న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటాడు. తన స్పిన్ మాయాజాలంతో కివీస్ బ్యాట్స్ మెన్లను గింగిరాలు తిప్పాడు. ఈ సిరీస్ లో మొత్తం 27 వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు. చివరి టెస్టులో 13 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు నేలకూల్చి, రెండు రనౌట్లలో పాలుపంచుకున్న ఈ నంబర్ ఆల్ రౌండర్ రెండో ఇన్నింగ్స్ లోనూ అదేస్థాయిలో విజృంభించాడు. 13.5 ఓవర్లలో 59 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో రెండు మేడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి.
Published Tue, Oct 11 2016 7:31 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement