఇన్సామ్నియా’ అంటారు. సెకండరీ ఇన్సామ్నియా: ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల వచ్చే నిద్రలేమిని ‘సెకండరీ ఇన్సామ్నియా’ అంటారు. అంటే మానసిక సమస్యలతో బాధపడుతుండటం లేదా గ్యాస్ వల్ల కలిగే ఛాతీలో మంట, ఆస్తమా, క్యాన్సర్ (కొన్ని సందర్భాల్లో క్యాన్సర్కు తీసుకునే చికిత్సల వల్ల కూడా); గుండెజబ్బులు, కీళ్లనొప్పులు లేదా దేహంలో మరెక్కడైనా తీవ్రమైన నొప్పి వల్ల నిద్రపట్టకపోవడం; కొన్ని సందర్భాల్లో మత్తుపదార్థాలను అధికంగాతీసుకున్నప్పుడూ నిద్రకు దూరం కావడం మామూలే. పట్టరాని సంతోషమూ లేదా భరించలేనంత దుఃఖం వల్ల కూడా నిద్రపట్టకపోవచ్చు. ఇలా వచ్చే నిద్రలేమిని ‘సెకండరీ ఇన్సామ్నియా’గా చెప్పవచ్చు. ఇన్సామ్నియాకు కారణాలు చిన్నతనంలో తీవ్రవేదనకు గురికావడం డిప్రెషన్, యాంగై్జటీ వంటి మానసిక సమస్యలు నిద్రమేల్కొని షిఫ్టుల్లో పనిచేయడం ∙వాతావరణ పరిస్థితులు (పెద్ద పెద్ద శబ్దాలు, తీక్షణమైన కాంతి, ఎక్కువ వేడి/చలి) జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు (ప్రియమైన వారి మరణం, అకస్మాత్తుగా ఉద్యోగం మారడం, విడాకుల వంటివి) కొన్నిరకాల మందులతో (ఉదా: అలర్జీ, ఆస్తమా, డిప్రెషన్, బీపీలకు వాడే కొన్ని మందులు).మేనేజ్మెంట్ / చికిత్స: తాత్కాలిక నిద్రలేమికి చికిత్స అవసరం లేదు. కాక΄ోతే వేళకు నిద్రపోవడం వంటి మంచి అలవాట్ల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. కానీ దీర్ఘకాలిక నిద్రలేమి ఉన్నప్పుడు ఏ కారణాల వల్ల ఇలా జరుగుతుందో చూడాలి. అంటే... మానసిక సమస్యల వల్లనా లేదా ఏవైనా శారీరక సమస్యలున్నాయా అని పరీక్షలు జర΄ాల్సిన అవసరముంటుంది. మానసిక సమస్యలతో ఇలా జరుగుతుంటే తగిన చికిత్స తీసుకోవాలి. ∙నిద్రమాత్రలు వాడటం ఒక చికిత్స. అయితే ఇవి తాత్కాలికంగానే వాడాలి. బాధితులు వాటికి అలవాటు పడే (అడిక్షన్కు) అవకాశం ఉంటుంది. అప్పుడు వాటిని వదిలించడానికి మరో చికిత్స చేయాల్సిరావచ్చు. అందుకే వాటిని దీర్ఘకాలం వాడటం సరికాదు. అందువల్ల జీవనశైలి మార్పులతో వేళకు నిద్ర΄ోయేలా చేసుకోవడం మంచిది. నిద్రలేమి నివారణ ఇలా... వేళకు నిద్ర΄ోవాలి. నిద్రకు అరగంట ముందర గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది ∙మధ్యాహ్నం నిద్ర ఓ పవర్న్యాప్లా అరగంట చాలు. ఒకవేళ మధ్యానం చాలాసేపు నిద్రపోతే అది రాత్రి నిద్రకు చేటుగా మారవచ్చు కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కాఫీతో తోపాటు కొన్ని కూల్డ్రింక్స్కు దూరంగా ఉండాలి ∙సిగరెట్లలోని నికోటిన్తో కూడా నిద్రను దూరం చేస్తుంది.ఆల్కహాల్తో నిద్ర పట్టినప్పటికీ ఒక్కోసారి తెల్లవారుజామున మెలకువ వచ్చి మళ్లీ నిద్రపట్టక΄ోవడం, నిద్ర సమయం తగ్గి΄ోవడం మామూలే. అందుకే మద్యం అలవాటుకు దూరంగా ఉండాలి ∙వ్యాయామంతో అలసిపోతే బాగా నిద్రపడుతుంది. అయితే నిద్రపోవడానికి 4–5 గంటల ముందు వ్యాయామం చేయకూడదు. పడక గదిలో టీవీ ఎట్టిపరిస్థితుల్లో ఉండకూడదు తీవ్రమైన ఉద్విగ్నత, ఆందోళన నిద్రను దూరం చేసే అంశాలు. అందుకే మానసిక ప్రశాంతత అవసరం. ఇందుకోసం యోగా, ధ్యానం చాలావరకు ఉపయోగపడతాయి నిద్ర టైముకు అరగంట ముందర గోరువెచ్చని పాలు తాగాలి. అందులోని ట్రిప్టోఫాన్ అనే ఎసెన్షియల్ అమైనో యాసిడ్ మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. నిద్రమాత్ర కంటే ఇది చాలా ఆరోగ్యకరమైన అలవాటని గుర్తుంచుకోవాలి. డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జువ్వా, స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మనాలజిస్ట్ (చదవండి: మగవాళ్లకు స్టయిలింగ్ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ) -
చుండ్రు సమస్య వేధిస్తోందా? ఇలా ట్రై చేయండి!
వేసవిలో చెమట ఎక్కువగా ఉండటం, వాతావరణ కాలుష్యం కారణంగా జుట్టు సమస్యలు వేధిస్తాయి. చెమట, ధూళికారణంగా జుట్టుకి తొందరగా మురికిపడుతుంది. అందువల్ల తరచు తలస్నానం చేయాలి. అలా తలస్నానం చేయకపోవడం వల్ల అంతకుముందు చుండ్రు లేనివారికి చుండ్రు వచ్చే అవకాశం ఉంది. ముందే చుండ్రు ఉన్నవారిని ఆ సమస్య మరింతగా వేధిస్తుంది. చుండ్రు సమస్యను తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ∗ రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకుని ఒక టీస్పూన్ రసాన్ని తలకు (జుట్టు కుదుళ్లకు) పట్టించి పది నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. మరొక టీ స్పూన్ల రసంలో కప్పు నీటిని కలిపి తలస్నానం పూర్తయిన తర్వాత తల మీద (స్కాల్ప్కు పట్టేలా) పోసుకోవాలి.∗ వారం పాటు తలకు ఆలివ్ ఆయిల్ రాస్తే చుండ్రు వదులుతుంది. రోజూ తలస్నానం చేసే వాళ్లు రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ పెట్టి ఉదయం తలస్నానం చేయవచ్చు.∗ రెండు టేబుల్ స్పూన్ల ల కొబ్బరి నూనెలో అంతే మోతాదు నిమ్మరసం కలిపి తలకు పట్టించి పది నిమిషాల సేపు మర్దన చేయాలి. మర్దన చేసిన తర్వాత ఇరవై నిమిషాలకు మామూలు షాంపూ లేదా కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి.∗ టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రి నానబెట్టి ఉదయం మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి అందులో నిమ్మరసం (ఒక కాయ) కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. తలకు మెంతుల పేస్ట్ పెట్టినప్పుడు కొద్దిగా తేమగా ఉండగానే తలస్నానం చేయాలి. పూర్తిగా ఎండి΄ోయే వరకు ఉంచితే జుట్టుకు పట్టేసిన మెంతుల పేస్టును వదిలించడం కష్టం.∗ కప్పు పుల్లటి పెరుగులో టీ స్పూన్ల నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. ఆరిన తర్వాత తలస్నానం చేయాలి.∗చుండ్రును వదిలించడంలో వేపాకు కూడా బాగా పని చేస్తుంది. వేపనూనె తలకు పట్టించి పది నిమిషాల సేపు మర్దన చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. వేప నూనె లేక΄ోతే వేపాకు రసం పట్టించి మర్దన చేయవచ్చు. -
అవ్వా, తాతల ఉసురు పోసుకుని ఉరేగుతోన్న పచ్చమంద
-
నేనున్నాను.. నేను విన్నాను
ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో సోమవారం జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా పలువురు అనారోగ్య బాధితులు, ప్రజలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు వచ్చారు. వీరిని చూసి స్వయంగా బస్సు దిగి వచ్చిన సీఎం వారి సమస్యలను సావధానంగా విన్నారు. నేనున్నానని భరోసా ఇచ్చారు. అర్జీలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలు, లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించారు. దీంతో వారంతా ముగ్ధులైపోయారు. ఆనందం వ్యక్తం చేశారు. జై జగన్ అంటూ నినదించారు. – కురిచేడు/మాచవరం / పిడుగురాళ్ల రూరల్/ వినుకొండ(నూజెండ్ల)/నరసరావుపేట రూరల్ దివ్యాంగురాలికి సీఎం ఆరోగ్యరక్ష మా పాప పుట్టిన కొంతకాలానికి మూర్చ వ్యాధి వచ్చింది. సకాలంలో చికిత్స చేయించకపోవడంతో మతిస్థిమితం కోల్పోయింది. ఆ తర్వాత శారీరక వైకల్యమూ శాపంగా మారింది. పాపకు చికిత్స చేయించే స్థోమత లేక ఇబ్బంది పడుతున్నాం. బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మా సమస్యను విన్నవించాం. ఆయన పెద్ద మనసు చూపారు. చికిత్స చేయించేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మాపాలిట ఆపద్బాంధవుడు సీఎం జగన్. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – నాగిశెట్టి రమాదేవి, సత్యనారాయణ, ఎన్ఎస్పీ కాలనీ, కురిచేడు, ప్రకాశం జిల్లా అంధురాలి చదువుకు సీఎం అభయం మా పాప చందన పుట్టుకతోనే అంధురాలు. బిడ్డకు ఇక కళ్లు రావని వైద్యులు చెప్పారు. కనీసం పాపను చదివించేందుకు ప్రభుత్వం తరఫున సాయం అందించాలని బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరాం. వెంటనే స్పందించిన సీఎం పాప చదువుకు అభయమిచ్చారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – చిప్పగిరి పాపయ్య, రమణమ్మ, కురిచేడు, ప్రకాశం జిల్లా జగనన్న ధైర్యమిచ్చారు మా పాప నర్రా వర్షిణి ఆరో తరగతి చదువుతోంది. పుట్టిన 9వ నెల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. ఇప్పటికే లక్షలాది రూపాయలు చికిత్స కోసం ఖర్చు చేశాం. ఫలితం లేకపోయింది. ప్రతినెలా రక్త మార్పిడికి రూ.10 వేలు, వైద్య పరీక్షలు, మందులకు రూ.10 వేలు మొత్తం రూ.20 వేలు ఖర్చు అవుతోంది. నా భర్త ఆటో డ్రైవర్. నేను చిన్న పాటి హోటల్ నిర్వహిస్తున్నా. మా బాధలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు వెళ్లగా, ఆయన బస్సు వద్దకు పిలిపించుకుని మా సమస్యను విని నేనున్నానని భరోసా ఇచ్చారు. మీకు ఇబ్బందులు లేకుండా చూస్తానని ధైర్యం చెప్పారు. ఆపరేషన్ చేయించి మీ కుటుంబం సంతోషంగా ఉండేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. – నర్రా శివ లావణ్య, కళ్యాణిపురం, వినుకొండ పట్టణం, పల్నాడు జిల్లా వెన్నెముక దెబ్బతిన్న యువతికి అభయం నేను ఎం ఫార్మసీ చదివాను. మా గ్రామంలో ప్రభ విరిగి పడడంతో నా వెన్నెముక దెబ్బతింది. కాళ్లు చచ్చుపడ్డాయి. వీల్చైర్కే పరిమితమయ్యాను. సీఎం బస్సు యాత్రగా వస్తున్నారని తెలిసి బంధువుల సాయంతో వచ్చాను. రోడ్డుపక్కన వేచి ఉన్న నన్ను చూడగానే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు దిగి వచ్చి సమస్య తెలుసుకున్నారు. అండగా ఉంటానని అభయం ఇచ్చారు. తన ముఖ్యకార్యదర్శి హరికృష్ణను కలవాలని సూచించారు. చాలా ఆనందంగా ఉంది. సీఎం స్పందించిన తీరు అద్భుతం. – కొత్త తేజస్వీ, విఠంరాజుపల్లి, వినుకొండ రూరల్, పల్నాడు జిల్లా చిన్నారి వైద్యసాయానికి భరోసా మా బిడ్డ రోహిణికి 12 ఏళ్లు. ఐదేళ్ల నుంచి వెన్నెముక సమస్యతో బాధపడుతోంది. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో చికిత్స చేయించలేకపోయాం. రూ.ఐదు లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. బస్సు యాత్ర సందర్భంగా శావల్యాపురంలో సీఎం జగన్ను కలిసేందుకు ప్రయత్నించాం. మమ్మలను చూడగానే సీఎం బస్సు దిగి వచ్చి మా సమస్య అడిగి తెలుసుకున్నారు. వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపరేషన్ చేయిస్తానని భరోసా ఇచ్చారు. – పున్నారావు, ఝాన్సీ దంపతులు, శావల్యాపురం, పల్నాడు జిల్లా నా భూమిని మాజీ ఎమ్మెల్యే జీవీ అనుచరులు ఆక్రమించారు నాకు సీతారామపురం గ్రామంలో 2.46 ఎకరాల భూమి ఉంది. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అనుచరులు ఆ భూమిని ఆక్రమించుకున్నారు. కేవలం 80 సెంట్లు మాత్రమే ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో చూపారు. నేను డాక్టర్ను. నడవలేని స్థితిలో ఉన్నా. నా సమస్యను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెబుదామని వచ్చాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు ఆపి నా దగ్గరకు వచ్చి సమస్య తెలుసుకున్నారు. పరిష్కరించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. – డాక్టర్ మోదుగుల వెంకటేశ్వరమ్మ, సీతారామపురం, వినుకొండ, పల్నాడు జిల్లా సాగర్ జలాలకు హామీ తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. మా గ్రామ చెరువుకు సాగర్ జలాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని బస్సుయాత్రగా గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరాం. గ్రామ సర్పంచ్ వేమా శివ, మాజీ సర్పంచ్ బత్తుల చిన సుబ్బయ్య, నాయకుడు వేమా చిన్న ఆంజనేయులుతో కలిసి వెళ్లి సీఎంకు వినతిపత్రం ఇచ్చాం. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. – బోధనంపాడు గ్రామస్తులు, కురిచేడు మండలం, ప్రకాశం జిల్లా -
పాఠశాలల పునః ప్రారంభం తర్వాత కూడా కొనసాగనున్న “వాటర్ బెల్”
పాఠశాలల పునః ప్రారంభం (జూన్ 12వ తేదీ) తర్వాత కూడా “వాటర్ బెల్” విధానాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు (ఏప్రిల్ 23వ తేదీ) వరకు ప్రతిరోజు వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని ఈ సందర్భంగా డీఈవోలకు సూచించారు. అంతేగాక మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని గుర్తించి నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించేందుకు వీలుగా వారు గుర్తించేలా పోస్టర్ను జతపరిచామని పేర్కొన్నారు. ఈ పోస్టర్లను పోస్ట్కార్డ్ సైజులో ముద్రించి ప్రతి మూత్రశాల మరియు టాయిలెట్ బ్లాక్ ముందు అతికించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా మూత్రం ఏ రంగూ లేకుండా వస్తే పారదర్శకంగా ఉందని, నీరు అధికంగా త్రాగుతున్నారని అర్థం. లేత గోధుమ రంగు వస్తే ఆరోగ్యంగా ఉన్నారని, తగినంత నీరు త్రాగుతున్నారని అర్థం. లేత పసుపు రంగు వస్తే సాధారణ స్థితి అని, ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. ముదురు పసుపు రంగు వస్తే నీరు తక్కువగా త్రాగుతున్నారని, మరి కొంత నీరు శరీరానికి అవసరమని అర్థం. తేనె రంగులో వస్తే శరీరానికి సరిపడినంత నీరు అందడం లేదని అర్థం. ముదురు గోధుమ రంగులో వస్తే వెంటనే ఎక్కువ నీరు త్రాగాలని విద్యార్థులకు సూచించేలా పోస్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు. జపాన్కు చెందిన టోషికో మొరిమోటో, యాసుయో ఆబే, అమెరికన్ స్కాలర్స్ పటేల్ ఏఐ మరియు లాస్ ఏంజిల్స్కు చెందిన బోర్రుడ్ ఎల్జి, నెదర్లాండ్స్కు చెందిన డచ్ స్కాలర్స్ మెక్కీ టీఈ, ఫాగ్ట్ ఎస్ ఈటీ ఏఐ, ఇతరులు నిర్వహించిన పరిశోధనలు ఈ విధానం యొక్క ఆవశ్యకతను నిర్ధారించాయని ప్రవీణ్ ప్రకాష్ వివరించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎండ వేడిమికి విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ మోగించాలని ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
బాధపడొద్దు.. నేనున్నా
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం ‘‘మేమంతా సిద్ధం’’ బస్సు యాత్ర సందర్భంగా పలువురు అనారోగ్య బాధితులు, వృద్ధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి తమ సమస్యలు విన్నవించి ఆదుకోవాలని అభ్యర్ధించారు. వారి కష్టాలను సావధానంగా ఆలకించిన సీఎం జగన్ ప్రతి ఒక్కరి నుంచి అర్జీలను స్వీకరించారు. ‘‘బాధపడొద్దు.. నేను ఉన్నాను. తప్పకుండా మీ సమస్యలను త్వరగా పరిష్కరిస్తా’’ అని భరోసా ఇచ్చి అర్జీలను వ్యక్తిగత సిబ్బందికి అందజేశారు. – సింగరాయకొండ (మర్రిపూడి) పొన్నలూరు/పీసీపల్లి టీడీపీ వాళ్లు పొలం కబ్జా చేశారయ్యా.. మర్రిపూడి మండలం చిలంకూరు గ్రామానికి చెందిన రాయిపాటి లక్ష్మీనరసయ్య (70) వైఎస్సార్ మరణానంతరం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ పదేళ్ల పాటు గడ్డం పెంచాడు. 2019 ఎన్నికలకు ముందు జగన్తో పాటు పాదయాత్రలో పాల్గొన్నాడు. దీనిపై కక్షగట్టిన టీడీపీ సానుభూతిపరులు లక్ష్మీనరసయ్యకి చెందిన 9 ఎకరాల పొలాన్ని కబ్జా చేశారు. బస్సు యాత్ర సందర్భంగా ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తేవడంతో పెద్దాయన సమస్యను నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగం కోసం వినతి 2017లో బీకాం చదివిన పీసీపల్లి మండలం అలవలపాడు కొత్తూరుకు చెందిన రావి సురేష్ ప్రస్తుతం వలంటీర్గా పని చేస్తున్నాడు. కుటుంబ పోషణ భారంగా ఉన్నందున ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ సీఎం జగన్కు వినతిపత్రం అందజేశాడు. ట్రై సైకిల్ ఇప్పించండన్నా బస్సు యాత్ర కనిగిరి మండలం అజీజ్పురానికి చేరుకున్న సమయంలో గ్రామానికి చెందిన కేశారపు దేవమ్మ అనే దివ్యాంగురాలు సీఎం జగన్ను కలిసింది. దివంగత వైఎస్సార్ గతంలో తనకు ఇచి్చన ట్రైసైకిల్ మూలనపడినందున కొత్తది ఇప్పించాలని విన్నవించింది. నలుగురు బిడ్డలున్నా... ‘‘చూపు కోల్పోయి పని చేయడానికి వీలు లేకుండా పోయింది. కుటుంబ పోషణ అంతంత మాత్రం. ఆర్థిక సాయం చేయండి సారూ’’ అంటూ కనిగిరి మండలం అజీస్పురంలో కేశారపు రోశయ్య వేడుకున్నాడు. తనకు నలుగురు పిల్లలున్నా పట్టించుకోవడం లేదని, ఒంటరినయ్యానని సీఎం జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరి్థక సాయం చేసి ఆదుకోవాలంటూ విలపించాడు. దివ్యాంగుడిని ఆదుకోండయ్యా కనిగిరి మండలం ఏరువారిపల్లిలో గ్రామానికి చెందిన లక్కె మంగమ్మ దివ్యాంగుడైన తన కుమారుడు లక్కె సాయిని వెంటబెట్టుకుని సీఎం జగన్ను కలిసింది. మన ప్రభుత్వంలో దివ్యాంగ పింఛన్ వస్తోందని తెలిపింది. తన కుమారుడికి ఆరి్థక సాయం చేసి ఆదుకోవాలంటూ విన్నవించింది. ► శారీరక ఎదుగుదల లేని పొన్నలూరు గ్రామానికి చెందిన వెలగపూడి ఏసుబాబు అర్హత ఉన్నా తనకు సదరం సరి్టఫికెట్ మంజూరు చేయడం లేదని, పింఛన్ పొందలేకపోతున్నానని విన్నవించాడు. ► పరుచూరివారిపాలెం గ్రామానికి చెందిన నేలపాటి నరసింహం ఎడమ కాలు రోడ్డు ప్రమాదంలో విరిగిపోయింది. తనకు మెరుగైన వైద్యం అందించాలని సీఎంకు విన్నవించాడు. ► కల్లూవారిపాలెం గ్రామానికి చెందిన కప్పల రియాగ్రేస్కు రెండు కళ్లు కనిపించకపోవడంతో శస్త్ర చికిత్స చేశారు. అయితే దురదృష్టవశాత్తూ శస్త్ర చికిత్స విఫలమైందని, మరోసారి శస్త్ర చికిత్స కోసం ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె తల్లిదండ్రులు కోరారు. ► మరికొందరు వృద్ధులు తమకు ఆరోగ్య సమస్యలున్నాయని, వాటిని నయం చేసేందుకు వైద్య సాయం అందించాలని వేడుకున్నారు. -
‘పచ్చ’పగ.. పెన్షన్ కోసం వృద్ధుల పడిగాపులు (ఫొటోలు)
-
చంద్రబాబు కుట్రలు.. పెన్షన్ కోసం వృద్ధుల పాట్లు
సాక్షి, విజయవాడ: హేయమైన రాజకీయాలకు నిరుపేదలకు బలి అవుతున్నారు. చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీల కుట్రతో వృద్దులు పెన్షన్ కోసం పాట్లు పడుతున్నారు. ప్రతినెల ఇంటికే పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈ నెల లేదు. ఎన్నిలకు కమిషన్ కి ఫిర్యాదు చెయ్యడంతో వాలంటీర్లు సేవలు బంద్ అయ్యాయి. నడవలేని వృద్దులు ఎండలో వస్తున్నారు. సచివాలయాల వద్ద పెన్షనర్లు కు సౌకర్యాలు కల్పించి పెన్షన్ డబ్బులు అందిస్తున్నారు సిబ్బంది. కానీ ఎండలలో సచివాలయాలకు రావాలంటే అష్టకష్టాలు పడుతున్నారు. చంద్రబాబు చేసిన కుట్రకు మేము బలి అయ్యామని, మాకొద్దు చంద్రబాబు అంటున్నారు. ఓటుతో చంద్రబాబు కి బుద్ధి చెప్తామని పెన్షనర్లు చెబుతున్నారు. -
రైతులంటే ఎందుకింత చిన్నచూపు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటలు ఎండుతున్నా, వడగళ్లు ముంచెత్తినా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప రైతుల వైపు కన్నెత్తి చూడటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ద్వారా ఆయన సీఎం రేవంత్కు పలు ప్రశ్నలు సంధించారు. సీఎంకు రైతుల కన్నీళ్లు, అన్నదాతల ఆర్తనాదాలు వినిపించడం లేదని, ఎన్నికల గోల తప్ప.. కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదని విమర్శించారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా నిరంతరం రాజకీయాల్లోనే మునిగి తేలుతున్నారని ఆక్షేపించారు. పార్టీ ఫిరాయింపులపై పెడుతున్న శ్రద్ధ పంట నష్టం పరిశీలనపై ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలోని అధిష్టానం చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ.. రైతుల సమస్యలు వినే ఓపిక లేకుండా పోయిందా? అని వ్యాఖ్యానించారు. ‘ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం’బాగుపడదు అనే సామెతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై తమ పార్టీ బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. -
ఆర్బీఐ అంబుడ్స్మన్ స్కీములకు ఫిర్యాదుల వెల్లువ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్మన్ స్కీముల కింద వివిధ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 2022–23లో ఇవి 68 శాతం పెరిగి 7.03 లక్షలుగా నమోదయ్యాయి. మొబైల్/ఎల్రక్టానిక్ బ్యాంకింగ్, రుణాలు, ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు, పింఛను చెల్లింపులు, రెమిటెన్సులు మొదలైన వాటికి సంబంధించిన ఫిర్యాదులు వీటిలో ఉన్నాయి. ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవడం, ఆర్బీఐ–సమీకృత అంబుడ్స్మన్ స్కీము (ఆర్బీ–ఐవోఎస్) కింద దాఖలు చేసే ప్రక్రియను సరళతరం చేయడం తదితర అంశాలు ఫిర్యాదుల నమోదుకు దోహదపడ్డాయని అంబుడ్స్మన్ స్కీము వార్షిక నివేదిక పేర్కొంది. అత్యధికంగా 83.78 శాతం ఫిర్యాదులు (1,93,635) బ్యాంకులపై వచ్చాయి. అంబుడ్స్మన్ ఆఫీసులు 2,34,690 ఫిర్యాదులను హ్యాండిల్ చేశాయి. సమస్య పరిష్కారానికి పట్టే సమయం సగటున 33 రోజులకు మెరుగుపడింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది 44 రోజులుగా ఉంది. -
ఈస్ట్రోజెన్ - అద్భుతమైన ఫుడ్స్
#EstrogenandFood ఈస్ట్రోజెన్ మన శరీర పనితీరులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలోని జీవ క్రియలకు ఈస్ట్రోజన్ చాలా అవసరం. క్లీవ్ల్యాండ్ క్లినిక్ ప్రకారం ఈస్ట్రోజన్ మహిళలలో నెలసరి, పునరుత్పత్తి వ్యవస్థ, లైంగిక కోరికను ప్రభావితం చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, కొల్లాజెన్ ఉత్పత్తిలో, ఎముకలు, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ సాయ పడుతుంది. జీవితకాలంలో ఈస్ట్రోజెన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు సాధారణం అయితే, ఈ స్థాయిల్లో తీవ్ర అసమతుల్యత వస్తే మొత్తం ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితంచేస్తుంది. శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గితే నెలసరి క్రమం తప్పడం, వివాహిత మహిళల్లో గర్భాధారణ లాంటి సమస్యలొస్తాయని క్లీవ్ల్యాండ్ క్లినిక్ హెచ్చరించింది.ఈస్ట్రోజెన్ తగ్గితే ఏమవుతుంది. శరీరంలో తగినంత ఈస్ట్రోజెన్ లేకపోతేచాలా సమస్యలొస్తాయి. అలాగే మెనోపాజ్ సమయంలో , అండాశయాల శస్త్రచికిత్స తొలగింపు తర్వాత ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గి పోతుందని ఎండోక్రైన్ సొసైటీ తెలిపింది. వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు, యోని పొడిబారడం, నిద్రలేమి , మైగ్రేన్ లాంటి సమస్యలు ఈస్ట్రోజెన్ తగ్గిందనడానికి సంకేతం. దీనికి సాధారణంగా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోవచ్చు. అయితే దీన్ని దీర్ఘకాలంకొనసాగించలేం. అందుకే ఈస్ట్రోజెన్ అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల సహజంగా ఈ స్థాయిలను పెంచుకోవచ్చు.ఈస్ట్రోజెన్ లభించే ఆహారాలు► పాలు, గుడ్లు వంటి జంతు ఆధారిత ఉత్పత్తులు మన ఆహారంలో చేర్చుకుంటే ఈస్ట్రోజెన్ ఉత్పత్తి పెరుగుతంది. అయితే ఈ ఆహారాలను మితంగా తీసుకోవడం మంచిది.► అవిసె గింజలు , గోధుమ గింజలు, సోయాబీన్స్ ఉత్పత్తులు తీసుకోవాలి.► ఖర్జూరం, ప్రూనే, ఆప్రికాట్లు వంటి డ్రై ఫ్రూట్స్లో ఫైటోఈస్ట్రోజెన్లు పుష్కలంగా ఉంటాయి. ► ఈస్ట్రోజెన్-రిచ్ ఫుడ్స్ కోసం చూస్తున్నట్లయితే నువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇతర ముఖ్యమైన పోషకాలతో పాటు ఫైటోఈస్ట్రోజెన్లలో కూడా లభ్యం.5 ఈస్ట్రోజెన్ లోపం కారణంగా ఎముకల సమస్యలతో బాధపడేవారికి వెల్లుల్లి బెస్ట్.►బ్రోకలీ , క్యాబేజీ, బచ్చలికూర వంటి ఆకులు మందంగా ఉండే ముదురు రంగు ఆకుకూరలు►ప్రముఖ డైటీషియన్ డానా కాన్లీ ప్రకారం ఒమేగా-త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభించే అవిసె గింజల్లో అత్యధిక ఫైటోఈస్ట్రోజెన్ కంటెంట్ ఉంది.►రాస్ బెర్రీస్, క్రాన్ బెర్రీస్, స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లతోపాటు, ఫైటోఈస్ట్రోజెన్లు కూడా ఉన్నాయి.నోట్: ఈస్ట్రోజెన్ లభించే ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీ 2017 అధ్యయనం ప్రకారం ఈస్ట్రోజెన్ను ఎండోక్రైన్ డిస్రప్టర్గా పరిగణిస్తారు. ఈ ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల వంధ్యత్వం ఈస్ట్రోజెన్-సెన్సిటివ్ అవయవాలలో కేన్సర్ ముఖ్యంగా రొమ్ము , గర్బాశయ, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. -
చట్టపరమైన అధికారం ఒక్కటే సరిపోదు
న్యూఢిల్లీ: న్యాయమూర్తిగా రాణించాలంటే చట్టపరమైన అధికారం ఒక్కటే సరిపోదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. మానవ జీవితాన్ని, మనుషుల సమస్యలను అర్థంచేసుకొని, పరిష్కరించే నేర్పు అలవర్చుకోవాలని, వారికి అదే అతిపెద్ద సాధనమని పేర్కొన్నారు. బుధవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసి, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బి.వరాలేను సత్కరించారు. నూతన న్యాయమూర్తు నియామకంతో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య గరిష్టంగా 34కు చేరిందని జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. వారి అనుభవంతో సుప్రీంకోర్టుకు మంచి పేరు వస్తుందని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే నైపుణ్యమే మనల్ని గొప్ప న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా మారుస్తుందని స్పష్టం చేశారు. -
లైఫ్లో దీన్ని నిర్లక్ష్యం చేశారో... ముప్పే!
ఉరుకులు, పరుగుల జీవితంలో ఒత్తిడి చాలా కామన్ అని లైట్ తీసుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ఒత్తిడి చాలారకాలుగా మన అందర్నీ వేధిస్తూ ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడిమానసిక సమస్యలే కాదు, శారీరకంగానూ అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. చర్మ సమస్యలు, త్వరగావృద్ధాప్యం శరీరం ఒత్తిడికి గురైనప్పుడు తలనొప్పికి మానసికంగా కుంగుబాటుతోపాటు అనేక చర్మ సమస్యలకు దారి తీస్తుంది. సోరియాసిస్ వంటి చర్మ పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుంది.స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ హార్మోన్ విడుదల ఎక్కువ అవుతుంది. ఇది చర్మ సున్నితత్వం రియాక్టివిటీని పెంచుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇప్పటికే తామర ఉన్నవారిలో అది మరింత ముదరవచ్చు. అలాగే గాయాలను సహజంగా నయం చేసే చర్మ సామర్థ్యానికి ఒత్తిడి ఆటంకం కలిగిస్తుంది. చర్మంలోని కొల్లాజెన్, సాగే ఫైబర్ను ప్రభావితం చేస్తోంది చర్మంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది దీంతో చాలా తొందరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఇంకా మొటిమలు, దద్దుర్లు రావడం, జట్టు సన్నబడటం, రాలిపోవడం లాంటి ఇతర చర్మ సమస్యలు కూడా వస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. హార్మోన్లపై ప్రభావం: ఎక్కువగా స్ట్రెస్కు గురైనపుడు డొపమైన్, కార్టిసోల్ అనే హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంది. ఇవి మిగిలిన హార్మోన్స్పై ప్రభావం చూపుతాయని ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవచ్చు. బీపీ పెరగడం లాంఇ సమస్యలు ఎదుర్కొంటారు. గుండె పోటు ముప్పు : తీవ్రమైన ఒత్తిడితో హృదయ స్పందనల్లో తేడాలొస్తాయి. ఒక్కోసారి గుండెపోటుకు ప్రమాదం ఉంది. బీపీ పెరిగి పక్షవాతంముప్పు పొంచివుంటుంది. ఒత్తిళ్లతో రక్తపోటు అదుపులో లేని వారిలో హెమరైజ్డ్ బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ క్షీణిస్తుంది. దీని కారణంగా ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. జీర్ణ సమస్యలు: ఒత్తిడి ఎక్కువైతే కడుపునొప్పి, అజీర్ణం, ఆకలి మందగించడం, అతిగా తినడం, వికారం లాంటివి కన్పిస్తాయి. కడుపులో అల్సర్లు ఏర్పడతాయి. జీవక్రియల వేగం మందగిస్తుంది. ఎంజైమ్ల ఉత్పత్తి తగ్గుతుంది. సైలెంట్ కిల్లర్... ఏం చేయాలి? సైలెంట్ కిల్లర్ లాంటి ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించి పరిష్కరించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. గుర్తించి చికిత్స తీసుకుంటే మాత్రం చాలా సులువుగా దీన్నుంచి బయటపడవచ్చు. స్ట్రెస్మేనేజ్మెంట్ తగినంత నిద్రపోవడం, హైడ్రేటెడ్గా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టడం చాలా కీలకం. రిలాక్సేషన్ టెక్నిక్స్ , యోగా, ధ్యానం లాంటి సాధన. రెగ్యులర్ వ్యాయామం ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, చర్మానికి మేలు చేస్తుంది. 7-9 గంటల నాణ్యమైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, పండ్లు, కూరగాయలు , తృణధాన్యాలతో సమతుల్య ఆహారం తీసుకోవాలి. తగినంత నీటిని తీసుకోవాలి. కెఫిన్ , ఆల్కహాల్కి దూరంగా ఉండటంతోపాటు, ఒత్తిడి కలిగించే పనులు, ఎక్కువ శ్రమకు దూరంగా ఉండాలి. స్నేహితులు, ఆత్మీయులు,కుటుంబ సభ్యుల మంచి సంబంధాలకు ప్రయత్నించాలి. ఇక ఒత్తిడి భరించలేని స్థాయికి చేరిందని పిస్తే థెరపిస్ట్ లేదా కౌన్సెలర్, లేదా నిపుణుడైన వైద్యుని సలహా తీసుకోవాలి. -
ప్రముఖుల విడాకులు.. మానసిక కారణాలు..!
ప్రముఖుల రొమాన్సులు, వివాహాలే కాదు విడాకులు కూడా మీడియాలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. అందరూ దాని గురించి చర్చించుకుంటారు. గతంలో ఆమీర్ ఖాన్-కిరణ్ రావు, అర్జున్ రాంపాల్-మెహర్ జెసియా, సమంతా రూత్ ప్రభు-నాగ చైతన్య, తాజాగా సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు చర్చనీయాంశాలయ్యాయి. అసలు కారణాలు ఎవరికీ తెలియకున్నా ఎవరి కారణాలు వారు వెతుక్కున్నారు. అయితే ఈ విడాకులను గాసిప్ లెన్స్ ద్వారా కాకుండా సైకాలజీ లెన్స్ ద్వారా పరిశీలిస్తే, వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు దొరుకుతాయి. ఫేమ్ వల్ల వచ్చే మానసిక ఒత్తిడి నిరంతరం ప్రజల దృష్టిలో ఉండటం ఏ సెలబ్రిటీ జీవితానికైనా కష్టమైన, నష్టం కలిగించే విషయం. వారు చేసే చిన్న పొరపాటు కూడా భూతద్దంలో చూస్తారు, ఘోరమైన తప్పిదంగా మీడియాలో ప్రొజెక్ట్ చేస్తారు. దీంతో ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను కాపాడుకోవడానికి వారు నిరంతరం ఒత్తిడి అనుభవిస్తారు. ఈ ఒత్తిడి ఇద్దరి మధ్య ఉన్న ఇబ్బందులను, విభేదాలను తీవ్రతరం చేస్తుంది. బంధం, అనుబంధం డీప్గా మారడానికి ఆటంకం కలిగిస్తుంది. పాపులారిటీతో పెరిగే అహంభావం కీర్తి, సంపద, నిరంతర పాపులారిటీ వ్యక్తిలో అహంభావాన్ని, తద్వారా నార్సిసిజంను పెంచుతాయి. అంటే తనను తాను ప్రేమించుకోవడం పెరిగిపోతుంది. ఫలితంగా భాగస్వామి పట్ల సహానుభూతి, రాజీపడే తత్వం తగ్గిపోతాయి. భాగస్వాములను పాపులారిటీలో తనతో పోటీపడే కాంపిటీటర్గా మారుస్తుంది. పరస్పర విశ్వాసం, సాన్నిహిత్యాన్ని దెబ్బతీస్తుంది. బిజీ జీవితంతో బలహీనపడే బంధాలు సెలబ్రిటీల జీవితం ఎడతెగని షెడ్యూల్లు, చాలాకాలం పాటు విడివిడిగా ఉండాల్సి రావడంతో పరస్సర భావోద్వేగ సంబంధాన్ని కొనసాగించడంలో, విశ్వాసాన్ని పెంపొందించడంలో సవాళ్లుగా మారతాయి. భౌతికంగా, మానసికంగా అధిగమించలేని దూరాలను సృష్టిస్తాయి. చివరికి ఒకరితో ఒకరు డిస్ కనెక్ట్ అవుతారు. ఆర్థిక భద్రత పెంచే స్వాతంత్య్ర భావం సెలబ్రిటీలకు ఉండే ఆర్థిక భద్రత ఒక గిఫ్ట్లా కనిపించినప్పటికీ, సాంప్రదాయిక నిబద్ధతలను చెరిపేసే స్వాతంత్య్ర భావాన్ని కూడా పెంపొందిస్తుంది. ఫలితంగా సెలబ్రిటీ జంటలు వారి కాపురంలో ఎదుర్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు, సయోధ్యకోసం తక్కువ మొగ్గు చూపుతారు. ఎవరిదారి వారు చూసుకుంటారు. కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ల న్యాయ పోరాటంలో హైలైట్ కావడం గమనార్హం. అయితే ఇవన్నీ సాధారణ మానసిక కారణాలు మాత్రమే. ప్రతి సెలబ్రిటీ విడాకుల వెనుక దానివైన ప్రత్యేక కారణాలు ఉంటాయని గుర్తించడం చాలా ముఖ్యం. పాపులారిటీకే ప్రాధాన్యం ఇవ్వడం, వైవాహికేతర సంబంధాలు, మానసిక ఒత్తిళ్లు, అహంకారం, అననుకూలత లాంటి అనేక అంశాలు అనేకం ఉండవచ్చు. తెరపై మెరిసే తారల జీవితాల్లో కూడా మనకు తెలియని అనేకానేక చీకటి గాధలు, బాధలు ఉండవచ్చు. వాటిని పరిష్కరించుకునే క్రమంలో అహానికి పోకుండా, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే మెరుగైన ఫలితం ఉండవచ్చు. --సైకాలజిస్ట్ విశేష్ ఫోన్ నెం: 8019 000066 psy.vishesh@gmail.com (చదవండి: పేరెంట్స్ నిర్లక్ష్యం చేస్తే Animal లా మారతారా? ) -
మా పాపకు పీరియడ్స్ ఇంకా రాలేదు! కానీ ఆమెకు అలా అవుతోంది..
మా పాపకు 12 ఏళ్లు. ఇంకా పీరియడ్స్ స్టార్ట్ అవలేదు. ఈ మధ్య ప్రైవేట్ పార్ట్స్లో ఇచింగ్ మొదలైందని చెబుతోంది. కానీ ఎలాంటీ డిశ్చార్చ్ లేదు. రాత్రిళ్లు చాలా ఇచింగ్తో చాలా సఫర్ అవుతోంది. అలా ఎందుకు అవుతోంది? కంట్రోల్ అవడానికి మందులేమైనా ఉన్నాయా? – పేరు, ఊరు రాయలేదు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి దాన్ని vulvitis అంటారు. 8–12 ఏళ్ల మధ్య చాలామంది అమ్మాయిలకు ఉంటుంది. ఇది Vulval స్కిన్ అంటే వెజైనా ఔటర్ పార్ట్ పీరియడ్స్ కాకముందు పల్చగా.. సెన్సిటివ్గా ఉంటుంది. సబ్బు, క్రీమ్స్, బబుల్ బాత్, షవర్ జెల్స్ ఎక్కువగా వాడితే దురద, మంట ఉంటాయి. Vulval స్కిన్ ఇరిటేట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. మూత్రం చేసేప్పుడు మంటగా ఉంటుంది. దీన్ని నివారించాలంటే తక్కువ గాఢత కలిగిన సబ్బులను వాడాలి. గోరువెచ్చని నీటితో ఎక్కువసార్లు వాష్ చేసుకోవాలి. Emollient సోప్స్ వాడటం మంచిది. వెజైనల్ ఏరియాలో డియోడరెంట్స్, పర్ఫ్యూమ్స్ వాడకూడదు. క్లీన్ చేసుకుని తుడుచుకునేప్పుడు ముందు నుంచి వెనక్కి తుడవాలి. దీనికి రివర్స్వేలో తుడిస్తే మలద్వారంలోని క్రిములు వెజైనాలోకి ప్రవేశిస్తాయి. అందుకే ఫ్రంట్ నుంచి బ్యాక్కి శుభ్రం చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నా ఇచింగ్ తగ్గకపోతే గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. కొన్ని క్రీమ్స్, యాంటీసెప్టిక్ లోషన్స్ ఇస్తారు. కొంతమందికి తక్కువ మోతాదు టాపికల్ స్టెరాయిడ్ క్రీమ్స్ అవసరమవుతాయి. ఈ కింది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మళ్లీ ఇరిటేషన్ రాకుండా ఉంటుంది. ఎప్పుడూ గోరువెచ్చని నీటితోనే శుభ్రం చేసుకోవాలి. ఎక్కువ గాఢత ఉన్న సబ్బులను వాడకూడదు ∙మెత్తటి, తడి టిష్యూతో శుభ్రం చేసుకోవాలి. అయితే ఆ టిష్యూ వెజైనాలో అతక్కుండా తుడవాలి ∙బబుల్ బాత్ అవాయిడ్ చేయాలి. నీళ్లల్లో షాంపూ, సబ్బు వేసి స్నానం చేయకూడదు. ∙జుట్టు కోసం వాడే షాంపూని స్నానానికి వాడకూడదు. హెడ్ బాత్ చేసేప్పుడు ఆ షాంపూ నీళ్లు కూడా ఒంటి మీద పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. వీలైతే వాష్బేసిన్లో హెడ్ బాత్ చేయించడం మంచిది. లేదంటే స్నానం అయిపోయాక హెయిర్ వాష్ చేయించండి ∙స్నానం చేశాక యూరిన్కి వెళ్లమని చెప్పండి. సోప్ ఏదైనా యూరిన్ ప్రాంతంలో ఉంటే వాష్ చేసుకోమని చెప్పాలి ∙పదినిమిషాల కన్నా ఎక్కువసేపు స్నానం చేయనివ్వకండి. ఒంటి మీద నీళ్లు ఎక్కువసేపు ఉంటే స్కిన్ ఇరిటేషన్ పెరుగుతుంది ∙కాటన్ అండర్వేర్ మాత్రమే వాడాలి. పాలిస్టర్, నైలాన్ అస్సలు వాడకూడదు ∙కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వస్తే vulval స్కిన్ ఇరిటేషన్ పెరుగుతుంది. అందుకే తగినన్ని మంచినీళ్లు తాగమని చెప్పండి ∙స్విమ్ చేయవచ్చు. కాని స్విమ్కి ముందు తరువాత ఏదైనా Emollient క్రీమ్ని vulval స్కిన్కి అప్లయ్చేయాలి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలా?) -
చైనాలో ఆర్థిక మాంద్యం?.. నిజాలు వెళ్లగక్కిన జిన్పింగ్!
నూతన సంవత్సరం తొలి రోజున చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు గురించి మాట్లాడారు. దేశంలోని ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆయన స్వయంగా అంగీకరించారు. దేశ ప్రజలు నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన అన్నారు. నూతన సంవత్సర సందేశంలో జీ జిన్పింగ్ దేశ ఆర్థిక సవాళ్లను ప్రస్తావించడం ఇదే మొదటిసారి. జీ జిన్పింగ్ గడచిన పదేళ్లుగా అంటే 2013 నుండి నూతన సంవత్సరం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా తర్వాత చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయినప్పటికీ పెరుగుతున్న నిరుద్యోగం, తగ్గుతున్న వ్యాపార డిమాండ్ కారణంగా చైనా మాంద్యంతో పోరాడుతోంది. జీ జిన్పింగ్ తన టెలివిజన్ ప్రసంగంలో మాట్లాడుతూ దేశంలో కొన్ని వ్యాపారరంగాలు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయని అన్నారు. జనం ఉద్యోగాలు దొరక్క, కనీస అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు తన మనసులో ఎప్పుడూ తిరుగాడుతుంటాయని జీ జిన్పింగ్ అన్నారు. ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయడానికి, బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా జీ జిన్పింగ్ ప్రసంగానికి కొన్ని గంటల ముందు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ)కి సంబంధించిన డేటాను విడుదల చేసింది. చైనాలో గడచిన డిసెంబర్లో పారిశ్రామిక కార్యకలాపాలు ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయని ఆ డేటా వెల్లడించింది. నవంబర్లో 49.4గా ఉన్న పీఎంఐ గత నెలలో 49కి పడిపోయింది. చైనా పీఎంఐ క్షీణించడం ఇది వరుసగా మూడోసారి. గత సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాల్లో స్వల్ప పెరుగుదల తర్వాత, అధికారిక పీఎంఐ సెప్టెంబర్ వరకు వరుసగా ఐదు నెలల పాటు 50 కంటే తక్కువగా ఉంది. -
భర్తను వదిలేసి చాటింగ్ ప్రియుడితో వెళ్ళిపోయిన భార్య.. ఆ యువకుడిపై భర్త దాడి!
ఉండవెల్లి: చాటింగ్లో పరిచయం పెంచుకుని, యువకుడితో ఓ వివాహిత భర్తను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో వారు తిరిగి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న వివాహిత భర్త, మరో ఆరుగురు వారిని పట్టుకుని చితకబాదిన ఘటన పుల్లూరు టోల్ప్లాజా సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ ఈరన్న తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా కోవెలకుంట్లకు చెందిన ఇంద్రవతి, అయిజకు చెందిన హరీష్తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం లేదు. కాగా ఇంద్రవతికి ఆన్లైన్ చాటింగ్ ద్వారా కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన హరిచరణ్తో పరిచయం పెరిగింది. పరిచయం ప్రేమగా మారడంతో వీరిద్దరు ఈ నెల 13వ తేదీన హైదరాబాద్కు పరారయ్యారు. వీరు తిరిగి ఆదివారం కర్నూల్కు వెళ్తున్నారన్న సమాచారం తెలుసుకున్న వివాహిత భర్త హరీష్, ఆరుగురు మిత్రులతో కలిసి పుల్లూరు టోల్ప్లాజా వద్ద వారి వాహనాన్ని అడ్డుకుని కర్రలతో దాడి చేశారు. ఘటనలో హరిచరణ్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని వివాహితను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లగా, హరిచరణ్ను కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హరిచరణ్ తండ్రి ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. -
ఢిల్లీని కబళించిన చలి పులి.. పొగమంచుతో తగ్గిన విజిబులిటీ!
దేశ రాజధాని ఢిల్లీలో నేడు (ఆదివారం) చలి మరింత పెరిగింది. పొగమంచు కారణంగా విజిబులిటీ మరింత తగ్గింది. ఇటువంటి వాతావరణంలో రోడ్డు రవాణా, రైలు రవాణా, విమానాల రాకపోకలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్వాసులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా ఉంది. శనివారం 5.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఇది సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువ. మరోవైపు ఆదివారం ఉదయం 8.30 గంటలకు సఫ్దర్జంగ్లో 700 మీటర్ల విజిబిలిటీ లెవల్ మాత్రమే ఉంది. పాలెంలో ఇది 800 మీటర్లుగా ఉంది. ఆదివారం ఆకాశం నిర్మలంగా ఉంటుందని, కాస్త ఎండగా ఉండే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 24 నుండి 25 డిగ్రీలు మధ్య ఉండవచ్చు. వారమంతా ఇదే వాతావరణం కొనసాగనుంది. ఈ వారంలో ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది కూడా చదవండి: ‘రాత్రుళ్లు ఎవరూ బయట నిద్రించకుండా చూడండి’ -
మెట్రో రెయిలింగ్పై మహిళ హైడ్రామా..
ఏదో ఒక కారణంతో ఢిల్లీ మెట్రో తరచూ ముఖ్యాంశాలలో నిలుస్తుంటుంది. కొందరు మెట్రోలో తమకు నచ్చినట్లు వ్యవహరిస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. తాజాగా మెట్రోలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఈ ఉదంతం మెట్రో అధికారులకు చిక్కులను తెచ్చిపెట్టింది. ఢిల్లీలోని షాదీపూర్ మెట్రో స్టేషన్లో ఒక మహిళ ఎలివేటెడ్ ట్రాక్ దాటి, రెయిలింగ్ ఎక్కి అక్కడి నుంచి దూకేందుకు ప్రయత్నించింది. దీనిని గమించిన కొందరు ప్రయాణికులు మెట్రో అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో వారు అతి కష్టం మీద ఆ మహిళను కాపాడారు. #Delhi- Girl was jumping from the track of metro station.. police saved her. #delhimetro #delhigirls #DelhiGovernment #Delhi #METRO4D #Metro pic.twitter.com/eFwJ6yNhAH — Arun Gangwar (@AG_Journalist) December 12, 2023 ఈ ఘటనకు సంబంధించిన 40 సెకన్ల వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఫోన్ పట్టుకుని ఎలివేటెడ్ మెట్రో ట్రాక్ పక్కన నిలబడి కనిపించింది. ఆమె ట్రాక్ పరిమితిని దాటి, రెయిలింగ్ పైకి ఎక్కినట్లు వీడియోలో కనిపిస్తోంది. షాదీపూర్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఎలివేటెడ్ ట్రాక్పై నుంచి దూకుతానంటూ ఆ మహిళ బెదిరించింది. ఆమెను కాపాడేందుకు అధికారుల బృందం ఫుట్పాత్ మీదుగా ట్రాక్ వైపు వెళ్లి ఆమెను రక్షించింది. కాగా ఆ మహిళ ఎందుకు ఈ ప్రయత్నం చేసిందో స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం ఈ ఉదంతపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇది కూడా చదవండి: శరద్ పవార్కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి: -
ఆ గేటు మూయడం వలన ఇబ్బంది పడుతున్న 40 గ్రామాల ప్రజలు!
దేవరకద్ర: మండల కేంద్రంలోని రైల్వే గేటు మూసి వేయడంతో ప్రజలు తప్పని సరి పరిస్థితుల్లో రైల్వే పట్టాలను దాటుతున్నారు. ప్రమాదం అని తెలిిసినా ప్రభుత్వ కార్యాలయాలు, సంతలో సరుకులు కొనడానికి ఇతర గ్రామాల నుంచి వచ్చే ప్రజలు రైల్వే పట్టాలు దాటి పోక తప్పడం లేదు. కాగా ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా.. వేగంగా వచ్చే రైళ్ల వల్ల ప్రమాదం పొంచిఉందని పలువురు పేర్కొంటున్నారు. దేవరకద్రలో నిర్మించిన ఆర్వోబీ వల్ల రాయిచూర్, నారాయణపేట, మక్తల్, ఆత్మకూర్, మహబూబ్నగర్, హైదరబాద్ వంటి పట్టణాలకు నేరుగా వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది లేకుండా వెళ్తున్నారని.. కానీ పట్టణంలోని ప్రజలు, ఇతర గ్రామాల నుంచి దేవరకద్రకు వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారు, బుధవారం జరిగే సంతకు చుట్టు పక్కల నుంచి వచ్చే 40 గ్రామాల ప్రజలు గేటు మూయడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు ఆలోచన లేకుండా తొందరపాటు నిర్ణయాల వల్ల పట్టణ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు నిత్యం ఇలా రైల్వే పట్టాలను దాటాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు. వృద్ధులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకూ ఇబ్బంది తప్పడం లేదని చెబుతున్నారు. గేటు తెరిస్తే బస్టాండ్ కళకళలాడుతుంది రైల్వే గేటు తెరిస్తే దేవరకద్ర బస్టాండ్ తిరిగి కళ కళలాడే అవకాశం ఉంది. బస్సుల రాక పోకలతో పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ప్రాంతంలోని వ్యాపార కేంద్రాలన్ని తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నిరాశతో ఉన్న వ్యాపారులు తమ వ్యాపారం తిరిగి కొనసాగించుకోడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక గేటును తెరిచిన పెద్దగా ట్రాఫిక్ సమస్య ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ విషయంలో స్పందించి గేటు తెరిచేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
Karimnagar: విమానం ఎగిరేనా? ఏళ్లుగా పరిష్కారం నోచుకొని సమస్యలు ఇవే..
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. 31,12,283 లక్షల మంది ఓటర్లు ఈసారి ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఓటర్ల సంఖ్య రాష్ట్రం మొత్తం ఓటర్లలో 10వ శాతం కావడం గమనార్హం. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో కరీంనగర్.. అప్పటి హైదరాబాద్ రాష్ట్రం నుంచే తన ఘనత చాటుకుంటోంది. రాజకీయంగా ప్రభావం చేయగలిగిన ఈ జిల్లాలో కొన్ని సమస్యలు ఏళ్లుగా పరిష్కారం నోచుకోకుండా మిగిలిపోయాయి. గోదా‘వర్రీ’ పెద్దపల్లి జిల్లాలో ప్రవహించే గోదావరి నదీజలాలు కాలుష్యపు కోరల్లో చిక్కుకున్నాయి. రామగుండం కార్పొరేషన్ డ్రైనేజీ నీరు, రసాయనాలను నేరుగా నీటిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీల నిర్మాణంతో ఏడాది పొడువునా నీరు నిల్వ ఉంటుంది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో రోజుకు సుమారు 70మిలియన్ లీటర్ల నీటిని ప్రజలు వినియోగిస్తున్నారు. అందులోంచి రోజుకు 40మిలియన్ లీటర్ల మురుగు గోదావరిలో కలుస్తుంది. ఆదాయపన్ను, మారుపేర్లు, ప్రైవేటీకరణ భూతం రామగుండం సింగరేణిలో రెండున్నర దశాబ్దాల కాలంగా మారుపేర్ల మార్పిడికి చట్టబద్ధత కోసం కోసం కార్మికులుఎదురుచూస్తున్నారు. గతంలో ఈ సమస్య పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చినా ఇంకా అమలుకు నోచుకోలేదు. మరోవైపు తమకు ఆదాయపు పన్ను మినహాయించాలని డిమాండ్ కోరుతున్నారు. అలాగే కోల్ బ్లాకులను ప్రైవేటు పరం చేయవద్దని కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. విమానం ఎగిరేనా..? 1980లో కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ అధినేత బీకే బిర్లా వచ్చేందుకు 294 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం నిర్మా ణం చేపట్టారు. 21 సీట్ల సామర్థ్యం ఉన్న చిన్న విమానాలు రాకపోకలు సాగించేవి. 2009లో దీన్ని రామగుండం ఎయిర్పోర్టు పేరిట అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు నడిచినా అవి అటకెక్కాయి. 2016లో ఉడాన్ పథకంలో భాగంగా 2020లో ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ఇండియా రాష్ట్ర ప్రభుత్వంతో పలు భౌగోళిక సర్వేలు నిర్వహించినా అడుగు ముందుకు పడలేదు. నాలుగోసారి నిర్వాసితులు.. కరీంనగర్ జిల్లాలో అదనపు టీఎంసీ కాలువ పనుల్లో భాగంగా రామడుగు, గంగాధర మండలాల్లో పలువురు నిర్వాసితులు నాలుగోసారి భూమిని కోల్పోతున్నారు. ఎవరైనా ఒకసారి కోల్పోవడం సాధారణం, రెండుసార్లు కోల్పోవడమే అరుదు. కానీ, ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి పనుల వల్ల ఈ మండలాల్లో కొన్ని గ్రామాలవారు నాలుగు తరాలుగా నిర్వాసితులుగా మారిపోయారు. ఈఎస్ఐ ఆస్పత్రి కావాలి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్షలాది మంది బీడీ కారి్మకులు ఉన్నారు. మున్సిపల్, పలు పరిశ్రమల్లో పనిచేసేవారికి ప్రతి నెలా వేతనం నుంచి ఈఎస్ఐ కట్ అవుతుంది. కానీ, ఈఎస్ఐ ఆస్పత్రి ఉమ్మడి జిల్లాలో రామగుండంలో ఉంది. అసలు రామగుండంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఉందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. అత్యవసరాల్లో శస్త్రచికిత్స సమయంలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలవుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒక ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని లక్షలాది మంది కార్మికులు కోరుతున్నారు. తెలంగాణలో కొన్ని రాజకీయ కుటుంబాల ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుంది. వాటిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గురించి ముందుగా తెలుసుకోవాలి. అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ 1962 నుంచి 2004 వరకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు నిర్వహిస్తే, 1994లో అసద్ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికీ కొనసాగగుతున్నారు. 1999 నుంచి అసద్ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తున్నారు. ఆ రకంగా అరవై ఒక్క సంవత్సరాలుగా ఒవైసీ కుటుంబం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటం విశేషం. ఆ కుటుంబం పదిమార్లు లోక్సభకు సలావుద్దీన్ 1962 నుంచి అయిదుసార్లు శాసనసభకు, ఆరుసార్లు ఎంపీగా హైదరాబాద్ నుంచి గెలుపొందారు. అసద్ రెండుసార్లు చార్మినార్ నుంచి అసెంబ్లీకి, తదుపరి 2004 నుంచి నాలుగుసార్లు హైదరాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక అక్బరుద్దీన్ ఒవైసీ చంద్రాయణగుట్ట నుంచి 1999 నుంచి వరుసగా అయిదు సార్లు గెలిచారు. 1999 లో తండ్రి లోక్సభకు, ఇద్దరు కుమారులు అసెంబ్లీకి ఎన్నికవడం ఒక ప్రత్యేకత. సలావుద్దీన్, అసద్ కలిసి ఇంతవరకు పదిసార్లు లోక్సభకు ఎన్నికయ్యారన్నమాట. తండ్రి, ఇద్దరు కుమారులు కలిసి పన్నేండుసార్లు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. చదవండి: -
కాల్చేస్తే ‘సరి’..
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయిలో అన్నదాతలు ఎదుర్కొనే ప్రతీ సమస్యకు చిటికెలో పరిష్కారం చూపిస్తోంది ‘సమీకృత రైతు సమాచార కేంద్రం’. రైతు సమస్యల పరిష్కారం కోసం మూడున్నరేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ కేంద్రం ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఒక్క ఫోన్కాల్ లేదా వాట్సప్ మెసేజ్ చేస్తే చాలు.. ఎలాంటి సమస్యకైనా వెంటనే సమాధానం దొరుకుతోంది. జాతీయ అంతర్జాతీయ ప్రశంసలు దక్కడమే కాదు అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి. ఏపీ స్ఫూర్తితో ఇప్పటికే తెలంగాణలో కాల్ సెంటర్ను ఏర్పాటుచేయగా, రాజస్థాన్లో ఆచరణలోకి రాబోతోంది. మరికొన్ని రాష్ట్రాలు ఏపీ బాటలోనే సొంతంగా కాల్ సెంటర్ ఏర్పాటుచేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. చివరికి.. ఆఫ్రికన్ దేశం ఇథియోపియాలో కూడా ఏపీ తరహాలో కాల్ సెంటర్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా నిర్వహణ గతంలో జాతీయ స్థాయిలో ఏర్పాటుచేసిన కిసాన్ కాల్ సెంటర్లు పలు రాష్ట్రాల్లో మొక్కుబడిగా పనిచేసేవి. ఈ కాల్ సెంటర్కు ఫోన్ కలవడమే గగనంగా ఉండేది. ఒకవేళ కలిసినా రికార్డు వాయిస్ ద్వారా సలహాలు, సూచనలు ఇవ్వడమే తప్ప రైతుల వెతలు వినే పరిస్థితి ఉండేది కాదు. దీంతో రైతులు పడరాని పాట్లు పడేవారు. ఈ పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల కోసం పూర్తిస్థాయిలో కాల్ సెంటర్ను ఏర్పాటుచేయాలని సంకల్పించారు. దీంతో.. ఆర్బీకేలతో పాటు విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద ఏర్పాటుచేసిన సమీకృత రైతు సమాచార కేంద్రం–ఐసీసీ కాల్ సెంటర్కు 2020 మే 30న శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ స్టైల్లో తీర్చిదిద్దిన ఈ కాల్ సెంటర్లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన 54 మందిని నియమించారు. వీరు ఉ.7 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు రెండు షిఫ్ట్లలో సేవలందిస్తున్నారు. ఫోన్ చేయగానే రైతులు చెప్పిన సమస్యలను ఒపిగ్గా వినడమే కాదు.. అత్యంత గౌరవంగా, మర్యాదపూర్వకంగా బదులిస్తున్నారు. తమకు తెలిసినదైతే వెంటనే సమాచారం చెబుతారు. లేదంటే అక్కడే ఉన్న వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన నిపుణులు, శాస్త్రవేత్తలతో మాట్లాడిస్తారు. పంటకు సోకిన పురుగులు, తెగుళ్లకు చెందిన ఫొటోలను వాట్సప్లో పంపితే చాలు తగిన పరిష్కారం చూపుతున్నారు. రికార్డు స్థాయిలో సమస్యల పరిష్కారం ఇక కాల్ సెంటర్కు సగటున ప్రతీరోజూ 649 ఫోన్కాల్స్, 10 మెసేజ్లు చొప్పున ఇప్పటివరకు 7,78,878 ఫోన్కాల్స్, 11,725 వాట్సప్ మెసేజ్లు వచ్చాయి. వచ్చే ఫోన్ కాల్స్లో 80 శాతం వ్యవసాయ శాఖ, 17 శాతం ఉద్యాన శాఖకు సంబంధించిన సమస్యలు ఉంటుండగా, మిగిలిన 3 శాతం మత్స్య, పట్టు, మార్కెటింగ్, పశు సంవర్థక శాఖలకు సంబంధించినవి ఉంటున్నాయి. ఫోన్చేసిన వారిలో 90 శాతం మంది సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. బ్రిటీష్ హై కమిషనర్ గారేట్ వైన్ ఓనర్, నీతి ఆయోగ్ మెంబర్ రమేష్ చంద్, సీఏసీపీ కమిషన్ చైర్మన్ ప్రొ. విజయపాల్ శర్మ, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థయిన ఎఫ్ఏఓ కంట్రీ హెడ్ చిచోరి, ఇథియోపియా దేశ వ్యవసాయ శాఖమంత్రి మెలెస్ మెకోనెన్ ఐమెర్ వంటి ఎంతోమంది æప్రముఖులు కాల్సెంటర్ నిర్వహణా తీరును ప్రశంసించారు. 24 గంటల్లో క్షేత్రస్థాయి పరిశీలన.. ఇక సమస్య తీవ్రతను బట్టి సంబంధిత జిల్లాల్లోని జిల్లా వనరుల కేంద్రం (డీఆర్సీ) దృష్టికి తీసుకెళ్తారు. దగ్గరలోని పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలతో కలిసి డీఆర్సీ సిబ్బంది 24 గంటల్లో ఆ రైతు పొలాన్ని సందర్శిస్తారు. అప్పటివరకు వాడిన ఎరువులు, మందుల వివరాలు, సాగు పద్ధతులు తెలుసుకుంటారు. అవసరమనుకుంటే గ్రామంలోని రైతులందరినీ సమీపంలోని ఆర్బీకే వద్ద సమావేశపరిచి సామూహికంగా పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ఇలా ఒక్క ఫోన్కాల్తో సాగు సమస్యలే కాదు సరికొత్త సాగు విధానాలు, చీడపీడల నియంత్రణ, నివారణోపాయాలు, అధిక దిగుబడికి సలహాలు అందిస్తున్నారు. ఐసీసీ టోల్ ఫ్రీ నంబర్: 155251 వాట్సాప్ నంబర్లు: 8331056028, 8331056149, 8331056150, 8331056152, 8331056153, 8331056154 ఊరంతా మేలు జరిగింది నాలుగెకరాల్లో పత్తి వేశా. పంటకు సోకిన తలమాడు తెగులు గుర్తించి సెపె్టంబర్ 5న ఫోన్చేశా. ఆ మర్నాడే అధికారు లు, శాస్త్రవేత్తలు మా ఊరొచ్చారు. ఊ రంతా ఈ తెగులు ఉందని గమనించి ఆర్బీకే వద్ద రైతులందరిని సమావేశపరిచి పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను చెప్పారు. నా పొలంలో గుర్తించిన గులాబి రంగు పురుగు నివారణకు సిఫార్సులు చేశారు. మందులు వాడడంవల్ల రైతులందరికీ మేలు జరిగింది. ఎకరానికి 9 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. – జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దమ్మాలపాడు, పల్నాడు జిల్లా ఒక్క ఫోన్కాల్తో సమస్య దూరం మా గ్రామంలో దాదాపు వంద ఎకరాల్లో వరి సాగు చేశాం. పైరులో ఉల్లికోడు ఆశించింది. సెపె్టంబర్ 20న నేను గన్నవరం కాల్ సెంటర్కు ఫోన్చేశాను. వెంటనే కాకినాడ నుంచి డీఆర్సీ సిబ్బంది, శాస్త్రవేత్తలు గ్రామానికి వచ్చి పరిశీలించారు. సస్యరక్షణ చర్యలు సూచించారు. ఉల్లికోడును తట్టుకునే సురేఖ, దివ్య, శ్రీకాకుళం సన్నాలు వంటి రకాలను సాగుచేస్తే మంచిదని సూచించారు. ఒక్క ఫోన్తో మా సమస్యకు పరిష్కారం లభించడం ఎంతో సంతోషం. – శీలం చినబాబు, కోరంగి, కాకినాడ జిల్లా మంచి స్పందన వస్తోంది కాల్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలకు రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాల్చేసిన వారిలో నూటికి 90 శాతం మంది సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సంతృప్తి ఈ స్థాయిలో ఉండడం నిజంగా గొప్ప విషయం. కాల్ సెంటర్ సిబ్బంది కూడా చాలా ఓపిగ్గా వింటూ మర్యాదపూర్వకంగా సమాధానాలు చెబుతున్నారు. – వై. అనురాధ, నోడల్ ఆఫీసర్, ఐసీసీ కాల్ సెంటర్ కాల్ సెంటర్ బలోపేతానికి చర్యలు దేశంలో మరెక్కడా లేని విధంగా మన రైతు సమాచార కేంద్రం అద్భుతంగా పనిచేస్తోంది. కాల్ సెంటర్ను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు హైదరాబాద్కు చెందిన బ్రేన్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. ఫోన్ రాగానే రైతుల సమస్యలన్నీ ఆటోమెటిక్గా సంబంధిత డీఆర్సీతో పాటు జిల్లా, మండల వ్యవసాయ శాఖాధికారులకు క్షణాల్లో చేరిపోతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను కూడా డిజైన్ చేస్తున్నాం. – వల్లూరి శ్రీధర్, స్టేట్ కోఆర్డినేటర్, ఐïసీసీ కాల్ సెంటర్ -
సమస్యలకు చకచకా పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం విజయవంతగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రజలు చెప్పుకొన్న సమస్యలు చకచకా పరిష్కారమవుతున్నాయి. టోల్ఫ్రీ నంబర్కు ప్రజలు సమస్యలు చెప్పగానే, వాటిని సంబంధిత శాఖలు వెనువెంటనే పరిష్కరిస్తున్నాయి. ఈ ఏడాది మే 9వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఈ నెల 12వ తేదీ వరకు తెలిపిన సమస్యల్లో ఇప్పటివరకు 86 శాతం పరిష్కారమయ్యాయి. మిగతావి పరిష్కారదశలో ఉన్నాయి. 85 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడైంది. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజలు సమస్యలను తెలపడానికి ప్రభుత్వం 1902 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. ఈ నంబరుకు వచ్చిన సమస్యలను నిర్ధారించిన గడువులోగా పరిష్కరించి, దాని స్థితిగతులను ఫిర్యాదుదారుకు తెలియజేస్తారు. ఇలా జవాబుదారీతనంతో కూడిన ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ప్రజల నుంచి వచ్చే సమస్యల పరిష్కారాన్ని నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో పాటు శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు, మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. పరిష్కరించిన సమస్యల పట్ల ప్రజలు అభిప్రాయాన్ని కూడా తిరిగి ఆడిట్ ద్వారా తెలుసుకుంటున్నారు. 1902 నంబరుకు ఈ నెల 12వ తేదీ వరకు 2,57,311 సమస్యలు వచ్చాయి. అందులో 2,20,785 సమస్యలను పరిష్కరించారు. అంటే 86 శాతం పరిష్కారమయ్యాయి. మరో 14 శాతం అంటే 36,526 సమస్యలు పరిష్కార దశలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి ఇటీవల జిల్లా కలెక్టర్లతో ఈ కార్యక్రమంపై సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించి, ప్రజల సంతృప్తి శాతాన్ని ఇంకా మెరుగుపరచాలని సూచించారు. సమస్యల పరిష్కారంంలో ఇంధన శాఖ, గృహ నిర్మాణ, వైద్య ఆరోగ్య, వ్యవసాయ శాఖల పట్ల ప్రజల్లో అత్యధికంగా సంతృప్తి వ్యక్తమైంది. అలాగే అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు. శ్రీకాకుళం జిల్లాల్లో జగనన్నకు చెబుదాంలో సమస్యల పరిష్కారం పట్ల అత్యధిక శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. -
సమస్యల ‘వాణి’ కి అందిన 400 దరఖాస్తులు..
కరీంనగర్: కలెక్టరేట్ సముదాయంలో సోమవారం జనసందోహం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందన్న సమాచారంతో ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి, తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అత్యధికంగా భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి 400కు పైగా దరఖాస్తులు రాగా ఆన్లైన్, మాన్యువల్గా స్వీకరించారు. కలెక్టర్ బి.గోపి, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. భూమి విషయంలో బెదిరిస్తున్నడు ఏళ్లుగా భూమిని అనుభవిస్తున్నం. పంటల సాగుతోనే కుటుంబాన్ని పోషిస్తున్నం. కానీ మా భూమితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి అతని భూమి అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నడు. సర్వే నంబర్ 126బి/3, 126ఎ/3 తదితర సర్వే నంబర్లలో మా భూమి ఉంది. అధికారులు న్యాయం చేయాలి.– బండారి కుటుంబసభ్యులు, చామనపల్లి, కరీంనగర్ రూరల్ పట్టాదారు పేరు మార్చండి చల్లూరు గ్రామంలో సర్వే నంబర్ 91, 728/2లో మూడెకరాల భూమి ఉంది. భూ రికార్డుల్లో తాతల కాలం నుంచి మేమే ఉన్నాం. కానీ సంబంధం లేని వ్యక్తి పేరిట మార్చారు. ఈ విషయంలో గత కొన్నేళ్లుగా తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. అయినా స్పందన లేదు. అధికారులు మోకాపై విచారణ జరిపి, న్యాయం చేయాలి. – గాజుల ప్రసాదరావు, చల్లూరు, వీణవంక వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి మాది కరీంనగర్లోని 42వ డివిజన్. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న. ఇప్పుడు శరీరం సహకరించడం లేదు. పని చేయాలంటే చేతకాని పరిస్థితి. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. రేపుమాపంటూ తిప్పుకుంటున్నరు. – బాసం మల్లయ్య, ప్రశాంత్నగర్, కరీంనగర్ వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి మాది కరీంనగర్లోని 42వ డివిజన్. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న. ఇప్పుడు శరీరం సహకరించడం లేదు. పని చేయాలంటే చేతకాని పరిస్థితి. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. రేపుమాపంటూ తిప్పుకుంటున్నరు. – బాసం మల్లయ్య, ప్రశాంత్నగర్, కరీంనగర్ పరిహారం ఇయ్యలే.. మాది కొత్తపల్లి మండలంలోని ఎలగందుల గ్రామం. మా ఇల్లు ఎస్సారెస్పీ ముంపునకు గురైంది. సర్వే నంబర్ 271లో ఇంటి నంబర్ 10–84 కాగా పరిహారం ఇచ్చే సమయంలో నా సోదరికి పక్షవాతం రావడంతో ఆస్పత్రిలో ఉన్నారు. అధికారులు కాలయాపన చేస్తున్నరు. – గడ్డం ఆంజనేయులు, రేకుర్తి, కరీంనగర్ -
మొదటికొచ్చిన ఏఎన్ఎంల పంచాయితీ
సాక్షి, హైదరాబాద్/సుల్తాన్ బజార్: రెండో ఏఎన్ఎంల ఆందోళన వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసి అధికారుల హామీతో విరమించిన ఏఎన్ఎంలు... హామీలు నెరవేరకపోవడంతో తిరిగి సమ్మె చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్ ప్రజారోగ్య సంచాలకుడి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. గత కొన్నాళ్లుగా ఏఎన్ఎంలు ఆందోళనలు, నిరసనలు చేస్తుండటం తెలిసిందే. అందులో భాగంగా ఆగస్టు 16 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవగా ప్రభుత్వం నాలుగుసార్లు వారితో చర్చలు జరిపింది. సెప్టెంబర్ ఒకటిన యూనియన్ నేతలతో జరిగిన చర్చల్లో ఏఎన్ఎంల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ వేయాలని నిర్ణయించింది. దీంతో ఒప్పందం ప్రకారం అదే నెల నాలుగో తేదీ నుంచి ఏఎన్ఎంలు సమ్మె విరమించారు. ఒప్పందంలో భాగంగా సెపె్టంబర్ నెల 15గా పీఆర్సీ బకాయిలతోపాటు సమ్మె కాలపు వేతనాన్ని ఈ నెల జీతంతో చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ సమ్మె విరమించి నెల రోజులైనా ఇప్పటివరకు తమ డిమాండ్లను పరిష్కరించలేదని ఏఎన్ఎంలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆందోళనకు దిగారు. ఇవీ ప్రధాన డిమాండ్లు... ♦ నోటిఫికేషన్లో ఇచ్చిన బేసిక్ పేతో 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలి. పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. రూ. 10 లక్షల ఆరోగ్య బీమా, ఏఎన్ఎంలు దురదృష్టవశా త్తూ మరణిస్తే రూ. 10 లక్షల ఎక్స్గ్రేíÙయాను అందించడంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి 6 నెలల్లోగా కారుణ్య నియామకం కింద కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని ఇవ్వాలి. ♦ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పూర్తి కాలానికి గ్రాట్యుటీ చెల్లించాలి. ♦ సమ్మె కాలానికి సంబంధించిన జీతం విడుదల చేయాలి. ♦ కరోనాకాలంలో మరణించిన రెండో ఎఎస్ఎంలను గుర్తించి వారి కుటుంబాలకు రూ. 5 లక్ష ల ఎక్స్గ్రేíÙయా చెల్లించడంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి కాంట్రాక్ట్ బేసిక్ లోనైనా సరే కారుణ్య నియామకం చేపట్టాలి. ♦ యూపీహెచ్సీల్లో పనిచేసే వారికి కూడా íపీహెచ్సీ వాళ్లకు ఇచ్చినట్లే రెండు మార్కుల వెయిటేజీ ఇవ్వాలి. ♦ నవంబర్ 10న జరిగే పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 10 వరకు వేతనంతో కూడిన ప్రిపరేషన్ హాలిడేస్ ఇవ్వాలి. ♦ పీహెచ్సీల్లో ఫస్ట్ ఏఎస్ఎంలు లేని సబ్ సెంటర్లలో పనిచేస్తున్న రెండో ఏఎస్ఎంకు రూ. 10 వేల అదనపు వేతనాన్ని అందించాలి. ♦ 8 గంటల పని విధానాన్ని అమలు చేస్తూ సాయంత్రం 6 గంటల తర్వాత ఏదైనా రిపోర్టు పంపాలని ఒత్తిడి చేయకూడదు. ♦ యూనిఫాం అలవెన్స్ కింద రూ. 4,500 ఇవ్వాలి. ♦ లక్ష్యాలను నిర్దేశిస్తూ జీతాలను నిలిపే ప్రక్రియను ఆపాలి. ♦ సమ్మె సందర్భంగా ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలి. ♦ వివాహం కాకముందు ఉద్యోగంలో నియమితులైన ఏఎస్ఎంలను వారి భర్తల సొంత మండలాలకు బదిలీ చేయడానికి అవకాశం కల్పించాలి. ∙పరీక్షను ఆఫ్లైన్లోనే ఓఎంఆర్ షీట్తో నిర్వహించాలి. -
ఇక పేదల ఇళ్ల స్థలాలకూ ‘భూదాన్’ భూములు
సాక్షి, అమరావతి: పేదలకు మేలు చేయడమే లక్ష్యంగా భూములకు సంబంధించి పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భూదాన్ బోర్డు విషయంలోనూ అదే ఒరవడిని కొనసాగించింది. భూదాన్ బోర్డుకి సైతం పేదలకు ఇళ్ల స్థలాలిచ్చే అధికారాన్ని ఇచ్చింది. ఇందుకోసం 1965 ఏపీ భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని సవరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది. భూస్వాములు తమకున్న భూమిలో కొంత పేదలకు ఇవ్వాలని కోరుతూ 1950వ దశకంలో గాంధేయవాది ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమాన్ని చేపట్టారు. ఆయన స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పలువురు భూమిని దానం చేశారు. ఇలా సంపన్నులు దానం చేసిన భూములను పేదలకు పంచే విధానాన్ని సూచిస్తూ కేంద్రం భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని రూపొందించగా దానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాలు చట్టాలను చేసుకున్నాయి. మన రాష్ట్రం కూడా 1965లో ఏపీ భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని చేసింది. దాని ప్రకారం భూదాన్ యజ్ఞ బోర్డును నియమించి దాని ద్వారా భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారాలు నడిపారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని భూదాన్ భూముల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భూముల వ్యవహారాలన్నింటినీ పరిష్కరించేందుకు ఒక క్రమపద్ధతిలో పనిచేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం భూదాన్ భూముల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్ను నియమించింది. అలాగే భూదాన్ భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు వాటి ద్వారా పేదలకు ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో తాజాగా భూదాన్ చట్టాన్ని సవరించింది. ఆచార్య వినోబా భావే లేకపోతే ఆయన నామినేట్ చేసిన వ్యక్తి సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు భూదాన్ బోర్డు చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను నియమించాలి. ఇవీ సవరణలు గత చట్టంలో భూదాన్ భూమిని వ్యవసాయం, ప్రభుత్వం, స్థానిక సంస్థలు, సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగించాలని నిర్దేశించారు. తాజా సవరణలో సామాజిక ప్రయోజనంతోపాటే బలహీనవర్గాలు, పేదల ఇళ్ల స్థలాల కోసం భూమిని కేటాయించే అధికారాలను భూదాన్ బోర్డుకి ఇచ్చారు. గతంలో ఇళ్ల స్థలాలకు కోసం భూదాన్ భూములను వినియోగించే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు వాటికి వినియోగించే అవకాశం ఏర్పడింది. వినోబా భావే మృతి చెందిన 41 సంవత్సరాలు దాటిపోవడంతో ఆయన ఎవరిని నామినేట్ చేశారనే దానిపై స్పష్టత లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని ఒకటి, రెండు సంస్థలు భూదాన్ బోర్డులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడడంతో పలు రాష్ట్రాలు చట్టాలను సవరించుకున్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ప్రభుత్వమే భూదాన్ బోర్డు చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను నియమించేలా చట్టంలో మార్పు చేశారు. భూదాన్ భూమిని పొందిన వ్యక్తి వరుసగా రెండు సాగు సంవత్సరాలు వ్యవసాయం చేయకపోతే ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారంతోపాటు భూమి పొందిన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తులు భూమిపై ఉన్నప్పుడు వారి నుంచి భూమిని తిరిగి తీసుకునే అధికారాన్ని తహసీల్దార్కు ఇస్తూ ఇప్పుడు చట్టంలో అవకాశం కల్పించారు. తద్వారా అన్యాక్రాంతమైన భూదాన్ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలు ఏర్పడింది. అర్బన్ ప్రాంతాల్లో వ్వవసాయం చేయకుండా ఆగిపోయిన భూదాన్ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగించుకునే అవకాశాన్ని చట్టంలో కల్పించారు. పేదలకు ఇంకా మంచి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఎప్పుడూ పేదల గురించే ఆలోచిస్తారనడానికి ఈ చట్ట సవరణ ఒక ఉదాహరణ. భూదాన్ భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు వాటి ద్వారా పేదలకు ఇంకా మంచి చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ భూముల వివరాలన్నింటినీ సేకరిస్తున్నాం. సీఎం ఆలోచనలకు అనుగుణంగా భూదాన్ భూములపై నిర్ణయాలు తీసుకుంటాం. – తాడి విజయభాస్కర్రెడ్డి, ఛైర్మన్, ఏపీ భూదాన్ యజ్ఞ బోర్డు -
ఫొటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: హరీశ్రావు
గన్ఫౌండ్రీ (హైదరాబాద్): ఫొటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. గతంలో పత్రికా ఫొటోగ్రాఫర్లకు ఫొటో జర్నలిస్టుగా అక్రిడిటేషన్ ఉండేదని, కానీ నేడు ఫొటోగ్రాఫర్గా మార్పు చేయడం వలన ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ సమస్య త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో.. అవార్డులు అందుకున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లు శివప్రసాద్, యాకయ్య, వేణుగోపాల్, సతీశ్, శివకుమార్, భాస్కరాచారి, రాజే శ్రెడ్డి, ఠాకూర్ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫొటోజర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్లో గెలుపొందిన ఫొటోగ్రాఫర్లకు ఆదివారం రవీంద్రభారతిలో బహుమతులు ప్రదానం చేశారు. హరీశ్ మాట్లాడుతూ దినపత్రికల్లో వార్త పూర్తిగా చదవకపోయినప్పటికీ ఫొటోను చూసి సారాంశం గ్రహించవచ్చని చెప్పారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం రూ.100 కోట్లు జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం కేటాయించిందని, త్వరలో జర్నలిస్టు భవనం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోంది
మచిలీపట్నంటౌన్: ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తూనే.. మరికొన్ని డిమాండ్లను కూడా నెరవేర్చేందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తున్నారని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కె.వి.శివారెడ్డి చెప్పారు. ఆదివారం విజయవాడలో వారు.. ఉద్యోగులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి అంచెలంచెలుగా పరిష్కరిస్తున్నారని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్పై త్వరలోనే జీవో రాబోతోందన్నారు. సీఎం జగన్.. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటం అభినందనీయమన్నారు. ఉద్యోగులపై సీఎం జగన్ ప్రేమాభిమానాలు చూపుతున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. 33 ఏళ్లుగా కార్పొరేషన్ కింద ఉన్న ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను సీఎం జగన్ 010 పరిధిలోకి తెచ్చారని వివరించారు. ఈ ఉద్యోగులు గతంలో ఎప్పుడు జీతం పడుతుందో తెలియక ఇబ్బందులు పడేవారని.. ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే జీతం అందుకుంటున్నారని చెప్పారు. సీపీఎస్ కాకుండా జీపీఎస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని.. ఇది కూడా ఉపయోగకరమేనన్నారు. 71 డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించగా.. 65 డిమాండ్లపై సానుకూలంగా స్పందించారని.. మిగిలిన వాటిని కూడా సీఎం జగన్ పరిష్కరిస్తారనే ఆశాభావం తమకు ఉందన్నారు. ఆగస్ట్ 21, 22 తేదీల్లో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే సంఘం మహాసభలను జయప్రదం చేయాలని ఉద్యోగులను కోరారు. ఈ సభలకు సీఎం జగన్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కూడా హాజరవుతున్నారన్నారు. సమావేశంలో ఏపీఎన్జీవో సంఘం నాయకులు ఉల్లి కృష్ణ, ఎ.వెంకటేశ్వరరావు, దారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
గురుక పెట్టి హాయిగా నిద్రపోతున్నారా?.. అంతకు మించి సమస్యలు
‘చెవిచిల్లు పెట్టే నీ గురక... చిందరవందర అయింది నా పడక’ అని నిద్రలో గురక పెట్టే వాళ్లపైన చుట్టుపక్కలవాళ్లు గింజుకుంటారు. అయితే నిద్రలో గురకపెట్టేవారికి అంతకు మించిన సమస్యలే ఎదురవుతాయని హెచ్చరిస్తున్నాయి అధ్యయనాలు. ఎవరైనా మంచం మీద ఇలా వాలి అలా గుర్రుపెట్టారంటే హాయిగా నిద్రపోతున్నారనుకుంటాం. అయితే గురకపెడుతూ నిద్రపోవడం హాయిగా భావించడం సరికాదని, దానిని తీవ్రమైన ఆరోగ్య సమస్యగా భావించాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. గురక తెచ్చిపెట్టే సమస్యలపై మన దేశంలో అవగాహన అత్యల్ప స్థాయిలో ఉందని వారంటున్నారు సాక్షి, హైదరాబాద్ : ఇటీవల చేసిన రెస్మెడ్–2023 గ్లోబల్ స్లీప్ సర్వేలో 58 శాతం మంది భారతీయులు గురకను మంచి నిద్రకు చిహ్నంగా భావిస్తున్నట్టు తేలడం నిద్ర ఆరోగ్యంపై వారి అవగాహన లేమిని తేల్చింది. 2022తో పోలిస్తే 2023లో మన వాళ్ల నిద్ర నాణ్యత 22 శాతం క్షీణించినా సర్వేలో పాల్గొన్నవారిలో 85 శాతం మంది తమ నిద్ర నాణ్యత బాగుందన్నారని సర్వే వెల్లడించింది. మూడ్ మార్పులు, పగటి నిద్ర, ఏకాగ్రత లోపం ఉన్న 20 శాతం మంది మాత్రమే వైద్యుడ్ని సంప్రదించాలని నిర్ణయించుకున్నారని తేల్చింది. గురక.. అనారోగ్య కారణమే... అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెడికల్ జర్నల్ ‘న్యూరాలజీ ఆన్లైన్’సంచికలోప్రచురించిన అధ్యయనం ప్రకారం..గురక పెట్టే వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం 91 శాతం ఎక్కువ. అంతేకాదు గురకపెట్టేవారిలో దాదాపు 20–25 శాతం మంది గురక.. తద్వారా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఒఎస్ఎ)తో బాధపడుతూ ఉండవచ్చునని మరో అధ్యయనం తేల్చింది. గురకపెట్టే వారిలో ప్రతి నాల్గవ వ్యక్తి స్లీప్ అప్నియా రోగి అని వైద్యులు అంటున్నారు. పెరుగుతున్నబాధితులు గురక–స్లీప్ అప్నియాతో బాధపడుతున్న చాలా మందికి దాని తీవ్రమైన పరిణామాల గురించి తెలియదని ఛాతీ, శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ సందీప్ అంటున్నారు. ‘40 శాతం మంది వ్యక్తులు గురక పెట్టినట్లయితే, వారిలో 10 శాతం మందికి స్లీప్ అప్నియా ఉన్నట్టే’అని దేశంలో తొలి స్లీప్ ల్యాబ్ ప్రారంభించిన డాక్టర్ జేసీ సూరి అన్నారు. తాను స్లీప్ ల్యాబ్ ప్రారంభించినప్పుడు నెలకు నలుగురైదుగురు రోగులు మాత్రమే వచ్చేవారని, ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరిగిందని అందులో మధ్య వయసు్కలు, వృద్ధుల సంఖ్య దాదాపు 15–20 శాతంగా ఉందన్నారు. ‘స్లీప్ అప్నియా ద్వారా రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. బాల్యంలోనే... నగరానికి చెందిన ఏఐజీ ఆసుపత్రి ఇటీవలి అధ్యయనం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 శాతం మంది పిల్లలు గురక, నిద్రలేమితో బాధపడుతున్నారు. చిన్నారుల్లో గురకకు చికిత్స చేయకపోతే మానసిక వికాసం, మేధో సామర్థ్యాలు దెబ్బతింటాయని, శారీరక చురుకుదనంపై కూడా ప్రభావం చూపుతుందని, దీర్ఘకాలిక అనారోగ్యానికి దారితీయవచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గురక లక్షణాలున్న కేసుల్లో దాదాపు 70 శాతం మంది పిల్లలకు స్లీప్ అప్నియా ఉన్నట్టు, 15 నుంచి 20 శాతం మంది పాఠశాల పిల్లలు ఊబకాయంతో ఉన్నారని వీరిలో అత్యధికులు గురకతో బాధపడేవారేనని ఏఐజీ అధ్యయనంలో తేలింది, నిద్ర పోకుండా పిల్లలు ఎక్కువ గంటలు మేల్కొని ఉండటం అధిక చురుకుదనం లక్షణంగా తల్లిదండ్రుల భావిస్తే అది అపోహ మాత్రమేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. స్లీప్ అప్నియాలక్షణాలివే.. నిద్రలో కండరాలు సడలించడం వల్ల శ్వాసనాళాలు కుంచించుకు పోతాయి. ఫలితంగా ఆక్సిజన్ అందక అది నాణ్యమైన శ్వాసక్రియకు, నిద్రకు తీవ్రమైన అంతరాయం కలిగించే పరిస్థితే స్లీప్ అప్నియా. గురక ముదిరి స్లీప్ అప్నియాకు దారి తీస్తుంది. సాధారణంగా ఊబకాయం ఉన్న వారిలో ఇది కనిపిస్తుంది. మెడ చుట్టుకొలత తగినంత లేకపోవడం, ఎగువవైపునకు గాలి వెళ్లే మార్గం ఇరుకుగా మారడం స్లీప్ అప్నియాకు దోహదం చేస్తుంది. ఉదాహరణకు, పిల్లలలో టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ కూడా స్లీప్ అప్నియాకు కారణం కావచ్చు. స్లీప్ అప్నియా ముదురుతున్న దశలో వ్యక్తి సురక్షితంగా డ్రైవింగ్ చేసే సామర్థ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. పగటిపూట అధికంగా నిద్రపోవడం ఏకాగ్రత లోపాలకు దారితీస్తుంది. ‘స్లీప్ అప్నియా చికిత్సలో భాగంగా బరువు తగ్గడం, ధూమపానం మానేయడం, ఆల్కహాల్ బాగా తగ్గించడం, తీరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. ఈ వ్యాధి తీవ్రమైతే రోగులకు మాస్క్ ద్వారా గాలిని అందించే వైద్య పరికరం, కొన్ని సందర్భాల్లో, అడ్డంకిని సరిచేయడానికి శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు. పిల్లలకు మరింత చేటు... తీవ్ర గురకతో బాధపడుతున్న పిల్లల్లో చురుకుదనం, శ్రద్ధ లోపిస్తాయి. చిరుతిళ్లు అధికంగా తినడం, చిరాకు, తరచుగా అలసట ఉంటాయి. గురక, నోటితో శ్వాస తీసుకోవడం, రాత్రి పూట చెమట పట్టడం వంటివి పిల్లల్లో గమనిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. –ఆర్.దీప్తి, చీఫ్ పీడియాట్రిషియన్,అమోర్ హాస్పిటల్స్ -
నిద్రలేమికి ఆస్పత్రి ఏర్పాటు అభినందనీయం
బంజారాహిల్స్ (హైదరాబాద్): నిద్రలేమి సమస్యలతో పాటు నిద్రలో వచ్చే అనేక ఇబ్బందులకు ఎక్కడికి వెళ్లాలో చాలామందికి తెలియదని అలాంటి వారికోసం ప్రత్యేకంగా ఆధునిక సాంకేతికతతో ఆస్పత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం ఫిలింనగర్ రోడ్ నెం 82లో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కోడలు, స్లీప్ థెరపిటిక్స్ డాక్టర్ హర్షిణికి చెందిన ‘ది బ్రీత్ క్లినిక్’ను ఆయన మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి నిద్ర అనేది ముఖ్యమని, చాలినంత నిద్రలేకపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు ఇలాంటి ఆస్పత్రులు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ హర్షిణి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి పైగా జనాభా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. అలాంటి వారికోసం తాము మూడు ప్రత్యేక ల్యాబ్లను ఏర్పాటు చేశామని, తెలుగు రాష్ట్రాల్లోనే నిద్రకు సంబంధించి ఇది తొలి క్లినిక్ అని అన్నారు. -
ఆ చెట్టు ఆకులు తెల్ల జుట్టుకి చెక్ పెడితే..వాటి పువ్వులు ఏమో..
మందారం ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుత్తు బాగా పెరుగుతుంది. చుండ్రు నివారణలోనూ, తెల్ల వెంట్రుకల నిరోధకంలోనూ సాయమవుతుంది. కప్పు నీటిలో ఒక మందార పువ్వు వేసి మరిగించి ఆ నీళ్లను తాగితే రక్తంలో ఐరన్ పెరుగుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఓ 10 ఆకులతో పేస్ట్ తయారు చేసి మజ్జిగలో కలిపేసుకుని రోజూ తాగితే కాలేయం వ్యర్థపదార్థాల నుంచి రక్షణ పొందుతుంది. రోజూ ఓ 8 ఆకుల్ని మిరియాలతో కలిపి తింటే ముక్కులో వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి. రోజూ రెండు మూడు పుదీనా ఆకుల్ని నమిలి మింగుతుంటే జీర్ణశక్తి పెరిగి, కడుపు ఉబ్బరం, తేన్పులు తగ్గుతాయి. శ్వాసకోశాల శక్తి పెరుగుతుంది. వేపాకు, యాంటీ సెప్టిక్గాన, క్రిమి సంహారిణిగానూ బాగా పనిచేస్తుంది. వేపాకు పొడిని నీళ్లల్లో కలిపి చల్లితే ఎన్నో రకాల క్రిమి కీటకాలు దూరంగా వెళ్లిపోతాయి. వేపాకుల్ని నీటిలో వేసి మరిగించి స్ప్రే చేస్తే దోమల బెడద తప్పుతుంది. వేపాకు పొడిని పేస్ట్గా చేసి వాడితే పలు రకాల చర్మ సమస్యలు, మొటిమలు, ఎగ్జిమాల బాధలు తప్పుతాయి. పసుపును పేస్ట్గా రోజూ ముఖానికి వాడితే, ముఖం మీద ఉండే సన్నని వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే మొటిమలు, మచ్చలు కూడా మాయమవుతాయి. ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంటు కాబట్టి రోజు మొత్తంలో ఒక టీ స్పను దాకా కడుపులోకి తీసుకోవచ్చు. (చదవండి: ఈ ఆహారం తింటే..చినుకుల్లో చింత ఉండదు) -
ట్విటర్లో సాంకేతిక సమస్యలు.. యూజర్ల గగ్గోలు
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లకు ట్విటర్ మొరాయించినట్లుగా ఆన్లైన్లో సాంకేతిక సమస్యలను సమీక్షించే వేదిక ‘డౌన్ డిటెక్టర్’ నివేదించింది. ‘డౌన్ డిటెక్టర్’ ప్రకారం.. భారత్లో 300 మందికి పైగా ట్విటర్ యూజర్లు ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ను ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. 7 వేల మందికి పైగా యూజర్లు అవుట్టేజ్ ట్రాకర్ వెబ్సైట్లో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను నివేదించారు. సాంకేతిక సమస్యలపై యూజర్ల ఫిర్యాదుల నేపథ్యంలో ట్విటర్లో #TwitterDown హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. యూజర్లు ఎవరికి తోచిన విధంగా వారు ఎలాన్ మస్క్ను తమ కామెంట్లతో ఆడేసుకున్నారు. "ఎలాన్ మస్క్ను ఎవరైనా నిద్రలేపి అతని 44 బిలియన్ డాలర్ల యాప్ పని చేయడం లేదని చెప్పండి!" అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. “ట్విటర్ డౌన్ అయిందా? ఇంకా ఎవరికైనా ఇదే సమస్య వచ్చిందా? కామెంట్ సెక్షన్ తెరవడం సాధ్యం కాలేదు" అని మరొక యూజర్ ట్వీట్ చేశారు. "నేను చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ.... #TwitterDown" ఇంకొక యూజర్ పోస్ట్ చేశారు. “Sorry. You are rate limited. Please try again in a few minutes.” That’s what I’m getting now. 🙃 #TwitterDown — SamanthaM (@Sammy6170) July 1, 2023 Twitter Down now Elon Musk trying to fix the problem be like😅#TwitterDown pic.twitter.com/7OeWprN7CJ — Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) March 1, 2023 Live footage of Elon at Twitter HQ trying to fix the rate limit exceeded debacle.#twitterdown pic.twitter.com/KtzqdRj9HH — Em (@emmasaurustex) July 1, 2023 -
డ్రై ఫ్రూట్స్ తరచుగా తినే అలవాటుందా? అయితే అంతే సంగతులు!
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. దీన్ని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలా అని వాటిని అతిగా తీసుకుంటే శరీరంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపించడమే గాక లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు న్యూట్రీషియన్లు. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువు, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, అతిసారం లేదా అపానవాయువుని పెంచడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇవి ఎలాంటి దుష్ప్రభావాలు చూపిస్తాయో ఒక్కసారి చూద్దాం. అలెర్జీ: డ్రై ఫ్రూట్స్ కొన్నిసార్లు అలెర్జీకి కారణమవుతాయి. దీందో శరీరంపై దురద, ఊపిరాడకపోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలర్జీలు ఉన్నవారు డ్రైఫ్రూట్స్ తినకపోవడమే మంచిదని ఆహార నిపుణలు చెబుతున్నారు. బరువు పెరుగుట: కొన్ని డ్రై ఫ్రూట్స్లో మంచి కొలస్ట్రాల్ ఉంటుంది. దీంతో వీటిని ఎక్కువగా తీసుకుంటే తొందరగా బరువు పెరిగి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓ మోస్తారుగా బ్యాలెన్స్డ్గా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కిడ్నీ స్టోన్: జీడిపప్పుడ, బాదంపప్పు, వేరశేనగలో ఆక్సలేట్లు ఉంటాయి. దీంతో కిడ్నీలో రాళ్ల సమస్య పెరగుతుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు: జీర్ణశక్తి సరిగా లేనివారు ఇవి తీసుకుంటే లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. జీడిపప్పులో ఉండే ఫ్యాట్, ఫైబరే దీనికి కారణం. (చదవండి: స్నానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు.. నీరు లేకుండా స్నానం చేయొచ్చని తెలుసా!) -
బాసర IIIT ఘటన పై గవర్నర్ తమిళ సై ఆవేదన..!
-
యాదాద్రీశా.. ఇదేమిగోస!.. భక్తుల విలవిల
సాక్షి, యాదాద్రి: వందల కోట్లతో పునర్నిర్మాణం చేసిన యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తులకు ఇంకా కనీస స్థాయి వసతులు సమకూరకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. గడిచిన వారం రోజులుగా పగటి పూట ఎండ తీవ్రతకు కొండపైన భక్తులు విలవిలలాడుతున్నారు. 43 డిగ్రీలు దాటుతున్న ఎండ ధాటికి కృష్ణ శిలలతో నిర్మించిన ప్రధానాలయం, దాని పరిసరాలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రధానాలయంలో సెంట్రల్ ఏసీలో శ్రీస్వామి దర్శనం చేసుకుని బయటకు వచి్చన భక్తులకు ఎండ వేడిమితో పట్టపగలే చుక్కలు కని్పస్తున్నాయి. ప్రసాదాల కొనుగోలుకు, శివాలయానికి వెళ్లడానికి, కొండపైన బస్టాండ్కు వెళ్లడానికి కాలినడకన వెళ్లాల్సిన ప్రాంతాలు నిప్పుల కుంపటిలా మారాయి. స్వామి దర్శనం కోసం చెప్పులు లేకుండా వెళ్లే భక్తులు తిరుగు ప్రయాణంలో పాదాలు కాలుతుండడంతో పరుగులు తీçస్తున్నారు. పిల్లలతో వచి్చన వారి పరిస్థితి దయనీయంగా ఉంది. వృద్ధులు కాళ్లకు సాక్స్ మాదిరిగా టవల్స్ చుట్టుకుని నడుస్తున్నారు. కూలింగ్ పెయింట్తోనే సరి భక్తులకు కనీస వసతులు కలి్పంచాల్సిన దేవస్థానం చేతులెత్తేసింది. చలువ పందిళ్లు, జూట్ మ్యాట్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. కేవలం కొంత ప్రాంతంలో వైట్ కూలింగ్ పేయింట్ వేసి చేతులు దులుపుకుంది. వేసిన కొన్ని జ్యూట్ మ్యాట్లపై వాటిపై క్రమం తప్పకుండా నీళ్లు చల్లడంలేదు. మంచినీటి నల్లాల వద్ద ఎలాంటి నీడ లేకపోవడంతో వాటి నుంచి చల్లని నీటికి బదులు వేడి నీరు వస్తోంది. దీంతో కొండపైన నీటి వ్యాపారం జోరందుకుంది. వ్యాపారులు రూ.20 ఉన్న కూల్ వాటర్ బాటిల్ రూ.30కి విక్రయిస్తున్నారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు -
రైతు సమస్యలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి లేదు
సాక్షి, గుంటూరు: చంద్రబాబు తనను తిట్టడానికే పర్యటన పెట్టుకున్నారని విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. రైతు సమస్యలపై బాబుకు, పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. రైతులకు సాయం పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ ఒకే పాట పదే పదే పాడుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి ఈమేరకు మాట్లాడారు. చదవండి: చంద్రబాబును భయపెడుతోంది ఇదే.. -
మంచి మాట: ఏదో.. ఏవో అనుకుంటూ...
ఒక పున్నమి రాత్రిలో తిక్కలోడు ఒకడు దారి వెంబడి నడుస్తూ పోతున్నాడు. కాసేపయ్యాక సేదతీరడం కోసం ఓ చెట్టు కింద నుంచున్నాడు. ఆ చెట్టుకు దగ్గరలో ఓ పెద్ద బావి కనిపిస్తే ఆ బావిలోకి తొంగి చూశాడు. ఆ బావి నీళ్లలో జాబిల్లి ప్రతిబింబం కనిపించింది. జాబిల్లి బావిలో పడిపోయింది అని అనుకున్నాడు. అయ్యో ఇప్పుడు నేనేం చెయ్యగలను? ఎలా ఈ జాబిల్లిని కాపాడగలను? ఇక్కడెవరూ లేరే, ఇప్పుడు ఈ జాబిల్లిని నేను కాపాడకపోతే అది చచ్చిపోతుంది కదా అని అనుకున్నాడు. అంతటితో ఊరుకోలేదు. అక్కడా ఇక్కడా వెతికి ఓ తాడును తీసుకుని దాన్ని బావిలోకి విసిరేశాడు జాబిల్లిని ఆ తాడుతో కట్టి బయటకు తియ్యచ్చని అనుకుని. ఆ బావిలో ఏదో ఓ రాయికి ఆ తాడు చిక్కుకుపోయింది. ఆ వ్యక్తి చాలబలంగా ఆ తాడును లాగాడు. కానీ రాయికి చిక్కుకుపోయిన తాడు రాలేదు. జాబిల్లి చాల బరువుగా ఉందే, పైగా నేనిక్కడ ఒంటరిగా ఉన్నానే, నేనెలా జాబిల్లిని బయటకు తియ్యగలను? ఈ జాబిల్లి ఎప్పటి నుండి ఈ బావిలో ఉందో తెలియడం లేదు, జాబిల్లి అసలు బతికి ఉందా, చచ్చిపోయిందా కూడా తెలియడం లేదు అని అనుకుంటూ ఆ వ్యక్తి తాడును బలంగా లాగుతున్నాడు. అలా లాగుతూ ఉండగా ఆ తాడు తెగిపోయి అతడు వెల్లకిలా నేలపై పడిపోయాడు. పడిపోవడంవల్ల అతడి కళ్లు మూసుకుపోయాయి. తలకు దెబ్బ తగిలింది. కొద్దిసేపు తరువాత అతడు కళ్లు తెరిచినప్పుడు జాబిల్లి ఆకాశంలో కనిపించింది. దాన్ని చూసి తను జాబిల్లిని కాపాడేశాడనీ, తనకు మాత్రమే కొంచెం దెబ్బ తగిలిందనీ అయినా పరవాలేదనీ తనవల్ల జాబిల్లి కాపాడబడిందనీ తనకు తాను చెప్పుకున్నాడు. ఆ వ్యక్తిని చూసి మనం నవ్వుకుంటాం. ఒక సందర్భంలో ఓషో చెప్పిన కథ ఇది. కథలోని వ్యక్తి ఎక్కడ తప్పు చేశాడు? అతడు తన తత్త్వంతో ఏదో అనుకున్నాడు. ఆ అనుకున్నది సరికాదు. మనం కూడా ఇలాగే ఏదో, ఏవో అనుకుంటూ ఉంటాం. చాలసందర్భాల్లో మనం అనుకునేవి సరైనవి కావు. ఈ తీరు మన సమస్యల్లో ప్రధానమైంది. అనుకోవడానికి అతీతంగా మనం బతకగలం అన్న చింతన కూడా మనలో చాలమందికి లేదు. ఎప్పడూ ఏదో ఒకటి అనుకుంటూ ఉండాల్సిందే అన్న స్థితిలో మనం కొట్టుమిట్టాడుతున్నాం. తిక్కవ్యక్తి, జాబిల్లి బావిలో పడిపోయిన ఈ కథలాగానే మానవజాతి మొత్తం ఇలాంటి సమస్యలో ఇరుక్కుపోయి ఉంది. ఈ ప్రపంచమంతా ఈ సమస్య ఉంది అని అంటారు ఓషో. దేన్నో అనుకుంటూ ఉండడమూ, దేన్ని పడితే దాన్ని అనుకుంటూ ఉండడమూ మనలోని సమస్యలు మాత్రమే కాదు మనం దిద్దుకోవాల్సిన తప్పులు. అభిప్రాయపడడంలాగా అనుకోవడం కూడా మనుషుల రుగ్మతే; కాకపోతే బలమైన బలహీనత. ఏదో, ఏవో అనుకుంటూ ఉండడంవల్ల మనుషులకు నష్టం, కష్టం, హాని కలుగుతూ ఉంటాయి. ఏదో, ఏవో అనుకుంటూ ఉండడం కాదు పరిస్థితులు, సంఘటనలపై సమగ్రమైన, సరైన అవగాహనను పొందేందుకు పూనుకోవాలి. అలాంటి అవగాహన మాత్రమే మనకు కావాల్సిన మేలు చేస్తుంది. అనుకోవడం అనేది ప్రతి వ్యక్తికీ ఉండే లక్షణమే. అనుకోవడం అన్న లక్షణం లేని మనుషులు ఉండరు. అయితే మనలో పలువురికి ఏం అనుకుంటున్నాం, ఎందుకు అనుకుంటున్నాం, అనుకునేది సరైందేనా? వంటివాటిపై ఉండాల్సిన పరిణతి, కచ్చితత్వం ఉండవు. ఈ తీరు పలు సమస్యలకు మూలం అవుతోంది. – రోచిష్మాన్ -
నా కుటుంబాన్ని మిస్ అయ్యాను.. నేను ప్రేమించిన వాళ్ళ దగ్గరకు వెళ్లి బాధలు పడ్డాను
-
కాలుష్య కాసారంతో నిండిపోతున్న కృష్ణ కెనాల్ కాలువ...
-
ఖమ్మం: తల్లీబిడ్డలు చల్లగా ఉండాలంటే..
ఖమ్మం: వేసవి కాలం వచ్చేసింది. నానాటికీ ఉక్కపోత పెరుగుతోంది. ఇళ్లలో అయితే ఎలాగోలా ఇక్కట్లు అధిగమిస్తాం. కానీ ఖమ్మం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మాతాశిశు కేంద్రం(ఎంసీహెచ్)లోని బాలింతల ఇబ్బందులు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ఎంసీహెచ్ రెండో అంతస్తులో ఉండగా.. వేడి ఎక్కువగా, ఫ్యాన్లు తక్కువగా ఉండడంతో బాలింతలు ఉక్కపోతతో అవస్థ పడుతున్నారు. దీంతో గర్భిణులను ప్రసవానికి తీసుకొచ్చేటప్పుడు వారి కుటుంబ సభ్యులు టేబుల్ ఫ్యాన్ కూడా వెంట తీసుకొస్తున్నారు. ఫలితంగా ప్రతీ బాలింత బెడ్ వద్ద టేబుల్ ఫ్యాన్లు కనిపిస్తున్నాయి. -
మెదడు పనిచేయకపోతే మనిషి జీవచ్ఛవం లెక్కే...
గుంటూరు మెడికల్: మనిషి దైనందిన జీవితంలో చేసే పనులన్నీ కూడా బ్రెయిన్ ద్వారానే జరుగుతాయి. జ్ఞానేంద్రియాలకు ఇది ముఖ్యమైన కేంద్రం. మెదడు పనిచేయకపోతే మనిషి జీవచ్ఛవం లెక్కే. శరీరంలోని కీలకమైన అవయవాలన్ని కూడా మెదడు ఇచ్చే ఆదేశాల ద్వారానే పనిచేస్తుంటాయి. కొన్ని రకాల వ్యాధుల వల్ల, ప్రమాదాల్లో గాయపడటం వల్ల మెదడు దెబ్బతిని, మెదడు పనిచేయక మనిషి చనిపోవటం జరుగుతుంది. మెదడును పరిరక్షించుకోకపోతే ఎలాంటి అనర్ధాలు వస్తాయి, మెదడు గురించి అవగాహన కల్పించేందుకు 1996 నుంచి 120 దేశాల్లో ప్రతి ఏడాది మార్చి 13 నుంచి 19వ తేదీ వరకు బ్రెయిన్ అవేర్నెస్ వీక్ నిర్వహిస్తున్నారు. బ్రెయిన్ సమస్యల బాధితుల వివరాలు గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో ప్రతిరోజూ 150 మంది, న్యూరో సర్జరీ విభాగంలో వంద మంది వివిధ రకాల మెదడు సంబంధిత సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. గుంటూరు జిల్లాలో 50 మంది న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు ఉన్నారు. వీరి వద్దకు ప్రతిరోజూ 20 నుంచి 30 మంది వివిధ రకాల మెదడు సంబంధిత సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. చిన్న వయస్సు మొదలుకొని పెద్ద వారి వరకు అందరికి బ్రెయిన్ సంబంధిత సమస్యలు వస్తుంటాయి. ప్రాథమిక దశలోనే వీటిని గుర్తించే ఆధునిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు నేడు అందుబాటులో ఉన్నాయి. మెదడుకు ఇబ్బందికర పరిస్థితులు... ప్రమాదాల్లో తలకు గాయాలవ్వటం. పక్షవాతం. మెదడులో ట్యూమర్లు ఏర్పడడం. పార్కిన్సన్స్ వ్యాధి. యాంగ్జటీ, డెమెన్షియా, డిప్రెషన్ కారణాల వలన మెదడు దెబ్బతింటుంది. తలనొప్పి, వాంతులు అవడం, చూపులో తేడాలు, నడకలో తడబాటు, జ్ఞాపకశక్తి లోపించడం, ఏదైనా విషయాలపై ఏకాగ్రత చూపించలేకపోవడం, చెవిలో శబ్దాలు వినిపించడం, మనిషి అసాధారణంగా ప్రవర్తించడం లాంటి లక్షణాలు కనిపిస్తే మెదడుకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయనే విషయం గుర్తించాలి. బ్రెయిన్ ట్యూమర్స్పై అప్రమత్తత.. మెదడులో ఏర్పడే కొన్ని గడ్డలు క్యాన్సర్గా మారి ప్రాణాలు తీస్తాయి. ఆపరేషన్ చేసి తొలగించవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారిలో ఫిట్స్ వస్తాయి. వైద్యుల సలహా మేరకు ఫిట్స్ రాకుండా మందులు వాడుతూ ఉండాలి. చేతులు, కాళ్లు పనిచేయకపోతే పక్షవాతం అని భావిస్తారు. బ్రెయిన్లో గడ్డ ఉండటం వలన కూడా ఇలా జరగవచ్చు. అన్ని వయస్సుల వారికి బ్రెయిన్ ట్యూమర్లు వస్తాయి. సిటిస్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్లను నిర్ధారిస్తారు. మెదడు గురించి.. ♦ మనిషి శరీరంలో బ్రెయిన్ మొత్తం బరువు రెండు శాతం. ♦ 18 ఏళ్ల వయసు వరకు బ్రెయిన్ ఎదుగుతూ ఉంటుంది. ♦ పగలు కంటే రాత్రి వేళల్లోనే మెదడు ఎక్కువ చురుకుగా పనిచేస్తుంది. ♦ మెదడులో 75 శాతం నీరు ఉంటుంది. ♦ మెదడు 1300 నుంచి 1400 గ్రాముల బరువు ఉంటుంది. ♦ అప్పుడే పుట్టిన పిల్లల్లో 350 నుంచి 450 గ్రాముల బరువు ఉంటుంది. ♦ శరీరం మొత్తం వినియోగించుకునే శక్తిలో 20 శాతం వినియోగించుకుంటుంది. -
మెట్రోకు సమ్మర్ ఫీవర్.. పగుళ్లకు కోటింగ్..పట్టాలకు లూబ్రికేషన్!
సాక్షి, సిటీబ్యూరో: వేసవిలో మెట్రో నిర్వహణ భారంగా మారింది. పలు మెట్రో స్టేషన్లకు ఏర్పడిన పగుళ్లు.. పట్టాలపై రైళ్లు పరుగులు తీసినపుడు మలుపుల వద్ద రణగొణ ధ్వనులు వెలువడుతుండడంతో తరచూ ఆందోళన వ్యక్తమౌతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలు చేపట్టే అంశంపై ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ దృష్టి సారించింది. ప్రమాణాల మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం మెట్రో ప్రాజెక్టులోని స్టేషన్లు, పిల్లర్లు తదితర సివిల్ నిర్మాణాలకు పగుళ్ల నివారణ, మన్నిక పెంచేందుకు ఇతర నిర్వహణపరమైన మరమ్మతులు చేపడుతున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. నగరంలో ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మూడు మార్గాల్లోని మొత్తం మెట్రో రైల్ నెట్వర్క్ పరిధిలో ఉన్న వయాడక్ట్ పారాపెట్స్ (పిట్టగోడలు)ను సైతం నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పలు చోట్ల స్టేషన్లకు వెంట్రుకవాసి పరిమాణంలో ఏర్పడిన పగుళ్లకు ఎపాక్సీ పదార్థంతో కోటింగ్ వేసి సరిచేస్తున్నట్లు తెలిపారు. మూడు రూట్లలో నిరంతరాయంగా రైళ్లు పరుగులు తీస్తున్న నేపథ్యంలో మెట్రో మార్గం పలు కంపనాలకు గురవుతుండడం, వాతావరణ మార్పుల కారణంగా తరచూ పగుళ్లు ఏర్పడుతున్నట్లు వివరించారు. ఇది సాధారణ పరిణామమేనని స్పష్టంచేశారు. రణగొణ ధ్వనులు వెలువడకుండా చర్యలు... నగరంలో మెట్రో మార్గం పలు ములుపులు తిరిగి ఉంది. నగర భౌగోళిక స్ధితి కారణంగా దేశంలో మరే ఇతర మెట్రో రైల్ మార్గంలో లేని విధంగా వినూత్నమైన రీతిలో మలుపులు, ఎత్తుపల్లాలతో అలైన్ మెంట్ ఉంది. ఈ నేపథ్యంలో మలుపుల వద్ద మెట్రో పట్టాలు, చక్రాల మధ్య రాపిడి కారణంగా కీచుమనే శబ్దాలు, అతిధ్వనులు అధికంగా వెలువడుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించి..రణగొణ ధ్వనులను నివారించేందుకు పట్టాలకు ట్రాక్ లూబ్రికేషన్ చేస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. తద్వార కంపనాలు పెరిగిన సమయంలో శబ్ద స్థాయిలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తరచుగా శబ్ద స్థాయిని పర్యవేక్షిస్తున్నామన్నారు. పీసీబీ నిర్దేశించిన ప్రమాణాల మేరకు శబ్దకాలుష్యం ఉందని తెలిపారు. విశ్వసనీయ ఇంజినీరింగ్ సంస్థగా, ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో నిలుస్తుందని..స్వల్ప పగుళ్లు, శబ్దకాలుష్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని సంస్థ భరోసానిస్తుండడం విశేషం. చదవండి: ఆ కరెంటుతో షాకే.. -
పొలిటికల్ కారిడార్: ఎల్బీ నగర్లో అన్ని సమస్యలే
-
యువ దంపతుల ఆత్మహత్య.. ‘దేవుడి తీర్థం రా తాగు’ అంటూ
దంపతులిద్దరూ పని కోసం నగరానికి వలసొచ్చారు. ఆభరణాల తయారీతో జీవితం మారుతుందనుకున్నారు. ఎన్నో ఆశలతో బతుకు ప్రయాణం మొదలెట్టారు. చేతినిండా పని దొరకలేదు.. జేబులో గవ్వ నిలవలేదు! చుట్టూ ఆర్థిక చీకట్లు అలుముకున్నాయి. చావొక్కటే మార్గంలా కనిపించింది.. ఆభరణాలకు మెరుగుపట్టే సైనేడ్ తీపి పాయసమైంది భార్యాభర్తలిద్దరూ గుండెనిండా దుఃఖంతో మింగారు. ఈలోకం విడిచి వెళ్లారు. పిల్లలు, వృద్ధులను ఒంటరి వాళ్లను చేశారు. ఇప్పుడు వీరికి దిక్కెవరు? సాక్షి, వరంగల్: బంగారం వ్యాపారానికి వరంగల్ నగరం అడ్డా. ఇక్కడ ఎంతోమంది స్వర్ణకారులు వివిధ ప్రాంతాలనుంచి వచ్చి ఉపాధి పొందుతుంటారు. విశ్వకర్మ వీధిలో బంగారు ఆభరణాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇలానే తన జీవితాన్ని బంగారుమయం చేసుకుందామని జగిత్యాల జిల్లాకు చెందిన ఉప్పల సతీశ్ అలియాస్ నవధన్ (33) భార్య స్రవంతి(28)తో కలిసి నగరానికి వచ్చాడు. పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు విరాట్, విహార్. కరోనా.. ఆతరువాత అంతో ఇంతో కోలుకున్నా.. రానురానూ పని దొరకడం కష్టమైంది. కుటుంబ పోషణ భారమై.. ఇటీవల కొద్ది రోజుల నుంచి పని దొరకడం లేదు. చేతిలో డబ్బులు ఉండడం లేదు. ఇంట్లో వృద్ధాప్యంలో కాలు విరిగిన నాన్న, అమ్మ. భార్యా, ఇద్దరు పిల్లలు.. కుటుంబ పోషణ కష్టమైంది. తెలిసిన వారి దగ్గర, ప్రైవేట్ ఫైనాన్స్లో అప్పు తెచ్చి బతుకు బండిని నెట్టుకొచ్చాడు. అప్పులిచ్చిన వాళ్లు తిరిగి చెల్లించాలని అడగడం మొదలెట్టారు. ఇంటి అద్దె కూడా కట్టలేని దైన్యం. దంపతులకు రూ. 10లక్ష నుంచి రూ.20లక్షల వరకు అప్పు ఉన్నట్లు తెలిసింది. అప్పులు తీర్చేదారి కని పించక సతీశ్ మానసికంగా కుంగిపోయాడు. రో జూ భార్యతో చెబుతూ బాధపడేవాడు. నాలుగు రోజులక్రితం తన తండ్రి మోహన్తో తన గోస చెప్పి చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేయగా, ఏమీ కాదు.. అన్ని సర్దుకుంటాయని మనోధైర్యం కల్పించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటింది. చదవండి: Malla Reddy: మల్లారెడ్డి ఇంటిపై ఐడీ దాడుల్లో కొత్త ట్విస్ట్.. ప్రాణాలతో బయటపడిన విరాట్, సైనేడ్ను నీళ్లతో కలుపుకొని తాగిన బాటిళ్లు నాన్నా.. ఇది దేవుడి తీర్థం రా.. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్న సతీశ్, స్రవంతిలు.. గురువారం రాత్రి చిన్న కుమారుడు నానమ్మ, తాతయ్య దగ్గర ఆడుకుంటుండగా పెద్దకుమారుడు విరాట్ను తీసుకుని బెడ్రూంలోకి వెళ్లారు. బంగారు, వెండి ఆభరణాలకు మెరుగుపెట్టే సైనేడ్ను వాటర్బాటిళ్లలో కలుపుకుని భార్యాభర్తలిద్దరూ తాగారు. పెద్దకుమారుడికి ‘దేవుడి తీర్థం రా తాగు’ అంటూ నోట్లో పోశారు. వెంటనే బాలుడు బయటికి ఉమ్మి వేశాడు. దీంతో బాలుడు ప్రాణాలతో బయటపడగా, దంపతులిద్దరూ చనిపోయారు. కొడుకు ఇంత పనిచేస్తాడనుకోలేదు.. చేతికొచ్చిన కొడుకు తమను సాకుతాడని భావించిన తండ్రి ఆకొడుకు కన్న పిల్లల బాధ్యత చూడాల్సి రావడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘కొడుకా.. ఇంత పనిచేస్తావనుకోలేదు’అంటూ ఆ వృద్ధ దంపతులు రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. స్వర్ణకారులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో గిర్మాజీపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ కష్టాలకు చెక్..
-
ప్రభుత్వ ఉత్తర్వులపై నిజాం కాలేజ్ డిగ్రీ విద్యార్థుల ఆగ్రహం ..
-
ధరణిలో మరో లొల్లి!.. దశాదిశ లేని ప్రభుత్వ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ధరణిలో పొరపాటున నిషేధిత జాబితా చేర్చిన పట్టా భూములను తొలగించేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) చేపట్టిన కసరత్తుపై విమర్శలు వస్తున్నాయి. సరైన రికార్డులు, క్షుణ్ణమైన పరిశీలన లేకుండానే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని సీసీఎల్ఏ ఒత్తిళ్లు వస్తున్నాయని.. అందులో అసైన్డ్, కోర్టు కేసుల్లో ఉన్న భూములూ ఉంటున్నాయని తహసీల్దార్లు చెప్తున్నారు. అది కూడా మౌఖిక ఆదేశాలే ఇస్తున్నారని.. దీనివల్ల భవిష్యత్తులో తాము సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువ సర్వే బైనంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించామని చెప్పుకోవడానికి సీసీఎల్ఏ తాపత్రయ పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూతూమంత్రంగా, తప్పుల తడకగా పరిష్కరించడం వల్ల సమస్య మరింత జటిలం అవుతుందనే విమర్శలు వస్తున్నాయి. రికార్డుల ప్రకారం రాష్ట్రంలో నిషేధిత భూముల సర్వే బైనంబర్లు 7లక్షల వరకు ఉన్నట్టు రెవెన్యూ వర్గాల అంచనా. అయితే ధరణి పోర్టల్లో నమోదు సమయంలో తప్పుల వల్ల వాటి సంఖ్య 20లక్షల వరకు చేరింది. రెండేళ్లు గడిచినా ఈ రికార్డులను సరిచేయడంలో పురోగతి లేదు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రైతులు తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదు. ఈ క్రమంలో తామే సుమోటోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని సీసీఎల్ఏ ముందుకొచ్చింది. నిషేధిత జాబితా నుంచి తొలగించాలో, లేదో నిర్ణయించాలంటూ 5,14,833 సర్వే బైనంబర్లను రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలకు పంపింది. ఇందులో 3,12,976 సర్వే బైనంబర్లను పరిశీలించిన స్థానిక రెవెన్యూ యంత్రాంగం కేవలం 85,132 (27.2 శాతం) నంబర్లలోని భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, 2,27,843 (72.8 శాతం) నంబర్లలోని భూమిని నిషేధిత జాబితాలో కొనసాగించాలని నిర్ణయించింది. కలెక్టర్లకు ‘హైదరాబాద్’ పిలుపు నిషేధిత జాబితాల నుంచి భూములను తొలగించే ప్రక్రియపై తుది నిర్ణయం పేరుతో కలెక్టర్లను హైదరాబాద్ రావాలని సీసీఎల్ఏ నుంచి ఆదేశాలు వెళ్లాయి. వారం రోజులుగా కలెక్టర్లతోపాటు సదరు జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, తహసీల్ కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉన్న రికార్డులతో సీసీఎల్ఏ కార్యాలయానికి వస్తున్నారు. ఆయా జిల్లాలకు కేటాయించిన సర్వే బైనంబర్లలో ఎన్ని పరిష్కారమయ్యాయి? పరిష్కారమైన వాటిలో ఎన్ని నంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించారు? ఎన్ని నంబర్లను కొనసాగించారనే వివరాలను, వాటికి కారణాలను సీసీఎల్ఏ వర్గాలకు వివరిస్తున్నారు. ఎక్కువ సర్వే బైనంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించామని చెప్పుకోవడానికి సీసీఎల్ఏ తాపత్రయ పడుతున్నట్టు సమాచారం. క్షేత్రస్థాయి యంత్రాంగం చెప్పిన కారణాలను వినకుండా.. అసైన్డ్ భూమి అయినప్పటికీ 20 ఏళ్లుగా పట్టాభూమి అని రాసి ఉందిగనుక ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఒత్తిడి చేస్తున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న వాటిని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని జిల్లాల యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నట్టు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, నారాయణపేట జిల్లాలకు చెందిన కసరత్తు పూర్తికాగా.. నల్లగొండ, కరీంనగర్, మేడ్చల్, రంగారెడ్డి, జగిత్యాల, ఖమ్మం జిల్లాలకు చెందిన అధికారులు ప్రస్తుతం సీసీఎల్ఏ కార్యాలయంలో ఈ విధుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాల నుంచి వస్తున్న యంత్రాంగానికి ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. మొత్తం మీద ఇంకా నిషేధిత జాబితాలోనే కొనసాగించాలని క్షేత్రస్థాయిలో నిర్ణయించిన వాటిలో నుంచి కనీసం 30 శాతం సర్వే బైనంబర్లను తొలగించడమే లక్ష్యంగా సీసీఎల్ఏ కార్యాలయంలో కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. అన్నీ మౌఖిక ఆదేశాలే.. వాస్తవానికి భూరికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకునే అధికారం మండల తహసీల్దార్లకు మాత్రమే ఉంటుంది. కానీ ధరణి పోర్టల్ తర్వాత జిల్లా కలెక్టర్లు భూసమస్యలను పరిష్కరిస్తున్నారు. కానీ ఆయా పరిష్కార పత్రాలపై ఉండేది తహసీల్దార్ల డిజిటల్ సంతకాలే. దీనివల్ల కలెక్టర్లు తీసుకునే నిర్ణయాలపై ఎవరైనా కోర్టులకు వెళితే తహసీల్దార్లే బాధ్యత వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు సీసీఎల్ఏ కార్యాలయం వేదికగా జరుగుతున్న కసరత్తు మరీ ఘోరంగా ఉందని తహసీల్దార్లు వాపోతున్నారు. తమకు కేటాయించిన సర్వే బైనంబర్లలోని భూముల రికార్డులను పరిశీలించి వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలా, వద్దా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటున్నామని.. అయితే దీనికి సంబంధించి తమకు ఎలాంటి లిఖితపూర్వక మార్గదర్శకాలు ఇవ్వలేదని చెప్తున్నారు. ఇప్పుడు సీసీఎల్ఏ కార్యాలయానికి పిలిపించి కూడా ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వకుండా.. కేవలం మౌఖికంగా ఫలానా సర్వేబై¯ð నంబర్లోని భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ ఆదేశాలు ఇస్తున్నారని వివరిస్తున్నారు. ఇది భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు ముప్పు తెచ్చి పెడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలగించారా, లేదా?.. తెలిసేదెలా? ఎవరైనా రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారా లేదా అన్నది సదరు రైతులకు తెలియడం లేదు. చాలా మంది రైతులకు తెలియకుండానే వారి భూములపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. అంతేగాకుండా సుమోటోగా తీసుకున్న 5 లక్షలకుపైగా సర్వే నంబర్లు మినహా ఇతర సర్వే నంబర్లలోని భూములపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. నిషేధిత జాబితా నుంచి తమ భూమిని తొలగించాలని రైతు దరఖాస్తు చేసుకుంటే.. ధరణి పోర్టల్లో ప్రాసెస్ చేసే విధానాన్ని కూడా ఇప్పుడు తొలగించారు. దీంతో తమ భూమి నిషేధిత జాబితాలో ఉందా, తొలగించారా? తమ దరఖాస్తును ఏం చేశారు? అసలు పరిష్కరిస్తారా లేదా? అన్న విషయాల్లో రైతులకు ఎలాంటి స్పష్టత లేకుండా పోవడం గమనార్హం. చదవండి: మీ వెనుక ఎవరున్నారు? -
Mumbai Monorail: ఆర్థిక నష్టాల్లో మోనో రైలు.. గట్టేక్కేదెలా?
దాదర్: భారతదేశంలో మొదటిసారి ముంబైలో ప్రవేశ పెట్టిన మోనో రైలు ప్రారంభించిన నాటి నుంచి తీవ్ర ఆర్థిక నష్టాల్లో నడుస్తోంది. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయాణికులను అనుకున్నంత మేర ఆకట్టుకోలేకపోయింది. దీంతో పీకల లోతు నష్టాల్లో కూరుకుపోయిన మోనోను గట్టెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ట్రాన్స్పోర్టు రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా మోనో రైలులో ప్రతీ ప్రయాణికుడికి సగటున రూ.200 ఖర్చవుతోంది. కానీ టికెట్టు రూపంలో కనీస చార్జీలు రూ. 20 వసూలు చేయగా గరిష్ట చార్జీలు రూ.50–60 వరకు వసూలు చేస్తున్నారు. దీన్ని బట్టి మోనోకు ఏ స్ధాయిలో నష్టాలు వస్తున్నాయో ఇట్టే తెలుస్తోంది. దేశంలోనే ప్రథమంగా... ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించిన మోనో రైలు దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎనిమిదేళ్ల కిందట ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) రూ.343 కోట్లు ఖర్చు చేసింది. కానీ గడచిన ఎనిమిదేళ్లలో ఈ రైళ్ల ద్వారా ఎమ్మెమ్మార్డీయేకు కేవలం రూ.29.73 కోట్ల ఆదాయం వచ్చింది. నష్టం మాత్రం రెట్టింపు కంటే ఎక్కువే ఉంది. ప్రారంభంలో చెంబూర్– వడాల మధ్య (9.8 కి.మీ.) తిరిగిన ఈ రైళ్లు విస్తరించడంతో ఇప్పుడు సాత్రాస్తా వరకు (20 కి .మీ.దూరం) వెళుతున్నాయి. ఈ మార్గంలో మొత్తం 18 స్టేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రైళ్లు జనవాసాల మధ్యలోంచి వెళుతున్నాయి. అయినప్పటికీ ప్రయాణికుల నుంచి స్పందన అనుకున్నంత రావడం లేదు. ప్రతీరోజూ 123 మోనో రైలు ట్రిప్పులు తిరగ్గా అందులో సరాసరి 10 వేల మంది ప్రయాణిస్తున్నారు. అంటే నెలకు సరాసరి మూడు లక్షల చొప్పున ఎనిమిదేళ్లలో 24 లక్షల వరకు రాకపోకలు సాగించినట్లు అమ్ముడుపోయిన టికెట్లను బట్టి తెలుస్తోంది. అదే ఎనిమిదేళ్ల కిందట ప్రారంభించిన వర్సోవా–అంధేరీ–ఘాట్కోపర్ మెట్రో–1 ప్రాజెక్టుకు ప్రయాణికుల నుంచి ఊహించని విధంగా స్పందన వస్తోంది. గడచిన ఎనిమిదేళ్లలో అందులో ఏకంగా 72 కోట్లకు పైనే మంది ప్రయాణించారు. దీన్ని బట్టి మోనో, మెట్రో మధ్య ఆదాయపరంగా చాలా వ్యత్యాసముందని స్పష్టమవుతోంది. మెట్రో మార్గంలో రెండు రైళ్ల మధ్య 4–5 నిమిషాల వ్యత్యాసముండగా, అదే మోనోలో 18–20 నిమిషాల వ్యత్యాసముంది. అంటే ఒక రైలు వెళ్లిపోయిందంటే ప్రయాణికులు మరో రైలు కోసం సుమారు 20 నిమిషాలు ప్లాట్ఫారంపై పడిగాపులు కాయాల్సిందే. అదేవిధంగా మోనో రైలు దిగిన ప్రయాణికులకు అనేక స్టేషన్ల బయట ట్యాక్సీ, ఆటోలు, బెస్ట్ బస్సులు తదితర రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. దీంతో ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్ధులు, సామాన్య ప్రజలు మోనోలో ప్రయాణించడానికి ముఖం చాటేస్తున్నారు. మోనో నష్టాల్లో నడవడానికి ఇవి కూడా కారణాలవుతున్నాయి. ట్రిప్పుల సంఖ్య పెంచడం, రైలు దిగిన ప్రయాణికులకు స్టేషన్ నుంచి బయటకురాగానే మెరుగైన రవాణా సౌకర్యాలుంటే తప్ప మోనో రైలు ఆర్ధిక పరిస్ధితి గాడిన పడదని రవాణారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (క్లిక్ చేయండి: జేఈఈ టాపర్స్ దృష్టి... ఐఐటీ బాంబే వైపే) -
మహిళా వ్యాపారవేత్తలకు బిజినెస్ లోన్స్ అంత ఈజీ కాదు!
న్యూఢిల్లీ: జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో ఎక్కువ మంది మహిళా పారిశ్రామికవేత్తలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ‘భారతీయ యువ శక్తి ట్రస్ట్’ (బీవైఎస్టీ) నిర్వహించిన సర్వేలో తెలిసింది. దేశ రాజధాని ప్రాంతం, చెన్నై, పుణెకు చెందిన 450 మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచు కున్నారు. బ్యాంకుల నుంచి కీలక ఆర్థిక సేవలను పొందడంలో తాము సమస్యలు ఎదుర్కొన్నట్టు 60 శాతం మంది చెప్పారు. ముఖ్యంగా రుణాలు తీసుకునే విషయమై 85 శాతం మందికి సవాళ్లు ఎదురైనట్టు ఈ సర్వే వెల్లడించింది. బీవైఎస్టీ సహకారంతో వచ్చే రుణ దరఖాస్తులను ఆహ్వనించేందుకు ప్రభుత్వరంగ బ్యంకులు సముఖంగా ఉన్నట్టు.. మేనేజింగ్ ట్రస్టీ లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ తెలిపారు. రుణ దరఖాస్తులను బ్యాంకులకు సమర్పించే ముందు తమ నిపుణుల ప్యానెల్ మదింపు వేస్తుందని చెప్పారు. -
రోడ్డెక్కిన ‘మధ్యమానేరు’ నిర్వాసితులు
వేములవాడ అర్బన్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు ముంపు గ్రామాల్లో ఏళ్లుగా నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ నిర్వాసితులు సోమవారం రోడ్డెక్కారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాధర్నాకు పూనుకున్నారు. ముందస్తుగా పోలీసులు ముంపు గ్రామాలైన అనుపురం, రుద్రవరం గ్రామాల్లో భారీగా మోహరించారు. సోమవారం వందలాది మంది నిర్వాసితులను పోలీసులు అడ్డుకోవడంతో అనుపురం వద్ద కరీంనగర్–సిరిసిల్ల రోడ్డుపై బైఠాయించారు. అదే సమయంలో వివిధ ముంపు గ్రామాల నిర్వాసితులు నందికమాన్ వద్దకు భారీగా తరలివచ్చారు. ‘మేం వ్యవసాయం చేసుకుందామంటే భూములు లేవు. చేతిలో పనిలేక అడ్డాకూలీలుగా మారాం’అని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామన్న ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు. పట్టా ఇచ్చిన ప్రతీ కుటుంబానికి రూ.5.04 లక్షలు ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీ నెరవేర్చలేదన్నారు. తమకు ఇళ్లు, భూముల పరిహారం, పట్టాలు, యువతకు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు 300 మందిని పోలీసులు కోనరావుపేట పీఎస్కు తరలించారు. మహాధర్నాకు తరలివస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులను వేములవాడ బ్రిడ్జిపై పోలీసులు అరెస్ట్ చేసి తంగళ్లపల్లి ఠాణాకు తరలించారు. నిర్వాసితులకు అండ: రేవంత్రెడ్డి మిడ్మానేరు నిర్వాసితులకు సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, వారికి న్యాయం జరిగేంతవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి వెల్లడించారు. ధర్నా చేస్తున్న నిర్వాసితులపై పోలీసులు దౌర్జన్యం చేయడం దుర్మార్గమని, నిర్వాసితులతో పాటు కాంగ్రెస్ నేతల అరెస్టును ఖండిస్తున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయం చేయాలి: బండి రాష్ట్ర ప్రభుత్వం మిడ్మానేరు బాధితుల డిమాండ్లపై స్పందించి వెంటనే న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముంపు బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న జేఏసీ, బీజేపీ నేతలను, మహిళలను అరెస్ట్ చేయడాన్ని ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలన్నారు. -
దంపతుల ఆత్మహత్య
మల్కాజిగిరి: కుటుంబ సమస్యల కారణంగా దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మల్కాజిగిరి బృందావన్ కాలనీకి చెందిన కామిశెట్టి సాయిదాసు(65),విజయలక్షి్మ(60) దంపతులకు సంతానం లేదు. గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈ నెల 26న తమ బంధువు పోతన శ్రీనివాసరావుకు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి వచ్చి వెళ్లమని చెప్పారు. 27న ఉదయం అతను సాయిదాసు ఇంటికి వెళ్లి పిలిచినా పలకక పోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా దంపతులిద్దరూ ఉరి వేసుకొని కనిపించారు. ఆనంద్బాగ్లో నివాసముంటున్న సాయిదాసు సోదరుడు మెహర్ ఓంకార్కు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్ధలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: మహిళలను వేధించే పోకిరీలకు చెక్!:.. 10 వారాల్లో 106 మంది అరెస్టు) -
సినిమా రిలీజ్ కాదన్నారు.. వారం క్రితం ఏడ్చేశాను: నిఖిల్
Nikhil Says He Cried About Karthikeya 2 Movie Release Problems: టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. 'హ్యాపీ డేస్' సినిమాతో వెండితెరకు పరిచయమైన నిఖిల్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. 2014లో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ' చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్గా 'కార్తికేయ 2' రానున్న విషయం తెలిసిందే. ఇందులో నిఖిల్కు జోడిగా బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ మూవీ అనేక వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్లో జోరు పెంచిన చిత్రబృందం వినూత్నంగా కాంటెస్ట్లు కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'కార్తికేయ 2' సినిమా విడుదల విషయంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయని, ఒకానొక సమయంలో ఏడ్చాను అని తెలిపాడు నిఖిల్. ''ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే సినిమాలను ఇటు అటు నెట్టేస్తారని అంటారు కదా.. అలానే మా సినిమాకు జరిగింది. నిజం చెప్పాలంటే ఒక ఐదు రోజుల క్రితం సినిమా రిలీజ్ డేట్ ఆగస్ట్ 12 అని ప్రకటించేటప్పుడు.. అది కూడా వద్దని చెప్పారు. చదవండి: నిఖిల్ ‘కార్తికేయ 2’ మూవీ కాంటెస్ట్.. గెలిస్తే రూ. 6 లక్షలు ప్రియుడితో బర్త్డే వేడుకలు!.. ఫొటోలతో దొరికిపోయిన హీరోయిన్ అక్టోబర్కు వెళ్లిపోండి. నవంబర్కు వెళ్లిపోండి. ఇప్పుడు అప్పుడే మీ సినిమా రిలీజ్ అవ్వదు. మీకు షోస్ దొరకవు. థియేటర్లు ఇవ్వము. అన్న స్టేజ్ వరకు వెళ్లింది. అప్పుడు నేను ఏడ్చాను. నేను నిజానికి చాలా స్ట్రాంగ్ పర్సన్ను. హ్యాపీ డేస్ సినిమా నుంచి ఇప్పటివరకు మూవీ విడుదల కాదు, థియేటర్లు దొరకవు అని ఎప్పుడు అనిపించలేదు. ఒక వారం క్రితం అయితే ఏడ్చేశాను. నువ్ ఎంత కష్టపడినా నీ సినిమా రిలీజ్ అవ్వదురా అని అన్నప్పుడు బాధేసింది. చివరికీ మా నిర్మాతలు విశ్వ ప్రసాద్, అభిషేక్ సపోర్ట్తో పట్టుబట్టి ఆగస్టు 12కే వస్తున్నాం అని ప్రకటించాం'' అని నిఖిల్ పేర్కొన్నాడు. చదవండి: కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్ -
ఆ ప్రాంతంలో అమ్మకు కష్టం.. తీరేదెన్నడో!
కొరాపుట్: శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నాం. ఆధునిక యుగంలో అన్ని వసతులు సమకూర్చుకుంటున్నాం అని సంబర పడుతున్నాం. కానీ ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ ప్రజలు కనీస వసతులకు నోచుకోవడం లేదు. పురిటి నొప్పులు వస్తే పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. వసతులు లేకపోవడంతో ఆస్పత్రికి రాకుండానే ప్రసవిస్తున్న ప్రాణాలెన్నో. నబరంగ్పూర్ జిల్లాలోని జొరిగాం సమితి చక్ల పొదర్ గ్రామ పంచాయతీ పరిధి దహిమార గ్రామానికి చెందిన ఉషావతి బోత్ర అనే గర్భిణికి బుధవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గ్రామస్తులు ఆశ కార్యకర్త నళినిని సంప్రదించారు. ఆమె వెంటనే జొరిగాం ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్కు సమాచారం అందించారు. కానీ వెంటనే అంబులెన్స్ వచ్చినప్పటికీ గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న నది అడ్డంగా మారింది. వెంటనే గ్రామస్తులు ఉషావతిని ఒక మంచంపై మోసుకొని నది ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇదే సమయంలో వారికి అంబులెన్స్ సిబ్బంది సైతం సాయం చేశారు. అనంతరం అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. ఉషావతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. చదవండి: థాక్రే అంటే ఇప్పటికీ గౌరవమే.. శివసేనకు వెన్నుపోటు పొడిచి మొత్తం ఆయనే చేశారు!: రెబల్స్ -
మలిసంధ్యలో ఏదీ మనశ్శాంతి?
బనశంకరి: శరీరంలో శక్తి ఉన్నంతకాలం కుటుంబ ఉన్నతికి పాటుపడి మలిసంధ్యలో విశ్రాంతి తీసుకుందామనుకుంటే ఇంటి పోరు తప్పడం లేదు. ఇళ్లలో వృద్ధులపై దాడులు, వేధింపులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అశక్తులు కావడంతో అడ్డుకోలేక, దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడడమే వారికి మిగిలింది. హైటెక్ సిటీలో డబ్బు, ఆస్తి కోసం సంతానమే ఈ వేధింపులకు పాల్పడుతున్నారు. వృద్ధుల సహాయవాణి కేంద్రం గణాంకాలు ఈ చేదు నిజాల్ని బయటపెట్టాయి. ఐదేళ్లలో 64 వేల ఫిర్యాదులు సమస్యల్లో ఉన్న వృద్ధుల కోసం నైటింగేల్స్ వైద్యకీయ ట్రస్ట్ అనే ఎన్జీఓ కలిసి సహాయవాణి కేంద్రాన్ని ప్రారంభించింది. వృద్ధులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే సహాయవాణి 1090, లేదా టోల్ ఫ్రీ నంబరు 22943226కి చేయవచ్చు. గత ఐదేళ్లలో 64,455 ఫోన్ కాల్స్ అందాయి. ఇందులో వేధింపులు, నిర్లక్ష్యం, దౌర్జన్యాలకు సంబంధించి 1,717 ఫిర్యాదులు ఉన్నాయి. ఆస్తి కోసం దూషణ కేసులు 244 నమోదయ్యాయి. మౌఖికంగా 311 ఫిర్యాదులు వచ్చాయి. నిరాదరణ, ఆస్తి కోసం దూషణలు 80 శాతం ఫిర్యాదులు నిరాదరణ, దౌర్జన్యం, డబ్బు లేదా ఆస్తికోసం డిమాండ్, వంచన, దూషణలకు గురవుతున్నట్లు ఉన్నాయి. గత 20 ఏళ్లలో 2.35 లక్షలమంది సీనియర్ సిటిజన్లు 1090 సహాయవాణిని సంప్రదించారు. 2021 మే నెల చివరికి 10,591 తీవ్రమైన ఫిర్యాదులు నమోదయ్యాయి. 69 శాతం కేసుల్లో బాధితులకు సహాయం అందించినట్లు సిబ్బంది తెలిపారు. (చదవండి: రోగులపై ప్రత్యక్ష ప్రయోగాలొద్దు) -
ప్రేమ జంటలను ఇలా కాపాడుకోవచ్చు..
కులం, మతం, తెగ అనే వివిధ సముదాయాల లోపలే పెళ్లిళ్ళు జరగాలి అని కోరుకునే సంస్కృతి బలంగా ఉన్న దేశం మనది. సముదాయానికి బయట ఉండే మనుషుల పట్ల ఇష్టాలు, ప్రేమలు అనేకం వివాహం వరకు పోకపోవడానికి ఈ సంస్కృతే కారణం. అదేమీ గొప్ప సాంస్కృతిక విలువ కాదు. సము దాయం లోపలి పెండ్లి అన్ని తీరులా గొప్పదీ, సముదాయం బయట పెండ్లి అనేక తీరుల్లో మంచిది కాదూ అనేది తప్పుడు ఆలోచన. ఒకటి మాత్రం వాస్తవం. ఇటువంటి వివాహాలను మెచ్చుకుని ఒప్పుకునే వాతావరణం మన దగ్గర పెరగలేదు. అందునా విలోమ వివాహాల పట్ల మరింత వ్యతిరేకత ఉన్నది. ఈ తరహా వివాహాలు మనుగడ సాగించాలంటే కొన్ని ప్రధాన కార్యక్రమాలు వివిధ స్థాయిల్లో జరగాలి. చదవండి: సర్కారీ కొలువుల జాతర సముదాయాంతర వివాహాలను కాపాడుకోవడంలో ముందుగా వివాహం చేసుకున్న జంటకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. వారు ఆ బాధ్యతను నెరవేర్చుకునే దానికి సహ కారం, సలహాలు, మద్దతును కూడగట్టుకోవాలి. సామాజిక కట్టుబాట్ల సరిహద్దు దాటిన జంటలు తొలి మూడు నాలుగు ఏండ్లు చాలా జాగ్రత్తగా, మెలకువగా మసలుకోవాలి. సామా జిక కట్టుబాట్లను ఉల్లంఘించి ఏర్పడిన జంట, హింసకు గురి కాగల, ఒక ప్రమాదాన్ని ఎదుర్కొనే అల్ప సంఖ్యాక జంటగా మారుతుంది. ఎందుకంటే చాలా సందర్భాలలో ఈ జంట మీద సామజిక కట్టుబాట్ల పరిరక్షకులుగా ఉండే హింసాత్మక మెజారిటీ వర్గంవారు వివిధ రూపాలలో దాడి చేసే అవకాశం ఉంటుంది. ముందుగా వారు వేరే ఎవ్వరి మీద ఆధారపడకుండా మెరుగుగా, తమ సంసారాన్ని గడిపే దానికి కావలిసిన రోజువారీ సామర్థ్యాల మీద దృష్టి పెట్టాలి. రెండు మూడు ఏండ్ల వరకు ఇటువంటి జంటలు పిల్లలను కనకుండా జాగ్రత్త పడాలి. వివాహంలో సామాజిక అంశాలు ఉంటాయి, కానీ వివాహం ముఖ్యంగా జంట వ్యక్తిగత వ్యవహారమనేది మరిచిపోకూడదు. ఆడపిల్లను ఆస్తిగా, గౌరవంగా, కుల మత, తెగ పవిత్రతను, పరిశుద్ధతను రక్షించే క్షేత్రంగా చూసే దృష్టి ప్రతి సముదాయంలో బలంగా ఉంది కనుక... సము దాయ కట్టుబాట్లు దాటిన వివాహాలలో జంటలకు ఆడ వారి బంధువుల నుండి ప్రమాదం అతి ఎక్కువగా ఉంటున్నది. ఈ వాస్తవాన్ని జంటలు గమనంలో ఉంచుకోవాలి. సముదాయాంతర వివాహాల పట్ల సానుకూలంగా ఉండే వారు, తాము నివాసం ఉంటున్న చోట తమవంటి వారితో కలుస్తూ ఉండాలి. ఒక భావ సారూప్య బృందంగా లేక కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్గా రూపొందాలి. ప్రతి చిన్న ప్రాంతంలో ఇటువంటి వివాహాల మద్దతు బృందాలు ఏర్ప డాలి. తమ ఎరుకలో ఉండే అటువంటి జంటలకు చేదోడు వాదోడుగా ఉండాలి. ఇలాంటి బృందాలు ఉన్నాయన్న విషయం బాగా ప్రచారం కావాలి. సముదాయాంతర జంట లకు సహకరించే నెట్వర్క్ ఉంది అని నమ్మకాన్ని ఇవ్వడం ముఖ్యం. అట్లనే అటువంటి జంటలు ఎదుర్కొనే ఎమో షనల్ సమస్యలను తట్టుకునేదానికి సలహాలు ఇచ్చే ఏర్పాటుగా ఈ సామాజికుల బృందం ఉండాలి. వామపక్ష ఉద్యమాలు తరచుగా సముదాయం బయటి వివాహాలను ప్రోత్సహించినాయి. ఇప్పుడు బాగా ప్రాచు ర్యంలో సాగుతున్న గుర్తింపు ఆధారిత ఉద్యమాలు– అందునా పీడిత సముదాయాల సామూహిక శక్తిని పెంపు చేసే దానికి నడుస్తున్న ‘గుర్తింపు– సయోధ్య’ (ఐడెంటిటీ– అలయన్స్) అనే సూత్రం పునాదిగా సామాజిక క్షేత్రంలో ఉద్యమాలు చేస్తున్నవారు సముదాయాంతర వివాహాల వైపు తమ తమ అనుయాయులకు అవగాహన కలిగించాలి. తమ సొంత సముదాయాలు దాటి పెళ్లి చేసుకోవడాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయన్న నమ్మకం ప్రజల్లో కలిగిం చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం అటువంటి వావాహాలను ప్రోత్సహిస్తూ... కొన్ని ప్రోత్సాహ కాలు ఇస్తున్నప్పటికీ అవి చాలవు. ఈ వివాహాల పరిరక్షణకు అవసరమైన చట్ట పర, పాలనాపర, విధానపర ఏర్పాట్లు ఉండాలి. ఇప్పటికే ఉన్న ఇటువంటి వివాహాలు చేసుకున్న జంటలకు రక్షణనిచ్చే చట్టాల గురించీ, వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ పథకాల గురించీ విస్తృత ప్రచారం కల్పించాలి. ఈ జంటలు తమకు మతం లేదు కులం లేదు అని ప్రకటించు కోదలిస్తే... అటు వంటి పత్రాలు ఇచ్చే ఏర్పాటు ఉండాలి. ప్రమాదంలో ఉన్న జంటలకు రక్షణ కల్పించడానికి పోలీ సులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రసార మధ్యమాలలో పనిచేసే వారికి సముదాయం బయట జరిగే వివాహాల ప్రాధాన్యత, అవి ఎదుర్కునే సమస్యల గురించిన అవగాహన ఉండాలి. సముదాయం బయట జరిగిన పెళ్లి... హత్యలకో, మరో రకం హింసలకో దారి తీసినప్పుడు మాత్రమే అది వార్త అనుకునే దుఃస్థితి ఈ రోజు ప్రసార మాధ్యమాలలో ఉంది. ప్రసార మాధ్యమా లలో పనిచేసే వారికి, సముదాయం దాటి చేసుకునే వివా హాలకు సానుకూలంగా ఉండే నిరంతర అవగాహన కార్య క్రమాలు ఉండాలి. ఇలాంటి వివాహాలు చేసుకుని విజయవంతంగా జీవితం గడుపుతున్న వివాహితుల గురించిన శీర్షికలు, పరి చయ కార్యక్రమాలు విరివిగా పత్రికలు, టీవీల్లో రావాలి. వాస్తవానికి సముదాయానికి బయట వివాహం చేసు కోవడం ప్రతి సందర్భంలోనూ హింసతో ముగిసిపోవడం లేదు. అటువంటి చాలా వివాహాలు విజయవంతంగా సాగుతూ ఉంటాయి. ఈ అంశానికి తగిన ప్రచారం ప్రసార మాధ్యమాలు ఇవ్వాలి. కుల, మత, జాతి భేదాలు చూడకుండా నచ్చినవారిని వివాహం చేసుకునే వివాహాలు నాలుగు కాలాల పాటు మనుగడ సాగించాలంటే.. జంటల వ్యక్తిగత స్థాయిలోనే కాక, పౌర సమాజం, ప్రభుత్వ స్థాయిల్లో అప్రమత్తత. మద్దతు, రక్షణ ఉండాలి. సమాచార ప్రచార మాధ్యమాల తోడ్పాటూ ఎప్పటికప్పుడు అందాలి. హెచ్. వాగీశన్ వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా -
ఆ నిర్ణయంతో చిన్న కార్లకు కష్టకాలమే!
న్యూఢిల్లీ: ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్స్ తప్పనిసరి ఉండాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై దేశీయ వాహన రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా స్పందించింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సూచించింది. ఇప్పటికే తగ్గుతున్న చిన్న కార్ల మార్కెట్పై ప్రతిపాదిత నిబంధన తీవ్ర ప్రభావం చూపిస్తుందని సంస్థ చైర్మన్ ఆర్.సి.భార్గవ వెల్లడించారు. వాహన రంగంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘మూడేళ్లుగా చిన్న కార్ల విభాగం అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు అప్గ్రేడ్ అయ్యే అవకాశాలను దెబ్బతీస్తుంది. ధరలు దూసుకెళ్తుండడంతో మెట్రోయేతర ప్రాంతాల్లో విక్రయాలు తగ్గాయి. ఆరు ఎయిర్బ్యాగ్స్ తప్పనిసరి అయితే ధర రూ.20–25 వేల దాకా అధికం అవుతుంది. చిన్న కారు కొనుగోలుదార్లకు ఇది భారమే’ అని భార్గవ వివరించారు. -
గాలి సరిపోక.. ఉక్క తట్టుకోలేక..
ఖమ్మం : వేసవిలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మధ్యాహ్న సమయాల్లో జిల్లాలోని జనం ఉక్కపోతకు తట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యాన ఖమ్మం జిల్లా ప్రభుత్వాస్పత్రి మాతా,శిశు కేంద్రంలోని ప్రసూతి వార్డులో బాలింతలు, చిన్నారులు ఉక్కపోతకు తల్లడిల్లిపోతున్నారు. ఆస్పత్రిలో ఉన్న ఫ్యాన్ల గాలి సరిపోకపోవడంతో బాలింతల ఇళ్ల నుంచి టేబుల్ ఫ్యాన్లు తీసుకొచ్చి ఇదిగో ఇలా ఏర్పాటు చేసుకున్నారు. కొందరు విద్యుత్తో నడిచేవి తీసుకొస్తే.. మరికొందరు సోలార్ పవర్, బ్యాటరీలతో నడిచే ఫ్యాన్లను తీసుకొచ్చి సేదదీరుతున్నారు. -
వీఆర్ఏల ఆగం బతుకులు.. కార్లు కడుగుడు.. బట్టలు ఉతుకుడు
► వీఆర్ఏ ఏం చేయాలి..?: విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ గ్రామంలో రెవెన్యూ సంబంధ వ్యవహారాలు చూసే ఉద్యోగి. ప్రభుత్వ భూముల రక్షణ, పంటల విస్తీర్ణం వివరాల సేకరణ, పంచనామాల నిర్వహణ వంటి పనులు చేయాలి. అధికారిక వ్యవహారాల్లో పైఅధికారులకు సహకరించాలి. ► మరి ఇప్పుడేం చేస్తున్నారు?: పైఅధికారుల ఇల్లు ఊడ్వటం, బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, కూరగాయలు తేవడం, వంట చేయడం, అధికారి సొంత కారుకు డ్రైవర్గా పనిచేయడం.. ఇలాంటి పనులెన్నో చేస్తూ అనధికారిక ‘పాలేర్లు’గా మారిపోయారు. ► ఎందుకీ సమస్య?: రెవెన్యూ శాఖలో వీఆర్వో వ్యవస్థ రద్దయిన తర్వాత వీఆర్ఏలకు సర్వీస్రూల్స్ రూపొందించకపోవడంతో.. జిల్లా కలెక్టర్లు మొదలుకొని డిప్యూటీ తహసీల్దార్ల దాకా వీఆర్ఏలను సొంత పనులకు వాడుకుంటూ.. కొత్త ‘ఆర్డర్లీ’వ్యవస్థకు తెరతీసిన తీరు వివాదస్పదంగా మారింది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో 23 వేల మంది వీఆర్ఏలున్నారు. కొత్త రెవెన్యూ చట్టం–2020 ప్రకారం వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. కానీ గ్రామాల్లో వీఆర్ఏల(గ్రామ రెవెన్యూ సహాయకుల)ను కొనసాగించాలని నిర్ణయించింది. మొదట్లో వారు గ్రామాల్లో ఉంటూ ప్రభుత్వ భూముల రక్షణ, పంటల విస్తీర్ణం వివరాల సేకరణ, కోర్టు సమన్లను అందచేయటం, పంచనామాల నిర్వహణ వంటి పనులు చేసేవారు. ప్రస్తుతం వారికి కొత్త విధులు అప్పగించకపోవటం, వారి డ్యూటీ ఏమిటనేది తేల్చకపోవడంతో.. అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో అన్నిపనులకు వినియోగిస్తున్నారు. స్వీపర్లు మొదలుకుని డ్రైవర్లు, వంట మనుషులు, నైట్ వాచ్మన్ల దాకా పని చేయించుకుంటున్నారు. వాస్తవానికి అర్హతల మేరకు వీఆర్ఏలను ఖాళీగా ఉన్న ఇతర ప్రభుత్వ శాఖల్లోకి పంపేందుకు 2017 ఫిబ్రవరి 24న ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నా ఇప్పటివరకు అమల్లోకి రాలేదు. కాదంటే భయం.. చేయలేక ఆగమాగం..: వీఆర్ఏలకు చాలా కాలంగా సర్వీస్ రూల్స్ అంటూ లేకపోవటంతో పైఅధికారులు ఏది చెప్తే అది చేయక తప్పని పరిస్థితిలో ఉన్నారు. కొన్నిసార్లు మరీ ఇంట్లో పనిమనుషులుగా కూడా వాడుకుంటున్నారు. చేయబోమని ఎవరైనా అంటే.. దూర ప్రాంతాలకు బదిలీ చేయడం లేదా ఆర్డీవో, జిల్లా కలెక్టరేట్లకు సరెండెర్ చేయడం వంటి కక్షసాధింపు చర్యలకు కొందరు అధికారులు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో చెప్పిన పనులు చేయలేక ఓ వైపు.. కాదంటే ఏ ఇబ్బంది ఎదురవుతుందోననే ఆందోళనతో మరోవైపు వీఆర్ఏలు మానసిక క్షోభకు గురవుతున్నారు. పోటీ పరీక్షలో గెలిచి వచ్చినా.. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్ఏలలో 2,900 మంది రాతపరీక్ష ద్వారా నేరుగా ఎంపికయ్యారు. మిగతా వారు వంశపారంపర్యంగా కొనసాగుతున్న వారు. వారికి ప్రతినెలా రూ.10,500 వేతనం చెల్లిస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసి, పోటీపరీక్ష ద్వారా ఉద్యోగం పొందినవారు కూడా ఇప్పుడు అధికారుల ఇళ్లలో పనిచేయాల్సి రావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు తగిన విధులు అప్పగించడంగానీ, ఇతర శాఖల్లో విలీనం చేయడంగానీ చేస్తే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చని పేర్కొంటున్నారు. వీలైనంత త్వరగా డ్యూటీ చార్ట్, సర్వీసు రూల్స్ ప్రకటించాలని కోరుతున్నారు. టెన్నిస్ కోర్టు బాల్ బాయ్స్గా.. ఇటీవల నిర్మల్ జిల్లా కేంద్రంలో వీఆర్ఏలకు టెన్నిస్ కోర్టు బాల్ బాయ్స్గా డ్యూటీలు వేశారు. రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రతిరోజు సాయంత్రం లాన్ టెన్నిస్ ఆడే సమయంలో.. అటూఇటూ వెళ్లిపోయిన బంతులను తెచ్చి ఇచ్చేందుకు రోజుకు ముగ్గురి చొప్పున వారానికి ఇరవై ఒక్క మంది వీఆర్ఏలకు అధికారికంగా డ్యూటీలు వేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. చస్తూ బతుకుతున్నం ఎంకాం చదువుకుని, డీఎస్సీ ద్వారా పోటీ పరీక్ష రాసి వీఆర్ఏగా ఎంపికయ్యా. ఇప్పుడు మా పరిస్థితి దారుణంగా తయారైంది. ఏ పని చెబితే ఆ పని చేయాల్సి ఉంటుంది.ఉన్నత చదువులు చదివిన వారంతా ఈ ఉద్యోగాన్ని ఎంచుకుని చస్తూ బతుకుతున్నరు. సర్వీస్ రూల్స్ కోసం ఎదురు చూస్తున్నం. – ఎ.వెంకటేశ్యాదవ్, వీఆర్ఏ, జిన్నారం బానిసల కంటే అధ్వానం మాకు రెవెన్యూ విధులు మినహా ఇతర పనులేవీ చెప్పొద్దని సీసీఎల్ఏ ఉత్తర్వులు (ఏ2–1635–2012) ఉన్నా వాటిని ఎవరూ పాటించడం లేదు. ఉన్నత ఆశయంతో పోటీపరీక్ష రాసి ఉద్యోగంలో చేరిన మాకు.. ప్రస్తుత పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. ఆడ, మగ తేడా లేకుండా అధికారులు అప్పగించిన పనులన్నీ చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల బానిస కంటే అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. – రమేశ్బహదూర్, వీఆర్ఏ, తిమ్మాజిపేట పనిఒత్తిడి, ఇతర సమస్యలకు బలి.. – మంచిర్యాల జిల్లా కొత్తపల్లిలో నైట్ వాచ్మన్ డ్యూటీలో ఉన్న వీఆర్ఏ దుర్గం బాపురావు హత్యకు గురయ్యాడు. – యాదాద్రి జిల్లా పులిగిల్లలో నైట్ డ్యూటీకి వెళుతూ వీఆర్ఏలు పల్లెర్ల పురుషోత్తం, ఈదుల కిష్టయ్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. – నిజామాబాద్ జిల్లా ఖండిగావ్లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు గౌతమ్ హత్యకు గురయ్యాడు. – మాచారెడ్డి, ఘనపూర్ తహసీల్దార్కు డ్రైవర్గా పనిచేస్తూ చల్లా రమేష్ పనిఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. – నిజామాబాద్ జిల్లా పెగడపల్లిలో పనిఒత్తిడితో హర్షవర్ధన్ బలవన్మరణానికి పాల్పడ్డారు. -
భార్యా భర్తలకు ఒకే చోట పనిచేసే అవకాశమేది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాలు, జోన్లకు అనుగుణంగా పోలీసు శాఖలో జరిగిన బదిలీలు భార్యాభర్తలైన కానిస్టేబుళ్లకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. వేర్వేరు జిల్లాల్లో నెలల తరబడి కుటుంబాలకు దూరంగా పనిచేయాల్సి రావడం వారిలో తీవ్ర మనోవేదన కలిగిస్తున్నాయి. ఆత్మహత్యకు వెనుకాడలేం... రాష్ట్ర పోలీసు శాఖలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న జంటలు దాదాపు 200 వరకు ఉంటాయని అంచనా. ఇటీవల జరిగిన నూతన జిల్లాల బదిలీల్లో భార్యాభర్తలంతా వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయ్యారు. అయితే భార్యాభర్తలకు ఒకేచోట పనిచేసే వెసులుబాటు కలి్పంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ఆయా జంటలు దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆదేశాలు వెలువడలేదు. దీంతో రామగుండం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్నగర్, రాచకొండ తదితర యూనిట్లలో పనిచేస్తున్న భార్యభర్తలైన కానిస్టేబుళ్లు ఒంటరితనంతో బతకలేక సతమతమవుతున్నారు. నిత్యం ఎవరో ఒకరు తమ ఆవేదనను ఆడియో సందేశాల రూపంలో బయటపెడుతున్నారు. కుటుంబాలకు దూరంగా పనిచేస్తూ నరకయాతన అనుభవిస్తున్నామని, ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటామో తెలియని పరిస్థితుల్లో బతకాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో ఓ మహిళా కానిస్టేబుల్ పడుతున్న బాధ అంతాఇంతా కాదు. తన భర్త మరో జిల్లాలో పనిచేస్తుండటంతో మూడేళ్ల పిల్లాడిని ఎవరూ చూసే వారు లేక చంటి పిల్లాడిని చంకన వేసుకొని బందోబస్తు డ్యూటీలు కూడా చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లల భవిష్యత్పై ప్రభావం... కొన్ని సంఘటనల్లో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎదుగుతున్న పిల్లలపై శ్రద్ధ తీసుకోకపోతే వారి భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికత సమస్య కూడా కానిస్టేబుళ్ల దంపతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇన్నాళ్లూ సొంత జిల్లాల్లో పనిచేసిన వారు వేరే జిల్లాకు బదిలీ కావడం వల్ల తమ పిల్లల స్థానికత విషయంలో సమస్య ఏర్పడుతుందని కలవరానికి గురవుతున్నారు. కాగా, బదిలీల సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియట్లేదని ఉన్నతాధికారులు అంటున్నారు. -
దూరవిద్య అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ ఓటీఆర్ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: దూరవిద్య (ఓపెన్)లో టెన్త్, ఇంటర్ చదివిన అభ్యర్థులను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) కష్టాలు వెంటాడుతున్నాయి. ఓటీఆర్లో ‘ఓపెన్’కు సంబంధించిన ఆప్షన్ కనిపించకపోవడంతో ఈ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కష్టమైపోయింది. అభ్యర్థి ఆధార్ కార్డు వివరాలతో వెబ్సైట్లో ఎంట్రీ చేయగానే పాఠశాల, కళాశాల విద్యకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని సూచిస్తోంది. కానీ దూరవిద్యలో కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు పాఠశాలలో, కళాశాలలో చదివిన నేపథ్యం లేకపోవడంతో నిర్దేశించిన ఆప్షన్లను పూరించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఓటీఆర్ ప్రక్రియలో ముందుకు సాగలేకపోతున్నారు. నోటిఫికేషన్లు వెలువడితే ఓటీఆర్ లేని అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. మరోవైపు ఓపెన్ అభ్యర్థులూ ఓటీఆర్కు అర్హులేనని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. వివరాల నమోదు సమయంలో వచ్చే పేజీని కొనసాగిస్తే సరిపోతుందంటున్నారు. కానీ రిజిస్ట్రేషన్ సాగట్లేదని అభ్యర్థులు చెబుతున్నారు. (చదవండి: TSPSC: గ్రూప్–1, 2 పోస్టులకు ఇంటర్వ్యూలు లేనట్టే! నేడో, రేపో..) -
వాణిజ్యంపై రష్యా–ఉక్రెయిన్ దెబ్బ..
న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో భారత వాణిజ్యంపై ప్రభావం పడనుంది. ఎగుమతులు, చెల్లింపులు, చమురు ధరలు మొదలైనవి కాస్త సమస్యాత్మకంగా మారనున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాలకు చేసే ఎగుమతులను ఆపి ఉంచాలని ఎగుమతిదారులకు సూచించినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో డైరెక్టర్–జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. యుద్ధం ఎన్నాళ్లు కొనసాగుతుందన్న దానిపై వాణిజ్యంపై ఎంత ప్రభావం పడుతుందన్నది ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘కోవిడ్–19 మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. ఇది మరో పెద్ద ఎదురుదెబ్బ. ఆ ప్రాంతంలో (రష్యా, ఉక్రెయిన్) వ్యాపార లావాదేవీల విషయంలో ఎగుమతిదారులు అప్రమత్తంగా ఉన్నారు‘ అని సహాయ్ వివరించారు. రష్యా, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 9.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఉక్రెయిన్తో ద్వైపాక్షిక వాణిజ్యం 2.3 బిలియన్ డాలర్లుగా ఉంది. అటు రష్యా, ఉక్రెయిన్తో పాటు ఆ ప్రాంతంలోని ఇతర దేశాలకు ఔషధాలను ఎగుమతి చేసే విషయంలో వేచి చూసే ధోరణి పాటిస్తున్నట్లు ఫార్మా పరిశ్రమ వర్గాలు తెలిపాయి. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని .. ఆ ప్రాంతంలోని తమ ఉద్యోగుల క్షేమంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ వర్గాలు తెలిపాయి. ‘ ఆయా దేశాలకు ఫార్మా ఎగుమతులపై ప్రస్తుతం ఆంక్షలేమీ లేవు. అయినప్పటికీ పరిస్థితులపై మరింత స్పష్టం వచ్చే వరకూ కాస్త వేచి చూడాలని భావిస్తున్నాం. అంతిమంగా యుద్ధ ఫలితంగా మాకు రావాల్సిన చెల్లింపులపై ప్రభావం పడకూడదు కదా‘ అని మరో ఫార్మా సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఫార్మా ఎగుమతి ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో ఉక్రెయిన్కు 181 మిలియన్ డాలర్లు, రష్యాకు 591 మిలియన్ డాలర్ల విలువ చేసే ఔషధాలు భారత్ నుంచి ఎగుమతి అయ్యాయి. గోధుమలపరంగా అవకాశాలు.. ప్రస్తుత సంక్షోభంతో గోధుమల ఎగుమతులను మరింతగా పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయని, ఎగుమతిదారులు వీటిని అందిపుచ్చుకోవాలని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా గోధుమల ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్ వాటా పావు భాగం పైగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా రష్యా ఎగుమతి చేస్తోంది. ఈజిప్ట్ అత్యధికంగా ఏటా 4 బిలియన్ డాలర్లపైగా విలువ చేసే గోధుమలను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో రష్యా, ఉక్రెయిన్ల వాటా 70 శాతం మేర ఉంటుంది. అలాగే టర్కీ, బంగ్లాదేశ్లు కూడా రష్యా నుంచి గోధుమలు భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రష్యాపై ఆంక్షలు గానీ అమలైతే.. వివిధ దేశాలకు గోధుమలపరంగా దేశీ ఎగుమతిదారులకు అవకాశాలు లభించవచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
విభజన సమస్యలపై త్రిసభ్య కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన వివాదాలను పరిష్కరించే దిశగా కేంద్రం ఎట్టకేలకు ముందడుగు వేసింది. విభజన వివాదాలపై అధ్యయనం చేసి పరిష్కారాలను సిఫార్సు చేసేందుకు కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఈ నెల 8న త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తరఫున ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్.ఎస్. రావత్, కె. రామకృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. ఈ సబ్ కమిటీ ఈ నెల 17న ఉదయం 11 గంటలకు వర్చువల్గా తొలి సమావేశం నిర్వహించనుంది. వాస్తవానికి 9 అంశాల ఎజెండాతో సమావేశం నిర్వహించనున్నామని రెండు రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ శుక్రవారం లేఖ రాసింది. అయితే ఆ ఎజెండాను 5 అంశాలకు కుదించామంటూ శనివారం సాయంత్రం మరో లేఖను పంపింది. మొదటి లేఖలో త్రిసభ్య కమిటీ పరిష్కారయోగ్యమైన సిఫార్సులు చేయాలని సూచించింది. రెండో సర్క్యులర్లో మాత్రం సమావేశం ఎజెండాలో మార్పులు చేసినట్లు పేర్కొంది. కమిటీ ప్రతి నెలా సమావేశమై.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా గత నెల 12న నిర్వహించిన సమావేశంలోనూ విభజన చట్టంలోని అంశాల గురించి చర్చించినా ఏ అంశమూ పరిష్కారం దిశగా ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీ ప్రతి నెలా సమావేశమై విభజన అంశాలను చర్చించి పరిష్కారమయ్యేలా కృషి చేయాల్సి ఉంటుంది. ఎజెండాలోని అంశాలు సవరించిన ఎజెండాలో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, ఏపీ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)కు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సిన బకాయిలు, పన్నుల వ్యత్యాసాల తొలగింపు, నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల విభజన, ఏపీ/తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థల రుణాల బట్వాడా అంశాలు ఉన్నాయి. ఎజెండా నుంచి తొలగించినవి వనరుల లోటు, రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతంలోని వెనుకబడిన 7 జిల్లాలకు అభివృద్ధి నిధులు, ఏపీకి ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు. ఏజెండాలోని అంశాల గురించి.. – తెలంగాణ డిస్కంల నుంచి రూ.3,442 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలు రావాల్సి ఉందని ఏపీ జెన్కో చెబుతోంది. ఏపీ విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను సర్దుబాటు చేశాక వాటి నుంచి తమకు రూ.12,111 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ విద్యుత్ సంస్థలు వాదిస్తున్నాయి. బకాయిల కోసం ఏపీ విద్యుత్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. – నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్కు కేటాయించిన 250 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోగా ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించి స్టే పొందింది. కోర్టు కేసును ఉపసంహరించుకుంటేనే షెడ్యూల్–9లోని సంస్థల విభజనలో పురోగతి సాధ్యం కానుందని తెలంగాణ పేర్కొంటోంది. – నగదు నిల్వలు, డిపాజిట్ల విభజన విషయంలో ఏపీ నుంచి కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన రూ.495 కోట్ల నిధులు రావాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. హైకోర్టు, రాజ్ భవన్ వంటి ఉమ్మడి సంస్థల నిర్వహణకు ఖర్చు చేసిన రూ.315 కోట్లనూ ఏపీ ఇవ్వాల్సి ఉందని వాదిస్తోంది. నిర్మాణంలో ఉన్న భవనాల్లో వాటా, రూ.456 కోట్ల సంక్షేమ నిధి, రూ.208 కోట్ల నికర క్రెడిట్ ఫార్వర్డ్ నిధులు సైతం ఏపీ నుంచి రావాల్సి ఉందంటోంది. – విభజన సమయంలో వాణిజ్య పన్నుల ఆదాయ పంపకాల్లోని వ్యత్యాసాల పరిష్కారంపై చర్చ జరగనుంది. – ఉమ్మడి రాష్ట్రంలో పౌర సరఫరాల సంస్థ తీసుకున్న రుణాల చెల్లింపుల్లో ఏ రాష్ట్రం ఎంత భరించాలో చర్చించనున్నారు. -
మళ్లీ పెళ్లికి సిద్ధమే, లేదంటే సహజీవనం: కరాటే కల్యాణి షాకింగ్ కామెంట్స్
సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కల్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవక్కర్లేదు. సినిమాల్లో ఆమె బోల్డ్ పాత్రల ద్వారా గుర్తింపు పొందిన కరాటే కల్యాణ్ బిగ్బాస్ 4 ద్వారా మరింత ఫేంను సంపాదించుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే కల్యాణి తన పదాలతో, వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న కల్యాణి తన వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యింది. చదవండి: హీరోయిన్ బాడీపై అసభ్య కామెంట్, నందిత దిమ్మతిరిగే సమాధానం ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘భార్య అంటే వంటింటికే పరిమితం. ఏం చెప్తే అది చేయాలి.. ఎదురు మాట్లాడకూడదు అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ నేను అలా కాదు. ఫైర్ లాంటి దాన్ని అరచేతితో ఆపేయలేరు. నిప్పుని ఎంతసేపు అని పట్టుకుంటారు. అందుకే వదిలేశారు. నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకున్నా.. కానీ అది వారికి తప్పు అనిపించిందేమో. అలా మనస్పర్థలతో గొడవలు, అనుమానాలు. నాకు అది నచ్చలేదు. అందుకే విడాకులు తీసుకున్నా. నాకు నచ్చినట్టు నేను హ్యాపీగా జీవిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ప్రేమ, పెళ్లిళ్లు తనకు కలిసిరావని, ఇప్పటి వరకు తనకు నిజమైన ప్రేమ దొరకలేదంటూ కల్యాణి వాపోయింది. చదవండి: లేటెస్ట్ బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన కాజల్ ‘ప్రేమ, పెళ్లి పేరుతో నన్ను వాడుకున్నారు. అందుకే ఇప్పటికీ నిజమైన ప్రేమ కోసం చూస్తున్నాను. అలాంటి ప్రేమ దొరికితే భవిష్యత్తులో పెళ్లి చేసుకోడానికి సిద్ధంగా ఉన్నా. సరైనా అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానంటే పెళ్లికి లేదా సహజీవనానికి కూడా రెడీ. ఎందుకంటే నాకు పిల్లలు అంటే ఇష్టం. ఆ ఆశతోనే రెండు సార్లు వివాహం చేసుకున్న. కానీ ఆ ఆశ ఇప్పటికి తీరలేదు’ అని ఆమె పేర్కొంది. అంతేగాక తన మాజీ భర్తల వల్ల చాలా కష్టాలు పడ్డానంటూ ఇలా చెప్పుకొచ్చింది. ‘తరచూ తాగోచ్చి కొట్టడం చేస్తుంటే భరించలేకపోయాను. పైగా నాపై అనుమానం. నేను చేయని తప్పుకి పడమంటే ఎలా పడతాను. చదవండి: రూ. 200 కోట్లకు పైగా లతా ఆస్తులు ఎవరికి? వీలునామాలో ఏం ఉంది.. తప్పంతా నాదే అంటే ఎలా కుదురుతుంది. అందుకే విడాకులు తీసుకున్నాను’ అంది. కానీ జనాలకు ఇవేం పట్టవు. నేను పడ్డ కష్టాలు ఏ ఆడది పడి ఉండదు. ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడ్డాను. ఒకానోక సమయంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోవాలని నిర్ణయించుకుని పలుమార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. ఒకసారి పది నిద్రమాత్రలు తీసుకున్న. అయిన బతికి బయటపడ్డాను. దేవుడు నన్ను కాపాడాడు అంటే ఇంకా నేను చేసేదో ఎదో ఉందన్నమాట అని ఆలోచించి ధైర్యంగా నిలబడ్డాను. పది మంది సాయం చేస్తూ ఇలా ఒంటిరిగా జీవిస్తున్నా’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. -
CAG Report: అయ్యయ్యో ఐఐటీ.. సమస్యలు తిష్ట
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 2008–09లో ఏర్పాటు చేసిన 8 ఐఐటీల్లో సమస్యలు తిష్టవేశాయని కాగ్ నివేదిక వెల్లడించింది. పరిపాలన, మౌలిక వసతుల కల్పన సహా పనితీరులో అనుకున్న మేర ఫలితాలను ఈ విద్యా సంస్థలు రాబట్టడం లేదని తెలిపింది. విద్యార్థులకు సరిపడా అధ్యాపకులు లేకపోవడం, పరిశోధన పత్రాల ప్రచురణలో వెనకబాటుతనం.. పీజీ, పీహెచ్డీ లాంటి కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం లాంటివి ఐఐటీల్లో డొల్లతనం బయటపెడుతున్నాయని చెప్పింది. చదవండి: కోల్గేట్ పేస్ట్ కోసం క్యూ కడుతున్న జనం! కారణం ఏంటంటే.. ఐఐటీ హైదరాబాద్ సహా భువనేశ్వర్, గాంధీనగర్, ఇండోర్, జోధ్పూర్, మండి, పాట్నా, రోపార్లలోని 8 ఐఐటీల్లో 2014–19 మధ్య కార్యకలాపాలను కాగ్ పరిశీలించింది. తమ పరిశీలన నివేదికను ఇటీవలే ముగిసిన శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటుకు సమర్పించింది. 2008–09లో 8 ఐఐటీల స్థాపనకు రూ.6,080 కోట్లు ప్రతిపాదిస్తే 2019లో అవి పూర్తయ్యేనాటికి సవరించిన అంచనా వ్యయం రూ. 14,332 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఇందులో హైదరాబాద్ ఐఐటీ అంచనా వ్యయం రూ.760 కోట్ల నుంచి రూ.2,092 కోట్లకు చేరిందని వెల్లడించింది. 5 నుంచి 36 శాతం అధ్యాపకుల ఖాళీలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్య 1:10 నిష్పత్తిలో ఉండాల్సి ఉండగా హైదరాబాద్ ఐఐటీలో 2018–19 ఏడాదిలో 23% అధ్యాపకుల కొరత ఉందని కాగ్ నివేదిక పేర్కొంది. 2,572 మంది విద్యార్థులకు 257 మంది అధ్యాపకులు ఉండాలని, కానీ 197 మందే ఉన్నారని నివేదికలో తేల్చింది. ప్రతి ఏటా కొత్తగా అధ్యాపకులను తీసుకుంటున్నా 7 ఐఐటీల్లో 5 నుంచి 36 శాతం మేర ఖాళీలున్నాయంది. విద్యా నాణ్యతపై ఇది ప్రభావం చూపిందని తెలిపింది. అధ్యాపకుల స్థానాలకు తగినంత మంది అభ్యర్థులు అందుబాటులో లేకపోవడం, పరిమిత మౌలిక సదుపాయాల వల్ల కొంతమంది విద్యార్థుల ఇన్టేక్ కెపాసిటీని పెంచలేకపోయారని వివరించింది. హైదరాబాద్ ఐఐటీలో ప్లేస్మెంట్స్ 63 శాతమే ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్లేస్మెంట్ అనేది ర్యాంకింగ్ కొలమానాల్లో ఒకటని, అయితే హైదరాబాద్ ఐఐటీలో 2014–19 వరకు విద్యార్థుల ప్లేస్మెంట్ శాతం కేవలం 63గానే ఉందని కాగ్ వివరించింది. 95 శాతం ప్లేస్మెంట్స్ ఇండోర్, 84 శాతం ప్లేస్మెంట్స్తో భువనేశ్వర్ ఐఐటీ రెండో స్థానంలో ఉన్నాయని తెలిపింది. 8 ఐఐటీల్లో హైదరాబాద్ చివరన ఉందని చెప్పింది. 2014–19 మధ్య కాలంలో పీజీ కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నమోదు శాతం హైదరాబాద్ ఐఐటీలో చాలా తక్కువగా ఉందని కాగ్ వెల్లడించింది. ఎస్సీల్లో 25 శాతం, ఎస్టీల్లో 34 శాతం మంది పీజీ కోర్సుల్లో చేరలేదంది. పీహెచ్డీ కోర్సుల్లోనైతే ఎస్టీల్లో 73 శాతం, ఎస్సీల్లో 25 శాతం మందే చేరారని చెప్పింది. పేటెంట్లలో హైదరాబాద్ ఐఐటీ టాప్ ఆవిష్కరణలకు పేటెంట్లు సాధించడంలో మాత్రం హైదరాబాద్ ఐఐటీ ముందు వరుసలో ఉందని కాగ్ వివరించింది. 2014–19 మధ్య 94 ఆవిష్కరణల పేటెంట్లకు దరఖాస్తు చేసుకుంటే ఏకంగా 16 ఆవిష్కరణలకు పేటెంట్లు దక్కించుకుందని చెప్పింది. ఐఐటీ జో«ధ్పూర్ 4, ఐఐటీ రోపార్ 2 ఆవిష్కరణలకు పేటెంట్లు దక్కించుకున్నాయని వెల్లడించింది. కాగ్ ఏం సూచించిందంటే.. ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం, అధ్యాపకుల కొరత తీర్చేలా కేంద్రం చర్యలు చేపట్టాలని కాగ్ సూచించింది. కొత్త బోధన విధానాలు, సమయోచిత కోర్సుల పరిచయం, ఉన్నత విద్యా ప్రమాణాలను పాటిస్తే ఐఐటీలను మానవ వనరుల అవసరాలను తీర్చేందుకు వీలుగా అభివృద్ధి చేయవచ్చని వివరించింది. ఐఐటీలు ప్రచురించిన పేపర్లు, పొందిన పేటెంట్ల ద్వారా ప్రభుత్వేతర వనరుల నుండి నిధులను ఆకర్షించి పరిశోధనలపై మరింత దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలంది. ఐఐటీల కార్యకలాపాలపై గవర్నింగ్ బాడీలు పర్యవేక్షణ పెంచాలని, తరుచుగా భేటీ అవుతూ మంచి ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
బువ్వ పెట్టేవాడికి భుక్తి దక్కాలి
సాగు ఎలా సాగాలో నిపుణులు, శాస్త్రవేత్తలు, అధికారులు, పాలకులు... ఇలా అందరూ చెప్పేవాళ్లే! అసలు రైతును సంప్రదించరు. అతని ఇబ్బందు లేంటి? ఏం కోరుతున్నాడు? ఏయే సంప్రదాయిక తెలివితేటలు నిరాదరణకు గురై కాలగర్భంలోకి జారిపోతున్నాయి... అతన్నడిగి తెలుసుకోవాలని ఎవరికీ పట్టదు. రైతు తాను పండించేది ఎందుకు తినలేకపోతున్నాడు? ఎందుకు తినజాలక పోతున్నాడు? అంతకుమించి ఎందుకు కొనలేకపోతున్నాడు? అని ప్రశ్నించుకోవాలి. వ్యవసాయాన్ని సంస్కరించి రైతును ఆదుకుంటామని పెద్ద ప్రకటనలు చేసే పాలకులు ఆచరణలో విఫలమవుతున్నారు. ఈ పద్ధతి మారాలి.ౖ రెతు కేంద్రకంగా వ్యవసాయ సంస్కరణలు రావాలి. రైతుకు దయనీయ స్థితి రాకుండా చూడటమే మన జాతీయ వ్యవసాయ విధానం కావాలి. ప్రకృతి ఒడిలో, పంచభూతాల సాక్షిగా రైతు నిరంతరం ఆశనే శ్వాసిస్తుంటాడు. అందులో నెరవేరేవి కొన్ని, నీరుగారి నీరసింపజేసేవి కొన్ని! కోటి ఆశలతో భారత రైతాంగం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే సందర్భమిది! గత కొన్నేళ్లుగా దేశంలో రైతులు ఎదుర్కొంటున్న ఎడతెరిపి లేని సమస్యలకు శీర్షంలా... ఆటుపోట్లను చవిచూపిన 2021 నేటితో ముగు స్తోంది. ఆశలు కల్పిస్తూ 2022 ఆహ్వానిస్తోంది. దేశానికి వెన్నెముక, తిండిపెట్టేవాడు రైతే. జనాభాలో అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్న అసంఘటిత రంగం వ్యవసాయం. సమస్త జనాభాకు ఆహారాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్ఠిని, పారిశ్రామిక రంగానికి ముడి సరుకుని, తగు విదేశీ మారకాన్నీ అందిస్తున్న కీలక వ్యవసాయ రంగం... పలు కారణాలతో నేడు కుదేలైంది. (చదవండి: ఆధార్తో శర (అను) సంధానం) భూతాపోన్నతి వల్ల ‘వాతావరణ మార్పు’ ప్రమాదమై ముంచుకొస్తున్న ప్రకృతి వైపరీత్య తీవ్రత, ఉన్న సమస్యకు తోడైంది. పెట్టుబడి వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి, ఆదాయం రమారమి పడిపోయి, పిల్లల విద్య– వైద్యం–పెళ్లిల్లు వంటి వ్యయభారాలతో క్రుంగి, రైతు కుటుంబాలు ప్రత్యామ్నాయ జీవనోపాధుల వైపు చూసే దుర్దశ! ఎన్ని చేసినా ఆగని రైతు ఆత్మహత్యలు, బలవన్మరణాలు! వ్యవసాయాన్ని సంస్కరించి రైతును ఆదుకుంటామని పెద్ద ప్రకటనలు చేసే పాలకులు ఆచరణలో విఫలమవుతున్నారు. ఎక్కడో తప్ప... ఎన్నికల ముందరి హామీలకు అంతిమంగా సాధించే ఫలితాలకు పొంతన ఉండటం లేదు. సమగ్ర వ్యవసాయ విధాన లోపం ఒకటైతే, ఉన్నవి సవ్యంగా అమలు కాని దురవస్థ మరొకటి! అన్ని ప్రతికూలతల్ని ఎదుర్కొని తృణమో, పణమో పండించినా, చేతికి వచ్చిన పంటకు ధర రాక రైతు నెత్తికి చేతులు పెట్టే దైన్యం! ప్రపంచ వాణిజ్య ఒప్పందాల నీడలో... శాస్త్ర సాంకేతిక బదలాయింపును మించి, కార్పొరేట్ దోపిడి పెరిగి రైతు నడ్డి విరుగుతోంది. ప్రజాస్వామ్యమే అయినా. నిలదీసి రైతులు వ్యవ సాయ అనుకూల విధానాలను సాధించుకోలేకపోతున్నారు. పైగా ప్రతికూల విధానాల్ని ఎదురించి పోరాటాలే చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో నిరసన తెలిపినందుకే, విచ్ఛిన్న శక్తులని, దేశద్రోహులని, నక్సలైట్లని, ఉగ్రవాదులని అపవాదు మోయాల్సి వస్తోంది. ఇదీ నేటి వ్యవసాయ భారతావని! అడుగడుగున సవాళ్లు, అదే మోతాదులో అవకాశాలూ ఉన్నాయి. అమలుకు చిత్తశుద్ది ఉండాలి! రాబడి పెంచాలి... రైతు రాబడి రెట్టింపు చేస్తామన్నది ఎన్నికల హామీ! ఆ దిశలో నిర్దిష్ట చర్యలే లేవు. పైగా, అసమగ్ర విధానాలు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం వల్ల మరింత దిగజారిన పరిస్థితి! ‘నువ్వు కారణమం’టే, ‘కాదు నువ్వు’ అనే కాట్లాటల్లో నలుగుతున్న లేగదూడ రైతాంగం. గిట్టుబాటు ధర గణించడమే అశాస్త్రీయం! ప్రకటించింది కూడా లభించక, కడకు ధాన్యం కొనే దిక్కే లేక... కల్లాల్లోనే రైతులు కాలం చేయటం, మార్కెట్ ముంగిట ధాన్యరాశుల మీద రైతు అసువులు బాయటమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం! అర్థ శతాబ్ది కిందటి ‘హరిత విప్లవం’ అధిక ఉత్పత్తి సాధించిందన్న మాటే గాని, మొత్తం వ్యవసాయాన్ని నాశనం చేసింది. కట్టడి లేని ‘వ్యవసాయ రసాయనీకరణ, విత్తన సంకరీకరణ’ స్థూలంగా దేశ వ్యవసాయ ప్రక్రియపైనే కోలుకోలేని దెబ్బ కొట్టింది. విత్తనాల నుంచి, విష రసాయన ఎరువులు, ప్రమాదకర క్రిమిసంహారకాలు పెట్టుబడి వ్యయాన్ని అసాధారణం చేశాయి. (చదవండి: ప్రత్యామ్నాయ పంటలకు మళ్లాల్సిందే కానీ...) మద్దతు ధర సంగతి మరచి పోయినా, కనీస గిట్టుబాటు ధర కూడా లభించక రైతాంగం ఆర్థికంగా అతలాకుతలమౌతోంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో తగినన్ని అప్పులు దొరక్క అధిక వడ్డీకి ప్రయివేటు రంగంలో తెచ్చే అప్పుల ఊబీ, రైతును లోనికి లాక్కొని తుదముట్టిస్తోంది. ఉత్పత్తుల్ని మార్కెట్కు తీసుకువెళితే నిలువ చేసే వసతి, శీతల గిడ్డంగులు, మద్దతు ధర ఇప్పించే వ్యవస్థలు లేక రైతు ఆల్లాడుతున్నాడు. కొనుగోళ్లకు భరోసా ఇచ్చే మార్కెట్ వ్యవస్థ లేదు. రైతు రాబడి పెంచాలంటే, నిర్దిష్ట చర్యలతో ఆస్కారముంది. రసాయన ఎరువులు–క్రిమిసంహారకాలు– కలుపు నివారకాల్ని వదిలేసి, సహజ–సేంద్రియ వ్యవసాయ పద్దతుల ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవాలి. జాతీయ ఉపాధి హామీ కార్యక్రమాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. క్రమంగా భూసారాన్ని మెరుగు చేసి దిగుబడి పెంచుకోవాలి. పంటకు తగిన ధర లభించేలా చూడాలి. ఇప్పుడున్నట్టు కాక, పూర్తి భిన్నంగా.... పెట్టుబడి ముడిసరుకును టోకు ధరలకు రైతు కొనేలా, తన పంటను చిల్లర ధరకు విక్రయించేలా రైతులో, రైతు సంఘాలో, సహకార వ్యవస్థలో చూసుకుంటే వ్యవసాయ రాబడి పెరుగుతుంది. (చదవండి: నవచరిత్రగా... రైతు విజయగాథ) సర్కార్ల సమన్వయం కీలకం వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశమని రాజ్యాంగం చెబుతోంది. కానీ, వ్యవసాయ ప్రక్రియను ప్రభావితం చేసే చాలా అంశాలు కేంద్ర జాబితాలో ఉన్నాయి. ఉమ్మడి జాబితాతో లంకెగల కొన్ని అంశాల ఆసరాతో, కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేసే సందర్భాలూ ఉంటాయి. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని రాష్ట్రాలు విమర్శిస్తుంటాయి. మొన్న అమలై–రదై్దన మూడు వ్యవసాయ చట్టాలు అలాంటివే! అందుకే, మొత్తంగా ఆ చట్టాలు రద్దవడానికి ముందే, పలు రాష్ట్రాలు సొంతంగా చట్టాలు తెచ్చుకొని, సదరు కేంద్ర చట్టాల ప్రభావం లేకుండా చేశాయి. దేశం నైసర్గికంగా, వాతావరణపరంగా పలు వ్యవ సాయ జోన్లుగా విడిపోయి ఉన్నందున, ఎక్కడికక్కడి ప్రాధాన్యతలు, పరిస్థితుల్ని బట్టి రాష్ట్రాల వారిగా వ్యవసాయ విధానాల అమలే మంచిది! అయితే, మార్కెటింగ్, ఆహార సరఫరా–పంపిణి, దిగు మతి–ఎగుమతులు, ఆహారభద్రత, పౌరసరఫరాలు–ప్రజా పంపిణీ వంటి పలు ప్రభావక అంశాల దృష్ట్యా ‘వ్యవసాయ జాతీయ స్థూల విధానం’ఉండాలంటారు. వ్యవహారకర్తలుగా రాష్ట్రాలుండి, సదరు విధానాన్ని సమన్వయపరిచి, సౌకర్యాలు కల్పిస్తూ కేంద్రం మద్దతి వ్వాలని ‘భారత రైతు సంఘాల పరిషత్’ (సిఫా) అభిప్రాయపడింది. గురువారం హైదరాబాద్లో సమావేశమైన పరిషత్ పలు అంశాలు చర్చించి, భవిష్యత్ కార్యాచరణకు కొన్ని ప్రతిపాదనలు చేసింది. (చదవండి: రాజకీయ సంకల్పంతోనే.. కనీస మద్దతు ధర సాధ్యం) ఒకటికొకటి విరుద్ధం కాదు... తోడవ్వాలి! సాగు ఎలా సాగాలో నిపుణులు, శాస్త్రవేత్తలు, అధికారులు, పాల కులు... ఇలా అందరూ చెప్పేవాళ్లే! అసలు రైతును సంప్రదించరు. అతని ఇబ్బందులేంటి? ఏం కోరుతున్నాడు? ఏయే సంప్రదాయిక తెలివితేటలు నిరాదరణకు గురై కాలగర్భంలోకి జారి పోతున్నాయి... అతన్నడిగి తెలుసుకోవాలని ఎవరికీ పట్టదు. రైతు తాను పండించేది ఎందుకు తినలేకపోతున్నాడు? ఎందుకు తినజాలక పోతున్నాడు? అంతకు మించి ఎందుకు కొనలేకపోతున్నాడు? అని ప్రశ్నించుకోవాలి. లోపభూయిష్ట ఆహార పంపిణీ వ్యవస్థ వల్ల... ఒక ఊళ్లో పండే పంటను నేరుగా అక్కడి వినియోగదారులు కొని, తినే పరిస్థితి ఉండదు. గ్రామం నుంచి టౌన్, అక్కడ్నుంచి రాజధాని, తిరిగి టోకు వ్యాపారుల ద్వారా టౌన్కు, చిల్లర వర్తకుల ద్వారా అదే గ్రామానికి, రెట్టింపు ధరతో వచ్చినపుడు ఆ గ్రామస్తులు కొంటుంటారు. ఈ పద్దతి మారాలి. ఎక్కడికక్కడ ఆహార సరఫరా విధానాన్ని అనుసరిస్తే, పలు ప్రయోజనాలు! నేల చదును, విత్తన శుద్ధి నుంచి ఆహార వినియోగం వరకు రైతుకు కొంత సంప్రదాయిక పరిజ్ఞానం ఉంటుంది. సదరు జ్ఞానానికి ఆధునిక శాస్త్ర–సాంకేతికత తోడైతే అద్భుతమైన ఫలితాలుం టాయి. ప్రపంచ వాణిజ్య ఒప్పందంలో భాగమైనపుడు... మన వ్యవ సాయోత్పత్తుల నాణ్యత–ఆమోదం పెంచుకోవడం, అంతర్జాతీయ పోటీని తట్టుకోవడం, ఎగుమతుల వృద్ధి ముఖ్యం! రైతు కేంద్రకంగా వ్యవసాయ సంస్కరణలు రావాలి. విశ్వనరుడు గుర్రం జాషువా అన్నట్టు, ‘వాని రెక్కల కష్టంబు లేనినాడు/సస్యరమ పండి పులకించ సంశయించు/ వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు/భోజనము పెట్టు, వానికి భుక్తి లేదు’ (గబ్బిలం) అన్న దయనీయ స్థితి రైతుకు రాకుండా చూడటమే మన జాతీయ వ్యవసాయ విధానం కావాలి. - దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
వారి కన్నీటి కథ.. కండలు కరిగినా కడుపునిండదాయె
సాక్షి, హైదరాబాద్: ఎండనక, వాననక రాళ్లను తీసుకువచ్చి రోళ్లను తయారు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు వడ్డెరలు. బతుకుదెరువు కోసం వివిధ జిల్లాల నుంచి వలస వచ్చి మేడ్చల్ జిల్లాలో జీవనం గడుపుతున్నారు. చదువంటే తెలియని వయస్సు పొట్టకూటి కోసం సమ్మెట ఆయుధంగా చేసుకున్న వారి జీవితాల్లో వెలుగులు కానరావడంలేదు. ప్రస్తుతం జవహర్నగర్లో దాదాపు వెయ్యి కుటుంబాలకు పైగా రాళ్లను కొడుతూ జీవనం సాగిస్తున్నాయి. రెండు రోజులు రాళ్లు కొడితేనే విసురు రాళ్లు, రుబ్బు రోళ్లు తయారవుతాయి. విసురు రాయికి రూ.100, రోలుకు రూ.70, రుబ్బు రోలుకు రూ.100 అవుతాయని అంటున్నారు. స్వశక్తితోనే కుటుంబాలు పోషించుకుంటున్నామని పేర్కొంటున్నారు. ఎక్కడైనా రోడ్లు మంజూరైతే కాని పని దొరకదని వడ్డెరలు పేర్కొంటున్నారు. పేదరికానికి మారుపేరు వారు. బతుకు గమనంలో చితికిపోయిన జీవితాలు. భవిçష్యత్పై ఆశలు లేని గమనాలు. కోటి విద్యలు కూటి కొరకే అన్న నానుడి రాళ్లను రోళ్లుగా తయారు చేస్తున్న వారి విషయంలో సరిపోతుంది. పొట్ట కూటి కోసం గ్రామాలు తిరుగుతూ బతుకు బండిని లాగుతున్నారు. రోళ్లను తయారు చేసే వారిని కదిలిస్తే కన్నీటి కథలే కనిపిస్తాయి. రాళ్లను పూజించే దేశంలో రాతిని ప్రేమించడం వడ్డెరులకే సాధ్యం. బతుకు గమనంలో తమకు చేయూతనందించాలని వేడుకుంటున్న వడ్డెరుల జీవిత గమనంపై ప్రత్యేక కథనం. ప్రభుత్వ పథకాల గురించి అసలే తెలీదు.. పిల్లలను చదివించే స్తోమత లేదని అందరం కష్టపడి పని చేస్తామని చెబుతున్నారు. తమకు నగర శివారుల్లోని కొంత అటవి ప్రాంతాన్ని అప్పగిస్తే అందులో లభించే బండలను కొట్టుకుని జీవనం సాగిస్తామని వేడుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల గురించి అసలు తమకు తెలియదని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని వడ్డెర కులస్తులు విన్నవిస్తున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లను సుత్తితో పగలగొట్టి ఉపయోగంలోకి తీసుకువస్తారు. ప్రతిరోజు ఉదయం కుటుంబ సభ్యులందరూ కలిసి బండలు పగలగొట్టె పనికి వెళ్తారు. ఎంత కష్టపడుతున్నా శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదని వడ్డెరలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో రాళ్లను కంకరగా తయారు చేయడానికి కొత్త రకాల క్రషర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వారికి పని దొరకని పరిస్థితి. రెండు రోజులు రాళ్లు కొడితేనే.. రెండు రోజులు రాళ్లు కొడితేనే విసురు రాళ్లు, రుబ్బు రోళ్లు తయారవుతాయి. విసురు రాయికి రూ.100, రోలుకు రూ.70, రుబ్బు రోలుకు రూ.100 అవుతాయని అంటున్నారు. స్వశక్తితోనే కుటుంబాలు పోషించుకుంటున్నామని పేర్కొంటున్నారు. ఎక్కడైనా రోడ్లు మంజూరైతే కాని పని దొరకదని వడ్డెరలు పేర్కొంటున్నారు. పని దొరకదు.. కడుపు నిండదు వంశపారంపర్యంగా ఈ వృత్తిని నమ్ముకునే జీవిస్తున్నాం. సంచార జీవితాన్ని గడపడంతో ఎదగలేకపోతున్నాం. పూట గడవడమే తప్ప ఒక్క పైసా వెనుకేసుకోలేదు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలం మేము. ప్రతి రోజు పని చేస్తేనే నాలుగు పైసలు కండ్ల చూస్తాం. లేకుంటే పస్తులుంటాం. ఒక్కోసారి పని దొరకదు. కడుపు నిండదు. ప్రభుత్వమే వడ్డెరులపై శ్రద్ధ వహించాలి. – నర్ర మహేష్, జవహర్నగర్ రాళ్లు కొట్టడానికి అనుమతి ఇవ్వాలి.. బండరాళ్లను అందమైన రోళ్లుగా తయారు చేయడమే తప్ప చదవడం అంటే తెలియదు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో పనికి వెళ్లి వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకున్నాం. కాయకష్టం చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. గుట్టల్లో రాళ్లను కొట్టడానికి అనుమతులు ఇవ్వాలి. – రేపన్ లక్ష్మణ్, జవహర్నగర్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి వడ్డెర కులస్తులకు కొంత అడవిని అప్పగించాలి. నగర శివారు ప్రాంతాలలో జీవిస్తున్న వడ్డెర కులస్తుల జీవితాలలో ఎలాంటి మార్పు రావడం లేదు. వడ్డెరలను ఎస్టీ జాబితోకి చేర్చి ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలి. చాలా మంది వడ్డెరల పిల్లలు చదువులకు దూరంగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో వసతి గృహాలను ఏర్పాటు చేయాలి. తాతల కాలం నుంచి రాయిని కొట్టుకుని జీవిస్తున్న మాకు వడ్డెరలకు చేయుతనివ్వాలి. – పల్లపు రవి, కార్పొరేటర్, జవహర్నగర్ సీఎం దృష్టికి తీసుకెళ్లాం రాష్ట్రంలో వడ్డెర కులస్తుల జీవన విధానాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వాస్తవంగా వారి జీవితాల్లో ఎంతో విప్లవాత్మక మార్పులు తీసుకురాల్సిన అవసరం ఉంది. చాలా మంది కుటుంబాలకు దూరంగా బండలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వడ్డెరల స్థితిగతులపై ప్రత్యేక నివేదికను తయారు చేసి సీఎం కేసీఆర్కు అందజేశాం. అదే విధంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ను కోరాం. – మర్రి రాజశేఖరరెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జ్ -
సామీజీల వేషం.. పూజలంటూ మోసం
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): వారు స్వామీజీల వేషం కట్టారు.. రెండ్రోజులుగా ఇంటింటికీ తిరుగుతున్నారు.. సమస్యలు పరిష్కరిస్తామని నమ్మిస్తున్నారు.. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చుతామని చెబుతూ పూజలు చేస్తున్నారు.. తాయత్తులు కడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు.. నిందితులను జగిత్యాల ఖిలాగడ్డ ప్రాంతంలో స్థానికులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు స్వామిజీల అవతారంలో రెండు రోజులుగా ఖిలాగడ్డ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్తున్నారు. ముందుగా వీరిలో ఒకరు మీ ఇంట్లో సమస్య ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించి, వెళ్తారు. గంట తర్వాత మరొకరు వచ్చి, లేని సమస్యలు ఉన్నట్లు నమ్మించి, రూ.2 వేలు, రూ.2,500 విలువైన తాయత్తులు ఉన్నాయని, వాటిని కట్టుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మిస్తారు. ఇలా పెద్దఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారు. విషయం స్థానికులకు అర్థమవడంతో నిందితులను మంగళవారం ఉదయం పట్టుకొని, దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. -
Kindness Day: దయ చుట్టంబౌ.. నేడు ప్రపంచ దయాగుణ దినోత్సవం
దేవుడు భక్తుణ్ణి అడిగాడట– ‘నేను నీ ఇంటికొస్తే నాకు అన్నమెందుకు పెట్టలేదు’ అని. ‘నువ్వెప్పుడొచ్చావు తండ్రీ’ అన్నాడట భక్తుడు. ‘ఒకరోజు నీ ఇంటి ముందు ఒక దీనుడు క్షుద్బాధతో అన్నం అడిగాడు. అతడికి నీవు పెట్టి ఉంటే అతడిలో నేను కనపడేవాణ్ణి’ అన్నాడట దేవుడు. దయను మించిన అంటు లక్షణం మరొకటి లేదు. మనం ఒకరితో దయగా ఉంటే ఆ ఒకరు మరొకరితో దయగా ఉంటారు. సాహసం, వీరత్వం కంటే దయ కలిగినవాడే గొప్పవాడు. ఇంట్లో, ఆఫీసుల్లో, సంఘంలో దయ లోపించడం వల్లే ఇవాళ సమస్యలు పెరిగిపోయాయి. దయ చూపేవారికి సాటి మనిషి తోడు నిలుస్తాడు. దయే నేడు కావలసిన చుట్టం. వెతకవలసిన దైవం. దేవుడు మనుషుల పట్ల ఎంతో దయగా ఉన్నాడు. లేకుంటే ఉష్ణం గక్కే పగలు నుంచి సాంత్వనం కోసం రాత్రిని ఇచ్చేవాడా? క్రూరమృగాల కీకారణ్యంలో తీయని ఫలాలను వేళ్లాడగట్టేవాడా? నదులను గీత కొట్టి అంతే పారాలని చెప్పేవాడా? సముద్రానికి చెలియలికట్టలు గీచేవాడా. దేవుడు మనుషులతో ఎంతో దయగా ఉన్నాడు. జబ్బు ఉన్నచోటే మందు ఇచ్చాడు. గాయపడిన చోట మాన్పుకోవడమూ నేర్పాడు. కంటిలో నీరు ఇచ్చి ఆనందబాష్పాలను కూడా చిలకరించాడు. మనిషి? అన్నీ ఫ్రీ. గాలిలోని ఆక్సిజన్ ఫ్రీ. సూర్యుడిలోని డి విటమిన్ ఫ్రీ. మబ్బులోని వాన ఫ్రీ. చంద్రుడిలోని వెన్నెల ఫ్రీ. చెట్ల ఆకుపచ్చదనం ఆకాశంలోని నీలిమ.. అన్నీ ఫ్రీ. ఇన్ని ఫ్రీగా తీసుకుంటూ అతడు బదులుగా ఇవ్వవలసింది చూపవలసింది ఏమిటి? సాటిమనిషి పట్ల కాసింత దయ. కొంచెం కరుణ. గుప్పెడు ఆర్ద్రత. చిటికెడు చెమరింత. ఇంగ్లిష్వాడు మానవజాతిని ‘మేన్కైండ్’ అన్నాడు. ‘కైండ్’గా ఉండటమే మానవజాతి లక్షణం. మానవీయమైన గుణం కలిగినవాడే మానవుడు. మానవీయగుణం అంటే దయ, కరుణ. ‘ఇంటి దగ్గర ఉండే లేగదూడకు పాలు ఇచ్చి వస్తాను. అప్పుడు నన్ను చంపి తిను’ అన్న గోవు మాట మీద నిలబడి తిరిగి వస్తే క్రూరమృగమైన పులికి దయ కలిగింది. ఆవును వదిలిపెట్టింది. కాని నేటి మనిషి పులి కంటే కఠినంగా మారుతున్నాడా? దయ, జాలి, కరుణ అనే మాటల్నే మరుస్తున్నాడా? ఇలాంటి మనిషిని ప్రకృతి ఇష్టపడుతుందా? ఇల్లు–ఇరుగు పొరుగు ‘పిల్లల పట్ల పెద్దలు దయగా ఉండాలి’ అని అంటారు. పిల్లలకు ఇంటి పని నేర్పించడం వేరు. ఇంటి పని పిల్లల చేత చేయించడం వేరు. బాల కార్మిక వ్యవస్థ బయట శిక్షార్హమైన నేరం. కాని ఇళ్లల్లో సొంత పిల్లలను రకరకాల పనుల్లో పెట్టి వారిని చెప్పుకోలేని బాధకు గురి చేసే తల్లిదండ్రులు ఉంటారు. ప్రతి పనికీ పిల్లల్ని కేక వేయడానికి వారు పనిమనుషులు కాదు. ఇక వారిని తిట్టడం, కొట్టడం వారిని భవిష్యత్తులో నిర్దాక్షిణ్యులుగా మార్చడమే. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలతో ఇరుగు పొరుగువారితో దయగా ఉంటే, ‘వాచ్మెన్కు ఈ టిఫిన్ ఇచ్చిరా’ అని పిల్లల చేత పంపిస్తే, ‘పాపం.. వాళ్ల బండి పంక్చర్ అయ్యిందట.. మన బండి తాళం ఇచ్చిరా’ అని పంపిస్తే... పిల్లలు దయను కూడా నేర్చుకుంటారు. అవును. మంచి గుణాలను నేర్పించాలి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎవరో చేయి సాచగానే తండ్రి నోటి నుంచి బూతులు, తల్లి మాటల్లో ఈసడింపు కనిపిస్తే పిల్లలు అలాంటి పేదవారి గురించి భవిష్యత్తులో దయగా ఉండే అవకాశం ఉండదు. ఇరుగు పొరుగు పిల్లలతో, క్లాస్లోని పిల్లలతో ఎంతో స్నేహంగా, దయగా ఉండాలని పిల్లలకు నేర్పించాలి. పెద్దలు తమ ప్రవర్తనతో చూపాలి. యువతలో ఈ దయాగుణం లోపిస్తున్నదని అమెరికా, ఆస్ట్రేలియా, యు.కెలలో క్లాస్ 12 లోపు పిల్లల కోసం ‘కైండ్నెస్ కరిక్యులమ్’ ప్రవేశపెడుతున్నారు. పని చోట మనతో పని చేసే వారితో మనం కఠినంగా ఉండాలి అనుకోవడమే సగం అనారోగ్యం. పని రాబట్టుకోవాలంటే కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రేమగా ప్రశంసగా కూడా పని జరుగుతుంది చాలాసార్లు. కొలీగ్స్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చూడటానికి మించిన నిర్దయ లేదు. వారి నిజమైన సమస్యలకు స్పందించడం, కనీసం వినడం, వారి పని సర్దుబాటులో, సెలవుల అవసరంలో సాయంగా ఉండటం పని చోట చూపాల్సిన కనీస దయ. పని చోట రాజకీయాలు నడిపితే అనారోగ్యం వస్తుందని దయగా ఉంటే మనశ్శాంతితో ఉంటూ శరీరంలో మంచి ఎంజైమ్లు ఊరుతూ ఆరోగ్యంగా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అందరూ పౌరులే ఈ దేశంలో అందరూ సమాన పౌరులే. అందరికీ రాజ్యాంగం శిరోధార్యమే. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించాలి. అలా జీవించే హక్కు వారికి ఉంది. ప్రాంతాన్ని బట్టి, సామాజిక వర్గాన్ని బట్టి, మతాన్ని బట్టి, భాషను బట్టి, ఆచారాలను బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి ఫలానా వారి పట్ల నిర్దయగా ఉండొచ్చు అనుకోవడానికి మించి సంకుచితత్వం లేదు. నువ్వు నిర్దయగా ఉన్నావంటేనే పైచేయి తీసుకుంటున్నట్టు అర్థం. పైచేయి తీసుకోవడం అంటే పీడన చేయడానికి సిద్ధమవడమేనని అర్థం. పీడిస్తే సంఘంలో బాధ ప్రవహిస్తుంది. దయగా ఉంటే సంతోషం, సామరస్యం పెల్లుబుకుతాయి. ఇవాళ ద్వేషం కాదు కావలÜంది దయ. బాగున్న వర్గాలు బాగలేని వర్గాల పట్ల నిర్దయను మానుకుంటే చాలు. వారి హక్కుల్ని వారు సాధించుకుంటారు. గ్రామీణులు ‘ఫలానా అతను దయగల్లోడు’, ‘ఫలానా ఇల్లాలు దయగలది’ అంటుంటారు. ఇవాళ, ఈ రోజున, మనల్ని ఎవరైనా అలా అంటున్నారా లేదా అని ఆత్మశోధన చేసుకోవడమే మనం చేయవలసిన పని. దయగా ఉంటే ఏం పోతుంది. మహా అయితే అందరూ మనతో దయగా ఉంటారు. అంతేగా? -
స్పైన్ బాగుంటేనే విన్...
ఇటీవలి కాలంలో బ్యాక్ ప్రాబ్లెమ్స్ లేదా వెన్నెముక సంబంధ సమస్యలు బాగా పెరిగాయి. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో లాక్డవున్ కారణంగా అత్యధిక సమయం ఇంట్లోనే ఉండడం, టీవీ లేదా కంప్యూటర్ల ముందు అధిక సమయం గడపడం వంటివి వెన్నుముక సమస్యలను మరింతగా పెంచాయి. అప్పటికే శారీరక శ్రమ లేక స్పైన్ బాధితులు పెరుగుతున్న క్రమంలో కరోనా తర్వాత వయసులకు అతీతంగా ఈ సమస్య విజృంభిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో డా.రావ్స్ హాస్పిటల్(గుంటూరు)కు చెందిన న్యూరోసర్జన్ డా.మోహనరావు పాటిబండ్ల దీనికి సంబంధించి పలు విశేషాలను, సూచనలను అందించారు. ►స్పైన్ లేదా వెన్నెముక అనేది మన శరీరపు భంగిమకు, అవయవాల సమన్వయానికి మన రోజువారీ కార్యకలాపాలకు అత్యవసరమైన మద్ధతును అందిస్తుంది. చాలా వరకూ వెన్నెముక సంబంధ సమస్యలు పెరిగితే అవి కదలికల్ని నిరోధిస్తూ రోజువారీ కార్యకలాపాలను క్లిష్టతరం చేస్తాయి. కాబట్టి... వెన్నెముక ఆరోగ్యం సవ్యంగా ఉండేలా చేసే ఆరోగ్యకరమైన అలవాట్లు పై అవగాహన పెంచుకుంటూ జాగ్రత్తపడాలి. ►ఆరోగ్యకరమైన బరువు కొనసాగించడం, శారీరక చురుకుదనం లోపించకుండా చూసుకోవడం, వ్యాయామాలు, శరీరాన్ని సాగదీసే స్ట్రెచ్ ఎక్సర్సైజ్లు, సరైన విధంగా వంగిలేచే మెళకువలు, బరువులు ఎత్తడం... వీటన్నింటితో పాటు తగినంత విశ్రాంతి కూడా తప్పనిసరి. ►గత 2–3 దశాబ్ధాల క్రితం ఎటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలూ, పరికరాలూ అందుబాటులో లేవు. అందువల్ల అప్పట్లో శస్త్ర చికిత్సల నుంచి సరైన ఫలితాలు రాలేదు. ►అయితే ఇప్పటికీ స్పైన్ సంబంధ వ్యాధులపైనా చికిత్సలపైనా ముఖ్యంగా శస్త్ర చికిత్సలపై కూడా రోగుల్లో చాలా అపోహలున్నాయి. వాటిని ముందుగా తొలగించుకోవాలి. ►ఇప్పుడు వెన్నెముక సంబంధ సమస్యల గురించి వైద్యరంగం మరింత చక్కగా అర్ధం చేసుకోవడం జరిగింది. తద్వారా మరింత చక్కని చికిత్స వీలవుతుంది. ►సంప్రదాయ పద్ధతిలో కొన్నింటికి చికిత్స సరిపోతుంటే కొన్నింటికి మాత్రం తప్పనిసరిగా శస్త్ర చికిత్స చేయవలసి రావచ్చునని గుర్తించాలి. ►వెన్నెముక చికిత్సల్లో అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ►మినిమల్లీ ఇన్వాసివ్ స్పైన్ సర్జరీ (ఎమ్ఐఎస్ఎస్)... అనేది ఈ రంగంలో ఒక కీలక మైలురాయి. ఈ శస్త్ర చికిత్సలో ఒక ట్యూబ్యులర్ రిట్రాక్టర్ సహాయంతో స్పైన్లోని సమస్యాత్మక ప్రాంతాన్ని చేరుకుంటారు. మైక్రోస్కోప్, ఎండోస్కోప్ వంటివి ఉపయోగిస్తారు. ల్యూంబర్ డిసెక్టమీ, ల్యామినెక్టొమీ, స్పైనల్ ఫ్యూజన్ వంటి కొన్ని రకాల వెన్నుముక చికిత్సల్లో దీన్ని ఉపయోగించవచ్చు ►ఇందులో చర్మాన్ని అతి స్వల్పంగా మాత్రమే కోత పెట్టడం ద్వారా శస్త్ర చికిత్స చేయడం జరగుతుంది. అంతేకాకుండా అతి తక్కువ రోజులు మాత్రమే ఆసుపత్రిలో ఉండేందుకు, చికిత్సానంతరం తక్కువ నొప్పి, గాయం త్వరగా మానడం... వంటివి సాధ్యమవుతాయి. –డా.మోహన్రావు పాటిబండ్ల, న్యూరో సర్జన్ డా.రావ్స్ హాస్పిటల్ -
మాకొక అండర్ పాస్ కావాలి
-
పట్టించుకోని ఆదివాసీల గోడు
-
Panchayat Secretary: ఉద్యోగమా.. చాకిరా?
ఆమె ఓ పంచాయతీ కార్యదర్శి. ఇద్దరు పిల్లల తల్లి. చీకటిలోనే పనులు ముగించు కున్నారు. ఈలోపు భారీ వర్షం. అయినా.. తడుస్తూనే విధులకు వెళ్లారు. కార్యాలయానికి చేరుకొని ఫొటో తీసుకుని యాప్లో అప్లోడ్ చేశారు. ఇదంతా ఎందుకంటే కేవలం అటెండెన్స్ కోసమే. సాక్షి, కరీంనగర్: ఉదయాన్నే 8 గంటలకు విధుల్లో చేరామన్న సందేశం చేరితేనే ఆ రోజు పనిచేసినట్లు లెక్క. పోనీ అంత ఉదయం వెళ్లినా.. ఎప్పుడు తిరిగి వస్తారో తెలియనంతగా పనులు. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో తీవ్ర పని ఒత్తిడి మధ్య పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు పల్లెప్రగతి యాప్ వచ్చాక వేధింపులు పెరిగిపోయాయి. ముఖ్యంగా తాము ఉదయాన్నే అది కూడా ఉదయం 8 గంటల్లోపే గ్రామపంచాయతీ కార్యాలయాన్ని చేరుకొని, కార్యాలయం కనిపించేలా సెల్ఫీ తీసుకుని దాన్ని అప్లోడ్ చేయాలి. ఏదైనా కారణం చేత కాస్త లేటైనా.. ఆ రోజు జీతం హుష్కాకి. ఇటీవల బుగ్గారంలో ఓ ఎంపీడీవో తన పరిధిలోని తొమ్మిది మంది పంచాయతీ కార్యదర్శులకు మెమో జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తాను వాట్సాప్ గ్రూపులో పెట్టిన సందేశానికి స్పందించలేదన్న కారణానికే ఆగ్రహించిన అధికారి ఏకంగా 9 మందికి మెమో జారీ చేశారు. ఈ విషయం పలువురు నెటిజన్లు మంత్రి కేటీఆర్కు, జగిత్యాల కలెక్టర్ రవి దృష్టికి తీసుకెళ్లారు. సెల్ఫీ తీసుకుంటేనే మస్టర్.. ► ఉదయాన్నే ఎనిమిది గంటలకు పంచాయతీ కార్యాలయానికి రావాలి. అక్కడ జీపీ లైవ్ లొకేషన్తోపాటు, లాంగిట్యుడ్, లాటిట్యూడ్ వివరాలు, పంచాయతీ భవనం కనిపించేలా సెల్ఫీ దిగి పల్లె ప్రగతి పీఎస్ యాప్లో అప్లోడ్ చేయాలి. ► పల్లెప్రగతి పీఎస్ యాప్.. ఎంపీవో (మండల పంచాయతీ ఆఫీసర్) అనే రెండు రకాల లాగిన్లు పంచాయతీ కార్యదర్శులకు ఉంటాయి. ప్రతీ పంచాయతీ కార్యదర్శి విధిగా రోజూ రెండు కాలువలు, రెండు రోడ్లు, ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థల భవనాలను క్లీన్ చేయించాలి. ► ఈ ఐదు పనులకు సంబంధించి ఐదు ఫొటోలు విత్ డేట్ అండ్ టైం ప్రకారం.. అప్లోడ్ చేస్తేనే ఆ రోజు పనిచేసిట్లు లెక్క. ఈ విధంగా నెలలో మొత్తం 24 పనిదినాలు ఇదే రకంగా విధులు నిర్వహించాలి. పాత ఫొటోలు అప్లోడ్ కావు. ► దీనికితోడు వీధి బల్బులు మార్చడం, ఇళ్ల నుంచి చెత్త సేకరణ వివరాలు కూడా రోజూ రిపోర్టు అప్లోడ్ చేయాలి. ► ఏ ఉద్యోగికైనా ఇంట్లో కనీస బాధ్యతలు ఉంటాయి. పిల్లలను స్కూలుకు పంపడం, మహిళలైతే ఇంట్లో వంట, పిల్లలు తదితర పనులు ఉంటాయి. కానీ.. కొత్త నిబంధన కారణంగా ఉదయాన్నే 7 గంటలకు బయల్దేరాలి. పిల్లలు నిద్రలేవక ముందే వదిలేసి రావడం చాలా బాధగా ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ► పోనీ, 5 గంటలకు ఉద్యోగం ముగుస్తుందా.. అంటే అదీ లేదు. వీడియో కాన్ఫరెన్స్లు, టెలీకాన్ఫనెన్స్లు జరిగితే గంటల కొద్దీ సమయంపాటు అక్కడే ఉండాలి. అవి పూర్తయ్యాక ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇల్లు చేరాలి. మళ్లీ ఉదయాన్నే విధులకు హాజరవ్వాలి. ► పంచాయతీ కార్యదర్శులపై మండలస్థాయిలో ఎంపీవో, ఎంపీడీవో, డివిజనల్ స్థాయిలో డీఎల్పీవో, ఏపీడీ, పీడీ జిల్లాస్థాయిలో ఏపీవో, డీపీవో వరకు ఇంతమంది సూపర్విజన్ ఉంటుంది. వీరందరూ ఏం పనిచెప్పినా ఎదురుచెప్పకుండా చేయాల్సిందే. ► ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి. జనన మరణ రికార్డులు, ఇంటి పన్నులవసూళ్లు, రెవెన్యూ రికార్డుల నమోదు, పరిపాలనపరమైన విధులన్నీ వీరే నిర్వహించాలి. ► పొరపాటున ఎదురుతిరిగినా, చేయలేమని చెప్పినా, టైమ్కు విధులకు రాలేకపోయినా మెమోలు జారీ చేస్తూ మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నారు. ► హరితహారం మొక్కలు పెరగకపోయినా, ఊర్లో కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకోకపోయినా, చిన్న చెత్త కనిపించినా వెంటనే మెమో జారీ చేస్తారు. ► ఇవి చాలవన్నట్లుగా గ్రామంలో సర్పించి, వార్డుమెంబర్లు, ప్రతిపక్ష నాయకులు, ఊర్లో ఉన్న పెద్దమనుషులు అంతా ప్రతీ పనికి వీరి మీదే పడుతున్నారు. ► ఈ ఉద్యోగాలు చేస్తున్న వారిలో దాదాపు 99 శాతం మంది పీజీలు చదివిన వారే. కరోనాకు ముందు ఈ ఉద్యోగాన్ని చాలామంది మానేద్దామనుకున్నారు. కానీ.. బయట కూడా పరిస్థితి బాగాలేకపోవడంతో విధిలేక ఈ కొలువులోనే కొనసాగుతున్నారు. చదవండి: 50 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి -
Vikarabad: రెచ్చిపోయిన సర్పంచ్.. సామాన్యుడిని కాలితో తంతూ..
వికారాబాద్ (రంగారెడ్డి): గ్రామ సమస్యలపై ప్రశ్నించినందుకు ఒక సామాన్యుడిపై సర్పంచ్ తన ప్రతాపాన్ని చూపాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, మార్పల్లి మండలం దామాస్తాపూర్కు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి గ్రామంలోని డ్రైనేజీ సమస్యలను పరిష్కారించాలని స్థానిక సర్పంచ్ జైపాల్ రెడ్డిని కోరాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు సర్పంచ్ నన్నే ప్రశ్నిస్తావా? అంటూ శ్రీనివాస్ రెడ్డిపై పిడిగుద్దులు కురిపించాడు. అంతటితో ఆగకుండా అతడిని కిందపడేసి విచక్షణ రహితంగా కాలితో తన్నాడు. దీంతో బాధితుడు తనపై అకారణంగా దాడిచేసిన సర్పంచ్ జైపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఒక బాధ్యాతాయుత పదవిలో ఉండి అనుచితంగా ప్రవర్తించిన సర్పంచ్పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. చదవండి: హైటెక్ వ్యభిచారం.. తప్పించుకోవడానికి రహస్య మార్గం.. -
పేదల ఇంట్లో గ్యాస్ మంటలు
-
లింకేజీ సమస్యలు.. రైతులకు అందని ‘పీఎం కిసాన్’!
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్ పథకం) కింద పేర్లు నమోదు చేసుకోవడంలో ఎదురవుతున్న పలు సమస్యల కారణంగా రాష్ట్రంలో వేలాది మంది రైతులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందట్లేదని లిబ్టెక్ ఇండియా అనే ఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశీలనలో వెల్లడైంది. ప్రధానంగా ఆధార్, పాన్కార్డుల లింకేజీ సమస్యలు, బ్యాంకు ఖాతాల్లో పేర్లు సరిపోలకపోవడం, డేటాలో తప్పులు, ఆధార్ ప్రాతిపదికన తిరస్కరణ, లబ్ధిదారుల పేర్లకు ఆమోదం తెలపడంలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కొంత జాప్యం చోటుచేసుకోవడం, తదితర అంశాలు ప్రభావం చూపుతున్నట్లు ఈ సంస్థ తాజా నివేదిక తేల్చింది. అలాగే పేర్ల నమోదు వెబ్సైట్ ఆంగ్లంలో ఉండటం, రైతులందరికీ ఈ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తెలియకపోవడం వంటి సమస్యలు కూడా ఇందుకు కారణమని ఈ అధ్యయనంలో తేలింది. ఇదీ అధ్యయనం... లిబ్టెక్ ఆధ్వర్యంలో ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్, పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న సమాచారం, వివరాలతో సమగ్ర పరిశీలన నిర్వహించారు. తెలంగాణలోని 32 జిల్లాల్లో కిసాన్ సమ్మాన్ అమలు తీరును పరిశీలించారు. 2018 డిసెంబర్ నుంచి 2021 జూన్ (26వ తేదీ) వరకు కేంద్రం 8 కిస్తీలు (ఇన్స్టాల్మెంట్లు) చెల్లించగా అవి ఏ మేరకు లబ్ధిదారులకు చేరాయన్న అంశాన్ని బేరీజు వేశారు. ఇదీ పీఎం కిసాన్ పథకం... చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఏటా రూ. 6 వేలు (రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో) ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద లబ్ధి పొందేందుకు రిజిస్టర్ అయిన రైతులకు ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్–డీబీటీ) కింద నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం జమ అవుతుంది. ముందుగా రాష్ట్రాల స్థాయిలో ఈ పథకం కింద అర్హులైన రైతులను గుర్తిస్తారు. చెల్లుబాటయ్యే ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాల పరిశీలన అనంతరం నేరుగా ఆ సొమ్మును వారి ఖాతాల్లో జమచేస్తారు. రాష్ట్రంలో అమలు తీరిలా... ►ఈ పథకం మొదలైన నాటి నుంచి 38,40,670 మంది రైతులు రిజిస్టర్ చేసుకోగా వారికి 2.83 కోట్ల ఇన్స్టాల్మెంట్ల ద్వారా రూ. 5,664 కోట్లు లబ్ధి చేకూరాలి. అయితే 37,73,259 మంది రైతులకు 2.65 కోట్ల ఇన్స్టాల్మెంట్ల ద్వారా రూ. 5,311 కోట్లు మాత్రమే అందాయి. ►34.12 లక్షల మంది రైతులకు (88.9 శాతం) అన్ని ఇన్స్టాల్మెంట్లు అందగా 3.6 లక్షల మందికి కనీసం ఒక ఇన్స్టాల్మెంట్ మొత్తమైనా చేరింది. ►67,411 మంది రైతులకు ఒక్క ఇన్స్టాల్మెంట్ మొత్తం కూడా డిపాజిట్ కాలేదు. ►మేడ్చల్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో 80 శాతానికిపైగా రైతులకు అన్ని ఇన్స్టాల్మెంట్లు అందాయి ►వాటిలో నాగర్కర్నూల్, నల్లగొండ, యాదాద్రి, నారాయణ్పేట జిల్లాలు వెనుకబడ్డాయి. ►260 గ్రామాల్లోని 100 శాతం రైతులకు అన్ని ఇన్స్టాల్మెంట్స్ అందాయి. ►339 గ్రామాల 75 శాతం రైతులకు ఈ ఇన్స్టాల్మెంట్స్ చేరాయి ►29 గ్రామాల్లోని 50 నుంచి 100 శాతం రైతులకు ఎలాంటి ఇన్స్టాల్మెంట్ అందలేదు. ►15 గ్రామాల్లోని 100 శాతం రైతులకు ఒక్క ఇన్స్టాల్మెంట్ జమకాలేదు కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ సరిగా లేదు. డిజిటల్ సిస్టమ్లోనూ లోపాలున్నాయి. రైతులకు ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించే ఓపిక బ్యాంకు అధికారులకు ఉండట్లేదు. అన్ని డీబీటీ పథకాల్లోనూ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. రైతులకు అందుతున్న నగదు లబ్ధికి సంబంధించి సెంట్రల్ ఏజెన్సీ వద్ద బ్రాంచీలవారీగా వివరాలు ఉండేలా చర్యలు చేపట్టాలి. – డాక్టర్ డి. నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణుడు పీఎం కిసాన్ పథకం అమల్లో భాగస్వాములైన ఏజెన్సీలు, బ్యాంకులు, సంస్థల్లో జవాబుదారీతనం ఉండట్లేదు. రైతులు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ లేదా మీ–సేవ కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. తెలంగాణలో పీఎం కిసాన్ కింద రైతుల రిజిస్ట్రేషన్కు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని లబ్ధిదారుల సంఖ్యను 38 లక్షల నుంచి 63 లక్షలకు పెంచాలి. – చక్రధర్ బుద్ధా, డైరెక్టర్, లిబ్టెక్ ఇండియా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రాష్ట్రంలో నోడల్ ఆఫీసర్ లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. కొందరు అర్హులకు ఆర్థిక సాయం అందట్లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ఎక్కడ, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియట్లేదు. అందువల్ల కేంద్రం ఈ పథకం అమలుకు రాష్ట్ర స్థాయిలో ఒక అధికారిని నియమించాలి. – రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు -
‘ఆటోమేషన్’ ఆపద..?
కంప్యూటర్లు వచ్చిన తరువాత టైప్ రైటర్లకు పనిలేకుండా పోయింది.. కంప్యూటర్లు కాస్తా తెలివిమీరి.. రోబోలు, డ్రోన్లు, కృత్రిమ మేథలొచ్చేశాయి..ఇవన్నీ పూర్తి వినియోగంలోకి వస్తే... మనిషి చేసేందుకు పనులుండవు.. ఆటోమేషన్ ముప్పు ఇప్పటికైతే సాఫ్ట్వేర్ రంగానికే కావచ్చుకానీ... ఇంకొన్నేళ్లు పోతే.. సాగు, నిర్మాణ, తయారీ రంగాల్లోనూ హవా చెలాయించడం గ్యారెంటీ.. మరి.. ఈ భారీ మార్పునకు భారత్ సిద్ధంగా ఉందా అంటే..ఊహూ.. లేదు అని ఆంటోంది ఆటోడెస్క్! సాక్షి, హైదరాబాద్ : ఐటీ రంగంలో ఆటోమేషన్తో లక్షల ఉద్యోగాలు పోతాయన్న వార్తలు మనకు కొత్త కాదు. కానీ, ఇతర రంగాలపై దీని ప్రభావం ఇప్పుటికిప్పుడే ఉండదని అనుకుంటూ ఉండగా.. అంతర్జాతీయ సాఫ్ట్వేర్ సంస్థ ఆటోడెస్క్ భారత్, చైనాలు సహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జరి పిన ఒక సర్వే ఇందుకు భిన్నమైన అంచనాలను మన ముందుంచింది. రాబోయే ఆటోమేషన్ విప్లవానికి భారత్ సన్నద్ధత అంతంత మాత్రమేనని ఈ అధ్యయనం నిర్వహించిన కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ కూడా చెబుతోంది. వివిధ రంగాల్లో ఆటోమేషన్ ఎలా జరుగుతోంది? భవిష్యత్లో ఉపాధి పరిస్థితి ఏంటి? అనే విషయాలపై 12 ఆసియా పసిఫిక్ దేశాల్లో ఈ సర్వే జరిగింది. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లపై ఆటోమేషన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉండనుందని ఈ అధ్యయనం హెచ్చరించింది. ఆటోమేషన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఐదవ స్థానంలో ఉండగా... సన్నద్ధత విషయంలో తొమ్మిదో స్థానంలో ఉంది. వ్యవసాయం, తయారీ, నిర్మాణం వంటి రంగాల్లోనే దేశ ప్రజల్లో ఎక్కువ మంది ఉపాధి అవకాశాలు పొందుతూ ఉండటం ఇందుకు కారణమన్నది ఈ అధ్యయనం అంచనా. ఈ రంగాల్లో ఆటోమేషన్ వేగం పుంజుకుంటే.. అదేస్థాయిలో ఉపాధి అవకాశాలు పోతాయన్నమాట. ఒకేరకమైన పనిని పదేపదే మనుషులతో చేయించడం కంటే.. రోబోలు, అత్యాధునిక సాఫ్ట్వేర్ల సాయంతో చేపడితే.. నాణ్యత పెరగడంతోపాటు, ఖర్చులు కలిసివస్తాయన్నది కంపెనీల ఆలోచన. వ్యాపార సంస్థల్లోని కనీసం సగం మంది తమ రంగాల్లో ఆటోమేషన్కు సుముఖంగా ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. జాగ్రత్తలు అత్యవసరం.. –ఆటోడెస్క్ రీజినల్ డైరెక్టర్ రాజీవ్ మిట్టల్ ఆటోమేషన్ మోసుకు రాగల సమస్యలను ముందుగానే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. ఆయా రంగాల్లో ఆటోమేషన్కు ఉన్న అవకాశాలపై అవగాహన పెంచడం, కొత్త కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకునేలా శ్రామిక శక్తికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కోవిడ్ కారణంగా పలు రంగాల్లో ఆటోమేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. అదే సమయంలో ఈ ప్రక్రియలు కాస్తా.. కొత్త, అర్థవంతమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఆయా దేశాలు ఈ మార్పునకు ఎంత సిద్ధంగా ఉన్నాయన్న అంశంపై ఆటోమేషన్ ప్రభావం ఆధారపడి ఉంటుంది. డిజిటల్ సాక్షరతను పెంచడం, కూలీలకు కొత్త నైపుణ్యాలను అందించే ప్రయత్నం చేయడం, నైపుణ్యాభివృద్ధికి తగిన మౌలిక సదుపాయాల కల్పన అవసరం. -
ఉచిత నీటికి ‘ఆక్యుపెన్సీ’ గండం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఉచిత నీటి సరఫరా పథకానికి ఆక్యుపెన్సీ ధ్రువీకరణ గండంలా పరిణమింంది. మహానగర శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో వేలాది నివాసాలు 200 చదరపు అడుగుల్లోపే ఉన్నాయి. వీటిలో చాలా భవనాలు 2012 ఏప్రిల్ 7 తర్వాత నిర్మింనవే. కానీ ఈ భవనాలకు విధిగా జీహెచ్ఎంసీ నుంచి జారీచేసిన ఆక్యుపెన్సీ ధ్రువీకరణ సమర్పిస్తేనే నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి సరఫరా పథకం వర్తిస్తుందని మున్సిపల్ పరిపాలన శాఖ తాజాగా వర్గదర్శకాలు జారీచేసింది. కానీ ఆక్యుపెన్సీ జారీచేసే విషయంలో బల్దియా చుక్కలు చూపుతోంది. చాలా మంది వినిÄñæగదారులు ఆక్యుపెన్సీ ధ్రువీకరణ కోసం బల్దియా క్షేత్రస్థాయి కార్యాలయాలకు కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు ధ్రువీకరణ జారీకి ససేమిరా అంటుండడం గమనార్హం. ఇదే సమయమయంలో వినియోగదారులకు డిసెంబరు–2020 నుంచి జూన్–2021 మధ్యకాలానికి జలమండలి నీటి బిల్లులు జారీచేసింది. ఈ బిల్లులు సాధారణ మధ్యతరగతి కుటుంబానికి సుమారు ర.5వేల నుంచి ర.10 వేల మధ్యన ఉన్నాయి. దీంతో వినియోగదారుల గుండె గుభిల్లుమంటోంది. నిబంధనలు సడలించాల్సిందే.. గ్రేటర్ పరిధిలో సుమారు 10.80 లక్షల నల్లాలున్నాయి. వీటిలో సుమారు 8 లక్షల వరకు గృహ వినియోగ నల్లాలు (డొమెస్టిక్) ఉన్నా యి. మరో రెండు లక్షల వరకు మురికివాడల (స్లమ్స్)కు సంబంధించిన నల్లాలున్నాయి. ఇప్పటికే స్లమ్స్ వినియోగదారులకు నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా పథకం అమలవుతోంది. ఇదే తరహాలో డొమెస్టిక్ నల్లాలకు సైతం ఆక్యుపెన్సీ ధ్రువీకరణతో సంబంధం లేకుండా కేవలం నల్లా కనెక్షన్ నెంబరుకు ఆధార్ అనుసంధానం చేసుకోవడం, నల్లాకు నీటిమీటరును ఏర్పాటు చేసుకున్న వెంటనే ఉచిత నీటి పథకానికి అర్హులను చేయాలని వేలాదిమంది శివారు వాసులు డిమాండ్ చేస్తున్నారు. మార్గదర్శకాలు అమలు చేస్తున్నాం.. ఉచిత తాగునీటి పథకం అమలుకు మున్సిపల్ పరిపాలన శాఖ జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేస్తున్నాం. 2012 ఏప్రిల్కు ముందు నిర్మింన భవనాలకు సంబంధిత మున్సిపాలిటీ జారీ చేసిన ఇంటి నిర్మాణ అనుమతులు, నిర్మాణ ప్లాన్ను జలమండలికి సమర్పించాల్సి ఉంటుంది. 2012 ఏప్రిల్ 7 తర్వాత నిర్మింన భవనాలకు ఆక్యుపెన్సీ ధ్రువీకరణ తప్పనిసరి అని మున్సిపల్ పరిపాలనశాఖ స్పష్టంచేసింది. ప్రతి నల్లాకూ నీటి మీటరును ఏర్పాటు చేసుకోవడం, నల్లా కనెక్షన్ నంబరుకు ఆధార్ నంబరును అనుసంధానం చేసుకున్న అనంతరమే ఈ పథకానికి అర్హత పొందుతారు. – ప్రవీణ్కుమార్, జలమండలి రెవెన్యూ విభాగం డైరెక్టర్ -
ఉమ్మడి పాలమూరుజిల్లాలో అన్నదాతల అవస్థలు
-
కరోనా కాలంలో... కంటి సమస్యలు
హైదరాబాద్: మారిన పరిస్థితుల్లో కంప్యూటర్ మనకి మరింత దగ్గర చుట్టం అయిపోయింది. ల్యాప్ టాప్ కావచ్చు, స్మార్ట్ ఫోన్, ట్యాబ్... ఇలా పేరేదైనా మనకు ఆత్మీయ నేస్తాల్లా మారిపోయాయి. స్క్రీన్స్ను తదేకంగా చూస్తుండడం అనేది ఇటీవలి కాలంలో మరింత పెరిగింది. వర్క్ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ స్కూల్స్, ఆన్లైన్ బిజినెస్, జూమ్ మీటింగ్స్, ఓటీటీ సినిమాలూ, ... ఇలా ప్రతీదానికీ స్క్రీన్ వ్యూ సర్వసాధారణంగా మారింది. రోజులో అత్యధిక సమయం కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ గడపడం అనేది అనేక మందిలో తీవ్రమైన కంటి సమస్యలకు దారి తీస్తోంది. అలాగే ఇంటి పట్టున ఉండడం పెరగడంతో నిర్విరామంగా టీవీ చానెళ్లను వీక్షించడం ఎక్కవైంది. దీంతో ఇది కంటి మీద తీవ్రమైన భారంగా మారింది. అప్పటికే కంటి సమస్యలున్నవారు కరోనా అనంతరం మరింత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇలాంటి వారు తాత్కాలిక పరిష్కారాలుగా కళ్లోజోడు, కాంటాక్ట్లెన్స్లు ఎంచుకోవడం కన్నా శాశ్వత పరిష్కారమైన లేజర్ సర్జరీకి ఓటేయడమే మేలంటున్నారు. డా. అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ ఆప్తమాలజిస్ట్, ఆల్పా అతుల్ పూరాబియా, ఈ నేపధ్యంలో సర్జరీలపై ఉన్న అపోహలను భయాలను తొలగించుకోవాలని ఆమె సూచిస్తున్నారు. కాంటాక్ట్ లెన్స్తో డ్రై నెస్... దృష్టి లోపాన్ని సరిదిద్దడానికి కళ్లజోళ్లు, కాంటాక్ట్ లెన్స్లు సులభ పరిష్కారం మాత్రమే, మరోవైపు క్రీడాకారులకు ఇది సరైన పరిష్కారం కాబోదు. స్క్రీన్ వీక్షణం కోసం పరిమితంగా కొన్ని గంటల కాలమే అయినా కాంటాక్ట్ లెన్స్ వినియోగం కూడా కళ్లలో డ్రైనెస్ను పెంచుతోంది. కాబట్టి స్మైల్, లాసిక్, పిఆర్కె వంటి రిఫ్రాక్టివ్ లేజర్ ఐ సర్జరీలు కంటి సంబంధ సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఎవరు చేయించుకోవచ్చు? లాంగ్, షార్ట్ సైట్లకు రిఫ్రాక్టివ్ లేజర్ ఐ సర్జరీ అనేది అత్యంత ఖచ్చితమైన పరిష్కారాల్లో ఒకటి. గత 12 నెలలుగా కళ్లజోడు వాడుతూ ఇతరత్రా ఆరోగ్య సమస్యలేమీ లేకుండా ఉన్న 21 సంవత్సరాలు దాటిన ఎవరైనా ఈ సర్జరీని ఎంచుకోవచ్చు. అయితే బాగా పల్చని కార్నియా ఉన్నా, కార్నియా పైన అపసవ్యతలేవైనా ఉన్నా దీర్ఘకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సర్జరీ చేయించుకోవడానికి వీలు ఉండదు. దీన్ని నిర్ధారించుకోవడానికి ముందుగా కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరం. అలాగే ఈ సర్జరీ విషయంలో కొందరికి పలు రకాల అపోహలు కూడా ఉన్నాయి. ►శస్త్రచికిత్స విధానం బాధాకరంగా ఉంటుందని కొందరు అపోహ పడుతున్నారు. అయితే అది నిజం కాదు. సర్జరీ విషయంలో వైద్యులు తగినన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. నొప్పిని వీలున్నంత తక్కువ స్థాయిలో ఉంచేందుకు కంటి డ్రాప్స్ వంటివి వాడతారు. అలాగే శస్త్ర చికిత్స అనంతరం పూర్తిగా కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని కూడా సందేహిస్తుంటారు. ఇదీ నిజం కాదు. సర్జరీ పూర్తయిన తర్వాత కేవలం 2 నుంచి 6 రోజుల వ్యవధిలోనే సాధారణ జీవితానికి తిరిగి వెళ్లవచ్చు. ►శాశ్వత దృష్టిలోపానికి దారి తీసే ప్రమాదం ఉందని మరికొందరి అపోహ. అయితే కంటిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఏర్పడితే తప్ప ఈ సర్జరీ కారణంగా శాశ్వత దృష్టి లోపం కలగడం జరగదు. ఇది చాలా అరుదైన విషయం. స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పటికీ అవన్నీ సులభంగా పరిష్కరించుకోగలిగినవే. ►సర్జరీ అయిన తర్వాత రెగ్యులర్ ఐ చెకప్స్ అక్కరలేదనేది కూడా అపోహే. లేజర్ కంటి శస్త్ర చికిత్స అనేది జీవితకాలం కంటి ఆరోగ్యానికి హామీ కాదు. వయసుతో పాటు వచ్చే మార్పుల ప్రభావం కంటి ఆరోగ్యం మీద ఉండొచ్చు. కాబట్టి సర్జరీ తర్వాత కూడా క్రమబద్ధమైన పద్ధతిలో కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరమే. ►సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా ఉంటాయని కొందరు భయపడుతుంటారు. స్వల్పంగా అసౌకర్యం అనిపించడం సహజమే.అయితే వీటిని పెయిన్ కిల్లర్స్ ద్వారా సులభంగా చికిత్స చేయవచ్చు. అలాగే కళ్లు పొడిబాచటం కూడా మరో సైడ్ ఎఫెక్ట్. చాలా మంది పేషెంట్స్ సర్జరీ అయిన కొన్ని వారాల్లోనే అన్నింటి నుంచి విజయవంతంగా కోలుకుంటారు. ఆటలు క్రీడల్లో రాణించాలనుకున్నవారికి ఇది చక్కని ఉపయుక్తం. –డా. ఆల్పా అతుల్ పూరాబియా, ఆప్తమాలజిస్ట్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, హైదరాబాద్. చదవండి: నిద్ర రావడం కోసం అద్భుత చిట్కాలు -
టీకా స్లాట్ బుక్ చేసినా.. తిప్పలు తప్పట్లేదు
సాక్షి,కుత్బుల్లాపూర్( హైదరాబాద్) : నానా పాట్లు పడి స్లాట్ బుక్ చేసుకుని వ్యాక్సిన్ సెంటర్లకు వెళ్తే అక్కడ గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఒక సెంటర్లో వ్యాక్సిన్ వేయించుకొనేందుకు స్లాట్ తీసుకొని వెళ్తే, అక్కడ టోకెన్లు ఇచ్చి తర్వాత లోపలికి పంపిస్తున్నారు. మరో సెంటర్ వద్ద స్లాట్లోని టైమింగ్తో సంబంధం లేకుండా క్యూలో నిలబడాలని చెప్తున్నారు. దీంతో వ్యాక్సిన్ కోసం వచ్చినవారు నానా అవస్థలు పడుతున్నారు. ► వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో టీకా కోసం వచి్చన వారు తమ వంతు వచ్చేంత వరకు చెట్లనీడలో, సమీపంలోని దుకాణాల మెట్లపై, ఎండలోనూ ఉసూరుమంటూ వేచి ఉండాల్సి వస్తోంది. ► ఒక షాపూర్నగర్ సెంటర్లో టెంట్ వేసినప్పటికీ అది సరిపోకపోవడంతో వచి్చనవారు ఎండలు నిరీక్షించాల్సి వస్తోంది. ► ఆరోగ్య కేంద్రం వద్ద చెట్టు కింద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ► గాజులరామారం సెంటర్ వద్ద లోపలికి వెళ్లడానికి జనం పోటీ పడుతుండటంతో ఒక్కొక్కరిని సిబ్బంది లోపలికి పంపిస్తున్నారు. కష్టాలు తప్పడం లేదు నేను మా అమ్మకు వ్యాక్సిన్ వేయించడానికి ప్రైవేట్ హాస్పిటల్లో స్లాట్ బుక్ చేశా. అది క్యాన్సిల్ అయిందని మెసేజ్ రావడంతో మళ్లీ స్లాట్ బుక్ చేసుకుంటే కుత్బుల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దొరికింది. తీరా ఇక్కడి వస్తే.. టోకెన్లను తీసుకోవాలని చెప్పారు. దీంతో టోకెన్ల కోసం పోటీ పడాల్సి వస్తోంది. స్లాట్ దొరకటం ఒక ఎత్తయితే, ఇక్కడ టోకెన్ పొంది లోపలికి వెళ్లడం మరో ప్రయాసగా మారుతోంది. కూర్చోవడానికి సదుపాయం లేకపోవడంతో వ్యాక్సిన్ కోసం గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ఈ చెట్ల కింద కుర్చీలు ఏర్పాటు చేస్తే పెద్దవారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ విషయమై అధికారులు ఆలోచించాలని కోరుతున్నా. – నన్ను, న్యూవివేకానంద్నగర్ ( చదవండి: కరోనా: మాత్రలు వద్దు.. పౌష్టికాహారమే ముద్దు ) -
ఆందోళనలో నిజామాబాద్ జిల్లా రైతులు
-
ఆసుపత్రిలో బెడ్లు లేక కరోనా రోగుల అగచాట్లు
-
బ్యాంకుల విలీనంతో ఖాతాదారుల పరిస్థితి అంతేనా..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల విలీన పరిణామాలతో కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొత్త మార్పుల కారణంగా గతంలో ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కులు బౌన్సయితే చార్జీల భారం పడటం, డివిడెండ్ చెల్లింపులను సక్రమంగా అందకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద బ్యాంకుల్లో విలీనమైన చిన్న బ్యాంకుల కస్టమర్లే ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాత ఎంఐసీఆర్ చెక్కుల స్థానంలో కొత్త వాటిని జారీ చేసేందుకు, డివిడెండ్లు మొదలైనవి చెల్లించాల్సిన సంస్థలకు కొత్తగా మారిన ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలను అందించేందుకు మరింత సమయం పట్టేయనున్నందున విలీన అమలు ప్రక్రియ డెడ్లైన్ను మరింతగా పొడిగించాలని కోరుతున్నారు. వాస్తవానికి ఇది మార్చి 31తో ముగిసింది. అకౌంట్ల అనుసంధానంలో సమస్యలు.. ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) నాలుగు పీఎస్బీల్లో విలీనం చేసిన ఉత్తర్వులు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంకుల సిస్టమ్స్ మొదలైన వాటి అనుసంధానం, కొత్త ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టం కోడ్ (ఐఎఫ్ఎస్సీ)ని అమల్లోకి తేవడం వంటి అంశాలకు మార్చి 31 డెడ్లైన్గా ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, అకౌంట్ల అనుసంధానం మొదలుకుని ఇతరత్రా పలు సమస్యలు ఇంకా ఉంటున్నాయని కస్టమర్లు, పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా పెద్ద బ్యాంకుల్లో విలీనమైన చిన్న బ్యాంకుల కస్టమర్లలో చాలా మందికి ఏవో కంపెనీల్లో షేర్లో లేదా బాండ్లలో పెట్టుబడులో ఉండే అవకాశముంది. వాటి మీద డివిడెండ్లు, ఇతరత్రా చెల్లింపులు మొదలుకుని ఐటీ రీఫండ్లు కూడా రావాల్సి ఉండొచ్చు. అయితే, ఐఎఫ్ఎస్సీ కోడ్ మారిపోవడం తదితర పరిణామాల వల్ల ఇలాంటివి పొందడం సమస్యగా మారే అవకాశం ఉంటోంది. పోనీ అలాగని కొత్త మార్పుల గురించి ఆయా సంస్థలకు తెలియజేయాలన్నా చాలా సమయం పట్టేయొచ్చు. ఈ నేపథ్యంలోనే డెడ్లైన్ను మూడు నెలల పాటు పొడిగించాలని కస్టమర్లు కోరుతున్నారు. ఇక కొత్త మార్పులకు అలవాటు పడేందుకు కూడా ఖాతాదారులకు ఇబ్బందిగా ఉంటోంది. ఉదాహరణకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో విలీనమైన యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఓ కస్టమరు విషయం తీసుకుంటే.. దాదాపు అన్ని లావాదేవీలకు గతంలో ఈ–యూబీఐ యాప్ ఉపయోగించేవారు. కానీ విలీనం తర్వాత ప్రస్తుతం కొత్త యాప్ను వినియోగించడం చాలా మటుకు తగ్గించేశారు. యాప్ చాలా సంక్లిష్టంగానే కాకుండా నెమ్మదిగా లోడ్ అవుతుండటం కూడా ఇందుకు కారణమని వివరించారు. ఇక తండ్రి మరణానంతరం ఆయనకు చెందిన సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంటు నుంచి నగదు విత్డ్రా చేసుకోవడానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయడానికి దాదాపు నెల రోజులు పైగా పట్టేసిందని మరో యూబీఐ ఖాతాదారు వాపోయారు. ఇలాంటి సాంకేతిక సమస్యలతో విలీన బ్యాంకుల కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. విలీనం ఇలా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనమయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను విలీనం చేశారు. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు విలీనమయ్యాయి. చదవండి: రిటైల్ రుణాలు.. రయ్రయ్! -
చలికాలంలో చుండ్రు: అపోహలు-వాస్తవాలు
చలికాలం వచ్చిందంటే కొన్ని సమస్యలు మరింత తీవ్రంగా పరిణమిస్తాయి. అందులో ప్రధానంగా చర్మసమస్యలు ఒకింత ఎక్కువవుతాయి. అలాంటివాటిల్లో చుండ్రు ఒకటి. అటు జుట్టులోనూ, ఇటు మాడుపైనా మాటిమాటికీ దురద పుట్టిస్తూ, నలుగురితో ఇబ్బంది కలిగిస్తుందీ సమస్య. అన్ని కాలాల్లో కంటే ఈ సీజన్లో ఎక్కువయ్యే ఈ చుండ్రుకు కారణాలేమిటో, దాన్ని నివారించడం ఎలాగో తెలుసుకుందాం. కొందరు తలదువ్వుకోగానే దువ్వెనలో తెల్లటి పొలుసులు రాలుతాయి. మరికొందరిలో ఇవే పొలుసులు షర్ట్పై పడి అసహ్యంగా కనిపిస్తుంటాయి. ఇలా కనిపించడానికి కారణమేమిటో చూద్దాం. చర్మంలో ఎపిడెర్మిస్, డెర్మిస్ అనే రెండు పొరలు ఉంటాయి. పైన ఎపిడెర్మిస్, కింది డెర్మిస్ అనే పొరలుంటే అందులోని డెర్మిస్లోకి హెయిర్ ఫాలికిల్స్ అనే రోమాంకురాల్లోంచి వెంట్రుకలు పుట్టుకువస్తాయి. వీటి పక్కనే సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఈ గ్రం«థులు సీబమ్ అనే నూనెలాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. ఇది వెంట్రుకలను ఆరోగ్యంగానూ, నిగారింపుతో కూడిన మెరుపును కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఈ సీబమ్ ఉత్పత్తి కొంతమందిలో సాధారణంగా ఉంటే, మరికొందరి లో చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల తలపైన ఉండే చర్మం ఒకింత జిడ్డుగా మారుతుంది. ఈ జిడ్డుపై మెలస్సీజియా అనే ఒక తరహా ఫంగస్ పెరుగుతుంది. సాధారణం గా ఈ ఫంగస్ కూడా అందరిలోనూ ఉంటుంది. కాకపోతే జిడ్డు చర్మం ఉన్నవారిలో ఈ ఫంగస్ అధికంగా పెరిగి... చర్మకణాలపై దాడి చేసి, కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ రసాయనాలతో చర్మం ఉపరితలంపైన మృతకణాలు పెరుగుతాయి. దాంతో తలలో పొట్టులా రాలే పొలుసులూ... వాటి కారణంగా దురద, చికాకు పెరుగుతాయి. దురద కారణంగా గోళ్లతో తలను గీరుకోగానే అక్కడ పేరుకున్న మృతకణాలు రాలిపడటం జరుగుతుంది. ఇలా రాలిపడే మృతకణాలనే మనం చుండ్రు అంటుంటాం. తీవ్రతను బట్టి ఒక్కోసారి ఈ చుండ్రు మాడుపైనేగాక కనుబొమలు, కనురెప్పలు, ముక్కుకు ఇరువైపులా, బాçహుమూలాల్లోనూ కనిపించవచ్చు. చలికాలంలో తీవ్రత ఎక్కువ... ఎందుకంటే? చలికాలం వాతావరణంలో తేమ తగ్గుతుంది. దాంతో చర్మం పొడిబారుతుంది. అందుకే చర్మంపై కొద్దిగా గీరగానే తెల్లటి చారికలు కూడా కనిపిస్తుంటాయి. ఇలా తేమ తగ్గిడం వల్ల మృతకణాలు పొడి పొడిగా రాలిపడుతుండటం చాలామందిలో చూడవచ్చు. చండ్రుకు కారణాలు చుండ్రు వచ్చేందుకు అనేక కారణాలు దోహదపడతాయి. చుండ్రు తీవ్రంగా ఉండే కండిషన్ను సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. సెబోరిక్ డర్మటైటిస్ ఈ కింది సమస్యలున్నవాళ్లలో తీవ్రంగా ఉండవచ్చు. అంటే... పోషకాహార లోపం, రోగనిరోధక శక్తి తగ్గడం, మలబద్దకం, వైరస్లతో వ్యాపించే అంటువ్యాధుల ఇన్ఫెక్షన్ తర్వాత, సెబోరిక్ ఎగ్జిమా, మానసిక ఒత్తిడులు, తీవ్రమైన అలసట, వ్యక్తిగత శుభ్రత లోపించడం, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, హెయిర్ స్టైల్స్ కోసం వాడే స్ప్రేలు... ఇలా రకరకాల కారణాల వల్ల చుండ్రు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పార్కిన్సన్స్ లాంటి నరాలకు సంబంధించిన సమస్యలున్నప్పుడూ చుండ్రు వచ్చే అవకాశాలున్నాయి. లక్షణాలు చుండ్రును గుర్తించడం చాలా తేలిక. మాడు విపరీతమైన దురదగా ఉంటుంది. దాంతో గోళ్లతో గీరగానే తెల్లటి పొట్టులాంటి పదార్థం గోళ్లలోకి వస్తుంది. భుజాలమీద, దుస్తుల మీదా కనిపిస్తూ ఉంటుంది. నివారణ ఆహారపరంగా: చుంద్రును నివారించడానికి ఆహారపరమైన జాగ్రత్తల విషయానికి వస్తే... ఈ సీజన్లో సాధారణంగానే మనం తక్కువగా నీళ్లు తాగుతుంటాం. దేహంలో నీటిపాళ్లు తగ్గకుండా ఉండేందుకు చల్లటి సీజన్లో మనమే పనిగట్టుకుని కనీసం రోజూ 12 గ్లాసుల నీళ్లు తాగాలి. అలాగే అన్ని రకాల పోషకాలు ఉన్న సమతులాహారం తినాలి. ఆహారం లో తాజా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి. రోజూ తాజా పండ్లు కూడా ఎక్కువగానే తీసుకోవాలి. వీటిలోని పోషకాలు చుండ్రుకు కారణమయ్యే ఫంగస్ని నివారించడంలో తోడ్పడతాయి. చర్మం, మాడును ఆరోగ్యంగా ఉంచడం ద్వారా చుండ్రును స్వాభావికంగా నివారించేందుకు ఉపయోగపడతాయి. తీసుకోకూడని పదార్థాలు చుండ్రు సమస్య ఉన్నవారు మాంసం, పంచదార, మైదా, స్ట్రాంగ్ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మేలు. తీసుకోవాల్సి వస్తే చాలా పరిమితంగా మాత్రమే వాటిని తీసుకోవాలి. దువ్వెన విషయంలో జాగ్రత్తలు జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ ఎక్కువగా ఉండేలా చూడటం ద్వారా కూడా మృతకణాల తీవ్రతను తగ్గించవచ్చు. ఇందుకోసం వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో జుట్టును పాయలుగా విడదీస్తూ, కుదుళ్ల దగ్గర నుంచి చివర్ల వరకు దువ్వాలి. దీనివల్ల రోమాంకురాలకు మాలిష్ అందడంతో అక్కడ రక్తప్రసరణ పెరుగుతుంది. పైగా ఇలా దువ్వుతూ ఉండటం వల్ల తలలో దుమ్ము, చుండ్రు ఎప్పటికప్పుడు రాలిపోతుంది. దీంతోపాటు వాతావరణంలో ఉండే కాలుష్యాలూ, పొగ వంటివి జుట్టును తాకకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవడం మంచిది. కొంతమంది హెల్మెట్ పెట్టుకోవడం వల్ల, జుట్టులో చెమట పెరిగి చుండ్రు సమస్య ఎక్కువవుతుందని అపోహ పడుతుంటారు. నిజానికి హెల్మెట్ కారణంగా వాతావరణంలోని కాలుష్యం... ఇతర కాలుష్యకారకాలు జుట్టును అంటకపోవడం వల్ల చుండ్రు సమస్య ఒకింత తగ్గుతుందనే చెప్పవచ్చు. షాంపూలతో... చుండ్రును అరికట్టేందుకు అంటూ మార్కెట్లో రకరకాల యాంటీ డాండ్రఫ్ షాంపూలు దొరుకుతున్నాయి. అందులో జింక్ పైరిత్రిన్, సెలీనియమ్ సల్ఫేడ్, కోల్తార్, కెటోకొనజోల్... లాంటి యాంటీడాండ్రఫ్ షాంపూల్లో ఏదైనా వాడుకోవచ్చు. షాంపూ లేబుల్స్పై ఉన్న నిబంధనలను పాటించడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఇలాంటి మెడికేటెడ్ షాంపూలు వాడేటప్పుడు... ముందుగా ఒకసారి డాక్టర్ను సంప్రదించి వాడటం మంచిదే. లేదా నాలుగు వారాల పాటు ఒక షాంపును వాడినప్పటికీ తగ్గకపోతే మరో షాంపూని మార్చి చూడాలి. వీటి వల్లా తగ్గకపోతే మైల్డ్ కార్టికో స్టిరాయిడ్స్ లోషన్స్ని మాడుకు రాసుకుని, కడిగేయాలి. ఏ షాంపూ అయినా అరచేతిలోకి తగినంతగా తీసుకుని, అందులో ఒకింత నీటిలో కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఆ తర్వాత తలంతా రుద్దుతూ శుభ్రపరుచుకోవాలి. చుండ్రు ఉన్నవారు తప్పనిసరిగా రోజూ యాంటీ డాంఢ్రఫ్ షాంపూతో తలస్నానం చేయాలి. కేశాలు పొడిబారుతున్నాయి అనుకునేవారు స్నానం చేయడానికి అరగంట ముందు గోరువెచ్చని నూనెతో మర్ధనా చేసుకోవాలి. అరచేతిలోకి షాంపూను వేసుకున్న తర్వాత దాన్ని నేరుగా జుట్టుకు రాయడం కంటే ఒకింత నీరు కలిపాక అది జుట్టులోకి మరింతగా విస్తరిస్తుందని గుర్తుపెట్టుకోండి. చుండ్రు నివారణకు మరికొన్ని చిట్కాలు ఈ సీజన్లో చలి కారణంగా కొందరు తలస్నానానికి బాగా వేడిగా ఉన్న నీళ్లనే వాడుతుంటారు. దీంతో మాడుపై చర్మం మరింత పొడిబారి చుండ్రు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకోసం తలస్నానానికి గోరువెచ్చని నీళ్లే వాడటం మేలు. డాక్టర్ని ఎప్పుడు కలవాలి? ఇక్కడ పేర్కొన్న చిట్కాలు పాటిస్తూ, యాంటీడాండ్రఫ్ షాంపూలు వాడాక కూడా చుండ్రు తీవ్రత తగ్గకపోయినా, మాడుపై చర్మం ఎర్రగా మారినా, అది పెచ్చులు పెచ్చులుగా ఎక్కువగా ఊడుతున్నా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. వ్యక్తి వయసు, వారి ఇతర ఆరోగ్య సమస్యలను వైద్యులు పరిగణనలోకి తీసుకుని డాండ్రఫ్ తీవ్రత ఎంతగా ఉందో గుర్తించి, తగిన చికిత్స చేస్తారు. అపోహలు – వాస్తవాలు అపోహ: అన్ని కాలాల్లోనూ విసిగిస్తుంది. వాస్తవం: అన్ని కాలాలలో కంటే... చలికాలంలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అపోహ: చుండ్రు వల్ల ఎక్కువ జుట్టు రాలుతుంది. వాస్తవం: జుట్టు రాలడానికి కారణం చుండ్రే అన్నది చాలామంది అపోహ. నిజానికి హెయిర్ ఫాల్ వేరు, చుండ్రు వేరు. సాధారణ చుండ్రు వల్ల జుట్టు రాలదు. ఫంగస్ వల్ల చుండ్రు ఎక్కువయితే కొద్దిగా జుట్టు రాలవచ్చు. అయితే చుండ్రు ఉందని మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటే సమస్య మరింతగా పెరగవచ్చు. అపోహ: చుండ్రు ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఉదా: దువ్వెనలు, దుస్తులు ఒకరివి ఒకరు వాడుకోవడం మూలంగా వాస్తవం: అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. (అయితే ఇతరుల దువ్వెన వాడకపోవడమే మేలు. ఒకవేళ వాడాల్సి వస్తే అది వాడేటప్పుడు శుభ్రత తప్పనిసరి). అపోహ: పిల్లల్లోనూ చుండ్రు ఉంటుంది. వాస్తవం: చాలా వరకు పిల్లల్లో చుండ్రు సమస్య ఉండదు. (ఏడాది లోపు పిల్లల్లో ఉండే చుండ్రును క్రెడిల్ క్రాప్ అంటారు. ఆ తర్వాత తగ్గిపోతుంది) -డాక్టర్ స్వప్నప్రియ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ -
విషాదం: ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, బల్మూర్(అచ్చంపేట): పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మనస్థాపానికి గురైన ఓ ప్రేమజంట కలిసి బతకకపోయినా.. కలిసి తనవు చాలించాలని నిర్ణయించుకొని ఉరేసుకొని మృతిచెందారు. ఈ సంఘటన నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం బిల్లకల్ అటవీ ప్రాంతంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు.. బిల్లకల్కు చెందిన రాయ అఖిల(19), చెంచుగూడెంకు చెందిన అనిల్(19) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురి కుటుంబాల పెద్దలకు తెలియటంతో పెళ్లికి నిరాకరించి మందలించారు. దీంతో కలిసి చావాలని నిర్ణయించుకొని సోమవారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని రుసుల చెరువు అటవీశాఖ బేస్ క్యాంప్ వద్దకు బైక్పై వెళ్లారు. క్యాంప్ వెనుక భాగంలో ఉన్న చెట్టుకు చున్నీతో ఇద్దరూ ఉరేసుకుని మృతిచెందారు. అటుగా వెళ్లిన మేకల కాపరులు గుర్తించి ఇరువురి కుటుంబ»సభ్యులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనలో రెండు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. ఎంపీపీ అరుణ, సర్పంచ్ అంజనమ్మ బాధిత కుటుంబాలను పరామర్శించారు. పోక్సో కేసు నమోదు గోపాల్పేట: మండలంలోని తాడిపర్తికి చెందిన సురేశ్పై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామగౌడ్ తెలిపారు. గ్రామానికి చెందిన ఓ యువతిని సురేశ్ ప్రేమించి ఆరునెలల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వరకట్నం తీసుకురావాలని సురేశ్తో పాటు వారి కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేస్తున్నారని.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వివరించారు. యువకుడి బలవన్మరణం పెబ్బేరు(కొత్తకోట): మండలంలోని తోమాలపల్లిలో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఏఎస్ఐ జయన్న కథనం మేరకు.. గ్రామానికి చెందిన గుడిసె వెంకటేష్ (25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు టవల్తో ఉరేసుకుని మృతిచెందాడు. పారిశుద్ధ్య పనులకు వెళ్లిన తల్లి ఇంద్రమ్మ ఇంటికి వచ్చి తలుపు తెరిచి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. అయిదు నెలల క్రితమే వివాహమైందని.. తరచూ భార్యాభర్తలిద్దరూ గొడవ పడుతుండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి ఇంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని ఏఎస్ఐ వివరించారు. -
సాక్షి ఎఫెక్ట్: కొండలెక్కిన పీఓ..
సాలూరు: ఆయనో జిల్లా స్థాయి అధికారి.. ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకోవాలనే ఉత్సాహంతో కొండ కోనల్లో పర్యటించారు. కిలోమీటర్ల కొద్దీ నడిచి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. గిరిజనుల ఇబ్బందులపై ఈ నెల 25న ‘అరణ్య రోదన’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఐటీడీఏ పీఓ కూర్మనాథ్, ఇతర అధికారులు స్పందించారు. కొదమ పంచాయతీ పర్యటనకు బయలుదేరిన అధికారులు చింతామల జంక్షన్ వరకు చేరుకున్నారు. గ్రామస్తులు చందాలు పోగుచేసుకుని నిర్మించుకున్న రోడ్డు చినుకులకు బురదమయంగా మారడంతో వాహనాలు ముందుకెళ్లలేదు. దీంతో పీఓ కూర్మనాథ్, తదితరులు సుమారు మూడు కిలోమీటర్లు నడిచి చింతామల.. మరలా వెనుకకు వచ్చి బల్ల జంక్షన్ నుంచి మరో 5 కిలోమీటర్లు నడుచుకుని కొదమ పంచాయతీ గ్రామానికి చేరుకున్నారు. చింతామల, కొదమ గ్రామాలలో ప్రజలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. అయితే గిరిజనులకు తెలుగు అంతగా రాకపోవడంతో స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు చోడిపల్లి బీసు ప్రజల మాటలను అధికారులకు.. అధికారుల వివరణను ప్రజలకు తర్జుమా చేసి చెప్పారు. రోడ్లు, తాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు పాఠశాల, అంగన్వాడీ భవనాలు, చెక్డ్యామ్లు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు. దీనికి పీఓ స్పందిస్తూ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర సూచనల మేరకు ఇక్కడి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా నంద నుంచి చింతామలకు రోడ్డు మంజూరైందని.. అయితే ఈ నిర్మాణం ఎందుకు పూర్తికాలేదో కారణాలు తెలుసుకుని పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. గిరిజన గ్రామాల్లో రహదారులు, వైద్యం, విద్యలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. చందాలతో వేసుకున్న చింతామల రోడ్డుకు సంబంధించి వారం రోజుల్లో ఉపాధి హామీ పథకం ద్వారా బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వచ్చే నెల 1వ తేదీన ప్రభుత్వ రేషన్ బియ్యం ఈ రెండు గ్రామాల్లో పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అటవీశాఖ అడ్డంకుల వల్ల గిరిశిఖర గ్రామాల్లో రహదారుల నిర్మాణం ముందుకు సాగడం లేదని, అధికారులు దీనిపై దృష్టి సారించాలని వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి దండి శ్రీనువాసరావు కోరారు. గిరిజనులతో సహపంక్తి భోజనం.. కొదమలో స్థానిక గిరిజన నాయకులు ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనంలో పీఓ కూర్మనాథ్, తదితరులు పాల్గొన్నారు. పీఓ తన వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను అక్కడి చిన్నారులు, మహిళలకు అందించారు. అలాగే ప్రజాచైతన్య వేదిక కన్వీనర్ కూనిశెట్టి అప్పలనాయుడు సమకూర్చిన రూ. 25 వేల నగదును యువతకు అందజేశారు. ఈ పర్యటనలో పీఓ కూర్మనాథ్ తన కుమారుడిని తీసుకువచ్చి గిరిజనుల ఆహార వ్యవహారాలు, కష్టసుఖాలను వివరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ కిరణ్కుమార్, డ్వామా పీడీ నాగేశ్వరరావు, తహసీల్దార్ ఇబ్రహీం, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
మగవారికి క్రాఫ్ కష్టాలు..
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్తో సెలూన్లు మూతపడ్డాయి. అసలే ఎండాకాలం..ఆపై జుట్టు పెరిగి పోవడంతో మగవారు ఉక్కపోతతో భరించలేకపోతున్నారు. బయటకెళ్లి క్రాఫ్ చేయించుకుందామంటే దాదాపు నెలన్నరగా షాపులన్నీ క్లోజ్. అ లాగే ఉంచుకుందామంటే చికాకు. దీంతో కొందరు తమ ఇంటి వద్దే క్రాఫ్ చేసుకుంటుంటే మరికొందరు సెలూన్ షాపు వాళ్లను ఫోన్లలో ఇళ్లకు రమ్మని చెబుతున్నారు. కాగా, కొందరు సెలూన్ షాపు యజమానులు లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఒకేసారి ఐదారుగురిని లోపల కూర్చోబెట్టి షాపులకు తాళం వేసి కస్టమర్లకు క్రాఫ్ వేస్తున్నారు. వాడిన కత్తెర, దువ్వెన్లను అందరికీ వాడుతున్నారు. వాటిని కొద్దిపాటినీళ్లతో కడిగి వదిలేస్తున్నారు. ఎలాంటి శానిటైజర్, చేతులకు గ్లౌజులు వాడకుండా క్రాఫ్ చేసేస్తున్నారు. ఇలా రోజుకు 10 నుంచి 15 మంది క్రాఫ్ చేస్తున్నారు. కరోనా విజృంభణ సయమంలో జాగ్రత్తలు తీసుకోకుంటే ముప్పు వాటిల్లే ప్రమాదముంది. -
పాప ఎప్పుడూ ఏడుస్తూనే ఉంది...
మా పాపకు రెండున్నర నెలలు. ఈ మధ్య ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటోంది. డాక్టర్గారికి చూపిస్తే ‘ఈ వయసు పిల్లల్లో కడుపు నొప్పి వస్తుంటుంది, ఆందోళన చెందాల్సిన అవసరంలేదు’ అంటూ కొన్ని మందులు రాశారు. మందులు వాడినప్పుడు కొద్దిరోజులు తగ్గినా ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. దయచేసి మా పాప సమస్యకు పరిష్కారం సూచించండి. పిల్లలు అదేపనిగా ఏడవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎలాంటి ప్రమాదమూ లేని చిన్న సమస్య మొదలుకొని, చాలా ప్రమాదకరమైన సమస్య వరకూ అన్నింటినీ వారు ఏడుపు ద్వారానే తెలియజేస్తారు. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. అదేపనిగా ఏడ్వటానికి కొన్ని కారణాలివి... ఆకలేయడం, దాహంవేయడం, భయపడటం, మూత్ర విసర్జన కారణంగా డయపర్ తడి కావడం, బయటి వాతావరణం మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండి వారికి అసౌకర్యంగా ఉండటం, భయపెట్టే పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడం (ఇలాంటివి ఏవైనా సెలబ్రేషన్ సందర్భంగా బాణాసంచా కాలుస్తున్నప్పుడు పిల్లలు ఉలిక్కిపడి ఏడ్వటం చాలా సాధారణం), వారున్న గదిలో కాంతి మరీ ఎక్కువగా ఉండటం, వారున్నచోట పొగ కమ్ముకుపోయి ఊపిరి తీసుకోడానికి ఇబ్బందిగా ఉండటం. వారికి ఏవైనా నొప్పులు ఉండటం, దంతాలు వస్తుండటం, ఇన్ఫెక్షన్లు రావటం, కడుపు నొప్పి (ఇన్ఫ్యాంటైల్ కోలిక్), జ్వరం, జలుబు, చెవినొప్పి, మెదడువాపు జ్వరం, గుండె సమస్యలు, కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలను అన్నింటినీ పిల్లలు ఏడుపు ద్వారానే కమ్యూనికేట్ చేస్తారు. ఒకటి నుంచి ఆర్నెల్ల వయసులో ఉన్న పిల్లలు అదేపనిగా ఏడుస్తున్నారంటే దానికి కారణం ముఖ్యంగా కడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు వంటి సమస్యలు ఉండటం. మీ పాప విషయంలోనూ ఏడుపునకు మీ డాక్టర్గారు చెప్పినట్లుగా బహుశా కడుపునొప్పి (ఇన్ఫెన్టైల్ కోలిక్) కారణం కావచ్చని అనిపిస్తోంది. ఈ సమస్య సాధారణంగా ఆరువారాల నుంచి మూడు నెలలలోపు పిల్లల్లో వస్తుంటుంది. ఈ వయసు పిల్లలు ఎక్కువగా కడుపునొప్పితో ఏడుస్తుండటం తరచూ చూస్తుంటాం. ఇది ముఖ్యంగా పేగులకు సంబంధించిన నొప్పి. ఇలాంటి పిల్లల్లో ఏడుపునకు నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినప్పటికీ... ఆకలి, గాలి ఎక్కువగా మింగడం, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు. ఇటువంటి పిల్లలను సరిగా ఎత్తుకోవడం (అప్ రైట్ పొజీషన్), లేదా కొద్దిసేపటికోసం వాళ్ల పొట్టమీద వాళ్లను పడుకోబెట్టడం (ప్రోన్ పొజిషన్), తేన్పు వచ్చేలా చేయడం (ఎఫెక్టివ్ బర్పింగ్)తో ఏడుపు మాన్పవచ్చు. కొందరికి యాంటీస్పాస్మోడిక్తో పాటు మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనే రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే తప్పకుండా మీ పిల్లల డాక్టర్కు చూపించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం. పాప ఒంటిమీద ఈ మచ్చలేమిటి? మా పాపకు 13 ఏళ్లు. దాదాపు ఆర్నెల్లుగా ఆమె ఒంటిమీద, ముఖం మీద చాలా మచ్చలు వస్తున్నాయి. ఈ మచ్చలు రావడానికి కారణం ఏమిటి? అవి పోవడానికి ఏం చేయాలి? మీ పాపకు ఉన్న కండిషన్ నీవస్ అంటారు. దీన్ని వైద్యపరిభాషలో మల్టిపుల్ నీవస్ అనీ, సాధారణ పరిభాషలో చర్మంపై రంగుమచ్చలు (కలర్డ్ స్పాట్స్ ఆన్ ద స్కిన్) అంటారు. ఇవి రెండు రకాలు. మొదటిది అపాయకరం కానివి. ఇవి చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. రెండోది హానికరంగా మారే మెలిగ్నెంట్ మచ్చలు. ఒంటిపై మచ్చలు పుట్టకతోనే రావచ్చు. మధ్యలో వచ్చే మచ్చలు 10 నుంచి 30 ఏళ్ల మధ్య రావచ్చు. నీవస్ చర్మానికి రంగునిచ్చే కణాల వల్ల వస్తుంది. ఇది శరీరంలో ఎక్కడైనా (అరచేతుల్లో, అరికాళ్లలో, ఆఖరుకు గోళ్లమీద కూడా) రావచ్చు. సూర్యకాంతికి ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం, కుటుంబ చరిత్రలో ఇలాంటి మచ్చలున్న సందర్భాల్లో ఇది వచ్చేందుకు అవకాశం ఎక్కువ. కొన్ని సందర్భాల్లో నీవాయిడ్ బేసల్ సెల్ కార్సినోమా అనే కండిషన్ కూడా రావచ్చు. ఇది పుట్టుకనుంచి ఉండటంతో పాటు, యుక్తవయస్సు వారిలోనూ కనిపిస్తుంది. వారికి ఈ మచ్చలతో పాటు జన్యుపరమైన అబ్నార్మాలిటీస్ చూస్తుంటాం. అలాంటి వాళ్లకు ముఖం ఆకృతి, పళ్లు, చేతులు, మెదడుకు సంబంధించిన లోపాలు కనిపిస్తాయి. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి పైన చెప్పిన అపాయకరమైన పరిస్థితులేమీ మీ పాపకు లేనట్లుగా తెలుస్తోంది. కాబట్టి మీ పాపది హానికరం కాని సాధారణ నీవస్ కావచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. క్యాన్సర్గా మారే అవకాశం కూడా చాలా తక్కువ. అయితే... కొన్ని నీవస్లు క్రమంగా క్యాన్సర్ లక్షణాలను సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒంటిపై మీ పాపలా మచ్చలు ఉన్నవారు రెగ్యులర్గా డెర్మటాలజిస్ట్లతో ఫాలో అప్లో ఉండటం మంచిది. అది ఎలాంటి మచ్చ అయినా... ఏ, బీ, సీ, డీ అన్న నాలుగు అంశాలు గమనిస్తూ ఉండటం మంచిది. ఏ– అంటే ఎసిమెట్రీ... అంటే పుట్టుమచ్చ సౌష్టవంలో ఏదైనా మార్పు ఉందా?, బీ– అంటే బార్డర్... అంటే పుట్టుమచ్చ అంచుల్లో ఏదైనా మార్పు ఉందా లేక అది ఉబ్బెత్తుగా మారుతోందా?, సీ– అంటే కలర్... అంటే పుట్టుమచ్చ రంగులో ఏదైనా మార్పు కనిపిస్తోందా?, డీ– అంటే డయామీటర్... అంటే మచ్చ వ్యాసం (పరిమాణం) పెరుగుతోందా? ఈ నాలుగు మార్పుల్లో ఏదైనా కనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్ను సంప్రదించాలి. అప్పుడు బయాప్సీ తీసి పరీక్ష చేసి అది హానికరమా కాదా అన్నది వారు నిర్ణయిస్తారు. ఇక ఇలాంటివి రాకుండా ఉండాలంటే... ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం పూర్తిగా తగ్గించాలి. హానికారక అల్ట్రావయొలెట్ కిరణాలు తాకకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేప్పుడు ఎక్కువ ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. మీ పాపకు ఉన్న మచ్చల్ని అప్పుడప్పుడూ డెర్మటాలజిస్ట్తో పరీక్ష చేయిస్తూ ఉండటం మంచిది. ఇలాంటి నీవస్లు ముఖం మీద ఉండి కాస్మటిక్గా ఇబ్బంది కలిగిస్తుంటే... వాటిని ఎక్సెషన్ థెరపీతో తొలగించవచ్చు. మీరొకసారి చర్మవ్యాధి నిపుణులను కలవండి. డా. రమేశ్బాబు దాసరి, సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
అధ్యక్షా..సమస్యలు ఇవే!
సాక్షి, కర్నూలు (రాజ్విహార్): ఐదేళ్లుగా ఎక్కడి సమస్యలు అక్కడే. అభివృద్ధి జాడలు వెతికినాకనిపించని వైనం. అప్పటి పాలకుల హామీలు ప్రకటనలకే పరిమితం. ప్రభుత్వం మారింది. ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అధికార పారీ్టకి చెందిన వారే కావడంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారంనుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు 10 రోజుల పాటు జరిగే సమావేశాల్లో జిల్లా సమస్యలపై సభ్యులు గళం విప్పాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో వేలాది మందికి ఉపాధిని కలి్పంచే ఓర్వకల్ ఇండస్ట్రియల్, కొలిమిగుండ్ల సిమెంట్ హబ్లపై సత్వర నిర్ణయాలు తీసుకోవాలని, కర్నూలు నగరంతోపాటు పలు పట్టణాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని, కర్నూలు పెద్దాసుపత్రి స్థాయిని పెంచాలని కోరుతున్నారు. మరో వైపు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపించి శాశ్వత ప్రతిపాదికన పరిష్కరించేలా నిధుల మంజూరుకు కృషి చేస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వేదావతి, గుండ్రేవులపై చర్చిస్తాం కారి్మకుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు, కొత్త పథకాలు, అమలు తదితర అంశాలతో పాటు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్లపై చర్చిస్తాం. వేదావతి, ఆర్డీఎస్ కుడికాలువ, గుండ్రేవుల నిర్మాణాల గురించి సభ దృష్టికి తీసుకెళ్తాం. ఆలూరు నియోజకవర్గంలోని నగరడోణ, నగటూరు ప్రాజెక్టును పూర్తి చేయిస్తా. జిల్లాలోని పలు గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారణకు శాశ్వత ప్రతిపాదికన చర్యలు చేపడతాం. – గుమ్మనూరు జయరాం, కారి్మక, ఉపాధి కల్పన మంత్రి పులికనుమ పూర్తి చేయాలి ఎమ్మిగనూరు పట్టణంలో తీవ్ర నీటి సమస్య ఉంటుంది. తుంగభద్ర నది పక్కనే ఉన్నా కష్టాలు తప్పడం లేదు. గాజులదిన్నెకు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని తీసుకొస్తే ఎమ్మిగనూరు, కోడుమూరు పట్టణాలకు నీటి ఎద్దడి ఉండదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఇప్పటికే ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. పులికనుమను పూర్తి చేసి తాగు, సాగునీరు సరఫరా చేయాలని కోరతా. –కె. చెన్నకేశవరెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మిగనూరు ఆర్డీఎస్ కుడి కాల్వ నిర్మాణంపై మాట్లాడతా మంత్రాలయం నియోజకవర్గంలో నెలకొన్న సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సభలో కోరుతా. కోసిగి తూము, ఆర్డీఎస్ లిఫ్ట్ ఇరిగేషన్, రాంపురం చానెల్, ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణ ప్రాధాన్యతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే మంత్రాలయం నియోజకవర్గంలో సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయి. అసంపూర్తిగా ఉన్న పులికనుమ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతా. తుంగభద్ర నది ఒడ్డున ఉన్నా అన్ని మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. దీని నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా. –వై. బాలనాగిరెడ్డి, ఎమ్మెల్యే, మంత్రాలయం ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీపై మాట్లాడతా మా నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. సిద్ధాపురం ఎత్తిపోతల పథకం నుంచి పంట పొలాలకు నీరు పోయేందుకు కాలువలు పూర్తి చేయాలన్నదే నా ధ్యేయం. దీనిపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. ఆత్మకూరులో మైనార్టీ కళాశాల ఏర్పాటు, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, ఆసుపత్రుల్లో వైద్య పోస్టుల భర్తీపై గళం విçప్పుతా. శ్రీశైలంలో నివాసం ఉంటున్న ప్రజలకు సున్నిపెంటలో స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలి. ఆలయ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగులరైజేషన్ కోసం పోరాడుతా. – శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే, శ్రీశైలం మరో ఎస్ఎస్ ట్యాంకు అవసరం కర్నూలు నగరంలో మంచి నీటి సమస్య పరిష్కరించేందుకు మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వం ముందు చూపులేక వ్యహరించడంతో కర్నూలు నగరం వేసవిలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంటోంది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం హెచ్ఎన్ఎస్ఎస్ నీటిని గాజులదిన్నెకు తరలించి అక్కడి నుంచి కర్నూలు తరలించేలా చర్యలు తీసుకుంటాం. నగరంలోని అవకాశం ఉన్న ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు, రోడ్లు, కాలువల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. –హఫీజ్ఖాన్, ఎమ్మెల్యే, కర్నూలు హంద్రీనీనా నీటితో చెరువులు నింపాలి పందికోన రిజర్వాయర్ నుంచి చెరువులను హంద్రీనీవా నీటితో నింపాలని కోరుతా. మండలంలోని 32 వేల ఎకరాలకు నీటిని సరఫరా చేయాలి. గత టీడీపీ ప్రభుత్వం పంట కాలువలను తీయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించింది. వెంటనే పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రస్తావిస్తా. పత్తికొండ, మద్దికెర, వెల్దుర్తిలో తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రస్తావిస్తా. రైతుల కష్టాలు పరిష్కరించడం, మద్దతు ధర కలి్పంచాలని విన్నవిస్తాం. –శ్రీదేవి, ఎమ్మెల్యే, పత్తికొండ డిగ్రీ కళాశాల మంజూరుకు కృషి కోడుమూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ముఖ్యంగా కోడుమూరులో డిగ్రీ కళాశాల, కొత్తపల్లి–గోరంట్ల మధ్య హంద్రీపై బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో కోరుతా. వృత్తి విద్య కోసం ఐటీఐ కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గూడూరు, కొత్తకోట, మునగాల మధ్య రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. దీనితో ప్రధానంగా నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాము. –జరదొడ్డి సుధాకర్, ఎమ్మెల్యే, కోడుమూరు తెలుగుగంగ పనులు పూర్తి చేయాలి తెలుగుగంగ లైనింగ్ పనులు పూర్తి చేయాలి. నీటి వృథాని అరికట్టి రైతులకు అందించాలి. కేసీ కెనాల్, తెలుగు గంగల కింద చివరి ఆయకట్టు రైతులకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యం. అందుకోసం రెండు ప్రధాన కాలువలకు లైనింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా. జిల్లాలో జరిగిన నీరు–చెట్టు పనుల అవినీతిపై విచారణకు డిమాండ్ చేస్తా. ఆళ్లగడ్డ పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతా. –గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలలి నందికొట్కూరు నియోజకవర్గ కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతా. అన్ని గ్రామాల్లో తాగు, సాగునీటి కష్టాలు ఉన్నాయి. వీటిని సభ దృష్టికి తీసుకెళ్తా. నందికొట్కూరులో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి కృషి చేస్తా. – తొగురు ఆర్థర్, ఎమ్మెల్యే, నందికొట్కూరు దద్దనాల ప్రాజెక్టుకు నీరు ఇవ్వాలి బనగానపల్లె నియోజకవర్గంలో ఉన్న దద్దనాల ప్రాజెక్టుకు డోన్ మండలం కొచ్చెర్వు నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ నీటిని ఇస్తే సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయి. దీనికి అటవీ శాఖ అనుమతులు అవసరం. ఈ క్లియరెన్స్ ఇప్పించాలి. దీనిపై అసెంబ్లీలో మాట్లాడుతా. అవుకు రిజర్వాయర్లో 4 టీఎంసీల నీరు నిలువ ఉండేలా చర్యలు తీసుకోవాలి. –కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్యే బనగానపల్లె కుందూ వెంట ఫ్లడ్ వాల్ నిర్మించాలి ఎప్పుడు వరదలు వచ్చినా నంద్యాల పట్టణం ముంపునకు గురవుతుంది. సమస్య పరిష్కారానికి కుందూనది వెంట ఫ్లడ్వాల్ నిర్మాణం చేపట్టాలని సభ దృష్టికి తీసుకెళ్తా. గతంలో ఈ ఫ్లడ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా మధ్యలో ఆగిపోయింది. వెలుగోడు నుంచి చేపట్టిన రక్షిత మంచినీటి పథకం నిధులు లేక పనులు ఆగిపోయాయి. ఈ నిర్మాణాలను పూర్తి చేయాలి. టీడీపీ ప్రభుత్వం కేవలం ప్రచారం కోసమే పనులు చేపట్టి కాంట్రాక్టర్లకు పైసా విడుదల చేయలేదు. – శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి, ఎమ్మెల్యే, నంద్యాల రహదారుల విస్తరణ చేపట్టాలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా. గ్రిడ్ ద్వారా మంచినీటి సమస్య పరిష్కరించాలి. పెండింగ్లోని బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని, మండగిరి తహసీల్దార్ తాగునీటి పథకం, పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని సభలో ప్రస్తావిస్తా. ఎస్ఎస్ ట్యాంకుల నిర్వహణ, విస్తరణకు చర్యలు చేపట్టాలని సీఎం దృష్టికి తీసుకెళ్తా. – సాయిప్రసాద్రెడ్డి, ఎమ్మెల్యే, ఆదోని జీవో 69పై మాట్లాడుతా శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు న్యాయం చేయాలని జారీ చేసిన జీఓ నంబర్ 69పై మాట్లాడుతా. ఓర్వకల్, గడివేముల, కల్లూరు మండలాల్లో సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విన్నవిస్తా. హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరుతా. గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతా. ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తే రైతన్నలకు సాగునీటి కష్టాలు ఉండవు. –కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎమ్మెల్యే, పాణ్యం -
షీ రాక్ టీమ్
రాక్ బ్యాండ్ అనగానే వాయిద్య పరికరాలతో స్టెయిల్గా అబ్బాయిలు కళ్లముందు నిలిస్తే నిలిచారు గానీ.. ఉత్తరప్రదేశ్కి చెందిన జయ తివారీ ‘మేరీ జిందగీ’ పేరుతో తొమ్మిదేళ్ల క్రితమే మహిళా రాక్ బ్యాండ్ను ఏర్పాటు చేశారు. జయతో పాటు మరో నలుగురు బృందంగా కలిశారు. మహిళల సమస్యల మీద మహిళలే సాహిత్యాన్ని సంగీతంతో జత కలిపి జయహో అనిపిస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటి మహిళా మిషన్ బ్యాండ్గా పేరొందిన ఈ షీ రాక్ టీమ్ త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వబోతోంది. మహిళల సామాజిక సమస్యలపై జయ బృందం సంధిస్తోన్న అస్త్రం ‘మేరీ జిందగీ’. రాక్ సాంగ్స్తో ప్రజల్లో చైతన్యం తెస్తోంది. ‘మేం పాట ద్వారా చూపే సమస్యలు మహిళలనే కాదు, మగవారినీ ప్రభావితం చేస్తాయి. అందుకే మా బృందానికి చాలా మంది పురుష మద్ధతుదారులూ ఉన్నారు. మా బృందం ఆశయం లింగసమానత్వం ఒక్కటే కాదు. అణచివేతలను సమాజంలోంచి పూర్తిగా తొలగించడం కూడా’ అంటోంది ఈ రాక్ బ్యాండ్. ఇందులోని వారంతా సాధారణ మధ్యతరగతి మహిళలే. తెల్లవారుఝామునే మేల్కొని ఉదయం ఏడున్నర లోపు తమ రాక్బాండ్ సెషన్ను ముగించుకుంటారు. ఆ తర్వాత ఉద్యోగాలు, కాలేజీలంటూ ఎవరి పనుల్లో వాళ్లు పరిగెడతారు. రాక్తో షేక్ ఉన్న సమయంలోనే తమ కోసం కొంత కేటాయించుకొని రాక్బ్యాండ్తో పాటకు ప్రాణం పోస్తారు జయ అండ్ కో. ఆ పాటలు ఫేస్బుక్, యూ ట్యూబ్ ద్వారా రిలీజై అత్యంత ప్రజాదరణను పొందుతున్నాయి. ‘మైరి మేరా బైహ్ నా రాచన...’ అనే పాటలో కూతుళ్లు పెరిగే దశలోనే పెళ్లి అనకుండా వారి కలలకు అవకాశం ఇవ్వమని తల్లులను తమ పల్లవులతో అడుగుతారు. ‘డ్రీమింగ్ కే ప్రెజర్ కుక్కర్ కి సీతీ కో బజ్నే దో..’ అనే పాట అమ్మాయిలను తమను తాము నమ్ముకోమని చెబుతుంది. భ్రూణ హత్యలపై ‘తేరి గాలియోన్ మెయిన్ నా అయేంగే కబీ ఈజ్ రాత్ కే బాద్, మా, మేరీ మా..’ అనే వారి హృదయ స్పందన విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ పాట మహిళా సాధికారత కోసం పనిచేస్తున్న రాష్ట్ర మహిళా సమాఖ్య, యునిసెఫ్, బిబిసి మీడియా యాక్షన్, బ్రేక్ త్రూ, వాటర్ ఎయిడ్ ఇండియా.. వంటి సంస్థల నుండి ఆహ్వానాలు అందుకునేలా చేసింది. ఈ ప్రోత్సాహంతో ‘మేరీ జిందగీ’ త్వరలోనే దేశవ్యాప్త ప్రదర్శనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. వంట గిన్నెలే వాయిద్యాలు! సంగీతం అంటే ప్రాణం పెట్టే నిహారికా దుబే జయ బృందంలో ఒకరు. ‘‘మొదట్లో నేను జయను కలిసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉండేది. మ్యూజిక్ నేర్చుకునేవారంతా బాలికలే. కానీ, ఒకే ఒక్క గిటార్ ఉండేది. మ్యూజిక్ క్లాస్కు వచ్చే వారంతా స్పూన్లు, గిన్నెలు, గ్లాసులు, ప్లేట్లు, పట్టుకారు.. ఇలాంటి వాటితోనే ప్రాక్టీస్ చేసేవాళ్లం. కానీ అమ్మాయిలెవరూ ఒక్క రోజు కూడా క్లాస్ మిస్ చేసేవాళ్లు కాదు. పార్కుల్లోనూ ప్రాక్టీస్ ఉండేది. నెమ్మదిగా ప్రజలు మా బృందాన్ని గమనించడం ప్రారంభించారు’’ అని చెబుతుంది నిహారిక. బాలికల విద్యకు సహకారం ‘‘ఇంతవరకు ఇలా మహిళల కోసం పనిచేసే బృందం నాకు మరొకటి కనిపించలేదు. మహిళల కోసం మహిళలే కదిలే ఈ బృందంతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అంటోంది పదిహేడేళ్ల అనామిక ఝుంఝున్వాలా. అత్యంత పిన్నవయస్కురాలైన డ్రమ్మర్గా అనామిక పేరొందింది. అనామిక ఎనిమిదేళ్ల వయసు నుంచి ఈ బృందంతో కలిసి డ్రమ్స్ వాయిస్తోంది. గిటారిస్ట్ పూర్వి మాల్వియా, గాయకురాలు సౌభాగ్య, స్వస్తిక వంటి ఇతర సంగీతకారులూ ఈ బృందంలో ఉన్నారు. ఈ ముగ్గురూ ఇటీవలే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేరారు. అయినా ‘మేరీ జిందగీ’ బృందంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ మహిళా పోలీసు విభాగానికి 70 పాటలను కంపోజ్ చేసింది ఈ షి రాక్ బ్యాండ్. రాక్ బ్యాండ్ షోస్ ద్వారా వచ్చే డబ్బుతో వీరు నిరుపేద బాలికల విద్యకు సహకారాన్ని అందిస్తున్నారు. ‘‘మహిళా లోకాన్ని జాగృతం చేయగలం అనే నమ్మకాన్ని ఈ బ్యాండ్ మాకు కలిగించింది. ఇక ఇదే మా జీవితం అంటోంది’’ దృఢంగా ఈ సంగీత, సాహిత్య, సంఘహిత బృంద సభ్యులు. – ఆరెన్నార్ మొదటన్నీ ఖాళీ కుర్చీలే తొలినాళ్లలో ఇంటి మేడ పైనే సృజనాత్మక చర్చలు : ‘మేరీ జిందగీ’ టీమ్ 2010లో లక్నోలో మొదటిసారి జయ ఈ రాక్బ్యాండ్ను ప్రారంభించినప్పుడు.. ఎవరూ దీనిని పట్టించుకోలేదు. ప్రదర్శనకు ప్రేక్షకులను రాబట్టడమే పెద్ద కష్టమైందని అంటారు ఆమె. ‘‘ఖాళీ కుర్చీలు మమ్మల్ని వెక్కిరించేవి. చాలా బాధగా అనిపించేది. బాధ్యతను భుజానికెత్తుకున్నప్పుడు అది ఎంత బరువైనా దించకూడదు అనుకున్నాం. బ్యాండ్కు అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడానికి డబ్బులేదు. కానీ, మేం మా ఆశను కోల్పోలేదు. ఒక్కో వాయిద్య పరికరాన్ని కొనుగోలు చేసుకుంటూ వచ్చాం. తొమ్మిదేళ్లుగా మేం చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు మహిళా విద్య, సమానత్వం, గృహహింస, భ్రూణ హత్యలను పాటలుగా ఎలుగెత్తి పాడే ఏకైక రాక్ బ్యాండ్ ‘మేరీ జిందగీ’ అయినందుకు చెప్పలేనంత సంతోషంగా ఉన్నాం’’ అంటారు జయ తివారి. సంగీతంలో పీహెచ్డీ చేసిన జయ ఐదేళ్లుగా రేడియో జాకీగానూ కొనసాగుతున్నారు. -
మోకాళ్ల నొప్పులు మళ్లీ రానే రావు...
నా వయసు 50 ఏళ్లు. ఇటీవల కొంతకాలంగా మోకాళ్లనొప్పుల తో బాధపడుతున్నాను. దీనికి హోమియోలో చికిత్స ఉందా? మోకాళ్ల నొప్పులు రావడానికి అధిక బరువే మొదటి కారణం. దేహం తాలూకు బరువు వివిధ దశల్లో కీళ్ల మీద పడుతుంది. నడిచేటప్పుడు ఆ బరువు నాలుగు రెట్లు అధికమై మోకాళ్ల మీద పడుతుంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాళ్ల మీద పడే భారం 6 నుంచి 7 రెట్లు అధికంగా ఉంటుంది. కీళ్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఉండదు కానీ... కీలు దెబ్బతిన్నప్పుడు మాత్రం సమస్యలు వస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి సమస్య ఉన్నప్పుడు కూడా కీళ్లనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు: ►కూర్చుని లేచే సమయంలో ఇబ్బంది∙కీలు బిగుసుకుపోవడం ►లేచేటప్పుడు, కదిలించేటప్పుడు, నడిచేటప్పుడు మోకాలి నుంచి శబ్దం ►మోకాలిపై వాపు, నొక్కితే నొప్పి ఎక్కువవుతుంది. ►నొప్పి మూలంగా మెట్లు ఎక్కడం, దిగడంలో ఇబ్బంది. హోమియో చికిత్స: మోకాలి నొప్పులను దూరం చేయడంలో హోమియో మందులు ఎంతో చక్కగా పనిచేస్తాయి. ఇతర వైద్య విధానాల్లో తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే లభిస్తుంది. కానీ హోమియో చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. డా‘‘ కె. రవికిరణ్, మాస్టర్స్ హోమియోపతి, హైదరాబాద్ చర్మంపై పొలుసుల్లా రాలుతున్నాయి! నా వయసు 45 ఏళ్లు. ఐదు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎంతోమంది డాక్టర్లకు చూపించాను. ప్రయోజనం కనిపించడం లేదు. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. హోమియో మందులతో తగ్గుతుందా? మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్గా తెలుస్తోంది. ఇది సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసువారికైనా రావచ్చు. లక్షణాలు: ►చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది. ►కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై కూడా మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి. ►తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తాము చూడటానికి కూడా బాగాలేకపోవడంతో మానసిక క్షోభకు గురవుతారు. ఇటీవలి ట్రెండ్: ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది మరింత అధికం అవుతుంది. కాబట్టి ఒత్తిడిని దూరంగా ఉంచుతూ, పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. చికిత్స: రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను బట్టి వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా హోమియోలో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సోరియాసిస్ సమస్యకు సమూలమైన చికిత్స ఉంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
నాకు తెలియాలి
‘ఇమాజినేటివ్ కన్ఫ్యూజన్’ అనే మాట వైద్యంలో ఉంటుంది. ఇంట్లో మనకు తెలిసినదానిని బట్టి ‘ధోరణి’ ‘తిక్క’ ‘పెత్తనం’, ‘ఓవరాక్షన్’ లాంటి పదాలు వాడతాం. మన కుటుంబ సభ్యులు కొందరు మన గురించి అతిగా స్పందిస్తుంటారు. దాని వల్ల సమస్యలు వస్తాయి. వారిని పట్టించుకోవాలి. వైద్య నిపుణుల సహాయం తీసుకోవాలి. అది అమ్మ గురించి కావచ్చు.నాన్న గురించి కావచ్చు. రాజు ఆ ఇంటి పెద్ద కొడుకు. పెళ్లి చేసుకోనంటున్నాడు. అతనికి ఇరవై అయిదు వచ్చేశాయి. రెండో కొడుకు ఇరవై మూడేళ్ల వయసులో క్యూలో ఉన్నాడు. ఆ ఇద్దరూ మంచి వయసులో ఉత్సాహంతో కొండలను కూడా పిండి కొట్టగల ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఉన్నారు కూడా. కాని వారి మనసులో ఏదో వెలితి. ఏదో అసంతృప్తి. నిరాశ. తల్లిదండ్రులు పెద్ద కొడుకును సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకువచ్చారు. ‘డాక్టర్.. వీడు పెళ్లి చేసుకునేలా చూడండి’ అని కోరారు. ఆ వయసు కుర్రాళ్లకు ఉండే సమస్యలు తెలుసుకుందామని సైకియాట్రిస్ట్ అతనితో మాట కలిపాడు. ‘ఏంటి నీ సమస్య రాజూ?’ ‘నాకేం సమస్య సార్. నాకు ఏ సమస్యా లేదు. సమస్యల్లా మా అమ్మా నాన్నలదే. వాళ్లు సంతోషంగా ఉన్నట్టు నేను ఊహ తెలిసినప్పటి నుంచి చూళ్లేదు. ఎప్పుడూ ఏదో ఒక కీచులాటే. వాళ్లను చూసి చూసి నాకు పెళ్లి చేసుకోవాలనిపించడం లేదు’ అన్నాడు. అయితే సమస్య ఇక్కడ లేదని రెండో కొడుకును పిలిచాడు. ‘ఏంటి ప్రాబ్లమ్’ ‘ఏం చెప్పమంటారు సార్. నాకూ మా అన్నకూ గొడవలు వచ్చేస్తున్నాయి ఈ మధ్య. దానికి కారణం మా అమ్మానాన్నలు. ఏదో పనికి మాలిన విషయానికి వాళ్లిద్దరు వాదులాడుకుంటారు. మేము ఇంట్లో ఉంటాము కదా. తెలియకుండానే ఒకరు అమ్మ పక్షం, ఒకరు నాన్న పక్షం అయిపోతున్నాం. వాళ్లు కాసేపు తిట్టుకొని మామూలైపోతారు. నేనూ అన్నయ్య తగాదా కంటిన్యూ చేస్తూ మనస్పర్థలు పెంచుకుంటూ ఉన్నాం’. ఇప్పుడు సైకియాట్రిస్ట్ తల్లిని పిలిచాడు. ‘డాక్టర్.. వారి కోసం అనుక్షణం ఆలోచించే తల్లిని. భార్యను. వారి బాగోగులు చూసుకోవడం నా తప్పా?’ అని అడిగింది ఆమె. ఆమెలో ఏ లోపమూ కనిపించలేదు. తండ్రిని పిలిపించాడు.‘సార్.. నా భార్యకు వంక పెట్టడానికి లేదు. ఆమె తన జీవితం మొత్తాన్ని నా కోసం మా ఇద్దరు అబ్బాయిల కోసం వెచ్చించింది. కష్టపడింది. అయితే–’ అని ఆగాడు.‘అయితే?’ ‘ఆ కష్టం కొంచెం ఎక్కువయ్యింది సార్. ప్రతి దాంట్లో ఆమె ఇన్వాల్వ్ అవుతుంది. మాకు ఒక మోస్తారు వ్యాపారం ఉంది. నేనూ మా ఇద్దరబ్బాయిలు చూసుకుంటాం. బయట సవాలక్ష ఉంటాయి. అవి అన్నీ ఆమెకు తెలియడం ఎందుకు చెప్పండి? అంటే ఆమె నుంచి దాచే విషయాలని కాదు. ఆమెకు చెప్పాల్సింది ఆమెకు చెప్తాం. కాని ఆమె వినదు. ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనే. నేను ఏం చేస్తున్నానో, పెద్దాడు ఏం చేస్తున్నాడో, చిన్నాడు ఏం చేస్తున్నాడో... బిజినెస్ సరిగ్గా జరుగుతున్నదో లేదో, కలెక్షన్స్ అవుతున్నాయో లేదో, సేల్స్ ఎలా ఉన్నాయో అన్నీ కావాలంటే ఎలా? పని చేసి ఇంటికి రాగానే ఏదో ఒక వివరం అడుగుతుంది. నాకు చెప్పే ఓపిక ఉండదు. దాంతో తగాదా. ఆమెను మేం బాగా చూసుకుంటున్నాం. హాయిగా ఉండొచ్చు కదా. మమ్మల్ని బాధ పెడుతోంది’ అన్నాడతను. తీగలాగితే డొంక కదిలినట్టు సమస్య తల్లిలో ఉందని సైకియాట్రిస్ట్కు అర్థమైంది. సత్యవతికి చిన్నప్పటి నుంచి ఊహాజనితమైన భయాలు ఉన్నాయి. ఏదో ఒక నష్టం జరుగుతుందేమో తనకు అనే భయం అది. ఆమె బాల్యంలో తెలిసిన వారి కుటుంబాల్లో అకాల మరణాలు చూసింది. అనుకోని విషాదాలు చూసింది. జీవితం అంటే ఏదో ఒక ప్రమాదం అనుక్షణం పొంచి ఉంటుందనే భయం ఆమెలో స్థిరపడింది. ఆమెకు భర్త, పిల్లలే లోకం. వీరికి ఏ ఆపద వచ్చి పడుతుందో అని ఆమె భయం.భర్త షాప్కు వెళ్లగానే ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత షాప్లో పని చేసే వర్కర్లకు చేస్తుంది. ఆ తర్వాత పెద్ద కొడుక్కు చేస్తుంది. ఆ తర్వాత చిన్న కొడుక్కు చేస్తుంది. ఏదో ఇప్పుడిప్పుడు కృష్ణారామా అంటూ వ్యాపారం సెటిల్ అయ్యింది.. కొడుకులు అందివచ్చారు... ఈ సంతోషానికి ఏదైనా విఘాతం జరిగితే అని ఆమెకు ఒకటే రంధి.భర్త, కొడుకులు ఈ ధోరణితో విసిగిపోతున్నారు. దీనిని పెత్తనం అనుకుంటున్నారు. చాదస్తం అనుకుంటున్నారు. ‘మీకున్న ఇబ్బందిని ఇమాజినేటివ్ కన్ఫ్యూజన్ అంటారమ్మా’ అన్నాడు డాక్టర్ ఆమెతో. ‘మీరే సమస్యను ఊహించుకుని, దానిలో చిక్కుకుని, మీరే పరిష్కారం కోసం ఆందోళన పడటం దీని లక్షణం’ అన్నాడాయన. ‘భర్త గురించి పిల్లల గురించి ఆందోళన పడటం తప్పా డాక్టర్?’ అందామె. ‘తప్పు కాదమ్మా. కాకపోతే నువ్వు ఎక్కువ ఆందోళన పడుతున్నావు. నీకు బాగా వ్యతిరేక స్వభావం ఏర్పడింది. రేప్పొద్దున తెల్లారదేమో అనే భయం నీకు లేదు. కాని రేప్పొద్దున ఏ నష్టం వస్తుందోననే భయం మాత్రం ఉంది. తెల్లారి తీరుతుంది అని మనసుకు తెలిసినట్టుగా నావాళ్లకు ఏమీ కాదు అని మనసుకు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? హైదరాబాద్లో దాదాపు కోటిమంది జనాభా ఉన్నారు. మనం పేపర్ తీస్తే రోజుకు అయిదో పదో దుర్ఘటనలు వ్యక్తుల మరణాలు నష్టాలు చూస్తాం. అంటే కోటి మందిలో కోటి మందీ ప్రమాదంలో లేనట్టే కదా దీని అర్థం. అందరికీ అన్నీ నష్టాలే జరిగితే ఇన్ని వేల సంవత్సరాల్లో మానవులు ఎప్పుడో హరించుకుపోయి ఉండేవారు’ అన్నాడాయన. ఆమె కాస్త తెరిపిన పడింది. ‘నీ భర్తను, పిల్లలను చూసుకోవడానికి నువ్వు కాకుండా ప్రభుత్వము, అధికారులు, పోలీసులు, సైన్యము, సమాజమూ, ఇరుగు పొరుగు, నువ్వు నమ్మేటట్టయితే దైవము ఇంత మంది ఉంటారు. కాబట్టి నిశ్చింతగా ఉండి వాళ్లకు ఎంత అవసరమో అంత సపోర్ట్ చేయి. నువ్వు సొంతంగా నీకిష్టమైన వ్యాపకం పెట్టుకో. ఫ్రెండ్స్ని కలువు. ఇంకేమైనా పనులు చేయి. సంతోషంగా ఉండి కుటుంబాన్ని సంతోషంలో పెట్టు. మీ ఇంటికి న్యూస్పేపర్ వస్తే అందులో రెండో మూడో విషయాలు నువ్వు చదువుతావు. అచ్చయిన ప్రతి వార్తా చదవవు కదా... నీ భర్త, పిల్లలు బయట జరిగే ప్రతి వ్యవహారం నీతో ఎందుకు చెప్పాలి చెప్పు? ఒకటి రెండు అవసరమైనవి చెప్తారు. నువ్వే కాదమ్మా... చాలా ఇళ్లల్లో నీలా తల్లులో తండ్రులో అన్నయ్యలో అనవసర ఆందోళన వల్ల అనవసర జోక్యం చేసుకుని అశాంతికి కారణమవుతున్నారు. కొంచెం సర్దుబాటు చేసుకుంటే ఇదంతా సమస్యే కాదు’ అని వివరించాడు. ఇంత వివరించాక ఆమెలో మార్పు రాకుండా ఉంటుందా? ఆమెకే కాదు, ఎవరిలోనైనా రావాల్సిందే. – కథనం: సాక్షి ఫీచర్స్ డెస్క్ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కేటీఆర్ హామీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి (ట్రెసా–జేఏసీ) జరిపిన చర్చలు సఫలమైనట్లు ఆ సంఘం తెలిపింది. ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సోమేశ్ కుమార్, అడిషనల్ డీజీపీ జితేందర్ రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో పలు దఫాలుగా జరిపిన చర్చల్లో సానుకూల స్పందన లభించిందని పేర్కొంది. ఈ మేరకు అధ్యక్ష, కార్యదర్శులు వంగా రవీందర్రెడ్డి, గౌతమ్కుమార్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం(ఎగ్జిక్యూటీవ్ బ్రాంచ్) అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమోహన్, మధు తదితరులు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దారుణహత్యకు గురైన తహసీల్దార్ విజయారెడ్డి, డ్రైవర్ గురునాథం కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను 15 రోజుల్లో పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. బుధవారం నుంచి ఉద్యోగులందరూ విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు. -
కడుపులోకి ‘కల్తీ’ కూట విషం..
సాక్షి, హైదరాబాద్: పండ్లు.. కూరగాయలు.. ఆకు కూరలు.. పప్పులు.. బియ్యం.. సుగంధ ద్రవ్యాలు.. గోధుమలు కాదేదీ పెస్టిసైడ్స్ (క్రిమి సంహారకాలు) ఆనవాళ్లకు అనర్హం అన్నట్లుగా మారింది ప్రస్తుత పరిస్థితి. హైదరాబాద్ వాసులు రోజువారీగా విని యోగిస్తున్న నిత్యావసరాలు, పలు రకాల ఆహార పదార్థాల నమూనాల్లోనూ ఫుడ్సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ ఎస్ఏఐ) నిర్దేశించిన పరిమితికి మించి రసాయనాలు, క్రిమి సంహారక ఆనవాళ్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ పరిధిలో బహిరంగ మార్కెట్ల, లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో మొత్తం గా సుమారు 30% మేర పెస్టిసైడ్స్ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఎరువులు, పురుగు మందుల అవశేషాలు లేని సేంద్రియ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నా మంటూ ప్రచారం చేసుకుంటున్న పలు సంస్థలు తమ ఆర్గానిక్ స్టోర్లలో విక్రయిస్తున్న నమూనాల్లోనూ ఈ ఆనవాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆయా స్టోర్లలో సేకరించిన పలు రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయల్లోనూ విష రసాయనాల ఆనవాళ్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరల నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా వీటి ఆనవాళ్లు బయటపడ్డాయి. కూరల్లో వాడే కరివేపాకులోనూ వీటి ఆన వాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నమూనాలను నగరంలోని పలు బహిరంగ మార్కెట్లలో సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. అమ్మో క్రిమి సంహారకాలు.. క్రిమి సంహారకాల్లో ప్రధానంగా ఆర్గానో క్లోరిన్, ఎసిఫేట్, ఎసిటామిప్రిడ్, అజోక్సీ స్టార్బిన్, కార్బన్డిజం, ఇమిడాక్లోప్రిడ్, టిబ్యుకొనజోల్ తదితర క్రిమిసంహారక ఆన వాళ్లు బయటపడ్డాయి. ఇవన్నీ ఫుడ్సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించి న పరిమితులకు మించి ఉంటున్నాయి. ఎసిఫేట్, లిండేన్ వంటి క్రిమి సంహారకాల వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ వాటి ఆనవాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సుగంధ ద్రవ్యమైన యాలకులలోనూ క్వినై ఫోస్, అజోక్సీస్టార్బిన్, థయామె టోక్సా మ్ వంటి క్రిమి సంహారకాలు ఉంటున్నాయి. పెస్టిసైడ్స్ ఆనవాళ్లతో అనర్థాలివే.. దేశంలో సరాసరిన 10% మధుమేహ బాధి తులుండగా.. హైదరాబాద్లో సుమారు 16–20% మంది ఈ వ్యాధితో బాధపడుతు న్నారు. దేశంలో గ్రేటర్ సిటీ డయాబెటిక్ క్యాపిటల్గా మారుతుండటం ఆందోళన కలి గిస్తోంది. ఆకుకూరలు, కూరగాయల్లో ఉండే క్రిమిసంహారకాలు ఆహారపదార్థాల ద్వారా మానవశరీరంలోకి ప్రవేశిస్తే సుమారు 20 ఏళ్ల పాటు అలాగే తిష్టవేసే ప్రమాదం ఉంద ని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల క్రిమిసంహారకాల అవశేషాలు దేహం లోని కొవ్వు కణాల్లో నిల్వ ఉంటాయని.. పలు రకాల అనారోగ్య సమస్యలకు కారణ మవుతాయంటున్నారు. కూరగాయలను ఉప్పు నీళ్లతో కడిగిన తరవాత.. బాగా ఉడికించి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహానికి కారకాలు.. తెలుగు రాష్ట్రాల్లో శరీర బరువు తక్కువగా ఉన్న వారు.. రక్తంలో కొవ్వు మోతాదు తక్కువ ఉన్న వారు సైతం మధు మేహ వ్యాధి బారిన పడేందుకు ఆర్గానో క్లోరిన్ తదితర క్రిమి సంహారక ఆనవాళ్లు ఆహార పదార్థాల్లో చేర డమే ప్రధాన కారణ మని ఈ నివేదిక హెచ్చరిం చింది. మరోవైపు ఆర్గానో క్లోరిన్ క్రిమిసం హారకాల తయారీ దేశంలో అధి కంగా జరుగుతోందని.. ఇక లిండేన్ వంటి నిషే ధిత క్రిమిసంహారకాన్ని సైతం దేశంలో పలు ప్రాం తాల్లో విరివిగా విని యోగిస్తుండటంతో పలు అనర్థాలు తలెత్తు తున్నా యని ఈ నివేదిక స్పష్టం చేసింది. తలసరి క్రిమిసం హారకాల వినియోగం లోనూ రెండు తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉండటం గమనార్హం. తల్లిపాలలోనూ క్రిమి సంహారకాల ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. -
నరకానికి కేరాఫ్..
సాక్షి ప్రతినిధి విజయనగరం: విజయనగరంలోని జేఎన్టీయూకే క్యాంపస్లో సమస్యలు తిష్ట వేశాయి. వందల మంది చదువుతున్న ఈ యూనివర్సిటీలో సగానికి పైగా విద్యార్థులు వసతి గృహాల్లోనే ఉంటూ కాలేజ్ మెస్లోనే తింటున్నారు. కానీ కొన్ని నెలలుగా ఈ మెస్ సరిగ్గా నడవడం లేదు. కనీసం తాగునీరు కూడా లేకపోవడంతో విద్యార్థులు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరానికి వచ్చి భోజనం చేయాల్సి వస్తోంది. లేదా పస్తులుండాలి. మరో వైపు కళాశాలలో పరిశోధన శాల అభివృద్ధికి వచ్చిన నిధులు కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి. విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ కూడా అందుబాటులో ఉండటం లేదు. ఇంత జరుగుతున్నా నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీనిపై రెండు రోజులుగా పగలు, రాత్రి అన్న తేడా లేకుండా విద్యార్థులు ఆందోళనల చేపడుతున్నారు. ప్రిన్సిపల్ ఆధిపత్యం.. కళాశాలలో మొత్తం 1670 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో దాదాపు 1430 మంది వసతి గృహంలోనే ఉంటున్నారు. స్టూడెంట్ మెస్లు నడుపుతూ విద్యార్ధులకు భోజన వసతి కల్పిస్తున్నారు. అయితే స్టూడెంట్స్ మేనేజ్మెంట్ నిర్వహణలో భోజన వసతి వ్యవహారంలో స్టూడెంట్స్కి స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ప్రిన్సిపల్ ఆధిపత్యం వల్ల మెస్ చార్జీలు భారీగా పెరుగుతున్నాయి. కాంట్రాక్ట్ పద్ధతి మెస్ నిర్వహణలో రూ.3 వేలు వరకు వచ్చిన బిల్లును స్టూడెంట్ మేనేజ్మెంట్ నిర్వహణ ద్వారా రూ.1400 కి తీసుకొచ్చారు. కానీ ప్రిన్సిపాల్ ఆధిపత్యంలో మెస్ నిర్వహణ వచ్చినప్పటి నుంచి రూ.1900 కి మెస్ బిల్లు చేరింది. దాదాపు నెలన్నరగా విద్యార్ధుల చేత నడిపించే మెస్లకు నీటి సౌకర్యం ఆగిపోయింది. విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించినా ప్రిన్సిపల్ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు విజయనగరం వచ్చి భోజనం చేస్తున్నారు. రెండేళ్లుగా కళాశాల ప్రాంగణానికి ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ప్రయోగశాల అభివృద్ధికి సంబంధించిన నిధులు ఉన్నప్పటికీ రెండేళ్లుగా వాటి ఏర్పాటుకు సంబంధించిన టెండర్లను పిలిచి డిపార్ట్మెంట్లకు అందజేయడం లేదు. నిధులున్నా విద్యార్థులకు ప్రయోగశాల నైపుణ్యాలను అప్గ్రేడ్ చేయలేదు. హాస్టల్లో మౌలిక సౌకర్యాల కొరత ఉంది. క్రీడాప్రాంగణం కళాశాల క్రీడలు ఆడుకునే స్థాయిలో లేదు. వీటిపై విద్యార్థులెవరైనా వ్యక్తిగతంగా నిలదీసినా, ప్రశ్నించినా వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నా రు. మార్కులు తగ్గించేస్తామంటూ బెదిరిస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. ఈ నేప థ్యంలో మూకుమ్మడిగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. మిడ్ ఎగ్జామ్స్కి దూరమైనా కూడా నిరసనలో పాల్గొంటున్నారు. దిగివచ్చిన రిజిస్ట్రార్.. జేఎన్టీయూ వీసీ వస్తేగానీ నిరసన విరమించేది లేదంటూ మంగళ వారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా విద్యార్థులు ఆందో ళన కొనసాగించారు. రాత్రి వేళ చీకట్లోనూ కళాశాల గేటు వద్ద బైఠాయించారు. చేసేది లేక జేఎన్టీయూ కాకినాడ యూనివర్శిటీ రిజస్ట్రార్ సుబ్బారావు బుధవారం విజయనగరం వచ్చారు. తొలుత కళాశాల ప్రిన్సిపాల్, వైస్ప్రిన్సిపాల్, వివిధ విభాగాల అధిపతులు, ఫ్యాకల్టీలతో సమస్యలపై సమీక్షించారు. అనంత రం విద్యార్థుల వద్దకు వచ్చివారి సమస్యలను తెలుసుకున్నారు. కళాశాల నిర్వహణలో లోపాలున్నట్లు ఆయన గుర్తించారు. అకడమిక్కి నష్టం కలగకుండా వాటిని సరిదిద్దుకుందామని వారికి హామీ ఇచ్చారు. సమస్యలు చెప్పే వారిపై పరోక్షంగా ఫ్యాకల్టీ శిక్షలు వేస్తున్నారని విద్యార్థులు రిజిస్ట్రార్ ముందు ఏకరుపు పెట్టడంతో అక్కడున్న కళాశాల ఫ్యాకలీ, ఇతర సిబ్బందిని రిజస్ట్రార్ కళాశాల లోపలికి పంపారు. అనంతరం విద్యార్థులు చెప్పిన సమస్యల్లో ప్రధానంగా కళాశాల గ్రంథాలయ సౌకర్యాన్ని వారం రోజుల్లో పూర్తి స్థాయిలో కల్పిస్తామని హామీ ఇచ్చారు. రూ.లక్షలోపు నిధులను విడుదల చేసే అర్హత తనకు ఉందని ప్రస్తుతం సెమిస్టర్కి అవసరమైన తక్షణ మెటీరియల్ని తెప్పిస్తామని చెప్పారు. గ్రంథాలయంలో కంప్యూటర్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలన్న డిమాండ్పై స్పష్టమైన హామీ ఇచ్చారు. వసతి గృహంలోని మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలిస్తాన్నారు. ఎప్పటిలాగే మెస్బిల్లును తగ్గించుకోవడానికి మెస్ నిర్వాహణలో ఫ్యాకల్టీ ఆధిపత్యం లేకుండా చేయాలని విద్యార్థులు కోరారు. స్టూడెంట్ మేనేజ్ మెంట్ పద్ధతిలో జరుగుతున్న మెస్ నిర్వహణలో పూర్తిగా విద్యార్థులకే స్వేచ్ఛ ఇస్తామని హామీ ఇచ్చారు. వీసీ రావాల్సిందే... రిజిస్ట్రార్ ఇచ్చిన హామీలపై విద్యార్థులు సంతృప్తి చెందలేదు. రిజస్ట్రార్ సుబ్బారావు విద్యార్థుల సమస్యలు ఒక్కొక్కటిగా వింటూ పరిష్కార మార్గాలు చెపుతూ విద్యార్థులకు హామీలిచ్చారు. దాదాపు నాలుగు అంశాల తరువాత బాలికల హాస్టల్ సమస్యలు చర్చలోకి వచ్చాయి. ఫ్యాకల్టీ, హాస్టల్ ఇతర సిబ్బంది వారిపై చేస్తున్న అసభ్యకర చర్యలను బాలికలు చెపుతున్న సమయంలో పరిష్కార మార్గాలు చెప్పకుండా మధ్యలో రిజిస్ట్రార్ కళాశాలలోపలికి వెళ్లిపోయారు. చాలా సేపటి వరకూ బయటకు రాకపోవడంతో విద్యార్థులు నిరసనలు కొనసాగించారు. రాత్రి 9.30 గంటల సమయంలో రిజిస్ట్రార్ మరలా విద్యార్థుల దగ్గరకు వచ్చారు. వీసీ వస్తేనే తాము ఆందోళన విరమిస్తామని విద్యార్థులు పట్టుబట్టి కూర్చున్నారు. రాత్రి 10 గంటలకు కూడా చర్చలు కొనసాగుతున్నాయి. -
'మా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి'
సాక్షి, చుంచుపల్లి(ఖమ్మం) : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశ కార్యకర్తలు కదం తొక్కారు. నిరంతరం శ్రమదోపిడీకి గురవుతున్నామని, ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన బాట పట్టారు. పలు డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దశలవారీ ఆందోళనల్లో భాగంగా ఈనెల 3వ తేదీన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు. 9న తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. 12వ తేదీన జిల్లా కలెక్టర్కు, వైద్యశాఖాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. 19, 20 తేదీల్లో కలెక్టరేట్ ధర్నాచౌక్ల వద్ద, మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఇక రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం కొత్తగూడెంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా, ముట్టడి కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత స్థానిక మంచి కంటిభవన్ నుంచి భారీ ప్రదర్శనగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ధర్నాచౌక్ సమీపంలో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఛేదించుకొని కలెక్టర్ కార్యాలయం వరకు దూసుకెళ్లారు. ఒక్కసారిగా కలెక్టర్ కార్యాలయ గేట్లను తొలగించుకొని లోనికి ప్రవేశించారు. ప్రధాన ద్వారం నుంచి ఇంకా లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు పూర్తిగా అడ్డుకున్నారు. ఆ సమయంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆశ కార్యకర్తలు కార్యాలయం ముందు గంట సేపు బైఠాయించి నినాదాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా పధ్రాన కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరీ చేస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నట్లుగా వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని, వేతనాలు అందక పోవడంతో ఆశ వర్కర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆశ వర్కర్లకు మెరుగైన వేతనాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. రెండుసార్లు అధికారంలోకి వచ్చినా నేడు వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ‘ఆశ’లకు రావాల్సిన జీతాలు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు రూ.10 వేల వేతనం అమలు చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి శ్రీధర్, ఎంవీ అప్పారావు, జాటోత్ కృష్ణ, నాయకులు నల్లమల సత్యనారాయణ, ఆశ వర్కర్లు లక్ష్మి, ఈశ్వరి, ఝాన్సీ, ధనలక్ష్మి, లత, పార్వతి, అంజలి, సునిత, కమల, గంగ, పున్నమ్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కరితో కష్టమే..!
సాక్షి, చీపురుపల్లి రూరల్: జిల్లాలోని పలు ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధన సమస్యగా మారింది. అత్యవసర వేళ ఉపాధ్యాయుడు సెలవు పెట్టినా... కాస్త ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు చదువుకు దూరంకావాల్సిన పరిస్థితి. జిల్లాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 378, ప్రాథమికోన్నత పాఠశాలలు 213, ప్రాథమిక పాఠశాలలు 2,160 ఉన్నాయి. వీటిలో సుమారు 275 పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి. వీటిలో బోధన సమస్యలు షరామామూలయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఒక్క చీపురుపల్లి మండలంలోనే 12 పాఠశాలలు, నియోజకవర్గంలో 25 పాఠశాలలు ఏకోపాధ్యాయుడితోనే నడుస్తుండడం గమనార్హం. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థుల బోధనకు, ఉపాధ్యాయుడికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గతంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అకడమిక్ ఇన్స్ట్రక్టర్ను నియమించారు. ఏకోపాధ్యాయుడికి సహాయంగా ఈ బోధకులతో బోధన అందించి విద్యార్థులకు న్యాయం చేసేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అకడమిక్ ఇన్స్ట్రక్టర్ నియామకాలను నిలిపివేసింది. దీంతో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో కష్టాలు మొదలయ్యాయి. విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్నామ్నాయ చర్యలు తీసుకోకపోతే కొన్ని సమయాల్లో విద్యార్థులు విద్యా భోదనకు దూరమవ్వాల్సిన పరిస్థితి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇవీ సమస్యలు.. ఒకటి నుంచి ఐదు తరగతులకు కలిపి 18 సబ్జెక్టులు ఉంటాయి. ఈ సబ్జెక్టులను ఒక ఉపాధ్యాయుడే బోధన చేస్తూ మిగతా పనులను కూడా చూసుకోవాల్సి ఉంది. ఉపాధ్యాయుడికి నెలకోమారు సమావేశం ఉంటుంది. వృత్యంతర శిక్షణకు హాజరుకావాలి. ఈ లెక్కన ఏడాదికి 11 సమావేశాలు ఉంటాయి. దీంతో పాటుగా స్కూల్ కాంప్లెక్సు సమావేశాలు ఉంటాయి. ఈ సమావేశాలుకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలి. ఆడిట్ వర్కులు, ఆన్లైన్ సేవలు సమయాల్లో సెలవులు తీసుకోవాలి. వీటితో పాటుగా ఉపాధ్యాయుడి అవసరాల నిమిత్తం తమ సెలవులను తీసుకుంటారు. ఇలాంటి సమయాల్లో ఏకోపాధ్యా పాఠశాలలు మూసే యాల్సి పరిస్థితి ఉండడమో.. లేదంటే సమీప దూరంలో ఉన్న వేరే పాఠశాల ఉపాధ్యాయుడిని మండల విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు వేరొకరిని వేయడమో చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎంత వరకు అందుతుందన్నది ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విద్యకు విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. విద్యార్థుల చదువులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్నామ్నాయ చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని జిల్లా విద్యాశాఖ అ ధికారుల వద్ద ప్రస్తావించగా... ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అప్పుడప్పుడు సమస్యలు తలెత్తుతున్న మాట వాస్తవమేనని, అయితే... అత్యవసరంగా ఉపాధ్యాయుడు సెలవుపెట్టినప్పుడు సమీప పాఠశాల నుంచి వేరొక్క ఉపాధ్యాయుడుని సర్దుబాటు చేస్తున్నామన్నారు. విద్యాబోధనకు ఆటంకం లేకుండా చూస్తున్నామన్నారు. -
ఆధార్ బేజార్
అమ్మ ఒడి పథకానికి అర్హత కోసం చిన్నారి పేరు ఆధార్లో నమోదు కావాలి. పెన్షన్కు అర్హత సాధించాలంటే వయసు ధ్రువీకరణ కోసం అవసరమైన మార్పులు ఆధార్లో చేయించుకోవాలి. అంతేనా... రేషన్ సరకులు కోసం ఈ కేవైసీ చేయించుకోవాలంటే ఆధార్ కేంద్రంలో వేలిముద్రలు వేయించుకోవాలి. ఇన్ని అవసరాలకు కారణమైన ఆ ఆధార్ కోసం ఇప్పుడు బేజారు పెరిగింది. ఒక్కసారిగా జనమంతా ఆధార్ కేంద్రాలు నిర్వహిస్తున్న మీ సేవ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇప్పుడు అక్కడి జనాన్ని చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. సాక్షి, విజయనగరం గంటస్తంభం: జిల్లాలో ఆధార్ నమోదు వ్యవహారం ప్రహసనంలా మారింది. ఈకేవైసీ నమోదులో భాగంగా ఆధార్ నమోదు కేంద్రాలపై ఒత్తిడి పెరగ్గా అందుకు తగ్గ కేంద్రాలు లేకపోవడం... ఉన్నవి కాస్తా మూతపడటం... వాటిని పునరుద్ధరించేందుకు ఉడాయ్ స్పందించకపోవడం ఈ సమస్యకు కారణ మైంది. ఇప్పుడు ఆధార్ నమోదుకోసం జనం కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. పరిస్థితిని గమనించిన అధికారులు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. ఈకేవైసీ నమోదుకు గడువు లేదని స్పష్టం చేస్తూ విద్యార్థులకు పాఠశాలల్లోనే నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇన్నాళ్లూ నమోదు చేసుకోకే... ప్రతి వ్యక్తికి ఏకీకృత గుర్తింపు సంఖ్య(యుఐడీ) జారీ చేస్తున్న విషయం తెలిసిందే. వేలిముద్రలు, కంటిపాపలు, ఇతర వివరాలు సేకరిస్తున్న సంగతీ తెలిసిందే. ఈ పక్రియ గత ఐదారేళ్లుగా నిరంతరం సాగుతోంది. అప్పట్లో తీసుకోని వారు, పిల్లలు పుట్టి, పెరిగిన తర్వాత వారు నమోదు చేసుకోవాల్సి ఉం ది. ఇలా ఇప్పటికీ ఆధార్ నమోదు చేసుకోని వారు చాలామంది ఉన్నారు. కొం దరికి అప్పట్లో తల్లితండ్రి పేరున ఆధార్ నంబర్ జారీ చేసినా వేలిముద్రలు సేకరించలేదు. పిల్లల వయస్సు ఐదేళ్లు దాటిన తర్వాత వారికి ఆధార్ చేయించాల్సి ఉన్నా చేయలేదు. ఈకేవైసీ నమోదుతో ఆధార్కు పరుగులు.. తాజాగా ప్రభుత్వం ఈకేవైసీ నమోదు చేసుకోవాలని సూ చించడంతో నమోదుకు రేష న్ డీలర్ల వద్ద ఈకేవైసీ కోసం వెళ్లగా పిల్లల వేలిముద్రలు పడట్లేదు. వారి ఆధార్ నమోదు కాకపోవడం ఇం దుకు కారణం. ఆధార్ చేయించుకోని కొందరు పెద్దవారి పరిస్థితీ ఇంతే. ఈ పరిస్థితుల్లో తొలుత ఆధార్ నమోదు చేసుకోవాల్సి రావడంతో వారంతా ఆధార్ నమోదు కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో ఇంకా 1.83లక్షల మంది ఈకేవైసీ నమోదు కావాల్సి ఉండడంతో రోజూ ఆధార్ తీసే మీసేవ కేంద్రాల వద్ద గంటల కొద్దీ వేచి ఉంటున్నారు. అయినా ఆధార్ జరగకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కేంద్రాల సంఖ్య తగ్గడంవల్లే ఇబ్బందులు.. డిమాండ్కు తగ్గట్టుగా ఆధార్ కేంద్రాలు లేకపోవడంతో వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 36 శాశ్వత, 10 తాత్కాలిక నమోదు కేంద్రాలను ఈసేవ, మీసేవ కేంద్రాల్లో అప్పట్లో ఏర్పాటు చేశారు. కానీ అందులో ఇప్పుడు కేవలం 19 మాత్రమే పని చేస్తున్నాయి. తాత్కాలిక కేంద్రాలను ఆపేయగా సరైన డాక్యుమెంట్లు స్కాన్ చేయకపోవడం, నిర్దేశిత రుసుం కంటే ఎక్కువ వసూలు చేయడం, సూపర్వైజర్ లాగిన్ లాక్ చేయడం వంటి కేంద్రాలతో శాశ్వత కేంద్రాల్లో 17 నిలుపుదల చేశారు. వీటిని తెరిపించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ రెండుసార్లు ఉడాయ్ అధికారులకు లేఖలు రాసినా వారు స్పందించలేదు. పాతవి పునరుద్ధరించకపోగా కొత్తవి కూడా మంజూరు చేయలేదు. దీనివల్ల ఇప్పుడు ప్రజలు అవస్థలు పడుతున్నారు. వేలాదిగా తరలివస్తున్న జనం.. విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఈ సేవ కేంద్రానికి శనివారం ఒక్కరోజే నాలుగువేల మంది వచ్చి ఉదయం నుంచి బారులు తీరారు. దీనివల్ల కాసేపు అక్కడ తోపులాట చోటు చేసుకుంది. అక్కడికి వచ్చిన వారు తోసుకున్నారు. లైన్లో ఉన్న వారికి మానేసి పక్కనుంచి వచ్చిన వారికి ఇస్తున్నారని ఆందోళన చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అదుపు చేయాల్సి వచ్చింది. చివరకు నిర్వాహకులు అందరికీ ఆధార్ చేయలేక ఆక్టోబర్ 25వ తేదీ వరకు రోజుకు 50మంది చొప్పున టోకెన్లు ఇచ్చి పంపేశారు. అయినా ఇంకా చాలామంది టోకెన్లు లభించక నిరాశతో వెనుదిరిగారు. ఉదయం నుంచి ఉన్నా తమ పని కాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి జిల్లాలోని మిగతా కేంద్రాలవద్ద కూడా ఉండటం విశేషం. స్పందించిన అధికారులు.. జనం పడుతున్న అవస్థల నేపథ్యంలో అధికారులు స్పందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈకేవైసీ చేయించుకోకుంటే కార్డులు తొలిగించమని ఇప్పటికే సంయుక్త కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రభుత్వం గడువు ఏమీ విధించలేదని తాజాగా వెల్లడించారు. అంతేగాకుండా ఐదేళ్ల నుంచి 15ఏళ్ల లోపు పిల్లలకు పాఠశాలల్లోనే ఆధార్ నమోదు, అప్డేషన్ చేస్తామని తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈకేవైసీ రేషన్ డిపోల్లో డీలర్ల వద్దే చేయించుకోవాలన్నారు. ఇక ఆధార్కోసం పిల్లల్ని తీసుకుని మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈకేవైసీ లేకున్నా... రేషన్.. ఈకేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్ సరుకులు ఇవ్వరన్నది వాస్తవం కాదని, నమోదు చేయించుకోకున్నా రేషన్ ఇస్తామని సంయుక్త కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 15ఏళ్ల వరకు ఉన్న వారికి పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు, అప్డేట్ చేయించే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తర్వాత రేషన్ డీలర్ వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవచ్చని చెప్పారు. వీరంతా ఆధార్ నమోదు కేంద్రానికి రావాల్సిన అవసరం లేదన్నారు. ఈకేవైసీ చేయించుకునేందుకు ఎలాంటి గడువు లేదని, ఎప్పుడైనా చేయించుకోవచ్చనీ స్పష్టం చేశారు. 15సంవత్సరాలు దాటిన వారు ఆధార్ కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, రేషన్ డీలరే ఈకేవైసీ చేస్తారనీ, ప్రజలు ఈవిషయాన్ని గమనించాలని కోరారు. -జేసీ వెంకటరమణారెడ్డి -
విద్యుత్ కష్టాలు తీరేనా.?
సాక్షి,ఆదిలాబాద్: ఇది ఆదిలాబాద్లోని భుక్తాపూర్ 33/11 కేవీ సబ్స్టేషన్.. ఉమ్మడి జిల్లాలో ఇది పాత సబ్స్టేషన్. 1970వ సంవత్సరంలో నిర్మించారు. ఇటీవల కాలంలో ఈ సబ్స్టేషన్ నుంచి సప్లయ్ పదేపదే ట్రిప్ అవుతుండడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడుతూ వచ్చింది. అయినా దీనిని మెయింటెనెన్స్ను అధికారులు మరిచారు. మాటిమాటికి ట్రిప్ కావడం సరఫరాలో అంతరాయం సమస్యలకు సంబంధించి ఎవరో ఎన్పీడీసీఎల్ సీఎండీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆ సబ్స్టేషన్ను తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో గత రెండు రోజులుగా భుక్తాపూర్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు సరఫరాలో బ్రేక్ డౌన్ ప్రకటించి యుద్ధప్రతిపాదికన మరమ్మతులు చేపట్టారు. పాత తుప్పుపట్టిన ఎలక్ట్రికల్ సామగ్రిని మార్చి కొత్తవి అమర్చారు. సబ్స్టేషన్ ఆవరణలో గడ్డి తీయించారు. కంచెకు రంగులు దిద్దారు. ఎన్నో రోజుల తర్వాత ఈ సబ్స్టేషన్ పూర్తి స్థాయి మరమ్మతుకు నోచుకుంది. ఇకనైనా సరఫరాలో ట్రిప్ జరగదని వినియోగదారులు ఆశిస్తున్నారు. నిర్వహణ అస్తవ్యస్తం.. ఉమ్మడి జిల్లాలో 215 సబ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా తెలంగాణ ఏర్పడిన తరువాత అనేకం కొత్తవి నిర్మించారు. గత ఐదారు సంవత్సరాలుగా ఆపరేటర్లను నియమించకపోవడంతో ఉన్నవారిపైనే భారం పడుతోంది. దీంతో సబ్స్టేషన్ల నిర్వహణ గందరగోళంగా మారింది. గతంలో వీటి నిర్వహణ కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఆ కాంట్రాక్టర్ ఆపరేటర్లను నియమించుకుని సబ్స్టేషన్ను మెయింటెనెన్స్ చేసేవారు. దీంట్లో అక్రమాలు జరుగుతున్నాయని కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేసి నేరుగా ఆపరేటర్లకు సంస్థే వేతనాలు ఇస్తోంది. రెండు సబ్స్టేషన్లకు కలిపి ఏడుగురు ఆపరేటర్లతో నిర్వహణ చేయాలని సంస్థ ఆదేశాలు ఉన్నాయి. ఆ ఏడుగురు కూడా రెండు సబ్స్టేషన్లకు అందుబాటులో లేని పరిస్థితి. 8గంటల చొప్పున ఒక ఆపరేటర్ విధులు నిర్వహిస్తే ఈ లెక్కన 24 గంటల్లో ముగ్గురు ఆపరేటర్ల తప్పనిసరి. అదనంగా ఒక ఆపరేటర్ ఉంటే ఎవరైనా ఆపరేటర్ సెలవులో ఉంటే సర్ధుబాటు చేసుకునే పరిస్థితి. రెండు సబ్స్టేషన్లకు ఏడుగురు ఆపరేట్లతో నిర్వహణ చేస్తుండడంతో వారికి మెయింటెనెన్స్ గగనంగా మారింది. కొత్త సబ్స్టేషన్లు నిర్మించామని, అదే విధంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చేశామని గొప్పలు పోతున్న సంస్థ అసలు నిర్వహణ విషయంలో తప్పటడుగు వేస్తోంది. దీంతో పలు సబ్స్టేషన్లు నిర్వహణ లేక గాడీ తప్పాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే నిత్యం సరఫరాలో ట్రిప్ అయి విద్యుత్ అంతరాయాలు కొనసాగుతున్నాయి. కంటిరెప్పపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదని చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ సబ్స్టేషన్ పరిధిలో శనివారం సబ్ స్టేషన్ మెయింటెనెన్స్లో భాగంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు ముందుగానే ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు అంతరాయం ఉంటుందని అధికారికంగా ప్రకటించి సాయంత్రం 5 గంటలకు సరఫరా పునరుద్ధరించారు. ఆదివారం కూడా ఇలాగే రిపీట్ చేశారు. వినియోగదారులు విద్యుత్ గోసను అనుభవించారు. -
ఎడారి దేశంలో తడారిన బతుకులు
సాక్షి, పశ్చిమ గోదావరి: జీవనోపాధి కోసం దేశం కాని దేశం వెళ్లిన ఎందరో దళారుల వలలో చిక్కి అష్టకష్టాలు పడుతున్నారు. కుటుంబానికి ఆసరా కోసం వెళ్లిన వారిని తిండి తిప్పలు లేకుండా చేసి గదిలో బంధించి చిత్ర హింసలు పెడుతున్నారు. ఇలా దుబాయ్ వెళ్లి అక్కడి విదేశీ రాయబార అధికారుల సహాయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని స్వగ్రామం తిరిగి వచ్చింది ఓ మహిళ. తనలాంటి బాధితులు పదుల సంఖ్యలో అక్కడ ఉన్నారని వారిని సీఎం జగన్మోహన్రెడ్డి కాపాడాలని ఆమె కోరుతోంది. శనివారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మొగల్తూరుకి చెందిన చెందిన పులిదిండి నాగలక్ష్మిది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. భర్త సురేష్ పొక్లయిన్ డ్రైవర్గా చేస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరి కుటుంబం రెండేళ్ల కిత్రం మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లి రాగా రెండు నెలల క్రితం మొగల్తూరుకు మకాం మార్చారు. నాగలక్ష్మికి నర్సుగా చేసిన అనుభవం ఉండటంతో దుబాయ్ వెళ్లే ఆలోచన చేశారు. ఈనేపథ్యంలో ఇరగవరం మండలం ఓగిడి గ్రామానికి చెందిన దొండి వెంకట సుబ్బారావు (చినబాబు) పరి చయం కావడంతో దుబాయ్ పంపేందుకు రూ.లక్ష ఖర్చువుతుందనడంతో అంగీకరించి అతడికి గత నెలలో సొమ్ములు ఇచ్చారు. గత నెల 13న నాగలక్ష్మిని హైదరాబాద్ తీసుకువెళ్లి విమానం ఎక్కించి దుబాయ్లో ఆకుమర్తి జ్యోతి అనే మహిళను కలవమని సుబ్బారావు సూచించాడు. 14న దుబాయ్లో విమానం దిగిన తర్వాత నాగలక్ష్మిని జ్యోతి జుల్ఫా అనే ప్రాంతానికి తీసుకువెళ్లింది. అక్కడి నుంచే నాగలక్ష్మికి కష్టాలు మొదలయ్యాయి. అక్కడ వారు ఆమె పాస్పోర్టు తీసుకుని తిండి కూడా పెట్టకుండా ఇబ్బందులు పెట్టారు. అక్కడ తనతో పాటు మన రాష్ట్రానికి చెందిన వారు మరో పది మంది, కేరళ, చెన్నై, మహారాష్ట్రకు చెందిన వారు కూడా ఉన్నారని నాగలక్ష్మి చెప్పింది. మనిషి అందంగా ఉండి వారికి నచ్చితేనే నర్సుగా ఉద్యోగం ఇప్పిస్తారని, లేకపోతే వ్యభిచార కూపాలకు అమ్మేస్తారని నాగలక్ష్మి వాపోయింది. వ్యభిచారం చేసేందుకు ఒప్పుకోకపోతే దారుణంగా హింసిస్తారని అంటోంది. 15 రోజులపాటు ఎంబసీలోనే.. తాను ఇన్ని బాధలు అనుభవించి భర్తకు ఫోన్లో విషయం చెప్పానని.. స్వదేశానికి వచ్చేందుకు సంబంధిత ఏజెంట్ మరో రూ.50 వేలు డిమాండ్ చేశాడని నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తన భర్త అప్పులు చేసి మరీ రూ.50 వేలు ఏజెంట్కు ఇచ్చాడని, అయినా తనను స్వదేశానికి రప్పించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదంది. తాను విషయాన్ని భర్తకు తెలియజేశానని దుబాయ్లో ఉన్నవారికి తెలిసి తనను మరిన్ని ఇబ్బందులు పెట్టారని కన్నీటి పర్యంతమైంది. ఈక్రమంలో గతనెల 27న మరో మహిళతో కలిసి స్థానికంగా ఉన్న వారి సహకారంతో దుబా య్లోని భారత ఎంబసీకి చేరుకుని విషయాన్ని వివరించామని, అక్కడి అధికారులు వెంటనే స్పందించి 15 రోజులపాటు తమకు అక్కడ ఆశ్రయం కల్పించారని నాగలక్ష్మి చెప్పింది. ఈనెల 10వ తేదీన పాస్పోర్టు ఇచ్చి ఖర్చుల కోసం నగదు ఇచ్చి తనను స్వదేశానికి పంపించారంది. తనతో మరో మహిళ స్వదేశానికి రాగా ఎంబసీలో మరో పది మంది మహిళలు ఉన్నారని, భాష రాకపోవడం, టూరిస్ట్ వీసాతో అక్కడకు వెళ్లడం, దళారుల చేతిలో చిక్కుకోవడం వంటి కారణాలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని వాపోయింది. సీఎం జగన్మోహన్రెడ్డి గల్ఫ్ బాధితులపై ప్రత్యేక దృష్టి సారించి రక్షించాలని, మోసపూరిత ఏజెంట్లను శిక్షించాలని నాగలక్ష్మి కోరుతున్నారు. -
కష్టబడి..!
టెక్కలి రూరల్: రెండు వీధుల తర్వాత పాఠశాల ఉంటేనే చాలా మంది వెళ్లడానికి బద్దకిస్తుంటారు. కానీ ఈ విద్యార్థులు కిలోమీటర్ల ఆవల ఉన్న బడికి వెళ్లేందుకు నిత్యం నరకయాతన పడుతున్నారు. రాళ్లు రప్పలతో నిండి ఉన్న దారిలో నిత్యం పా దయాత్ర చేస్తున్నారు. చదువుకోవాలనే కుతూహలం, విద్య నేర్చుకోవాలనే ఆరాటం వారిని నిత్యం నడిపిస్తోంది. టెక్కలి మండలంలోని ముఖలింగాపురం పంచాయతీ పరిధి బెండకాయలపేట గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు వీరు వస్తుంటారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే మెళియాపుట్టి మండల పరిధి అడ్డివాడ గ్రామానికి చెందిన కొందరు గిరిజన విద్యార్థులు బెండకాయలపేట ప్రాథమిక పాఠశాలకు వస్తుంటారు. రాళ్లు రప్పలతో ఉన్న కొండ మార్గం నుంచి నిత్యం పాఠశాలకు రావడం, తిరిగి సాయంత్రం తమ ఇళ్లకు నడిచివెళ్లడం సాహసంతో కూడుకున్న పని. చిన్నపాటి వర్షం కురిసినా, గట్టిగా ఎండ పెట్టినా వీరి రాక అంత సజావుగా సాగదు. అయినా అంత కష్టం పడుతూనే బడికి వస్తున్నారు. ఏటా ఈ గ్రామం నుంచి విద్యార్థులు చదువుకునేందుకు ఈ పాఠశాలకు రావడం పరిపాటి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బెండకాయలపేట గ్రామంలోనున్న పాఠశాలలో సుమారు 24 మంది చదువుతున్నారు. పరిసర గ్రామాలైన లంకపాడు, ముఖలింగాపురం, చిరుతునాపల్లి తదితర గ్రామాల నుంచి పిల్లలు వచ్చి చదువుకుంటున్నారు. వీరు ఇంత కష్టపడి పాఠశాలకు వస్తుంటే.. వారం రోజులుగా పాఠశాల మూతబడి ఉంది. ఇక్కడ టీచర్ సెలవు పెడితే బడికి కూడా సెలవే. గతంలో విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లిన కారణంగా నూతనంగా ఇక్కడ ఉపాధ్యాయులను నియమించకపోవడంతో పాఠశాల మూతబడింది. అయితే అడ్డివాడ గ్రామం నుంచి వచ్చే విద్యార్థులకు పాఠ«శాల తెరిచి ఉన్నదీ లేనిదీ తెలీకపోవడంతో రాకపోకలు సాగించక లేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత విద్యాశాఖాధికారులు స్పందించి కొండపైన పాఠశాలను ఏర్పాటు చేయాలని, ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. నిత్యం నడిచే వెళ్తున్నాం.. కొండ దిగువన మా పాఠశాల ఉండడంతో నిత్యం కొండపై నుంచి కిందకు నడిచి వెళ్తున్నాం. రోజూ ఉదయం కొండ దిగి పాఠశాలకు వెళ్లి తిరిగి సాయంత్రం కొండ ఎక్కి గ్రామానికి వెళ్తుంటాం. గత కొద్దిరోజులుగా పాఠశాలకు ఉపాధ్యాయులు రాకపోవడంతో రోజూ వెళ్లి నిరాశగా వెనుదిరగాల్సి వస్తోంది. – ఒంటిళ్ల కుమారస్వామి, 4వ తరగతి విద్యార్థి -
నేతన్నల వెతలు తీరేదెన్నడు?
భారతదేశంలో వ్యవసాయం తర్వాత నేత వృత్తిలోనే అధికంగా ప్రజలు ఆధారపడి ఉన్నారన్నది నిర్వివాదాంశం.. రైతన్నలను ఆదరిస్తున్న ప్రభుత్వాలు నేతన్నలపై మాత్రం సవతితల్లి ప్రేమను ఎందుకు కనపరుస్తున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదు.. భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు కళా నైపుణ్యాన్ని ప్రతిబింబించే చేనేత వృత్తిని ఆదరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.. నేలకొరుగుతున్న నేతన్నలను వారి కుటుంబాలను అక్కున చేర్చుకోవాల్సిన నైతిక బాధ్యతతో బాటు వారికి ఆదరణ అందించాల్సిన ఆవశ్యకత కూడా మనపైనే వుంది.. అద్భుతమైన చేనేత వస్త్రాలను తయారు చేయడంలో నేతన్న పడుతున్న కష్టం మనందరికీ తెలి సిందే, మానవాళికి అద్భుతమయిన వస్త్రాలను అందిస్తున్న నేతన్న, తాను కప్పుకోవడానికి బెత్తెడు గుడ్డ కూడా లేకుండా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు, జీవనపోరాటంలో ఓడిపోయి చివరకి చనిపోయినా సొంతింట్లో అంతిమ దహన సంస్కారాలకు కూడా నోచుకోలేక పోతున్నాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించక ముందు నేతన్నల ఆత్మహత్యలు అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చాయి. ప్రత్యేక తెలంగాణ తోనే ఈ విషమ పరిస్థితులకు పరిష్కారం దొరుకుతుం దని నేతన్నలు భావించారు. నేతన్నల ఆత్మహత్యలు కాస్త కొన్ని పార్టీలకు రాజకీయ అవకాశాలుగా మారాయి. కొత్త తెలంగాణ రాష్ట్రం సిద్ధిం చింది. గంపెడు ఆశలతో వున్న నేతన్నలకు తెలం గాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్లలోపెద్ద ఎత్తున కేటాయింపులు ప్రకటించింది. అయినా గ్రామాల్లో నేతన్నల ఆశలు నెరవేరక ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా 350 మంది నేతన్నలు ఆత్మహత్యలు, అనారోగ్య కారణాలతో మృత్యువాతపడ్డారు. రెండు వేల మంది కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. వేలమంది వృత్తిని కోల్పోయారు.. ప్రభుత్వం ప్రకటించిన పథకాల అమలు అటుకెక్కింది. ఎన్నోమార్లు ప్రభుత్వానికి, చేనేత జౌళి శాఖ అధికారులకు సమస్యలను విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. తెలంగాణ ప్రభుత్వం గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా రైతన్నల మాదిరిగా నేత కార్మికులందరికి 5 లక్షల రూపాయల జీవిత బీమాను ఉచితంగా అందించాలి.. కేంద్ర ప్రభుత్వం నేతన్నల ఆత్మహత్యలపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయాలి. మృతి చెందిన 350 నేత కార్మికులకు పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలి.. నేతన్నల ఆరోగ్యాలను పరిరక్షించడానికి ప్రతి నేతన్న కుటుంబానికి రూ. 5 లక్షల విలువైన హెల్త్ కార్డ్ను ఉచితంగా అందించాలి.. నేతన్నలకు ప్రభుత్వం సాలీనా 30 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించాలి.. కేంద్ర ప్రభుత్వం నేతన్నలు వినియోగించే నూలు, రంగులు, రసాయనాలపై జీఎస్టీని వెంటనే రద్దుచేయాలి.. ప్రభుత్వం నేతన్నలకు అధిక గిట్టుబాటు ధర కల్పించి ప్రస్తుత కూలీ రేట్లు పెంచాలి.. కేంద్ర ప్రభుత్వ చేనేత జౌళి శాఖ పథకాలన్నీ తెలంగాణలో అమలయ్యేలా చూడాలి. చేనేత వ్యవస్థపై ఆధారపడిన మహిళలకు స్వయం సమృద్ధి పథకాలు రూపొందించి వారి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రభుత్వాలు శిక్షణ, ఆర్ధిక తోడ్పాటు అందించాలి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి వలసపోయిన లక్షలాది మంది చేనేత కార్మికులకు వరంగల్ కేంద్రంగా ఉపాధి కల్పిం చాలి.. దీనికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కావలసిన నిధులు కేటాయించాలి. తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నలకు జీవిత బీమా ఏర్పాటుకు ప్రభుత్వానికయ్యే ఖర్చు కేవలం పది కోట్ల రూపాయలు మాత్రమే.. ఇంత ప్రాముఖ్యత గల విషయాలను పక్కనబెట్టి ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లో 1,273 కోట్ల రూపాయలు ప్రకటించడం వలన నేతన్నలకు ఒరుగుతున్నదేమిటి..? ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఆత్మ విమర్శ చేసుకోవాలి.. ‘ఆకొన్న కూడె యమృతము తానొంచక నిచ్చు వాడే దాత’ అన్న సుమతి శతకం లోని భావంలా ఆకలితో ఎదురుచూపులు చూస్తున్న నేతన్నలకు ఇప్పుడు కావాల్సింది కడుపు నింపే మాటలు కాదు.. చేతిలో రెండు అన్నం ముద్దలు, వారి కుటుంబాలలో చిరునవ్వులు, ఇది గమనించకుండా తమ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తే ఎప్పటికయినా తగిన మూల్యం చెల్లిం చుకోక తప్పదు. ప్రభుత్వాలు సహకరిస్తే నేతన్నలు వారి ఋణం వుంచుకోరు. వారిని ఆదరిస్తే తప్పకుండా పాలకులను నిండు మనస్సుతో తిరిగి దీవిస్తారు.. (నేడు చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా) వ్యాసకర్త: దాసు సురేష్; చైర్మన్, చేనేతల ఐక్య కార్యాచరణ కమిటీ మొబైల్ నంబర్: 91773 58286 -
ఎలక్ట్రిక్ బస్సు సిటీ గడప దాటదా?
సాక్షి, హైదరాబాద్: దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపే విషయంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మల్లగుల్లాలు పడుతోంది. దూర ప్రాంతాలకు నడిపే ఎలక్ట్రిక్ బస్సుల్లో బ్యాటరీకి సంబంధించిన సాంకేతిక సమస్యలు ఏర్పడి మధ్యలో ఆగిపోతే ఎలా అని ఆందోళన చెందుతోంది. ఇక కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లపైనా సంస్థ తీవ్రంగా మ«థనపడుతోంది. దీంతో ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్లుగా హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట లాంటి ప్రాంతాల మధ్య ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలన్న ప్రతిపాదననూ ఆర్టీసీ విరమించుకుంది. ఫలితంగా ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్)’పథకం రెండో విడత కింద కేంద్రం పెద్ద సంఖ్యలో బ్యాటరీ బస్సులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. పరిమిత సంఖ్యలోనే తీసుకోవాలని సంస్థ నిర్ణయించింది. ఈ పథకం కింద 600 బస్సులు మంజూరుకు వీలుగా కేంద్రాన్ని కోరాలని ముందుగా భావించింది. కానీ, హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాలకు వాటిని నడిపితే ఏర్పడే సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం ఇప్పటికిప్పుడు లేనందున కేవలం 334 బస్సులు మాత్రమే కోరాలని నిర్ణయించింది. ప్రతిపాదనలు కేంద్రానికి పంపే గడువు గురువారంతో ముగుస్తుండటంతో అధికారులు ఈ మేరకు ప్రతిపాదన సిద్ధం చేసి ఆర్టీసీ ఎండీకి పంపారు. అక్కడి నుంచి గురువారం సాయంత్రంలోగా ఢిల్లీకి పంపనున్నారు. సమస్యగా చార్జింగ్ స్టేషన్లు.. ఎలక్ట్రిక్ బస్సు ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఇదే పథకం మొదటి దశ కింద మంజూరై హైదరాబాద్లో తిరుగుతున్న ఏసీ బస్సుల ధర ఒక్కోటి రూ.2.40 కోట్లుగా ఉంది. ఈ మొత్తంలో 60 శాతం బ్యాటరీదే భారం. ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్ బస్సులు తయారువుతున్నా.. బ్యాటరీలను మాత్రం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటివరకు మన రాష్ట్రంలో బ్యాటరీ బస్సులను వాడిన దాఖలాలు లేనందున ఎక్కడా వాటి చార్జింగ్ పాయింట్లు లేవు. గతేడాది హైదరాబాద్లో 40 బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. దీంతో వాటి కోసం 3 చోట్ల చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. చార్జింగ్ కేంద్రం ఏర్పాటు కూడా పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. హైదరాబాద్లోనే చార్జ్ చేసి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్లుగా నగరం నుంచి ఇతర పట్టణాలకు వాటిని నడపాలని తొలుత నిర్ణయించారు. కానీ ప్రయాణం మధ్యలో బస్సు బ్యాటరీలో సమస్య తలెత్తితే దాన్ని వెనక్కు తీసుకురావటం పెద్ద ఇబ్బందిగా మారనుంది. అలాగే తరచూ సమస్యలు తలెత్తితే వాటిని నిర్వహించటం సాధ్యం కాదని తేల్చుకున్న అధికారులు.. వాటిని హైదరాబాద్ వరకే పరిమితం చేయాలని నిర్ణయించారు. నాన్ ఏసీ బస్సులే.. ఫేమ్ పథకం తొలి దశలో 40 బస్సులు కొన్నారు. అవన్నీ ఏసీ బస్సులే. వీటిని నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టుకు తిప్పుతున్నారు. ఇప్పుడు కొత్తగా నాన్ ఏసీ బ్యాటరీ బస్సులే కొనాలని నిర్ణయించారు. వీటి ధర తక్కువగా ఉండటంతో టికెట్ ధర కూడా తగ్గనుంది. దీంతో వీటికి సాధారణ ప్రయాణికుల ఆదరణ ఎక్కువగా ఉంటుందనేది అధికారుల ఆలోచన. నగరం, శివారు ప్రాంతాలు, సమీపంలోని చిన్న పట్టణాల వరకు మాత్రమే వీటిని తిప్పబోతున్నారు. వరంగల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించే బస్సులను పూర్తిగా సిటీ బస్సులుగానే నడపాలని నిర్ణయించారు. అన్ని చోట్లా సిటీ సర్వీసులే.. ప్రస్తుతం దేశంలో ఎక్కడా దూర ప్రాంతాలకు వీటిని నడపటం లేదు. ఢిల్లీ, బెంగళూరు సహా మరికొన్ని నగరాల్లో ఈ బస్సులు పరుగుపెడుతున్నా.. అన్ని చోట్లా సిటీ బస్సులుగానే తిరుగుతున్నాయి. దూర ప్రాంతాల మధ్య వాటిని ప్రారంభించనందున.. వాటి నిర్వహణకు సంబంధించి ఏ ఆర్టీసీకి స్పష్టమైన అవగాహన లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 5 వేల బస్సులు తిప్పాలని కేంద్రం నిర్ణయించినందున, కొన్ని చోట్ల దూరప్రాంతాల మధ్య తిప్పే అవకాశం ఉంది. అప్పుడు ఆయా సంస్థలకు ఎదురయ్యే అనుభవాలను తెలుసుకుని భవిష్యత్లో రాష్ట్రంలో కూడా దూర ప్రాంతాల మధ్య వాటిని నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. అద్దె బస్సుల వివాదం.. మరో కారణం.. ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య 25 శాతానికి మించకూడదనేది నిబంధన. కార్మిక సంఘాలతో యాజమాన్యం చేసుకున్న ఒప్పందంలో దీన్ని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ పరిమితి నిండిపోయింది. కొత్తగా అద్దె బస్సులను ఏర్పాటు చేసుకుంటే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టయి కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో అద్దె బస్సుల సంఖ్య తక్కువగా ఉన్నందున, ఇక్కడ వాటిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొనే బ్యాటరీ బస్సులను అద్దె బస్సులుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నందున.. కార్మిక సంఘాల నుంచి వ్యక్తమయ్యే వ్యతిరేకతను ఎదుర్కోవటం కూడా ఇబ్బందిగా అధికారులు భావించారు. వెరసి తొలుత 600 బస్సులు సమకూర్చుకోవాలని భావించినా ఇప్పుడు దాన్ని 334కే పరిమితం చేయాలని నిర్ణయించారు. ఎక్కువ బస్సులు తీసుకోవాలని కేంద్రం నుంచి ఒత్తిడి వస్తే అందుకు వీలుగా 550, 450 బస్సులు తీసుకునేలా రెండు ప్రతిపాదనలు కూడా ప్రత్యామ్నాయంగా సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. స్మార్ట్ సిటీ బస్సులు.. స్మార్ట్ సిటీలకు ప్రత్యేకంగా ఈ బస్సులు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆ జాబితాలో ఉన్న వరంగల్ పట్టణంలో కొన్నింటిని ప్రయోగాత్మకంగా తిప్పాలని భావిస్తున్నారు. 12 మీటర్లు, 9 మీటర్లు, 7 మీటర్ల పొడవుండే 3 కేటగిరీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న 40 బస్సులు 12 మీటర్ల పొడవైనవే. పాతబస్తీ లాంటి ఇరుకు దారులుండే రోడ్లపై వీటిని నడపడం ఇబ్బందిగా ఉంటుంది. టికెట్ ధర కాస్త ఎక్కువగా ఉన్నందున వీటిలో రద్దీ కూడా తక్కువగా ఉంటోంది. అందుకోసం సాధారణ ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు చిన్న బస్సులే తిప్పబోతున్నారు. ఇందుకోసం 9, 7 మీటర్ల బస్సులను కూడా కొంటున్నారు. మొత్తం 334 బస్సులు కొనాలని దాదాపు ఖరారు చేశారు. ఇందులో 309 బస్సులను హైదరాబాద్లో తిప్పాలని, మిగతా వాటిని వరంగల్ పట్టణంలో సిటీ బస్సులుగా తిప్పాలని భావిస్తున్నారు. -
పార్లమెంట్లో గళమెత్తిన గోరంట్ల మాధవ్
సాక్షి, అనంతపురం: ‘ఓ వైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు గత ప్రభుత్వ వైఫల్యం.. కరువు జిల్లా ‘అనంత’లో రైతులు కుదేలయ్యారు. పదిమందికి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్రా...అంటూ ఉపాధి లేక పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు ఉపయోకరంగా ఉంటుంది’ అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. గురువారం ఆయన పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. జిల్లాలో నెలకొన్న కరువు, రైతుల దుస్థితి, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇంగ్లిషులో ప్రసంగించారు. తీవ్ర కరువుతో కొట్టుమిట్టాడుతున్న అనంతపురం జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలు ఎంతో గౌరవింపబడుతున్న ఈ దేశంలో తీవ్ర కరువుతో పూటగడవక కొందరు వ్యభిచార గృహాలకు తరలిపోతుండగా...మరికొందరు ఉపాధి కోసం కుటుంబాలను వదిలి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి కారణం ఎవరని ప్రశ్నించారు..?. ఢిల్లీకి కూత వేటు దూరంలోనే వ్యభిచార గృహాలు నడుస్తున్నాయన్నారు. మరోవైపు బడికి వెళ్లాల్సిన పసి పిల్లలు రోడ్లుపై తిరుగుతూ కనిపిస్తున్నారన్నారు. నిర్బంధ ఉచిత విద్య చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కోరారు. లేదంటే పిల్లలు భవిష్యత్తులో జాతికి బరువుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రవాదులు, టెర్రరిస్టులుగా మారితే ఆరోజు వారిని అదుపు చేసేందుకు రూ.వంద ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. అదే నేడు రూ.10 ఖర్చు చేసి బడిలో చేర్పిస్తే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. -
నాయీ బ్రహ్మణులకు అండగా ఉంటాం: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, కృష్ణా : దేవాలయాల్లోని నాయీ బ్రాహ్మణుల సమస్యలపై విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయీ బ్రహ్మణులను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. అందుకే ఈ ఎన్నికల్లో నాయీ బ్రహ్మణులు చంద్రబాబును ఓడించారన్నారు. కాగా మన ప్రభుత్వం నాయీ బ్రహ్మణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కోన్నారు. త్వరలోనే వారి సమస్యలపై చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించండి
న్యూ ఢిల్లీ: బీజేపీ రాజ్యసభ ఎంపీ జీ వీ ఎల్ నరసింహారావు మంగళవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు. పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. అందులో భాగంగా తక్కువ నాణ్యత కలిగిన పొగాకు కిలో రూ.20 చొప్పున ధరను అమలు చేయాలని కోరారు. అదే విధంగా పంట మార్పిడికి నష్ట పరిహారంగా ఒక బారన్ పొగాకుకు సుమారు రూ. 5 నుంచి 10 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
ట్రాఫిక్ చక్రబంధం
ఒంగోలు నగరం రోజురోజుకూ ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోతోంది. గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా.. నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా.. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా.. ఇలా ఒంగోలు నగరం విస్తరిస్తూ పోతోంది. కానీ ఇప్పటికీ అవే రోడ్లు... అదే ఇరుకు సందులు... సాంకేతిక పరిజ్ఞానంతోపాటే అంతేవేగంగా మోటారు వాహనాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. కానీ, దీనికి తగ్గట్టు నగరంలో ప్రధాన రహదారుల విస్తరణ మాత్రం జరగటం లేదు. రోడ్లు విస్తరణ చేస్తామంటూ రాజకీయ నాయకులు, అధికారులు చేసిన ప్రకటనలు నీటిమీద రాతలుగానే మిగిలి పోయాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. అటు పాదచారులు, ఇటు వాహనదారులు సతమతమవుతున్నారు. ప్రజలు రోడ్లపైకి రావటానికి జంకుతున్నారు. రోడ్డు దాటాలంటే పెద్ద సాహసమే అవుతోంది. ఒంగోలు వన్టౌన్: ఒంగోలు నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. గ్రామల్లో నివశించే ప్రజల్లో అనేక అవాసరాల రీత్యా నగరంలోకి వలసలు వచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకొని స్థిరపడిపోతున్నారు. ఇప్పటికే నగర శివారు ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. మరోపక్క కార్పొరేట్ సంస్థలు ఒంగోలు నగరంలో తమ కార్యకలాపాలను విస్తరించుకుంటూ ఇప్పటికే అనేక సంస్థలు వెలిశాయి. ఒంగోలు నగర జనాభా మాత్రం 2011 జానాభా లెక్కల ప్రకారం 2.53 లక్షలు. ప్రస్తుతం ఆ సంఖ్య 3 లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఇప్పటికి నగరంలో సుమారు 60 వేలకు పైగా గృహాలు 400 వరకు అపార్టుమెంట్లు వెలిశాయి. నిత్యం నగరంలో లక్షకు పైగా వాహనాలు çరోడ్ల మీద పరుగులు తీస్తున్నాయి. 8 వేలకు పైగా ఆటోలు, 200కు పైగా స్కూల్ బస్సులు 50 వేలకు పైగా ద్విచక్ర వాహనాలు, వేల సంఖ్యల్లో అనేక ట్రాన్స్పోర్టు వాహనాలు నగరంలో నిత్యం తిరుగుతున్నాయి. నగరం ఎటు చూసినా 3 లేక 4 కిలో మీటర్లు పెరిగిపోయింది. గమ్య స్థానానికి చేరాలంటే గంటల వ్యవధి పడుతోంది. కార్ల జోరు.. నగరవాసులు సైకిల్ నుంచి మోటారు సైకిల్, మోటారు సైకిల్ నుంచి కారు... ఇలా ప్రతి మనిషి వేగాన్ని పెంచుకొని అభివృద్ధి వైపు దూసుకుపోతున్నాడు. నేడు ద్విచక్రవాహనం లేని ఇల్లు లేదంటే అతి శయోక్తి కాదు. ఒక్కో ఇంట్లో రెండు, మూడు ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి. ఇక కార్ల సంఖ్యా తక్కువేమీ కాదు. వీటికి తోడుగా ఆటోల జోరు అంతా ఇంతా కాదు. నగరవాసులతోపాటు, ఇక జిల్లా నలుమూలల నుంచి ఒంగోలు నగరానికి వచ్చే వారి సంఖ్య తక్కువేమీ కాదు. ప్రతి రోజూ వేల సంఖ్యలో నగరానికి వస్తుంటారు. ప్రభుత్వ కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చేవారు.. ఒంగోలులోని కాలేజీల్లో చదువుకునే వారి కోసం వచ్చే తల్లిదండ్రులు ఇలా ఎందరో..! ఇరుకు రోడ్లు.... జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలోని ప్రధాన వ్యాపార కూడలి ట్రంకు రోడ్డు, గాంధీ రోడ్డు. ఈ రెండు రోడ్లలో మనుషులు నడవటానికే ఖాళీ ఉండదు. ఇక వాహనాలు వేసుకొని వస్తే షాపింగ్ చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళాలంటే గంటల కొద్దీ సమయం పడుతుందని ప్రజలు వాపోతున్నారు. గాంధీ రోడ్డు, పత్తి వారి వీధి, పప్పు బజారు, తూర్పు బజారు, పశ్చిమ బజారు, బండ్లమిట్ట, మిరియాలపాలెం సెంటర్, కోర్టు సెంటర్, లాయర్పేట సాయిబాబా గుడి, అంజయ్య రోడ్డు, మంగుమూరు రోడ్డు, కర్నూలు రోడ్డు నెల్లూరు బస్టాండ్ సెంటర్లు నిత్యం రద్దీగా ఉంటాయి. ఇదిలా ఉంటే పాత మార్కెట్ సెంటర్ నుంచి దర్గా సెంటర్ మొదలుకొని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ వరకు రోడ్దు వన్వే అయినా పెద్ద వాహనాలు ముందు పోతుంటే కనీసం ద్విచక్ర వాహనం కూడా దానిని దాటుకొని పోవాలంటే సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. పార్కింగ్ సమస్య... పెరుగుతున్న వాహనాలతో పార్కింగ్ వాహనదారులకు పెద్ద సమస్యగా మారింది. ఏది కొనుగోలు చేయాలన్నా వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో అర్ధంకాక వాహనదారులు సతమతమవుతున్నారు. అధికారికంగా ఎక్కడా పార్కింగ్ ప్రదేశాలు లేవు. దీంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ట్రాఫిక్ పోలీసుల వేధింపులు అంతా ఇంతా కాదు. రోడ్దు మీద పార్కింగ్ చేసిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు హైడ్రాలిక్ ద్వారా లారీలో ఎక్కించుకొని తీసుకుపోతున్నారు. షాపింగ్ చేసుకొని వాహనం పెట్టిన చోటుకు వచ్చి చూస్తే అక్కడ వాహనం ఉండదు. తీరా అక్కడ షాపుల వాళ్ళను విచారిస్తే ట్రాఫిక్ పోలీసులు తీసుకుపోయారన్న సమాధానం వస్తుంది. దీంతో వెంట తీసుకొచ్చిన కుటుంబ సభ్యులను వదిలేసి ట్రాఫిక్ పోలీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. వందల మంది ప్రజలు ఇప్పటి వరకు పడిన, పడుతున్న ట్రాఫిక్ అవస్థలు ఇంతా ఇంతా కాదు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం పార్కింగ్కు స్థలాలను చూపించకపోగా అడ్డాదిడ్డంగా చాలనాలు రాస్తూ వాహనదారులను దోచుకుంటున్నారు. వాహనదారులకు చలానాలు అదనపు భారంగా మారుతున్నాయి. -
నిజంగా ‘పరీక్షే’
సాక్షి, అమరావతి : ఎంకి పెళ్లి సుబ్బడి చావుకొచ్చిందన్న చందంగా ఎన్నికల సందడి విద్యార్థుల భవిష్యత్తుకు గండంగా మారింది. రాజకీయ నాయకులు నామినేషన్ల సమయంలో చేసే హడావుడితో పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. రాజకీయ నాయకులు తన అనుచరగణంతో పదుల కొద్ది వాహనాలు చేసే ర్యాలీల్లో హారన్ శబ్దాలతో చెవులు వాచిపోతున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అదే సమయంలో రాజకీయ నాయకుల పాదయాత్రలు, ర్యాలీలు మొదలవుతున్నాయి. ఆ సమయంలో రాజకీయ నాయకులు డప్పు వాయిద్యాలు, ఈలలు, కేకలతో మోతమోగిస్తున్నారు. ఈ ర్యాలీలు పదోతరగతి పరీక్షా కేంద్రాల నుంచి పోతున్నప్పుడు అందులో పరీక్ష రాస్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మోతల మధ్య రాతలెలా రా దేవుడా...? అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఒకేసారి రెండు పరీక్షలు... మార్చి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మరో పక్క అదే రోజు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఇలా ఒకేసారి విద్యార్థులకు, రాజకీయ నాయకులకు పరీక్షలు మొదలయ్యాయి. మంచి ముహూర్తాలు లేకపోవటమో లేక మరేదైనా కారణమో తెలియదు కాని మొదటి రెండు రోజులు పెద్దగా నామినేషన్ల హడావుడి కనిపించలేదు. బుధవారం నుంచి జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. జిల్లా వ్యాప్తంగా బుధవారానికి 19 అసెంబ్లీ, 3 పార్లమెంట్ నామినేషన్లు దాఖలయ్యాయి. గద్దె నామినేషన్తో ఇక్కట్లు.. విజయవాడ తూర్పు నియోజవకర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్రావు బుధవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఇందులో భాగంగా పటమట లంకలోని కృష్ణవేణి రోడ్డులో తన అనుచరులు చేసిన ర్యాలీతో ఆ రోడ్డులో ఉన్న మూడు పదోతరగతి పరీక్షా కేంద్రాల్లోని విద్యార్థులు తీవ్ర ఆటంకం కలిగింది. వల్లూరి సరోజని ఉన్నత పాఠశాల, సీతారామమ్మ బాలికల పాఠశాల, కృష్ణవేణి హైస్కూల్లు ఉన్నాయి. బుధవారం ఉదయం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి క్యాంప్ కార్యాలయం నుంచి డప్పలు, వాయిద్యాలు, బ్యాండ్సెట్లతో పదుల సంఖ్యలో వాహనాలలో ర్యాలీ ప్రారంభించారు. వీరు చేసిన హడావుడితో పరీక్షా కేంద్రాలలో ఉన్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒకనొక సమయంలో కేంద్రాల బయట ఉన్న తల్లిదండ్రులు తెలుగుదేశం నాయకులతో వాగ్వాదానికి దిగారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇలా ప్రవర్తించటం ఏంటంటూ నిలదీశారు. స్వీయ నియంత్రణ అవసరం... పదోతరగతి పరీక్షలు కోసం విద్యార్థులు ఏడాదంతా కష్టపడి చదువుతారు. ఈ పరీక్షలు వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయం. రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో అడుకుంటూ ర్యాలీలతో ఇబ్బంది పెట్టడం సరైంది కాదని రాజకీయ నాయకలు గుర్తించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలాంటి వాటిని ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవటం కన్నా నాయకులే స్వీయ నియంత్రణ పాటించటం ఉత్తమమని చెబుతున్నారు. పరీక్షా కేంద్రాల ఇరువైపులా వంద మీటర్ల మేర ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ముందుకుసాగి విద్యార్థులకు సహకరించాలని విన్నవిస్తున్నారు. -
గోకులానికి మొండిచేయి
ప్రభుత్వ విధానాలతో జిల్లాలోని పాడిపరిశ్రమ అట్టడుగుస్థాయికి పడిపోతోంది. గతంలో, ప్రస్తుతం పాడి రైతులు సీఎం చంద్రబాబునాయుడు మోసాలకు బలవుతూనే ఉన్నారు. సొంత ప్రయోజనం కోసం గతంలో జిల్లాకే తలమానికమైన విజయా డెయిరీని మూయించి వేసి పాడి రైతులను అధోగతి పాలు చేశారు. అదే రీతిలో ప్రస్తుతం పాడి రైతులను ఆదుకుంటున్నామనే పేరుతో దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తున్నారు. గోకులం పథకం పేరుతో ప్రతి పాడి రైతుకూ సబ్సిడీపై ఆవుల షెడ్డుకు నిధులు అందిస్తామని ప్రకటనలిచ్చారు. నిధుల లేమిని సాకుగా చూపి అర్ధంతరంగా నిలిపేశారు. షెడ్లు నిర్మించుకుని నిధులు మంజూరుకాకపోగా, కట్టిన డీడీలు కూడా వెనక్కి ఇస్తుండడంతో రైతులు అయోమయంలో పడ్డారు. సాక్షి, చిత్తూరు : జిల్లాలోని రైతాంగానికి పాడి పరిశ్రమే ప్రధాన జీవనాధారం. పంటలు లేకపోయినా పాడి పరిశ్రమతో జీవనం సాగిస్తున్న కుటుంబాలే అధికం. జిల్లావ్యాప్తంగా 6.67 లక్షల రైతు కుటుంబాలు ఉండగా పాడి పరిశ్రమపై ఆధారపడి దాదాపు 5 లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. 10.20 లక్షల పాడి ఆవులు, గేదెలను రైతులు పోషిస్తున్నారు. వాటి ద్వారా రోజుకు 32 లక్షల నుంచి 34 లక్షల లీటర్ల మేరకు పాల ఉత్పత్తి వస్తోంది. అందులో 21 లక్షల నుంచి 22 లక్షల లీటర్ల మేరకు పాలను విక్రయిస్తున్నారు. దీంతో వచ్చే ఆదాయంతో కుటుంబాలను, పశువులను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గోకులం పథకం ఇలా.. ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు గాను ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాన్ని అందిస్తామని ప్రకటనలు గుప్పించారు. ఇందుకుగాను ప్రతి పాడి రైతుకూ పశువుల షెడ్డు నిర్మించుకునేందుకు 90 శాతం సబ్సిడీపై నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. అందులో రెండు ఆవుల షెడ్డుకు గాను రూ.97 వేలు, నాలుగు ఆవుల షెడ్డుకు గాను రూ.1.47 లక్షలు, ఆరు ఆవుల షెడ్డుకు గాను రూ.1.75 లక్షల చొప్పున నిధులను 90 శాతం సబ్సిడీపై అందిస్తామని గత ఏడాది నవంబరులో ప్రకటించారు. నీరుగారిన పథకం.. గోకులం పథకం కింద షెడ్లు నిర్మించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 14 వేల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో డిసెంబరు నెలాఖరుకు 4,256 మంది రైతులు సబ్సిడీ పోగా మిగిలిన 10 శాతం నిధులకు డీడీలు కట్టారు. మరింత మంది రైతులు డీడీలు కట్టేందుకు ముందుకు రావడంతో ప్రభుత్వం గోకులం పథకాన్ని పెండింగ్లో పెట్టింది. జనవరిలో సబ్సిడీ మొత్తాన్ని 90 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది. దీంతో అప్పటికే డీడీలు కట్టిన రైతులు మిగిలిన 20 శాతం మొత్తాలకు కూడా డీడీలు ఇవ్వాలని పశుసంవర్థక శాఖ అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో అప్పటికే సొంత డబ్బు వెచ్చించి షెడ్లు నిర్మించుకున్న రైతులు విధిలేక మిగిలిన 20 శాతం డబ్బులను కూడా 1,982 మంది రైతులు కట్టారు. అయినా వారికి ఇంతవరకు షెడ్డు నిర్మాణానికి అందించాల్సిన నిధులు ఒక్కపైసా కూడా మంజూరు కాలేదు. డీడీలు చెల్లించిన 4,256 మంది రైతుల్లో ప్రభుత్వం 2,731 యూనిట్లు మాత్రమే మంజూరు చేసింది. మిగిలిన 1,525 మందిలో 20 శాతం డీడీలు కట్టని 749 మంది, 10 శాతం డీడీలు కట్టి పథకం మంజూరు కాని వారు ఉన్నారు. వీరు కట్టిన డీడీలను అధికారులు వెనక్కి ఇచ్చేస్తున్నారు. అదేగాక 30 శాతం డీడీలు కట్టిన వారికి కూడా ఇంతవరకు నిధులు మంజూరు కాకపోవడంతో డీడీలు వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో గోకులం పథకం ద్వారా షెడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపినట్లయింది. -
మృదువైన చేతుల కోసం...
ఈ కాలం గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం పొడిబారి గరుకుగా తయారవుతుంది. రకరకాల పనుల వల్ల చేతులు నీళ్లలో ఎక్కువసేపు ఉండటం వల్ల చేతులపై చర్మం మరింత పొడిబారి, గరుకుగా అవుతుంది. ఈ సమస్యకు విరుగుడుగా.. టేబుల్ స్పూన్ టమాటా రసంలో అర టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు చేతులకూ రాసి, అయిదు నిమిషాల పాటు మృదువుగా మర్దనా చేయాలి. టేబుల్ స్పూన్ శనగపిండిలో అర టేబుల్ స్పూన్ రోజ్వాటర్, చిటికెడు పసుపు కలిపి పేస్ట్లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు రాసి, ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.టేబుల్ స్పూన్ శనగపిండిలో గుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్ గంధం పొడి కలపాలి. ఈ పేస్ట్ని చేతులపై పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ కాలం ట్యాన్ సమస్య కూడా ఉంటుంది కాబట్టి మురికి తొలగించడానికి ఈప్యక్స్ బాగా పనిచేస్తాయి. వారంలో మూడు రోజులైనా ఈ ప్యాక్స్ వేసుకుంటే మేలు. అలాగే రాత్రి పడుకునేముందు చేతులకు గ్లిజరిన్ బేస్డ్ కోల్డ్ క్రీము తప్పనిసరిగా రాసుకోవాలి. గోళ్లను కూడా మర్దనా చేయాలి. దీని వల్ల చేతులపై చర్మం మృదువుగా అవుతుంది. -
వ్యవసాయోత్పత్తులకు గడ్డుకాలం
వ్యవసాయ రంగంలో 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని 2016 ఫిబ్రవరి 22న ఉత్తరప్రదేశ్లోని రాయబరేలిలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ప్రతిపాదనను సాఫల్యం చేయడానికి నీతి ఆయోగ్ను ఆదేశించారు. ప్రణాళికాబోర్డును రద్దుచేసి, దానిస్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పర్చిన తర్వాత ఈ సంస్థ ప్రతిపాదించిన సూచనలు, నివేదికలు కార్పొరేట్లకు అనుకూలంగా వున్నాయే తప్ప, సామాన్య ప్రజలకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేవని ఆచరణ రుజువు చేసింది. రైతుల ఆదాయం రెట్టింపుచేసే బాధ్యతను తీసుకున్న నీతి ఆయోగ్ 4 సూచనలను ప్రకటించింది. 1. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించటం 2. వ్యవసాయ ఉత్పత్తులు పెంచటం 3. భూసంస్కరణలు అమలుచేసి పేదలకు భూములు పంచటం 4. రైతులకు సహాయం అందించటం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చని సూచించింది. అసలు పెరుగుదల అంటే ఏమిటి? ఏ ప్రాతిపదికగా పెరుగుదలను పరిశీలించాలి? 1. రైతుల ఆదాయం 2. ఉత్పత్తి పెరుగుదల 3. వ్యవసాయ రంగంలో అదనపు విలువ పెంపుదల 4. దేశీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల. పై నాలుగింటిలో ఏ రంగంలో పెరుగుదల వల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది? ఈ నాలుగు అంశాలను పరిశీలించిన నిపుణుల కమిటీ భారతదేశంలో ప్రస్తుత విధానాల ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం కానీ, రైతు ఆదాయం పెరగడం కానీ అసాధ్యమని ఈ మధ్య తేల్చారు. గిట్టుబాటు ధరలు రెండు విధాలుగా చూడాలి. 1. మార్కెట్ సంస్కరణలు 2. కనీస మద్దతు ధర నిర్ణయం. మార్కెట్ సంస్కరణల విషయంలో రాజ్యాంగం రీత్యా రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు చేపట్టాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్కెట్ చట్టాలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చి బిల్లులు తయారుచేసి తమ తమ శాసనసభలలో ఆమోదానికి పెట్టాల్సిందిగా ఆదేశిం చింది. తెలుగు రాష్ట్రాలు రెండూ ఆ బిల్లులను ఆమోదించాయి. ఈ చట్ట సభల ద్వారా కార్పొరేట్ సంస్థలకు మార్కెట్లలో కొనుగోలుచేసే అవకాశం కల్పిం చారు. ధరలను ఆ సంస్థలే నిర్ణయిస్తాయి. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల నుంచి వైదొలిగి రాష్ట్రాలపై నెట్టివేసింది. గిట్టుబాటు ధరలు నిర్ణయించటం, వాటిని అమలుచేసే బాధ్యతను కేంద్రం గానీ, రాష్ట్రంగానీ ఇంతవరకూ ప్రకటించలేదు. కేంద్రం ధరలు ప్రకటించి చేతులు దులుపుకోగా, రాష్ట్రం నేటికీ ధరల అమలుపై తన బాధ్యతను ప్రకటించలేదు. ఉత్పత్తిని పెంచడం: గత సంస్కరణల నుండి (1997 నుండి) మన దేశీయ పరిశోధనల విభాగాలను దాదాపుగా మూసివేశారు. బహుళజాతి సంస్థలైన మోన్శాంటో, డూపాంట్, కార్గిల్, సింజెంటా సంస్థలు 80% ప్రయోగాలను చేస్తుండగా, వాటిని మన దేశంలో వినియోగిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో 27 కేంద్రాలలో 5 వేల ఎకరాల భూమి పరిశోధనల కొరకు కేటాయించబడినప్పటికీ, ఆ పరి శోధనా కేంద్రాలన్నింటినీ మూసివేయడం జరిగింది. ఇలాంటి స్థితిలో ఉత్పాదకత ఎలా పెరుగుతుంది? సహాయక చర్యలు: ప్రస్తుతం బడ్జెట్లో 2.5% మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నారు. పేద దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ దేశాలు తమ బడ్జెట్లో 5 నుంచి 8 శాతం కేటాయించాయి. 8 రకాల సబ్సిడీలను రైతులకు అందచేస్తున్నారు. పంటల బీమా ప్రీమియం పూర్తిగా ప్రభుత్వాలే చెల్లిస్తున్నాయి. నిర్ణయించిన ఆదాయం, నిర్ణయించిన ధరలు మార్కెట్లో తగ్గితే ఆ లోటును కూడా ప్రభుత్వాలు రైతుకు నగదుగా ఇస్తున్నాయి. కానీ ఇందులో ఏ ఒక్కటీ భారతదేశంలో అమలు జరగడం లేదు. రెట్టింపు కావడానికి చేపట్టాల్సిన చర్యలు: నాణ్యత గల వ్యవసాయ ఉపకరణాలు స్వదేశీ టెక్నాలజీలో పరిశోధన చేసి రైతులకు సకాలంలో అందించాలి. వ్యవసాయ భూమి తగ్గుదలను అరికట్టాలి. సకాలంలో పంటలకు సాగునీటి వసతి కల్పించాలి. సకాలంలో రుణాలు ఇవ్వాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రుణాలు వడ్డీ లేకుండా ఇవ్వడంతోపాటు, సహకార వ్యవస్థను బలపర్చాలి. పంటలు వేసేటప్పుడే ధరలు నిర్ణయించి, ఆ ధరలను అమలు జరపాలి. ప్రభుత్వమే అన్ని పంటలకు ప్రీమియం చెల్లించాలి. 60 సం.లు దాటిన రైతులకు పెన్షన్లు ఇవ్వాలి. బడ్జెట్లో 6% వ్యవసాయ రంగానికి కేటాయించాలి. పరిశోధనా కేంద్రాలలో స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విత్తనోత్పత్తి చేసి, రైతులకు అందించాలి. కార్పొరేట్ల జోక్యం ఉన్నంతకాలం రైతుల ఆదా యం పెరగదని ప్రపంచబ్యాంకు అనుకూల నిపుణులే వ్యాఖ్యానిస్తున్న అంశాలను కేంద్రం దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ప్రకటించిన విధానాలను మార్చాలి. వ్యాసకర్త: సారంపల్లి మల్లారెడ్డి, వ్యవసాయ నిపుణులు మొబైల్ : 94900 98666 -
అలా నెట్టుకొస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఇబ్బందులతో నెట్టుకొస్తోంది. ఈ విభాగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జిల్లాల పునర్విభజన వరకు అధికారుల కొరత ఉన్నా నెట్టుకొచ్చారు. నూతన జిల్లాల ఏర్పాటుతో ఈ కొరత మరింత తీవ్రమైంది. ప్రభుత్వం చేసే ప్రతీ పని, చేపట్టిన ప్రతీ పథకాన్ని ప్రజలకు చేరువచేసే సమాచార శాఖ పనితీరు కొత్త జిల్లాల్లో ఆశించిన రీతిలో లేదని.. ఆ విభాగంలోనే చర్చ జరుగుతోంది. మంజూరు కానీ పోస్టులు... కొత్త జిల్లాలకు డిస్టిక్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, అదనపు పీఆర్వో, డివిజన్ పీఆర్వో, ఇద్దరు ఆఫీస్ అసిస్టెంట్లు, టైపిస్ట్, సీనియర్ అసిస్టెంట్, అటెండర్ల పోస్టులు మంజూరు కావాలి. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఆ పోస్టులను మంజూరు చేయలేదు. జిల్లాల పునర్విభజన సమయంలో పంపిన ప్రతిపాదనలు పెండింగ్లోనే ఉండిపోయాయి. అలా ఉండగానే కొత్త జిల్లాలు ఏర్పాటుకావడంతో.. నూతన జిల్లాలకు డివిజన్ పీఆర్వోలను ఇన్చార్జిలుగా నియమించారు. రెండేళ్లు గడుస్తున్నా శాశ్వత సిబ్బందిని నియమించలేదు. ఉమ్మడి జిల్లాలకు డీపీఆర్వోలుగా ఉన్న అధికారులను కొన్ని చోట్ల కొత్త జిల్లాలకు ఇన్చార్జిలుగా కొనసాగిస్తున్నారు. కొంత మంది డిప్యూటీ డైరెక్టర్లుగా పదోన్నతి పొందినా ఇంకా జిల్లా పీఆర్వోలుగానే పనిచేస్తున్నారు. కాగా, సమాచార, ప్రజాసం బంధాల శాఖలో అధికారుల హోదాలో 300 మంది వరకు పనిచేస్తున్నారు. వీరిలో రెండేళ్లలో 35 శాతం మంది పదవీ విరమణ చేయబోతున్నారు. -
జోరువానలో.. 12 కిలోమీటర్లు డోలీలో..
-
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
నిర్మల్టౌన్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా విద్యారంగ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే మిగిలాయని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పూదరి బిట్టు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరె శేఖర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు పటిష్టపరిచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించడంతో పాటు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేజీ టూ పీజీ విద్యను ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఇందులో కార్యనిర్వాహక కార్యదర్శి భూషణ్, వినోద్, కైలాశ్, యోగేశ్ తదితరులున్నారు. -
దళిత విద్యార్థులంటే ఇంత చులకనా!
నాయుడుపేటటౌన్: నెల్లూరు జిల్లా ‘నాయుడుపేట గురుకులంలో పరిస్థితి ఇంత దారుణమా?, దళిత విద్యార్థులంటే ఇంత చులకనా’ అంటూ వైఎస్సార్సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గురుకులాన్ని బుధవారం ఆయన ఆ పార్టీ మున్సిపల్ ఫ్లోర్లీడర్ షేక్ రఫీ, మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, కౌన్సిలర్లు కేఎంవీ కళాచంద్ర, పలువురు నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఎమ్మెల్యే వంటగది వద్దకు వెళ్లారు. అపరిశుభ్ర పాత్రల్లో వంటలు చేస్తుండటం, మురికిమయంగా ఉన్న గ్రైండర్లోనే ఆకుకూర పప్పు వేసేందుకు ప్రయత్నిస్తుండటాన్ని చూసి ఇదేం పద్ధతి అంటూ కేర్ టేకర్గా ఉన్న గురుకుల పీడీ శ్రీరేష్పై మండిపడ్డారు. మోనూ ప్రకారం బుధవారం విద్యార్థులకు బెండకాయ తాళింపు వేయకపోవడాన్ని గుర్తించారు. అలాగే అన్నం సక్రమంగా వండకుండా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసి ఉండటం చూసిన కిలివేటి ‘మీ ఇంట్లో పిల్లలకు ఇలాగే పెడతారా’ అని వారిని ప్రశ్నాంచారు. పురుగులు పట్టిన బియ్యం, చెడిపోయిన కూరగాయలు, నాసిరకంగా ఉండే పప్పులు తదితరాలు స్టోరూంలో నిల్వలు చేసి ఉండటం చూచి ఇవేనా దళిత విద్యార్థులకు వండి పెడుతోంది అంటూ ఆగ్రహించారు. ‘ఎస్సీ విద్యార్థులంటే అంతా చులకనా’ అంటూ గురుకులు అధికారుల తీరుపై మండిపడ్డారు. అనంతరం తరగతి గదుల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే వద్దకు వెళ్లి తమ బిడ్డలు గురుకులంలో అధ్వాన పరిస్థితుల మధ్య చదువులు సాగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఇళ్ల వద్ద ఇలాగే పెట్టుకుంటారా? విద్యార్థులు వినియోగించే మరుగుదొడ్లు దుర్గందభరితంగా ఉండటం చూసిన ఎమ్మెల్యే చలించిపోయారు. మరుగుదొడ్ల పక్కనే విద్యార్థుల వసతి భవానలు ఉండటంతో పారిశుద్ధ్యం పనులు చేపట్టపోవడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. మీ ఇళ్ల వద్ద ఇలాగే పెట్టుకుంటారా అంటూ వారిని నీలదీశారు. గురుకులంలో పనిచేస్తున్న అధికారులు బాధ్యతారాహిత్యంగా ఉంటూ దళిత విద్యార్థులకు కల్పించాల్సిన వసతులపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలన్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా కార్యదర్శి పాదర్తి హరిరెడ్డి, నాయకులు దొంతాల రాజశేఖర్రెడ్డి, పార్టీ తిరుపతి పార్లమెంటరీ ఎస్సీ సెల్ కార్యదర్శి చేవూరు చెంగయ్య, రాష్ట్ర మహిళా కార్యదర్శి రత్నశ్రీ, విద్యార్థి విభాగం నాయకులు వెంకటేష్, ఇరుగు సాయి, విష్ణువర్ధన్రెడ్డి ఉన్నారు. -
బరువు మోస్తేనే..భోజనం!
ఈ ఫొటోలో భోజనం గంప నెత్తిన పెట్టుకుని క్యారీ చేతపట్టుకుని రోడ్డుపై నడుస్తున్న చిన్నారులు పొలం వద్దకు వెళుతున్నారనుకుంటే పొరబడినట్లే. పాఠశాలలో చదువుకుంటున్న తోటి చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఇలా బరువు మోస్తున్నారు. ప్రతిరోజు ఆ పాఠశాలలో చదివే చిన్నారులు పడుతున్న ఇబ్బందులు శనివారం సాక్షి కంటపడింది. మండలంలోని చిన్నగోపవరం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు వంట ఏజెన్సీ నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. పాఠశాల వద్ద వంటగది లేకపోవడంతో ఆమె తన ఇంటి వద్దే భోజనాన్ని తయారు చేస్తుంది. అయితే పాఠశాల ఊరి చివర ఉండటం, సుమారు కిలోమీటరు ఉండటంతో ఆ వృద్ధురాలు భోజనాన్ని పాఠశాల వద్దకు తీసుకెళ్లడం కష్టమైంది. దీంతో ఉపాధ్యాయులు ప్రతిరోజు భోజనాన్ని తీసుకువచ్చే బాధ్యత విద్యార్థులకు అప్పచెప్పారు. చేసేదేమీ లేక చిన్నారులు ఇలా భోజనం గంప నెత్తిన పెట్టుకుని నడిచి వెళుతున్న ఆ దృశ్యాన్ని చూసిన వారంతా అయ్యో పాపం ఎంత కష్టపడుతున్నారో అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభంశుభం తెలియని చిన్నారుల చేత బరువు మోయిస్తున్న విషయంపై హెచ్ఎం ఓబులేసును వివరణ కోరగా అందులో తప్పేముందని సమర్థించడం గమనార్హం. –గోపవరం -
మేము ఏమైనా దేశ ద్రోహులమా..?
విజయవాడ : రాష్ట్ర ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టారు. విద్యా రంగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తున్న ప్రభుత్వపు తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నాకు దిగారు. ఇందులో భాగంగా విజయవాడను వేదికగా చేసుకొని ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించడానికి సమాయత్తం అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఈ ధర్నాకు తరలివస్తున్నారు. పోలీసులు మాత్రం మహా ధర్నాకు అనుమతి లేదంటూ అడ్డుకోనే ప్రయత్నం చేస్తున్నారు. నిరసనల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయ సంఘాల నేతలను ఎక్కడిక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. విజయవాడ పరిధిలో ఇప్పటికే 16 మంది యూటీఎఫ్ నాయకులను అరెస్టు చేసి తిరువూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై ఉపాధ్యాయ సంఘాలు, నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసుల నిరంకుశ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. అక్రమ కేసుల పెట్టి ఉపాధ్యాయులను స్టేషన్లకు తరలిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదివేల మంది ఉపాధ్యాయలను పోలీసులు అరెస్టు చేశారని వారిని తక్షణమే విడుదల చేయాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయమని అడుగుతున్నామని ఉపాధ్యాయ సంఘ నేతలు తెలిపారు. తామేమీ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి స్థానం అడగలేదని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, సైకిళ్లతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. ఉపాధ్యాయ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని కోరామని కానీ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట తప్పి రాష్ట్రంలో యుద్ధ వాతారణం ఏర్పరచిందని మండిపడ్డారు. ఉపాధ్యాయ ఉద్యమ చరిత్రలో ఇలాంటి చీకటి అధ్యాయాన్ని ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. అర్ధరాత్రి వేళ ఉపాధ్యాయులపై బైండోవర్ కేసులు పెట్టి అరెస్టు చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ఎప్పుడూ ఉపాధ్యాయులపై ఇంత దుర్మార్గంగా వ్యహరించలేదని అన్నారు. ఈ చర్యలకు అన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. బలవంతంగా అడ్డుకొని పోలీస్స్టేషన్లో పెట్టడానికి ఉపాధ్యాయులు ఏమైనా దోశద్రోహులా అని సంఘాల నేతలు ప్రశ్నించారు. మహాధర్నాకు మొదట అనుమతి ఇచ్చామని చెప్పిన ఏసీపీ తరువాత మాట మార్చి నోటీసులు పంపించారని విమర్శించారు. -
జలమే గరళమై..
ఆ ఊళ్లో ఓ చేదబావి లేదు.. ఓ చేతిపంపూ లేదు.. తాగుదామంటూ గుక్కెడు మంచినీళ్లు కరువు.. గ్రామస్తులకు వ్యవసాయ బావే దిక్కు.. అన్ని అవసరాలకు అవే నీళ్లు.. ఆ జలం కలుషితమై.. ఆపై గరళమై జనం ప్రాణాలను కాటేసింది. తాంసి మండలం అట్నంగూడలో కలుషిత నీటి కారణంగా అతిసారం ప్రబలింది. వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతి చెందారు. మరో 11 మంది తీవ్ర అస్వస్థతతో ఆదిలాబాద్ రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. తాంసి(బోథ్): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం గిరిగాం గ్రామ పంచాయతీ పరిధి అట్నంగూడలో అతిసారం ప్రబలింది. కలుషిత నీరుతాగి వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గుపై ఓ విద్యార్థిని, మరో వృద్ధురాలు మృతిచెందారు. 11 మంది అస్వస్థతకు గురై జిల్లా కేంద్రంలోని రి మ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రా మంలో తాగునీటి బావి లేదు. దీంతో గ్రామ స మీపంలో ఉన్న వ్యవసాయ బావిలోని కలుషిత నీటిని తాగుతున్నారు. ఈ కారణంగానే అస్వస్థత కు గురైనట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. మూ డు రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన త లాండె బాపురావు(60) వాంతులు, విరేచనాలతో మృతి చెందాడు. అతడు అనారోగ్యంతో మృతి చెందినట్లు భావించారు. ఇదే క్రమంలో మంగళవారం గ్రామానికి చెందిన దుర్వ సుజాత(19), దుర్వ గంగుబాయి(60) వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని కుటుం బసభ్యులు రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా, సు జాత మార్గంమధ్యలో చనిపోయింది. గంగుబాయి ఆసుపత్రి చికిత్స పొందూతు మృతిచెం దింది. సుజాత మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గ్రామంలో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న తలండె జంగుబాయి(40), దుర్వ నిర్మలబాయి(45), పెందుర్ సీమ్(22), మడావి లక్ష్మి(26), అనక కౌసల్యబాయి(55)తో పాటు 11 మందిని ఆటోలు, 108ల ద్వా రా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జంగుబాయి పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నట్లు స్థానిక వై ద్య సిబ్బంది తెలిపారు. గ్రామంలో కనీసం బోరుబావి కూడా లేదని, దీంతో గ్రామ సమీపాన గల వ్యవసాయ బావి నీళ్లు తాగుతున్నామని గ్రామస్తులు తెలిపారు. వర్షాకాలంలో కలుషిత బావినీరు తాగడంతోనే అతిసారం ప్రబలిందని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. అతిసారంతో ఇద్దరు మృతి చెందిన వెంటనే తాంసి, భీంపూర్ పీహెచ్సీల వై ద్యులు, సిబ్బంది గ్రామంలో తిరుగుతూ అతి సారం లక్షణాలున్నవారికి చికిత్స అందిస్తున్నారు. -
పకడ్బందీగా రేషన్ బియ్యం పంపిణీ
జడ్చర్ల : జిల్లాలో రేషన్బియ్యం పంపిణీకి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. రేషన్ డీలర్ల సమ్మె నేపథ్యంలో మంగళవారం ఆయన జడ్చర్ల స్టాక్ పాయింట్ను పరిశీలించి బియ్యం పంపిణీకి సంబంధించి ఆరా తీశారు. సకాలంలో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అనంతరం జేసీ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 804 రేషన్ దుకాణాలకు సంబంధించి 420 దుకాణాలకు డీలర్లు డీడీలు కట్టారని మిగతా 384 రేషన్ దుకాణాలకు ఐకేపీ, మెప్మా ద్వారా ఆర్ఓలు జారీ చేశామని తెలిపారు. ఇప్పటికే 121 దుకాణాలకు బియ్యం స్టాక్ పాయింట్ల నుండి తరలించామని చెప్పారు. రాతీ, పగలు తేడా లేకుండా అదనపు లారీలను ఏర్పాటు చేసి గోదాముల నుండి అన్ని దుకాణాలకు బియ్యాన్ని చేరుస్తామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే 08542–241330 నంబర్ ఫోన్ చేయాలని సూచించారు. మండల స్థాయిలో తహసీల్దార్ను నోడల్ అధికారిగా నియమించగా, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, ఐకేపీ సీసీలను పర్యవేక్షకులుగా ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా పోలీసుల సహకారాన్ని కూడా తీసుకుంటామని తెలిపారు. స్థానిక తహసీల్దార్ లక్ష్మీనారాయణ, సివిల్ సప్లయీస్ డీటీ హరికృష్ణ, ఆర్ఐ రఘు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు మహబూబ్నగర్ న్యూటౌన్ : ప్రజాపంపిణీ కార్యక్రమంలో భాగంగా సరుకుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు సూచించారు. జడ్చర్ల నుండి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో సమీక్షించగా కలెక్టరేట్ నుండి డీసీఎస్ఓ శారదా ప్రియదర్శిని, సివిల్ సప్లయీస్ డీఎం బిక్షపతి పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 420 మంది డీలర్లు డీడీలు కట్టారని, మిగిలిన స్థానాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అన్నిచోట్ల ఈ నెల 5వ తేదీ నుండి 10వ తేదీ వరకు సరుకుల పంపిణీ చేయించాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియలో ఆలస్యం చేయొద్దు మహబూబ్నగర్ న్యూటౌన్ : జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం చేయొ ద్దని జేసీ ఎస్.వెంకట్రావు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళ వారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులతో పాటు జాతీయ రహదారి నిర్మాణం ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
రేషన్ డీలర్లతో చర్చలు జరపాలి
కరీంనగర్ సిటీ : తెలంగాణ ప్రభుత్వం వెంటనే రేషన్ డీలర్లతో చర్చలు జరిపి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా శాఖ డిమాండ్ చేసింది. శనివారం కరీంనగర్ తెలంగాణ చౌక్లో గజ్వేల్లో డీలర్ వజీన్ఖాన్ ఆత్మహత్యాయత్నం చేసినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ రేషన్ డీలర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమస్యలను విన్నవించుకుంటే స్పందించని ప్రభుత్వం సమ్మెను విచ్చిన్నం చేయడానికి అన్ని విధాలా బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. సమస్యలు పరిష్కరించకుండా డీడీలు కట్టాలని ఒత్తిడి చేయడం తగదన్నారు. సస్పెన్షన్ నోటీసును చూసి గజ్వేల్కు చెందిన డీలర్ ఆత్మహత్యాయత్నం చేసి చావుబతుకుల్లో ఉన్నాడని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రేషన్డీలర్లతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారుడు కూర ధర్మరాజు, జిల్లా కార్యదర్శి సదానందం, రాష్ట్ర రేష న్ డీలర్ల మహిళా అధ్యక్షురాలు వసంత, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే హైదర్, జిల్లా కోశాధికారి గాలి గట్టయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి శరణ్కుమార్, నాయకులు శ్రీనివాస్, రవీందర్, లక్ష్మణ్, నరేష్, రమేశ్, ప్రతాప్, భాస్కర్, రాజేశ్వర్రావు, నర్సయ్య, శ్రీనివాస్, చంద్రమౌళి, అశోక్, నర్సిం హారెడ్డి, శంకర్లింగం, రాము తదితరులున్నారు. -
తెలిసే తప్పులు
సుభాష్నగర్(నిజామాబాద్అర్బన్) : విద్యాశాఖ లో ఓ జిల్లాస్థాయి అధికారి భార్య ఘన్పూర్ పాఠశాలలో తొమ్మిదేళ్లుగా ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాల రెండేళ్ల క్రితం వరకు 20 శాతం హెచ్ఆర్ఏ పరిధిలో ఉండేది. తర్వాత జరిగిన హెచ్ఆర్ఏల మార్పిడిలో మూడో కేటగిరిలోకి పాఠశాల చేరింది. ఆమెకు ఏడేళ్లు 20 శాతం హెచ్ఆర్ఏ పాయింట్లు, రెండేళ్లు 12.5 శాతం హెచ్ఆర్ఏలో స్కూల్ కేటగిరి పాయింట్లు కేటాయించాలి. కానీ 9 ఏళ్లు 12.5 శాతం హెచ్ఆర్ఏ కేటగిరిలో ఉన్నట్లే చూపించి 27 పాయింట్లు వేశారు. దీంతో సీనియారిటీ జాబితాలో ఆమె వేలమంది టీచర్ల కంటే ముందు వరుసలో చేరిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న బదిలీ ప్రక్రియ రచ్చకెక్కుతోంది. ప్రక్రియలో మొదటి నుంచీ చోటుచేసుకుంటున్న అవకతవకలు ఆ శాఖకే మచ్చతెస్తున్నాయి. శనివారం వెబ్సైట్లో ఉంచిన సీనియారిటీ జాబితానే అందుకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. స్కూల్ కేటగిరి పాయిం ట్లు, ఎస్సెస్సీ కేటగిరి పాయింట్లలో జరిగిన లోపాలు విద్యాశాఖ అధికారులకు తెలియవా అనే ప్రశ్న లు తలెత్తుతున్నాయి. బదిలీల్లోభాగంగా మొన్న ప్రిఫరెన్సియల్ కేటగిరి అవకతవకలు జరగగా, నేడు సీనియారిటీ జాబితాలో అవే తప్పులు చోటు చేసుకున్నాయి. తద్వారా కిందిస్థా యి ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా మొదటగా ప్రిఫరెన్సియల్ కేటగిరి వారి కి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వా త సర్వీస్, స్కూల్ కేటగిరి, ఎస్సెస్సీ, స్పౌజ్ కేటగిరి, సంఘం నాయకులు, ఇత రాత్ర కేటగిరీలకు పాయింట్లు కేటాయించారు. స్కూల్ కేటగిరి, ఎస్సెస్సీ, స్పౌజ్ కేటగిరీల్లో అక్కడక్క డా అవకతవకలు చోటు చేసు కున్న ట్లు ఆరోపణలు ఉన్నాయి. స్కూల్ కేటగిరి పాయింట్లలో నాలుగు రకాలుగా పాయింట్లను కేటాయి స్తారు. అందులో 20 శాతం హెచ్ఆర్ఏలో పని చేసిన, చేస్తున్న వారు తక్కువ కేటగిరీలో పని చేస్తున్నట్లు చూపిస్తున్నారు. తద్వారా వారికి పాయింట్లు పెరిగే ఆస్కారం ఉంది. హెచ్ఆర్ఏల మార్పిడిలో సక్రమంగా పరిశీలన జరగలేదు. ఎస్సెస్సీ కేటగిరీలో పాయింట్లు ఇష్టానుసారంగా వేసుకున్నట్లు వెలుగులోకి వచ్చాయి. జిల్లా విద్యాశాఖ వద్ద పదోతరగతి రిజల్ట్స్ పూర్తిస్థాయిలో ఉంటాయి. అయినప్ప టికీ టీచర్లు ఇష్టానుసారంగా వేసుకున్న పాయింట్ల ఆధారంగానే సీనియారిటీ గుర్తించడం జరిగింది. అంటే జిల్లా కమిటీ ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.స్పౌజ్ కేటగిరిలోనూ అవకతవకలు చోటుచేసుకున్నా యి. భార్యభర్తల్లో ఒకరికి 8 ఏళ్లల్లో ఒకరికి మాత్రమే 10 పాయింట్లు కేటాయిస్తారు. ఇద్ద రూ ఒకే శాఖలో పని చేస్తే తప్పు జరిగేందుకు ఆస్కారం ఉండకపోవచ్చు. కానీ ఇద్దరు వేర్వే రు శాఖల్లో పనిచేసే వారైతే పాయింట్ల కోసం గతంలో స్పౌజ్ కేటగిరీని వినియోగించుకోలేదనే ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ గుర్తిం పు పొందిన సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 10 పాయింట్ల చొప్పున కేటాయిస్తున్నారు. ఇటీవలే కొన్ని సం ఘాలకు ప్రభుత్వం గుర్తింపు నిచ్చింది. ఈ క్రమంలో రాత్రికి రాత్రే సంఘం బాధ్యులు మారిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి, రెండు సంఘాల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుం డా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పేర్లు జిల్లాపరిషత్ (లోకల్బాడీస్) జా బితాలో, జిల్లాపరిషత్ ఉపాధ్యాయుల పేర్లు ప్రభుత్వ పాఠశాలల జాబితాలో వచ్చా యి. డీఈఓపై కలెక్టర్ ఆగ్రహం..? ఉపాధ్యాయ బదిలీల్లో అవకతవకలపై జిల్లా కలెక్టర్ డీఈఓపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలి సింది. మొన్న మెడికల్ సర్టిఫికెట్లలో ఎలా లోపాలు జరిగాయని ప్రశ్నించినట్లు సమాచా రం. బదిలీలు పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. ప్రిఫరెన్సియల్ కేటగిరి, సీనియారిటీ జాబితాలను హెచ్ఎంలు, ఎంఈఓల స్థాయిలో మండల కమిటీ, డీఈఓ స్థాయి లో జిల్లా కమిటీలు పరిశీలించిన తర్వాత కూడా ఎలా లోపాలు జరుగుతున్నాయన్నది ఎవరికీ అం దని ప్రశ్న. అన్నీ తప్పులు తెలిసే జరుగుతున్నాయని టీచర్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. మెడికల్ సర్టిఫికెట్లలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి. 19న ఫైనల్ జాబితా ఉంచుతాం సీనియారిటీ జాబితాలో ఒకటి,అర లోపాలు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. 16, 17 తేదీల్లో లోపాలకు సంబంధించిన అప్పీళ్లను స్వీకరిస్తాం.ఇప్పటికే ఎంఈఓలు ఆయా ఎమ్మార్సీల్లో అందుబాటులో ఉంటున్నారు. ఉపాధ్యాయులే ఆన్లైన్ అప్లికేషన్లో చేసిన పొరపాట్ల వల్లే లోపాలు జరిగాయి. వాటి కోసమే రెండ్రోజు లు సమయమిచ్చాం. ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదు. 19న ఫైనల్ జాబితాను వెబ్సైట్లో ఉంచుతాం. - నాంపల్లి రాజేష్, డీఈఓ -
నేడు ఒమన్లో ఓపెన్ హౌస్
సాక్షి : ఒమన్ దేశ రాజధాని మస్కట్లోని భారత రాయబార కార్యాలయంలో నేడు (శుక్రవారం) మధ్యాహ్నం 2.30 గంటలకు ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు. ఆ దేశంలో నివసించే ఎన్నారైలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఇండియన్ ఎంబసీ అధికారులతో నేరుగా తమ సమస్యలను చర్చించే అవకాశం లభిస్తుంది. ఒమన్లో ఇబ్బందుల్లో ఉన్న భారతీయులు ఎంబసీ హెల్పలైన్ నెంబర్ +968 2469 5981 టోల్ఫ్రీ నంబర్ 8007 1234కు సంప్రదించవచ్చు. ఎంబసీ ఇ-మెయిల్ cw.muscat@mea.gov.in మరియు inde mbassy.muscar@mea.gov.in ఇండియన్ ఎంబసీ వెబ్సైట్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. -
‘దోస్త్’ కుదరలేదు
ఈ ఫొటోలో కనిపిస్తున్న విద్యార్థులు జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్, ఎంవీఎస్ కళాశాలల్లో డిగ్రీ కోర్సుల్లో సీట్లు పొందారు. ‘దోస్ట్’ ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో సీటు వచ్చిన తర్వాత చేరాలంటే ఖచ్చితంగా ఫీజు చెల్లించాలని కళాశాలల అధికారులు చెప్పడంతో ఇలా బ్యాంకు ముందు బారులు తీరారు. ప్రవేశం పొందేందుకు బుధవారం ఆఖరి తేదీ కావడంతో పెద్దసంఖ్యలో విద్యార్థులు రావడంతో బ్యాంకు అధికారులు బయట నిలబెట్టి ఒక్కొక్కరిని లోపలకు పంపించారు. సాక్షి, మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ : ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ) కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రవేశాల సమయంలో ఇచ్చిన సమాచారం.. ఇప్పుడు చెబుతున్న మాటలకుపొంతన లేకుండా పోవడంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇదేకాకుండా ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు తీసుకునే విద్యార్థులు ఫీజులు చెల్లించాలన్న అపోహపై ఎవరూ స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థులను కలవరానికి గురి చేస్తోంది. ఫలితంగా తొలి దశ సీట్ల కేటాయింపు పూర్తయినా ఇంకా పలువురు విద్యా ర్థులు రిపోర్ట్ చేయకపోగా.. ప్రభుత్వ కళాశాలలో చేరేం దుకు ఫీజు చెల్లించాలన్న ప్రచారంతో బ్యాంకుల వద్ద బారులు తీరి కనిపిస్తుండడం గమనార్హం. మొత్తం 90 కళాశాలలు పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 90 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటన్నింటల్లో కలిపి 34,555 సీట్లు ఉండగా, మొదటి దశ కింద ‘దోస్త్’ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో 8,128 మందికి సీట్లు కేటాయించారు. అయితే, ఇందులో ఇప్పటివరకు కేవలం 5,636 మందే సీటు వచ్చిన కళాశాలల్లో రిపోర్టు చేశారు. రిపోర్టు చేసే గడువు ముగిసినా ఇంకా 2,492 మంది విద్యార్థులు చేరలేదు. వీరికి కళాశాల మార్చుకునేందుకు కానీ రెండో కౌన్సిలింగ్ సీటు కేటాయించే పరిస్థితి కానీ లేదు. ఖచ్చితంగా సీటు కేటాయించిన కళాశాలలోనే ప్రవేశం పొందాల్సి ఉన్నా గడువు ముగిసినా స్పందన రాలేదు. అయితే, చాలా మంది విద్యార్థులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోగా సీటు వచ్చిన వారు కళాశాలలో చేరే రోజే ఫీజు చెల్లించాలన్న నిబంధన ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో పలువురు అప్పు చేసి మరీ ప్రవేశాలు పొందగా.. మరికొందరు దూరంగా ఉండిపోయారు. ప్రభుత్వ కళాశాలల్లో ఫీజులా ? జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 21 ఉండగా సాదారణంగా చాలా మంది ప్రభుత్వ కళాశాలల్లో సీటు కోరుకుంటారు. ఇదేవిధంగా ఆప్షన్లు ఇచ్చే సమయంలో ప్రభుత్వ కళాశాల అంటే ఫీజు చెల్లించాల్సిన అవసరముండదని భావించారు. కానీ సీట్లు వచ్చిన విద్యార్థులు సాధారణ కోర్సులైతే రూ.2,500, సెల్ప్ పైనాన్స్ కోర్సులైతే రూ.4,875 ఖచ్చితంగా చెల్లించాలని ప్రభుత్వ కళాశాలల అధికారులు హుకూం జారీ చేస్తున్నారు. అయితే, దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకునే సమయంలో వెబ్సైట్లో ఈ నిబంధన లేకపోగా ఇప్పుడూ లేదని కొందరు చెబుతున్నారు. కానీ కొన్ని కళాశాలల ఉద్యోగులు ఫీజు తప్పనిసరి అని చెబుతుండడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. చాలామంది విద్యార్థులు అప్పు చేసి ఫీజు కట్టగా.. మరికొందరు ప్రవేశాలకు దూరంగా ఉండిపోయారు. మొదటి దశలో ప్రభుత్వ కళాశాల్లోనే అధికంగా సీట్లు కేటాయించినా 2,492 మంది కళాశాలల్లో చేరకపోవడానికి ఇదే కారణమని తెలుస్తోంది. కాగా, యూనివర్సిటీల పరిధిలో ఉన్న కళాశాలల్లో ఎన్ని కోర్సులు ఉన్నాయి.. అందులో ఎందరు విద్యార్థులకు సీట్లు కేటాయించాలి.. ఎంత ఫీజు నిర్ధారించాలనే అంశాలను ప్రభుత్వం యూనివర్సిటీల పరిధి నుండి తొలగించింది. ఈక్రమంలో చాలా వరకు కోర్సులు, ఫీజుల వివరాలు తప్పుగా కనిపిస్తున్నాయి. దరఖాస్తుకు రూ.600 దోస్ట్ ద్వారా దరఖాస్తులో భాగంగా రిజిస్ట్రేషన్కు రూ.200 గా నిర్ణయించిన ప్రభుత్వం, రెండో దశలో దాన్ని రూ.400 కు పెంచింది. రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు మీ సేవ సెంటర్లకు రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. ఇక జిరాక్స్లు, ఇతరత్రా ఖర్చులకు కలిపి ఇది రూ.600 కు చేరుతోంది. తద్వారా విద్యార్థులకు దరఖాస్తు దశ నుంచే ఆర్థిక భారం వెంటాడుతుండగా.. ఇప్పుడు ప్రవేశాల సమయంలో ఫీజు కట్టాలన్న ప్రచారం వారిని ఆవేదనకు గురి చేస్తోంది. కళాశాల్లో చేరాల్సిందే... మొదటి దశలో దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించిన కళాశాలల్లో ఖచ్చితంగా చేరాలన్న నిబంధన ఉంది. అయితే ఏవైనా ఇబ్బందులు కారణంగా మొదటి దశలో ప్రవేశం పొందకపోతే ఇతర కళాశాలల్లో ప్రవేశాలు పొందే అవకాశం లేకుండా పోయింది. దరఖాస్తు సమయంలో ఐదు నుండి పది కళాశాలను ఎంపిక చేసుకోగా దూరంగా ఉన్న కళాశాలలో సీటు వస్తే.. ఇతర కళాశాలకు మార్చుకునే అవకాశం కూడా లేకపోవడం గమనార్హం. తద్వారా విద్యార్థులు కేటాయించిన కళాశాలల్లోనే ప్రవేశం పొందాల్సిన పరిస్థితి నెలకొంది. మొదటి ప్రాధాన్యత కింద ఏదైనా ప్రైవేట్ కళాశాలలో సీటు కోరుకున్నా... దూరంగా ఉన్న ప్రైవేట్ కళాశాలల్లోనే సీటు వచ్చిందని పలువురు వాపోతున్నారు. -
పారదర్శకత కోసమే టీజేఎస్
సాక్షి, మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ : తెలంగాణలో రాజకీయ పార్టీలు ప్రజలే కేంద్రంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎదిర, టీచర్స్ కాలనీ, పాతపాలమూరు, బండ్లగేరిలో మంగళవారం ఆయన పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఎదిరలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పార్టీలు ఏర్పడాలే తప్ప స్వార్థరాజకీయాల కోసం కాదన్నారు. పారదర్శకతతో రాజకీయాలను అందించడానికే టీజేఎస్ పార్టీని ఏర్పాటుచేశామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల ను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామన్నారు. తెలంగాణ అమర వీరుల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండానే ఎదిరె పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేశారన్నారు. ఇలా విలీనం చేయడం వల్ల వ్యవసాయం చేసుకునే రైతులకు పన్నుల భారం పడుతుందని తెలిపారు. పుస్తకాలు కొత్తవి.. సమస్యలు పాతవి ప్రభుత్వం రైతులకు అందించిన చెక్కుల పంపిణీలో చాలా మంది రైతులకు అన్యాయం జరిగిందని కోదండరాం పేర్కొన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పాసు పుస్తకాలు మాత్రమే కొత్తవని, వాటిలో రైతుల పేర్లు సరిగా రాకపోవడం, భూమి పూర్తిస్థాయిలో రికార్డు కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. రైతులు అంటే ఆర్థికంగా వెనుకబాటు ఉండి, తక్కువ భూమిలో సేద్యం చేసుకునే నిజమైన లబ్దిదారులకు చెక్కులు ఇవ్వడం వల్ల న్యాయం జరుగుతుందన్నారు. చెక్కుల పంపిణీలో అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగే విధంగా టీజేఎస్ పార్టీ వెంట ఉంటుందన్నారు. అందుకోసం రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా పర్యటించి చెక్కుల పంపిణీలో ఉన్న లోటు పాట్లు రైతులకు జరిగిన ఇబ్బందిపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఈమేరకు పలువురు కోదండరాం సమక్షాన టీజేఎస్లో చేరగా, టీచర్స్ కాలనీలో ముస్లిం మహిళలకు రంజాన్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా కన్వీనర్ రాజేందర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వసంత నర్సింహులు, నాయకులు మంత్రి నర్సిహ్మయ్య, బాల్కిషన్, దేవరాజ్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. పాలమూరుపై కేసీఆర్ సవతి ప్రేమ మక్తల్ : సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాపై అభివృద్ధిలో సవతి ప్రేమ చూపిస్తున్నారని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మక్తల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గతంలో 90శాతం పనులు చేసి కేవలం 10 శాతం పనులు చేయలేదని అన్నారు. ఎన్నికల హామీలను ఏ మాత్రం అమలు చేయలేదని తెలిపారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు ఆవిర్భావ దినోత్సవం రోజున గౌరవించలేదని విమర్శించారు. అంతకు ముందు మక్తల్ పెద్ద చెరువులో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఒండ్రు మట్టిని తరలిస్తున్నారని చెప్పగా.. ఈ పనులు రైతుల కోసమా, ఇటుక బట్టీల వ్యాపారస్తుల కోసమా అని ప్రశ్నించారు. టీజేఎస్ కన్వీనర్ రాజేందర్రెడ్డితో పాటు నర్సిములు, సూర్యప్రకాష్, దత్తాత్రేయ, మొద్దు రాములు, పోలప్ప, జంసీర్, అశోక్ పాల్గొన్నారు. భూములు లేకుండా చేయడమేనా? మాగనూర్ (మక్తల్) : భూప్రక్షాళనలో జరిగిన అవకతవకల కారణంగా పేదలు తమ భూములపై హక్కులు కోల్పోయే ప్రమాదమున్నందున తక్షణమే రికార్డులు పూర్తిస్థాయిలో సరిచేయాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. భూప్రక్షాళనలో నష్టపోయిన రైతుల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలో రైతులతో ఫిర్యాదులు స్వీకరించారు. ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన పేద రైతులకు న్యాయం జరగడమేమో కానీ ఉన్న భూమి కోల్పోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. టీజేఎస్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, నర్సిములు, ముదిరాములు, సూర్యప్రకాష్ ఉన్నారు. -
ఓపెన్కాస్ట్ బ్లాస్టింగ్తో ఇబ్బందులు
సాక్షి, గోదావరిఖని(రామగుండం) : సింగరేణి రామ గుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ–2 డివిజన్ పరిధిలో గల ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్–3లో సోమవారం మట్టి తొలగించేందుకు ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థ చేపట్టిన బ్లాస్టింగ్ ధాటికి గోదావరిఖని విఠల్నగర్లోని ఓ ఇంట్లో ఫ్యాన్ ఊడి కిందపడింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న గాండ్ల వెంకటమ్మ అనే మహిళ చెవుకు గాయమైంది. ఆ సమయంలో తన కూతురు పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటుండగా వారిపై ఫ్యాన్ పడకపోవడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ఆదివారం కూడా ఇదే కాలనీలో నివసించే రాజు అనే కిరాణా వ్యాపారి ఇంట్లో బ్లాస్టింగ్ చేసిన తర్వాత ఫ్యాన్ కుప్పకూలింది. ఈ సమయంలో ఇంట్లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా ఓసీపీ–3లో మట్టి తొలగింపు పనుల కోసం చేస్తున్న బ్లాస్టింగ్కు వాడుతున్న పేలుడు పదార్థాలను ఎక్కువగా వినియోగిస్తున్న కారణంగానే తమ ఇళ్లు పగుళ్లు తేలడం, ఇంట్లో రేకులు, ఫ్యాన్లు ఊడిపడుతున్నాయని విఠల్నగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. అయితే బ్లాస్టింగ్ విషయమై గతంలో ఆందోళన చేసినప్పుడు తక్కువ సామర్థ్యంతో బ్లాస్టింగ్ చేస్తున్నారని, ఆ తర్వాత షరా మామూలుగానే వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ తెలిపారు. రెండు నెలల క్రితం ఓ ఇంట్లో మండంపై ఆడుకుంటున్న బాలుడిపై బ్లాస్టింగ్ జరిగిన సమయంలో పెద్ద బండరాయి పడింది. దీంతో బాలుడి కుటుంబసభ్యులు, స్థానికులు ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులోపలికి వెళ్లి వాహనాలు నడవకుండా రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో స్పందించిన యాజమాన్యం అధికారులను విఠల్నగర్ కాలనీకి పంపించి ఇళ్లల్లో అద్దాలను బిగించారు. ఆ సమయంలో అద్దాలు పగలకుండా తక్కువ స్థాయిలో బ్లాస్టింగ్ చేసి కాలనీవాసులను అధికారులు నమ్మించారు. ఆ తర్వాత షరా మామూలుగానే బ్లాస్టింగ్ చేస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. కాగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబసభ్యులు నివసించే ఈ కాలనీలో బ్లాస్టింగ్ వల్ల నష్టపోతున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని స్థానికులంటున్నారు. దీనికితోడు రామగుండం కార్పొరేషన్కు పన్నులు చెల్లిస్తున్నా అధికారులు సింగరేణి యాజమాన్యంతో ఏనాడు తమ గురించి చర్చించలేదని, ఇక తమ ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలని కాలనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం, రామగుండం కార్పొరేషన్ అధికారులు బ్లాస్టింగ్ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. -
రిజిస్ట్రేషన్లకు ఆటంకాలెన్నో..!
సాక్షి,ఆదిలాబాద్ : తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా మూడుచోట్ల ప్రారంభించగా, నామమాత్రంగానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే కొత్తగా ఈ ప్రక్రియ ప్రారంభించడంతో రానురాను గాడిలో పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ధరణి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడం తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆటంకమవుతుందని అధికారుల నుంచి వినిపిస్తున్న వాదన. లోపభూయిష్టంగా ఉన్న ఈ విధానం కారణంగా ఒత్తిడిలో పనిచేయలేమని తహసీల్దార్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 20 నుంచి ఉమ్మడి జిల్లాలోని మరికొన్ని తహసీల్దార్ కార్యాలయాల్లోనూ ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. నామమాత్రంగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మే 19న మూడు తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్, నిర్మల్ జిల్లా నిర్మల్రూరల్, మంచిర్యాల జిల్లా నెన్నెల తహసీల్దార్ కార్యాలయాల్లో పైలెట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించారు. గుడిహత్నూర్, నెన్నెలలో నామమాత్రంగా రిజిస్ట్రేషన్లు కాగా, నిర్మల్రూరల్లో కొంత పర్వాలేదనిపించింది. అయితే అధికారులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వకపోవడంతో ఆయా కార్యాలయాల్లో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది సహకారంతోనే తహసీల్దార్లు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడం కూడా ఆటంకం కలిగిస్తుంది. ప్రధానంగా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రతీ అంశంలో ఒక్కో సిబ్బంది అందుబాటులో ఉంటారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్తో పాటు ఆపరేటర్, సబార్డినేట్ మినహా ఇతర సిబ్బంది లేకపోవడం ఇబ్బందిగా మారింది. అదే సమయంలో ప్రస్తుతం ధరణి ప్రాజెక్టు కింద భూ వివరాలను క్రోడీకరించడం రెవెన్యూ సిబ్బందికి పెద్ద తలనొప్పిగా ఉంది. ప్రస్తుతం పాస్పుస్తకాల్లోనూ పెద్ద ఎత్తున తప్పులు దొర్లడంతో వాటిని సవరించే ప్రక్రియ చేపడుతున్నారు. ఇటు రెవెన్యూకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న అధికారులు రిజిస్ట్రేషన్ మీద దృష్టి సారించలేకపోతున్నామన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ రిజిస్ట్రేషన్లు చేపడదామన్నా ధరణికి సంబంధించి వెబ్సైట్ పూర్తిగా సిద్ధం కాకపోవడం పెద్ద ఆటంకంగా మారింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పటికీ ఇతర అంశాల పరంగా ప్రక్రియలను చేపట్టలేకపోతున్నారు. పట్టా మార్పిడి ఆప్షన్ ఇప్పటికీ రానట్టు చెబుతున్నారు. అదేవిధంగా కరెక్షన్లకు సంబంధించి ఎలా చేపట్టాలో స్పష్టత లేకపోవడం కూడా సిబ్బంది ఇబ్బందులకు కారణమవుతోంది. ఒక రిజిస్ట్రేషన్ను రద్దు (క్యాన్సలేషన్) చేయాలన్న దానికి కూడా ఆప్షన్ రావడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రతీ అంశంలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిపై ఆధారపడాల్సి వస్తోందని, దీంతో రిజిస్ట్రేషన్ చేపడతామన్న ధీమా కనపడటం లేదని ఓ అధికారి చెప్పారు. ధరణి వెబ్సైట్ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చనందునా అన్నిరకాల సవరణలు చేసే అవకాశం అమల్లోకి రాలేదని, వెబ్సైట్లో ఇచ్చిన ఆప్షన్లు కూడా సాంకేతికంగా లోపభూయిష్టంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ధరణి వెబ్సైట్ నిర్వాహకులు నియమించిన సిబ్బందికి సరైన నైపుణ్యత లేదని, కావాల్సిన అర్హతలు కూడా వారికి లేవని అధికారులు చెబుతున్నారు. వారిని వెంటనే వెనక్కి పంపించి నిపుణులను ఎంపిక చేసే బాధ్యత కలెక్టర్లకు ఇవ్వాలని అభిప్రాయ పడుతున్నారు. ధరణి వెబ్సైట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాతే సబ్రిజిస్ట్రార్ బాధ్యతలను అప్పగించాలని చెబుతున్నారు. అంతకుముందు సిబ్బంది, మౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఒత్తిడి.. ఓ వైపు రెవెన్యూ సంబంధిత పనుల్లో బిజీగా ఉంటూ మరోపక్క రిజిస్ట్రేషన్ చేపట్టడం తలకుమించిన భారంగా మారుతుందన్న అభిప్రాయం తహసీల్దార్లలో వ్యక్తమవుతుంది. రెవెన్యూ ఏతర పనులను తహసీల్దార్ల నుంచి, రెవెన్యూ సిబ్బంది నుంచి మినహాయించాలని కోరుతున్నారు. ఖాళీగా ఉన్న రెవెన్యూ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో దరఖాస్తుదారుడు డాక్యుమెంట్లో సూచించిన విధంగా మోకా(స్థలం) మీద పరిశీలన జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వివాదాలు చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదు. స్థలాన్ని పరిశీలించిన పక్షంలో డాక్యుమెంట్లో పొందుపర్చిన అంశాలు పూర్తిగా సరైనవా లేదా అన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా డాక్యుమెంటేషన్లో భూమి విస్తీర్ణం అధికంగా చూపడం, మోకా మీద భూమి తక్కువగా ఉండటం అంశాల కారణంగా అమ్మకం, కొనుగోలుదారుల మధ్య విభేదాలు చోటుచేసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాలకు ఈ బాధ్యతను అప్పగించిన తర్వాత అయినా స్థల పరిశీలన చేసి రిజిస్ట్రేషన్ చేస్తే ఉపయుక్తంగా ఉంటుందన్న అభిప్రాయం లేకపోలేదు. అదే సమయంలో తహసీల్దార్లపై కూడా రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ధరణి పూర్తయితేనే రిజిస్ట్రేషన్లు ధరణి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాతనే రిజిస్ట్రేషన్లు చేపట్టడం సులువుగా ఉంటుంది. గతంలో ఉన్న వెబ్ల్యాండ్ పిరియడ్ అయిపోయింది. ధరణికి సంబంధించి అన్ని అంశాలు ఆన్లైన్లో రాకపోవడం ఇబ్బందిగా ఉంది. పట్టా మార్పిడి ఆప్షన్ లేదు. సవరణ చేద్దామన్నా ఆ ఆప్షన్ కూడా లేదు. రిజిస్ట్రేషన్ క్యాన్సలేషన్, ఇతరత్రా అంశాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది సహకారం తీసుకొని ప్రస్తుతం చేపడుతున్నాం. – మోతీరాం, తహసీల్దార్, గుడిహత్నూర్ -
ఆన్లైన్తో ఆగమే..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు ‘ఆన్లైన్’ విధానాన్ని అనుసరించాలన్న నిర్ణయం గందరగోళానికి దారితీస్తోంది. ఈ విధానంలో దరఖాస్తుల దగ్గరి నుంచి పోస్టుల కేటాయింపు దాకా ఎన్నో సమస్యలు ఎదురుకాక తప్పదని ఉపాధ్యాయ సంఘాల నేతలే పేర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న పోస్టులు నచ్చకుంటే ‘నాట్ విల్లింగ్’ చెప్పే అవకాశం ఉండదని.. స్పౌజ్ కేటగిరీలో సమస్యలతోపాటు దుర్వినియోగానికీ ఆస్కా రం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఒక్క టీచర్ బదిలీ తప్పుగా జరిగినా.. ఆ తర్వాత వరుసగా ఉండే వేల మందికి బదిలీ ప్రాంతాలు మారిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. దీంతో టీచర్లు నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. అందువల్ల ఆఫ్లైన్లో బదిలీల ప్రక్రియ చేపట్టాలని.. కచ్చితంగా ఆన్లైన్లోనే బదిలీలు చేయాలనుకుంటే లోపాలను సరిదిద్ది, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే బదిలీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దరఖాస్తు చేసుకుంటే వెళ్లాల్సిందే.. నిబంధనల ప్రకారం.. ఒకే చోట 8 ఏళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను మాత్రమే తప్పనిసరిగా బదిలీ చేస్తారు. రెండేళ్లకుపైగా ఒకేచోట పనిచేస్తున్న వారు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ వారు తప్పనిసరిగా బదిలీ కావాలన్న నిబంధన లేదు. ఆఫ్లైన్ విధానంలో ఎవరైనా టీచర్ బదిలీల కౌన్సెలింగ్ సమయంలో తమకు నచ్చిన ప్రాంతాల్లో ఖాళీలు లేకపోతే.. ‘నాట్ విల్లింగ్’ చెప్పి యథాతథంగా ఉన్న స్థానంలోనే కొనసాగవచ్చు. అదే ఆన్లైన్ విధానంలో అయితే.. దరఖాస్తు చేసుకుంటే తప్పనిసరిగా బదిలీ కావాల్సి వస్తుంది. ఆ టీచర్ ఇచ్చే వెబ్ ఆప్షన్ల మేరకు ఎక్కడ పోస్టు కేటాయింపు జరిగినా వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే బదిలీకి అసలు దరఖాస్తే చేసుకోకుండా ఉండాల్సి వస్తుంది. ఉదాహరణకు శ్రీనివాస్ అనే టీచర్ ఓ పాఠశాలలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆయన కంపల్సరీ ట్రాన్స్ఫర్ (ఒకేచోట 8 ఏళ్లు పూర్తయి కచ్చితంగా బదిలీ కావాల్సిన టీచర్లు) జాబితాలో ఉండరు. ఆయన ప్రస్తుత స్థానంలో రెండేళ్లకు మించి కొనసాగుతున్నారు కాబట్టి బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం వచ్చింది. దీంతో ఆయన తాను కోరుకునే.. 50 ప్రదేశాలకు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఆయన సీనియారిటీ, ఇచ్చిన ఆప్షన్లను బట్టి ఒకటో ప్లేస్ నుంచి 50వ ప్లేస్ వరకు ఎక్కడికి బదిలీ వచ్చినా వెళ్లాల్సిందే. ఆప్షన్లు ఇచ్చుకున్న చోట్ల కంటే మంచి చోటు అందుబాటులో ఉన్నా.. ఆయనకు వచ్చే అవకాశం ఉండదు. అదే ఆఫ్లైన్ బదిలీల విధానంలో అయితే.. అప్పటికి అందుబాటులో ఉన్న అన్ని చోట్లలో తనకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. లేకుంటే ‘నాట్ విల్లింగ్ (బదిలీ కోరుకోవడం లేదు)’ అని చెప్పి.. ప్రస్తుతమున్న స్థానంలోనే కొనసాగవచ్చు. ఆన్లైన్ విధానంలో ఈ అవకాశం ఉండదు. ‘ఆన్లైన్’తో ప్రధాన సమస్యలివీ.. స్పౌజ్ కేటగిరీలో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు విద్యాశాఖ ఇచ్చే 10 ప్రాధాన్య పాయింట్లను వినియోగించుకుని దరఖాస్తు చేసుకుంటే.. స్పౌజ్ ఉన్న ప్రదేశంలోనే పోస్టింగ్ రావచ్చు, రాకపోవచ్చు. అంతేకాదు ఆ ప్రాధాన్య పాయింట్లను పొందేవారు.. వాటిని దుర్వినియోగం చేస్తూ, పట్టణ ప్రాంతాలకు వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. దీనికి అడ్డుకట్ట వేయడం కష్టం. దీంతో ఇతర కేటగిరీల వారికి నష్టం వాటిల్లుతుంది. ‘ఆన్లైన్’విధానంతో ఆప్షన్ల విషయంలోనూ గందరగోళం తప్పని పరిస్థితి. ఉదాహరణకు స్కూల్ అసిస్టెంట్ గణితం సబ్జెక్టును తీసుకుంటే.. ఒక జిల్లాలో 250 మంది గణితం టీచర్లు ఉన్నారనుకుందాం. సీనియారిటీ ప్రకారం సురేశ్ అనే టీచర్ 200వ స్థానంలో ఉంటే... తనకు ముందున్న 199 స్థానాలను ఖాళీలుగానే భావించి.. నచ్చిన స్థానాలకు వరుసగా ఆప్షన్లు ఇవ్వాలి. దాంతోపాటు మరో 100 ఖాళీ పోస్టులు ఉన్నాయనుకుంటే.. వాటిని కూడా కలిపి మొత్తం 299 స్థానాలకు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఇలాంటపుడు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో తెలియదు. వచ్చిన చోట చేరిపోవాల్సిందే. లేదంటే బదిలీకే దరఖాస్తు చేసుకోవద్దు. ఇక సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీల) విషయంలో పరిస్థితి మరింత కష్టంగా ఉండనుంది. ప్రతి జిల్లాలో బదిలీ అర్హత కలిగిన ఎస్జీటీలు దాదాపు ఐదు వేల మంది వరకు ఉంటారు. దాంతో ఏ స్థానాలు ఖాళీ అవుతాయో, ఎవరెక్కడి వెళతారో తెలియదు. కాబట్టి ప్రాధాన్య క్రమంలో వేల ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి వస్తుంది. పైగా ఎక్కడ పోస్టింగ్ వస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది. విడో, మెడికల్, వికలాంగులు, ఇతర ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన కష్టమే. ఇందుకు రెండు రోజులు సమయం కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ సాధ్యం కాదు. మ్యాన్యువల్ బదిలీల సమయంలో సంఘాల పర్యవేక్షణ ఉన్నపుడే.. అనర్హులకు ప్రాధాన్యత లభించింది. అదే ఆన్లైన్ విధానంలో ప్రత్యక్షంగా పరిశీలించేందుకు, అభ్యంతరాలు చెప్పేందుకు అవకాశమేదీ ఉండదు. బదిలీలు పూర్తయ్యాక ఎవరైనా గుర్తిస్తేనే విషయం బయటకు వస్తుంది. లేదంటే అంతే. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాకే.. ‘‘బదిలీలకు ప్రభుత్వమిచ్చిన గడువు ఇంకా 12 రోజులే ఉంది. ఈ తక్కువ సమయంలో ఆన్లైన్లో లోపాల సవరణ, టీచర్లకు అవగాహన కల్పించడం కష్టం. ఇలా గందరగోళంగా బదిలీలు చేసి అభాసుపాలయ్యే కన్నా.. అన్ని ఏర్పాట్లు చేసుకుని బదిలీలు చేపడితే.. పారదర్శకంగా జరుగుతాయి. ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుంది..’’ – సరోత్తంరెడ్డి, పీఆర్టీయూ అవగాహన లేకుంటే నష్టమే.. ‘‘ఆన్లైన్ బదిలీ ప్రక్రియపై టీచర్లకు అవగాహన కల్పించాలి. లేదంటే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అవగాహన కల్పించేందుకు ఎక్కువ సమయం పడుతుంది. హడావుడిగా చేస్తే సమస్యలు తలెత్తుతాయి..’’ – ప్రతాప్రెడ్డి, టీఆర్టీఎఫ్ ముందు లోపాలు సవరించాలి ‘‘ఆన్లైన్ విధానంలో ముందు లోపాలన్నింటినీ సవరించి బదిలీలు చేయాలి. లేకపోతే టీచర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అయితే ఆన్లైన్ వల్ల అక్రమాలకు చెక్ పడుతుంది.’’ – రవి, యూటీఎఫ్ ఒక్క పొరపాటు జరిగినా సమస్యే ‘‘ఆన్లైన్లో ఒక్క పొరపాటు దొర్లినా అంతా గందరగోళంగా మారిపోతుంది. ఖాళీల జాబితాలో ఒక్క ఖాళీ తప్పుగా చూపించి (క్లియర్ వేకెన్సీ కాకపోతే), ఆ ఖాళీకి ఎవరైనా ఆప్షన్ ఇస్తే.. ఆ టీచర్కు కేటాయింపు జరిగిపోతుంది. మిగతావారికి వరుస క్రమంలో కేటాయింపులు జరిగిపోతాయి. దాంతో గందరగోళం నెలకొంటుంది..’’ – శ్రీపాల్రెడ్డి, పీఆర్టీయూ -
‘లోకల్’ డబుల్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఏర్పాటు చేయతలపెట్టిన కొత్త జోన్లు, స్థానికత నిర్ధారణపై కొత్త చిక్కులు ముసురుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పలు సవరణలు ఆచరణలో ఇబ్బందికరంగా మారుతాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి మధ్య నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడి స్థానికత వర్తిస్తుందన్న నిర్వచనంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దానివల్ల తెలంగాణ వారికి నష్టం జరిగే అవకాశం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. హడావుడితో కొత్త సమస్యలు కొత్త జోనల్ విధానానికి ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. పాత జోనల్ వ్యవస్థలో మార్పులు చేసిన సర్కారు.. కొత్తగా ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లుగా పునర్ వ్యవస్థీకరించింది. ఈ మేరకు 371 (డి) కింద జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపింది. అయితే ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్న హడావుడిలో ప్రభుత్వం చేసిన కసరత్తు కొత్త సమస్యలకు దారితీస్తోంది. కొత్త ‘స్థానికత’తో నష్టమే! జోనల్ వ్యవస్థ మార్పులతో పాటు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని స్థానికత నిర్వచనం కూడా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో అమల్లో ఉన్న విధానం ప్రకారం నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు నాలుగేళ్లు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లా స్థానికతగా పరిగణిస్తారు. తాజాగా ప్రభుత్వం దీనిలో మార్పు చేస్తూ ఒకటి నుండి ఏడో తరగతి వరకు నాలుగేళ్ల పాటు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లా స్థానికతగా పరిగణించాలని నిర్ణయించింది. అయితే అటు ఆంధ్రప్రదేశ్లో పాత విధానమే అమల్లో ఉంది. దీంతో తెలంగాణ అభ్యర్థులకు నష్టం జరుగుతుందనే వాదనలు వస్తున్నాయి. ఉదాహరణకు ఎవరైనా అభ్యర్థి ఒకటి నుంచి 4 లేదా 5వ తరగతి వరకు తెలంగాణలో చదివి, తర్వాత పదో తరగతి వరకు ఏపీలో చదివితే... రెండు చోట్లా స్థానికులుగా అర్హత పొందుతారు. అంటే ఏపీకి చెందినవారు తెలంగాణలోని స్థానిక కోటాలోనూ ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని... అదే జరిగితే తెలంగాణ స్థానికులు నష్టపోతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానికతకు కొత్త నిర్వచనం వివాదాస్పదంగానే ఉందని ఉద్యోగ సంఘాల నేతలు సైతం పేర్కొంటున్నారు. రాష్ట్ర కేడర్ లేకుంటే ఎలా? కొత్త జోనల్ వ్యవస్థ ప్రతిపాదనల్లో.. రాష్ట్ర కేడర్ పోస్టులను మల్టీ జోనల్ పోస్టులుగా మార్చడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. ఇతర రాష్ట్రాల్లో జోనల్ విధానమే లేదు. అన్ని రాష్ట్రాల్లో స్టేట్ కేడర్ నియామకాలు ఉన్నాయి. కానీ రాష్ట్రం రూపొందించిన కొత్త విధానంలో కొత్తగా మల్టీ జోనల్ పోస్టులను తెచ్చారు. ఈ మల్టీజోనల్ పోస్టుల్లో నియామకాలు చేపట్టి పదోన్నతుల ద్వారా స్టేట్ కేడర్ను భర్తీ చేయాలని నిర్ణయించారు. అంటే స్టేట్ కేడర్ పోస్టుల్లో నేరుగా నియామకాలు ఉండవు. దీనికితోడు అన్ని కేడర్ పోస్టుల్లో 95 శాతం స్థానికులకే రిజర్వు చేసే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల తెలంగాణలో ఉంటున్న ఇతర ప్రాంతాలవారికి గతంలో ఉన్న పదిహేను శాతం ఉద్యోగాల అవకాశం కూడా కోల్పోతారని అంటున్నారు. అయితే స్థానికులకు, ప్రధానంగా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల వారికి ఈ నిర్ణయం మేలు చేస్తుందని చెబుతున్నారు. -
డ్వాక్రా మహిళలకు తప్పనిపాట్లు
నరసన్నపేట : సారవకోట మండలం రంగసారం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభ కోసం బస్సుల్లో వచ్చిన డ్వాక్రా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం ఎండతీవ్రత ఎక్కువగా ఉండటం.. సభాస్థలికి ఐదు కిలో మీటర్లు దూరంలో బస్సులు నిలిపివేయడంతో వాటి వద్దకు చేరుకొనే సరికి నానా అవస్థలు పడ్డారు. పులిహోరా ప్యాకెట్లు ఇచ్చినా మంచి నీరు ఇవ్వలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ఆంక్షల పేరున కిలో మీటర్ల దూరంలో బస్సులు నిలిపి వేయడంతో ఎండ తీవ్రతకు గురయ్యారు. సభ అనంతరం వచ్చిపోయో వాహనాలతో సారవకోట–రంగసాగరంల మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఇదిలా ఉండగా, స్వయం శక్తి సంఘాల మహిళలతో పాటు ఉపాధి వేతనదారులు కూడా అధిక సంఖ్యలో సభా ప్రాంగణానికి తరలించారు. ఇందుకు ప్రతిఫలంగా ఉపాధి వేతనదారులకు ఫ్రీ మస్తర్ వేసి ఒక్కో కూలీకి రూ.150 వచ్చేలా ఫీల్డు అసిస్టెంట్లు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. -
కంది.. కదలనంటోంది!
సాక్షి, కురిచేడు : రెండేళ్లుగా కందులు రైతుల లోగిళ్లలో నిల్వ ఉన్నాయి. నెలల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద క్యూలో నిలబడినా రైతుకు మాత్ర ఫలితం దక్కలేదు. పరపతి సంఘాల్లోని అధికార పార్టీ నాయకులు సీరియల్లో ఉన్న తమకు మొండిచేయి చూపి వారి అనుయాయులకు ప్రాధాన్యమిచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. కందుల కేంద్రంలో కాకుండా బయట కూడా కాటా వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కురిచేడు మండలంలోని కురిచేడు, ఎన్.ఎస్.పి.అగ్రహారం సహకార పరపతి సంఘాల పరిధిలోని కందుల కొనుగోలు కేంద్రాలకు టార్గెట్లు పూర్తయ్యాయంటూ మార్క్ఫెడ్ వారు ఏప్రిల్ 30 నుంచి కొనుగోళ్లు నిలిపివేశారు. పడమర వీరాయపాలెం కొనుగోలు కేంద్రం ఒక్కటి మాత్రమే నిర్వహణలో ఉంది. దీంతో కందుల నిల్వలు ఉన్న రైతులంతా కలిసి కొనుగోళ్లకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖామంత్రి శిద్దా రాఘవరావు ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. కానీ ఇంతవరకు అనుమతి రాకపోవటంతో కేంద్రాలు నిలిచిపోయి ఉన్నాయి. కానీ గడచిన సోమ, మంగళవారాలలో మార్కెట్ యార్డు పక్కన వున్న శ్రీనివాసనగర్లో ఓ రైతు ఇంటి వద్ద కందులు కొనుగోలు జరుగుతుండటంతో కలకలం రేగింది. కొందరు రైతులు వాటిని ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో గుట్టు రట్టయింది. అసలేం జరిగిందంటే..! కందుల కొనుగోలు కోసం కేంద్రాలు ప్రారంభించే ముందు ప్రభుత్వం అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించింది. కానీ అధికారులు మెట్ట భూముల్లో ఎకరానికి నాలుగు క్వింటాల్లు, మాగాణి భూములలో ఎకరానికి 7 క్వింటాళ్ల ప్రకారం దిగుబడి వస్తుందని ప్రభుత్వానికి తెలిపారు. ప్రభుత్వం అందులో సగం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి మెట్ట భూముల రైతులు నీరు అందుబాటులో ఉన్నంత వరకు ఎన్నో వ్యవ ప్రయాసలకు ఓర్చి మూడు కిలోమీటర్ల వరకు నీరు పెట్టి ఎకరానికి 7 క్వింటాళ్ల వరకు పండించారు. మాగాణి భూముల్లో 12 క్వింటాళ్ల వరకు పండించారు. దీంతో రైతుల వద్ద కందులు ఇబ్బడి ముబ్బడిగా మిగిలిపోయాయి. మిగిలిన కందులను ఏంచేయాలో అర్థంకాక, కొనుగోలు కేంద్రాల్లో కొనక, బయట తక్కువకు అడుగుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3500 టన్నులు కొనుగోలు చేశారు.. ఇప్పటి వరకు కురిచేడు కొనుగోలు కేంద్రం ద్వారా 3500 టన్నులు కందులు కొనుగోలు చేశారు. మరో 750 టన్నులకు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్.ఎస్.పి. అగ్రహారం కొనుగోలు కేంద్రం పరిధిలో 1800 టన్నులు కొనుగోలు చేశారు. మరో 1300 టన్నుల కొనుగోలుకు అనుమతి కావాలని కోరుతున్నారు. పడమర వీరాయపాలెం కొనుగోలు కేంద్రం పరిధిలో 650 టన్నులకు అనుమతి ఇచ్చారు. కొనుగోలు జరుగుతుంది. ఈ నెల 15 వరకు కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖలు రాయటం జరిగింది. –జోత్స్నదేవి, కురిచేడు, ఏఓ రెండు నెలల తర్వాత వెనక్కు పంపారు మార్చి నెలలో 13వ తేదీ కందుల కొనుగోలుకు సీరియల్ ఇచ్చారు.కాని రెండు నెలల పాటు కాగితాలు వారి వద్ద ఉంచుకుని తిరిగి ఇప్పడు ఇచ్చారు. యార్డు మూసి వేసిన తరువాత అనుమతి కోసమంటూ మరలా కాగితాలు తీసుకుని అనుమతి వస్తుందని తెలిశాక వెనక్కు ఇచ్చారు. సమాధానం కూడా చెప్పలేదు. అధికార పార్టీ నాయకుల కందులు యార్డులో కాకుండా బయట కొంటున్నారు.– ఇందూరి సుబ్బారెడ్డి, రైతు, కురిచేడు ప్రభుత్వం కొనలేదు, బయట అమ్ముకోనీయలేదు ప్రభుత్వం అన్ని కందులు మేమే కొంటామని చెప్పి మోసం చేసింది. బయట అమ్ముకోనీయ కుండా చేసి చివరకు వాళ్లు కూడా కొనలేదు. నిరుడు కందులు కూడా ఉన్నాయి. రెండేళ్ల కందులు ఏమి చేసుకోవాలో అర్థం కావటం లేదు.అప్పులు పెరిగిపోయాయి.– పెనుగొండ రామిరెడ్డి, రైతు, కురిచేడు -
డ్రెయినేజీ అస్తవ్యస్తం
కట్టంగూర్ : మండలంలోని కురుమర్తి గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగు నివాసాల మధ్య నిల్వ ఉండడంతో ప్రజలు రోడ్డు వెంట వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామంలోని బస్స్టాప్ నుంచి ప్రాథమిక పాఠశాలకు వెళ్లే రహదారి వెంబడి నిర్మించిన డ్రెయినేజీ పూర్తిగా మట్టితో నిండిపోయింది. ఎస్సీ కాలనీలో డ్రెయినేజీ లేకపోవటంతో రోడ్డుపై మురుగు నిలిచి నెలరోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో దుర్వాసన వెదజల్లుతూ ఈగలు, దోమలకు ఆవాసంగా మారింది. ప్రజలకు రోగాల బారిన పడుతున్నారు. గ్రామంలో సీసీ రోడ్ల వెంబడి డ్రెయినేజీలు నిర్మించకపోవటంతో ఇళ్లలోని మురుగు రోడ్డుపై నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నిత్యం కురుమర్తి నుంచి మునుకుంట్ల గ్రామానికి, వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే రైతులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేసినా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డ్రెయినేజీలు నిర్మించాలి గ్రామంలో డ్రెయినేజీలు నిర్మించకపోవటంతో మురుగు నివాసాల మధ్య నిల్వఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కురుమర్తి నుంచి మునుకుంట్లకు వెళ్లే దారి అధ్వానంగా ఉండడంతో వాహనదారులు, రైతులు నానా అవస్థలు పడుతున్నారు. డ్రెయినేజీలు నిర్మించి సమస్యను పరిష్కరించాలి. -
వెట్టి కన్నా ఘోరం
సాక్షి, అమరావతి : అక్కడ పని వెట్టి కన్నా ఘోరం. చట్టాలు, నియమ నిబంధనలూ అస్సలు పట్టవు. ఉద్యోగం ఎన్నాళ్లుంటుందో... ఎప్పుడు తీసేస్తారో తెలియదు. ఇచ్చే వేతనాలూ అరకొర... అవీ ఎప్పుడిస్తారో దేవుడికే ఎరుక. ఇక మహిళల పరిస్థితి మరింత దారుణం. లైంగిక వేధింపులు షరా మామూలే. గర్భిణులు, బాలింతలకు ఇవ్వాల్సిన సెలవులు వీరికి వర్తించవు. ఇలా ఎన్ని చెప్పుకొన్నా తరగని ఈ వెతలు ప్రైవేటు విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందివి. నియమాలు చట్టుబండలు... రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో కేవలం హైస్కూలు స్థాయి వరకే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎక్కువ ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, బీఈడీ, డీఈడీ ఇలా ఇతర కాలేజీలన్నీ అత్యధికం ప్రైవేటులోనే ఉన్నాయి. విద్యార్ధులూ ప్రభుత్వ సంస్థల్లో కన్నా ప్రైవేటులోనే అత్యధికంగా ఉన్నారు. వీరి నుంచి కోట్ల కొద్దీ సొమ్మును ఫీజుల రూపేణా వసూలు చేస్తున్న ఈ సంస్థలు.. సిబ్బందికి చెల్లించేది మాత్రం నామమాత్రమే. స్కూళ్లు, కాలేజీల్లో కలిపి దాదాపు 5 లక్షల మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు పనిచేస్తున్నట్లు అంచనా. సిబ్బంది గురించి స్పష్టమైన గణాంకాలను ఆయా సంస్థలు ఇవ్వకుండా రికార్డులను వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు వేలల్లో∙ఉన్నాయి. వీటిలో దాదాపు 5.5 నుంచి 6 లక్షల మంది వరకు బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని 61 వేల బడుల్లో ప్రైవేటు స్కూళ్ల సంఖ్య తక్కువే అయినా మొత్తం 72 లక్షల మందిలో సగం వీటిల్లోనే చదువుతున్నారు. ఇంటర్మీడియెట్లో 9 లక్షల మంది విద్యార్థులుండగా వీరిలో కేవలం 2 లక్షల మందే ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్నారు. మిగిలిన వారు ప్రైవేటులోనే ఉన్నారు. డిగ్రీ కళాశాలల విషయంలోనూ ఇదే పరిస్థితి. దయనీయ పరిస్థితులు బీఈడీ, ఎంఈడీ సహా పలు విద్యార్హతలున్న వారికి సైతం ఇచ్చేది రూ.10 నుంచి రూ.15 వేలే. అదికూడా 10 నెలలే. ఏడాదిపాటు చెప్పాల్సిన సిలబస్ను 5 నెలల్లో ముగించి టీచర్లను బయటకు పంపేస్తున్నారు. సీనియారిటీ పెరిగిన ఉద్యోగులకు వేతనాలుపెంచాల్సి వస్తుందన్న కారణంతో అకారణంగా ఉద్యోగం మానిపిస్తున్నారు. స్కూల్/కాలేజీల్లో పిల్లల్ని చేర్పించే టీచర్ల మీదే మోపుతున్నారు. ఇందులో టార్గెట్లు చేరుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీçసుకొని, ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఆదివారాలు, పండగలు, జాతీయ పర్వదినాల్లోనూ సిబ్బందికి సెలవు ఇవ్వరు. సరైన వసతులు ఉండవు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు నిల్చునే పనిచేయాలి. మహిళల పరిస్థితి మరీ దారుణం.. మహిళా సిబ్బంది పరిస్థితి మరింత దయనీయం. మెటర్నీటీ లీవులు లేవు. నిండు గర్భంతో ఉన్నా విధులకు రావాల్సిందే. లేదంటే ఉద్యోగం మానుకోవాలి. కొన్ని సంస్థల్లో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులూ జరుగుతున్నాయి. అవేవీ బయటకు రాకుండా యాజమాన్యాలు మేనేజ్ చేస్తున్నాయి. ఈ సంస్థల్లో విద్యార్ధులే కాదు టీచర్లూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చట్టం ఏం చెబుతోందంటే... ప్రభుత్వ పాఠ్యప్రణాళికను, పాఠ్యాంశాలను, సమయవేళలను తప్పనిసరిగా అనుసరించాలి. విద్యాసంస్థలను వ్యాపార దృక్పథంతో నడపరాదు. ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. పీఎఫ్ వంటి ప్రభుత్వ నిబంధనలను టీచర్లకు, సిబ్బందికి వర్తింపచేయాలి. ఫీజుల్లో 5 శాతం మేనేజ్మెంటు ఉంచుకోవచ్చు, 15 శాతం స్కూలు నిర్వహణకు, 50 శాతం వేతనాలకు వినియోగించాలి. 15 శాతం మొత్తాన్ని సిబ్బంది గ్రాట్యుటీ, ప్రావిడెంటు ఫండ్, ఇన్సూరెన్సుల కింద మేనేజ్మెంటు వాటాగా చెల్లించడానికి వినియోగించాలి. ఉద్యోగుల్ని ఏకపక్షంగా తొలగించే అధికారం యాజమాన్యానికి లేదు. విధి నిర్వహణలో సరిగా లేకుంటే ఇంక్రిమెంట్ల కోత, సీనియార్టీ తగ్గింపు, అలవెన్సుల్లో కోత, వంటివి విధించవచ్చు. -
సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
అరకులోయ : సమస్యలు పరిష్కారం కోసం విశాఖలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేసిన సంఘటనకు నిరసనగా అరకులోయ పట్టణంలో సీఐటీయూ నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులతో దాడులు చేయించిన చంద్రబాబు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇక్కడి నాలుగురోడ్ల జంక్షన్లో రాస్తారోకో చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని, మహిళలపై పోలీసు ల లాఠిచార్జీ సంఘటనను అన్ని వర్గాల ప్రజ లు ఖండించాలని నినదించారు. సీఐటీయూ నేత ఉమామహేశ్వరరావు, సంఘ నేతలు మణి, పి.విమల, నిర్మల, భాను, జానకి పాల్గొన్నారు. -
నీటికోసం రాస్తారోకో
కుందుర్పి : తాగునీటి సమస్య పరిష్కారం కోసం మండలంలోని ఎనుములదొడ్డి గ్రామానికి చెందిన 200 మంది రోడ్డెక్కారు. పార్టీలకు అతీతంగా అందరూ ఒక్కటై ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. గ్రామంలో నెల రోజులుగా తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చినా అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో మంగళవారం ఉదయం 7 గంటలకే గ్రామస్తులంతా రోడ్డుపైకి చేరుకున్నారు. ప్రదాన కూడలిలలో ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు.తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానిక సర్పంచ్, ఎంపీటీసీతో పాటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులను విన్నవించినా వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆందోళన కొనసాగించడంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఆర్డబ్ల్యూఎస్ జేఈ నవీన్, ఎంపీడీఓ నాగరాజు తదితరులు గ్రామస్తులతో ఫోన్లో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. గ్రామస్తుల ఆందోళనకు వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు పలికారు. -
మెకానిక్ల బతుకులు దుర్భరం
బీబీపేట : ప్రస్తుతం కాలంలో బైకు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. పెరుగుతున్న అవసరాల రీత్యా ఒక్కో ఇంట్లో రెండేసి, మూడేసి బైక్లు ఉంటున్నాయి. ద్విచక్ర వాహనం కొనుగోలు చేసిన యజమాని సర్వీసింగ్, రిపేర్ చేయించక తప్పదు. కానీ బైక్ మెకానిక్లు పొద్దంతా కష్టపడి పని చేసినా, ఏళ్లు గడిచినా వారి జీవితాల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. నానాటికి పెరిగిపోతున్న వాహనాల విడిభాగాల ధరలతో మెకానిక్లకు ఆదాయం తగ్గిపోతోంది. మరమ్మతులు చేస్తే వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. దీంతో మెకానిక్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి ఎటువంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ప్రస్తుతం ప్రతి వినియోగదారుడు కొత్త వాహనాలపై మోజు పెంచుకోవడంతో తమ వృత్తి తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రంగానే చార్జీలు.. బైక్ సర్వీసింగ్కు మెకానిక్లు నామమాత్రంగానే చార్జీలు వసూలు చేస్తుంటారు. బైక్ సర్వీసింగ్ కు రూ. 350లు, వాటర్ సర్వీసింగ్ కు రూ. 50లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయిల్ ధరలు పెరగడం, విడి భాగాల ధరలు పెరగడం వల్ల మిగులుబాటు ఉండడం లేదని మెకానిక్లు వాపోతున్నారు. అలాగే నిత్యం ఆయిల్ గ్రీజులను ముట్టుకోవడం, వాహనాలను స్టార్ట్ చేసేటప్పుడు వచ్చే పొగను పీల్చడం వల్ల తరుచూ అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోతున్నారు. పెరిగిన అద్దెలు ప్రస్తుతం మెకానిక్ దుకాణం ఏర్పాటు చేయాలంటే పట్టణాలు, మండల కేంద్రాల్లో అయితే రూ. 50వేల అడ్వాన్సుతో పాటు నెలకు కనీసం రూ. 2వేల నుంచి 5వేల వరకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు కరెంట్ బిల్లు మరో రూ. వెయ్యి వస్తుంది. మొత్తంగా వచ్చే ఆదాయంలో సగం వరకు ఖర్చులకే సరిపోతుందని మెకానిక్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ఆరోగ్య పథకాలు, బీమా వర్తింప జేయాలని, అలాగే ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కుటుంబ పోషణకు కష్టంగా ఉంది మెకానిక్ పనిచేస్తే వచ్చే ఆదాయం కుటుంబపోషణకు కూడా సరిపోవడం లేదు. అద్దెలు పెరిగాయి. బైకు విడిభాగాలు, పనిముట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందడం లేదు. మా జీవితానికి ప్రమాద బీమా సౌకర్యం కూడా లేదు. ప్రభుత్వం ఆర్థికసహాయం అందించి మమ్మల్ని ఆదుకోవాలి. –గుర్రాల నవీన్, బైక్ మెకానిక్, బీబీపేట