బాబు మోసాలపై జగన్ సమరం | YS Jagan samara deeksha on babu rulling | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 3 2015 7:47 AM | Last Updated on Thu, Mar 21 2024 6:38 PM

అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసపుచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నుంచి చేపడుతున్న సమరదీక్షకు సర్వం సిద్ధమైంది. రెండు రోజుల పాటు సాగే సమరదీక్షకు గుంటూరు జిల్లా మంగళగిరి ‘వై’ జంక్షన్ సమీపంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. చంద్రబాబు మోసాలపై ప్రజల్లో ఎండగట్టడంతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో ఈ దీక్ష చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement