Ravichandran Ashwin
-
IPL 2025: అశ్విన్, చహల్ను వదులుకొని రాయల్స్ తప్పు చేసిందా..?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. తొలి మ్యాచ్లో సన్రైజర్స్ చేతిలో పరాజయం ఎదుర్కొన్న ఆ జట్టు.. నిన్న (మార్చి 26) ఆడిన రెండో మ్యాచ్లో కేకేఆర్ చేతిలో చావుదెబ్బ తినింది. ఈ సీజన్లో రాయల్స్ వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం వారి జట్టు. గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో వారి జట్టు చాలా బలహీనంగా ఉంది. బ్యాటింగ్లో పర్వాలేదనిపిస్తున్నా బౌలింగ్లో మాత్రం దారుణంగా ఉంది. గత సీజన్ వరకు వారి విజయాల్లో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, ట్రెంట్ బౌల్ట్ను వదులుకుని రాయల్స్ పెద్ద తప్పు చేసింది. వీరి ప్రత్యామ్నాయంగా వచ్చిన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. రాయల్స్ యాష్, చహల్కు ప్రత్యామ్నాయంగా లంక స్పిన్ ద్వయం మహీశ్ తీక్షణ, వనిందు హసరంగలను అక్కున చేర్చుకుంది. వీరు మంచి బౌలర్లే అయినా యాష్, చహల్ అంత ప్రభావం చూపలేకపోతున్నారు. తొలి రెండు మ్యాచ్ల్లోనే ఈ విషయం తేలిపోయింది. రాయల్స్ మరో ఇన్ ఫామ్ పేసర్ ఆవేశ్ ఖాన్ను కూడా వదిలేసి మూల్యం చెల్లించుకుంటుంది. బౌల్ట్ స్థానాన్ని భర్తీ చేస్తాడనుకున్న జోఫ్రా ఆర్చర్ గల్లీ బౌలర్ కంటే దారుణంగా తయారయ్యాడు. సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్చర్ ఏకంగా 76 పరుగులిచ్చాడు (4 ఓవర్లలో). జట్టులోకి కొత్తగా వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ యువ పేసర్ ఫజల్ హక్ ఫారూకీ ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు. అనుభవజ్ఞుడైన సందీప్ శర్మలో మునుపటి జోరు కనిపించడం లేదు. కొత్తగా వచ్చిన దేశీయ పేసర్ తుషార్ దేశపాండే ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. మొత్తంగా చూస్తే ఈ సీజన్లో అశ్విన్, చహల్, బౌల్ట్ లేని లోటు రాయల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుత బౌలింగ్ యూనిట్తో రాయల్స్ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. బ్యాటింగ్నే నమ్ముకొని అద్భుతాలు చేద్దామన్నా, ఈ సీజన్లో రాయల్స్ బ్యాటర్లు ఫామ్లో ఉన్నట్లు కనిపించడం లేదు. తొలి మ్యాచ్లో జురెల్, శాంసన్ పర్వాలేదనిపించినా రెండో మ్యాచ్లో వారిద్దరూ తేలిపోయారు. స్టార్ ఓపెనర్ జైస్వాల్ తన స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. ఏదో చేస్తాడనుకున్న నితీశ్ రాణా దారుణంగా విఫలమవుతున్నాడు. గత సీజన్లో సంచలన ఇన్నింగ్స్లు ఆడిన రియాన్ పరాగ్లో ఆ మెరుపులు కనిపించడం లేదు. హెట్మైర్ను పరిశీలించాల్సి ఉంది. ఈ బ్యాటింగ్ విభాగంతో రాయల్స్ ప్లే ఆఫ్స్కు చేరాలని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది.కాగా, కేకేఆర్తో నిన్న జరిగిన మ్యాచ్లో రాయల్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమై 8 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. సన్రైజర్స్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆకట్టుకున్న రాయల్స్ బ్యాటర్లు ఈ మ్యాచ్లో తేలిపోయారు. కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు రాయల్స్ బౌలర్లు కూడా ఏమాత్రం ప్రతిఘటించలేదు. పార్ట్ టైమ్ బౌలర్ అయిన రియాన్ పరాగ్ ఒక్కడు కాస్త పర్వాలేదనిపించాడు. డికాక్ 61 బంతుల్లో 97 పరుగులు చేసి ఒంటిచేత్తో కేకేఆర్ను విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగా.. కేకేఆర్ మరో 15 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. రాయల్స్ తమ తదుపరి మ్యాచ్లో సీఎస్కేను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ గౌహతి వేదికగా మార్చి 30న జరుగనుంది. -
శ్రేయస్ కాదు!.. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అశ్విన్
పంజాబ్ కింగ్స్ పేసర్ విజయ్కుమార్ వైశాఖ్ (Vijaykumar Vyshak)పై టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రశంసలు కురిపించాడు. ఆఖరి ఐదు ఓవర్ల ఆటలో అద్భుతం చేసి జట్టును గెలిపించాడని కొనియాడాడు. గుజరాత్ టైటాన్స్ (GT)- పంజాబ్ కింగ్స్ (PBKS) మ్యాచ్కు సంబంధించి.. తన దృష్టిలో వైశాఖ్ అత్యంత విలువైన ఆటగాడని పేర్కొన్నాడు.శ్రేయస్ అయ్యర్ తుపాన్ ఇన్నింగ్స్ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్- పంజాబ్ మంగళవారం తలపడిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ దుమ్ములేపింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (23 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 97 నాటౌట్), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో పంజాబ్ ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ విజయానికి చేరువగా వచ్చింది. సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్ (41 బంతుల్లో 74) ఆడగా.. జోస్ బట్లర్ (33 బంతుల్లో 54), షెర్ఫానే రూథర్ఫర్డ్ (28 బంతుల్లో 46) పంజాబ్ నుంచి మ్యాచ్ను లాగేసుకునే ప్రయత్నం చేశారు.ఇంపాక్ట్ ప్లేయర్అయితే, సరిగ్గా అదే సమయంలో పంజాబ్ ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్కుమార్ వైశాఖ్ను రంగంలోకి దించింది. దాదాపు పద్నాలుగు ఓవర్ల పాటు బెంచ్ మీద ఉన్న అతడు.. పదిహేనో ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. అనంతరం పదిహేడో ఓవర్లో మళ్లీ బరిలోకి దిగి ఇదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. ఆ తర్వాత పందొమ్మిదో ఓవర్లో(18 రన్స్)నూ ఫర్వాలేదనిపించాడు.ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన ఈ విజయానికి మూలం. అయితే, ఓ ఆటగాడు డగౌట్లో కూర్చుని.. మైదానంలోని ఆటగాళ్ల కోసం నీళ్లు తీసుకువస్తూ కనిపించాడు.ఆ సమయంలో గుజరాత్ మొమెంటమ్లోకి వచ్చేసింది. రూథర్ఫర్డ్, బట్లర్ మ్యాజిక్ చేసేలా కనిపించారు. అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు విజయ్కుమార్ వైశాఖ్. దాదాపు పద్నాలుగు ఓవర్లపాటు మ్యాచ్కు దూరంగా అతడిని పిలిపించి.. మ్యాచ్ను మనవైపు తిప్పమని మేనేజ్మెంట్ చెప్పింది.‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అతడికే ఇవ్వాల్సిందిపదిహేడు, పందొమ్మిదో ఓవర్లో అతడు పరిణతితో బౌలింగ్ చేశాడు. అతడు వికెట్ తీయకపోవచ్చు. కానీ డెత్ ఓవర్లలో అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తన ప్రణాళికలను తూచా తప్పకుండా అమలు చేశాడు. అద్భుతమైన యార్కర్లతో అలరించాడు.తన బౌలింగ్లో వైడ్లు, ఫుల్ టాస్లు ఉండవచ్చు. కానీ అతడి కట్టుదిట్టమైన బౌలింగ్ వల్లే గుజరాత్ వెనుకడుగు వేసింది. నా దృష్టిలో అతడు అత్యంత విలువైన ఆటగాడు. నిజానికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విజయ్కుమార్ వైశాఖ్కు దక్కాల్సింది’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో పంజాబ్ పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. మొత్తంగా మూడు ఓవర్ల బౌలింగ్లో విజయ్ 28 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.చదవండి: NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్కు అవమానకర ఓటమిPunjab Kings hold their nerves in the end to clinch a splendid win against Gujarat Titans ❤️Scorecard ▶ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/0wy29ODStQ— IndianPremierLeague (@IPL) March 25, 2025 -
ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ టీమ్.. రోహిత్ శర్మకు షాక్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముగిసిన సంగతి తెలిసిందే. ఆదివారం(మార్చి 9) దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి భారత్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత తిరిగి భారత్ సొంతమైంది.ఈ క్రమంలో టోర్నీలో ఉత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో కూడిన జట్టును భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రకటించాడు. ఈ పదకొండు మంది సభ్యుల జట్టులో నలుగురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం అశ్విన్ తన ఎంచుకున్న టీమ్లో చోటు ఇవ్వలేదు. రోహిత్ శర్మ ఫైనల్లో 74 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాకుండా కెప్టెన్సీ పరంగా రోహిత్ అదరగొట్టాడు. టోర్నీలో భారత్ ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ విజేతగా నిలిపాడు. ఐసీసీ ప్రకటించిన ఉత్తమ టీమ్లో కూడా రోహిత్కు చోటు దక్కలేదు.కాగా అశ్విన్ తన ఎంపిక చేసిన జట్టులో న్యూజిలాండ్కు చెందిన రచిన్ రవీంద్ర, ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్లకు ఓపెనర్లగా అవకాశమిచ్చాడు. అదేవిధంగా ఫస్ట్ డౌన్లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, సెకెండ్ డౌన్లో శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కింది. వికెట్ కీపర్గా ఆస్ట్రేలియాకు చెందిన జోష్ ఇంగ్లిష్ను అశూ ఎంచుకున్నాడు.ఫినిషర్గా డేవిడ్ మిల్లర్కు ఛాన్స్ లభించింది. ఆల్రౌండర్ల కోటాలో అజ్మతుల్లా ఓమర్జాయ్, మైఖల్ బ్రేస్వెల్.. స్పెషలిస్ట్ స్పిన్నర్లగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్లకు చోటు దక్కింది. ఏకైక ఫాస్ట్ బౌలర్గా కివీస్ స్పీడ్ స్టార్ మాట్ హెన్రీని అశ్విన్ ఎంపిక చేశాడు. అశ్విన్ తన జట్టులో 12వ ప్లేయర్గా న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ను ఎంచుకున్నాడు. అయితే ఐసీసీ మాత్రం తన ప్రకటించిన టీమ్కు శాంట్నర్ను కెప్టెన్గా ఎంపిక చేయడం గమనార్హం.ఆర్ అశ్విన్ ఎంపిక చేసిన బెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు: రచిన్ రవీంద్ర, బెన్ డకెట్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, జోష్ ఇంగ్లిస్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మైఖేల్ బ్రేస్వెల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మాట్ హెన్రీ. 12వ ఆటగాడు: మిచెల్ సాంట్నర్చదవండి: రిషబ్ పంత్ ఇంట్లో పెళ్లి భజాలు.. సందడి చేయనున్న భారత క్రికెటర్లు -
'ప్రపంచ క్రికెట్ని భారత్ శాసిస్తుంది’
టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)ది ప్రత్యేక శైలి. స్వతహాగా ఇంజనీర్ అయిన అశ్విన్ తన స్పిన్ బౌలింగ్ లోనూ అదే మేధస్సును ప్రదర్శించాడు. గత సంవత్సరం జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించిన 38 అశూ.. ఆటను విశ్లేషించడంలో మాంచి దిట్ట. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయంపై కూడా తనదైన శైలిలో స్పందించాడు. ప్రస్తుత భారత్ జట్టు 1990- 2000లలో దశాబ్ద కాలంలో ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్ ని ఎలా శాసించిందో.. అదే రీతిలో విజయ పరంపర కొనసాగిస్తుందని వ్యాఖ్యానించాడు.భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)ని గెలుచుకున్న తర్వాత ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అశ్విన్ మాట్లాడుతూ.. ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే భారత్ ఈ విజయం సాధించడం చాలా ప్రత్యేకమైందన్నాడు. ఇది భారత బౌలింగ్ లైనప్ బలాన్ని రుజువు చేసిందని వ్యాఖ్యానించాడు.బౌలింగ్ వల్లేటీమిండియా ఈసారి బ్యాటింగ్ వల్ల కాదు, బౌలింగ్ వల్లే ఈ ట్రోఫీ గెలిచిందని. .ఇది అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా గ్రాస్ రూట్ స్థాయిలో బౌలర్లకు మరింత మద్దతు, ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరముందని అశ్విన్ పిలుపునిచ్చాడు. బుమ్రా లేకుండా ఈ టోర్నమెంట్లో విజయం సాధిండానికి భారత్ బౌలర్ల చేసిన కృషి ని ప్రత్యేకంగా అభినందించక తప్పదని అశ్విన్ తెలియజేసాడు. వచ్చే సంవత్సరం జరిగే టీ20 ప్రపంచ కప్ గురించి మాట్లాడుతూ అశ్విన్ భారత జట్టుకు ముగ్గురు ప్రధాన ఆటగాళ్లను అశ్విన్ గుర్తించాడు. జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ మరియు వరుణ్ చక్రవర్తి భారత్ జట్టులో తప్పనిసరిగా ఉండాలని అశ్విన్ సూచించాడు. వారి ముగ్గురితో కూడిన బౌలింగ్ ని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు భయంకరంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు.రచిన్ కాదు వరుణ్ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూ జిలాండ్ అల్ రౌండర్ రచిన్ రవీంద్ర ని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ప్రకటించడం పై అశ్విన్ విభేదించాడు. రచిన్ రవీంద్రకి బదులుగా, భారత్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కి ఆ గౌరవం దక్కాల్సిందని అశ్విన్ పేర్కొన్నాడు. రచిన్ 263 పరుగులతో ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. "ఎవరేమి చెప్పినా, ఏం చేసినా, నా దృష్టిలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కచ్చితంగా వరుణ్ చక్రవర్తి. అతను ఈ మొత్తం టోర్నమెంట్ ఆడలేదు. కానీ ఆడిన రెండు మూడు మ్యాచ్ లలోనే చాల కీలక భూమిక వహించాడు. వరుణ్ చక్రవర్తి లేకుంటే, ఈ భారత్ కి ఈ టోర్నమెంట్ చాల భిన్నంగా ఉండేదని నేను భావిస్తున్నాను. అతను భారత్ జట్టులో 'ఎక్స్ ఫ్యాక్టర్'.. జట్టు బౌలింగ్ కి వైవిధ్యాన్ని అందించాడు’’ అని అశ్విన్ స్పష్టంచేశాడు .ఆతిధ్య పాకిస్తాన్కి తలవంపులు ఓ వైపు భారత్ క్రికెటర్లు సంబరాల్లో మునిగిపోగా, ఈ టోర్నమెంట్ కి ఆతిధ్యమిచ్చి చివరికి ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ పరిస్థితి చాల దారుణంగా తయారైంది. ఈ టోర్నమెంట్ కి ఆతిధ్యమిచ్చిన గౌరవం దక్కకపోగా, ఆ జట్టు వైఫల్యంతో అవమానంతో తలవంపులు తెచ్చుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోహ్సిన్ నఖ్వీ దుబాయ్ లో భారత్, న్యూ జిలాండ్ ల మధ్య జరిగిన ఫైనల్ కి హాజరుకాకపోవడం మరో దుమారానికి దారితీసింది. భారత్ అన్ని మ్యాచ్ లను 'హైబ్రిడ్ మోడల్'లో దుబాయ్లో ఆడింది. దీనితో పాటు భయానకమైన ఎయిర్ షోలు, ఖాళీ స్టేడియంలు మరియు పేలవమైన డ్రైనేజీ వ్యవస్థలు ఐసీసీ టోర్నమెంట్కు పాకిస్తాన్ అధ్వాన్నస్థితిని బయటపెట్టాయి. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిరసన తెలిజేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దుబాయ్ లో జరిగిన ముగింపు వేడుకలో టోర్నమెంట్ డైరెక్టర్ సుమైర్ అహ్మద్ ను ఆహ్యానించకపోవడం పై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఐసీసీ వెలిబుచ్చిన కారణాలతో మొహ్సిన్ నఖ్వీ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. -
రచిన్ రవీంద్ర కాదు.. అతడే ప్లేయర్ ఆఫ్ది టోర్నమెంట్: అశ్విన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా ఫైనల్లో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించిన భారత్.. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఛాంపియన్స్ ట్రోఫీతో రోహిత్ సేన సోమవారం సొంతగడ్డపై అడుగుపెట్టింది.అయితే ఐపీఎల్-2025 సీజన్కు సమయం దగ్గరపడుతుండడంతో ఈసారి ఎటువంటి విక్టరీ పరేడ్లను నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. స్వదేశానికి చేరిన ఆటగాళ్లు ఒక్కొక్కరిగా తమ ఐపీఎల్ జట్లతో కలుస్తున్నారు. ఇక ఇది ఇలా ఉండగా.. న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రను ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా ఎంపిక చేయడం పట్ల భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్లేయర్ ఆఫ్ టోర్నీ అవార్డు అందుకునేందుకు భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆర్హడుని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. "ప్లేయర్ ఆఫ్ది టోర్నమెంట్ రచిన్ రవీంద్రను ఎంపిక చేసుండొచ్చు. కానీ దృష్టిలో మాత్రం ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వరుణ్ చక్రవర్తినే. అతడు టోర్నీ మొత్తం ఆడలేదు. ఆడిన కొన్ని మ్యాచ్ల్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. అతడు భారత్కు ఎక్స్ఫ్యాక్టర్గా మారాడు. వరుణ్ లేకపోయింటే పరిస్థితి మరోవిధంగా ఉండేది.ఈ టోర్నీలో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. నేను జడ్జిని అయివుంటే ఆ అవార్డు వరుణ్కి ఇచ్చేవాడిని. ఫైనల్ మ్యాచ్లో గ్లెన్ ఫిలిప్స్ను చక్కవర్తి ఔట్ చేసిన విధానం గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే. గూగ్లీతో ఫిలిప్స్ను వరుణ్ బోల్తా కొట్టించాడు. ఈ ఒక్క మ్యాచ్లోనే కాదు అతడు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఈ తరహా ప్రదర్శన చేశాడు. అతడు ఆడిన మ్యాచ్లను పరిగణలోకి తీసుకుని ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా ఎంపిక చేయాల్సింది. ఈ అవార్డుకు వరుణ్ కచ్చితంగా ఆర్హుడు" అని తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ పేర్కొన్నాడు. కాగా వరుణ్ ఈ టోర్నీలో తన స్పిన్ మయాజాలంతో అందరిని ఆకట్టుకున్నాడు. తొలి రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన చక్రవర్తి.. కివీస్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్కు తుది జట్టులోకి వచ్చాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే వరుణ్ ఇంపాక్ట్ చూపించాడు. ఆ మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టి కివీస్ పతానాన్ని శాసించాడు. ఆ తర్వాత సెమీఫైనల్, ఫైనల్లో రెండేసి వికెట్లు పడగొట్టి భారత్ను ఛాంపియన్గా నిలిపాడు. మరోవైపు రచిన్ రవీంద్ర.. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్లు ఆడి 263 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు.చదవండి: అద్భుతంగా రాణించాను.. టెస్టు రీఎంట్రీకి సిద్ధం -
CT 2025: ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందింది.. విమర్శకులకు ఇచ్చిపడేసిన అశ్విన్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమిస్తున్నప్పటికీ.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడుతుంది. అయితే టీమిండియా తమ మ్యాచ్లను ఒకే వేదికపై ఆడటాన్ని కొందరు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఒకే వేదికపై మ్యాచ్లు ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందని ఆరోపిస్తున్నారు.ఈ ఆరోపణలపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందనడం సరికాదన్నాడు. గతంలో (2009 ఛాంపియన్స్ ట్రోఫీ) సౌతాఫ్రికా ఒకే వేదికపై అన్ని మ్యాచ్లు ఆడినా ఫైనల్కు చేరలేదన్న విషయాన్ని గుర్తు చేశాడు. బాగా ఆడితేనే టోర్నమెంట్లు గెలుస్తారని, సాకుల వల్ల కాదని చురకలంటించాడు. దుబాయ్లో ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందని తమ కెప్టెన్, కోచ్లను ప్రశ్నించినప్పుడు నవ్వుకున్నానని అన్నాడు. టీమిండియా చివరిగా కోవిడ్కు ముందు 2018లో (ఆసియా కప్) దుబాయ్లో ఆడిందన్న విషయాన్ని గుర్తు చేశాడు. టీమిండియా తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా దుబాయ్లో ఆడాయని అన్నాడు. ప్రయాణించడం వల్ల ఆటగాళ్లు అలసిపోతారన్న విషయంతో ఏకీభవించిన అశ్విన్.. షెడ్యూల్ ఫిక్స్ చేయడంలో టీమిండియా ప్రమేయం ఉండదన్న విషయాన్ని గుర్తు చేశాడు. సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఈ విషయాన్ని ప్రస్తావించాడు.ఎంతమంది ఎన్ని రకాలుగా టీమిండియాపై ఆరోపణలు (ఒకే వేదిక అంశం) చేసినా న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయరని కితాబునిచ్చాడు. ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయకుండా కేవలం ఆటపై దృష్టి పెడుతుంది కాబట్టే న్యూజిలాండ్కు భారీ సంఖ్యలో అభిమానులున్నారని అన్నాడు. ఫైనల్లో గెలిచినా ఓడినా న్యూజిలాండ్ ఆటగాళ్లు హుందాగా ప్రవర్తిస్తారని తెలిపాడు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాక్, న్యూజిలాండ్పై విజయాలు సాధించిన భారత్.. సెమీస్లో ఆసీస్ను మట్టికరిపించి అజేయ జట్టుగా ఫైనల్కు చేరింది. మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్పై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడింది. అయినా గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్కు చేరింది. సెమీస్లో కివీస్ సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. దుబాయ్ వేదికగా రేపు (మార్చి 9) జరుగబోయే తుది సమరంలో న్యూజిలాండ్ రోహిత్ సేనతో అమీతుమీ తేల్చుకోనుంది.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్ను ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2000 ఎడిషన్ ఫైనల్లో కివీస్ భారత్ను ఢీకొట్టి విజేతగా నిలిచింది. న్యూజిలాండ్కు అది తొలి ఐసీసీ టైటిల్. -
అతడికి కొత్త బంతిని ఇవ్వండి.. హెడ్కు చుక్కలు చూపిస్తాడు: అశ్విన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో దుబాయ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ సెమీస్ పోరు కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్కు ఆర్హత సాధించాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక సూచన చేశాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశమివ్వాలని అశ్విన్ సూచించాడు. కాగా న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి సంచలన ప్రదర్శన కనబరిచాడు. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. తన కెరీర్లో రెండో వన్డే ఆడిన వరుణ్.. 5 వికెట్లు పడగొట్టి భారత్కు అద్బుతమైన విజయాన్ని అందించాడు."ట్రావిస్ హెడ్ను అడ్డుకోవాలంటే పవర్ప్లేలో బౌలింగ్ వరుణ్ చక్రవర్తితో చేయించాలి. హెడ్కు స్టంప్స్ దిశగా బౌలింగ్ చేయమని వరుణ్కు చెప్పండి. అప్పుడు హెడ్ స్టంప్స్ను విడిచిపెట్టి ఓవర్ ది ఫీల్డ్ షాట్ ఆడే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో బంతి మిస్స్ అయ్యి స్టంప్స్ను తాకే అవకాశముంది.అంతేకాకుండా బౌలింగ్ తగ్గట్టు ఫీల్డ్ సెట్ చేస్తే హెడ్ దొరికిపోయే ఛాన్స్ ఉంది. వరుణ్ చక్రవర్తి కొత్త బంతితో భారత్కు మంచి అరంభాన్ని అందించగలడు. వరుణ్ బౌలింగ్లో హెడ్ నెమ్మదిగా ఆడుతాడని నేను అనుకోను. అతడు కచ్చితంగా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. వరుణ్ బౌలింగ్లో షాట్లు ఆడటం అంత సులువు కాదు. కాబట్టి వరుణ్ బౌలింగ్లో హెడ్ ఔటయ్యే అవకాశముంది. ఏదేమైనప్పటికి ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి,ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షియస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్చదవండి: మాపై ఒత్తడి లేదు.. ఇది సాధారణ మ్యాచ్ మాత్రమే: శ్రేయస్ అయ్యర్ -
ఐదుగురు స్పిన్నర్లా?
న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఉండటంపై భారత మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఎలా చూసినా ఈ సంఖ్య ఎక్కువేనని అతను అభిప్రాయ పడ్డాడు. పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో... టీమిండియా ఆడే మ్యాచ్లను దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అశ్విన్ మాట్లాడుతూ.. ‘దుబాయ్లో ఐదుగురు స్పిన్నర్లు అవసరమా? అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్తో పాటు పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు తుది జట్టులో చోటు దక్కొచ్చు. వరుణ్ చక్రవర్తిని కూడా ఆడించాలనుకుంటే... ఒక పేస్ బౌలర్ను తగ్గించి పాండ్యానే రెండో పేసర్గా పరిగణించాల్సి ఉంటుంది. అదనపు పేసర్ను బరిలోకి దింపాలంటే ఒక స్పిన్నర్ను తగ్గించుకోక తప్పదు’ అని అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అక్షర్, జడేజా, కుల్దీప్, వరుణ్తో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్... టీమిండియాలో ‘సూపర్ స్టార్ కల్చర్’పై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘భారత జట్టులో సూపర్ సెలబ్రిటీ విధానాన్ని తగ్గించాలి. దాన్ని ఏమాత్రం ప్రోత్సహించకూడదు. జట్టులో ఉండేది ఆటగాళ్లే... సూపర్ స్టార్లు కాదు. కెరీర్లో ఎంతో సాధించిన కోహ్లి, రోహిత్ ఇప్పుడు మరో సెంచరీ కొట్టినా అదేమీ పెద్ద ఘనత కాదు, మీ వ్యక్తిగత రికార్డు కూడా కాదు. అంతా జట్టు కోసమే’ అని అశ్విన్ పేర్కొన్నాడు. ప్లేయర్లు వ్యక్తిగత మైలురాళ్లను పట్టించుకోకుండా జట్టు ప్రయోజనాల కోసమే ఆడాలని అశ్విన్ సూచించాడు. జాతీయ జట్టు తరఫున 106 టెస్టులాడి 537 వికెట్లు పడగొట్టిన అశ్విన్... 116 వన్డేల్లో 156 వికెట్లు తీశాడు. 65 టి20ల్లో 72 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా మూడో టెస్టు అనంతరం అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
తుదిజట్టులో ఆ ఇద్దరు పక్కా.. మరీ అంతమంది ఎందుకు?: అశ్విన్
టీమిండియా సెలక్టర్ల తీరును భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) విమర్శించాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి ఎంపిక చేసిన జట్టులో ఐదుగురు స్పిన్నర్లకు చోటు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. తుదిజట్టు కూర్పు విషయంలో ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డాడు.యశస్వి జైస్వాల్ను తప్పించికాగా ఈ ఐసీసీ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) మంగళవారం తమ పూర్తిస్థాయి జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రాథమిక జట్టులో ఉన్న బ్యాటర్ యశస్వి జైస్వాల్ను తప్పించి.. అతడి స్థానంలో కొత్తగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని చేర్చింది. అదే విధంగా.. జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కాగా.. హర్షిత్ రాణాకు పిలుపునిచ్చింది.ఇదిలా ఉంటే.. ఇప్పటికే జట్టులో కుల్దీప్ యాదవ్తో పాటు ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ల రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. వరుణ్ రాకతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.నాకు అర్థం కావడం లేదు‘‘దుబాయ్కు ఇంతమంది స్పిన్నర్లను తీసుకువెళ్లడంలో మర్మమేమిటో నాకు అర్థం కావడం లేదు. యశస్వి జైస్వాల్పై వేటు వేసి స్పిన్నర్ల సంఖ్య ఐదుకు పెంచారు. ఈ పర్యటనలో ముగ్గురు లేదంటే నలుగురు స్పిన్నర్లు ఉంటారని ముందుగానే ఊహించాం.కానీ దుబాయ్కు ఏకంగా ఐదుగురు స్పిన్నర్లతో వెళ్తున్నామా? ఒకరు.. లేదంటే ఇద్దరు అదనంగా ఉన్నారని అనిపించడం లేదా?.. అందులో ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లు(రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్). ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లే.పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు జడేజా, అక్షర్ తుదిజట్టులో ఉంటారు. కుల్దీప్ కూడా ఆడతాడు. ఇలాంటపుడు ఒకవేళ మీరు వరుణ్ చక్రవర్తిని కూడా జట్టులోకి తీసుకోవాలనుకుంటే.. ఓ పేసర్ను పక్కనపెట్టాల్సి ఉంటుంది.అప్పుడు హార్దిక్ పాండ్యాను రెండో పేసర్గా ఉపయోగించుకోవాలి. లేదంటే.. స్పిన్నర్ను తప్పించి మూడో సీమర్ను తుదిజట్టులోకి తెచ్చుకోవాలి. నాకు తెలిసి కుల్దీప్ యాదవ్ నేరుగా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకున్నాడు. మరి అప్పుడు వరుణ్కు ఎలా చోటిస్తారు?ఒకవేళ కుల్దీప్తో పాటు వరుణ్ కూడా తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ దుబాయ్లో బంతి అంతగా టర్న్ అవుతుందని మీరు భావిస్తున్నారా? నేనైతే ఈ జట్టు ఎంపిక తీరు పట్ల సంతృప్తిగా లేను’’ అని అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.3-0తో క్లీన్స్వీప్కాగా చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆల్రౌండ్ ప్రదర్శనతో సొంతగడ్డపై బట్లర్ బృందాన్ని 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత తుదిజట్టులో జడేజాతో పాటు అక్షర్ పటేల్ ఉండటం ఖాయం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వీలుగా వీరికి ప్రాధాన్యం ఉంటుంది. ఇక ఇద్దరు స్పెషలిస్టు పేసర్లను ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్ లేదంటే వరుణ్ చక్రవర్తిలలో ఒక్కరికే స్థానం దక్కుతుంది. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్లు దుబాయ్లో ఆడుతుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి. చదవండి: CT 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం.. చాంపియన్స్ ట్రోఫీ మాదే: బంగ్లాదేశ్ కెప్టెన్ -
CT 2025: అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్
టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్(India vs England) ఆసాంతం అదరగొట్టాడు ఈ కర్ణాటక బౌలర్. ఐదు టీ20లలో కలిపి పద్నాలుగు వికెట్లతో మెరిసిన ఈ రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్.. భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును సొంతం చేసుకున్నాడు.అంతేకాదు.. ఒక ద్వైపాక్షకి సిరీస్లో ఎక్కువ వికెట్లు తీసిన తొలి స్పిన్ బౌలర్గానూ వరుణ్ చక్రవర్తి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న వరుణ్ చక్రవర్తికి వరుస అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.అతడిని జట్టులోకి తీసుకోండిఈ క్రమంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) టీమిండియా నాయకత్వ బృందానికి కీలక సూచనలు చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులో వరుణ్ చక్రవర్తిని చేరిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని పేర్కొన్నాడు. అయితే, అంతకంటే ముందు ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో అతడిని ఆడించాలని సూచించాడు.కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫ్రీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో జనవరి 18న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ప్రకటించింది. అయితే, ఈ జట్టులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అతడు చాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉంటే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. అతడికి అవకాశం ఇస్తారనే భావిస్తున్నా.సమయం మించిపోలేదుఎందుకంటే.. ఈ టోర్నీలో ఆడుతున్న అన్ని దేశాలు తమ ప్రాథమిక జట్లను మాత్రమే ప్రకటించాయి. కాబట్టి వరుణ్కు ఈసారి ఛాన్స్ ఇస్తారేమో అనిపిస్తోంది. అయితే, నేరుగా ఐసీసీ టోర్నీ జట్టుకు ఎంపిక చేయడం అంత సులువేమీ కాదు.అదీగాక అతడు ఇంకా వన్డేల్లో అరంగేట్రమే చేయలేదు. అందుకే తొలుత ఇంగ్లండ్తో వన్డేల్లో వరుణ్ని ఆడించి.. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక చేస్తే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో అతడికి తప్పక అవకాశం ఇస్తారని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తమ మ్యాచ్లన్నీ తటస్థ వేదికైన దుబాయ్లో ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జట్టులో నలుగురు స్పిన్నర్లకు చోటిచ్చింది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లను ఎంపిక చేసింది. ఇక వరుణ్ చక్రవర్తిని కూడా జట్టులోకి తీసుకుంటే ఐదో స్పెషలిస్టు స్పిన్నర్ అవుతాడు. కానీ అది సాధ్యం కాకపోవచ్చు. చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి.చదవండి: ఇంగ్లండ్తో తొలి వన్డే.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి -
సూర్యకుమార్.. అందుకు సమయం అసన్నమైంది: అశ్విన్
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav) మాత్రం తన పేలవ ఫామ్తో తీవ్ర నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికా సిరీస్లో విఫలమైన సూర్య.. ఇంగ్లండ్ సిరీస్లోనూ అదే తీరును కనబరిచాడు.ఐదు మ్యాచ్ల్లో మిస్టర్ 360 కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. అతడి చివరి ఐదు ఇన్నింగ్స్లో రెండు డకౌట్లు కూడా ఉండటం గమనార్హం. కెప్టెన్సీ పరంగా ఆకట్టుకుంటున్నప్పటికి.. వ్యక్తిగత ప్రదర్శన పరంగా పూర్తిగా ఈ ముంబైకర్ తేలిపోతున్నాడు. తన ఫేవరేట్ షాట్ల ఆడటంలో కూడా సూర్య విఫలమవుతున్నాడు.ఈ సిరీస్లో అన్ని మ్యాచ్ల్లోనూ సూర్య ఒకేలా ఔటయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ది కూడా ఇదే పరిస్థితి. దక్షిణాఫ్రికా సిరీస్లో వరుస సెంచరీలతో చెలరేగిన శాంసన్.. ఇంగ్లండ్పై మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ సిరీస్లో శాంసన్ కేవలం 51 పరుగులు (26,5,3,1,16) మాత్రమే చేశాడు. సంజూ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. తొలి మూడు మ్యాచ్ల్లో జోఫ్రా అర్చర్ చేతికే సంజూ చిక్కాడు. అయితే ఆఖరి టీ20లో శాంసన్ చేతి వేలికి గాయం కావడంతో ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. అతడు తిరిగి మళ్లీ ఐపీఎల్-2025తో మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్, సంజూను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ తన బ్యాటింగ్ స్టైల్ను మార్చుకోవాల్సిన సమయం అసన్నమైందని అశ్విన్ అన్నాడు."సిరీస్ గెలిచినప్పటికి సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ మాత్రం భారత్కు ప్రధాన సమస్యగా మారింది. ఈ సిరీస్లో అతడి కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. అతడి కెప్టెన్సీలో ఎటువంటి లోపాలు లేవు. కానీ బ్యాటింగ్ పరంగా మెరుగ్గా రాణించాల్సిన అవసరముంది. మరోవైపు సంజూ శాంసన్ కూడా తన బ్యాటింగ్తో ఆకట్టుకోలేకపోయాడు.వీరిద్దిరూ ఒకే రకమైన బంతి, ఒకే ఫీల్డ్ పొజిషేన్లో ఔట్ అవ్వుతున్నారు. ఒకట్రెండు మ్యాచ్ల్లో ఇలా జరిగితే ఫర్వాలేదు. కానీ వీరిద్దరూ ప్రతీ మ్యాచ్లోనూ ఇదే తరహాలో తమ వికెట్లను కోల్పోతున్నారు. ఆటగాళ్లు స్వేఛ్చతో ఆడాలన్న విషయంతో నేను కూడా ఏకీభవిస్తాను. కానీ ఒకే తరహాలో ఔట్ అవుతున్నప్పుడు దానికి కొత్త సమాధానం కనుగొనాల్సిన బాధ్యత మీపై ఉంది. సూర్యకుమార్ యాదవ్ చాలా అనుభవం ఉన్న ఆటగాడు.బ్యాటింగ్లో భారత క్రికెట్ అప్రోచ్ను మార్చడంలో సూర్య భాగమయ్యాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ తన బ్యాటింగ్ విధానాన్ని కొద్దిగా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నానని" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: CT 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. హాట్కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు -
BCCI Naman Awards 2025: అవార్డుల ప్రదానోత్సం.. విజేతల పూర్తి జాబితా
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నమన్ అవార్డుల(BCCI Naman Awards 2025) వేడుక శనివారం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar)ను బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. అదే విధంగా.. గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు ఈ సందర్భంగా పురస్కారాలు అందజేశారు. పురుషుల ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ విభాగంలో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు అవార్డు దక్కింది. అన్ని ఫార్మాట్లలోనూ గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన బుమ్రాకు బీసీసీఐ ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్’ అవార్డు అందజేసింది.అదే విధంగా.. మహిళల క్రికెట్లో స్మృతి మంధానకు ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్' దక్కింది. ఇక భారత లెజెండరీ స్పిన్నర్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ను ప్రత్యేక పురస్కారంతో బీసీసీఐ సత్కరించింది. మూడు ఫార్మాట్లలో కలిపి 765 వికెట్లు తీసిన అశూ సేవలకు గుర్తింపుగా అవార్డు అందజేసింది.ఇక ఈ అవార్డుల ప్రదానోత్సవంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఈ ఈవెంట్కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మొత్తంగా 26 మంది క్రికెటర్లు పురస్కారాలు అందుకున్నారు.బీసీసీఐ నమన్ అవార్డులు-2025: విజేతల పూర్తి జాబితా1. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24 ఉత్తమ మహిళా క్రికెటర్ (జూనియర్ డొమెస్టిక్) [పతకం] - ఈశ్వరి అవసరే2. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24 ఉత్తమ మహిళా క్రికెటర్ (సీనియర్ డొమెస్టిక్) (సీనియర్ మహిళల వన్డే) [పతకం] - ప్రియా మిశ్రా3. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ (అండర్-16) [పతకం] - హేమచుదేశన్ జగన్నాథన్4. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు (U-16) [పతకం] - లక్ష్య రాయచందనీ5. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కూచ్ బెహార్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్(U-19) [పతకం] - విష్ణు భరద్వాజ్6. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కూచ్ బెహార్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ (U-19) [పతకం] - కావ్య టియోటియా7. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ (U-23) - ప్లేట్ గ్రూప్ [పతకం] - నీజెఖో రూపేయో8. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ (U-23) - ఎలైట్ గ్రూప్ [పతకం] - పి. విద్యుత్9. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక పరుగులు (U-23) - ప్లేట్ గ్రూప్ [పతకం] - హేమ్ చెత్రి10. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక పరుగులు (U-23) - ఎలైట్ గ్రూప్ [పతకం] - అనీష్ కేవీ11. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ - ప్లేట్ గ్రూప్ [పతకం] - మోహిత్ జంగ్రా12. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ - ఎలైట్ గ్రూప్ [పతకం] - తనయ్ త్యాగరాజన్13. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు - ప్లేట్ గ్రూప్ [పతకం] - అగ్ని చోప్రా14. మాధవరావు సింధియా అవార్డ్: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు - ఎలైట్ గ్రూప్ [పతకం] - రికీ భుయ్15. దేశీయ పరిమిత ఓవర్ల పోటీలలో ఉత్తమ ఆల్ రౌండర్గా లాలా అమర్నాథ్ అవార్డు, 2023-24 [పతకం] - శశాంక్ సింగ్16. రంజీ ట్రోఫీ 2023-24 లో ఉత్తమ ఆల్ రౌండర్గా లాలా అమర్నాథ్ అవార్డు [పతకం]- తనుష్ కోటియన్17. దేశీయ క్రికెట్లో ఉత్తమ అంపైర్, 2023-24 [ట్రోఫీ] - అక్షయ్ టోట్రే18. 2023-24 బీసీసీఐ దేశీయ టోర్నమెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన - ముంబై క్రికెట్ అసోసియేషన్19. 2023-24 మహిళల వన్డేలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ [పతకం] - దీప్తి శర్మ20. 2023-24 మహిళల వన్డేలలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ [పతకం] - స్మృతి మంధాన21. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం - మహిళలు [ట్రోఫీ] - ఆశా శోభన22. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం - పురుషులు [ట్రోఫీ] - సర్ఫరాజ్ ఖాన్23. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ - మహిళలు [ట్రోఫీ] - స్మృతి మంధాన24. పాలీ ఉమ్రిగర్ అవార్డు: ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ - పురుషులు [ట్రోఫీ] - జస్ప్రీత్ బుమ్రా25. బీసీసీఐ ప్రత్యేక అవార్డు [షీల్డ్] - రవిచంద్రన్ అశ్విన్26. కల్నల్ CK నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు [షీల్డ్] - సచిన్ టెండూల్కర్. -
శ్రీజేష్కు పద్మ భూషణ్.. అశ్విన్కు పద్మశ్రీ
గణతంత్ర దినోత్సవ పురుష్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. క్రీడా విభాగంలో పలువురుకు పద్మ అవార్డులు వరించాయి.హాకీ మాజీ గోల్ కీపర్ శ్రీజేష్ను కేంద్రం పద్మభూషన్తో సత్కరించింది. అదేవిధంగా టీమిండియా స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యాడు. వీరితో పాటు గత ఏడాది ఆర్చరీలో పారాలింపిక్ స్వర్ణం సాధించిన హర్విందర్ సింగ్, మణి విజయన్(ఫుట్ బాల్-కేరళ), సత్యపాల్ సింగ్(కోచ్- ఉత్తరప్రదేశ్)లకు పద్మశ్రీ అవార్డుకు సెలక్టయ్యారు.చదవండి: IND vs ENG: వరుణ్ స్పిన్ మ్యాజిక్.. హ్యారీ బ్రూక్ ఫ్యూజ్లు ఔట్! వీడియో -
జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి?: అశ్విన్
టీమిండియా చీఫ్ సెలక్టర్ పదవిపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు సెలక్షన్ కమిటీ చైర్మన్ అయ్యే అవకాశం వచ్చినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాధ్యతలు చేపట్టబోనని తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా చీఫ్ సెలక్టర్గా ఉండటం తలనొప్పితో కూడిన పని అని అశూ వ్యాఖ్యానించాడు.ఆచితూచి...భారత్లో ప్రతిభ ఉన్న క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారని.. అయితే, వారిలో ఎవరిని జట్టుకు ఎంపిక చేయాలనేది ఎల్లప్పుడూ క్లిష్టతరంగానే ఉంటుందని అశ్విన్ పేర్కొన్నాడు. ఏదేమైనా ఓ ఆటగాడి వైపు మొగ్గు చూపేటపుడు ప్రదర్శన, ప్రత్యేక నైపుణ్యాల ఆధారంగానే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.కాగా ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి జట్లను ప్రకటించిన సమయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అతడి గురించే ఎక్కువగా చర్చముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కని సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్కు ఇంగ్లండ్తో వన్డేల్లోనైనా అవకాశం ఇవ్వాల్సిందని కొంతమంది అభిప్రాయపడగా.. సంజూ శాంసన్కు ఈసారీ అన్యాయం జరిగిందంటూ సునిల్ గావస్కర్, మహ్మద్ కైఫ్ వంటి మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు.వన్డేల్లో రిషభ్ పంత్ కంటే మెరుగ్గా ఉన్న సంజూ శాంసన్ను వికెట్ కీపర్ కోటాలో చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ అంతర్జాతీయ టీ20లకి తిరిగి వస్తే.. అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ పరిస్థితి ఏమిటి?వీరే కాకుండా ఓపెనింగ్ కోటాలో రుతురాజ్ గైక్వాడ్కు దక్కుతున్న ప్రాధాన్యం ఎంత? దేశవాళీ క్రికెట్ వన్డే ఫార్మాట్లో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ను సెలక్టర్లు కనికరించకపోవడానికి కారణం? .. ఇలాంటి చర్చలు భారత క్రికెట్ వర్గాల్లో జరుగుతున్నాయి.జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి?ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అంతర్జాతీయ టీ20లలోకి యశస్వి జైస్వాల్ తప్పక తిరిగి రావాలి. అతడు వరల్డ్ కప్ జట్టులో ఉన్న వ్యక్తి. మొదటి ప్రాధాన్యం కలిగిన ఓపెనర్.ఒకవేళ వచ్చే ఐపీఎల్ సీజన్లో శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ భారీగా పరుగులు చేస్తే.. సెలక్టర్లకు తలనొప్పి మరింత ఎక్కువవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్గా లేదంటే.. టీమ్ మేనేజర్గా.. అదీ కాదంటే నిర్ణయాలు తీసుకునే నాయకత్వ బృందంలో ఉండే అవకాశం వస్తే మాత్రం నేను అస్సలు తీసుకోను.ప్రతిభ ఉన్న క్రికెటర్లకు కొదువలేకపోవడం అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే, సెలక్టర్లకు మాత్రం ఇది ఒక సమస్య. ఏదేమైనా.. పోటీలో ఉన్న ఆటగాళ్లందరి ప్రదర్శన, ప్రధాన టోర్నమెంట్లో ఒత్తిడిని ఏమేరకు జయించగలరన్న అంశాల ఆధారంగా ఎంపిక చేస్తే బాగుంటుంది.క్లిష్ట పరిస్థితుల్లోనూ రాణించగలిగే వాళ్లకే పెద్దపీట వేయాలి. ఎవరు గొప్ప ఆటగాడు అన్న ప్రశ్నలకు సమాధానమిచ్చే కొలమానాలు ఏవీ లేవు’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. అయితే, అరుదైన నైపుణ్యాలు, ఫామ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ మాజీ క్రికెటర్ సూచించాడు. చదవండి: భారత్తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు -
ఇంగ్లండ్తో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే! అతడికి నో ఛాన్స్?
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 మరి కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశస్రాలను సిద్దం చేసుకునున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదతో ఉన్నాయి. ఇప్పటికే తొలి టీ20 కోసం ఇంగ్లండ్ క్రికెట్ తమ తుది జట్టును ప్రకటించింది. జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, లివింగ్స్టోన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కన్పిస్తోంది.బౌలింగ్ విభాగంలో కూడా మార్క్ వుడ్, ఆర్చర్, అదిల్ రషీద్ వంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. దీంతో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్తో తొలి టీ20 కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్ను టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Aswin) ఎంపిక చేశాడు. అశ్విన్ తన ఎంచుకున్న జట్టులో ఓపెనర్లగా ఎడమచేతి వాటం బ్యాటర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్లకు అవకాశమిచ్చాడు.అదే విధంగా వరుసగా మూడు నాలుగు స్ధానాల్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలకు చోటు దక్కింది. అయితే పరిస్థితుల బట్టి వీరిద్దరి బ్యాటింగ్ ఆర్డర్ మారే ఛాన్స్ ఉందని అశూ అభిప్రాయపడ్డాడు. ఫినిషర్లగా టాలిస్మానిక్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, డైనమిక్ బ్యాటర్ రింకు సింగ్లకు అశ్విన్ ఛాన్స్ ఇచ్చాడు. అదేవిధంగా ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్తో పాటు వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్,నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్ దక్కింది.అయితే తుది జట్టులో చోటు కోసం నితీశ్, వాషింగ్టన్ సుందర్ మధ్య పోటీ నెలకొందని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఫాస్ట్ బౌలర్లగా మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ను ఎంపిక చేసిన అశ్విన్.. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తిని పరిగణలోకి తీసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్తో టీ20 అరంగేట్రం చేస్తుడనుకుంటున్న యువ పేసర్ హర్షిత్ రాణా(harshit rana)కు అశ్విన్ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ మ్యాచ్ సాయంత్రం 7: 00 గంటలకు ప్రారంభం కానుంది.అశ్విన్ ఎంపిక చేసిన భారత ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి/వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్ మరియు మహమ్మద్ షమీఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: జైస్వాల్కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
CT 2025: గంభీర్కు అతడంటే ఇష్టం.. తుదిజట్టులో చోటు పక్కా: అశ్విన్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో ఆడే భారత తుదిజట్టులో వాషింగ్టన్ సుందర్కు తప్పక స్థానం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ను లోయర్ ఆర్డర్లో కాకుండా.. టాప్-5లో బ్యాటింగ్కు పంపించాలని అశూ మేనేజ్మెంట్కు సూచించాడు.పాకిస్తాన్- యూఏఈ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానుంది. ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫిబ్రవరి 20 నుంచి తమ వేట మొదలుపెట్టనుంది. లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్తో తలపడనున్న రోహిత్ సేన.. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్ ఆడుతుంది. ఆ నలుగురుఆ తర్వాత న్యూజిలాండ్ను ఢీకొట్టనుంది. ఇక టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన జట్టులో స్పిన్ విభాగంలో ముగ్గురు ఆల్రౌండర్లు, ఒక స్పెషలిస్టు బౌలర్కు చోటు దక్కింది. ఆ నాలుగు ఎవరంటే.. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్.. కుల్దీప్ యాదవ్.వీరిలో కుల్దీప్ లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ కాగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కూడా ఎడమచేతి వాటం బౌలర్లే. అయితే, ఇందులో రైటార్మ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఒక్కడే. అందునా అతడు ఆఫ్ స్పిన్నర్. ఈ ప్రత్యేకతే అతడికి చాంపియన్స్ ట్రోఫీ తుదిజట్టులో చోటు దక్కేలా చేస్తుందని స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.అంతేకాదు.. టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్కు వాషీ అంటే ఎంతో ఇష్టమని.. అది కూడా అతడికి ప్లస్ పాయింట్గా మారుతుందని అశూ పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘ఈరోజుల్లో రైట్- లెఫ్ట్ కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది.గంభీర్కు అతడంటే చాలా ఇష్టం.కానీ మనకు ఎక్కువ మంది ఆఫ్ స్పిన్నర్లు లేరు. లెఫ్టార్మ్ స్పిన్నర్లే ఎక్కువ ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో వాషింగ్టన్ సుందర్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు రెండు కారణాలున్నాయి.. నాకు తెలిసినంత వరకు గంభీర్కు అతడంటే చాలా ఇష్టం.అతడి ఆటతీరును దగ్గరగా గమనించడంతో పాటు.. కచ్చితంగా అండగా నిలబడతాడు. ఇక వాషీ ఆఫ్ స్పిన్నర్ కావడం కూడా కలిసి వస్తుంది. అయితే, అతడు ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేస్తే మాత్రం జట్టు సమతూకంగా ఉండకపోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్లో అతడిని ముందుకు పంపాలి.టాప్ 5లో ఉంటేసమర్థవంతంగా బౌలింగ్ చేయడంతో పాటు నాలుగు లేదంటే ఐదో స్థానంలో ఆడే ఆల్రౌండర్ ఉంటే జట్టుకు ఎంతో ఉపయోగకరం. అదీ ఆఫ్ స్పిన్నర్ టాప్ 5లో ఉంటే ఇంకా బాగుంటుంది’’ అని అశ్విన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా అశ్విన్ మాదిరే వాషీ కూడా తమిళనాడుకు చెందినవాడే. ఈ ఇద్దరూ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లే కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆడిన భారత జట్టులో అశూ- వాషీ ఇద్దరికీ చోటు దక్కింది. అయితే, పెర్త్ టెస్టులో అనుభవజ్ఞుడైన అశూను కాదని.. మేనేజ్మెంట్ వాషీని ఆడించింది. అందుకు తగ్గట్లుగానే అతడు రాణించాడు కూడా!అశూ ఆకస్మిక రిటైర్మెంట్అయితే, ఆ తర్వాత మరో రెండు టెస్టుల్లోనూ అశూకు అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో బ్రిస్బేన్లో మూడో టెస్టు డ్రా అయిన తర్వాత అతడు సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. మేనేజ్మెంట్ తీరు నచ్చకే అశూ రిటైర్మెంట్ ప్రకటించాడనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో గంభీర్కు వాషీ ఆట అంటే ఇష్టమంటూ అశూ చేసిన వ్యాఖ్యలు సందేహాలకు తావిస్తున్నాయి.కాగా రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్, ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వాషింగ్టన్ సుందర్.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 9 టెస్టులు, 22 వన్డేలు, 52 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 468, 315, 161 పరుగులు చేయడంతో పాటు.. 25, 23, 47 వికెట్లు తీశాడు.చదవండి: ‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’ -
అతడు ‘జట్టు’లో లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనదే: అశ్విన్
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ‘గేమ్ ఛేంజర్’ ఎవరన్న అంశంపై తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ఓ స్టార్ పేసర్ పేరు చెప్పాడు. అతడు గనుక ఆస్ట్రేలియా జట్టులో లేకపోయి ఉంటే.. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని భారత్ కైవసం చేసుకునేదని ఈ మాజీ ఆల్రౌండర్ అభిప్రాయపడ్డాడు. 3-1తో గెలిచి పదేళ్ల తర్వాతఏదేమైనా ఈసారి బీజీటీ ఆద్యంతం ఆసక్తిగా, పోటాపోటీగా సాగిందని అశూ హర్షం వ్యక్తం చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophyబీజీటీ)లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. పెర్త్లో గెలుపొంది శుభారంభం అందుకున్న టీమిండియా.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. అడిలైడ్లో పింక్ బాల్ టెస్టులో ఓడి.. అనంతరం బ్రిస్బేన్లో మూడో టెస్టు డ్రా చేసుకున్న భారత్.. మెల్బోర్న్, సిడ్నీల్లో మాత్రం చేతులెత్తేసింది.తద్వారా రోహిత్ సేనను 3-1తో ఓడించిన కమిన్స్ బృందం.. పదేళ్ల తర్వాత బీజీటీని సొంతం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వైఫల్యం కారణంగానే టీమిండియాకు ఇంతటి ఘోర పరాభవం ఎదురైంది. ఇక బ్రిస్బేన్ టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. తాజాగా ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్పై ప్రశంసలు కురిపించాడు.అతడు లేకుంటే.. ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం‘‘ప్యాట్ కమిన్స్(Pat Cummins)కు ఇదొక గొప్ప సిరీస్ అని చాలా మంది అంటున్నారు. నిజానికి ఈ పేస్ బౌలర్ ఎడమచేతి వాటం బ్యాటర్లను ఎదుర్కోవడంలో చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు. అయితే, అదృష్టవశాత్తూ స్కాట్ బోలాండ్ జట్టులోకి రావడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చింది. ఒకవేళ బోలాండ్ గనుక ఈ సిరీస్లో ఆడకపోయి ఉంటే.. టీమిండియానే ట్రోఫీ గెలిచేది.అయితే, ఇక్కడ నేను జోష్ హాజిల్వుడ్ నైపుణ్యాలను తక్కువ చేసి మాట్లాడటం లేదు. అతడు కూడా అద్భుతమైన బౌలర్. అయితే, భారత్తో సిరీస్లో మాత్రం హాజిల్వుడ్ను కొనసాగిస్తే.. విజయం మనదే అయ్యేది. అయితే, బోలాండ్ మనల్ని అడ్డుకున్నాడు. ముఖ్యంగా లెఫ్డాండర్లకు రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయడం ప్రభావం చూపింది’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా గాయం కారణంగా జోష్ హాజిల్వుడ్ దూరం కాగా.. అతడి స్థానంలో నాలుగో టెస్టు నుంచి బోలాండ్ బరిలోకి దిగాడు. ఈ సిరీస్లో ఆడింది కేవలం రెండు టెస్టులే ఆడినా 16 వికెట్లు పడగొట్టి.. సిరీస్లో మూడో లీడింగ్ వికెట్ టేకర్గా బోలాండ్ నిలిచాడు. భారత కీలక బ్యాటర్ విరాట్ కోహ్లిని అనేకసార్లు అవుట్ చేసి.. టీమిండియాను దెబ్బకొట్టాడు. తద్వారా ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అత్యధిక వికెట్ల వీరుడిగా బుమ్రాఇదిలా ఉంటే.. టీమిండియా పేస్ దళనాయకుడు జస్ప్రీత్ బుమ్రా బీజీటీ 2024-25లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఐదు టెస్టుల్లో కలిపి 32 వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. అదే విధంగా.. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్(డిసెంబరు)గా కూడా బుమ్రా ఎంపికయ్యాడు. ఇక ఆస్ట్రేలియాతో పెర్త్లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం కాగా.. బుమ్రా సారథ్యం వహించి భారీ విజయం అందించాడు. ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ తప్పుకోగా.. మరోసారి కెప్టెన్సీ చేపట్టిన బుమ్రా.. ఈసారి మాత్రం గెలిపించలేకపోయాడు.చదవండి: పాకిస్తాన్కు వెళ్లనున్న రోహిత్ శర్మ!.. కారణం?పంత్ క్లారిటీ ఇచ్చాడు... కానీ కోహ్లి మాత్రం ఇలా: డీడీసీఏ ఆగ్రహం -
అతడి డిఫెన్స్ అద్భుతం.. 200 బంతులు కూడా ఆడగలడు: అశ్విన్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దూకుడైన బ్యాటింగ్కు పెట్టింది పేరు. ఫార్మాట్ ఏదైనా పంత్ బ్యాటింగ్ స్టైల్ ఒకటే. క్రీజులో వచ్చినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడడం రిషబ్కు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈ ఢిల్లీ చిచ్చరపిడుగులో దూకుడైన బ్యాటింగ్తో పాటు అద్భుతమైన డిఫెన్స్ స్కిల్స్ను కూడా టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ గుర్తించాడు.ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న అశ్విన్ తన సహచరుడి బ్యాటింగ్పై ప్రశంసలు కురిపించాడు. పంత్ డిఫెన్స్ అభేద్యమని, అతను పట్టుదలగా నిలబడితే ఎన్ని బంతులైనా ఆడగలడని అశ్విన్ కొనియాడాడు.పంత్ డిఫెన్స్ అద్భుతం..‘రిషభ్ పంత్లో అన్ని రకాల షాట్లు ఆడే సామర్థ్యం ఉంది. అయితే అతడి నుంచి మనం ఏం ఆశిస్తున్నామో అతనికి స్పష్టంగా చెప్పాలి. అతడి డిఫెన్స్ కూడా ఎంత బాగుంటుందంటే 200 బంతులు కూడా ఆడగలడు. ప్రపంచంలోనే అద్బుతంగా డిఫెన్స్ ఆడే బ్యాటర్లలో రిషబ్ ఒకడు.తన బలమేంటో తనకే పూర్తిగా తెలీదు. మిడిల్ గేమ్లో పరిస్థితికి తగినట్లుగా ఆడటం అలవాటు చేసుకుంటే ప్రతీ మ్యాచ్లో పంత్ సెంచరీ కొట్టగలడు. డిఫెన్స్ ఆడుతూ అతను అవుట్ కావడం చాలా అరుదు. నెట్స్లో నేను ఎన్నోసార్లు అతనికి బౌలింగ్ చేశాను.అతడు ఎల్బీడబ్ల్యూగా లేదా బంతి ఎడ్జ్ తీసుకుంటూ ఎప్పుడూ అవుట్ కాలేదు. గత కొన్నేళ్లుగా టెస్టుల్లో బ్యాటింగ్ చాలా కష్టంగా మారిపోయింది. అలాంటి సమయంలో పంత్ ఆడుతున్నాడు. సిడ్నీలో అతడి ఆడిన ఇన్నింగ్స్లు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.ఒకే ఒకే గేమ్లో రెండు వేర్వేరు నాక్లు ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో డిఫెన్స్ ఆడితే, రెండో ఇన్నింగ్స్లో తన విశ్వరూపం చూపించాడు’ అని అశ్విన్ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సిడ్నీ టెస్టులో భారత్ ఓటమి పాలైనప్పటికి పంత్ మాత్రం తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు.తొలి ఇన్నింగ్స్లో 40 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 61 పరుగులతో సూపర్ నాక్ ఆడాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మొత్తం 9 ఇన్నింగ్స్లో పంత్.. 28.33 సగటుతో 255 పరుగులు చేశాడు. ఓవరాల్గా ఇప్పటివరకు 43 టెస్టులు ఆడిన పంత్.. 42.11 సగటుతో 2948 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో ఆరు సెంచరీలు చేశాడు.చదవండి: క్రికెట్ ‘మనసు’ చదివింది! -
హిందీ జాతీయ భాష కాదు.. అశ్విన్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తమిళనాడులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో హిందీ బాషను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో యాష్ మాట్లాడుతూ.. హిందీ జాతీయ భాష కాదు. అది కేవలం అధికారిక భాష మాత్రమే అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దూమారం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ నడుస్తుంది.#Watch | தமிழுக்கு அதிர்ந்த அரங்கம்.. இந்திக்கு SILENT.. "இந்தி தேசிய மொழி இல்ல".. பதிவு செய்த அஸ்வின்!சென்னையில் உள்ள தனியார் பொறியியல் கல்லூரியில் நடைபெற்ற பட்டமளிப்பு விழாவில் மாஸ் காட்டிய கிரிக்கெட் வீரர் அஸ்வின்#SunNews | #Chennai | #Ashwin | @ashwinravi99 pic.twitter.com/TeWPzWAExQ— Sun News (@sunnewstamil) January 9, 2025అసలు ఏం జరిగిందంటే.. కాంచీపురంలోని రాజలక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రాడ్యుయేషన్ సెర్మనీకి అశ్విన్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో యాష్ విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగం చేశాడు. యాష్ తన ప్రసంగం ప్రారంభించడానికి ముందు ఏ భాష అయితే మీకు కంఫర్ట్గా ఉంటుందని స్టూడెంట్స్ను అడిగాడు. ఇంగ్లిష్, తమిళ్, హిందీ భాషల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలని కోరాడు. తమిళ్, ఇంగ్లిష్ అని అశ్విన్ చెబుతుండగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అదే హిందీ పేరు ఎత్తగానే ఆడిటోరియం మొత్తం మూగబోయింది. ఈ సందర్భంగా అశ్విన్ హిందీ జాతీయ భాష కాదు, అధికారిక భాష మాత్రమే అని వ్యాఖ్యానించాడు. అశ్విన్ మాటల్లో.. "హిందీ మన జాతీయ భాష కాదు. అది అధికారిక భాష మాత్రమే. ఈ విషయాన్ని నేను చెప్పాలని అనుకున్నాను" అశ్విన్ ఈ విషయాన్ని ప్రస్తావించిన వెంటనే తమిళ ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. యాష్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాడో కానీ, ఈ అంశం ప్రస్తుతం సోషల్మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అశ్విన్ లాంటి వ్యక్తి ఇలాంటి సున్నితమైన అంశాలపై (భాష) వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.కాగా, భాషా వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన భారతదేశం, రాజ్యాంగం ప్రకారం 22 షెడ్యూల్డ్ భాషలను గుర్తిస్తుంది. ఇండియాలో ఇంగ్లిష్తో పాటు హిందీ అధికారిక భాష హోదాను కలిగి ఉంది. భారత్లో హిందీ సహా ఏ భాషకు జాతీయ భాష హోదా లేదు. అధికారిక భాష, జాతీయ భాష మధ్య వ్యత్యాసాన్ని తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. ఇది విస్తృత చర్చలకు దారితీస్తుంది. సంవత్సరాలుగా హిందీని ఏకీకృత భాషగా ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందీ మాట్లాడని రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఇదిలా ఉంటే, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బ్రిస్బేన్ టెస్ట్ అనంతరం అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్లలో భాగమైన అశ్విన్.. టీమిండియా తరఫున 106 టెస్ట్లు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. టెస్ట్ల్లో 537 వికెట్లు తీసి భారత్ తరఫున రెండో లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్న యాష్.. వన్డేల్లో 156, టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. 38 ఏళ్ల అశ్విన్ తదుపరి ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. -
అశ్విన్ రిటైర్మెంట్కు కారణమిదే?.. ఆసీస్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 మధ్యలోనే టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అతడి నిర్ణయం యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. బ్రిస్బేన్లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసిన వెంటనే అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.ఈ సిరీస్లో రవిచంద్రన్ అశ్విన్ అడిలైడ్ వేదికగా జరిగిన పింక్-బాల్ టెస్టులో మాత్రమే భాగమయ్యాడు. ఆ మ్యాచ్లో 29 పరుగులు చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాతి మ్యాచ్(మూడో టెస్టు)కు తుది జట్టు నుంచి అతడిని టీమ్మెనెజ్మెంట్ తప్పించింది.ఆ మ్యాచ్ తర్వాతే అశ్విన్ ఇంటర్ననేషనల్ క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు. తాజాగా అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బీజీటీ సిరీస్లో ప్లేయింగ్ ఎలెవన్లో చోటుదక్కకపోవడంతోనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు."టీమిండియా సరైన గేమ్ ప్లాన్తో ఆస్ట్రేలియా పర్యటనకు రాలేదు. వారు తమ మొదటి మూడు టెస్టుల్లో ముగ్గురు వేర్వేరు స్పిన్నర్లకు అవకాశమిచ్చారు. సరైనా గేమ్ ప్లాన్ లేదని అప్పుడే ఆర్ధమైంది. అయితే అశ్విన్ సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. తొలి టెస్టుకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కపోవడంతో అతడు నిరాశచెందినట్లు ఉన్నాడు. బహుశా అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించాలని డిసైడ్ అయినట్లు అన్పిస్తోంది. వరల్డ్ క్రికెట్లో అశ్విన్ నంబర్ 1 స్పిన్నర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అతడి రికార్డు అత్యద్భుతంగా ఉంది. అశ్విన్ లాంటి ఆటగాళ్లు ఎవరూ కూడా బెంచ్కే పరిమితం కావాలనుకోరు. కచ్చితంగా అతడు నిరాశకు లోనై ఉంటాడు. అందుకే సిరీస్ మధ్యలోనే తన కెరీర్ను ముగించాడని" హాడిన్ విల్లో టాక్ పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా అశ్విన్ రిటైర్మెంట్పై అతడి తండ్రి రవిచంద్రన్ సైతం ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. తన కొడుకు చాలాకాలంగా అవమానాలకు గురవుతున్నాడని, అందుకే ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.టెస్టు క్రికెట్లో అశ్విన్ మార్క్..అశ్విన్ తన అంతర్జాతీయ కెరీర్లో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 537, 156, 72 వికెట్లు తీశాడు. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ టెస్టుల్లో 3503 పరుగులు కూడా సాధించాడు. ఇందులో ఆరు శతకాలు. 14 అర్ధ శతకాలు ఉండటం విశేషం. అశ్విన్ కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడనున్నాడు.చదవండి: బుమ్రా వరల్డ్క్లాస్ బౌలర్.. కోహ్లి చాలా మంచోడు.. అతడితో ఎందుకు గొడవపడ్డానంటే.. -
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో బుమ్రా 907 రేటింగ్ పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బుమ్రాకు ముందు అత్యధిక రేటింగ్ పాయింట్లు కలిగిన భారత బౌలర్గా రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. యాష్ 2016లో 904 రేటింగ్ పాయింట్లు సాధించాడు. తాజాగా బుమ్రా అశ్విన్ రికార్డును బద్దలు కొట్టి భారత్ తరఫున ఆల్టైమ్ గ్రేట్ రికార్డును నెలకొల్పాడు.టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ సీమర్లు సిడ్నీ బార్న్స్ (932), జార్జ్ లోమన్ (931), పాక్ మాజీ పేసర్ ఇమ్రాన్ ఖాన్ (922), శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (920) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు. తాజాగా 907 రేటింగ్ పాయింట్లు సాధించిన బుమ్రా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ డెరిక్ అండర్వుడ్తో కలిసి సంయుక్తంగా 17వ స్థానంలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగు మ్యాచ్ల్లో 30 వికెట్లు పడగొట్టిన బుమ్రా తన రేటింగ్ పాయింట్లను గణనీయంగా పెంచుకుని టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్లో ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు.తాజా ర్యాంకింగ్స్లో బుమ్రా తర్వాతి స్థానంలో జోష్ హాజిల్వుడ్ (843) ఉన్నాడు. బుమ్రాకు హాజిల్వుడ్కు మధ్య 64 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. బుమ్రా, హాజిల్వుడ్ తర్వాతి స్థానాల్లో కమిన్స్ (837), రబాడ (832), మార్కో జన్సెన్ (803), మ్యాట్ హెన్రీ (782), నాథన్ లియోన్ (772), ప్రభాత్ జయసూర్య (768), నౌమన్ అలీ (751), రవీంద్ర జడేజా (750) ఉన్నారు.బ్యాటింగ్లో విరాట్ టాప్ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బ్యాటర్గా విరాట్ కోహ్లి చలామణి అవుతున్నాడు. విరాట్ కోహ్లి 2018లో 937 రేటింగ్ పాయింట్లు సాధించాడు. భారత్ తరఫున ఏ ఇతర బ్యాటర్ ఇన్ని రేటింగ్ పాయింట్లు సాధించలేదు.నాలుగో స్థానానికి ఎగబాకిన జైస్వాల్ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో భారత స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్తో నాలుగో టెస్ట్లో రెండు భారీ అర్ద సెంచరీలు చేసిన జైస్వాల్ తన రేటింగ్ పాయింట్లను 854 పాయింట్లకు పెంచుకున్నాడు. ఇంగ్లండ్ స్టార్ జో రూట్ (895) నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. హ్యారీ బ్రూక్ (876), కేన్ విలియమ్సన్ (867), జైస్వాల్, ట్రవిస్ హెడ్ (780) టాప్-5 టెస్ట్ బ్యాటర్లుగా కొనసాగుతున్నారు. జైస్వాల్ టెస్ట్ల్లో నంబర్ వన్ స్థానానికి చేరుకునేందుకు మరో 41 పాయింట్ల దూరంలో ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్లో భారత్ తరఫున జైస్వాల్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. భారత స్టార్ బ్యాటర్లు రిషబ్ పంత్ 12, శుభ్మన్ గిల్ 20, విరాట్ కోహ్లి 24, రోహిత్ శర్మ 40 స్థానాల్లో నిలిచారు. -
BGT: చాలానే చేశారు.. ఇక చాలు.. మండిపడ్డ గంభీర్!
టీమిండియా ఆటగాళ్ల తీరుపట్ల హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమైనందుకు అందరికీ చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా చేశారని.. ఇకముందైనా జాగ్రత్తగా ఉండాలని గౌతీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు వస్తున్నాయి.కాగా గంభీర్ ప్రధాన కోచ్గా పగ్గాలు చేపట్టిన తర్వాత వన్డే, టీ20లలో బాగానే రాణిస్తున్న టీమిండియా.. టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవాలు ఎదుర్కొంటోంది. గౌతీ మార్గదర్శనంలో స్వదేశంలో బంగ్లాదేశ్ను 2-0తో క్లీన్స్వీప్ చేయడం మినహా ఇంత వరకు స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతోంది.దారుణ వైఫల్యాలుసొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0-3తో వైట్వాష్ కావడం.. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) చేజార్చుకునే స్థితికి చేరడం విమర్శలకు దారి తీసింది. ఆసీస్తో తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. ఆ తర్వాత మాత్రం దారుణమైన ప్రదర్శనతో ఓటములు చవిచూస్తోంది.స్టార్ బ్యాటర్ల వైఫల్యంముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ వంటి స్టార్ బ్యాటర్ల వైఫల్యం కారణంగా భారీ మూల్యం చెల్లిస్తోంది. ఇప్పటి వరకు ఈ సిరీస్లో ఆసీస్ గడ్డపై నాలుగు టెస్టులు పూర్తి కాగా భారత జట్టుపై కంగారూలు 2-1తో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఆఖరిదైన ఐదో టెస్టులో గెలిస్తేనే రోహిత్ సేనకు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.అదే విధంగా.. ఐదు టెస్టుల సిరీస్ను కూడా టీమిండియా 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. లేదంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ చేజారడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతవుతాయి. ఈ నేపథ్యంలో.. పరిస్థితి ఇంతదాకా తీసుకువచ్చిన టీమిండియా ఆటగాళ్లతో పాటు కోచ్లపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.చాలా ఎక్కువే చేశారుఇదిలా ఉంటే.. ఇప్పటికే భారత జట్టు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న గంభీర్.. డ్రెసింగ్రూమ్లో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘కోచ్గా నాకు కావాల్సినంత దక్కింది.. చాలా ఎక్కువే చేశారు’’ అంటూ అతడు మండిపడినట్లు తెలిపాయి. కాగా వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియాలో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.పెర్త్లో జరిగిన తొలి టెస్టు తర్వాత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడాన్ని ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. గంభీర్తో రోహిత్కు సమన్వయం కుదరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆసీస్- భారత్ మధ్య సిడ్నీలో జనవరి 3న ఐదో టెస్టు మొదలుకానుంది. ఇందులో గనుక విఫలమైతే రోహిత్ కెప్టెన్సీతో పాటు.. టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? -
IND VS AUS 4th Test: అశ్విన్ను వెనక్కు నెట్టిన లియోన్
టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ (Nathan Lyon) భారత తాజా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను (Ravichandran Ashwin) వెనక్కు నెట్టాడు. మెల్బోర్న్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో సిరాజ్ వికెట్ పడగొట్టడం ద్వారా లియోన్ ఈ ఘనత సాధించాడు. సిరాజ్ వికెట్తో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో లియోన్ ఏడో స్థానానికి ఎగబాకడు. అశ్విన్ 106 టెస్ట్ల్లో 537 వికెట్లు పడగొట్టగా.. లియోన్ 133 టెస్ట్ల్లో 538 వికెట్లు తీశాడు.టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (704), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్గ్రాత్ (563), నాథన్ లియోన్ (538), రవి అశ్విన్ (537), కోట్నీ వాల్ష్ (519), డేల్ స్టెయిన్ (439) టాప్-10లో ఉన్నారు.మెల్బోర్న్ టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో భారత్పై ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో నెగ్గింది. ఫలితంగా ఐదు మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ సిరీస్లో ఆసీస్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి రోజు చివరి సెషన్ వరకు సాగిన మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకునే అవకాశాలను దారుణంగా దెబ్బ తీసింది. ఏడో అద్భుతం జరిగితే తప్ప టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరలేదు. మరోవైపు సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా మధ్య చివరిదైన ఐదో టెస్ట్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.మెల్బోర్న్ టెస్ట్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.105 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 234 పరుగులకు ఆలౌటైంది. లబూషేన్ (70) టాప్ స్కోరర్గా నిలువగా.. పాట్ కమిన్స్ (41), నాథన్ లియోన్ (41) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ 3, రవీంద్ర జడేజా ఓ వికెట్ తీశారు.340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (84), రిషబ్ పంత్ (30) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. లియోన్ 2, స్టార్క్, హెడ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
'డబుల్ సెంచరీ'పై కన్నేసిన బుమ్రా...
మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు గురువారం(డిసెంబర్ 26) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ బాక్సింగ్ డే టెస్టులో బుమ్రా 6 వికెట్లు పడగొడితే.. 200 టెస్టు వికెట్ల మైలురాయి అందుకుంటాడు.తద్వారా టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్గా బుమ్రా నిలుస్తాడు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ ఉన్నాడు. అశ్విన్ కేవలం 37 టెస్టుల్లోనే 200 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఇక ఇప్పటి వరకు 43 టెస్టులు ఆడిన బుమ్రా 83 ఇన్నింగ్స్ల్లో 194 వికెట్లు పడగొట్టాడు.ప్రస్తుతం బుమ్రా ఉన్న ఫామ్కు ఈ ఫీట్ సాధించడం నల్లేరు మీద నడక అని చెప్పాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన బుమ్రా.. 21 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), KL రాహుల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ఆసీస్ తుది జట్టుఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్. -
BGT: అశ్విన్ స్థానంలో ఆస్ట్రేలియాకు.. ఎవరీ తనుశ్?
ముంబై క్రికెటర్ తనుశ్ కొటియాన్కు అరుదైన అవకాశం దక్కింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ( Border-Gavaskar Trophy- బీజీటీ)లో భాగంగా.. ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు.. టీమిండియా సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. తనుశ్కు జాతీయ జట్టులో చోటు దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం.కాగా బీజీటీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం కంగారూల చేతిలో ఓడిపోయింది. ఫలితంగా సిరీస్ 1-1తో సమం కాగా.. బ్రిస్బేన్లో మూడో టెస్టు డ్రా అయింది.అశ్విన్ రిటైర్మెంట్ఇక ఈ మ్యాచ్ ముగియగానే టీమిండియా దిగ్గజ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో అశూ స్థానంలో ముంబై ఆటగాడు తనుశ్ కొటియాన్(Tanush Kotian)కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. నిజానికి మరో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు జట్టుతోనే ఉన్నా.. ముందు జాగ్రత్త చర్యగా సోమవారం అతడిని ఎంపిక చేశారు.ఎవరీ తనుశ్ కొటియాన్?మహారాష్ట్ర చెందిన తనుశ్ కొటియాన్ ఆఫ్స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. దేశవాళీ క్రికెట్లో అతడు ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 26 ఏళ్ల తనుశ్ ఇప్పటి వరకు 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 25.70 సగటుతో 101 వికెట్లు తీశాడు.అదే విధంగా.. బ్యాటింగ్లోనూ రాణించిన అతను 47 ఇన్నింగ్స్లలో 41.21 సగటుతో 1525 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 2023–24 రంజీ ట్రోఫీ టైటిల్ను ముంబై గెలుచుకోవడంలో తనుశ్దే కీలకపాత్ర. ఆ ఎడిషన్లో 502 పరుగులు చేసి 29 వికెట్లు పడగొట్టిన అతను ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలవడం విశేషం. ఇక ఇటీవల భారత్ ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన ఒక మ్యాచ్లోనూ తనుశ్ బరిలోకి దిగాడు. వన్డే టోర్నీలో సత్తా చాటుతూతనుశ్ కొటియాన్ ప్రస్తుతం ముంబై తరఫు విజయ్ హజారే టోర్నీ(Vijay Hazare Trophy) మ్యాచ్లు ఆడుతున్నాడు. టీమిండియాలోకి ఎంపికైన రోజే అతడు అహ్మదాబాద్లో హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించడం విశేషం. రెండు వికెట్లు తీయడంతో పాటు.. 37 బంతుల్లో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. ఆసీస్- భారత్ మధ్య మెల్బోర్న్(డిసెంబరు 26-30)లో నాలుగో టెస్టు జరుగనుంది. తదుపరి సిడ్నీ వేదికగా ఇరుజట్లు ఆఖరి టెస్టులో తలపడతాయి.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. విధ్వంసకర వీరుడు దూరం!? -
Indian Cricket In 2024: టీ20 వరల్డ్ కప్ టూ అశ్విన్ రిటైర్మెంట్..
2024 ఏడాదికి మరికొద్ది రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. భారత్లో గత 12 నెలలలో అన్ని రంగాలతో పాటు క్రీడా రంగంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది భారత క్రికెట్కు బాగా కలిసొచ్చిందేనే చెప్పుకోవాలి.టీ20 వరల్డ్కప్ విజయం నుంచి ఐసీసీ ప్రెసిడెంట్గా ఎంపిక వరకు భారత క్రికెట్కు ఎన్నో అపురూప క్షణాలు ఉన్నాయి. అయితే అన్నీ తీపి గుర్తులే కాకుండా టీమిండియాకు కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాదిలో భారత క్రికెట్లో చోటుచేసుకున్న కీలక అంశాలపై ఓ లుక్కేద్దాం.11 ఏళ్ల నిరీక్షణకు తెర.. జూన్ 13 2024.. ఆ రోజు భారత క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. టీ20 వరల్డ్కప్-2024ను సొంతం చేసుకున్న భారత జట్టు.. తమ 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించింది. తుది పోరులో దక్షిణాఫ్రికాను ఓడించి రెండో వరల్డ్కప్ టైటిల్ను భారత్ తమ ఖాతాలో వేసుకుంది. ఓటమి తప్పదనకున్న చోట సూర్యకుమార్ యాదవ్ తన అద్బుతక్యాచ్తో భారత్ను విశ్వవిజేతగా నిలిపాడు. ఆ రోజు అతడు పట్టిన క్యాచ్ భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ధోని సారథ్యంలో చివరగా(2013 ఛాంపియన్స్ ట్రోఫీ) ఐసీసీ టైటిల్ను గెలుచుకున్న భారత జట్టు.. మళ్లీ రోహిత్ శర్మ సారథ్యంలోవిరాట్, రోహిత్, జడ్డూ రిటైర్మెంట్..వరల్డ్కప్ గెలిచిన అనందంలో అందరూ మునిగి తెలుతున్న వేళ భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా ఓ బాంబు పేల్చారు. ఈ సీనియర్ త్రయం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చారు. అంతేకాకుండా ఈ వరల్డ్కప్ విజయంతో భారత జట్టు హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం కూడా ముగిసింది.వరల్డ్కప్తో భారత్కు తిరిగొచ్చిన టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. భారత ఆటగాళ్లకు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.కెప్టెన్గా సూర్య, కోచ్గా గంభీర్..ఇక టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత జట్టు కెప్టెన్గా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ను బీసీసీఐ ఎంపిక చేసింది. అప్పటివరకు తత్కాలిక కెప్టెన్గా కొనసాగిన హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకు జట్టు పగ్గాలు అప్పగించడం అందరిని ఆశ్చర్యపరిచింది. మరోవైపు రాహుల్ ద్రవిడ్ వారుసుడిగా భారత హెడ్ కోచ్ బాధ్యతలను మాజీ క్రికెటర్ గౌతం గంబీర్ చేపట్టాడు.క్రికెట్ చరిత్రలో తొలిసారి..టీ20 వరల్డ్కప్ విజయం తర్వాత స్వదేశంలో భారత్కు న్యూజిలాండ్ జట్టు బిగ్ షాకిచ్చింది. కివీస్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో టీమిండియా 3-0 తేడాతో వైట్ వాష్కు గురైంది. మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో సొంతగడ్డపై టీమిండియాను వైట్వాష్ చేసిన తొలి జట్టుగా న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది.చరిత్ర సృష్టించిన పంత్..టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. అతడిని లక్నో సూపర్ జెయింట్స్ రికార్డు స్థాయిలో రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది.కొత్త కుర్రాళ్లు అరంగేట్రం.. ఇక ఈ ఏడాది భారత క్రికెట్ తరపున చాలా మంది యువ ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. టెస్టుల్లో రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాష్ దీప్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా డెబ్యూ చేయగా.. టీ20ల్లో రమణదీప్ సింగ్, మయాంక్ యాదవ్, తుషార్ దేశ్పాండే, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్ అడుగుపెట్టారు.ఐసీసీ ఛైర్మన్గా జై షాఐసీసీ ఛైర్మన్గా జై షా నియమితులయ్యారు. 2024 డిసెంబరు 1 నుంచి ఆయన పదవీకాలం మొదలైంది. అతడి నేతృత్వంలోనే 2025 ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగకరీంచింది.అశ్విన్ విడ్కోలు..ఈ ఏడాది ఆఖరిలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికి అందరికి షాకిచ్చాడు. అశ్విన్తో పాటు భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొన్నాడు. -
'మీ అమ్మగారు అస్పత్రిలో ఉన్నా.. జట్టు కోసం ఆలోచించావు'
టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మికంగా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పి అందరికి షాకిచ్చిన విషయం తెలిసిందే. బ్రిస్బేన్ టెస్ట్ ముగిసిన వెంటనే తన 14 ఏళ్ల కెరీర్కు అశ్విన్ ముగింపు పలికాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విలేకరుల సమావేశంలో అశూ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అతడి నిర్ణయంతో భారత క్రికెట్ అభిమానులే కాకుండా సహచరలు సైతం అశ్చర్యపోయారు. ఈ నిర్ణయాన్ని ఎంత సడన్గా అశ్విన్ ఎందుకు తీసుకున్నాడో ఆర్ధం కాక అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఏదేమైనప్పటికి 14 ఏళ్ల పాటు భారత క్రికెట్కు తన సేవలను అందించినందుకు గాను అశ్విన్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.అతడికి ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అశ్విన్ను భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశించారు. అతడొక లెజెండ్ అని మోదీ కొనియాడారు."అంతర్జాతీయ క్రికెట్ నుంచి మీ ఆకస్మిక రిటైర్మెంట్ భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను అందరిని ఆశ్చర్యపరిచింది. మీ నుంచి మరెన్నో ఆఫ్-బ్రేక్ల కోసం అందరూ ఎదురు చూస్తున్న సమయంలో మీరు క్యారమ్ బాల్ని విసిరి అందరినీ బౌల్డ్ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని మీరు ఎంతగానో ఆలోచించి తీసుకున్నారని మాకు ఆర్ధమవుతోంది. భారత క్రికెట్ తరపున సుదీర్ఘ కాలం పాటు ఆడిన తర్వాత ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదు.భారత క్రికెట్ కోసం 14 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి అద్భుతమైన ప్రదర్శన చేశారు. అందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇకపై జెర్సీ నంబర్ 99ను మేము మిస్ అవ్వనున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా నిలిచారు. మీ స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధులను హడలెత్తించారు. అంతర్జాతీయ క్రికెట్లో మీరు పడగొట్టిన ఒక్కో ఒక్క వికెట్ వెనక మీ కష్టం దాగి ఉంది. టెస్టు క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుల రికార్డు మీ పేరిట ఉండడం అందుకు నిదర్శం.అరంగేట్రంలోని 5 వికెట్లు పడగొట్టి మీ సత్తాను ప్రపంచానికి తెలియజేశారు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో కూడా మీరు భాగమయ్యారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకోవంలో మీరు కీలక పాత్ర పోషించారు. క్రికెట్ పట్ల మీకెంతో అంకితభావం ఉంది మీ అమ్మగారు ఆసుపత్రిలో ఉన్నప్పుడూ జట్టు ప్రయోజనాల కోసం ఆడావు. చెన్నైలో వరదల సమయంలో కుటుంబ సభ్యులతో కాకుండా జట్టుతోనే ఉన్నావు. నిజంగా మీరు ఒక లెజెండ్. మీ సెకెండ్ ఇన్నింగ్స్లో అంత మంచి జరగాలని కోరుకుంటున్నా. అల్ ది బెస్ట్ అంటూ అశ్విన్కు రాసిన లేఖలో మోదీ పేర్కొన్నాడు. -
అశ్విన్ రిటైర్మెంట్పై భార్య ప్రీతి తొలి రియాక్షన్.. వైరల్
‘‘గత రెండు రోజులుగా నాకు అంతా గందరగోళంగా ఉంది. అసలు ఏం చెప్పాలో.. ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడంలేదు. నా ఆల్టైమ్ ఫేవరెట్ క్రికెటర్కు నీరాజనం సమర్పించాలా?... లేదంటే.. జీవిత భాగస్వామి కోణంలో ఆలోచించాలా? లేదంటే.. ఫ్యాన్ గర్ల్లా ఓ ప్రేమ లేఖను రాయాలా?.. లేదా ఈ భావోద్వేగాల సమాహారాన్ని పూసగుచ్చాలా?!అశ్విన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినపుడు చిన్నా, పెద్దా.. అన్ని జ్ఞాపకాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. గత 13- 14 ఏళ్లుగా ఎన్నో అనుభవాలు చవిచూశాం. అతిపెద్ద విజయాలు, ఎన్నెన్నో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు, ఓటమి ఎదురైనపుడు గదిలో నిశ్శబ్దాలు, మ్యాచ్కు సన్నద్ధమయ్యే క్రమంలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ బోర్డు మీద రాసే రాతలు.. ఇలాంటి జ్ఞాపకాలెన్నో గుర్తుకువస్తున్నాయి.చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో విజయం, సిడ్నీ డ్రా, గబ్బా గెలుపు... టీ20లలో పునరాగమనం.. వీటన్నింటి వల్ల మేము పొందిన ఆనందం అనిర్వచనీయం. అదే సమయంలో ఓటముల వల్ల మా హృదయం ముక్కలైనపుడు ఉండే భయంకర నిశ్శబ్దం కూడా నాకు గుర్తే.ప్రియమైన అశ్విన్.. నాకైతే మొదట్లో క్రికెట్ కిట్ బ్యాగ్ ఎలా సర్దాలో కూడా తెలిసేదే కాదు. నీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నాకు క్రికెట్ ప్రపంచాన్ని పరిచయం చేసింది నువ్వే. ఆట పట్ల కూడా ప్రేమను కలిగించావు. నీ ప్యాషన్, క్రమశిక్షణ, కఠిన శ్రమ.. వీటన్నింటికి మరేదీ సాటిరాదు.అత్యుత్తమ గణాంకాలు, అరుదైన రికార్డులు, లెక్కలేనన్ని అవార్డులు.. అయినా సరే ప్రతిసారి మ్యాచ్కు ముందు నువ్వు సన్నద్ధమయ్యే తీరు, నీ నైపుణ్యాలకు మెరుగులు దిద్దే విధానం గురించి ఎలా వర్ణించను?..నీ అంతర్జాతీయ కెరీర్ అత్యద్భుతంగా సాగింది. ఇక నీ మీద ఉన్న భారాన్ని దించుకునే సమయం వచ్చింది. నీకు ఇష్టమైన రీతిలో కొత్త జీవితాన్ని గడుపు. నచ్చిన భోజనం తిను. కుటుంబానికి కూడా కాస్త సమయం కేటాయించు. మన పిల్లలను ఇంకాస్త జాగ్రత్తగా చూసుకో’’.... అంటూ ప్రీతి నారాయణన్ భావోద్వేగానికి లోనయ్యారు. టీమిండియా తాజా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సతీమణే ప్రీతి.తొలి స్పందన.. ఉద్వేగపూరిత నోట్ వైరల్అంతర్జాతీయ క్రికెట్కు తన భర్త రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రీతి ఈ మేర ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశారు. అశూ ఇకపై తమకు మరింత దగ్గరగా ఉంటాడని భార్యగా ఆనందపడుతూనే.. మరోవైపు అభిమానిగా విచారం వ్యక్తం చేశారు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తర్వాత అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.అయితే, టెస్టు క్రికెట్ రారాజుగా వెలుగొందిన అశూ అన్నకు సరైన వీడ్కోలు లభించలేదన్నది వాస్తవం. బ్రిస్బేన్లో టెస్టు డ్రా గా ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మకతో కలిసి ప్రెస్మీట్కు వచ్చిన అశూ తన నిర్ణయాన్ని చెప్పి నిష్క్రమించాడు.ఎందుకింత అకస్మాత్తుగా?ఈ నేపథ్యంలో.. అశ్విన్ ఆకస్మికంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. మేనేజ్మెంట్ పట్ల అసంతృప్తితోనే అతడు గుడ్బై చెప్పాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో 537, వన్డేల్లో 156, టీ20లలో 72 వికెట్లు తీసిన స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అశ్విన్.. ఆయా ఫార్మాట్లలో 3503, 707, 184 పరుగులు సాధించాడు.ఇక అశ్విన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 2011, నవంబరు 13న చిరకాల ప్రేయసి ప్రీతి నారాయణన్ను చెన్నైలో వివాహమాడాడు. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు అఖీరా అశ్విన్(2015), ఆద్యా అశ్విన్(2016).చదవండి: 'అశ్విన్ను చాలా సార్లు తొక్కేయాలని చూశారు' -
అశ్విన్కు వచ్చే పెన్షన్ ఎంతో తెలుసా?
భారత క్రికెట్లో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ శకం ముగిసిన సంగతి తెలిసిందే. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు అశ్విన్ వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విలేకరుల సమావేశంలో అశూ వెల్లడించాడు.ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా నిలిచిన అశ్విన్ ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించడం అందరిని షాక్కు గురిచేసింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన అశ్విన్కు ఎంత మొత్తం పెన్షన్ వస్తుందనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది.అశ్విన్కు ఎంతంటే?ఫస్ట్క్లాస్ క్రికెట్లో కనీసం 25 మ్యాచ్లు ఆడిన ప్లేయర్లకు భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) పెన్షన్ సౌకర్యం కల్పిస్తోంది. 2022 వరకు ఆటగాళ్లకు తక్కువ మొత్తంలో పెన్షన్ లభించేది. కానీ జూన్ 1, 2022 ఆటగాళ్ల పెన్షన్ స్కీమ్లో బీసీసీఐ భారీగా మార్పులు చేసింది.ప్రస్తుత విధానం ప్రకారం.. 25 నుండి 49 మ్యాచ్లు ఆడిన ఫస్ట్-క్లాస్ క్రికెటర్లందరికి ప్రతీ నెలా రూ.30 వేల పెన్షన్ లభిస్తుంది. గతంలో వారికి నెలకు 15,000 రూపంలో పెన్షన్ అందేది. అదే విధంగా 50 నుంచి 74 మ్యాచులు ఆడిన వారికి రూ.45 వేల పెన్షన్ బీసీసీఐ నుంచి అందనుంది.75కి పైగా మ్యాచులు ఆడిన క్రికెటర్లకు ప్రతి నెలా రూ.52,500 పెన్షన్ ఇస్తారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో 25 కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన టెస్టు క్రికెటర్లందరికీ నెలకు రూ.70,000 పెన్షన్ లభించింది. గతంలో వీరి పింఛన్ రూ. 50,000గా ఉండేది. ఈ లెక్కన 106 టెస్టులు ఆడిన అశ్విన్కు రూ. 70,000 పెన్షన్ అందనుంది.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
'అశ్విన్ను చాలా సార్లు తొక్కేయాలని చూశారు'
టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ నిర్ణయం భారత క్రికెట్ అభిమానులనే కాకుండా యావత్తు క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించి అందరిని షాక్కు గురిచేశాడు. అయితే టెస్టు క్రికెట్లో భారత తరపున సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన అశ్విన్ కనీసం ఫేర్వెల్ మ్యాచ్ కూడా ఆడకుండా రిటైర్ అవ్వడం ఫ్యాన్స్ను నిరాశపరిచింది. అతడికి బీసీసీఐ ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన చేసి షాకయ్యాను. నిజాయితీగా చెప్పాలంటే అశ్విన్ పట్ల భారత జట్టు మెనెజ్మెంట్ సరైన రీతిలో వ్యవహరించలేదు. పెర్త్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత విడ్కోలు పలకాలని అశ్విన్ నిర్ణయించకున్నాడని స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మనే చెప్పాడు.తొలి టెస్టులో తనను కాదని వాషింగ్టన్ సుందర్ను ఆడించిన తర్వాతే అశ్విన్ రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతడు సంతోషంగా లేడన్న అంశాన్ని ఆ విషయం చెబుతోంది. నిజం చెప్పాలంటే.. తమిళనాడు నుంచి ఓ క్రికెటర్ ఈ స్ధాయికి చేరుకోవడం చాలా గొప్ప విషయం.అందుకు చాలా కారణాలున్నాయి. భారత క్రికెట్లో కొన్ని రాష్ట్రాల ఆటగాళ్లకే మంచి అవకాశాలు లభిస్తాయి. ఇన్ని అసమానతలు ఉన్నప్పటికీ, అశ్విన్ 500 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టి లెజెండ్ అయ్యాడు. అశ్విన్ కూడా చాలా సార్లు పక్కన పెట్టడానికి ప్రయత్నించారు. కానీ అలా జరిగినా ప్రతిసారీ అతడు పక్షిలా తిరిగి గాల్లోకి ఎగిరాడు అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బద్రీనాథ్ పేర్కొన్నాడు.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
కుదుపు రేపే నిర్ణయం
భారత క్రికెట్ రంగంలో బుధవారం ఉరుము లేని పిడుగు పడింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు అయిదు టెస్ట్లు ఆడుతుండగా సిరీస్ మధ్యలోనే అగ్రశ్రేణి భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించడం అనేకమందిని ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియాలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్లోని మూడో టెస్ట్తో పాటు అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ సైతం ముగిసింది. సంచలనం రేపిన ఈ వార్త పలు అనుమానాలు, ఊహాగానాలకు కూడా తెర తీసింది. తాజాగా పెర్త్, బ్రిస్బేన్ మ్యాచ్లలో తుది జట్టులో స్థానం దక్కకపోవడంతో అశ్విన్ స్వచ్ఛందంగా ఆట నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. ‘సిరీస్లో ఇప్పుడు నా అవసరం లేనట్టయితే, ఆటకు గుడ్బై చెప్పేస్తాను’ అంటూ రిటైర్మెంట్కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఆయన తేల్చిచెప్పేశారు. ‘ఆడే సత్తా నాలో ఇంకా మిగిలే ఉంది. బహుశా, (ఐపీఎల్ లాంటి) క్లబ్–స్థాయి క్రికెట్లో దాన్ని చూపుతాను. భారత జట్టు తరఫున ఆడడం మాత్రం ఇదే ఆఖరి రోజు’ అన్న అశ్విన్ ప్రకటన క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేని విషయమే. మొత్తం 106 టెస్టుల్లో 537 వికెట్లు సాధించిన అశ్విన్ అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత క్రికెటర్. 132 మ్యాచ్లలో 619 వికెట్లు సాధించిన నిన్నటి తరం అగ్రశ్రేణి స్పిన్నర్ అనిల్ కుంబ్లే తరువాత అలా ద్వితీయ స్థానంలో నిలిచారు అశ్విన్. బంతితోనే కాదు... బ్యాట్తోనూ అరడజను శతకాలు, 14 అర్ధ శతకాలతో 3,503 పరుగులు సాధించిన ఘనత ఆయనది. ఇంకా చెప్పాలంటే, గత 14 ఏళ్ళ పైచిలుకు కాలంలో స్వదేశంలో భారత జట్టు తిరుగులేని శక్తిగా ఎదగడం వెనుక ఈ తమిళ తంబి కీలక పాత్రధారి. ఈ ఏడాది బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఆయన ఏకంగా 11వ సారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికై, ప్రపంచ రికార్డును సమం చేశారు. బరిలో ఓర్పు, బంతి విసరడంలో నేర్పు, ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంలో నైపుణ్యం ఉన్న తెలివైన ఆటగాడాయన.అందుకే, ఆటలో ఈ అగ్రశ్రేణి ఆఫ్ స్పిన్నర్ చూపే ప్రతిభకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ప్రస్తుత భారత జట్టు బౌలర్లలో ప్రత్యేకంగా నిలిచారు. ఏ క్రికెటరైనా విదేశాల్లో కాకుండా సొంతగడ్డపై ఆటకు స్వస్తి పలకాలనుకుంటారు. అది సర్వసాధారణం. ఎందుకంటే, స్వదేశంలో సొంత క్రీడాభిమానుల జయజయ ధ్వానాల మధ్య ఘనంగా వీడ్కోలు పలకవచ్చని భావిస్తారు. కానీ, అశ్విన్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. దానికి కారణాలు లేకపోలేదు. ఆడే సత్తా ఉన్న ఏ క్రీడాకారుడైనా బరిలో ఉండాలనుకుంటాడే తప్ప, అవకాశం కోసం నిరీక్షిస్తూ బెంచ్ మీద కూర్చొనే జాబితాలో చేరాలనుకోడు. అది ఎవరికైనా బాధాకరమే. అలాంటిది... టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆరు టెస్ట్ సెంచరీలు, 500కు పైగా వికెట్లు తీసుకొన్న ఏకైక క్రికెటర్కు తరచూ అలాంటి అనుభవం ఎదురైతే? అది మరింత బాధ కలిగిస్తుంది. 38 ఏళ్ళ వయస్సులో, కెరీర్లో కాలం కరిగిపోతున్న వేళ... అశ్విన్కు అది అవమానమూ అనిపించింది. భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా సిరీస్లో మధ్యలో ఆయన హఠాత్తుగా తన రిటైర్మెంట్ ప్రకటించారనుకోవాలి. సరిగ్గా పదేళ్ళ క్రితం 2014 డిసెంబర్లో మరో అగ్రశ్రేణి భారత క్రికెటర్ ధోనీ సైతం ఇలాగే ఆటకు అల్విదా చెప్పారు. ఈ వాస్తవ పరిణామాలన్నీ గమనిస్తూ, క్షేత్రస్థాయి అంశాలను గమనంలోకి తీసుకున్న వారికి మాత్రం అశ్విన్ నిర్ణయం మరీ దిగ్భ్రాంతికరంగా తోచదు. అదే సమయంలో జీవితంలో, ఆటలో అత్యంత కఠినమైన ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కూడా విమర్శల జోలికి పోకుండా, పక్కా జెంటిల్మన్గానే వ్యవహరిస్తూ అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించడం చెప్పుకోదగ్గ విషయం. ఆస్ట్రేలియా సిరీస్లోని తొలి మూడు టెస్టుల్లో అడిలైడ్లోని రెండో టెస్ట్లో మాత్రమే అశ్విన్కు జట్టులో స్థానం దక్కింది. ప్రతిభావంతుడైన పాతికేళ్ళ వాషింగ్టన్ సుందర్ అంతకంతకూ ముందు కొస్తూ, అశ్విన్ను పక్కకు జరిపి జట్టులో చోటు సంపాదించుకుంటూ పోతున్నారు. ఫలితంగా అశ్విన్ హుందాగానే పక్కకు తప్పుకున్నారు. వికెట్లు పడగొట్టడంలో పేరున్న ఈ స్పిన్నర్ నిర్ణయం ‘వ్యక్తిగతం’ అని రోహిత్ శర్మ చెప్పారు కానీ రిటైర్మెంట్ ప్రకటన అనంతరం విలేఖరుల ప్రశ్నలు వద్దని అశ్విన్ సున్నితంగానే తప్పుకోవడంతో కంటికి కనిపించని కథలున్నాయనే వాదనకు బలం చేకూరింది. అయితే, అశ్విన్ ఆది నుంచి జట్టు సమష్టి ప్రయోజనాలకై ఆడినవారే. అనేక సందర్భాల్లో సెలెక్టర్ల బంతాటలో వైట్ బాల్ గేమ్స్లో స్థానం దక్కించుకోకున్నా, పట్టుదలతో ఆడుతూ తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ కనీసం మరో రెండేళ్ళ పాటు అంతర్జాతీయ స్థాయిలో ఆడగల సత్తా ఆయనకుంది. అయినా పక్కకు తప్పుకున్నారు. గతంలో ధోనీ ఆస్ట్రేలియాతోనే మెల్ బోర్న్ టెస్ట్లో హుందాగా టెస్ట్ క్రికెట్ నుంచి పక్కకు తప్పుకొని, యువకులకు దోవ ఇచ్చారు. కార ణాలేమైనా, అశ్విన్ ప్రస్తుతానికి పెదవి విప్పి పెద్దగా చెప్పకుండానే పదవీ విరమణ ప్రకటించారు. పేరు ప్రతిష్ఠలు, డబ్బు అన్నీ కెరీర్లో భాగమైన ఆటగాళ్ళు వాటన్నిటినీ వదులుకొని, రిటైరవుతున్నట్టు చెప్పడం నిజానికి ఎప్పుడూ కష్టమే. అశ్విన్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కాకుంటే, పైకి గంభీరంగా కనిపిస్తూ భావోద్వేగాల్ని ప్రదర్శించకపోవడం విశేషం. అశ్విన్ వ్యక్తిగతం మాటెలా ఉన్నా, ఆయన నిష్క్రమణతో భారత క్రికెట్ ఇప్పుడో చిత్రమైన సంధి దశలో నిలిచింది. బహుశా, ఈ ప్రతిభావంతుడి తాజా నిర్ణయంతో ఒకప్పటి ఫామ్ కోల్పోయి, తడబడుతున్న రోహిత్ శర్మ, కోహ్లీలు సైతం ఆత్మపరిశీలనలో పడాల్సి రావచ్చు. ఎంతైనా ఆర్ట్ ఆఫ్ ‘లీవింగ్’ కూడా ఆర్ట్ ఆఫ్ ‘లివింగ్’లో భాగమే కదా! వెరసి, అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం అన్వేషణతో పాటు ఆయన నిష్క్రమణకు దారి తీసిన పరిస్థితులపై చర్చ చాలాకాలం కొనసాగడం ఖాయం. -
అశ్విన్ ‘వారసుడు’ ఎవరు?.. అతడికే అవకాశం ఎక్కువ
గింగిరాలు తిరిగే బంతులతో... ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టిన స్టార్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకగా... భారత జట్టులో అతడి స్థానాన్ని భర్తీ చేసేవారెవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. విదేశీ పిచ్లపై ప్రదర్శనను పక్కన పెడితే... స్వదేశంలో టీమిండియా జైత్రయాత్ర వెనక అశ్విన్ పాత్ర ఎంతో ఉందనేది కాదనలేని సత్యం. అశ్విన్ అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు సొంతగడ్డపై టీమిండియా 65 టెస్టులు ఆడగా... వీటన్నింటిలో అశ్విన్ బరిలోకి దిగాడు. ఈ మధ్య కాలంలో అశ్విన్ విఫలమైన రెండు సిరీస్లలో (2012 ఇంగ్లండ్తో, 2024 న్యూజిలాండ్తో) తప్ప అన్నీట్లో టీమిండియా జయకేతనం ఎగరవేసింది. ఈ గణాంకాలు చాలు అతడేంటో చెప్పేందుకు. 106 టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టి... భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచిన 38 ఏళ్ల అశ్విన్... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ మూడో టెస్టు అనంతరం బుధవారం అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలకగా... సహచరులు, సీనియర్లు అశ్విన్ ఘనతలను కొనియాడారు.అయితే ఇకపై అశ్విన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో... స్పిన్ మాంత్రికుడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరనే చర్చ ప్రధానంగా సాగుతోంది. ఇందులో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, తనుశ్ కొటియాన్, అక్షర్ పటేల్ పేర్లు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో వారి ప్రదర్శనలను ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగంసుందర్కే చాన్స్ ఎక్కువ...ఇప్పుడున్న పరిస్థితుల్లో అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరా అనే ప్రశ్నకు వాషింగ్టన్ సుందర్ అనే సమాధానమే వినిపిస్తోంది. ఈ ఇద్దరూ తమిళనాడుకు చెందిన వాళ్లే కాగా... సుందర్ కూడా అశ్విన్ బాటలోనే అటు బంతితో మాయ చేయడంతో పాటు ఇటు బ్యాటింగ్లోనూ సత్తా చాటగల సమర్థుడు. తాజా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తొలి టెస్టులో అశ్విన్ను కాదని టీమ్ మేనేజ్మెంట్ సుందర్కే అవకాశమిచ్చింది. సమీప భవిష్యత్తులో ఇలాగే జరిగే సూచనలు కనిపించడంతోనే అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికిన అశ్విన్... కొత్త తరానికి మార్గం సుగమం చేశాడు. అశ్విన్ తరహాలోనే టి20 ఫార్మాట్లో సత్తాచాటి అటు నుంచి జాతీయ జట్టు తలుపు తట్టిన 25 ఏళ్ల సుందర్... ఇప్పటి వరకు టీమిండియా తరఫున 7 టెస్టులు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్లో 48.37 సగటుతో 387 పరుగులు సాధించాడు. విదేశీ పిచ్లపై అశ్విన్ కంటే మెరుగైన బ్యాటింగ్ నైపుణ్యం సుందర్ సొంతం కాగా... ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జట్టు యాజమాన్యం సుందర్ను ప్రోత్సహిస్తోంది. కెపె్టన్, కోచ్ నమ్మకాన్ని సంపాదించిన సుందర్... ఎప్పటికప్పుడు బౌలింగ్లో వైవిధ్యం చూపగల నేర్పరి కావడంతో అతడు ఈ జాబితాలో ముందు వరుసలో కనిపిస్తున్నాడు. రేసులో కుల్దీప్ యాదవ్ ఒకదశలో విదేశాల్లో భారత ప్రధాన స్పిన్నర్ అని హెడ్ కోచ్తో మన్ననలు అందుకున్న మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. చైనామన్ స్పిన్నర్గా జట్టులోకి వచి్చన కుల్దీప్ ప్రధానంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనే ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 106 వన్డేల్లో 172 వికెట్లు... 40 టి20ల్లో 69 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో టెస్టు ఫార్మాట్లో 13 మ్యాచ్లాడిన 30 ఏళ్ల కుల్దీప్ యాదవ్ 22.16 సగటుతో 56 వికెట్లు పడగొట్టాడు. అయితే ప్రస్తుతం అశ్విన్ స్థానం కోసం పోటీపడుతున్న వారిలో బ్యాటింగ్ పరంగా కుల్దీప్ యాదవ్ కాస్త వెనుకబడి ఉండటం అతడికి ప్రతిబంధకంగా మారింది. ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి పేస్ ఆల్రౌండర్గా టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడం ఖాయంగానే కనిపిస్తున్న నేపథ్యంలో కుల్దీప్కు బ్యాటింగ్ ప్రతిభతో సంబంధం లేకుండా స్వదేశీ పిచ్లపై ప్రధాన స్పిన్నర్గా ఎంపిక చేసుకునే అవకాశాలు లేకపోలేదు. వయసురీత్యా చూసుకుంటూ ఇప్పటికే 30వ పడిలో ఉన్న కుల్దీప్... అశ్విన్ వారసుడిగా పేరు తెచ్చుకుంటాడా అనేది కాలమే నిర్ణయించాలి. అక్షర్కు అవకాశం లేనట్టే! గత కొంతకాలంగా పరిశీలిస్తే... సొంతగడ్డపై భారత జట్టు ఆడిన టెస్టుల్లో అక్షర్ పటేల్ మూడో స్పిన్నర్గా బరిలోకి దిగాడు. తన ఎత్తును వినియోగించుకుంటూ ఎడమ చేత్తో బంతిని స్పిన్ చేయడంతో పాటు బ్యాటింగ్లోనూ ప్రభావం చూపాడు. 30 ఏళ్ల అక్షర్ ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 14 టెస్టులు ఆడి 19.34 సగటుతో 55 వికెట్లు పడగొట్టడంతో పాటు 35.88 సగటుతో 646 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ స్పిన్ ఆల్రౌండర్గా తనదైన పాత్ర పోషిస్తున్న అక్షర్ పటేల్కు తన బౌలింగ్ శైలే ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ స్పిన్నర్గా ఉన్న రవీంద్ర జడేజా కూడా ఎడమచేతి వాటం బౌలరే కాగా... అక్షర్ మాదిరే బ్యాటింగ్లోనూ సత్తా చాటగల సమర్థుడు. దీంతో బౌలింగ్లో వైవిధ్యం ఉండాలి అంటే వీరిద్దరిలో ఒక్కరినే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.తనుశ్పై దృష్టి...ముంబైకి చెందిన కుడిచేతి వాటం ఆఫ్స్పిన్నర్ తనుశ్ కొటియాన్కు కూడా అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశవాళీల్లో అపార అనుభవం ఉన్నా... ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయని 26 ఏళ్ల తనుశ్... ఇటీవల ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా భారత్ ‘ఎ’ జట్టు తరఫున ఆకట్టుకున్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 33 మ్యాచ్లు ఆడి 25.70 సగటుతో 101 వికెట్లు పడగొట్టిన కొటియాన్... బ్యాట్తో 41.21 సగటుతో 1525 పరుగులు సాధించాడు. బౌలింగ్లో చక్కటి ప్రతిభతో పాటు అవసరమైతే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న తనుశ్... జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటే సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతానికి టీమిండియాలో ఉన్న పోటీని తట్టుకోవడం అంత సులభం అయితే కాదు. -
అశ్విన్ బాటలో రోహిత్ శర్మ?!.. హిట్మ్యాన్ సమాధానం ఇదే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ, బ్యాటింగ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్తో సిరీస్లో అతడి సారథ్యంలో భారత జట్టు 3-0తో వైట్వాష్కు గురైన విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఇప్పటికి మిశ్రమ ఫలితాలే వచ్చాయి.పితృత్వ సెలవుల కారణంగా పెర్త్లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ దూరం కాగా.. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ ఫాస్ట్బౌలర్ నేతృత్వంలో టీమిండియా ఆసీస్ను 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక అడిలైడ్లో కంగారూలతో పింక్ బాల్ టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చినా.. అనుకున్న ఫలితం రాబట్టలేకపోయాడు.రోహిత్ కెప్టెన్సీలో ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్టు వర్షం వల్ల డ్రా అయింది. లేదంటే.. పరిస్థితి ఆస్ట్రేలియాకే అనుకూలంగా ఉండేదన్న అభిప్రాయాలు ఉన్నాయి.ఇక అడిలైడ్, బ్రిస్బేన్లో రెగ్యులర్ ఓపెనింగ్ స్థానంలో కాకుండా.. ఆరో ప్లేస్లో బ్యాటింగ్ చేసిన రోహిత్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు మూడు ఇన్నింగ్స్ ఆడి అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 3, 6, 10. దీంతో కెప్టెన్గా రోహిత్ తప్పుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. బుమ్రాకు పగ్గాలు అప్పగించాలని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆసీస్తో బ్రిస్బేన్ టెస్టు ముగియగానే టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అనుకున్న ఫలితం రాకపోతే రోహిత్ కూడా గుడ్బై చెబుతాడనే వదంతులు వ్యాపించాయి.అయితే, రోహిత్ శర్మ మాత్రం వాటిని కొట్టిపడేశాడు. ‘‘నేను సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయానన్నది వాస్తవం. ఈ విషయాన్ని అంగీకరించడంలో ఎలాంటి తప్పూ లేదు. అయితే, ఎల్లవేళలా మెరుగ్గా ఆడేందుకు నన్ను నేను సన్నద్ధం చేసుకుంటాను. అనుకున్న లక్ష్యాలలో దాదాపుగా అన్నిటినీ చేరుకున్నాను.క్రీజులో మరింత ఎక్కువ సేపు నిలబడేందుకు ప్రయత్నిస్తా. ఇక నా శరీరం, నా మనసు సహకరించినంత కాలం.. నేను ముందుకు కొనసాగుతూనే ఉంటా. ఈ ప్రయాణంలో విధి నాకోసం ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేసినా వాటిని సంతోషంగా స్వీకరిస్తా’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియా చెరో విజయం సాధించి.. మూడో టెస్టును డ్రా చేసుకున్నాయి. ఫలితంగా సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.తదుపరి డిసెంబరు 26- 30 మధ్య బాక్సింగ్ డే టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఇందుకు వేదిక. ఇక ఈ మ్యాచ్తో పాటు.. సిడ్నీలో జరిగే ఆఖరి టెస్టులోనూ గెలిస్తేనే.. భారత్ ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరుకునే వీలుంటుంది. చదవండి: నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలు -
‘అప్పుడే డిసైడ్ అయ్యాను’.. రోహిత్ అలా.. అశ్విన్ ఇలా!
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్కు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. అశూ అన్న చెన్నైలోని తన ఇంటికి చేరుకున్న సమయంలో సమయంలో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు మేళతాళాలతో ఆహ్వానం పలికారు. అనంతరం అశ్విన్ మీడియాతో మాట్లాడాడు.టీమిండియా క్రికెటర్గా మాత్రమేబ్రిస్బేన్ టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగానే తాను రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు అశ్విన్ తెలిపాడు. ఏదేమైనా క్రికెటర్ అశ్విన్గా తన ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని.. టీమిండియా క్రికెటర్గా మాత్రమే తన ప్రస్థానం ముగిసిందని పేర్కొన్నాడు. వీలైనంత కాలం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేందుకు ప్రయత్నిస్తానని అశూ తెలిపాడు.‘‘చాలా మందికి ఇదొక భావోద్వేగ సమయం. బహుశా నా మనఃస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. అయితే, నేను ఇప్పుడు పూర్తి సంతృప్తితో ఉన్నాను. రిటైర్మెంట్ విషయం చాలా రోజులుగా నా మదిలో తిరుగుతూనే ఉంది. అయితే, బ్రిస్బేన్ టెస్టు నాలుగో రోజు ఆట జరుగుతున్నపుడు నేను నిర్ణయం తీసుకున్నా.జీరో రిగ్రెట్స్ఇదేమీ నా జీవితంలో అతిపెద్ద విషయం కాదు. ఎందుకంటే నేను ఇకపై కొత్త దారిలో ప్రయాణిస్తాను’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా కెప్టెన్గా ఒక్కసారి కూడా అవకాశం రానందుకు బాధపడుతున్నారా అని విలేకరులుగా అడగా.. ‘‘నాకు ఎలాంటి విచారం లేదు. జీరో రిగ్రెట్స్.జీవితం, కెరీర్ పట్ల విచారంతో ఉండే వ్యక్తులను నేను దూరంగా ఉండి చూశాను. కానీ నా లైఫ్లో అలాంటివేమీ లేవు’’ అని అశ్విని తమ మనసులోని భావాలను వెల్లడించాడు. ఇక 2011లో వన్డే వరల్డ్కప్ గెలిచినపుడు తనకు ఘన స్వాగతం లభించిందని.. ఇప్పుడు మళ్లీ నాటి జ్ఞాపకాలను గుర్తుచేశారంటూ అశూ భావోద్వేగానికి లోనయ్యాడు.రోహిత్ అలా.. అశూ ఇలాకాగా తాను పెర్త్కు చేరుకున్నపుడే అశూ రిటైర్మెంట్ విషయం తెలిసిందని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పగా.. అశూ మాత్రం బ్రిస్బేన్లోనే తాను డిసైడ్ అయ్యానని చెప్పడం గమనార్హం.కాగా 2010లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు అశ్విన్. తన పద్నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 537, 156, 72 వికెట్లు తీశాడు. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ టెస్టుల్లో 3503 పరుగులు కూడా సాధించాడు. ఇందులో ఆరు శతకాలు. 14 అర్ధ శతకాలు ఉండటం విశేషం.సీఎస్కే తరఫునఇదిలా ఉంటే.. వన్డేల్లో 707 పరుగులు సాధించిన అశ్విన్.. టీ20లలో 184 రన్స్ రాబట్టాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు(బ్రిస్బేన్) సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇకపై అశూ క్లబ్ క్రికెట్కే పరిమితం కానున్నాడు. వచ్చే ఏడాది చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) తరఫున అతడు ఐపీఎల్ బరిలో దిగనున్నాడు. ఇటీవల జరిగిన మెగా వేలం-2025లో చెన్నై ఫ్రాంఛైజీ.. అశూను రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది.చదవండి: నా అవసరం లేనపుడు.. నేనెందుకు ఉండాలి?: రోహిత్ శర్మతో అశ్విన్The countless battles on the field are memorable ❤️But it's also moments like these that Ashwin will reminisce from his international career 😃👌 Check out @ashwinravi99 supporting his beloved support staff 🫶#TeamIndia | #ThankYouAshwin pic.twitter.com/OepvPpbMSc— BCCI (@BCCI) December 19, 2024 -
నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలు
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటనపై అతని తండ్రి రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కొడుకు చాలా కాలంగా అవమానానికి గురవుతున్నాడని, అందుకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిందని వివాదాస్పద కామెంట్స్ చేశాడు. అద్భుతమైన కెరీర్ రికార్డు కలిగి ఉన్నప్పటికీ ప్లేయింగ్ XIలో రెగ్యులర్గా స్థానం పొందలేకపోవడాన్ని యాష్ అవమానంగా భావించవచ్చని అభిప్రాయడపడ్డాడు.CNN న్యూస్ 18కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రవిచంద్రన్ మాట్లాడుతూ.. తన కొడుకు చాలాకాలంగా అవమానాలకు గురవుతున్నాడని ఆరోపించాడు. యాష్ ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే కారణం అయ్యుండవచ్చని అభిప్రాయపడ్డాడు. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన విన్నప్పుడు అందరి లాగే తాను కూడా ఆశ్చర్యపోయానని అన్నాడు. అశ్విన్ రిటైర్మెంట్ గురించి తనకు కూడా చివరి నిమిషంలో తెలిసిందని తెలిపాడు. అశ్విన్ మనస్సులో ఏముందో తెలియదు కానీ, అతని నిర్ణయాన్ని మనస్పూర్తిగా అంగీకరిస్తున్నానని అన్నాడు. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన విధానం చూస్తే ఓ పక్క సంతోషం, మరో పక్క బాధగా ఉందని పేర్కొన్నాడు. రిటైర్మెంట్ అన్నది అశ్విన్ వ్యక్తిగతం. అందులో నేను జోక్యం చేసుకోలేను. కానీ అతని ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. అవి అశ్విన్కి మాత్రమే తెలుసు. బహుశా తనుకు రెగ్యులర్గా జట్టులో చోటు దక్కకపోవడాన్ని అశ్విన్ అవమానంగా భావించి ఉండవచ్చని రవిచంద్రన్ చెప్పుకోచ్చాడు. కాగా, రిటైర్మెంట్పై అశ్విన్ గత కొంతకాలంగా మదన పడుతున్న విషయాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రస్తావించాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ వరకు రిటైర్మెంట్ను పోస్ట్పోన్ చేసుకోవాలని అశ్విన్ను కోరినట్లు హిట్మ్యాన్ స్వయంగా చెప్పాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. -
స్వదేశానికి చేరుకున్న అశ్విన్.. కుటుంబ సభ్యుల ఘన స్వాగతం
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ అనంతరం స్వదేశానికి చేరుకున్నాడు. అశ్విన్ చెన్నైలోని తన స్వగృహానికి చేరుకోగానే కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బ్యాండ్ వాయిద్యాలతో అశ్విన్ ఇంటివద్ద కోలాహలం నెలకొంది. WELCOME BACK TO INDIA, RAVI ASHWIN. 🇮🇳❤️- Ash reaches Chennai after announcing his retirement. 🥹 pic.twitter.com/kIQ1gxzHIA— Mufaddal Vohra (@mufaddal_vohra) December 19, 2024వాయిద్యాల నడుమ అశ్విన్ తన భార్య, పిల్లలతో కలిసి ఇంట్లోకి ప్రవేశించాడు. అశ్విన్కు మొదటిగా తన తండ్రి ఎదురుపడి అభినందించాడు. అనంతరం కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా యాష్ను విష్ చేశారు. అభిమానులు యాష్ను పూల మాలలతో సత్కరించారు. ఫ్యాన్స్ అశ్విన్తో ఫోటోల కోసం, ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడ్డారు.HOME TOWN HERO IS BACK. 🇮🇳- A Grand welcome for Ravichandran Ashwin at his home. 🤍 pic.twitter.com/WNGywMr4Sj— Johns. (@CricCrazyJohns) December 19, 2024కాగా, అశ్విన్ ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్పై అశ్విన్ బీజీటీ ప్రారంభానికి ముందు నుంచే క్లారిటీ కలిగి ఉన్నాడు. అశ్విన్ తాను రిటైర్ కావాలనుకుంటున్న విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మతో తొలి టెస్ట్ సందర్భంగా చెప్పాడు. అయితే రోహిత్ అప్పుడు అశ్విన్ను వారించి రెండో టెస్ట్ వరకు ఎదురుచూడాలని కోరాడు. రెండో టెస్ట్ అయిన పింక్ బాల్ టెస్ట్లో అశ్విన్ చివరిసారి టీమిండియా జెర్సీలో కనిపించాడు. జట్టు సమీకరణల దృష్ట్యా ఆశ్విన్కు మూడో టెస్ట్లో ఆడే అవకాశం రాలేదు. దీంతో ఇదే రిటైర్మెంట్కు సరైన సమయమని భావించిన యాష్.. బ్రిస్బేన్ టెస్ట్ అనంతరం మీడియా సమావేశంలో తన మనోగతాన్ని వెల్లడించాడు.38 ఏళ్ల అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆస్ట్రేలియాను వీడి భారత్కు పయనమయ్యాడు. అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినా దేశవాలీ క్రికెట్, ఐపీఎల్లో ఆడతాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అశ్విన్ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. అశ్విన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 765 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 180 వికెట్లు తీశాడు. అశ్విన్ రిటైర్మెంట్ అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో భావోద్వేగంతో కూడిన సందేశాన్ని ఇచ్చాడు. -
అశ్విన్ ద గ్రేట్.. మురళీథరన్, షేన్ వార్న్ కంటే ఎక్కువ..!
ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్బై చెప్పాడు. అశ్విన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 765 వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్లతో పోలిస్తే టెస్ట్ క్రికెట్ ఎక్కువగా ఆడిన యాష్.. ఒక్క సుదీర్ఘ ఫార్మాట్లోనే 537 వికెట్లు తీశాడు. అశ్విన్ టెస్ట్ల్లో 37 సార్లు ఒకే ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ ఏడో స్థానంలో ఉన్నాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (800) కొనసాగుతున్నాడు. మురళీ తర్వాతి స్థానాల్లో షేన్ వార్న్ (708), ఆండర్సన్ (704), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్గ్రాత్ (563) ఉన్నారు.మురళీథరన్, షేన్ వార్న్ కంటే ఎక్కువ సార్లు..!టెస్ట్ల్లో మురళీథరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజ స్పిన్నర్లు అశ్విన్ కంటే ఎక్కువ వికెట్లు తీశారు. వికెట్ల సంఖ్యా పరంగా లేదా ఇతరత్రా రికార్డుల విషయంలో వీరంతా అశ్విన్ కంటే మెరుగ్గా ఉన్నా, ఒక్క విషయంలో మాత్రం అశ్విన్ పై ముగ్గురిని తలదన్నాడు.టెస్ట్ సిరీస్ల్లో అత్యధిక సార్లు 25 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఘనత అశ్విన్కే దక్కుతుంది. అశ్విన్ తన కెరీర్లో ఏడు సార్లు టెస్ట్ సిరీస్ల్లో 25 అంతకంటే ఎక్కువ వికెట్లు తీయగా.. షేన్ వార్న్, మురళీథరన్ ఆరు సార్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. అశ్విన్ 25 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆరు సిరీస్ల్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలవడం విశేషం. అశ్విన తన కెరీర్లో మొత్తం 12 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు అందుకున్నాడు. -
అశ్విన్.. రిటైర్మెంట్ ప్రకటించడానికి సమయమా ఇది..?
ఆసీస్తో మూడో టెస్ట్ (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అశ్విన్ సడెన్గా ఆటకు వీడ్కోలు పలికినందుకు భారత అభిమానులంతా బాధపడుతుంటే.. క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ మాత్రం అశ్విన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాడు. సిరీస్ మధ్యలో ఈ ఆకస్మిక నిర్ణయమేంటని ప్రశ్నిస్తున్నాడు. అశ్విన్ రిటైర్ కావాలనుకుంటే సిరీస్ అయిపోయే దాకా వేచి ఉండాల్సిందని అన్నాడు. అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన టీమిండియా ప్రణాళికలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇలాంటి దశలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన సిరీస్ ఫలితాన్ని తారుమారు చేయగలదని అంచనా వేశాడు. అశ్విన్ సిరీస్ మధ్యలో రిటైర్ కావడం వల్ల భారత్ మిగిలిన రెండు మ్యాచ్లకు ఒక ఆటగాడి సేవలు కోల్పోతుందని అన్నాడు. గతంలో ఎంఎస్ ధోని కూడా ఇలాగే సిరీస్ మధ్యలో రిటైరైన విషయాన్ని ప్రస్తావించాడు. సిరీస్లో చివరిదైన సిడ్నీ టెస్ట్లో అశ్విన్ తన ప్రభావాన్ని చూపేందుకు ఆస్కారముండేదని అభిప్రాయపడ్డాడు. సిడ్నీ పిచ్కు స్పిన్నర్లకు సహకరించిన చరిత్ర ఉందని గుర్తు చేశాడు. అశ్విన్ నిర్ణయాన్ని తప్పుబడుతూనే గవాస్కర్ మరో కీలక వ్యాఖ్య చేశాడు. మిగిలిన సిరీస్ కోసం అశ్విన్తో పోలిస్తే వాషింగ్టన్ సుందర్ ముందున్నాడని అన్నాడు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే ఆసీస్తో తదుపరి జరుగబోయే రెండు టెస్ట్ల్లో గెలవాల్సి ఉంది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.మ్యాచ్ ఐదు రోజులు వర్షం అంతరాయాలు కలిగించడంతో మూడో టెస్ట్లో ఫలితం తేలలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో తడబడగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆకాశ్దీప్, బుమ్రా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించారు. రెండో ఇన్నింగ్స్లో వేగంగా పరుగులు చేసే క్రమంలో ఆసీస్ త్వరితగతిన వికెట్లు కోల్పోయింది. అయినా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి రోజు మరోసారి వరుణుడు విజృంభించడంతో కొద్ది సేపటికే మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు. -
ఈ ఏడాది రిటైరైన స్టార్ క్రికెటర్లు వీరే..!
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్తో అంతర్జాతీయ క్రికెట్లో ఒక శకం ముగిసినట్లనిపిస్తుంది. ఈ ఏడాది భారత్ సహా చాలా దేశాలకు చెందిన స్టార్ ఆటగాళ్లు రిటైరయ్యారు. వీరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా లాంటి స్టార్లు పొట్టి ఫార్మాట్కు మాత్రమే వీడ్కోలు పలుకగా.. డేవిడ్ వార్నర్, శిఖర్ ధవన్ లాంటి దిగ్గజ ప్లేయర్లు అన్ని ఫార్మాట్లకు గుడ్బై చెప్పారు. 2024లో ఇప్పటివరకు (డిసెంబర్ 18) 32 మంది అంతర్జాతీయ క్రికెటర్లు తమ కెరీర్లకు వీడ్కోలు పలికారు.ఈ ఏడాది తొలి వారంలోనే సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్, ఆసీస్ దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 వరల్డ్ వరల్డ్కప్ అనంతరం టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్కు బై బై చెప్పారు. మధ్యలో శిఖర్ ధవన్.. జేమ్స్ ఆండర్సన్.. తాజాగా అశ్విన్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పారు.ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్లు..1. సౌరభ్ తివారి (అన్ని ఫార్మాట్లు)2. వరుణ్ ఆరోన్ (అన్ని ఫార్మాట్లు)3. దినేశ్ కార్తీక్ (అన్ని ఫార్మాట్లు)4. కేదార్ జాదవ్ (అన్ని ఫార్మాట్లు)5. విరాట్ కోహ్లి (టీ20లు)6. రోహిత్ శర్మ (టీ20లు)7. రవీంద్ర జడేజా (టీ20లు)8. శిఖర్ ధవన్ (అన్ని ఫార్మాట్లు)9. బరిందర్ స్రాన్ (అన్ని ఫార్మాట్లు)10. వృద్దిమాన్ సాహా (అన్ని ఫార్మాట్లు)11. సిద్దార్థ్ కౌల్ (భారత క్రికెట్)12. రవిచంద్రన్ అశ్విన్ (అంతర్జాతీయ క్రికెట్)ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన అంతర్జాతీయ క్రికెటర్లు..1. డీన్ ఎల్గర్ (సౌతాఫ్రికా, అన్ని ఫార్మాట్లు)2. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)3. హెన్రిచ్ క్లాసెన్ (సౌతాఫ్రికా, టెస్ట్లు)4. నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు)5. కొలిన్ మున్రో (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు)6. డేవిడ్ వీస్ (నమీబియా, అన్ని ఫార్మాట్లు)7. సైబ్రాండ్ ఎంజెల్బ్రెచ్ (నెదర్లాండ్స్, అన్ని ఫార్మాట్లు)8. బ్రియాస్ మసాబా (ఉగాండ, టీ20లు)9. జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)10. డేవిడ్ మలాన్ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)11. షాన్నోన్ గాబ్రియెల్ (వెస్టిండీస్, అన్ని ఫార్మాట్లు)12. విల్ పుకోవ్స్కీ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)13. మొయిన్ అలీ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)14. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్, టెస్ట్లు, టీ20లు)15. మహ్మదుల్లా (బంగ్లాదేశ్, టీ20లు)16. మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)17. టిమ్ సౌథీ (న్యూజిలాండ్, టెస్ట్ క్రికెట్)18. మహ్మద్ అమీర్ (పాకిస్తాన్, అంతర్జాతీయ క్రికెట్)19. ఇమాద్ వసీం (పాకిస్తాన్, అంతర్జాతీయ క్రికెట్)20. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు) -
నా అవసరం లేనపుడు.. నేనెందుకు ఉండాలి?: రోహిత్తో అశ్విన్
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. పెర్త్ టెస్టు సమయంలోనే అశూ ఈ నిర్ణయం తీసుకున్నాడని.. అయితే, తాను నచ్చచెప్పడం వల్ల ఇప్పటిదాకా ఆగాడని తెలిపాడు. అశ్విన్ను మ్యాచ్ విన్నర్గా అభివర్ణించిన రోహిత్.. ఇకపై అతడు జట్టులో లేని స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నాడు.తొలి టెస్టులో దక్కని చోటుటీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. తొలి టెస్టు పెర్త్లో జరుగగా.. రెండో టెస్టుకు అడిలైడ్ వేదికైంది. ఇక తొలి టెస్టులో అశూను పక్కనపెట్టిన టీమిండియా మేనేజ్మెంట్.. స్పిన్నర్ కోటాలో వాషింగ్టన్ సుందర్ను ఆడించింది.మూడో టెస్టులోనూ మొండిచేయిఇక రెండో టెస్టు తుదిజట్టులో ఈ చెన్నై ప్లేయర్కు చోటు దక్కినా.. పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. అడిలైడ్లో జరిగిన ఈ పింక్ బాల్ మ్యాచ్లో అశ్విన్ 18 ఓవర్లు బౌలింగ్ చేసి 53 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే, బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్టులో అశూ స్థానాన్ని రవీంద్ర జడేజాతో భర్తీ చేశారు.అశ్విన్ స్పష్టతతో ఉన్నాడుగబ్బా ఆతిథ్యమిచ్చిన ఈ టెస్టు డ్రాగా ముగియగా.. మ్యాచ్ అనంతరం అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రెస్మీట్లో కూర్చున్న అశూ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ విషయం గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘అశ్విన్ తన నిర్ణయం పట్ల పూర్తి స్పష్టతతో ఉన్నాడు.పెర్త్ టెస్టు తర్వాతే రిటైర్ అవ్వాలని భావించాడు. తుదిజట్టు కూర్పు విషయంలో మేనేజ్మెంట్ ఎలా ఆలోచిస్తుందో అతడికి తెలుసు. కాంబినేషన్లపై కూడా అతడికి అవగాహన ఉంది. నిజానికి మేము ఆస్ట్రేలియాలో అడుగుపెట్టే సమయానికి అసలు స్పిన్నర్ను ఆడిస్తామో లేదో తెలియని పరిస్థితి.పరిస్థితులకు తగ్గట్లుగా ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేసుకోవాలని భావించాం. అయితే, నేను పెర్త్కు చేరుకున్నపుడే అశూ నాతో రిటైర్మెంట్ గురించి చర్చించాడు. అయితే, కనీసం పింక్ బాల్ టెస్టు వరకైనా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోరాను.నా అవసరం లేనపుడు.. నేనెందుకు ఉండాలి?‘ఒకవేళ ఈ సిరీస్లో నా అవసరం లేకపోతే.. నేను జట్టుతో కొనసాగడం కూడా దండగ. గుడ్ బై చెప్పడమే సరైంది’ అని అశూ అన్నాడు. ఇక మెల్బోర్న్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు.స్పిన్నర్ను ఆడించే విషయంపై స్పష్టత లేదు. అందుకే తన నిర్ణయాన్ని గౌరవించాలని భావించాం’’ అని పేర్కొన్నాడు. అశ్విన్ బిగ్ మ్యాచ్ విన్నర్ అన్న రోహిత్ శర్మ.. అతడితో కలిసి ఆడిన క్షణాలు తనకు గుర్తుండిపోతాయని తెలిపాడు.చెరో విజయంతోకాగా ఆసీస్తో తొలి టెస్టుకు రోహిత్ స్థానంలో బుమ్రా సారథ్యం వహించగా.. రెండో టెస్టు నుంచి రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. ఇక బుమ్రా కెప్టెన్సీలో పెర్త్లో గెలిచిన భారత జట్టు.. రోహిత్ నాయకత్వంలో పింక్ బాల్ టెస్టు ఓడిపోయింది. మూడో టెస్టు డ్రా కావడంతో ఇరుజట్లు ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి. మిగిలిన రెండు టెస్టులు మెల్బోర్న్, సిడ్నీలలో జరుగుతాయి.చదవండి: వర్షం వల్లే డ్రా.. లేదంటే గెలుపు మాదే.. ఆ ఇద్దరు అద్భుతం: కమిన్స్#Ashwin has announced his retirement from all forms of international cricket! With 765 wickets across formats, he bows out as one of the greatest spinners of all time. Go well, @ashwinravi99 ! 🙌 pic.twitter.com/alfjOj4IDm— Star Sports (@StarSportsIndia) December 18, 2024 -
అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన వెనుక కారణాలు..?
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎవ్వరూ ఊహించని విధంగా గబ్బా టెస్ట్ (భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్ట్) అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడు. అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన వెనుక కారణాలు ఏమని ఆరా తీస్తే మూడు విషయాలు వెలుగులోకి వచ్చాయి.1. విదేశాల్లో జరిగే టెస్ట్ల్లో అవకాశాలు కరువువిదేశాల్లో జరిగే టెస్ట్ల్లో అశ్విన్కు అవకాశాలు కరువయ్యాయి. ముఖ్యంగా SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో జరిగే టెస్ట్ల్లో అశ్విన్ను పట్టించుకోవడమే లేదు. ఇక్కడ అశ్విన్ తప్పేమీ లేదు. SENA దేశాల్లో పిచ్లు స్పిన్నర్లకు పెద్దగా సహకరించవు. అందుకే అశ్విన్ తుది జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు. విదేశాల్లో జరిగే టెస్ట్ల్లో అవకాశాలు కరువు కావడమే అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం వెనుక ప్రధాన కారణం కావచ్చు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ల్లో అశ్విన్కు ఒకే ఒక అవకాశం వచ్చింది. అడిలైడ్లో జరిగిన రెండో టెస్ట్లో అశ్విన్కు అవకాశం వచ్చినా సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. బీజీటీలో తదుపరి జరుగబోయే రెండు టెస్ట్ల్లో కూడా అశ్విన్ అవకాశాలు దక్కడం అనుమానమే. దీంతో గబ్బా టెస్ట్ అనంతరమే ఆటకు వీడ్కోలు పలికితే బాగుంటుందని అశ్విన్ భావించాడు. 2. హోం సిరీస్కు ఇంకా 10 నెలల సమయం ఉందిటీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు క్వాలిఫై అయితే ఆ మ్యాచ్ ఆడేందుకు ఇంగ్లండ్కు వెళ్తుంది. ఆతర్వాత టెస్ట్ల్లో భారత అసైన్మెంట్ ఇంగ్లండ్లోనే ఉంది. భారత్ తదుపరి హోం సిరీస్ వచ్చే ఏడాది అక్టోబర్లో వెస్టిండీస్తో ఉంటుంది. అంటే భారత్ స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడాలంటే ఇంకా 10 నెలల సమయం ఉంది. ఒకవేళ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించకపోయినా అవకాశాల కోసం విండీస్ సిరీస్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఇంత సమయం ఖాళీగా ఉండటం ఇష్టం లేకే అశ్విన్ ఆకస్మికంగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించి ఉండవచ్చు. ఆస్ట్రేలియాలో రిటైర్ కావడం కంటే ఉత్తమమైనది ఏదీ ఉండదని యాష్ భావించి ఉండవచ్చు.3. వయసుఅశ్విన్ ఆకస్మికంగా రిటైర్ కావడానికి మరో ప్రధాన కారణం వయసు. ప్రస్తుతం అశ్విన్ వయసు 38 ఏళ్లు. అశ్విన్ ఇప్పుడు రిటైర్ కాకపోయినా మహా అయితే మరో రెండేళ్లు ఆడగలడు. కేవలం స్వదేశంలో జరిగే టెస్ట్ల్లోనే అవకాశాలు వస్తుండటంతో అశ్విన్ మహా అయితే మరో 10-12 టెస్ట్లు ఆడగలడు. ఈ మధ్యలో ఫామ్ కోల్పోయి లేదా జట్టుకు భారంగా మారడం కంటే అంతా బాగున్నప్పుడే రిటైర్ కావడం మంచిదని అశ్విన్ భావించి ఉండచ్చు. -
అంతర్జాతీయ క్రికెట్కు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు (ఫొటోలు)
-
అశ్విన్ అల్విదా
భారత టెస్టు క్రికెట్ ఘనాపాఠిల్లో మరో శిఖరం తన ఆటను ముగించింది. తన పదునైన ఆఫ్స్పిన్ బంతులతో పాటు తనకే సాధ్యమైన వ్యూహాలు, తెలివితేటలతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించిన ఇంజినీరింగ్ బుర్ర ఇక అంతర్జాతీయ క్రికెట్ చాలంటూ తప్పుకుంది. సుదీర్ఘ కెరీర్ తర్వాత మదరాసీ ముద్దు బిడ్డ రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా తరఫున చివరి మ్యాచ్ ఆడేసినట్లు ప్రకటించాడు. ఎన్నో రికార్డులు, మరెన్నో ఘనతల తర్వాత భారత్ తరఫున తన ప్రస్థానాన్ని ముగిస్తున్నట్లు అశ్విన్ వెల్లడించాడు. లెక్కపెట్టలేనన్ని మేటి గణాంకాలకు చిరునామాగా నిలిచిన ఈ దిగ్గజం తుది జట్టులో తన స్థానంపై సందేహం రాగానే ఇక చాలంటూ చివరి నిర్ణయం తీసుకున్నాడు. తన అవసరం లేని జట్టుతో ఇంకా కొనసాగడం అనవసరం అంటూ ఆ్రస్టేలియాతో సిరీస్ మధ్యలోనే గుడ్బై చెప్పేసి నిష్క్రమించాడు. బ్రిస్బేన్: భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. టీమిండియా క్రికెటర్గా ఇదే తన చివరి రోజు అంటూ వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా అడిలైడ్లో జరిగిన డే అండ్ నైట్ టెస్టు అశ్విన్ కెరీర్లో చివరిదిగా ముగిసింది. తొలి, మూడో టెస్టుల్లో తుది జట్టులో అతనికి స్థానం లభించలేదు. ‘గాబా’లో టెస్టు ముగిసిన తర్వాత కెపె్టన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశానికి హాజరైన అశ్విన్... తన నిర్ణయం గురించి స్పష్టంగా వివరించి వెనుదిరిగాడు. సిరీస్లో మరో రెండు టెస్టులు మిగిలి ఉన్నా... ముందే రిటైర్మెంట్ ప్రకటించిన అతను నేడు స్వదేశానికి బయలుదేరి వెళుతున్నాడు. 2011లో భారత్ తరఫున తొలి టెస్టు మ్యాచ్ ఆడిన అశ్విన్ 106 టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టాడు. 2010లో వన్డేలు, టి20ల్లో అశ్విన్ అరంగేట్రం జరిగింది. ఈ రెండు ఫార్మాట్లలో చాలా కాలం క్రితమే అతను జట్టుకు దూరమైనా... అనూహ్యంగా వచ్చిన అవకాశాలు మళ్లీ వరల్డ్ కప్లు ఆడేలా చేశాయి. గత ఏడాది సొంత మైదానంలో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో ఆడిన వరల్డ్ కప్ మ్యాచ్ అతని ఆఖరి వన్డే కాగా... 2022 టి20 వరల్డ్ కప్లో భాగంగా అడిలైడ్లో ఇంగ్లండ్తో ఆడిన పోరు అతని ఆఖరి అంతర్జాతీయ టి20 మ్యాచ్. 2011 వన్డే వరల్డ్ కప్, 2013 వన్డే చాంపియన్స్ ట్రోఫీల్లో విజేతగా నిలిచిన భారత జట్టులో అశ్విన్ సభ్యుడు. అయితే గత కొన్నేళ్లుగా అతను ‘టెస్టు స్పెషలిస్ట్’గానే జట్టుతో కొనసాగుతున్నాడు. ప్రధాన స్పిన్నర్గా స్వదేశంలో భారత్ సిరీస్ విజయాల్లో అశ్విన్దే కీలక పాత్ర. జట్టులో అవకాశాలు రాకపోవడంతో... ఆ్రస్టేలియాతో టెస్టు సిరీస్ మధ్యలో తప్పుకోవడం ఆశ్చర్యంగా అనిపించినా అశ్విన్ తీసుకున్న నిర్ణయం మరీ అనూహ్యమేమీ కాదు. ఈ సిరీస్కు ముందు న్యూజిలాండ్తో 3 టెస్టుల్లో అతను 41.22 సగటుతో కేవలం 9 వికెట్లు తీశాడు. స్వదేశంలో అతని స్థాయి ప్రదర్శనతో పోలిస్తే ఇది చాలా పేలవం. ఆ్రస్టేలియాతో పెర్త్లో జరిగిన తొలి టెస్టులో అతడిని కాదని యువ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్కు చోటు కల్పించడం అశ్విన్కు తీవ్ర నిరాశ కలిగించింది. సాధారణంగా టీమిండియా విదేశీ గడ్డపై ఒక స్పిన్నర్ను ఆడిస్తే అతని బ్యాటింగ్ బలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. మూడో టెస్టులో రవీంద్ర జడేజా ఆడాడు. బుధవారం కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే దీనిపై మరింత స్పష్టత వచ్చింది. తొలి టెస్టులో అతడిని తప్పించే నిర్ణయం కోచ్ గంభీర్ తీసుకోగా... రెండో టెస్టు కోసం అశ్విన్ను రోహిత్ ఒప్పించాడు. ‘పెర్త్ టెస్టు సమయంలోనే అతను రిటైర్మెంట్ గురించి చర్చించాడు. అప్పటికే అతని మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి. అడిలైడ్ తర్వాత బ్రిస్బేన్లో కూడా పలు కారణాలతో తుది జట్టులో అతను లేడు. మెల్బోర్న్ గురించి ఇప్పుడే చెప్పలేను. అపార అనుభవం ఉండి డ్రెస్సింగ్ రూమ్లో పరిణామాల గురించి ఎంతో తెలిసిన అశ్విన్ ఇలాంటి విషయాలు అర్థం చేసుకోగలడు. సిరీస్లో తన అవసరం లేకపోతే ఇంకా ఎందుకని అతను భావించాడు. అయితే అతని స్థాయి ప్లేయర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని మనం గౌరవించాలి’ అని రోహిత్ శర్మ అన్నాడు. నిజానికి స్పిన్కు అనుకూలించే సిడ్నీలో జరిగే చివరి టెస్టులో ఇద్దరు స్పిన్నర్లతో ఆడితే అశ్విన్ పేరును కూడా పరిశీలించే అవకాశం ఉండేది. అయితే దీనిపై కూడా అతనికి బహుశా నమ్మకం లేకపోవచ్చు. జడేజా, సుందర్లనే ఆడిస్తారని అతను అనుకొని ఉంటాడు. అందుకే సిరీస్ ముగిసేవరకు అతను ఆగలేదు. భారత్ తమ తర్వాతి సిరీస్ వచ్చే ఏడాది జూన్లో ఇంగ్లండ్ గడ్డపై ఆడుతుంది కాబట్టి అక్కడా అతనికి తుది జట్టులో స్థానంపై సందేహమే.టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్కు అర్హత సాధించినా ఇదే పరిస్థితి ఎదురు కావచ్చు. దాదాపు ఏడాది వరకు స్వదేశంలో టెస్టులు లేవు. ఈ నేపథ్యంలో తప్పుకోవడమే మంచిదని అశ్విన్ భావించాడు. ఐపీఎల్ బరిలో... ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఇటీవల జరిగిన వేలంలో అశ్విన్ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.9 కోట్ల 75 లక్షలకు తీసుకుంది. కాబట్టి వచ్చే సీజన్లో అతను ఐపీఎల్ ఆడటం ఖాయం కాగా, తమిళనాడు ప్రీమియర్ లీగ్లో కూడా ప్లేయర్ కమ్ కోచ్గా బరిలోకి దిగే అవకాశం ఉంది.అంకెల్లో అశ్విన్ ఘనతపదమూడేళ్ల ఘనమైన టెస్టు కెరీర్లో అశ్విన్ ఎన్నో కొత్త రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్నాడు. గతంలో ఎవరికీ సాధ్యం కాని అసాధారణ గణాంకాలకు అతను అడ్రస్గా మారాడు. కొన్ని అంకెలు చూస్తే జట్టులో అతని విలువేమిటో, చిరస్మరణీయ విజయాల్లో అశ్విన్ పాత్ర ఏమిటో అర్థమవుతుంది. 537టెస్టుల్లో అశ్విన్ వికెట్ల సంఖ్య. భారత్ తరఫున అత్యధిక వికెట్ల సాధించిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే (619) తర్వాత రెండో స్థానంతో అశ్విన్ ముగించాడు. ఓవరాల్గా అతనిది ఏడో స్థానం. మురళీధరన్ (800), వార్న్ (708), అండర్సన్ (704), కుంబ్లే (619), బ్రాడ్ (604), మెక్గ్రాత్ (563) అతనికంటే ముందున్నారు. 37టెస్టుల్లో 37సార్లు అశ్విన్ ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ముత్తయ్య మురళీధరన్ (67) తర్వాత షేన్ వార్న్ (37)తో రెండో స్థానంలో అతను సమంగా నిలిచాడు.268అశ్విన్ అవుట్ చేసిన ఎడంచేతి వాటం బ్యాటర్లు. ఈ జాబితాలో అందరికంటే ముందున్న అతను అత్యధికంగా బెన్ స్టోక్స్ (13)ను పెవిలియన్ పంపించాడు.65అశ్విన్ అరంగేట్రం చేసిన నాటినుంచి ఇప్పటి వరకు భారత్ సొంతగడ్డపై 65 టెస్టులు ఆడింది. వీటన్నింటిలో అతను బరిలోకి దిగడం విశేషం. ఈ మ్యాచ్లలో 383 వికెట్లు పడగొట్టిన అతను జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మధ్య కాలంలో భారత్ స్వదేశంలో అశ్విన్ విఫలమైన 2 సిరీస్లలోనే ఓడి రికార్డు స్థాయిలో 18 సిరీస్లు గెలిచింది. 2012లో ఇంగ్లండ్పై 4 టెస్టుల్లో 52.64 సగటుతో 14 వికెట్లు... 2024లో న్యూజిలాండ్పై 3 టెస్టుల్లో 41.22 సగటుతో 9 వికెట్లతో అతను విఫలమయ్యాడు. ఈ రెండు సిరీస్లను ఇండియా చేజార్చుకోవడం అతని పాత్రను చూపిస్తోంది.11 అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ల సంఖ్య. ఈ జాబితాలో మురళీధరన్తో సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు.4 టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయడంతో పాటు సెంచరీ కూడా చేసిన ఘనతను అశ్విన్ నాలుగు సార్లు నమోదు చేశాడు.14 ఏళ్లుగా కలిసి ఆడాం. నువ్వు ఈ మాట చెప్పినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యా. మన జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు కదిలాయి. ఈ ప్రయాణంలో ప్రతీ క్షణం ఆస్వాదించాను. నీలా మ్యాచ్లు గెలిపించడం ఎవరికీ సాధ్యం కాదు. భారత క్రికెట్లో నువ్వు ఒక దిగ్గజానివి. రిటైర్మెంట్ తర్వాతి జీవితం కూడా గొప్పగా సాగాలి. – కోహ్లి‘మనసా... వాచ ఆటపై నీవు కనబరిచే కచ్చితమైన దృక్పథం నన్ను ఎల్లప్పుడు అబ్బురపరుస్తుంది. నువ్వు సంధించే క్యారమ్ బాల్ నుంచి జట్టుకు అవసరమైన పరుగుల్ని రాబట్టే క్రమందాకా జట్టు విజయానికి వేసే బాట అద్భుతం. నువ్వో మ్యాచ్ విన్నర్వి. నీ గొప్పతనం ఏంటో నీ ప్రయాణమే చెబుతుంది. నీ పట్టుదల ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుంది. ఇక నీ రెండో ఇన్నింగ్స్కు నా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ అశ్విన్. –సచిన్ టెండూల్కర్ అద్భుత కెరీర్ ముగించిన నీకు నా అభినందనలు. నేను కోచ్గా ఉన్న సమయంలో నువ్వొక విలువైన ఆస్తివి. నీ నైపుణ్యంతో ఆటకు వన్నె తెచ్చావు. – రవిశాస్త్రిఘనమైన కెరీర్ సాగించిన నీకు శుభాకాంక్షలు. దశాబ్ద కాలం పాటు భారత స్పిన్కు పతాకధారిగా నిలబడిన నీ ఘనతల పట్ల గర్వంగా ఉన్నాం. – హర్భజన్ సింగ్నీ ప్రయాణం అసాధారణం. 700కు పైగా అంతర్జాతీయ వికెట్లతో ఆటను సుసంపన్నం చేశావు. మైదానం బయట కెరీర్ అద్భుతంగా ఉండాలి. – అనిల్ కుంబ్లే కుర్రాడిగా మొదలు పెట్టి దిగ్గజంగా ఎదిగే వరకు నిన్ను చూశాను. అశ్విన్ను చూసి బౌలర్గా మారామని ఒక తరం బౌలర్లంతా చెప్పుకుంటారు. ఆటలో నీ లోటు పూడ్చలేనిది. – గౌతమ్ గంభీర్నీ బౌలింగ్లో స్లిప్లో ఫీల్డింగ్ చేయడం అంత ఉత్సాహవంతమైన పని మరొకటి లేదు. ప్రతీ బంతికి క్యాచ్ అవకాశం వచ్చినట్లే అనిపించేది. – అజింక్య రహానేక్రికెట్లో నీ రాక మా అదృష్టం. అద్భుత ఆటతో అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ కాలం కొనసాగావు. నువ్వు వినోదం పంచడమే కాదు ఎంతో నేర్పించావు కూడా. – ఇయాన్ బిషప్ అశ్విన్ కెరీర్ గణాంకాలుఆడిన టెస్టులు: 106 తీసిన వికెట్లు: 537 చేసిన పరుగులు: 3503 అత్యధిక స్కోరు: 124 సెంచరీలు: 6 అర్ధ సెంచరీలు: 14 ఇన్నింగ్స్లో ఉత్తమ బౌలింగ్: 7/59 ఇన్నింగ్స్లో 5 వికెట్లు: 37 సార్లు మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు: 8ఆడిన వన్డేలు: 116 తీసిన వికెట్లు: 156 చేసిన పరుగులు: 707 అత్యధిక స్కోరు: 65 ఉత్తమ బౌలింగ్: 4/25ఆడిన టి20లు: 65 తీసిన వికెట్లు: 72 చేసిన పరుగులు: 184 అత్యధిక స్కోరు: 31 ఉత్తమ బౌలింగ్: 4/814 భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 14వ ప్లేయర్గా అశ్విన్ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో సచిన్, ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, సునీల్ గావస్కర్, విరాట్ కోహ్లి, దిలీప్ వెంగ్సర్కార్, సౌరవ్ గంగూలీ, ఇషాంత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, చతేశ్వర్ పుజారా కూడా ఉన్నారు. -
వర్షం ఎఫెక్ట్.. ఆస్ట్రేలియా- భారత్ మూడో టెస్టు డ్రా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రాగా ముగిసింది. 275 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగగా.. 8/0 స్కోరు వద్ద వెలుతురు లేమి కారణంగా మ్యాచ్ను అంపైర్లు నిలిపివేశారు.ముందుగానే టీ బ్రేక్ను అంపైర్లు ప్రకటించారు. అంతలోనే వర్షం మళ్లీ తిరిగి రావడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్లో 1-1తో ఆస్ట్రేలియా, భారత్ సమంగా నిలిచాయి.భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టు(డిసెంబరు 14- 18)👉వేదిక: ది గబ్బా, బ్రిస్బేన్👉టాస్: భారత్.. బౌలింగ్👉ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 445 ఆలౌట్👉భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 260 ఆలౌట్👉ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 89/7 డిక్లేర్డ్👉భారత్ లక్ష్యం: 275 పరుగులు👉వర్షం కారణంగా భారత్ స్కోరు 8/0 వద్ద ఉండగా నిలిచిపోయిన ఆట👉ఇరుజట్ల కెప్టెన్లు అంగీకరించడంతో మ్యాచ్ డ్రా👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రవిస్ హెడ్(తొలి ఇన్నింగ్స్లో 152 రన్స్).చదవండి: #Ravichandran Ashwin: రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్శెభాష్.. ఫాలో ఆన్ గండం నుంచి తప్పించారుPat Cummins definitely didn't forget about Akash Deep hitting him for six 😅#AUSvIND pic.twitter.com/UW7ZOLUuMe— cricket.com.au (@cricketcomau) December 18, 2024 -
అశ్విన్ రికార్డును సమం చేసిన భువీ
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ భీకర ఫామ్లో ఉన్నాడు. ఈ టోర్నీలో భువీ దాదాపుగా ప్రతి మ్యాచ్లో వికెట్లు తీస్తున్నాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్తో జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో కూడా భువీ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో రెండో వికెట్ తీసిన అనంతరం భువీ.. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డును సమం చేశాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అశ్విన్, భువీ సమంగా నిలిచారు. ప్రస్తుతం వీరిద్దరి ఖాతాలో 310 టీ20 వికెట్లు ఉన్నాయి. ఈ జాబితాలో యుజ్వేంద్ర చహల్ (364 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. పియూశ్ చావ్లా (319) రెండో స్థానంలో ఉన్నాడు. భువీ, అశ్విన్ సంయ్తుంగా మూడో స్థానంలో నిలిచారు.కాగా, ఆంధ్రప్రదేశ్తో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భువీ (ఉత్తర్ప్రదేశ్ కెప్టెన్) ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎస్ భరత్, త్రిపురణ విజయ్ వికెట్లు తీశాడు. భువీ బంతితో రాణించడంతో ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఏపీ ఇన్నింగ్స్లో ఎస్డీఎన్వీ ప్రసాద్ (34 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలువగా.. కేవీ శశికాంత్ (23 నాటౌట్), కెప్టెన్ రికీ భుయ్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీకర్ భరత్ (4), అశ్విన్ హెబ్బర్ (11), షేక్ రషీద్ (18), పైలా అవినాశ్ (19), త్రిపురణ విజయ్ (16) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. యూపీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. మొహిసిన్ ఖాన్, శివమ్ మావి చెరో వికెట్ దక్కించుకున్నారు.157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉత్తర్ప్రదేశ్.. మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కరణ్ శర్మ (48) టాప్ స్కోరర్గా నిలువగా.. రింకూ సింగ్ (22 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, సిక్సర్), విప్రాజ్ నిగమ్ (27 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి యూపీని గెలిపించారు. కే సుదర్శన్ (4-1-23-3), త్రిపురణ విజయ్ (4-0-21-2), సత్యనారాయణ రాజు (4-0-30-1) మెరుగ్గా బౌలింగ్ చేసినప్పటికీ ఏపీని గెలిపించలేకపోయారు. -
వారిద్దరూ చాలా సీనియర్ ఆటగాళ్లు.. కానీ పక్కన పెట్టాల్సి వచ్చింది: రోహిత్
క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్టుకు సమయం అసన్నమైంది. శుక్రవారం(డిసెంబర్ 6) నుంచి ఆడిలైడ్ ఓవల్ వేదికగా ఈ డే అండ్ నైట్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి.ఈ అడిలైడ్ టెస్టులో ఎలాగైనా గెలిచి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆతిథ్య ఆసీస్ భావిస్తుంటే.. భారత్ మాత్రం తమ జోరును కొనసాగించాలని యోచిస్తోంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నాడు. ఈ సందర్భంగా స్టార్ ప్లేయర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తుది జట్టులో చోటుపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.జడ్డూ, అశ్విన్ ఇద్దరూ చాలా సీనియర్ ప్లేయర్లు అని, వారిద్దరూ ఈ సిరీస్లో భారత్కు కీలకంగా మారనున్నారని హిట్మ్యాన్ తెలిపాడు. ఈ కానీ ఈ స్పిన్ దయం రెండో టెస్టులో ఆడుతారా లేదా అన్నది భారత కెప్టెన్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో వీరిద్దిరికి తుది జట్టులో చోటు దక్కకపోవడం అందరని ఆశ్చర్యపరిచింది. భారత్ కేవలం ఒక స్పిన్నర్తో ఆడింది. ఈ క్రమంలో రెండో టెస్టుకు ఈ స్పిన్ మాంత్రకులకు చోటు లభిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కానీ రోహిత్ వ్యాఖ్యలు చూస్తుంటే రెండో టెస్టుకూ వీరిద్దరూ బెంచ్కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి."అశ్విన్, జడేజా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు తుది జట్టులో చోటు ఇవ్వకుండా వదిలివేయడం ఎల్లప్పుడూ కష్టమే. కానీ కొన్ని సమయాల్లో జట్టుకు ఏదో ఉత్తమమో అదే చేయాలి. అందుకే వారికి తొలి టెస్టులో ఆడే అవకాశం లభించలేదు.కానీ ఈ సిరీస్లో మిగిలిన మ్యాచ్ల్లో వారిద్దరూ భారత్కు కీలకంగా మారుతారని భావిస్తున్నాను అని రోహిత్ పేర్కొన్నాడు. అదే విధంగా కేఎల్ రాహుల్ ఓపెననర్గానే కొనసాగనున్నాడని హిట్మ్యాన్ స్పష్టం చేశాడు.చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
అశ్విన్ అద్భుత స్పిన్నరే కానీ...
ముంబై: సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత స్పిన్నరే అయినా... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాషింగ్టన్ సుందర్ను సిద్ధం చేయాలని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్లో 536 వికెట్లు పడగొట్టిన అశ్విన్... భారత్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే (619) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తొలి టెస్టులో అశ్విన్ను కాదని టీమ్ మేనేజ్మెంట్ సుందర్ను తుది జట్టులోకి ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో భజ్జీ మాట్లాడుతూ... ‘అశ్విన్ జాతీయ జట్టు తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అయితే ఇప్పుడతడి వయసు 38. అతడు ఆటకు వీడ్కోలు పలికే సమయానికి జట్టు సుందర్ను సిద్ధం చేసుకోవాలనుకుంటుండోచ్చు. అందుకే విదేశీ పిచ్లపై అనుభవజు్ఞడైన అశ్విన్ కంటే సుందర్కు అవకాశం ఇచ్చారు. పెర్త్లో ఆ్రస్టేలియాపై టీమిండియా విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. అక్కడ ఆసీస్ అజేయమైన జట్టుగా కనిపించేది. అలాంటి చోట చక్కటి ఆటతీరుతో భారత జట్టు కంగారూలను కట్టడి చేసింది. ఇదే జోరు కొనసాగిస్తూ టీమిండియా 4–1తో సిరీస్ కైవసం చేసుకుంటుందనుకుంటున్నా’అని అన్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు చేరడం భారత్కు కొత్త కాదని... అయితే ఈసారి గెలవడం ముఖ్యమని భజ్జీ వ్యాఖ్యానించాడు. తొలి టెస్టులో రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకున్నా... జస్ప్రీత్ బుమ్రా జట్టును అద్భుతంగా నడిపించాడని హర్భజన్ కొనియాడాడు. కోహ్లిని చూసి లబుషేన్ నేర్చుకోవాలి: పాంటింగ్ ఫామ్లేమితో సతమతమవుతున్న ఆ్రస్టేలియా ఆటగాళ్లు మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్కు... మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక సూచనలు చేశాడు. ఈ ఇద్దరూ భారత స్టార్ విరాట్ కోహ్లిని చూసి నేర్చుకోవాలన్నాడు. ‘పెర్త్ టెస్టులో లబుõÙన్ తీవ్రంగా తడబడ్డాడు. విభిన్నమైన వికెట్పై నాణ్యమైన బౌలింగ్ను ఎదుర్కోవడం ఎప్పుడూ కష్టమే. కానీ పరిస్థితులను మనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించడం ముఖ్యం. పెర్త్ రెండో ఇన్నింగ్స్లో కోహ్లి ఇదే చేశాడు. తొలి ఇన్నింగ్స్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయిన విరాట్ రెండో ఇన్నింగ్స్లో పరిస్థితులపై పైచేయి సాధించాడు. కోహ్లి తన బలాలపై దృష్టి పెడతాడు. లబుషేన్, స్మిత్ అదే చేయాలి. వారి సామర్థ్యాన్ని నమ్మాలి’అని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. బుమ్రా వంటి బౌలర్ను ఎదుర్కొనేందుకు మెరుగైన ప్రణాళికలతో బరిలోకి దిగాలని... లేకుంటే ఫలితాలు అనుకూలంగా రావని పాంటింగ్ అన్నాడు.మరోవైపు ఆసీస్ మాజీ పేసర్ జాన్సన్ భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ నెల 6 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టు నుంచి లబుషేన్ను తప్పించాలని అన్నాడు. గత కొన్నాళ్లుగా ఫామ్లోలేక ఇబ్బంది పడుతున్న లబుషేన్ దేశవాళీల్లో ఆడితే తిరిగి లయ అందిపుచ్చుకోవచ్చని సూచించాడు. -
IND VS AUS 1st Test: అశ్విన్, జడేజా లేకుండానే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్లో టీమిండియా ఇద్దరు స్ట్రయిట్ స్పిన్నర్లు లేకుండానే బరిలోకి దిగింది. ఈ మ్యాచ్లో భారత్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి అనుభవజ్ఞులను పక్కన పెట్టి అంతంతమాత్రం అనుభవం ఉన్న వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఏకైక స్పిన్నర్తో బరిలోకి దిగింది. మ్యాచ్ ముందు వరకు ఆ ఏకైక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అని అంతా అనుకున్నారు. అయితే టీమిండియా మేనేజ్మెంట్ ఆఖరి నిమిషంలో సుందర్వైపు మొగ్గు చూపింది. అశ్విన్తో పోలిస్తే సుందర్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాడన్న కారణంగా అతన్ని తుది జట్టులోకి తీసుకోవడమైంది. మరి టీమిండియా అవళభించిన ఈ వ్యూహం సక్సెస్ అవుతుందా లేక బెడిసికొడుతుందా అన్నది వేచి చూడాలి.ఎందుకంటే అశ్విన్, జడేజా ఇద్దరికి కూడా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ సుందర్నే ఎంచుకుని పెద్ద సాహసమే చేసింది. ఇటీవలికాలంలో అశ్విన్, జడేజా లేకుండా టీమిండియా బరిలోకి దిగిందే లేదు. వీరిద్దరు లేకుండా 2021 గబ్బా టెస్ట్లో భారత్ చివరిసారిగా బరిలోకి దిగింది.మరోవైపు ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఒకరు నితీశ్ కుమార్ రెడ్డి కాగా.. రెండో ఆటగాడు హర్షిత్ రాణా. నితీశ్ కుమార్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కాగా.. హర్షిత్ రాణా రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. పెర్త్ పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించనుండటంతో ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఓ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్తో బరిలోకి దిగింది. బుమ్రా భారత పేస్ అటాక్ను లీడ్ చేయనుండగా.. హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్ మరో ఇద్దరు పేసర్లుగా ఉన్నారు. నితీశ్ కుమార్ నాలుగో పేస్ బౌలింగ్ ఆప్షన్గా ఉంటాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ పేసర్ల ధాటికి భారత్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్, వన్డౌన్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. జైస్వాల్ను స్టార్క్ పెవిలియన్కు పంపగా.. పడిక్కల్ను హాజిల్వుడ్ ఔట్ చేశాడు. 14 ఓవర్ల అనంతరం భారత స్కోర్ 20/2గా ఉంది. కేఎల్ రాహుల్ (14), విరాట్ కోహ్లి (0) క్రీజ్లో ఉన్నారు.తుది జట్లు..ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ మెక్స్వీని, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ(వికెట్కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్వుడ్భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్ -
ఆసీస్తో తొలి టెస్ట్.. జడేజాకు నో ప్లేస్..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్లు జరుగనున్నాయి. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్లో టీమిండియాకు తుది జట్టు కూర్పు సమస్యగా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం.. శుభ్మన్ గిల్ గాయపడటంతో టీమిండియా ప్రత్యామ్నాయ ఆటగాళ్లను వెతుక్కునే పనిలో పడింది.రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్గా కేఎల్ రాహుల్ వైపు మొగ్గు చూపుతున్న టీమిండియా మేనేజ్మెంట్.. శుభ్మన్ గిల్ స్థానంలో (వన్డౌన్లో) ఎవరిని ఆడించాలో అర్దం కాక తలలు పట్టుకుని కూర్చుంది. జట్టులో లేని దేవ్దత్ పడిక్కల్ను ఆడించాలని కొందరంటుంటే.. ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్లలో ఎవరో ఒకరికి అవకాశం కల్పించాలని మరికొందరంటున్నారు. మొత్తానికి ఎలా చూసినా టీమిండియా బ్యాటింగ్ లైనప్లో విరాట్, రిషబ్ పంత్ మినహా పెద్ద అనుభవజ్ఞులు లేరు.ఈ మ్యాచ్లో టీమిండియా ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఓ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్తో బరిలోకి దిగాలని భావిస్తుంది. స్పెషలిస్ట్ పేసర్ల కోటాలో బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్ తుది జట్టులో చోటు దక్కించుకోనుండగా.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైపోయింది. పెర్త్ పిచ్ పేసర్లకు సహకరించనుండటంతో భారత్ తప్పకుండా నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగుతుంది.జడేజాకు నో ప్లేస్ఈ మ్యాచ్లో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఒకే ఒక స్పిన్నర్ ఫార్ములాతో బరిలోకి దిగుతుంది. ఈ క్రమంలో భారత మేనేజ్మెంట్ రవీంద్ర జడేజాను పక్కన పెట్టి అశ్విన్ను తుది జట్టులో ఆడించనుంది. ఆసీస్ జట్టులో ఎక్కువగా లెఫ్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటంతో కోచ్ గంభీర్ సైతం ఇదే నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నాడు. రోహిత్ గైర్హాజరీలో తొలి టెస్ట్లో బుమ్రా కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.తొలి టెస్ట్కు భారత తుది జట్టు (అంచనా)..కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవ్దత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్కీపర్), ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్దీప్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా -
వాషింగ్టన్ సుందర్కు భారీ ధర.. ఏకంగా రూ. 15.5 కోట్లు!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సర్వం సిద్దమైంది. నవంబర్ 24-25 తేదీలలో జెడ్డా వేదికగా ఈ క్యాష్ రిచ్ లీగ్ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ మెగా వేలంలో అందరి కళ్లు టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్పైనే ఉన్నాయి. అద్బుత ఫామ్లో ఉన్న సుందర్ ఎంత ధరకు అమ్ముడు పోతాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన మాక్ వేలంలో వాషింగ్టన్కు కళ్లు చెదిరే ధర దక్కింది. కాగా మెగా వేలంలో వాషింగ్టన్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. శ్విన్ ఆన్లైన్లో కండక్ట్ చేసిన ఈ మాక్ వేలంలో సుందర్ కోసం తొలుత ఆర్సీబీ రూ. 2 కోట్లకు బిడ్ వేసింది. ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ పోటీలోకి వచ్చింది. ఎస్ఆర్హెచ్ క్రమక్రమంగా వాషింగ్టన్ ధరను రూ. 8 కోట్లకు పెంచింది. దీంతో ఆర్సీబీ పోటీ నుంచి తప్పుకొని గుజరాత్ జెయింట్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆఖరికి గుజరాత్ జెయింట్స్ సుందర్ కోసం ఏకంగా రూ. 15.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. కాగా సుందర్ గత కొన్ని సీజన్లగా సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మెగా వేలానికి ముందు అతడిని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోలేదు.న్యూజిలాండ్పై అదుర్స్..కాగా ఐపీఎల్-2024లో సుందర్ నిరాశపరిచాడు. ఈ ఏడాది సీజన్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కానీ టీఎన్పీఎల్లో మాత్రం ఆల్రౌండ్ ప్రదర్శనతో సుందర్ దుమ్ములేపాడు. ఆ తర్వాత అనుహ్యంగా భారత టెస్టు జట్టులోకి వచ్చిన వాషింగ్టన్.. న్యూజిలాండ్పై సంచలన ప్రదర్శన కనబరిచాడు. కేవలం రెండు మ్యాచ్ల్లో 16 వికెట్లు పడగొట్టి ఓవర్నైట్ హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలోనే సుందర్కు ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర దక్కనుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. తెలుగోడి అరంగేట్రం ఫిక్స్!? -
ఇషాన్ కిషన్కు కళ్లు చెదిరే ధర.. రూ. 14.5 కోట్లకు వారి సొంతం!
టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్కు ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ ఈ ఏడాది కలిసి రాలేదు. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్-2024లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. పద్నాలుగు మ్యాచ్లలో కలిపి 320 పరుగులు చేయగలిగాడు. అయితే, మెగా వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ మాత్రం అతడిని వదిలేసింది.జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలతో పాటు యువ క్రికెటర్ తిలక్ వర్మను రీటైన్ చేసుకున్న ముంబై.. ఇషాన్ పేరును మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. నిజానికి 2018లో ముంబై తరఫునే క్యాచ్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఆరంభం నుంచే మెరుగ్గా రాణించిన ఇషాన్ కిషన్ కోసం ఐపీఎల్-2022లో ముంబై భారీ మొత్తం వెచ్చించింది.నాడు రూ. 15.25 కోట్ల ధరకు ముంబై సొంతంనాటి మెగా వేలంలో అతడిని ఏకంగా రూ. 15.25 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. కానీ.. అప్పటి నుంచి నేటి దాకా ఇషాన్ కిషన్ అందుకు తగ్గ పైసా వసూల్ ప్రదర్శన మాత్రం ఇవ్వలేకపోయాడు. అంతేకాదు.. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయి.. జాతీయ జట్టుకూ దూరమయ్యాడు.అయితే, ఇటీవలే రంజీల్లో సెంచరీలు చేయడంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్.. భారత్-‘ఎ’ జట్టుకు సెలక్ట్ అయ్యాడు. కానీ.. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇషాన్ కిషన్ ఐపీఎల్-2025 మెగా వేలంలోకి రాబోతున్నాడు.వికెట్ కీపర్ కోటాలో కళ్లు చెదిరే మొత్తంఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన ‘మాక్ వేలం’లో మాత్రం ఇషాన్ కిషన్ భారీ ధర పలకడం విశేషం. మెగా వేలంలో ఇషాన్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. అయితే, అశ్విన్ మాత్రం తన వేలంలో.. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కోసం బిడ్ వేసే ఫ్రాంఛైజీలు రూ. 5 కోట్ల నుంచి మొదలుపెట్టాలని సూచించాడు.ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 5 కోట్లకు బిడ్ వేయగా.. క్రమక్రమంగా ఇషాన్ ధర రూ. 10 కోట్లకు పెంచింది. దీంతో పంజాబ్ కింగ్స్ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 14.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అతడు ఉన్నా కూడాఅయితే, అశ్విన్ నిర్వహించిన ఈ మాక్వేలంలో ఇషాన్ కిషన్కు కళ్లు చెదిరే మొత్తం దక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్లో లేని ఇషాన్ కోసం.. మెగా వేలంలో ఏ ఫ్రాంఛైజీ అంతగా ఆసక్తి చూపదని.. మహా అయితే, అతడికి రూ. ఐదు కోట్లు దక్కవచ్చని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.అంతేకాదు.. లక్నో ఇప్పటికే వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ను ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అట్టిపెట్టుకుంది. అలాంటిది.. ఇషాన్ను ఆ ఫ్రాంఛైజీ కొనుక్కోవడం ఏమిటంటూ అశూ మాక్ వేలంలో లక్నో తరఫున పాల్గొన్న అభిమానులను ట్రోల్ చేస్తున్నారు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరుగనుంది.చదవండి: BGT 2024: టీమిండియాకు గుడ్న్యూస్ -
సిక్సర్ల వర్షం కురిపించిన రుతురాజ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్, భారత్-ఏ మధ్య వాకా వేదికగా ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ చేశారు. ఈ మ్యాచ్లో ఇండియా-ఏకు ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో రెండు.. మానవ్ సుతార్, హర్షిత్ రాణా బౌలింగ్లో తలో సిక్సర్ బాదాడు. ఈ మ్యాచ్లో గంటకు పైగా బ్యాటింగ్ చేసిన రుతురాజ్ ఆతర్వాత సర్ఫరాజ్ ఖాన్కు బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. రుతురాజ్ ఇటీవలే ఆస్ట్రేలియా-ఏతో జరిగిన రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్ల్లో భారత్-ఏ జట్టుకు సారథ్యం వహించాడు. ఈ సిరీస్లో రుతురాజ్ ఆశించిన మేరకు రాణించకపోయినప్పటికీ ప్రాక్టీస్ మ్యాచ్లో మాత్రం ఇరగదీశాడు. తాజా ఇన్నింగ్స్తో రుతురాజ్ టీమిండియా మేనేజ్మెంట్ను మెప్పించి తుది జట్టులో (ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్కు) చోటు దక్కించుకుంటాడేమో వేచి చూడాలి.🚨 Updates from Perth 4 Sixes from Ruturaj Gaikwad - 2 Vs Ashwin 1 Vs Sutar and one vs Rana - After playing for more than an hour made his way to Sarfaraz Khan.#AUSvsIND pic.twitter.com/yGMIjk4Wzp— RevSportz Global (@RevSportzGlobal) November 16, 2024చెమటోడ్చిన విరాట్, యశస్వి, గిల్రుతురాజ్ విషయాన్ని పక్కన పెడితే, టీమిండియా కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా ప్రాక్టీస్ మ్యాచ్లో చెమటోడ్చారు. ఈ ముగ్గురు ఈ మ్యాచ్లో తలో రెండుసార్లు బ్యాటింగ్ చేశారు. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన విరాట్.. సెకెండ్ ఇన్నింగ్స్లో ఆశాజనకమైన ప్రదర్శన చేశాడు. యశస్వి జైస్వాల్ షార్ట్ బాల్స్ను మంచి టెక్నిక్తో ఎదుర్కొన్నాడు. శుభ్మన్ గిల్ సైతం తొలి ఇన్నింగ్స్లో తడబడినప్పటికీ.. సెకండ్ ఇన్నింగ్స్లో స్థాయి మేరకు రాణించాడు. బౌలర్లలో ముకేశ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముకేశ్ ఆస్ట్రేలియా-ఏతో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్ల్లోనూ సత్తా చాటాడు. అయితే అతను భారత మెయిన్ జట్టులో లేని విషయం తెలిసిందే. భారత సెలెక్టర్లు ముకేశ్ను ట్రావెలింగ్ రిజర్వగా ఎంపిక చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. -
ఆసీస్ తొలి టెస్టు.. టీమిండియా తుది జట్టు ఇదే! స్టార్ ప్లేయర్కు నో ఛాన్స్
ఆస్ట్రేలియా-భారత్ మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా తొలి టెస్టుతో ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు మొదటి టెస్టు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ అయిన భారత జట్టు ఆసీస్ పర్యటనను విజయంతో ప్రారంభించాలని భావిస్తోంది. అయితే తొలి టెస్టుకు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.ఈ క్రమంలో పెర్త్ టెస్టు కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్ను టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎంచుకున్నాడు. తొలి టెస్టులో భారత ఓపెనర్గా శుబ్మన్ గిల్ను రవిశాస్త్రి ఎంపిక చేశాడు. అదే విధంగా కేఎల్ రాహుల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ రావాలని అతడు సూచించాడు. మరోవైపు ధ్రువ్ జురెల్కు సైతం శాస్త్రి చోటిచ్చాడు."తొలి టెస్టులో భారత ఓపెనర్గా శుబ్మన్ గిల్ను ప్రమోట్ చేయాలి. అతడికి ఓపెనర్గా అనుభవం ఉంది. గత ఆస్ట్రేలియా పర్యటనలో అతడు టీమిండియా ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. ఒకవేళ గిల్ జట్టులో లేకపోయింటే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సి ఉండేది. రోహిత్ బ్యాకప్గా ఎంపికైన ఈశ్వరన్ పెద్దగా రాణించలేకపోయాడు. ఆస్ట్రేలియా-ఎతో జరిగిన సిరీస్లో ఈశ్వరన్ కనీసం హాఫ్ సెంచరీ మార్క్ను దాటలేకపోయాడు. అయితే నెట్స్లో ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో జట్టు మేనెజ్మెంట్కే తెలియాలి. తుది జట్టులో అశ్విన్ లేదా జడేజాకు చోటు ఇవ్వాలా అన్న చర్చ నడుస్తోంది. నేను అయితే జడేజాతోనే వెళ్తాను. ఎందుకంటే అతడు ఫీల్డింగ్తో పాటు బ్యాటింగ్ కూడా అద్బుతంగా చేయగలడు. అశ్విన్కు ఓవర్సీస్లో పెద్దగా రికార్డు లేదు" అని ఐసీసీ రివ్యూలో శాస్త్రి పేర్కొన్నాడు.రవిశాస్త్రి ఎంచుకున్న భారత తుది జట్టు ఇదేశుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా/వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.చదవండి: #Tilak Varma: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లి ఆల్టైమ్ రికార్డు బ్రేక్ -
IND Vs SA: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. అశ్విన్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి అదరగొట్టాడు. బుధవారం సెంచూరియన్ వేదికగా సఫారీలతో జరిగిన మూడో టీ20లో రెండు వికెట్లతో సత్తాచాటాడు. గత రెండు మ్యాచ్లతో పోలిస్తే పరుగులు కాస్త ఎక్కువగా ఇచ్చినప్పటికీ రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత్కు మరో విజయాన్ని అందించాడు.ఓపెనర్ రీజా హెండ్రిక్స్, కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్లను సరైన సమయంలో పెవిలియన్కు పంపి మ్యాచ్ను భారత్ వైపు మలుపు తిరిగేలా చేశాడు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.అశ్విన్ రికార్డు బద్దలు...ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా వరుణ్ చరిత్ర సృష్టించాడు. ఈ సిరీస్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన ఈ తమిళనాడు స్టార్ స్పిన్నర్ 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ రేర్ ఫీట్ను తన పేరిట వరుణ్ లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. 2016లో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో అశ్విన్ 9 వికెట్లు తీశాడు. తాజా మ్యాచ్తో అశ్విన్ ఆల్టైమ్ రికార్డును చక్రవర్తి బద్దలు కొట్టాడు. కాగా ఈ మ్యాచ్లో 11 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. తద్వారా నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది.చదవండి: IND vs AUS: ప్రాక్టీస్ మొదలైంది -
అశ్విన్ ఆల్టైమ్ రికార్డుపై కన్నేసిన మిస్టరీ స్పిన్నర్
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సహచర స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉన్న ఓ ఆల్టైమ్ రికార్డుపై కన్నేశాడు. సౌతాఫ్రికాతో ఇవాళ (నవంబర్ 13) జరుగబోయే మూడో టీ20లో వరుణ్ మరో రెండు వికెట్లు తీస్తే.. టీమిండియా తరఫున ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా రికార్డు సృష్టిస్తాడు.2016లో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో అశ్విన్ 9 వికెట్లు తీశాడు. నాటి నుంచి ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో ఏ భారత స్పిన్నర్ ఇన్ని వికెట్లు తీయలేదు. ఇప్పుడు అశ్విన్ ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం వరుణ్కు వచ్చింది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో వరుణ్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో 5.25 సగటున 8 వికెట్లు తీశాడు.డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లు తీసిన వరుణ్.. గెబెర్హా వేదికగా జరిగిన రెండో టీ20లో ఐదు వికెట్లు పడగొట్టాడు. సెంచూరియన్ వేదికగా ఇవాళ మూడో టీ20 జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. తొలి టీ20లో భారత్ గెలువగా.. రెండో టీ20లో సౌతాఫ్రికా గెలిచిన విషయం తెలిసిందే.రెండో టీ20లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 124 పరుగులకే పరిమితమైనా.. వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసి విజయావకాశాలు సృష్టించాడు. అయితే ఆఖర్లో కొయెట్జీ, స్టబ్స్ కొన్ని అద్భుతమైన షాట్లు ఆడి టీమిండియాకు గెలుపును దూరం చేశారు. ఈ మ్యాచ్లో వరుణ్ డేంజరెస్ బ్యాటర్లైన రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ వికెట్లు పడగొట్టాడు. -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. కుంబ్లే ఆల్టైమ్ రికార్డు బద్దలు
ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. తొలి రెండు టెస్టుల్లో ఆధిపత్యం కొనసాగించిన కివీస్ దూకుడుకు భారత జట్టు కళ్లెం వేసింది. ముంబై టెస్టులో రెండో రోజు ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. పర్యాటక జట్టు ప్రస్తుతం కేవలం 143 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ తమ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించారు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో జడేజా ఇప్పటివరకు 4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 3 కీలక వికెట్లు సాధించారు.అశ్విన్ అరుదైన రికార్డు..ఇక 3 వికెట్లతో చెలరేగిన రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వాంఖడే స్టేడియంలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా అశ్విన్ రికార్డులకెక్కాడు. అశ్విన్ ఇప్పటివరకు ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో 6 టెస్టులు ఆడి 41 వికెట్లు పడగొట్టాడు.ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. వాంఖడేలో 7 టెస్టులు ఆడిన కుంబ్లే 38 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్తో కుంబ్లే ఆల్టైమ్ రికార్డును అశూ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో అశ్విన్, కుంబ్లే తర్వాత స్ధానాల్లో కపిల్ దేవ్(28) ఉన్నారు.చదవండి: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా టీమిండియా స్టార్ ప్లేయర్? -
నా బౌలింగ్లోనే సిక్సర్లు కొడతావా? కసి తీర్చుకున్న అశ్విన్! వీడియో
ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బంతితో మ్యాజిక్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో వికెట్ సాధించలేకపోయిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం సత్తాచాటాడు. తన క్యారమ్ బంతులతో కివీస్ బ్యాటర్లను అశ్విన్ను బోల్తా కొట్టించాడు. రచిన్ రవీంద్ర, విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్ వంటి కీలక వికెట్లను పడగొట్టి న్యూజిలాండ్ను దెబ్బతీశాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 16 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ 63 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు.ప్రతీకారం తీర్చుకున్న అశ్విన్..ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్ను అశ్విన్ ఔట్ చేసిన విధానం గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. కివీస్ ఇన్నింగ్స్ 33వ ఓవర్ వేసిన అశ్విన్ను ఫిలిప్స్ టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో తొలి మూడు బంతుల్లో ఫిలిప్స్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో అశూపై పైచేయి సాధించినట్లు ఫిలిప్స్ థీమాగా కన్పించాడు. కానీ అశ్విన్ మాత్రం దెబ్బతిన్న సింహంలా అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు.ఓ సంచలన బంతితో ఫిలిప్స్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అశ్విన్ వేసిన క్యారమ్ బాల్కు సదరు కివీ బ్యాటర్ దగ్గర సమాధానమే లేకుండాపోయింది. అతడిని బౌల్డ్ చేసిన వెంటనే అశ్విన్ గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. నా బౌలింగ్లోనే సిక్సర్లు కొడతావా అన్నట్లు ఫిలిప్స్ వైపు చూస్తూ అశ్విన్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.పట్టు బిగించిన భారత్..ఇక ముంబై టెస్టులో భారత్ పట్టు బిగించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ప్రస్తుతం 143 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారత బౌలర్లలో ఇప్పటివరకు జడేజా 4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 3 వికెట్లు సాధించాడు. న్యూజిలాండ్ ఆటగాడు విల్ యంగ్(51) సెకెండ్ ఇన్నింగ్స్లో కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు.చదవండి: IND vs UAE: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి A special effort to dismiss Glenn Phillips 🔥Ashwin takes Phillips as New Zealand loses their 6th wicket. Lead is 103 now. #INDvNZ #ashwin #IndiaVsNewZealand #3rdtest #Mumbai #bcci pic.twitter.com/BbNWJ2ylBR— Abhinandan Bhattacharjee (@Abhi11590) November 2, 2024 -
ముంబై టెస్టులో పట్టు బిగించిన టీమిండియా
ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ప్రస్తుతం కేవలం 143 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. కాగా తొలి ఇన్నింగ్స్లో సత్తాచాటిన భారత స్పిన్నర్లు.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్లో కూడా అదరగొట్టారు. అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ మయాజాలానికి బ్లాక్క్యాప్స్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. భారత బౌలర్లలో ఇప్పటివరకు జడేజా 4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ చెరో మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరితో పాటు పేసర్ ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్ తలా వికెట్ సాధించారు. ప్రస్తుతం క్రీజులో మాట్ హెన్రీ(10), ఓ రూర్కే ఉన్నారు. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(51) హాఫ్ సెంచరీ సాధించాడు.263కు భారత్ ఆలౌట్..అంతకుముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో యువ ఆటగాడు శుబ్మన్ గిల్(90), రిషబ్ పంత్(60) హాఫ్ సెంచరీలతో మెరిశాడు. కివీస్ బౌలర్లలో స్పిన్నర్ అజాజ్ పటేల్ 5 వికెట్ల ఘనత సాధించాడు. అతడితో పాటు హెన్రీ, ఫిలిప్స్, సోధీ ఒక్క వికెట్ సాధించారు. కాగా కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్లో 235 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.చదవండి: IND vs UAE: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి -
కివీస్తో మూడో టెస్ట్.. ఆల్టైమ్ రికార్డుపై కన్నేసిన అశ్విన్
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. న్యూజిలాండ్తో రేపటి నుంచి ప్రారంభం కాబోయే మూడో టెస్ట్లో అశ్విన్ మరో ఐదు వికెట్ల ఘనత సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. అశ్విన్, అనిల్ కుంబ్లే ఇప్పటివరకు టీమిండియా తరఫున 37 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించారు. అశ్విన్ ఒక్క టెస్ట్ల్లోనే ఈ ఘనత సాధించగా.. కుంబ్లే 35 సార్లు టెస్ట్ల్లో, రెండు సార్లు వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అశ్విన్, కుంబ్లే చెరి ఎనిమిది సార్లు 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసిన ఘనత ముత్తయ్య మురళీథరన్కు దక్కుతుంది. మురళీ శ్రీలంక తరఫున 77 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 22 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. మురళీ తర్వాత ఈ లిస్ట్లో రిచర్డ్ హ్యాడ్లీ, షేన్ వార్న్ ఉన్నారు. హ్యాడ్లీ 41 ఐదు వికెట్ల ప్రదర్శనలు, తొమ్మిది 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయగా.. షేన్ వార్న్ 38 ఐదు వికెట్ల ప్రదర్శనలు, పది 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఈ జాబితాలో మురళీథరన్, హ్యాడ్లీ, వార్న్ తర్వాత అశ్విన్, కుంబ్లే ఉన్నారు.కాగా, ముంబైలోని వాంఖడే స్టేడియంలో రేపటి నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచిన న్యూజిలాండ్ ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ మ్యాచ్ రేపు ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. చదవండి: IND vs NZ 3rd Test: బుమ్రాకు విశ్రాంతి..? -
బుమ్రా చేజారిన వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు.. అగ్రస్థానంలో అతడు
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు. అతడి అగ్ర స్థానాన్ని సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ ఆక్రమించాడు. ఇక బుమ్రా మూడోస్థానానికి పడిపోగా.. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్ రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) బుధవారం ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో ఈ మేర మార్పులు చోటుచేసుకున్నాయి.మూడు వందల టెస్టు వికెట్ల క్లబ్లోకాగా బంగ్లాదేశ్ పర్యటనలో రబాడ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మిర్పూర్ టెస్టులో తొమ్మిది వికెట్లతో సత్తా చాటి జట్టును గెలిపించాడు. అంతేకాదు.. ఈ టూర్ సందర్భంగా రబాడ మూడు వందల టెస్టు వికెట్ల క్లబ్లో చేరాడు. ఈ క్రమంలో రెండు ర్యాంకులు మెరుగుపరచుకున్న 29 ఏళ్ల రబాడ.. బుమ్రాను వెనక్కి నెట్టి వరల్డ్ నంబర్ వన్గా అవతరించాడు.మరోవైపు.. బుమ్రా స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టుల్లో రాణించలేకపోతున్నాడు. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్పై వికెట్లు తీయడంలో వెనుకబడ్డాడు. దీంతో కివీస్తో తొలి రెండు రెండు టెస్టుల్లో మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ క్రమంలో నంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు.సత్తా చాటిన పాక్ స్పిన్నర్లుసొంతగడ్డపై ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో పాకిస్తాన్ స్పిన్నర్లు నౌమన్ అలీ, సాజిద్ ఖాన్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో నౌమన్ కెరీర్ బెస్ట్ సాధించాడు. ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి.. తొమ్మిదో ర్యాంకుకు చేరుకున్నాడు.సాంట్నర్ ఏకంగా 30 స్థానాలు ఎగబాకిమరోవైపు.. సాజిద్ ఖాన్ సైతం 12 స్థానాలు మెరుగుపరచుకుని కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించాడు. ఇక టీమిండియాతో పుణె వేదికగా రెండో టెస్టులో సత్తా చాటిన న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ సైతం ముందుకు దూసుకువచ్చాడు. రెండో టెస్టులో 13 వికెట్లతో చెలరేగిన ఈ లెఫ్టార్మ్ బౌలర్ 30 స్థానాలు ఎగబాకి 44వ ర్యాంకుకు చేరుకున్నాడు.ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకులు టాప్-51. కగిసో రబాడ(సౌతాఫ్రికా)- 860 రేటింగ్ పాయింట్లు2. జోష్ హాజిల్వుడ్(ఆస్ట్రేలియా)- 847 రేటింగ్ పాయింట్లు3. జస్ప్రీత్ బుమ్రా(ఇండియా)- 846 రేటింగ్ పాయింట్లు4. రవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 831 రేటింగ్ పాయింట్లు4. ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- 820 రేటింగ్ పాయింట్లు.జైస్వాల్కు మూడో ర్యాంకుఇదిలా ఉంటే.. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కేన్ విలియమ్సన్ రెండో ర్యాంకు నిలబెట్టుకున్నాడు. ఇక టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక ర్యాంకు మెరుగపరుచుకుని మూడో స్థానానికి చేరుకోగా.. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్ ఆ తర్వాతి ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్టైమ్ రికార్డు బ్రేక్ -
వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలోనే
పుణే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్పిన్నర్లు సత్తాచాటారు. ఆఫ్ స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్లు బంతితో మ్యాజిక్ చేశారు. తమ స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించారు.ఈ ఇద్దరు తమిళ తంబీల దాటికి కివీస్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. అయితే తొలుత అశ్విన్ వికెట్ల వేటను మొదలు పెట్టగా.. సుందర్ ముగించాడు. కివీస్ మొత్తం పది వికెట్లను ఈ ఇద్దరే పడగొట్టారు.వాషింగ్టన్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ 3 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక న్యూజిలాండ్ 10 వికెట్లు పడగొట్టిన అశ్విన్-సుందర్ జోడీ పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నారు.వరల్డ్ రికార్డు..→టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో మొత్తం పది వికెట్లు పడగొట్టిన ఆఫ్-స్పిన్ జోడీగా అశ్విన్-సుందర్ నిలిచారు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలో ఈ ఘనత ఎవరికి సాధ్యం కాలేదు.→అదే విధంగా టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్లో మొత్తం 10 వికెట్లు పడగొట్టిన భారత ఆఫ్ స్పిన్ జోడీ కూడా వీరిద్దరే కావడం విశేషం.వీరికంటే ముందు ఏ భారత కుడిచేతి వాటం స్పిన్నర్లు కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.→మరోవైపు భారత్ గడ్డపై టెస్టుల్లో తొలి రోజు మొదటి ఇన్నింగ్స్లో పది వికెట్లు స్పిన్నర్లే తీయడం ఇది ఆరోసారి. ఈ ఘనతను అంతకంటే ముందు భారత్ నాలుగు సార్లు సాధించగా, ఇంగ్లండ్ ఒక్కసారి సాధించింది. -
ఏడేసిన వాషింగ్టన్.. 259 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్
పుణే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్పిన్నర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా స్పిన్నర్ల దాటికి కివీస్ 259 పరుగులకు ఆలౌటైంది. అనుహ్యంగా పుణే టెస్టుకు భారత జట్టులో చోటు దక్కించుకున్న ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు.తొలి ఇన్నింగ్స్లో సుందర్ ఏకంగా 7 వికెట్లతో చెలరేగాడు. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను సుందర్ ముప్పు తిప్పలు పెట్టాడు. ముఖ్యంగా వాషీ తన సెకెండ్ స్పెల్లో అయితే అద్భుతమైన బంతులతో కివీస్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. తొలి ఇన్నింగ్స్లో 23.1 ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్.. 59 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 5 వికెట్లు పైగా సుందర్ పడగొట్టడం తన కెరీర్లో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక అతడితో పాటు మరో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు సాధించి తనవంతు పాత్ర పోషించాడు.మరోసారి కాన్వే, రచిన్..ఇక కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాన్వే 76 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రవీంద్ర(65) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆఖరిలో శాంట్నర్(33) కాసేపు అలరించాడు. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజులో యువ ఆటగాళ్లు శుబ్మన్ గిల్(10), యశస్వీ జైశ్వాల్(6) పరుగులతో ఆజేయంగా ఉన్నారు. అయితే ఆదిలోనే భారత్కు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్గా వెనుదిరిగాడు. -
టెస్ట్ల్లో అత్యధిక వికెట్ల వీరులు.. ఏడో స్థానానికి ఎగబాకిన అశ్విన్
టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ ఏడో స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్తో ఇవాళ (అక్టోబర్ 24) మొదలైన రెండో టెస్ట్లో మూడు వికెట్లు తీసిన అశ్విన్ తన వికెట్ల సంఖ్యను 531కి పెంచుకున్నాడు. ఈ క్రమంలో అశ్విన్ ఆసీస్ స్పిన్ లెజెండ్ నాథన్ లయోన్ను (530) అధిగమించాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మురళీథరన్ (800), షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (704), అనిల్ కుంబే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్గ్రాత్ (563) అశ్విన్ కంటే ముందున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ 54 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అశ్విన్.. టామ్ లాథమ్ (15), విల్ యంగ్ (18), డెవాన్ కాన్వే (76) వికెట్లు పడగొట్టాడు. రచిన్ రవీంద్ర (43), డారిల్ మిచెల్ (12) క్రీజ్లో ఉన్నారు.కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ స్థానాల్లో శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్దీప్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ సైతం నేటి మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. పేసర్ మ్యాట్ హెన్రీ స్థానంలో మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో న్యూజిలాండ్ తొలి టెస్ట్లో నెగ్గిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్కీపింగ్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కేచదవండి: WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్ -
WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో ఆస్ట్రేలియా క్రికెటర్ నాథన్ లియోన్ పేరిట ఉన్న రికారుర్డు బద్దలు కొట్టాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు.న్యూజిలాండ్తో రెండో టెస్టు సందర్భంగా అశ్విన్ ఈ అరుదైన ఘనత సాధించాడు. కాగా డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో పర్యాటక న్యూజిలాండ్ టీమిండియాను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది.తొలుత నాథన్ లియోన్ రికార్డు సమం చేసిఈ క్రమంలో భారత్- కివీస్ మధ్య పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(15)ను ఆదిలోనే పెవిలియన్కు పంపాడు రవిచంద్రన్ అశ్విన్. కివీస్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ ఆఖరి బంతికి లాథమ్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) కాగా డబ్ల్యూటీసీలో అశూకు ఇది 187వ వికెట్. తద్వారా డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ రికార్డును సమం చేశాడు. అయితే, కాసేపటికే లియోన్ను అధిగమించాడు అశూ. 24వ ఓవర్లో కివీస్ మరో వన్డౌన్ బ్యాటర్ విల్ యంగ్ను అవుట్ చేశాడు. లీడింగ్ వికెట్ టేకర్గా అవతరించిఈ క్రమంలో 188 వికెట్లతో అశ్విన్ డబ్ల్యూటీసీ లీడింగ్ వికెట్ టేకర్గా అవతరించాడు. ఇక మొదటి రోజు ఆటలో భోజన విరామ సమయానికి న్యూజిలాండ్ 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 47, రచిన్ రవీంద్ర 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్కు రెండు వికెట్లు దక్కాయి.చదవండి: IND Vs NZ 2nd Test: న్యూజిలాండ్తో రెండో టెస్ట్.. టీమిండియాలో మూడు మార్పులు -
IND vs NZ 2nd Test: అశ్విన్ మ్యాజిక్.. కెప్టెన్ ఔట్
పూణే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో న్యూజిలాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఎనిమిదో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ మ్యాజిక్ డెలివరీతో కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. అశ్విన్ బంతిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైన లాథమ్ వికెట్ల ముందు సులువుగా దొరికిపోయాడు.ఇన్నింగ్స్ 24వ ఓవర్లో అశ్విన్ మరోసారి మ్యాజిక్ చేశాడు. ఈసారి యాష్ విల్ యంగ్ను (18) బోల్తా కొట్టించాడు. వికెట్ల వెనుక పంత్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో యంగ్ పెవిలియన్ బాట పట్టాడు. 24 ఓవర్ల అనంతరం న్యూజిలాండ్ స్కోర్ 76/2గా ఉంది. డెవాన్ కాన్వే (38), రచిన్ రవీంద్ర క్రీజ్లో ఉన్నారు.ASHWIN STRIKES IN HIS FIRST OVER 👌- What a champion, India on charge at Pune. pic.twitter.com/oJOCsGZPAZ— Johns. (@CricCrazyJohns) October 24, 2024కాగా, ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి టీమిండియాను బౌలింగ్కు ఆహ్వానించింది. తొలుత బౌలింగ్ చేస్తున్న భారత్ 76 పరుగులకే రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ను డిఫెన్స్లోకి నెట్టేసింది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ స్థానాల్లో శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్దీప్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ సైతం నేటి మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. పేసర్ మ్యాట్ హెన్రీ స్థానంలో మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్కీపింగ్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కేచదవండి: ఆరేసిన రబాడ.. సౌతాఫ్రికా టార్గెట్ 106 -
Ind vs NZ: టీమిండియాలోకి చెన్నై చిన్నోడు.. బీసీసీఐ ప్రకటన
న్యూజిలాండ్తో మిగిలిన రెండు టెస్టులకు టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులోకి వచ్చాడు. కివీస్తో పుణె, ముంబై మ్యాచ్లకు అతడిని ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదివారం ప్రకటన విడుదల చేసింది.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా రోహిత్ సేన స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్లో మరీ దారుణంగా 46 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోరు(462) చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు టెస్టులు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వాషింగ్టన్ సుందర్ను తిరిగి పిలిపించడం ఆసక్తికరంగా మారింది. బెంగళూరు టెస్టులో విఫలమైన రవీంద్ర జడేజా నేపథ్యంలో ఈ తమిళనాడు క్రికెటర్పై సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. భారీ సెంచరీతో మెరిసిన వాషీకాగా రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా తమిళనాడు తరఫున వాషింగ్టన్ సుందర్ ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో భారీ సెంచరీ(269 బంతుల్లో 152; 19 ఫోర్లు, ఒక సిక్సర్)తో సత్తా చాటాడు.తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు(674/6 డిక్లేర్డ్) సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అతడు మూడేళ్ల తర్వాత టెస్టులో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా వాషింగ్టన్ సుందర్ 2021లో చివరగా టెస్టు మ్యాచ్ ఆడాడు.‘పెద్దోడి’కి తోడుగా చిన్నోడు!ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్తో తొలి టెస్టులో రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో ఐదు పరుగులకే వెనుదిరిగాడు. అయితే, ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీయగలిగాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కివీస్తో సిరీస్లో చెన్నై దిగ్గజ స్పిన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ‘పెద్దోడి’కి చిన్నోడు జతకావడం విశేషం. కాగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య అక్టోబరు 24- 28 వరకు పుణె వేదికగా రెండో టెస్టు, నవంబరు 1-5 వరకు మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.న్యూజిలాండ్తో రెండు, మూడో టెస్టులకు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్.చదవండి: సర్ఫరాజ్ కాదు!.. మిడిలార్డర్లో అతడిని ఆడించాలి: మాజీ క్రికెటర్ 🚨 News 🚨Squad Update: Washington Sundar added to squad for the second and third Test#INDvNZ | @IDFCFIRSTBankDetails 🔽— BCCI (@BCCI) October 20, 2024 -
అశ్విన్ వారసుడు దొరికినట్లేనా?
భారత క్రికెట్కు మరో అసలుసిసలైన ఆల్రౌండర్ దొరికేశాడు. బ్యాట్తో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోసే సత్తా అతడిది. మరోవైపు బంతితో బ్యాటర్లకు ముప్పు తిప్పలు పెట్టే మాస్టర్ మైండ్ అతడిది. జట్టులో కష్టాల్లో ఉందంటే అందరికి గుర్తు వచ్చే ఆపద్బాంధవుడు. అతడే ముంబై యువ సంచలనం తనీష్ కోటియన్. కోటియన్ గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తాజాగా కాన్పూర్ వేదికగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్ను ముంబై సొంతం చేసుకోవడం లోనూ తనీష్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో మెరిసిన కోటియన్.. రెండో ఇన్నింగ్స్లో సంచలన సెంచరీతో చెలరేగాడు. ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి మరి కోటియన్ సెంచరీ చేయడం గమానార్హం. అంతేకాకుండా బౌలింగ్లోనూ 3 వికెట్లతో సత్తాచాటాడు.అశ్విన్ వారుసుడు దొరికినట్లేనా?ఫస్ట్ క్రికెట్లో అతడి ప్రదర్శన చూసిన క్రికెట్ నిపుణులు త్వరలోనే భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని అభిప్రాయపడుతున్నారు. మరి కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి ఈ యువ సంచలనం.. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వారుసుడుగా బాధ్యతలు చేపడతాడని జోస్యం చెబుతున్నారు.కాగా అశ్విన్కు, తనీష్కు దగ్గర పోలికలు ఉన్నాయి. ఇద్దరూ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తారు. అంతేకాకుండా బ్యాటింగ్ పొజిషేన్ కూడా దాదాపు సమానంగా ఉంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అశ్విన్ ఏ విధంగా అయితే ఆదుకుంటాడో, కోటియన్ కూడా విరోచిత పోరాటం కనబరుస్తున్నాడు. అశ్విన్ రిటైరయ్యాక భారత టెస్టు జట్టులో కీలక ఆల్రౌండర్గా తనీష్ మారే అవకాశముంది.ఎవరీ తనీష్.. ?25 ఏళ్ల తనీష్ కోటియన్ ముంబైలో జన్మించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ముంబైకు తనీష్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2018 రంజీ సీజన్తో సౌరాష్ట్రపై కోటియన్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 30 రెడ్ బాల్ క్రికెట్ మ్యాచ్లు ఆడిన అతడు 88 వికెట్లతో పాటు 1451 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఈ ఏడాది రంజీ సీజన్లో కోటియన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 10 మ్యాచ్లు ఆడిన కోటియన్.. 502 పరుగులతో పాటు 29 వికెట్లు పడగొట్టాడు. దులీప్ ట్రోఫీ-2024లో కూడా తనీష్ 121 పరుగులతో పాటు 10 వికెట్లు సాధించాడు.చదవండి: -
అశ్విన్కే సాధ్యం.. ముత్తయ్య మురళీధరన్ వరల్డ్ రికార్డు సమం
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఎడిషన్లో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. తాజాగా బంగ్లాదేశ్తో సిరీస్లోనూ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సత్తా చాటాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్న వేళ సెంచరీతో ఆదుకున్నాడు.సొంత మైదానం చెపాక్లో నిలకడగా ఆడి 113 పరుగులు సాధించాడు. అంతేకాదు.. అదే మ్యాచ్లో ఆరు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బకొట్టాడు. ఇలా ఆల్రౌండ్ ప్రతిభతో రాణించి.. బంగ్లాదేశ్పై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి అశూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.రెండో టెస్టులోనూ అదరగొట్టిఇక కాన్పూర్లో జరిగిన రెండో టెస్టులోనూ అశ్విన్ అదరగొట్టాడు. తన స్పిన్ మాయాజాలంతో బంగ్లా బ్యాటర్లను తిప్పలుపెట్టి కీలక వికెట్లు కూల్చాడు. తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ నజ్ముల్ షాంటో(31), షకీబ్ అల్ హసన్(9) వికెట్లు తీసిన అశూ.. రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్ జకీర్ హసన్(10), మొమినుల్ హక్(2), హసన్ మహమూద్(4)లను పెవిలియన్కు పంపాడు. అలా మొత్తంగా రెండో టెస్టులో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ రికార్డు సమంఈ మ్యాచ్లోనూ భారత్ బంగ్లాపై గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన అశ్విన్ను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. అశూ టెస్టుల్లో ఈ పురస్కారం అందుకోవడం ఇది పదకొండోసారి కావడం విశేషం. తద్వారా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఈ చెన్నై బౌలర్ సమం చేశాడు. మురళీధరన్ కూడా సంప్రదాయ క్రికెట్లో 11 సార్లు ఈ అవార్డు గెలిచాడు. కాగా సొంతగడ్డపై బంగ్లాదేశ్తో చెన్నై టెస్టులో 280 పరుగుల తేడాతో గెలిచిన రోహిత్ సేన.. కాన్పూర్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.టెస్టుల్లో అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలిచిన క్రికెటర్లుముత్తయ్య మురళీధరన్(శ్రీలంక)- 11 సార్లురవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 11 సార్లుజాక్వెస్ కలిస్(సౌతాఫ్రికా)- 9 సార్లుసర్ రిచర్డ్ హాడ్లీ(న్యూజిలాండ్)- 8 సార్లుఇమ్రాన్ ఖాన్(పాకిస్తాన్)- 8 సార్లుషేన్ వార్న్(ఆస్ట్రేలియా)- 8 సార్లు.చదవండి: WTC: ప్రపంచంలోనే తొలి బౌలర్గా అశ్విన్ రికార్డు -
WTC: ప్రపంచంలోనే తొలి బౌలర్గా అశ్విన్ రికార్డు
టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) చరిత్రలో ఇంత వరకు ఏ బౌలర్కూ సాధ్యం కాని ఘనత నమోదు చేశాడు. కాగా సొంతగడ్డపై భారత జట్టు బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.ప్రపంచంలోనే తొలి బౌలర్గా అశ్విన్ రికార్డుఈ క్రమంలో సొంతమైదానం చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్లో అశూ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చెపాక్లో రెండో టెస్టు సందర్భంగా అశూ సెంచరీ(113) చేయడంతో పాటు.. ఆరు వికెట్లు పడగొట్టాడు. తద్వారా టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఇదిలా ఉంటే.. కాన్పూర్ వేదికగా శుక్రవారం మొదలైన రెండో టెస్టు సందర్భంగా అశ్విన్.. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యంత వేగంగా 50 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి బౌలర్గా ఘనత సాధించాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్లో షకీబ్ అల్ హసన్ను అవుట్ చేయడం ద్వారా ఈ ఫీట్ నమోదు చేశాడు. తాజా సీజన్లో ఆడిన తొలి పది మ్యాచ్లలోనే ఈ రికార్డు నెలకొల్పాడు.డబ్ల్యూటీసీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వికెట్స్ బౌలర్ అశూ2019-21 సీజన్- 14 మ్యాచ్లలో 71 వికెట్లు- అత్యుత్తమ గణాంకాలు 7/1452021-23 సీజన్- 13 మ్యాచ్లలో 61 వికెట్లు- అత్యుత్తమ గణాంకాలు 6/912023-25 సీజన్- 10* మ్యాచ్లలోనే 50* వికెట్లు()-అత్యుత్తమ గణాంకాలు 7/71.ధనాధన్ఇక కాన్పూర్ టెస్టులో టీమిండియా విజయమే లక్ష్యంగా ఐదో రోజు ఆట మొదలుపెట్టింది. రెండో ఇన్నింగ్స్లో 26/2(11) ఓవర్నైట్ స్కోరుతో మొదలుపెట్టిన బంగ్లాదేశ్ను అశూ ఆదిలోనే దెబ్బకొట్టాడు. మొమినుల్ హక్ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. ఆకాశ్ దీప్ షాద్మన్ ఇస్లాం, రవీంద్ర జడేజా నజ్ముల్ షాంటో, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్ వికెట్లు కూల్చారు. దీంతో వందలోపు(94) పరుగులకే బంగ్లా ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. త్వరగా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి..బజ్బాల్ క్రికెట్తో గెలుపొందాలని టీమిండియా పట్టుదలగా ఉంది. చదవండి: IND vs BAN: విరాట్ కోహ్లి వరల్డ్ రికార్డు.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. కుంబ్లే ఆల్టైమ్ రికార్డు బద్దలు
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా కాన్పూర్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ మరో అరుదైన రికార్డను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియాలో అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా యాష్ రికార్డులకెక్కాడు.తొలి ఇన్నింగ్స్లో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటోను ఔట్ చేసిన అశ్విన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అశ్విన్ ఇప్పటివరకు ఆసియాలో 420 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే తన కెరీర్లో ఆసియాలో 419 వికెట్లు సాధించాడు. ఇక ఓవరాల్గా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ 612 వికెట్లతో తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్ధానంలో అశ్విన్(420) ఉన్నాడు. అశ్విన్ తర్వాత స్ధానాల్లో కుంబ్లే, రంగనా హెరత్(354), హార్భజన్ సింగ్(300) ఉన్నారు. ఓవరాల్గా టెస్టు క్రికెట్లో 101 మ్యాచ్లు ఆడిన అశ్విన్.. 2.82 ఏకానమీతో 522 వికెట్లు పడగొట్టాడు.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్తో తొలి టెస్టు సందర్భంగా ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రెండో టెస్టులో మరొక వికెట్ తీస్తే చాలు.. మరో ఎలైట్ జాబితాలోనూ చోటు దక్కించుకుంటాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన.. నజ్ముల్ షాంటో బృందాన్ని 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సమిష్టి ప్రదర్శనతో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది.తన జట్టు టెస్టుల్లో గెలిచిన సందర్భాల్లోఇక ఈ మ్యాచ్లో భారత స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ జడేజా.. 86 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించి.. ఓ రేర్ ఫీట్ నమోదు చేశాడు. తన జట్టు టెస్టుల్లో గెలిచిన సందర్భాల్లో 2 వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు.. 200కు పైగా వికెట్లు తీసిన తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ ఆటగాడు ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి.టీమిండియా గెలిచిన సందర్భాల్లో ఇప్పటి వరకు జడ్డూ 2003 రన్స్ చేశాడు. అంతేకాదు 218 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ (1943 రన్స్, 369 వికెట్లు) జడ్డూ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.ఇంకొక్క వికెట్ తీస్తే..కాన్పూర్ వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్తో మొదలైన రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా ఒక వికెట్ తీస్తే.. టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్లో చేరతాడు. తద్వారా.. సంప్రదాయ క్రికెట్లో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా నిలుస్తాడు. అంతేకాదు.. ఈ ఫీట్ నమోదు చేసిన టీమిండియా తొలి లెఫ్టార్మ్ స్పిన్నర్గానూ రికార్డు సాధిస్తాడు.టీ20లకు గుడ్బైకాగా 2012లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రవీంద్ర జడేజా.. ఇప్పటి వరకు 73 టెస్టులు, 197 వన్డేలు, 74 టీ20లు ఆడాడు. ఈ లెఫ్టాండర్ టెస్టులో 3122 పరుగులు, 299 వికెట్లు.. వన్డేల్లో 2756 రన్స్, 220 వికెట్లు, టీ20లలో 515 పరుగులు, 54 వికెట్లు తీశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 ఆడిన భారత జట్టులో సభ్యుడైన 35 ఏళ్ల జడ్డూ.. ఈ టోర్నీలో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో కలిసి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్టులు, ఫ్రాంఛైజీ క్రికెట్లో కొనసాగుతున్నాడు.చదవండి: IPL 2025: సీఎస్కేకు బై బై.. కేకేఆర్ మెంటార్గా వెస్టిండీస్ లెజెండ్ -
Ind vs Ban: 'టీమిండియాకు ఇది మంచికాదు'
దాదాపు ఆరు నెలల విరామం తర్వాత టెస్టు బరిలో దిగిన భారత క్రికెట్ జట్టు విజయంతో పునరాగమనం చేసింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్తో తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థిని ఏకంగా 280 పరుగుల తేడాతో చిత్తు చేసి.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.ఇక బంగ్లాదేశ్తో టెస్టులో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, యువ బ్యాటర్లు రిషభ్ పంత్, శుబ్మన్ గిల్ శతకాలతో మెరవగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో రాణించాడు. సెంచరీ కొట్టడంతో పాటు ఆరు వికెట్లు తీసిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విఫలంఅంతాబాగానే ఉన్నా.. ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వైఫల్యం మాత్రం అభిమానులను నిరాశపరిచింది. రెండు ఇన్నింగ్స్లో కలిపి రోహిత్ 11, కోహ్లి 23 పరుగులు మాత్రమే చేయడం మేనేజ్మెంట్లో ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఘాటు విమర్శలు చేశాడు.టీమిండియాకు ఇది మంచికాదురోహిత్, కోహ్లి దులిప్ ట్రోఫీ-2024లో ఆడితే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. అయినా.. ఆటగాళ్ల పేరు ప్రఖ్యాతుల ఆధారంగా తారతమ్యాలు చూపించడం.. భారత క్రికెట్కి మంచిది కాదని పేర్కొన్నాడు. ఈ మేరకు సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘వాళ్లిద్దరు వరల్డ్క్లాస్ బ్యాటర్లు. తిరిగి ఫామ్లోకి రాగలరు. కానీ ఈ సిరీస్కు ముందు దులిప్ ట్రోఫీ ఆడితే బాగుండేది.వారిని ఈ రెడ్బాల్ టోర్నీలో ఆడించే వీలున్నా విశ్రాంతినిచ్చారు. మిగతా వాళ్లకు మాత్రం ఆ వెసలుబాటు లేదు. అయినా.. ఒక్కక్కళ్లను ఒకలా ట్రీట్ చేయడం భారత క్రికెట్కు నష్టంచేకూర్చే అవకాశం ఉంది. రోహిత్, కోహ్లిల క్రేజ్ దృష్ట్యా వారు కోరినట్లు చేయడం సరికాదు. దులిప్ ట్రోఫీ ఆడి ఉంటే వారిద్దరు ఫామ్లోకి వచ్చేవారు’’ అని పేర్కొన్నాడు. తొలి టెస్టులో మిగతా ప్లేయర్లు రాణించారు కాబట్టి సరిపోయిందని.. లేదంటే ఫలితం వేరేలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డాడు. కాగా రోహిత్, కోహ్లితో పాటు అశ్విన్, బుమ్రా సైతం దులిప్ ట్రోఫీ ఆడలేదు. ఇదిలా ఉంటే.. టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు ఆరంభం కానుంది.చదవండి: నేను హార్డ్ హిట్టర్ని.. వచ్చే వరల్డ్కప్లోనూ ఆడతా: విండీస్ స్టార్ -
Ind vs Ban: అశ్విన్ ఇంకో నాలుగు వికెట్లు తీశాడంటే..
టెస్టు కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటికే భారత్ తరఫున సంప్రదాయ క్రికెట్లో 522 వికెట్లు పూర్తి చేసుకున్న ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ బ్యాటింగ్లోనూ సత్తా చాటుతున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా బంగ్లాదేశ్ ఇటీవల జరిగిన తొలి టెస్టులో అశూ అదరగొట్టాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్సొంతమైదానం చెన్నైలోని చెపాక్లో ఆకాశమే హద్దుగా చెలరేగి విలువైన శతకం(113) బాదడంతో పాటు.. ఆరు వికెట్లు పడగొట్టాడు. తద్వారా బంగ్లాపై టీమిండియా 280 పరుగుల తేడాతో గెలవడంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక భారత్- బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు(సెప్టెంబరు 27) కాన్పూర్లో మొదలుకానుంది.నాలుగు వికెట్లు తీస్తే..ఈ నేపథ్యంలో అశ్విన్ ఓ అరుదై రికార్డు ముంగిట నిలిచాడు. బంగ్లాతో రెండో టెస్టులో గనుక ఈ దిగ్గజ స్పిన్నర్ నాలుగు వికెట్లు తీస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డు సాధిస్తాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్ను అధిగమించి మొదటిస్థానానికి చేరుకుంటాడు. ఈ డబ్ట్యూటీసీ తాజా సీజన్లో హాజిల్వుడ్ ఇప్పటి వరకు 51 వికెట్లు తీయగా.. అశూ 48 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఫైనల్ చేరడమే లక్ష్యంగా వరుస విజయాలతో దూసుకుపోతోంది.డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:జోష్ హాజిల్వుడ్(ఆస్ట్రేలియా)- 51రవిచంద్రన్ అశ్విన్ఇండియా)-48ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- 48మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)-48క్రిస్ వోక్స్(ఇంగ్లండ్)-43నాథన్ లియోన్(ఆస్ట్రేలియా)-43.చదవండి: అతడిని కట్టడి చేస్తే టీమిండియాపై గెలుపు మాదే: కమిన్స్ -
‘రోహిత్, కోహ్లిలే కాదు.. టీమిండియాకు అతడూ ముఖ్యమే’
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ జట్టుకు అశూ సేవలు మరువలేనివని.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు అతడు ఏమాత్రం తీసిపోడని కొనియాడాడు. తన దృష్టిలో టీమిండియాలో అత్యంత ముఖ్యమైన ఆటగాడు అతడేనని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు.బంగ్లాదేశ్తో టీమిండియా తొలి టెస్టులో అశ్విన్ సత్తా చాటిన విషయం తెలిసిందే. చెన్నైలోని సొంతమైదానం చెపాక్లో జరిగిన ఈ మ్యాచ్లో విలువైన సెంచరీ చేయడంతో పాటు.. ఆరు వికెట్లు తీసి బంగ్లాదేశ్ ఓటమిని శాసించాడు. భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఆరు శతకాలు.. 522 వికెట్లుఈ క్రమంలో టెస్టు క్రికెట్లో ఇప్పటికే 522 వికెట్లతో పాటు... 3422 పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇందులో ఆరు సెంచరీలు ఉండం విశేషం. ఇక గతంలోనూ పలు టెస్టుల్లో టీమిండియా చిక్కుల్లో పడ్డవేళ ఆపద్భాందవుడిలా తన ఇన్నింగ్స్తో గట్టెక్కించిన సందర్భాలూ ఉన్నాయి.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ‘‘తొలి టెస్టులో అశ్విన్ అద్బుతంగా ఆకట్టుకున్నాడు. స్పెషలిస్టు బ్యాటర్ మాదిరి ఇన్నింగ్స్ ఆడాడు. నేను విదేశీయుడిని.. అయితే, నాలాగే చాలా మందికి ఎక్కువగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పేర్లే వినిపిస్తున్నాయి.రోహిత్, కోహ్లిలే కాదు.. టీమిండియాకు అతడూ ముఖ్యమేఅయితే, నా దృష్టిలో మాత్రం వాళ్లిద్దరితో పాటు టీమిండియాకు అశ్విన్ కూడా అంతే ముఖ్యం. కానీ.. అశూ లాంటి వాళ్లు సెంచరీ చేసినపుడు.. ఐదు లేదా ఆరు వికెట్లు పడగొట్టినపుడు మాత్రమే మనం వాళ్ల గురించి మాట్లాడతాం. అయితే, భారత క్రికెట్ జట్టు విజయపథంలో నడవడంలో అశ్విన్ వంటి మేటి ఆటగాళ్ల కృషి ఎంతగానో ఉంది’’ అని పేర్కొన్నాడు. రోహిత్, కోహ్లి మాదిరే అతడూ టాప్ ప్లేయరేనని తమీమ్ ఇక్బాల్ ఈ సందర్భంగా అశ్విన్ను ప్రశంసించాడు.చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..!📽️ WATCHThe dismissal that completed five-wicket haul number 37 in Test Cricket for @ashwinravi99 👏👏#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/tDKMeNn33O— BCCI (@BCCI) September 22, 2024 -
IND VS BAN 1st Test: జడేజా ఖాతాలో అరుదైన రికార్డు
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ల్లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ (86) చేసిన జడేజా.. మ్యాచ్ మొత్తంలో ఐదు వికెట్లు తీశాడు. ఇలా ఓ టెస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ, ఐదు వికెట్లు తీయడం జడేజాకు ఇది 12వ సారి. భారత క్రికెటర్లలో ఈ ఘనతను ఇన్ని సార్లు ఎవ్వరూ సాధించలేదు. జడ్డూ తర్వాతి స్థానంలో అశ్విన్ (11) ఉన్నాడు. వీరిద్దరి తర్వాత కపిల్ దేవ్ (7), హర్భజన్ సింగ్ (6) ఉన్నారు. వీరి మినహా ఏ భారత క్రికెటర్ రెండు కంటే ఎక్కువ సార్లు ఈ ఘనత సాధించలేదు.చెన్నై టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టీమిండియా బంగ్లాదేశ్పై 280 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఈ మ్యాచ్లో భారత్ అన్ని విభాగాల్లో సత్తా చాటి పర్యాటక జట్టుపై సంపూర్ణ ఆధిపత్యం చలాయింది. అశ్విన్ (113, 6/88), జడేజా (86, 2/19, 3/58) ఆల్రౌండ్ షోతో ఇరగదీయగా.. గిల్ (119 నాటౌట్), పంత్ (109) అదిరిపోయే శతకాలతో ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ, సెకెండ్ ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..! -
IND VS BAN 1st Test: భార్యతో ఇంటర్వ్యూ.. అశ్విన్ సరదా సమాధానాలు
చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఈ మ్యాచ్లో భారత గెలుపులో స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. అశ్విన్.. సొంత మైదానమైన చెపాక్ స్టేడియంలో సెంచరీ సాధించడం రెండో సారి. ఐదు వికెట్ల ఘనత నమోదు చేయడం నాలుగోసారి.అశ్విన్ సొంత మైదానంలో మ్యాచ్ ఆడుతుండటంతో అతని కుటుంబ సభ్యులంతా మ్యాచ్ వీక్షించేందుకు వచ్చారు. అశ్విన్ తల్లి, తండ్రితో పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలు అశ్విన్ ఆటను నాలుగు రోజుల పాటు తిలకించారు.మ్యాచ్ పూర్తయిన అనంతరం అశ్విన్ కుటుంబ సభ్యులు మైదానంలో కలియ తిరిగారు. అశ్విన్ తన తల్లిదండ్రులను హత్తు కొని తన ప్రేమను చాటాడు. అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ అశ్విన్ను సరదాగా ఇంటర్వ్యూ చేసింది. A special game calls for a special conversation 💙@ashwinravi99's family in a heartwarming interaction with him post Chepauk heroics.P.S. - Ashwin has a gift for his daughters on this #DaughtersDay. Watch 👇👇#INDvBAN | @IDFCFIRSTBank | @prithinarayanan pic.twitter.com/4rchtzemiz— BCCI (@BCCI) September 22, 2024డాటర్స్ డే రోజు ఏం ఇస్తావని పిల్లలు అడుగుతున్నారని అడిగింది. ఇందుకు అశ్విన్ తాను ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బంతి ఇస్తానని చెప్తాడు. దీనికి తన కుమార్తెల్లో ఒకరు వద్దు అని సరదాగా అంటుంది.సొంత మైదానంలో రాణించడం ఎలా అనిపిస్తుంది అని ప్రీతి మరో ప్రశ్న అడిగింది. ఈ ప్రశ్నకు ఎలా స్పందించాలో అర్దం కావడం లేదని అశ్విన్ అంటాడు. తొలి రోజు అంతా త్వరత్వరగా జరిగిపోయింది. ఆ రోజు బ్యాటింగ్కు వస్తానని అస్సలు అనుకోలేదు. సెంచరీ గురించిన ఆలోచనే లేదు. ఇక్కడ ఆడిన ప్రతిసారి ఏదో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఈ మైదానంలో ఏదో శక్తి ఉందనిపిస్తుందని అశ్విన్ అంటాడు.ఇలా ప్రీతి, అశ్విన్ మధ్య పలు ఆసక్తికర అంశాలపై సంభాషణ జరిగింది. అంతిమంగా ప్రీతి అశ్విన్కు కంగ్రాట్స్ చెప్పగా.. యాష్ థ్యాంక్స్ చెప్తాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. చదవండి: అదరగొట్టిన అశ్విన్.. విండీస్ దిగ్గజం ఆల్టైమ్ రికార్డు బద్దలు -
280 పరుగుల తేడాతో...
సొంతగడ్డపై రవిచంద్రన్ అశ్విన్ అటు బ్యాట్తో, ఇటు బంతితో విజృంభించిన వేళ... బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ భారీ విజయం సాధించింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు చేరడమే లక్ష్యంగా సాగుతున్న రోహిత్ బృందం ముందు బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అందులో సగం పరుగులైనా చేయకముందే ఆలౌటైంది. ఈ విజయంతో భారత టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి గెలుపోటముల నిష్పత్తిలో పరాజయాల కన్నా ఎక్కువ విజయాలు నమోదు చేసుకుంది. చెన్నై: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన భారత జట్టు బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండు మ్యాచ్ల సిరీస్లో 1–0తో ముందంజ వేసింది. భారత్ నిర్దేశించిన 515 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓవర్నైట్ స్కోరు 158/4తో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ చివరకు 62.1 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ నజ్ముల్ హసన్ (127 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఐదో వికెట్కు షకీబ్ అల్ హసన్ (25)తో కలిసి నజు్మల్ 48 పరుగులు జోడించాడు. ఈ దశలో అశ్విన్ బంతి అందుకోవడంతో పరిస్థితి తలకిందులైంది. ‘లోకల్ బాయ్’ చక్కటి బంతితో షకీబ్ను ఔట్ చేయగా... లిటన్ దాస్ (1)ను జడేజా బుట్టలో వేసుకున్నాడు. మిరాజ్ (8) విఫలమయ్యాడు. భారత బౌలర్లలో ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు పడగొట్టగా... రవీంద్ర జడేజా 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. చేతిలో ఆరు వికెట్లతో నాలుగో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ లంచ్ విరామానికి ముందే ఆలౌటైంది. ఈ ఆరు వికెట్లలో అశ్విన్ , జడేజా చెరో 3 పంచుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేయడంతో పాటు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసిన అశ్విన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి కాన్పూర్లో రెండో టెస్టు ప్రారంభం కానుంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 376; బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 149; భారత్ రెండో ఇన్నింగ్స్: 287/4 డిక్లేర్డ్; బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: జాకీర్ (సి) యశస్వి (బి) బుమ్రా 33; షాద్మన్ (సి) గిల్ (బి) అశ్విన్ 35; నజు్మల్ (సి) బుమ్రా (బి) జడేజా 82; మోమినుల్ హక్ (బి) అశ్విన్ 13; ముషి్ఫకర్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 13; షకీబ్ (సి) యశస్వి (బి) అశ్విన్ 25; లిటన్ దాస్ (సి) రోహిత్ (బి) జడేజా 1; మిరాజ్ (సి) జడేజా (బి) అశ్విన్ 8; తస్కీన్ (సి) సిరాజ్ (బి) అశ్విన్ 5; హసన్ మహమూద్ (బి) జడేజా 7; నాహిద్ రాణా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (62.1 ఓవర్లలో ఆలౌట్) 234. వికెట్ల పతనం: 1–62, 2–86, 3–124, 4–146, 5–194, 6–205, 7–222, 8–222, 9–228, 10–234. బౌలింగ్: బుమ్రా 10–2–24–1; సిరాజ్ 10–5–32–0; ఆకాశ్దీప్ 6–0–20–0; అశ్విన్ 21–0–88–6; జడేజా 15.1–2–58–3. -
అదరగొట్టిన అశ్విన్.. విండీస్ దిగ్గజం ఆల్టైమ్ రికార్డు బద్దలు
చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో విజయ డంఖా మోగించింది. 515 పరుగుల భారీ లక్ష్యం చేధించడంలో బంగ్లాదేశ్ చతకిలపడింది. భారత స్పిన్నర్ల దాటికి 234 పరుగలకు బంగ్లా ఆలౌటైంది.కాగా భారత్ విజయంలో స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ది కీలక పాత్ర. ఈ మ్యాచ్లో అశ్విన్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో సత్తాచాటిన యాష్.. రెండో ఇన్నింగ్స్లో బంతితో మ్యాజిక్ చేశాడు. ఏకంగా 6 వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.అశ్విన్ సాధించిన రికార్డులు ఇవే.. టెస్టు క్రికెట్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన రెండో బౌలర్గా ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ రికార్డును అశ్విన్ సమం చేశాడు. షేన్ వార్న్ 145 టెస్టుల్లో 37 సార్లు ఫైవ్ వికెట్ల హాల్స్ సాధించగా.. అశ్విన్ కేవలం 101 మ్యాచ్ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు.అశ్విన్ మరో ఫైవ్ వికెట్ల హాల్ సాధిస్తే వార్న్ను అధిమిస్తాడు. అశ్విన్ తర్వాతి స్ధానంలో న్యూజిలాండ్ దిగ్గజం రిచర్డ్ హాడ్లీ(36) ఉన్నారు. ఈ మ్యాచ్ కంటే ముందు హాడ్లీతో కలిసి అశ్విన్ మూడో స్ధానంలో కొనసాగాడు. అయితే తాజా మ్యాచ్తో హ్యాడ్లీని అధిగమించాడు.అదే విధంగా టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్ల జాబితాలో 8వ స్థానంలో ఉన్న కోట్నీ వాల్ష్ను అశ్విన్ వెనక్కి నెట్టాడు.అశ్విన్ 522 వికెట్లతో 8వ స్ధానంలో నిలిచాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో మురళీధరన్ (800), వార్న్ (708), అండర్సన్ (704), కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్గ్రాత్ (563), లయన్ (530) మాత్రమే అశ్విన్ కంటే ముందున్నారు.చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే -
IND vs BAN: అశ్విన్ స్పిన్ మాయ.. బంగ్లాపై భారత్ ఘన విజయం
బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్పై 280 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. ఇక 515 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు 234 పరుగులకు ఆలౌటైంది.అశ్విన్ స్పిన్ మాయ..158/4 ఓవర్ నైట్ స్కోర్తో నాలుగో రోజును ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ అశ్విన్ స్పిన్ ఉచ్చులో చిక్కు కుంది. క సెకెండ్ ఇన్నింగ్స్లో బంగ్లా బ్యాటర్లకు అశ్విన్ చుక్కలు చూపించాడు. స్పిన్ మాస్ట్రో బౌలింగ్ను ఎదుర్కొలేక వరుస క్రమంలో బంగ్లా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఈ మ్యాచ్లో 6 వికెట్లతో చెలరేగాడు. అతడికి తోడు మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా 3 వికెట్ల సత్తాచాటాడు. దీంతో కేవలం మూడున్నర రోజల్లోనే చెపాక్ టెస్టు ముగిసిపోయింది.శాంటో ఒక్కడే..బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ శాంటో(82) మినహా మిగితా బ్యాటర్లందరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. మూడో రోజు ఆటలో కాస్త పట్టుదలతో కన్పించిన బంగ్లా బ్యాటర్లు.. నాలుగో రోజు మాత్రం పూర్తిగా తేలిపోయారు. షకీబ్(25) ఔటైన తర్వాత వచ్చినవారు వచ్చినట్లే పెవిలియన్కు క్యూ కట్టారు. 76 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లు కోల్పోయి బంగ్లా ఓటమి చవిచూసింది.అశ్విన్- జడ్డూ ఫైటింగ్ ఇన్నింగ్స్..ఇక తొలి ఇన్నింగ్స్లో 376 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో స్టార్ బ్యాటర్లు విఫలమైనప్పటకి రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అద్బుతమైన పోరాట పటిమ కనరిబరిచారు. అశ్విన్(113) సెంచరీతో మెరవగా.. జడ్డూ(86) పరుగులతో రాణించారు. వీరిద్దరూ ఏడో వికెట్కు 199 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం బంగ్లాదేశ్ 149 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్లో 287/4 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో లభించిన భారీ ఆధిక్యాన్ని జోడించి బంగ్లా ముందు 515 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది. ఈ లక్ష్యాన్ని చేధించడంలో బంగ్లా చేతులేత్తేసింది.చదవండి: IND vs AUS: ఆసీస్ను చిత్తు చేసిన టీమిండియా -
అశ్విన్ మాస్టర్ మైండ్.. బంగ్లా బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్(వీడియో)
చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో లోకల్ బాయ్, భారత స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొడుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో బ్యాట్తో సత్తాచాటిన అశ్విన్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్లో బంతితో మాయచేస్తున్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 15 ఓవర్లు వేసిన అశ్విన్.. 3 కీలక వికెట్లు పడగొట్టి బంగ్లాను బ్యాక్ ఫుట్లో ఉంచాడు. ఈ క్రమంలో బంగ్లా బ్యాటర్ మోమినుల్ హక్ను యాష్ ఔట్ చేసిన విధానం గురించి ఎంతచెప్పుకున్న తక్కువే. అద్భుతమైన బంతిని మోమినుల్ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు.బంగ్లా ఇన్నింగ్స్ 30వ ఓవర్లో ఆఖరి బంతిని మోమినుల్ ఆఫ్ స్టంప్ దిశగా టాస్డ్ ఆప్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని మోమినుల్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నం చేశాడు. కానీ బంతి టర్న్ అద్భుతంగా అవుతూ స్టంప్స్ను గిరాటేసింది. దీంతో సదరు బంగ్లా బ్యాటర్ బిత్తర పోయాడు. ఈ బంతిని చూసి మైదానంలో ఉన్న విరాట్ కోహ్లి ఫిదా అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: భయపడకు కోహ్లి.. నీ స్టైల్లో ఆడు: రవిశాస్త్రి pic.twitter.com/kl3FVaAjgc— Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) September 21, 2024 -
Ind vs Ban: రెండో రోజు ముగిసిన ఆట.. 308 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
India vs Bangladesh, 1st Test Chennai Day 2 Updates:రెండో రోజు ముగిసిన ఆట.. 308 పరుగుల ఆధిక్యంలో టీమిండియాబంగ్లాతో తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్లో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (10), రోహిత్ శర్మ (5), విరాట్ కోహ్లి (17) ఔట్ కాగా.. శుభ్మన్ గిల్ (33), రిషబ్ పంత్ (12) క్రీజ్లో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్, నహిద్ రాణా, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ పడగొట్టారు.ప్రస్తుతం భారత్ 308 పరుగుల ఆధిక్యంలో (తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని) కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్కు 227 పరుగుల ఆధిక్యం లభించింది. దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు ఆలౌటైంది. 19.2:మూడో వికెట్ కోల్పోయిన టీమిండియారెండో ఇన్నింగ్స్లో కోహ్లి(17) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. పంత్ క్రీజులోకి వచ్చాడు. గిల్ 31 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా స్కోరు: 67/3 (19.2) . బంగ్లాపై 294 పరుగుల ఆధిక్యం. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. యశస్వి ఔట్6.4వ ఓవర్: 28 పరుగులకే భారత్ ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. రోహిత్ 5, యశస్వి జైస్వాల్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. రోహిత్ను తస్కిన్.. జైస్వాల్ను నహిద్ రాణా పెవిలియన్కు పంపారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్2.3: తస్కిన్ అహ్మద్ బౌలింగ్లో రోహిత్ జకీర్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. గిల్ క్రీజులోకి వచ్చాడు. మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా స్కోరు: 16-1 . కాగా తొలి ఇన్నింగ్స్లోనూ రోహిత్ ఆరు పరుగులకే అవుటైన విషయం తెలిసిందే.149 పరుగులకు ఆలౌటైన బంగ్లాదేశ్47.1వ ఓవర్: భారత్తో తొలి టెస్ట్లో బంగ్లా తొలి ఇన్నింగ్స్ 149 పరుగుల వద్ద ముగిసింది. సిరాజ్ నహిద్ రాణాను క్లీన్ బౌల్డ్ చేసి బంగ్లా ఇన్నింగ్స్కు తెరదించాడు. మెహిది హసన్ మీరజ్ 27 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లా ఇన్నింగ్స్లో నజ్ముల్ షాంటో (20), షకీబ్ అల్ హసన్ (32), లిట్టన్ దాస్ (22), తస్కిన్ అహ్మద్ (11), నహిద్ రాణా (11), మిరాజ్ రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్, ఆకాశ్దీప్, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్42.5వ ఓవర్: 130 పరుగుల వద్ద బంగ్లాదేశ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. బుమ్రా అద్భుతమైన యార్కర్తో తస్కిన్ అహ్మద్ను (11) క్లీన్ బౌల్డ్ చేశాడు. ఎనిమిదో వికెట్ డౌన్.. టీ బ్రేక్ సమయానికి స్కోరెంతంటే?36.5: బుమ్రా బౌలింగ్లో హసన్ మహమూద్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ వికెట్ల వీరుడు అవుటయ్యాడు. టీ బ్రేక్ సమయానికి బంగ్లాదేశ్ స్కోరు: 112/8 (36.5).ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్30.3: షకీబ్ అల్ హసన్ రూపంలో బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో వికెట్ కీపర్ రిషభ్ పంత్కు క్యాచ్ ఇచ్చి షకీబ్ నిష్క్రమించాడు. మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న ఈ ఆల్రౌండర్.. 5 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. హసన్ మహమూద్ క్రీజులోకి వచ్చాడు. బంగ్లా స్కోరు: 92/7 (30.5)ఆరో వికెట్ డౌన్.. లిట్టన్ దాస్ ఔట్లిట్టన్ దాస్ రూపంలో బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన దాస్.. జడేజా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. 29 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్: 91/6. క్రీజులో షకీబ్(32), మెహదీ హసన్(0) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న షకీబ్, లిట్టన్40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లాదేశ్ను స్టార్ ప్లేయర్లు షకీబ్ అల్హసన్(22), లిట్టన్ దాస్(18) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 24 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది.కష్టాల్లో బంగ్లాదేశ్.. 40 పరుగులకే 5 వికెట్లుచెపాక్ టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ముష్ఫికర్ రహీం రూపంలో బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన రహీం.. బుమ్రా బౌలింగ్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 14 ఓవర్లకు బంగ్లా స్కోర్: 44/5. క్రీజులో షకీబ్(8), లిట్టన్దాస్(0) పరుగులతో ఉన్నారు.కష్టాల్లో బంగ్లా.. నాలుగో వికెట్ డౌన్కెప్టెన్ శాంటో రూపంలో బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన శాంటో.. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 12 ఓవర్లకు బంగ్లా స్కోర్: 40/4. క్రీజులో షకీబ్(4), ముష్పికర్ రహీం(8) పరుగులతో ఉన్నారు.ఆకాష్ ఆన్ ఫైర్.. భారత పేసర్ ఆకాష్ దీప్ నిప్పులు చేరుగుతున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్ 9వ ఓవర్లో తొలి బంతికి జకీర్ హసన్ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాష్.. రెండో బంతికి మోమినుల్ హక్ అదే తరహాలో ఔట్ చేశాడు. 9 ఓవర్లు ముగిసే సరికి బంగ్లా 3 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది.బంగ్లా తొలి వికెట్ డౌన్.. తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన బంగ్లాదేశ్కు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే షాకిచ్చాడు. బంగ్లా ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(2)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. 4 ఓవర్లకు బంగ్లా స్కోర్: 8/1. క్రీజులో జకీర్ హసన్(2), షాంటో(4) పరుగులతో ఉన్నారు.376 పరుగులకు భారత్ ఆలౌట్చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తమ తొలి ఇన్నింగ్స్లో భారత్ 376 పరుగులకు ఆలౌటైంది. 339/9 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా అదనంగా కేవలం 37 పరుగులు మాత్రమే తమ ఇన్నింగ్స్ను మగించింది.రెండో రోజు ఆటలో పేసర్ టాస్కిన్ ఆహ్మద్ 3 వికెట్ల పడగొట్టి దెబ్బతీశాడు. భారత బ్యాటర్లలో రవిచంద్రన్ అశ్విన్(113) టాప్ స్కోరర్గా నిలవగా.. రవీంద్ర జడేజా(86), జైశ్వాల్(56) రాణించారు. బంగ్లా బౌలర్లలో యువ సేసర్ హసన్ మహమూద్ 5 వికెట్లు సాధించగా.. టాస్కిన్ మూడు, మెహది హసన్, నహిద్ రానా తలా వికెట్ పడగొట్టారు.తొమ్మిదో వికెట్ డౌన్..అశ్విన్ ఔట్భారత్ తొలి ఇన్నింగ్స్ మగింపునకు చేరుకుంది. రవిచంద్రన్ అశ్విన్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 113 పరుగులు చేసిన అశ్విన్.. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. 91 ఓవ్లకు భారత్ స్కోర్ఎనిమిదో వికెట్ డౌన్.. ఆకాష్ దీప్ రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన దీప్.. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. 90 ఓవర్లకు భారత్ స్కోర్: 373/8ఏడో వికెట్ డౌన్.. జడేజా ఔట్339-6 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్లో రవీంద్ర జడేజా(86) ఔటయ్యాడు. దీంతో 199 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి ఆకాష్ దీప్ వచ్చాడు.రెండో రోజు ఆట ఆరంభం..చెపాక్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. మొదటి రోజు ఆటలో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.క్రీజులో రవిచంద్రన్ అశ్విన్(102), రవీంద్ర జడేజా(86) పరుగులతో ఉన్నారు. రెండో రోజు బంగ్లా బౌలింగ్ ఎటాక్ను టాస్కిన్ ఆహ్మద్ ప్రారంభించాడు.తుదిజట్లు:టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.బంగ్లాదేశ్షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా. -
అశ్విన్ అదరహో...
ఒకరికి అది ఓనమాలు నేర్చుకున్న సొంత మైదానం... మరొకరికి అక్కడి అభిమానులు ఆత్మీయతతో తమ సొంతవాడిగా మార్చుకున్న మైదానం...ఈ ఇద్దరూ జత కలిస్తే అక్కడ అద్భుతం జరగాల్సిందే. చెపాక్ మైదానంలో గురువారం సరిగ్గా అదే జరిగింది. సాధారణ పరిస్థితుల్లో అలవోకగా ఆడటం వేరు... 144/6 వద్ద కష్టాల్లో ఉన్న సమయంలో టీమ్ను రక్షించి పటిష్టమైన స్థితికి చేర్చడం వేరు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా దానిని చేసి చూపించారు. బంగ్లా దేశ్ బౌలింగ్ ముందు అనూహ్యంగా టీమిండియా కుప్పకూలగా వీరిద్దరి భాగస్వామ్యం భారీ స్కోరుకు బాటలు వేసింది. ఉదయం పేస్కు అనుకూలించిన పిచ్పై బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ ధాటికి ఒక దశలో 34/3 వద్ద నిలిచిన టీమ్ కోలుకొని తొలి రోజును ఘనంగా ముగించింది. అశ్విన్ ఆరో శతకంతో మెరవగా... జడేజా సెంచరీకి చేరువయ్యాడు. చెన్నై: బంగ్లాదేశ్తో తొలి టెస్టులో భారత జట్టుకు సరైన ఆరంభం లభించింది. టాస్ ఓడి ఆరంభంలో తడబడినా...చివరకు టీమిండియాదే పైచేయి అయింది. మ్యాచ్ మొదటి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (112 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ పూర్తి చేసుకోగా...రవీంద్ర జడేజా (117 బంతుల్లో 86 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్లు) అతనికి అండగా నిలుస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు ఇప్పటికే ఏడో వికెట్కు అభేద్యంగా 195 పరుగులు జోడించారు. యశస్వి జైస్వాల్ (118 బంతుల్లో 56; 9 ఫోర్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమూద్ (4/58) భారత్ను దెబ్బ తీశాడు. రోహిత్, కోహ్లి విఫలం... చల్లటి వాతావరణం, కాస్త తేమను దృష్టిలో ఉంచుకొని బంగ్లా కెపె్టన్ నజ్ముల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత గడ్డపై ప్రత్యర్థి కెపె్టన్ ఒకరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం ఏడేళ్లలో ఇదే మొదటిసారి. పాకిస్తాన్పై సిరీస్ గెలిపించిన తమ బౌలర్లను మరోసారి నమ్ముకుంటూ బంగ్లా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగింది. కేవలం 3 టెస్టుల అనుభవం ఉన్న పేసర్ హసన్ మహమూద్ వరుసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి తన కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. తన మూడో ఓవర్లోనే అతను రోహిత్ శర్మ (6)ను పెవిలియన్ పంపించాడు. తన తర్వాతి ఓవర్లోనే శుబ్మన్ గిల్ (0)ను కూడా అతను అవుట్ చేశాడు. ఆ తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (6) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. హసన్ బౌలింగ్లోనే డ్రైవ్ చేయబోయి కీపర్కు క్యాచ్ ఇవ్వగా... హసన్ 5–2–6–3 స్పెల్తో అదరగొట్టాడు. అయితో మరో ఎండ్లో యశస్వి పట్టుదలగా ఆడాడు. అతనికి రిషబ్ పంత్ (52 బంతుల్లో 39; 6 ఫోర్లు) నుంచి సహకారం లభించింది. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ నాలుగో వికెట్కు 62 పరుగులు జత చేశారు. అయితే లంచ్ తర్వాత పంత్ వికెట్ కూడా హసన్కే దక్కింది. 95 బంతుల్లో యశస్వి హాఫ్ సెంచరీ పూర్తయింది. భారత గడ్డపై వరుసగా ఆరు టెస్టుల్లో అతను కనీసం అర్ధ సెంచరీ సాధించడం విశేషం. అనంతరం ఒకే స్కోరు వద్ద యశస్వి, కేఎల్ రాహుల్ (16) వెనుదిరిగారు. భారీ భాగస్వామ్యం... స్కోరు 144/6గా ఉన్న స్థితిలో జట్టు ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే ఈ దశలో జడేజాకు అశ్విన్ జత కలిశాడు. అప్పటి నుంచి మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఆ తర్వాత 37.4 ఓవర్ల పాటు ఈ జోడీని విడదీయలేక బంగ్లా బౌలర్లు చేతులెత్తేశారు. గత తప్పిన బంతులతో వారు ఈ ద్వయం పాతుకుపోయేందుకు అవకాశం కల్పించారు. ఏ ఒక్క బౌలర్ కూడా ప్రభావం చూపలేకపోయాడు. సొంతగడ్డపై అశ్విన్ జోరుగా ఆడగా, జడేజా పరిస్థితులను బట్టి సహచరుడికి అండగా నిలిచాడు. డ్రైవ్, పంచ్, పుల్, స్లాగ్... ఇలా అశ్విన్ బ్యాటింగ్లో అన్ని షాట్లూ కనిపించాయి. ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య అతను కవర్స్, స్క్వేర్లెగ్ దిశగా పరుగులు రాబట్టాడు. వీరిద్దరు కుదురుకున్న తర్వాత పరుగులు అలవోకగా వచ్చాయి. నాహిద్ బౌలింగ్లో అశ్విన్ కొట్టిన ర్యాంప్ షాట్ బౌండరీ హైలైట్గా నిలిచింది. మరో ఆరు నిమిషాల్లో రోజు ముగుస్తుందనగా షకీబ్ బౌలింగ్లో మిడ్ వికెట్ దిశగా ఆడి సింగిల్ తీయడంతో 108 బంతుల్లో అశ్విన్ సెంచరీ పూర్తయింది. ఒక్క చివరి సెషన్లోనే భారత్ 32 ఓవర్లలో 163 పరుగులు సాధించగా... అశ్విన్, జడేజా వేగంగా ఓవర్కు 5.17 పరుగుల రన్రేట్తో పరుగులు తీయడం విశేషం. 6 టెస్టుల్లో అశ్విన్కు ఇది ఆరో సెంచరీ. వెస్టిండీస్పై నాలుగు సెంచరీలు సాధించిన అతను... 2021లో ఇదే చెన్నై మైదానంలో ఇంగ్లండ్పై మరో శతకం బాదాడు. ‘సొంత ప్రేక్షకుల మధ్య ఆడటం ఎప్పుడూ సంతోషాన్నిస్తుంది. నాకెంతో ఇష్టమైన మైదానమిది. ఇక్కడ ఆడిన గత టెస్టులాగే ఈ సారి సెంచరీ చేయడం ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఇటీవలే టి20 టోర్నీ ఆడిన నేను బ్యాటింగ్పై బాగా దృష్టి పెట్టాను. ఇలాంటి పిచ్పై దూకుడుగా ఆడటం అవసరం. నేను అలసిపోయిన సమయంలో జడేజా అండగా నిలిచి ఉత్సాహపరిచాడు. రెండో రోజు కూడా ఆరంభంలో ఇక్కడ పేసర్లు ప్రభావం చూపిస్తారు. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ ఈ పిచ్ స్పిన్కు అనుకూలంగా మారుతుంది’ –రవిచంద్రన్ అశ్విన్ స్కోరు వివరాలుభారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) షాద్మన్ (బి) నాహిద్ 56; రోహిత్ (సి) నజు్మల్ (బి) హసన్ 6; గిల్ (సి) దాస్ (బి) హసన్ 0; కోహ్లి (సి) దాస్ (బి) హసన్ 6; పంత్ (సి) దాస్ (బి) హసన్ 39; రాహుల్ (సి) జాకీర్ (బి) మిరాజ్ 16; జడేజా (నాటౌట్) 86; అశ్విన్ (నాటౌట్) 102; ఎక్స్ట్రాలు 28; మొత్తం (80 ఓవర్లలో 6 వికెట్లకు) 339. వికెట్ల పతనం: 1–14, 2–28, 3–34, 4–96, 5–144, 6–144. బౌలింగ్: తస్కీన్ 15–1–47–0, హసన్ మహమూద్ 18–4–58–4, నాహిద్ రాణా 17–2–80–1, మెహదీ హసన్ మిరాజ్ 21–2–77–1, షకీబ్ 8–0–50–0, మోమినుల్ 1–0–4–0. -
దంచి కొట్టిన అశ్విన్, జడ్డూ.. తొలి రోజు భారత్దే (ఫోటోలు)
-
అతడి వల్లే ఈ సెంచరీ.. నిజంగా చాలా గ్రేట్: అశ్విన్
చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో కదం తొక్కాడు. తన సొంత ప్రేక్షకుల ముందు అశ్విన్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 క్రికెట్ను తలపించిన అశ్విన్.. కేవలం 108 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్సర్లతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అంతేకాకుండా 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తన విరోచిత సెంచరీతో అశూ ఆదుకున్నాడు. మరో ఆల్రౌండర్ జడేజాతో కలిసి భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్కు అజేయంగా 195 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 80 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. క్రీజులో అశ్విన్(102 బ్యాటింగ్), జడేజా(86 బ్యాటింగ్) ఉన్నారు. ఇక తొలి రోజు ఆట అనంతరం సెంచరీ హీరో అశ్విన్ స్పందించాడు. జడేజా సహకారంతో తన సెంచరీ సాధించగల్గాని అశ్విన్ తెలిపాడు."సొంత ప్రేక్షకుల ముందు ఎల్లప్పుడూ నాకు ప్రత్యేకమే. చెపాక్లో క్రికెట్ ఆడటం నాకు చాలా ఇష్టం. ఈ మైదానం నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలను అందించింది. నేను చివరగా ఈ మైదానంలో సెంచరీ సాధించాడు. అప్పుడు రవిశాస్త్రి భాయ్ కోచ్గా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా స్పెషల్. టీఎన్పీఎల్ టీ20 టోర్నీ ఆడటం నా బ్యాటింగ్కు చాలా ఉపయోగపడింది. సాధారణంగా నేను ఎప్పుడూ ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా ఆడేందుకు ప్రయత్నిస్తుంటాను. ఇటువంటి వికెట్పై దూకుడుగా ఆడటమే ఉత్తమం. మనం బంతిని ఫాలో అవుతూ ఆడితే ఇబ్బంది పడక తప్పదు. పంత్ ఆవిధంగానే తన వికెట్ను కోల్పోయాడు. ఇది పాత తరహా చెన్నై పిచ్. బౌన్స్తో పాటు కాస్త క్యారీ ఉంటుంది. రెడ్ సాయిల్ పిచ్పై మనం సరిగ్గా లైన్లో ఉంటే కొన్ని షాట్లు ఈజీగా ఆడవచ్చు.ఈ ఇన్నింగ్స్లో జడేజా కూడా నాకు సపోర్ట్గా నిలిచాడు. నా ఇన్నింగ్స్ మధ్యలో నేను కాస్త ఆలిసిపోయి చెమటలు పట్టాను. అది చూసిన జడేజా నన్ను గైడ్ చేస్తూ ముందుకు సాగేలా ప్రోత్సహించాడు. గతకొన్నేళ్లగా జడ్డూ మా జట్టులోనే బెస్ట్ బ్యాటర్. నాకు చాలా సహకారం అందించాడు.మూడు పరుగులు తీసే దగ్గర కూడా అతడు రెండు పరుగులు చాలు అని సరిపెట్టాడు. దీంతో నాకు కొంచెం అలసట తగ్గి నా ఇన్నింగ్స్ కొనసాగించగలిగాను. అతడికి థాంక్స్ చెప్పాలి. రేపు పిచ్ ఎలా ప్రవర్తిస్తుంది నాకు తెలియదు. కొంచెం స్పిన్,కొంచెం బౌన్స్కు అనుకూలించే అవకాశముంది" అని అశ్విన్ పేర్కొన్నాడు.చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన అశ్విన్.. ప్రపంచంలోనే క్రికెటర్గా -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో లోకల్ బాయ్, టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ క్రికెటర్లు విఫలమైన చోట.. అశ్విన్ విధ్వంసం సృష్టించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన అశ్విన్ తన విరోచిత పోరాటంతో జట్టును ఆదుకున్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఏడో వికెట్కు 195 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని అశూ నెలకొల్పాడు. ఈ క్రమంలో కేవలం 108 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్స్లతో తన సెంచరీ మార్క్ను ఈ స్పిన్ మాస్ట్రో అందుకున్నాడు.ప్రస్తుతం అశ్విన్ 102 పరుగులతో క్రీజులో ఆజేయంగా ఉన్నాడు. కాగా అశ్విన్కు ఇది ఆరో టెస్టు సెంచరీ. తద్వారా పలు అరుదైన రికార్డులను అశ్విన్ తన పేరిట లిఖించుకున్నాడు.అశ్విన్ సాధించిన రికార్డులు ఇవే..అశ్విన్ తన టెస్టు కెరీర్లో ఫిఫ్టీ ప్లస్ స్కోర్ సాధించడం ఇది 20వ సారి కావడం గమనార్హం. దీంతో వరల్డ్ టెస్టు క్రికెట్ హిస్టరీలోనే 20కి పైగా ఫిప్టీ ప్లస్ స్కోర్లు, 30కి పైగా ఫైవ్ వికెట్ల హాల్స్ సాధించిన తొలి క్రికెటర్గా అశ్విన్ నిలిచాడు. అశ్విన్ టెస్టుల్లో ఇప్పటివరకు 36 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు.ఈ క్రమంలోనే ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో అశ్విన్ వేసుకున్నాడు. కాగా అశ్విన్ తర్వాతి స్దానంలో న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం రిచర్డ్ హ్యాడ్లీ ఉన్నాడు. 17 పైగా 50+ స్కోర్లు, 30 కంటే ఎక్కువ ఫైవ్ వికెట్ల హాల్స్ అతడి పేరిట ఉన్నాయి. ⇒అదే విధంగా ఒకే వేదికలో రెండు టెస్టు సెంచరీలతో పాటు అత్యధిక ఫైవ్ వికెట్ల హాల్స్ సాధించిన క్రికెటర్గా అశ్విన్ రికార్డులకెక్కాడు. అశ్విన్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రెండు సెంచరీలతో పాటు 4 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు.ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం ఇయాన్ బోథమ్ పేరిట ఉండేది. బోథమ్ లీడ్స్లో రెండు సెంచరీలతో పాటు 3 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. తాజా మ్యాచ్తో బోథమ్ ఆల్టైమ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. -
అశూ, జడ్డూ అదుర్స్.. తొలి రోజు మనదే
చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత్ పైచేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటకి ఆల్రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అద్భుత పోరాట పటిమ కనబరిచారు. కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో సమయంలో వీరిద్దరూ తమ వీరోచిత ఇన్నింగ్స్లతో ఆదుకున్నారు. అప్పటివరకు నిప్పులు చేరిగిన బంగ్లా పేసర్లపై ఈ స్టార్ ఆల్రౌండర్లు ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో వీరిద్దరూ ఏడో వికెట్కు 195 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో రవిచంద్రన్ అశ్విన్ (102 నాటౌట్; 112 బంతుల్లో 10×4, 2×6), రవీంద్ర జడేజా (86 నాటౌట్; 117 బంతుల్లో 10×4,2×6) ఉన్నారు. ఈ సీనియర్ క్రికెటర్లతో పాటు యశస్వీ జైశ్వాల్(56) హాఫ్ సెంచరీతో రాణించాడు.నిప్పులు చేరిగిన హసన్ మహమూద్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు తొలి సెషన్లో బంగ్లా పేసర్ హసన్ మహమూద్ చుక్కలు చూపించాడు. ఆరంభంలోనే రోహిత్ శర్మ, కోహ్లి, గిల్ వికెట్లను పడగొట్టి భారత్ను కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ను కూడా పెవిలియన్కు పంపాడు. ఓవరాల్గా తొలి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 18 ఓవర్లు బౌలింగ్ చేసిన హసన్.. 58 పరుగులిచ్చి 4 వికెట్లు సాధించాడు. -
చెపాక్లో చితక్కొట్టుడు.. అశ్విన్ సూపర్ సెంచరీ
చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తన సొంతమైదానంలో బంగ్లా బౌలర్లను అశ్విన్ ఊచకోత కోశాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన అశూ.. అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.అశ్విన్ తన బ్యాటింగ్ శైలికి భిన్నంగా దూకుడుగా ఆడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. అప్పటివరకు భారత్కు చుక్కలు చూపించిన బంగ్లా పేసర్లపై అశ్విన్ ఎదురుదాడికి దిగాడు. మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టుస్తున్నాడు.ఈ క్రమంలో కేవలం 108 బంతుల్లోనే తన ఆరో టెస్టు సెంచరీని అశూ అందుకున్నాడు. అశ్విన్ 112 బంతుల్లో 102 పరుగులు చేసి క్రీజులో ఆజేయంగా ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 10 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి.భారీ స్కోర్ దిశగా భారత్.. తొలి టెస్టులో భారీ స్కోరు దిశగా భారత్ అడుగులు వేస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రీజులో అశ్విన్తో పాటు జడేజా(86) పరుగులతో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 4 వికెట్లు పడగొట్టగా.. నహిద్ రానా, మెహదీ హసన్ మీరజ్ తలా రెండు వికెట్లు సాధించారు. Hometown Hundred for Ravichandran Ashwin! 💯 👌#INDvBAN #JioCinema #IDFCFirstBankTestSeries pic.twitter.com/i27n47VK1v— JioCinema (@JioCinema) September 19, 2024 -
38వ పడిలోకి స్పిన్ మాంత్రికుడు.. హ్యాపీ బర్త్ డే అశ్విన్
టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ ఇవాళ (సెప్టెంబర్ 17) 38వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అశ్విన్ కెరీర్లోని ముఖ్యాంశాలపై ఓ లుక్కేద్దాం. 1986 సెప్టెంబర్ 17న మద్రాస్లో జన్మించిన యాశ్.. 2010లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున అశ్విన్ కెరీర్ వన్డేలతో మొదలైంది. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్తో పాటు లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ అయిన అశ్విన్.. భారత్ తరఫున 100 టెస్ట్లు (516 టెస్ట్ వికెట్లు), 116 వన్డేలు (156 వన్డే వికెట్లు), 65 టీ20లు (72 టీ20 వికెట్లు) ఆడాడు. అశ్విన్ ఖాతాలో 5 టెస్ట్ సెంచరీలు, 14 టెస్ట్ హాఫ్ సెంచరీలు, ఓ వన్డే హాఫ్ సెంచరీ ఉంది. అశ్విన్ కెరీర్లో 36 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించాడు.అశ్విన్ కెరీర్లో ముఖ్యాంశాలు..భారత్ తరఫున టెస్ట్ల్లో రెండో అత్యధిక వికెట్లు (516). భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో రెండో అత్యధిక వికెట్లు (744).భారత్ తరఫున బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో (ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్) అత్యధిక వికెట్లు. భారత్ తరఫున వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక వికెట్లు.భారత్ తరఫున టెస్ట్ల్లో వేగవంతమైన 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450, 500 వికెట్లు.వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, ఐపీఎల్, విజేత. కాగా, సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో జరుగబోయే టెస్ట్ సిరీస్లో అశ్విన్ పాల్గొననున్నాడు. ఈ సిరీస్లో యాశ్ 14 వికెట్లు పడగొడితే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక వికెట్ల వీరుడిగా.. 26 వికెట్లు సాధిస్తే డబ్ల్యూటీసీలో 200 వికెట్ల మార్కును తాకిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం అశ్విన్ డబ్ల్యూటీసీలో మూడో హైయ్యెస్ట్ వికెట్ టేకర్గా (35 మ్యాచ్ల్లో 174 వికెట్లు) ఉన్నాడు. ఓవరాల్గా టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ముత్తయ్య మురళీథరన్ (800) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), ఆండర్సన్ (704), కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్గ్రాత్ (563) టాప్-6లో ఉన్నారు.తొలి టెస్ట్కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: బంగ్లాదేశ్తో తొలి టెస్ట్.. తుది జట్టులో ఉండనున్న ముగ్గురు స్పిన్నర్లు వీరే..! -
బంగ్లాదేశ్తో తొలి టెస్ట్.. తుది జట్టులో ఉండనున్న ముగ్గురు స్పిన్నర్లు వీరే..!
భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కఠోర సాధనలో నిమగ్నమై ఉన్నాయి. బంగ్లాదేశ్తో పోలిస్తే భారత్ ఇంకాస్త ఎక్కువగా శ్రమిస్తుంది. టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడి చాన్నాళ్లు కావడంతో ఈ ఫార్మాట్కు అలవాటు పడేందుకు చెమటోడుస్తుంది. సెప్టెంబర్ 13 నుంచే చెన్నైలో భారత శిక్షణా శిబిరం మొదలైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత ఆటగాళ్లు లయను అందుకున్నారు. భారత ఆటగాళ్ల ప్రాక్టీస్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.మ్యాచ్ ప్రారంభానికి మరో రెండు రోజులే ఉండటంతో భారత తుది జట్టు కూర్పుపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. తుది జట్టులో వారుండబోతున్నారు.. వీరుండబోతున్నారంటూ సోషల్మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భారత మేనేజ్మెంట్ నుంచి మాత్రం తుది జట్టు విషయమై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే పీటీఐ నుంచి వస్తున్న సమాచారం మేరకు బంగ్లాతో తొలి టెస్ట్లో భారత స్పిన్ విభాగం ఖరారైనట్లు తెలుస్తుంది. తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఉండనున్నారని సమాచారం. అక్షర్ పటేల్ బెంచ్కే పరిమితం కానున్నట్లు తెలుస్తుంది.మరోవైపు బ్యాటింగ్ విభాగంలో ఓ బెర్త్ మినహా బెర్త్లు అన్నింటి విషయమై క్లారిటీ ఉంది. ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్, వన్డౌన్లో శుభ్మన్ గిల్, నాలుగో స్థానంలో విరాట్ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. ఐదో స్థానం కోసం కేఎస్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ పోటీ పడుతున్నప్పటికీ.. రాహుల్కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. వికెట్ కీపర్ కోటాలో రిషబ్ పంత్ ఆడటం దాదాపుగా ఖాయమైంది. ఆతర్వాతి స్థానాల్లో జడేజా, అశ్విన్, కుల్దీప్ అనుకుంటే తొమ్మిది బెర్త్లు ఖరారైపోయినట్లే. ఇక మిగిలింది పేస్ విభాగం. ఈ కేటగిరీలో బుమ్రా స్థానం ఖరారు కాగా.. మరో పేసర్ కోటాలో అనుభవజ్ఞుడు సిరాజ్కు ఛాన్స్ ఇస్తారా లేక ఆకాశ్దీప్, యశ్ దయాల్లలో ఎవరో ఒకరివైపు మొగ్గు చూపుతారా అన్నది వేచి చూడాల్సి ఉంది.బంగ్లాతో తొలి టెస్ట్కు భారత తుది జట్టు (అంచనా)..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్చదవండి: ముమ్మర సాధనలో... -
కోహ్లి, రోహిత్ కాదు!.. ఆ షాట్లు ఆడటంలో వాళ్లే బెస్ట్: అశ్విన్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. దాదాపు ఆరునెలల తర్వాత మళ్లీ భారత జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో పాల్గొననున్నాడు. ఇందుకోసం ఇప్పటికే చెన్నై వేదికగా టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ దిగ్గజ స్పిన్నర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు.ఈ సందర్భంగా హోస్ట్ విమల్ కుమార్ అడిగిన ప్రశ్నలకు అశూ ఇచ్చిన సమాధానాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన దృష్టిలో.. బెస్ట్ కవర్ డ్రైవ్ షాట్ ఆడేది వీరేనంటూ ఇద్దరు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ల పేర్లు చెప్పాడు అశూ. అదే విధంగా.. పుల్ షాట్ అత్యుత్తమంగా ఆడేది ఇతడేనంటూ ఆస్ట్రేలియా దిగ్గజం పేరును ప్రస్తావించాడు. ఇంతకీ వారెవరంటారా?కోహ్లి, రోహిత్ కాదు!కాగా ఆధునిక తరం క్రికెటర్లలో కవర్ డ్రైవ్ షాట్ ఆడటంలో టీమిండియా రన్మెషీన్ విరాట్ కోహ్లి, పాకిస్తాన్ మేటి బ్యాటర్ బాబర్ ఆజం ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే, మాజీ క్రికెటర్లలో డేవిడ్ గోవర్, మార్క్ వా, మైకేల్ వాన్, సౌరవ్ గంగూలీ, మార్కస్ ట్రెస్కోతిక్ కూడా షాట్తో ప్రసిద్ధి చెందినవారే. అయితే, అశ్విన్ వీరిలో కోహ్లిని కాదని మార్కస్ ట్రెస్కోతిక్, మైకేల్ వాన్లకు ఓటేశాడు.అతడి కవర్ డ్రైవ్లే ఇష్టం.. పుల్ షాట్లు ఆడటంలో అతడు బెస్ట్‘‘మార్కస్ ట్రెస్కోతిక్ అంటే ఇప్పటి యువతలో చాలా మందికి తెలియకపోవచ్చు. నాకైతే అందరికంటే అతడి కవర్ డ్రైవ్లే ఎక్కువగా నచ్చుతాయి. ఇక మైకేల్ వాన్ కూడా.. అద్భుతంగా ఈ షాట్లు ఆడగలడు’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక పుల్ షాట్లు ఆడటంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్కు ఎవరూ సాటిరారని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుల్ షాట్లు సూపర్గా ఆడతాడన్న విషయం తెలిసిందే.ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పిల్లర్లుగాఇలా.. అభిమానులు ఊహించినట్లుగా కోహ్లి, రోహిత్ పేర్లు చెప్పకుండా అశూ.. విదేశీ బ్యాటర్ల పేర్లు చెప్పి ఒకరకంగా వారికి షాకిచ్చాడు. కాగా మార్కస్ ట్రెస్కోతిక్- మైకేల్ వాన్ తమ ఆట తీరుతో.. 2000 నాటి తొలినాళ్లలో ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగానికి రెండు పిల్లర్ల మాదిరి నిలబడ్డారు. ట్రెస్కోతిక్ ఇంగ్లండ్ తరఫున 76 టెస్టులు ఆడి సగటు 43.79తో 5825 పరుగులు సాధించాడు. ఇందులో 14 శతకాలు ఉన్నాయి. మరోవైపు.. మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ 82 టెస్టుల్లో 5719 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో 18 సెంచరీలు ఉన్నాయి.చివరగా ఇంగ్లండ్తో..టీమిండియా తరఫున అశ్విన్ చివరగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో ఆడాడు. స్వదేశంలో మార్చిలో ముగిసిన ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ సందర్భంగానే అశూ.. టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్లో చేరాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో టెస్టుల్లో 516, వన్డేల్లో 156, టీ20లలో 72 వికెట్లు ఉన్నాయి. టెస్టుల్లో ఘనమైన రికార్డు ఉన్న ఈ స్పిన్ బౌలింగ్ ఐదు శతకాలు కూడా బాదడం విశేషం.చదవండి: కోహ్లిని చూసి నేర్చుకో బాబర్.. లేకుంటే కష్టమే: యూనిస్ ఖాన్ -
బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్.. అశ్విన్ ముందు ప్రపంచ రికార్డు
త్వరలో బంగ్లాదేశ్తో జరుగబోయే టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తుంది. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో అశ్విన్ 14 వికెట్లు పడగొడితే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్నాడు. లియోన్ డబ్ల్యూటీసీలో 43 మ్యాచ్లు ఆడి 187 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్.. 35 మ్యాచ్ల్లో 174 వికెట్లు తీసి మూడో హైయ్యెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో (42 మ్యాచ్ల్లో 175 వికెట్లు) ఉన్నాడు. బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్లో అశ్విన్ 26 వికెట్లు సాధిస్తే.. డబ్ల్యూటీసీలో 200 వికెట్ల మార్కును తాకిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టిస్తాడు. బంగ్లాతో టెస్ట్ సిరీస్లో అశ్విన్ 14 వికెట్లు తీస్తే అత్యధిక వికెట్లు సాధించిన టెస్ట్ బౌలర్ల జాబితాలో లియోన్తో సమానంగా ఏడో స్థానంలో నిలుస్తాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (800) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), ఆండర్సన్ (704), కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్గ్రాత్ (563) టాప్-6లో ఉన్నారు. ఈ జాబితాలో అశ్విన్ (516) ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.కాగా, బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ చెన్నై వేదికగా.. రెండో మ్యాచ్ కాన్పూర్ వేదికగా (సెప్టెంబర్ 27 నుంచి) జరుగనున్నాయి. టెస్ట్ సిరీస్ అనంతరం భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి.తొలి టెస్ట్కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: ట్రిపుల్ సెంచరీకి చేరువలో కుల్దీప్ -
నేను చూసిన బెస్ట్ క్రికెటర్ అతడే: టీమిండియా స్టార్
రవీంద్ర జడేజా అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ అని టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించాడు. జడ్డూ ఆటతీరు తనకెంతో ఇష్టమని తెలిపాడు. కలిసి పనిచేయడానికి ఆరంభంలో కాస్త తడబడ్డామని.. అయితే ప్రస్తుతం తమ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని అశూ అన్నాడు.సొంతగడ్డపై అశ్విన్కు తిరుగులేదన్న విషయం తెలిసిందే. స్పిన్కు అనుకూలించే ఉపఖండ పిచ్లపై టెస్టు సిరీస్లు ఉంటే.. అశూకు తప్పక తుదిజట్టులో చోటు దక్కుతుంది. అయితే, టీమిండియా విదేశీ పర్యటనలో ఉన్నపుడు మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. అశూను కాదని స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు పెద్దపీట వేస్తారు సెలక్టర్లు.విదేశాల్లో ఎక్కువగా బౌన్సీ పిచ్లే ఉంటాయి కాబట్టి సహజంగానే ఫాస్ట్ బౌలర్లకు ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి చోట స్పెషలిస్టు స్పిన్నర్ కంటే కూడా ఆల్రౌండర్ వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపుతుంది. ఫలితంగా అశూను వెనక్కినెట్టి జడ్డూ ఇప్పటికే ఎన్నో సిరీస్లలో భాగమయ్యాడు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అశ్విన్కు జడేజా గురించి ప్రశ్న ఎదురైంది.అసూయ, ద్వేషం లేవుజడ్డూపై అసూయ పడుతారా అన్న హోస్ట్ విమల్ కుమార్కు బదులిస్తూ.. ‘‘నాకు అవకాశం రాకపోవడంలో జడేజా తప్పేముంది? నాకు అతడిపై అసలు ఎలాంటి అసూయ, ద్వేషం లేవు. నా కోసం అతడిని జట్టు నుంచి తప్పించాలని.. నేనే మ్యాచ్లు ఆడాలని అస్సలు ఆలోచించను. ప్రతిఒక్కరు ఈర్ష్యను అధిగమిస్తేనే సంతోషంగా ముందుకు వెళ్లగలరునేను చూసిన మోస్ట్ టాలెంటెడ్ క్రికెటర్ జడేజా. అతడి ఆట సహజంగా ఉంటుంది. కలిసి ఆడిన తొలినాళ్లలో కాస్త ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. అయితే, ఇప్పుడు మా మధ్య ఆట పరంగా మంచి అనుబంధం, సమన్వయం ఉంది’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.కాగా టీమిండియా సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్తో స్వదేశంలో సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో అశ్విన్తో పాటు జడ్డూకూ చోటు దక్కే అవకాశం ఉంది. ఇక చెన్నై ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 100 టెస్టులు పూర్తి చేసుకుని 516 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. సౌరాష్ట్ర స్టార్ జడ్డూ.. 72 టెస్టులు ఆడి 294 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. -
అశ్విన్ దృష్టిలో బెస్ట్ ఐపీఎల్ టీం ఏది?
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఆల్టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవెన్ను ప్రకటించాడు. ఈ జట్టుకు కెప్టెన్ కమ్ వికెట్కీపర్గా ఎంఎస్ ధోనిని ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. వన్డౌన్లో సురేశ్ రైనా, నాలుగో స్థానం కోసం సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేశాడు. ఐదో స్థానంలో ఏబీ డివిలియర్స్, ఆరో స్థానంలో ధోని, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా సునీల్ నరైన్, రషీద్ ఖాన్, పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా పేర్లను ప్రకటించాడు.అశ్విన్ తన ఆల్టైమ్ ఫేవరెట్ ఐపీఎల్ జట్టులో విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్కు చోటు కల్పించకపోవడం ఆసక్తికరం. అశ్విన్ తన జట్టులో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లను కూడా ఎంపిక చేయలేదు. భారత జట్టు మాజీ ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్కు చెందిన యూట్యూబ్ (చీకీ చీకా) ఛానల్తో మాట్లాడుతూ అశ్విన్ ఈ విషయాలను వెల్లడించాడు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటం లేదు. ఆయా రాష్ట్రాల్లో లోకల్ టోర్నీలు జరుగుతున్నాయి. త్వరలో దులీప్ ట్రోఫీ మొదలుకానుంది. అనంతరం బంగ్లాదేశ్ భారత్లో పర్యటిస్తుంది. ఆటగాళ్లంతా కచ్చితంగా దులీప్ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ప్రదర్శనల ఆధారంగానే బంగ్లా సిరీస్కు జట్టు ఎంపిక జరుగవచ్చు. ఏది ఎలా ఉన్నా అశ్విన్ మాత్రం భారత టెస్ట్ జట్టులో తప్పక ఉంటాడు. -
‘రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్తోనే ఉంటాడు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలం నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హిట్మ్యాన్ ముంబై ఇండియన్స్ను వీడతాడా? లేదంటే అదే ఫ్రాంఛైజీతో కొనసాగుతాడా? అంటూ క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో అభిమానులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ రోహిత్ ముంబై జట్టుతో బంధం తెంచుకుంటాడని గట్టిగా వాదిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తన పూర్వపు జట్టుతోనే ప్రయాణం కొనసాగిస్తాడని అంచనా వేశాడు. ఒక దశకు చేరుకున్న తర్వాత.. రోహిత్ వంటి ఆటగాళ్లు డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వరంటూ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. ఈ మేరకు యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ రోహిత్ ఇలా ఆలోచిస్తే తప్పేం ఉంది?నేను సంతోషంగా ఈ జట్టుతోనే ఉంటాను అనుకుంటే..‘నాకు కొత్తగా ఎలాంటి తలనొప్పులు వద్దు. నేను టీమిండియా కెప్టెన్గా ఉన్నాను. ముంబై ఇండియన్స్ జట్టుకు ఎన్నో ఏళ్లు సారథ్యం వహించాను. ఒకవేళ ఇప్పుడు నేను కెప్టెన్ కాకపోయినంతమాత్రాన ఏం మారుతుంది? నేను సంతోషంగా ఈ జట్టుతోనే ఉంటాను’ అని రోహిత్ భావించవచ్చు. తారస్థాయికి చేరిన తర్వాత కొంతమందికి డబ్బుకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.రోహిత్ను తప్పించి.. హార్దిక్కు పగ్గాలుకాగా ముంబై ఇండియన్స్ను ఏకంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన ఘనత రోహిత్ శర్మది. 2011లో ముంబై ఇండియన్స్లో చేరిన ఈ ముంబై బ్యాటర్.. 2013లో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. 2023 వరకు సారథిగా కొనసాగాడు. అయితే, ఈ ఏడాది వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్.. రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతడి స్థానంలో హార్దిక్కు పగ్గాలు అప్పగించింది.ఈ నేపథ్యంలో రోహిత్కు- ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి విభేదాలు వచ్చాయని.. అతడు వచ్చే ఏడాది జట్టును వీడబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో అశూ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గెలవాలన్న దాహం తీరదుఅయితే, ఇటీవల క్రీడా పురస్కారాల వేడుకకు హాజరైన రోహిత్ శర్మ.. తనలో ట్రోఫీలు గెలవాలనే దాహం ఇంకా తీరలేదన్నాడు.. ఒక్కసారి గెలుపు రుచి చూసిన వాళ్లు అంత తేలికగా సవాళ్లకు తలొగ్గరని.. ముందుకు సాగుతూనే ఉంటారని పేర్కొన్నాడు. కాగా ఐదు ఐపీఎల్ టైటిల్స్తో పాటు టీ20 ప్రపంచకప్(2024) ట్రోఫీ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు హిట్మ్యాన్.చదవండి: టీమిండియా పాకిస్తాన్కు రాబోతోంది.. జై షానే కారణం: పాక్ మాజీ కెప్టెన్ -
‘రోహిత్ 59 శాతం.. విరాట్ 61 శాతం.. అయినా ఎందుకిలా?’
టీమిండియా సీనియర్లు దులిప్ ట్రోఫీ టోర్నీలో పాల్గొనాల్సిందని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. వారికి ఇప్పటికే కావాల్సినంత విశ్రాంతి దొరికిందని.. అయినా ఈ దేశవాళీ టోర్నమెంట్కు దూరంగా ఉండటం ఏమిటని ప్రశ్నించాడు. యువ క్రికెటర్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్మెషీన్ విరాట్ కోహ్లి, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఇందులో ఆడితే బాగుండేదని పేర్కొన్నాడు.ఆ నలుగురు దూరంకాగా బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు ముందు భారత క్రికెటర్లకు దులిప్ ట్రోఫీ రూపంలో కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. రోహిత్, కోహ్లి, అశూ, బుమ్రా మినహా టీమిండియాలోని దాదాపు అందరు ఆటగాళ్లు ఈ రెడ్బాల్ టోర్నీ బరిలో దిగనున్నారు. అయితే, పేసర్ మహ్మద్ సిరాజ్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, యువ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఆఖరి నిమిషంలో తప్పుకోగా.. సిరాజ్, ఉమ్రాన్ స్థానాలను నవదీప్ సైనీ, గౌరవ్ యాదవ్తో భర్తీ చేస్తున్నట్లు బీసీసీఐ మంగళవారమే ప్రకటించింది.ఐదేళ్లలో 249 మ్యాచ్లు.. వీరు ఆడింది మాత్రంఈ నేపథ్యంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఎక్స్ వేదికగా సీనియర్ల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘గత ఐదేళ్లలో టీమిండియా 249 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. వీటిలో రోహిత్ కేవలం 59 శాతం, విరాట్ 61 శాతం, బుమ్రా 34 శాతం మ్యాచ్లు మాత్రమే ఆడారు. వీళ్లకు దొరికినంత విశ్రాంతి మరే ఇతర భారత క్రికెటర్లకు దొరలేదన్నది నా అభిప్రాయం. వీరిని దులిప్ ట్రోఫీకి ఎంపిక చేయాల్సింది’’ అని పేర్కొన్నాడు. కనీసం ఫస్ట్రౌండ్లోనైనా ఈ మేటి క్రికెటర్లు పాల్గొనాల్సిందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.వరుస టెస్టు సిరీస్లుకాగా సెప్టెంబరు 5 నుంచి దులిప్ ట్రోఫీ 2024-25 ఎడిషన్ ఆరంభం కానుంది. అనంతపురం, బెంగళూరులలో ఈ టోర్నీ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఇక శ్రీలంక పర్యటన తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం సెప్టెంబరు 19 నుంచి టీమిండియా మళ్లీ బిజీకానుంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. తొలి టెస్టుకు చెన్నై, రెండో టెస్టుకు కాన్పూర్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆ తర్వాత బెంగళూరు, పుణె, ముంబై వేదికగా భారత్ న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. అనంతరం నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనున్న టీమిండియా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్లు భారత్కు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలోనే సీనియర్లకు విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది.చదవండి: Duleep Trophy: ఆ ముగ్గురు స్టార్లు దూరం.. బీసీసీఐ ప్రకటనIndia has played 249 international matches in the last 5 years. Rohit has played only 59% of those. Virat 61 % & Bumrah 34%. I see them as well rested India players. Could have been selected for the Duleep trophy.— Sanjay Manjrekar (@sanjaymanjrekar) August 28, 2024 -
'కౌన్ బనేగా కరోడ్పతి'లో క్రికెటర్కు సంబంధించిన ప్రశ్న
ప్రముఖ బాలీవడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్పతి షోలో టీమిండియా క్రికెటర్కు సంబంధించిన ఓ ప్రశ్న వచ్చింది. తాజాగా జరిగిన ఎడిసోడ్లో బెంగళూరుకు చెందిన ప్రియాంక పోర్వాల్ అనే కంటెస్టెంట్ 80,000 రూపాయలకు ఈ ప్రశ్నను ఎదుర్కొంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. చెన్నైలో పుట్టిన ఏ టీమిండియా క్రికెటర్ 'కుట్టి స్టోరీస్' అనే టాక్ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తాడు..?A cricket question in KBC. pic.twitter.com/X7hwjhNBVC— Mufaddal Vohra (@mufaddal_vohra) August 26, 2024ఈ ప్రశ్నకు అమితాబ్ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో మొదటిది దినేశ్ కార్తీక్ కాగా.. రెండోది రవిచంద్రన్ అశ్విన్.. మూడవది వాషింగ్టన్ సుందర్, నాలుగవది సంజూ శాంసన్. పై నాలుగింటిలో కంటెస్టెంట్ ప్రియాంక ఓ సమాధానాన్ని ఎంచుకోవాల్సి ఉండింది. అయితే సమాధానంపై సరైన అవగాహణ లేని ప్రియాంక ఆడియన్స్ పోల్కు వెళ్లి, ఆప్షన్-బి రవిచంద్రన్ అశ్విన్ అని చూస్ చేసుకుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ కావడంతో ఆమె తదుపరి ప్రశ్నకు అర్హత సాధించింది. అయితే 1,60,000 ప్రశ్నకు ఆమె ఆన్సర్ చెప్పలేకపోవడంతో ఆమె 80,000తోనే గేమ్ను వదిలేసింది.కాగా, కేబీసీలో ఇలా క్రికెట్కు, క్రికెటర్లకు సంబంధించిన ప్రశ్నలు రావడం ఇటీవలికాలంలో తరుచూ జరుగుతుంది. కంటెస్టెంట్లకు అన్ని అంశాల్లో అవగాహణ ఉందో లేదో తెలుసుకునేందుకు నిర్వహకులు ఇలాంటి ప్రశ్నలను సంధిస్తుంటారు.ఇదిలా ఉంటే, టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్లు లేకపోవడంతో లోకల్ క్రికెట్లో పాల్గొంటున్నాడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ రెండు టెస్ట్లు, మూడు వన్డేల సిరీస్ల కోసం భారత్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లలో అశ్విన్ టెస్ట్లకు ఎంపికయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అశ్విన్ 100 టెస్ట్లు ఆడి 516 వికెట్లు పడగొట్టాడు. -
కుల్దీప్ కాదు!.. టీమిండియాలో అశ్విన్ వారసుడు ఇతడే: డీకే
ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటివరకు 100 టెస్టులు ఆడిన ఈ చెన్నై స్టార్ 516 వికెట్లు తన ఖతాలో వేసుకున్నాడు. తద్వారా అనిల్ కుంబ్లే తర్వాత భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలర్గా అశూ కొనసాగుతున్నాడు.ఇక అశ్విన్ తదుపరి సొంతగడ్డ వేదికగా బంగ్లాదేశ్ టెస్టు సిరీస్కు సన్నద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. 37 ఏళ్ల ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్కు సరైన వారసుడు ఇతడేనంటూ టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా మరో చెన్నై స్టార్కే ఉందని అభిప్రాయపడ్డాడు.కుల్దీప్ కాదు!ఇప్పటికే జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్న చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను కాదని.. వాషింగ్టన్ సుందర్ పేరును చెప్పాడు డీకే. ఈ మేరకు క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘కొత్త తరం ఆఫ్ స్పిన్నర్ కోసం టీమిండియా వెదుకుతోంది. ఇంగ్లండ్ లయన్స్తో ఇండియా-ఏ సిరీస్ సందర్భంగా మూడు మ్యాచ్లలో ముగ్గురు వేర్వేరు స్పిన్నర్లను బరిలోకి దించడమే ఇందుకు నిదర్శనం.పుల్కిత్ నారంగ్, వాషింగ్టన్ సుందర్, సారాంశ్ జైన్లను ఈ సిరీస్ సందర్భంగా పరీక్షించింది. వీరిలో రవిచంద్రన్ అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయగల నైపుణ్యం వాషింగ్టన్ సుందర్కే ఉంది. అశూ వారసుల పోటీలో అతడే ముందుంటానడంలో సందేహం లేదు. తనకు లభించిన కొద్దిపాటి అవకాశాలను కూడా వాషీ సద్వినియోగం చేసుకున్నాడు.అతడే సరైన వాడు.. ఎందుకంటే?అందుకే.. అశూ స్థానంలో అతడే సరైన వాడని చెప్పగలను’’ అంటూ దినేశ్ కార్తిక్ వాషీ పేరు చెప్పడానికి గల కారణాన్ని వెల్లడించాడు. కాగా 2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన వాషింగ్టన్ సుందర్ లెఫ్టాండ్ బ్యాటర్.. అదే విధంగా రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. 24 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 4 టెస్టులు, 22 వన్డేలు, 49 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 6, 23, 44 వికెట్లు తీశాడు. చివరగా శ్రీలంకతో వన్డే సిరీస్లో పాల్గొన్నాడు వాషీ. -
కోచ్లపై అతిగా ఆధారపడొద్దు: రవిచంద్రన్ అశ్విన్
కెరీర్లో ఎదగాలంటే సొంత బలాలు, బలహీనతలపై దృష్టి పెట్టాలని... ప్రతీదానికి కోచ్లను ఆశ్రయించే పనికి స్వస్తి చెప్పాలని భారత సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. అలా చేయడం వల్ల యువ ఆటగాళ్లు కొత్తగా ఆలోచించడం మానేసి ఒక్క చోటనే ఆగిపోతారని అతను అభిప్రాయపడ్డాడు.అవతలి వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో నేర్చుకునే సాకుతో ‘అతుక్కుపోయే’ గుణం తనకు ఏమాత్రం నచ్చదని అశ్విన్ వ్యాఖ్యానించాడు. 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి 744 వికెట్లు తీసిన అశ్విన్ పరిస్థితులకు తగినట్లుగా ఎప్పటికప్పుడు తన ఆటను మార్చుకోవడంలో అందరికంటే ముందుంటాడు.‘చాలా మంది ఆటగాళ్లు కోచ్లు, మెంటార్లపై లేదా తమకు తెలిసిన ఎవరైనా మరో వ్యక్తిపై అతిగా ఆధారపడుతున్నారు. నా దృష్టిలో ఇది ప్రమాదకర సంప్రదాయం. ఎందుకంటే ఇలా ఇతరులను నమ్ముకునే వారు కొత్తగా ఆలోచించడం మరచిపోతారు’ అని అశ్విన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.కోచ్లు శిక్షణ ఇచ్చే కోణంలో కూడా ఇది చేటు చేస్తుందని అతను చెప్పాడు. ‘సాధారణంగా అందరు కోచ్లు నీకేదైనా సమస్య ఉంటే దానికి పలు విధాలుగా పరిష్కారం చెప్పేందుకు ప్రయత్నిస్తారు.అయితే ఒక ఆటగాడికి పని చేసిన సూత్రం మరో ఆటగాడి విషయంలో పని చేయదు. కానీ నేటి ఆధునిక తరహా కోచింగ్లో ఎవరూ దీనిని పట్టించుకోవడం లేదు. సందేహాలు ఉంటే రెండో వ్యక్తి వద్ద సలహా తీసుకోవడంలో తప్పు లేదు. కానీ నీ ఆటపై నీకు అవగాహన లేకుంటే, నీ లోపాలు నీవే గుర్తించలేకపోతే కష్టం. కోచ్ల వద్ద నేర్చుకునేవారు బాగుపడరని నేను చెప్పడం లేదు కానీ దీని వల్ల చాలా చోట్ల వెనుకబడిపోతారు’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. తన కెరీర్ ఆరంభంలో మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్ కోచ్గా ఉన్నా... తాను ఏ మార్గంలో వెళితే బాగుంటుందని చెప్పారే తప్ప ఫలానా తరహాలోనే ఉండాలని బలవంత పెట్టలేదని ఈ ఆఫ్స్పిన్నర్ అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. గౌతమ్ గంభీర్తో తనకు మంచి సాన్నిహిత్యం ఉందన్న అశ్విన్... అతనితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. చాలా సమయం పట్టింది! అశ్విన్ బౌలింగ్ అమ్ముల పొదిలో ‘దూస్రా’ కూడా ఒక పదునైన బలం. దీనిని సమర్థంగా వాడి అతను ఎన్నో వికెట్లు పడగొట్టాడు. అయితే దూస్రాను నేర్చుకునేందుకు చాలా సమయం పట్టిందని అశ్విన్ వెల్లడించాడు. లంక స్పిన్నర్ అజంతా మెండిస్ వేసిన దూస్రా బంతులను చూసి స్ఫూర్తి పొందానని... దాదాపు మూడేళ్ల పాటు సాధన చేసిన అనంతరం నమ్మకం కుదిరాకే దేశవాళీ క్రికెట్లో దానిని తొలిసారి ఉపయోగించానని అతను చెప్పాడు. మరోవైపు ఐపీఎల్ కారణంగా యువ ఆటగాళ్లకు, పేరు, డబ్బు రావడం మంచి పరిణామమే అయినా... అందరికీ భారత్ తరఫున ఆడాలనేది తొలి లక్ష్యం కావాలని అశ్విన్ సూచించాడు. -
టీమిండియా సూపర్స్టార్లలో అతడే బెస్ట్: ద్రవిడ్
టీమిండియా సీనియర్ క్రికెటర్ల గురించి మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టును ఐకమత్యంగా ఉంచడంలో వారు పెద్దన్న పాత్ర పోషిస్తారని కొనియాడాడు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మకు కలుపుగోలుతనం ఎక్కువని.. డ్రెస్సింగ్ రూం వాతావరణం ప్రశాంతంగా ఉండటానికి తనే ప్రధాన కారణం అని పేర్కొన్నాడు.ఇక రోహిత్ శర్మ మాదిరే మిగతా టీమిండియా సూపర్ స్టార్లు సైతం ఎంతో నిరాడంబరంగా ఉంటారని ద్రవిడ్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్, కెప్టెన్గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. వీరిద్దరి హయాంలో భారత జట్టు టీ20 ప్రపంచకప్-2022(సెమీస్), ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23 ఫైనల్, వన్డే వరల్డ్కప్-2023(ఫైనల్) ఆడింది.అయితే, ఈ ఐసీసీ టోర్నీల్లో విజేతగా నిలవలేకపోయింది. టీ20 ప్రపంచకప్-2024 ద్వారా ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలన్న ద్రవిడ్-రోహిత్ కల నెరవేరింది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా సాగిన ఈ టోర్నీలో టీమిండియా చాంపియన్గా నిలిచింది. ఫలితంగా కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిశాయి.ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచ్గా తన పని సులువు కావడానికి జట్టులోని సీనియర్లే కారణమని పేర్కొన్నాడు. ‘‘ఈ విజయానికి క్రెడిట్ నేనొక్కడినే తీసుకోలేను. ఈ జట్టును తీర్చిదిద్దిన కోచ్లు, సీనియర్లు, కెప్టెన్లు అందరికీ చెందుతుంది. రోహిత్తో కలిసి పని చేయడం నాకు దక్కిన గౌరవం.ఈ రెండున్నరేళ్లకాలంలో అతడిని దగ్గరిగా గమనించారు. అద్భుతమైన నాయకుడు. జట్టులోని ఆటగాళ్లంతా ఎల్లప్పుడూ అతడి వైపే ఉంటారు. అంతలా వారి అభిమానం చూరగొన్నాడు. చాలా మంది.. భారత క్రికెట్ సూపర్స్టార్లు ఇగో కలిగి ఉంటారని అనుకుంటారు. వారిని మేనేజ్ చేయడం కోచ్లకు కష్టం అనుకుంటారు.అయితే, ఇక్కడ అంతా రివర్స్ ఉంటుంది. సూపర్స్టార్లు అయినప్పటికీ వాళ్లెంతో నిరాడంబరంగా ఉంటారు. పూర్తిస్థాయిలో మ్యాచ్లకు సన్నద్ధమవుతారు. అందుకే వాళ్లు ఈరోజు సూపర్స్టార్లుగా క్రేజ్ సంపాదించారు. జట్టును ఒక్కటిగా ఉంచడంలో వారిదే కీలక పాత్ర. విరాట్ కోహ్లి, బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్.. వీళ్లంతా డ్రెసింగ్ రూంలో సానుకూల వాతావరణం ఉండేలా చూస్తారు’’ అని రాహుల్ ద్రవిడ్ స్టార్ స్పోర్ట్స్తో వ్యాఖ్యానించాడు. -
స్పెషలిస్ట్ బ్యాటర్గా మారిన అశ్విన్.. హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పెషలిస్ట్ బ్యాటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా మారాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్లో యాష్ బ్యాట్తో మెరుపు విన్యాసాలు చేశాడు. ఈ టోర్నీలో అశ్విన్ సారథ్యంలో దిండిగుల్ డ్రాగన్స్ ఛాంపియన్గా అవతరించింది. డ్రాగన్స్ ఛాంపియన్గా అవతరించడంలో అశ్విన్ ప్రధానపాత్ర పోషించాడు. అశ్విన్.. డ్రాగన్స్ విజయాల్లో బంతితో కాంట్రిబ్యూట్ చేశాడనుకుంటే పొరపాటే. అశ్విన్ తనలోని బ్యాటింగ్ నైపుణ్యాన్ని వెలికితీసి డ్రాగన్స్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. కీలకమైన ఎలిమినేటర్, క్వాలిఫయర్-1, ఫైనల్ మ్యాచ్ల్లో అశ్విన్ మెరుపు అర్దసెంచరీలు చేశాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో 35 బంతుల్లో 57 పరుగులు చేసిన యాష్.. క్వాలిఫయర్-2లో 30 బంతుల్లో అజేయమైన 69 పరుగులు.. ఫైనల్లో 46 బంతుల్లో 52 పరుగులు చేసి డ్రాగన్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.అశ్విన్ అంతర్జాతీయ వేదికపై కూడా పలు సందర్భాల్లో బ్యాట్తో విన్యాసాలు చేశాడు. టెస్ట్ల్లో అయితే యాష్ పేరిట ఐదు సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లోనూ అశ్విన్ పలు సందర్భాల్లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. 37 ఏళ్ల వయసులో అశ్విన్ అటతీరు చూసిన వారు ఔరా అంటున్నారు. అశ్విన్ బ్యాట్తో ఇదే తరహాలో రెచ్చిపోతే భారత టీ20 జట్టుకు ఎంపిక కావడం ఖాయమని అంటున్నారు. బ్యాట్తో రాణించాడని అశ్విన్ బౌలింగ్ను లైట్గా తీసుకోలేదు. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అతను బంతితోనూ రాణించాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో 4 ఓవర్లలో 33 పరుగులు.. క్వాలిఫయర్-2లో నాలుగో ఓవర్లలో 27 పరుగులు (ఒక వికెట్).. ఫైనల్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు.కాగా, తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఫైనల్లో దిండిగుల్ డ్రాగన్స్.. లైకా కోవై కింగ్స్పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో బ్యాట్తో, బంతితో సత్తా చాటిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగా.. డ్రాగన్స్ 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజేతగా అవతరించింది. -
చెలరేగిన టీమిండియా స్టార్.. ద్రవిడ్ చేతుల మీదుగా ట్రోఫీ
తమిళనాడు ప్రీమియర్ లీగ్-2024 సీజన్ విజేతగా దిండిగల్ డ్రాగన్స్ అవతరించింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్సీలో తమ తొలి టైటిల్ సాధించింది. నాయకుడిగా జట్టును ముందుకు నడిపిస్తూనే.. ఆద్యంతం ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న అశ్విన్ ఫైనల్లోనూ అద్భుత ప్రదర్శనతో డ్రాగన్స్కు ట్రోఫీ అందించాడు.జూలై 5న మొదలైన తమిళనాడు లీగ్ తాజా ఎడిషన్ ఆదివారం(ఆగష్టు 4)తో ముగిసింది. లైకా కోవై కింగ్స్, ట్రిచీ గ్రాండ్ చోళాస్, చెపాక్ సూపర్ గిల్లీస్, నెల్లై రాయల్ కింగ్స్, ఐడ్రీమ్ తిరుపూర్ తమిళన్స్, దిండిగల్ డ్రాగన్స్, సేలం స్పార్టన్స్, సీచం మధురై పాంథర్స్ తదితర జట్లు టైటిల్ కోసం పోటీపడ్డాయి.TNPL 2024-ன் மணிமகுடத்தில் தங்களோட பெயரை பதிய வெச்சுட்டாங்க Dindigul Dragons! 🏆🥳#TNPLOnStar #TNPL2024 #NammaOoruNammaGethu @TNPremierLeague pic.twitter.com/00yaGgqbHj— Star Sports Tamil (@StarSportsTamil) August 4, 2024 రాణించిన బౌలర్లు ఈ క్రమంలో లైకా కోవై కింగ్స్- దిండిగల్ డ్రాగన్స్ ఫైనల్ చేరగా.. ఇరు జట్ల మధ్య ఆదివారం రాత్రి మ్యాచ్ జరిగింది. చెపాక్ స్టేడియం వేదికగా టాస్ గెలిచిన దిండిగల్ తొలుత బౌలింగ్ చేసింది. లైకా జట్టును 129 పరుగులకు పరిమితం చేసింది. దిండిగల్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, పి.విఘ్నేశ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సబోత్ భాటీ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.లైకా ఇన్నింగ్స్లో రామ్ అర్వింద్ 27 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దిండిగల్కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు విమల్ కుమార్ 9, శివం సింగ్ 4 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యారు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు.అశూ హాఫ్ సెంచరీమరో ఎండ్ నుంచి వికెట్ కీపర్ బాబా అపరాజిత్(32) సహకారం అందించగా.. అశూ కెప్టెన్ ఇన్నింగ్స్తో సత్తా చాటాడు. 46 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో సి. శరత్ కుమార్ 27, భూపతి కుమార్ 3 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు.అర్ధ శతకంతో రాణించి జట్టును గెలిపించిన అశ్విన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన షారుఖ్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. టీమిండియా మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందించారు నిర్వాహకులు.ఇదే తొలి టైటిల్.. ద్రవిడ్ చేతుల మీదుగా ట్రోఫీకాగా తమిళనాడు ప్రీమియర్ లీగ్లో దిండిగల్ డ్రాగన్స్కు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్లో అశ్విన్ సిక్సర్ల వర్షం కురిపిస్తూ యాభై పరుగుల మార్కు అందుకోగానే.. అతడి భార్య ప్రీతి నారాయనణ్ చప్పట్లతో అభినందిస్తూ సందడి చేశారు. ప్రీతికి సంబంధించిన విజువల్స్ హైలైట్గా నిలిచాయి.తమిళనాడు ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్లో 37 ఏళ్ల అశ్విన్.. పది మ్యాచ్లలో కలిపి 252 పరుగులు సాధించడంతో పాటు తొమ్మిది వికెట్లు తీశాడు. కాగా ఈ టీ20 లీగ్ తర్వాత అశ్విన్ టీమిండియా సిరీస్లతో బిజీ కానున్నాడు. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో అతడు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.దిండిగల్ డ్రాగన్స్ వర్సెస్ లైకా కోవై కింగ్స్ స్కోర్లు👉లైకా కోవై కింగ్స్- 129/7 (20)👉దిండిగల్ డ్రాగన్స్ - 131/4 (18.2)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో కోవై కింగ్స్పై గెలిచిన దిండిగల్ డ్రాగన్స్.చదవండి: IND vs SL: 6 వికెట్లతో భారత్కు చుక్కలు చూపించాడు.. ఎవరీ జెఫ్రీ వాండర్సే?Ash அண்ணா! என்றென்றும் நீங்க Mass அண்ணா! 🤩👏📺 தொடர்ந்து காணுங்கள் TNPL | Final | Lyca Kovai Kings vs Dindigul Dragons | Star Sports தமிழில் மட்டும்#TNPLOnStar #TNPL2024 #NammaOoruNammaGethu @TNPremierLeague pic.twitter.com/A6Da3c74xx— Star Sports Tamil (@StarSportsTamil) August 4, 2024 -
రవిచంద్రన్ అశ్విన్ విధ్వంసం.. 11 ఫోర్లు, 3 సిక్స్లతో! వీడియో
తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టిఎన్పిఎల్)-2024లో దిండిగల్ డ్రాగన్స్ కెప్టెన్, టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజన్స్తో జరిగిన క్వాలిఫియర్-2లో అశ్విన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 109 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో ఓపెనర్గా వచ్చిన అశ్విన్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు.కేవలం 30 బంతులు ఎదుర్కొన్న అశ్విన్.. 11 ఫోర్లు, 3 సిక్స్లతో 69 పరుగులు చేశాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా స్వల్ప లక్ష్యాన్ని దిండిగల్ కేవలం 10.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి చేధించింది. అశ్విన్తో పాటు మరో ఓపెనర్ విమల్ కుమార్ 28 పరుగులతో రాణించాడు.తొలుత బ్యాటింగ్ చేసిన ఐడ్రీమ్ తిరుప్పూర్ జట్టు దిండిగల్ బౌలర్లు చెలరేగడంతో 108 పరుగులకే కుప్పకూలింది. తిరుప్పూర్ బ్యాటర్లలో మన్ భప్నా(26) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. దిండిగల్ బౌలర్లలో పి విగ్నేష్ 3 వికెట్లు పడగొట్టగా.. సుభాత్ భాటీ, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంతో దిండిగల్ డ్రాగన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో లైకా కోవై కింగ్స్తో దిండిగల్ డ్రాగన్స్ తలపడనుంది. Ravi Ashwin in the TNPL knockouts:Eliminator:57 (35) - won POTM award.Qualifier:69* (30) & 1/27 - won POTM award.- Ashwin, the All Rounder. 🥶pic.twitter.com/lQE48sJKnR— Mufaddal Vohra (@mufaddal_vohra) August 3, 2024 -
అశ్విన్ ఊచకోత.. సిక్సర్ల వర్షం! వీడియో వైరల్
తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టిఎన్పిఎల్)-2024లో దిండిగల్ డ్రాగన్స్ క్వాలిఫియర్-2కు ఆర్హత సాధించింది. దిండిగల్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో చెపాక్ సూపర్ గిల్స్పై 4 వికెట్ల తేడాతో డ్రాగన్స్ విజయం సాధించింది. ఈ విజయంలో ఆ జట్టు కెప్టెన్, భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. తొలుత బౌలింగ్లో విఫలమైన అశ్విన్.. బ్యాటింగ్లో మాత్రం దుమ్ములేపాడు. 159 పరుగుల లక్ష్య చేధనలో అశ్విన్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కళ్లు చెదిరే షాట్లను అశ్విన్ ఆడాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన అశ్విన్.. ఓపెనర్ శివమ్ సింగ్తో కలిసి 112 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవరాల్గా 35 బంతులు ఎదుర్కొన్న అశ్విన్.. 4 ఫోర్లు, 4 సిక్స్లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. అశ్విన్తో పాటు శివమ్ సింగ్(64) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా 159 పరుగుల లక్ష్యాన్ని దిండిగల్ డ్రాగన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెపాక్ సూపర్ గిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగలు చేసింది. చెపాక్ సూపర్ గిల్స్ బ్యాటర్లలో కెప్టెన్ అపరజిత్(72) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఆగస్టు 2న జరగనున్న క్వాలిఫియర్-2లో ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజన్స్తో దిండిగల్ డ్రాగన్స్ తలపడనుంది. நெருப்பு டா நெருங்கு டா பாப்போம்! Ft. Ash அண்ணா 💥🥵📺 தொடர்ந்து காணுங்கள் TNPL | Eliminator | Chepauk Super Gillies vs Dindigul Dragons | Star Sports தமிழில் மட்டும்#TNPLOnStar #TNPL2024 #NammaOoruNammaGethu @TNPremierLeague pic.twitter.com/7E7oxuDPfZ— Star Sports Tamil (@StarSportsTamil) July 31, 2024 -
'T20 వరల్డ్కప్లో అదే నా ఫేవరేట్ మూమెంట్.. నా కళ్లలో నీళ్లు తిరిగాయి'
టీ20 వరల్డ్కప్-2024 విజేతగా నిలిచి భారత్ తమ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో సగర్వంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికారు. వీరిముగ్గురు మాత్రమే కాకుండా రాహుల్ ద్రవిడ్ సైతం భారత హెడ్కోచ్గా తన ప్రస్ధానాన్ని ముగించాడు. గతేడాది వన్డే వరల్డ్కప్లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన టీమిండియాకు.. 7 నెలల తిరిగకముందే పొట్టి ప్రపంచకప్ రూపంలో ఐసీసీ టైటిల్ను ది గ్రేట్ వాల్ అందించాడు. విజయనంతరం భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొంతమంది ఆటగాళ్లు అయితే కన్నీటి పర్యంతమయ్యారు. ఈ భావోద్వేగ క్షణాలను యావత్తు ప్రపంచం వీక్షించింది. ఇక తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీ20 వరల్డ్కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్లో తన ఫేవరేట్ మూమెంట్ను ఎంచుకున్నాడు. సెలబ్రేషన్స్ సమయంలో విరాట్ కోహ్లి ట్రోఫీని రాహుల్ ద్రవిడ్కు అందజేసినప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగినట్లు అశ్విన్ చెప్పుకొచ్చాడు."నిజంగా ఇది యావత్తు భారత్ గర్వించదగ్గ విజయం. మా 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అయితే ఈ టోర్నీలో విజయం సాధించిన తర్వాత ఓ మూమెంట్ నా మనసును హత్తుకుంది. విరాట్ కోహ్లి.. రాహుల్ ద్రవిడ్కు పిలిచి ట్రోఫీని అందిండచడం నన్ను ఎంతగానే ఆకట్టుకుంది.ఇదే నా ఫేవరేట్ మూమెంట్. ద్రవిడ్ వెంటనే కప్ను అందుకుని గట్టిగా కేకలు వేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ క్షణం నా కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ద్రవిడ్ నుంచి ఇటువంటి సెలబ్రేషన్స్ ఇప్పటివరకు నేను చూడలేదు. అయితే అందుకు ఓ కారణముంది.2007లో కరేబియన్ దీవుల వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో ద్రవిడ్ సారథ్యంలోని భారత జట్టు గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. ఆ తర్వాత ద్రవిడ్ తన కెప్టెన్సీ నుంచి వైదొలగాడు. అప్పటి నుంచి జట్టులో కేవలం ఆటగాడిగా కొనసాగాడు. కెప్టెన్సీ నుంచి తప్పకున్నప్పటకి ద్రవిడ్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఒకవేళ భారత జట్టు మ్యాచ్ ఓడిపోయినా అందరూ ద్రవిడ్నే టార్గెట్ చేసేవారు. అప్పుడు తను కెప్టెన్గా సాధించలేకపోయింది.. ఇప్పుడు కోచ్గా సాధించి చూపించాడని" తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ పేర్కొన్నాడు. -
అశ్విన్ పరుగుల విధ్వంసం.. సిక్సర్ల మెరుపులు.. వీడియో
భారత స్పిన్ మాస్టర్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాట్తో దుమ్ములేపాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అశూ అన్న బ్యాటింగ్ మెరుపులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తమిళనాడు ప్రీమియర్ లీగ్-2024 సీజన్ జూలై 5న మొదలైంది. ఈ టీ20 టోర్నీలో దిండిగల్ డ్రాగన్స్ జట్టుకు అశ్విన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.అశూ సారథ్యంలో తొలి మ్యాచ్లో ట్రిచీ గ్రాండ్ చోళాస్ జట్టును ఓడించిన దిండిగల్ జట్టు.. తదుపరి మ్యాచ్లో సేలం స్పార్టాన్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ క్రమంలో చెపాక్ సూపర్ గిల్లీస్తో ఆదివారం తమ మూడో మ్యాచ్లో తలపడింది.కోయంబత్తూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెపాక్ జట్టు తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో శివం సింగ్(0)తో కలిసి ఓపెనింగ్ చేసిన అశూ ధనాధన్ దంచికొట్టాడు.అశూ పరుగుల విధ్వంసంకేవలం ఇరవై బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 45 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అయితే, మిగతా వాళ్ల నుంచి అశ్విన్కు పెద్దగా సహకారం అందలేదు.ఇక ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించగా.. ఏడు ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో అశూ కెప్టెన్ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత ఏడు ఓవర్లలో దిండిగల్ డ్రాగన్స్ ఆరు వికెట్లు నష్టపోయి 64 పరుగులు చేసింది.దిండిగల్ టీమ్కు తప్పని ఓటమిలక్ష్య ఛేదనకు దిగిన చెపాక్ సూపర్ గిల్లీస్ కేవలం 4.5 ఓవర్లలనే పని పూర్తి చేసింది. ఓపెనర్, వికెట్ కీపర్ నారాయణన్ జగదీశన్ 14 బంతుల్లోనే 32 పరుగులు చేయగా.. కెప్టెన్ బాబా అపరాజిత్ 14 బంతుల్లో 31 రన్స్ సాధించాడు.వీరిద్దరు కలిసి ఆడుతూ టార్గెట్ను ఛేదించగా.. దిండిగల్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా అశూ కెప్టెన్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది.అయితే, క్రీజులో ఉన్నంత సేపు అశ్విన్ ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేయడం అభిమానులకు సంతోషాన్నిచ్చిది. అశూ ఇన్నింగ్స్ వీడియో తాజాగా వెలుగులోకి రాగా ఫ్యాన్స్ ఈ దృశ్యాలను షేర్ చేస్తున్నారు. ఇక దిండిగల్ తదుపరి బుధవారం ఐడ్రీమ్ తిరుపూర్ తమిళన్స్ జట్టుతో తలపడనుంది.ఎనిమిది జట్లు.. ప్రస్తుతం టాపర్గా లైకా కోవై కింగ్స్తమిళనాడు ప్రీమియర్ లీగ్-2024 ఎడిషన్లో ఎనిమిది జట్లు భాగమయ్యాయి. లైకా కోవై కింగ్స్ మూడింట మూడు గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది.మిగిలిన స్థానాల్లో వరుసగా ట్రిచీ గ్రాండ్ చోళాస్(2 విజయాలు), చెపాక్ సూపర్ గిల్లీస్(2 విజయాలు), నెల్లై రాయల్ కింగ్స్(2 విజయాలు), ఐడ్రీమ్ తిరుపూర్ తమిళన్స్(1 విజయం), దిండిగల్ డ్రాగన్స్(1 విజయం), సేలం స్పార్టన్స్(1 విజయం), సీచం మధురై పాంథర్స్(1 విజయం) ఉన్నాయి.Captain. Opener. Top Scorer. 😎Ash Anna scored a thunderous 45* while the 7 other batters combined for just 21. MASS! 🔥#TNPLonFanCode @ashwinravi99 pic.twitter.com/RWac8GL60y— FanCode (@FanCode) July 15, 2024 -
ధోనికి కోపం వచ్చింది.. అతడి వల్లే: అశ్విన్
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్కు ‘మిస్టర్ కూల్’గానూ పేరుంది. పరిస్థితి చేయిదాటి పోతే తప్ప తలా.. మైదానంలో కోపం, అసహనం ప్రదర్శించడు. అయితే, శ్రీశాంత్ చేసిన పని వల్ల తొలిసారి ధోనికి ఆగ్రహానికి గురికావడం చూశానంటున్నాడు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.తొలిసారి ధోని కోప్పడటం చూశా2010 నాటి సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని తన పుస్తకం ‘ఐ హావ్ ది స్ట్రీట్స్- ఏ కుట్టీ క్రికెట్ స్టోరీ’(I Have The Streets- A Kutty Cricket Story)లో అశూ వెల్లడించాడు. నాటి మ్యాచ్ సంగతులను ప్రస్తావిస్తూ..‘‘ఆరోజు నేను డ్రింక్స్ అందించే పని చేస్తున్నా. అప్పుడు ధోని హెల్మెట్ తీసుకురమ్మని చెప్పాడు. నాకెందుకో మహీ కోపంగా ఉన్నట్లు కనిపించింది.అతడు సహనం కోల్పోవడం నేను అంతకు ముందెన్నడూ చూడలేదు. ‘శ్రీ(శ్రీశాంత్) ఎక్కడ ఉన్నాడు? అతడు అసలేం చేస్తున్నాడు?’ అని ఎంఎస్ అడిగాడు.శ్రీశాంత్కు ఈ సందేశం చేరవేరుస్తానని నేను చెప్పాను. ఆ తర్వాత ఎంఎస్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే, మరుసటి ఓవర్లో నన్ను మళ్లీ పిలిచి మహీ హెల్మెట్ రిటర్న్ చేశాడు.శ్రీకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదేమో!అప్పుడు కామ్గానే ఉన్నట్లు అనిపించింది. నాకు హెల్మెట్ ఇచ్చే సమయంలో.. ‘ఒక పనిచెయ్.. రంజీబ్ సర్(టీమ్ మేనేజర్) దగ్గరికి వెళ్లు.శ్రీకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదని చెప్పు. వెంటనే అతడికి టికెట్ బుక్ చేయమని చెప్పు. అతడు ఎంచక్కా ఇండియాకు తిరిగి వెళ్లిపోతాడు. సరేనా’ అని నాతో అన్నాడు.ధోని అలా అనడం ఊహించని నాకు షాక్ తగిలినట్లయింది. అసలు నేను ఈ మాటలు విన్నది ధోని నుంచేనా అని కాసేపు అయోమయానికి గురయ్యాను’’ అని అశ్విన్ తన పుస్తకంలో రాశాడు.ఆ మరుసటి ఓవర్లో తనతో పాటు శ్రీశాంత్ కూడా భారత ఆటగాళ్లకు మైదానంలో డ్రింక్స్ అందించాడని అశూ తెలిపాడు. అయినప్పటికీ ధోని శాంతించలేదని.. అతడి నుంచి డ్రింక్స్ తీసుకోవడానికి ఇష్టపడలేదని పేర్కొన్నాడు.మళ్లీ తననే పిలిచి.. శ్రీశాంత్ టికెట్ గురించి మేనేజర్తో చెప్పావా?లేదా అని తనను గట్టిగా ప్రశ్నించాడని అశూ తెలిపాడు. కాసేపయ్యాక అంతా మామూలుగా మారిపోయిందని.. సమస్య సమసిపోయిందని అశ్విన్ వెల్లడించాడు.ధోని కోపానికి కారణం ఇదేకాగా రిజర్వ్ ఆటగాళ్లతో పాటు డగౌట్లో కూర్చోకుండా పేసర్ శ్రీశాంత్ డ్రెస్సింగ్రూంలోనే ఉండిపోవడమే ధోని ఆగ్రహానికి కారణం. ఆ తర్వాత అశ్విన్తో మెసేజ్ పంపగా.. శ్రీశాంత్ జెర్సీ వేసుకుని డగౌట్కు రావడంతో పాటు.. ధోని దెబ్బకు డ్రింక్స్ కూడా సర్వ్ చేశాడట. అదీ సంగతి!చదవండి: బ్లడ్ క్యాన్సర్.. బాధగా ఉంది: బీసీసీఐకి కపిల్ దేవ్ విజ్ఞప్తి -
అమెరికన్ జట్టు సహ యజమానిగా అశ్విన్
న్యూఢిల్లీ: భారత సీనియర్ స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ చెస్లో అడుగు పెట్టాడు. గ్లోబల్ చెస్ లీగ్లో ఈసారి కొత్తగా చేరిన అమెరికన్ గ్యాంబిట్స్ జట్టుకు అశ్విన్ సహ యజమానిగా ఉన్నాడు. గత ఏడాది పోటీపడిన చింగారీ గల్ఫ్ టైటాన్స్ జట్టు స్థానంలో కొత్తగా అమెరికన్ గ్యాంబిట్స్ జట్టు వచ్చింది.టెక్ మహీంద్రా, అంతర్జాతీయ చెస్ సమాఖ్యసంయుక్త ఆధ్వర్యంలో గత ఏడాది దుబాయ్లో తొలి గ్లోబల్ చెస్ లీగ్ జరిగింది. ఈ ఏడాది టోర్నీకి లండన్ నగరం వేదిక కానుంది. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు ఆరు జట్ల మధ్య గ్లోబల్ చెస్ లీగ్ రెండో ఎడిషన్ జరగనుంది. ఫైనల్ బెర్త్ ఎవరిదో! మ్యూనిక్: ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచి జోరు మీదున్న స్పెయిన్... నిలకడలేమితో సతమతమవుతున్న ఫ్రాన్స్... ‘యూరో’ కప్ ఫుట్బాల్ టోర్నీ లో ఫైనల్లో చోటు కోసం నేడు తొలి సెమీఫైనల్లో ‘ఢీ’కొననున్నాయి. సెమీఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ 11 గోల్స్ చేయగా... ఫ్రాన్స్ మూడు గోల్స్ సాధించింది. ‘యూరో’ టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య ఆరు మ్యాచ్లు జరిగాయి. నాలుగుసార్లు ఫ్రాన్స్ గెలుపొందగా...ఒక మ్యాచ్ ‘డ్రా’గా ముగిసి, ఒక మ్యాచ్లో స్పెయిన్ నెగ్గింది. తొలి విజయం కోసం... అంతర్జాతీయ మహిళల ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ల్లో భాగంగా మయన్మార్ జట్టుతో భారత జట్టు రెండు మ్యాచ్లు ఆడనుంది. యాంగూన్లో నేడు జరిగే తొలి మ్యాచ్లో ఆశాలతా దేవి సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ కూడా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించనుంది.ప్రపంచ ర్యాంకింగ్స్లో 67వ స్థానంలో ఉన్న భారత జట్టు ఇప్పటివరకు ఐదుసార్లు మయన్మార్ జట్టుతో తలపడినా ఒక్కసారీ విజయం సాధించలేదు. నాలుగు మ్యాచ్ల్లో ఓడిన టీమిండియా ఒక మ్యాచ్ను మాత్రం ‘డ్రా’ చేసుకుంది. -
IND Vs USA: అర్ష్దీప్ అరుదైన రికార్డు.. టీ20 వరల్డ్కప్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా న్యూయర్క్ వేదికగా అమెరికాతో మ్యాచ్లో టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అమెరికా బ్యాటర్లకు అర్ష్దీప్ చుక్కలు చూపించాడు. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి అమెరికాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఓవరాల్గా తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చిన అర్ష్దీప్.. 4 వికెట్లు పడగొట్టాడు.ఈ క్రమంలో అర్ష్దీప్ సింగ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో అత్యత్తుమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్గా అర్ష్దీప్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన పేరిట ఉండేది. 2014 టీ20 వరల్డ్కప్లో ఆసీస్పై అశ్విన్ 11 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్లో కేవలం 9 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన అర్ష్దీప్.. అశ్విన్ రికార్డును బ్రేక్ చేశాడు.అదే విధంగా మరో రికార్డును అర్ష్దీప్ సాధించాడు. టీ20 వరల్డ్కప్లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మొదటి బంతికే వికెట్ పడగొట్టిన మొదటి భారత బౌలర్గా అర్ష్దీప్ నిలిచాడు. యూఎస్ఎ ఓపెనర్ జహంగీర్ను మొదటి బంతికే ఔట్ చేసిన అర్ష్దీప్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. -
ఐపీఎల్ 2025.. చెన్నై సూపర్ కింగ్స్లోకి అశ్విన్!?
ఐపీఎల్లో టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన సొంతగూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025 మెగా వేలంలో అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ బాధ్యతలను అశ్విన్కు సీఎస్కే ఫ్రాంచైజీ యాజయాన్యం ఇండియా సిమెంట్స్ గ్రూప్ అప్పగించింది. దీంతో అశూతో సీఎస్కే మరోసారి ఒప్పందం కుదుర్చుకోవడం దాదాపు ఖాయమైంది. కాగా తమిళనాడులో ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను తయారు చేసేందుకు సీఎస్కే ఫ్రాంచైజీ చెన్నై శివారులో హై పెర్ఫార్మెన్స్ సెంటర్ను ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. "వేలానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆటగాళ్ల ఎంపిక అనేది వేలం డైనమిక్స్పై ఆధారపడి ఉంటుంది. ముందే మేము ఏ ప్లాన్స్ చేయలేం. అశ్విన్ను కొనుగోలు చేసే ఛాన్స్ మాకు వస్తుందో లేదో కూడా తెలియదు. అతడు మొదటగా మా హై పెర్ఫార్మెన్స్ సెంటర్ ఛీప్గా బాధ్యతలు చేపడతాడు. అక్కడ ప్రోగ్రామ్లు, క్రికెట్కు సంబంధించిన విషయాలను అతడు చూసుకుంటాడు. అతడితో మేము ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. అశూ ఇప్పుడు సీఎస్కే వెంచర్లో భాగమయ్యాడు.అదే విధంగా టీఎన్సీఎ ఫస్ట్-డివిజన్ క్రికెట్లో ఇండియా సిమెంట్స్ జట్లకు సైతం ప్రాతినిథ్యం వహిస్తాడని" ఓ ప్రకటనలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ పేర్కొన్నాడు. కాగా అశ్విన్ ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు.అయితే ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న ఐపీఎల్ మెగా వేలానికి అశ్విన్ను రాజస్తాన్ విడిచిపెట్టే ఛాన్స్ ఉంది. కాగా అంతకముందు అశ్విన్ 2005 నుంచి 2015 వరకు సీఎస్కే ప్రాతినిథ్యం వహించాడు. మళ్లీ పదేళ్ల తర్వాత సీఎస్కే ఫ్యామిలీలో అశూ భాగమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. -
RR Vs SRH Pics: ఆర్ఆర్ను చిత్తు చేసి.. ఫైనల్కు సన్రైజర్స్ హైదరాబాద్ (ఫొటోలు)
-
మళ్లీ హెడ్కోచ్గా రవిశాస్త్రి?
టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మరోసారి ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే, ఇందులో ఓ ట్విస్టు ఉంది.భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి 2017- 2021 మధ్య టీమిండియా హెడ్ కోచ్గా పనిచేశాడు. అతడి మార్గదర్శనంలో.. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు పలు చిరస్మరణీయ విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలవడంసహా నంబర్ వన్ జట్టుగా ఎదిగింది.అయితే, వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క ఐసీసీ టైటిల్ కూడా నెగ్గలేకపోయింది టీమిండియా. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 తర్వాత రవిశాస్త్రి పదవీకాలం ముగియగా.. కెప్టెన్గా విరాట్ కోహ్లి యుగానికి తెరపడింది. ఈ క్రమంలో కోహ్లి రోహిత్ శర్మ సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతుండగా.. రవిశాస్త్రి తిరిగి కామెంటేటర్గా మారాడు.ఈ నేపథ్యంలో తాజాగా రవిచంద్రన్ అశ్విన్తో మాట్లాడుతూ రవిశాస్త్రి.. హెడ్కోచ్గా పనిచేయడంపై తనకున్న ఆసక్తిని వివరించాడు. భవిష్యత్తులో తాను ఐపీఎల్ జట్టు కోచ్గా పనిచేసే అవకాశాలను కొట్టిపారేయలేనని తెలిపాడు.భారత్లో ఎంతో మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నారని.. వారిని మెరికల్లా తీర్చిదిద్దే అవకాశం తనకు వస్తే కచ్చితంగా మళ్లీ కోచ్గా మారతానని రవిశాస్త్రి సంకేతాలు ఇచ్చాడు. ఇప్పటికే సూపర్ స్టార్లుగా ఎదిగిన వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. అయితే, కొత్త టాలెంట్ను ప్రోత్సహించేందుకు తనకు ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని స్పష్టం చేశాడు.ఏడేళ్లు టీమిండియాతో పనిచేసిన తర్వాత .. తిరిగి కామెంటేటర్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్న రవిశాస్త్రి.. తదుపరి ఐపీఎల్ కోచ్గా మారేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలియజేశాడు. కాగా రవిశాస్త్రి తర్వాత టీమిండియా హెడ్కోచ్గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్: సెహ్వాగ్
ఐపీఎల్-2024లో టీమిండియా వెటరన్, రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన అశ్విన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే సాధించాడు. వికెట్లు విషయం పక్కన పెడితే తన బౌలింగ్లో భారీగా పరుగులు కూడా సమర్పించుకుంటున్నాడు.8 మ్యాచ్ల్లో 9.00 ఏకానమీతో 278 పరుగులిచ్చాడు. ఈ క్రమంలో అశ్విన్పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు. తనే రాజస్తాన్ కోచ్గా గానీ మెంటార్ ఉండి ఉంటే అశ్విన్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఇచ్చేవాడిని కాదని సెహ్వాగ్ మండిపడ్డాడు."అశ్విన్ వైట్బాల్ క్రికెట్కు సెట్ కాడు. అశ్విన్కు మిడిల్ ఓవర్లలలో వికెట్లు తీసే సత్తా లేదు. గతంలో ఓసారి కేఎల్ రాహుల్ తన స్ట్రైక్ రేట్ గురించి ఎవరు ఏమనుకున్న పట్టించుకోని వ్యాఖ్యనించాడు. ఇప్పుడు అదే తరహాలో అశ్విన్ కూడా వికెట్లు తీయకపోతేనేం బాగానే బౌలింగ్ చేస్తున్నా కాదా అన్నట్లు మాట్లాడుతున్నాడు. అశ్విన్ ఈ ఏడాది సీజన్లో ఇదే ప్రదర్శన కొనసాగిస్తే.. వచ్చే ఏడాది మెగా వేలంలో కచ్చితంగా అమ్ముడుపోడు. ఏ జట్టు అయినా బౌలర్ను సొంతం చేసుకున్నప్పుడు అతడి నుంచి వికెట్లు ఆశిస్తోంది. అంతేతప్ప 4 ఓవర్లలో 25 నుంచి 30 పరుగులు ఇస్తే చాలు అని ఏ జట్టు అనుకోదు . రెండు లేదా మూడుసార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవాలని ఏ ప్రాంఛైజీనా భావిస్తోంది. అతడి సహచరలు చాహల్, కుల్దీప్ యాదవ్ ఈ ఏడాది సీజన్లో అద్బుతంగా రాణిస్తున్నాడు. అశ్విన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తే బ్యాటర్లు టార్గెట్ చేస్తారని, క్యారమ్ బాల్స్ వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే అతడికి వికెట్లు పడడం లేదు. అతడు తన ఆఫ్ స్పిన్ను నమ్ముకుంటే వికెట్లు పడే ఛాన్స్ ఉంది. కానీ నేను రాజస్తాన్ ఫ్రాంచైజీకి మెంటార్ లేదా కోచ్గా ఉండి ఉంటే అతడి తుది జట్టులో చోటు దక్కేది కాదని క్రిక్ బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
ఐశ్వర్య రాజేష్ సినిమాలో ఇండియన్ స్టార్ క్రికెటర్
నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్కుమార్, నటి ఐశ్యర్య రాజేశ్ జంటగా నటించిన చిత్రం డియర్. నటి రోహిణి, ఇళవరసు, తలైవాసల్ విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నట్మగ్ ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిఫేక్ రామిశెట్టి, జీ.పృధ్వీరాజ్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చే సుకుని, ఈ నెల 11వ తేదీన తెరపైకి రానుంది. టీమిండియా స్టార్ ఆటగాడు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలిసారిగా ఈ సినిమాలో భాగమయ్యారు. క్రికెట్లో స్పిన్ మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న అశ్విన్.. ఇప్పుడు వెండితెరపై కూడా కనిపించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. తమిళంలో వస్తున్న 'డియర్' సినిమాలో అతిథి పాత్రలో అశ్విన్ నటించారట. ఈ సినిమా ట్రైలర్ కూడా తాజాగా విడుదలైంది. కానీ సినిమాలో ఆయన లుక్ రివీల్ చేయలేదు. ఈ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నట్లు క్రికెటర్ అశ్విన్ స్వయంగా తన ఎక్స్ పేజీలో వెల్లడించారు. అశ్విన్తో హీరోయిన్ ఐశ్వర్యకు ఇదే తొలి చిత్రం. ఈ చిత్రాన్ని ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 11న విడుదల కానున్న డియర్ సినిమా ట్రైలర్ను తాజాగా మేకర్స్ విడుదల చేయగా దానిని అశ్విన్ కూడా తన ఎక్స్ పేజీలో షేర్ చేశారు. అశ్విన్ వాయిస్తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 'డియర్' చిత్రంలో దీపిక, అర్జున్ పాత్రలలో ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ నటించారు. కొత్తగా పెళ్లయిన జంట మధ్య జరిగే సమస్యల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమా గురించి జీవీ.ప్రకాశ్కుమార్ మాట్లాడుతూ నటి ఐశ్వర్యరాజేశ్ ఒకసారి విమానంలో కలిసినప్పుడు ఒక మంచి కథ ఉంది చే స్తారా? అని అడిగారన్నారు. ఆ చిత్రంలో ఈమె నటిస్తున్నారంటే తన పాత్రకు పెద్దగా స్కోప్ ఉండదని భావించానన్నారు. అయినప్పుటికీ అందులో తను నటించకూడదనే భావనతోనే దర్శకుడిని కథ చెప్పమని అడిగానన్నారు. ఆ తరువాత దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ తనను కలిసి కథ చెప్పడంతో చాలా ఇంట్రస్ట్గా ఉందని పించిందన్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం ఎంతగానో ఆకట్టుకోవడంతో తాను నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. Excited to unveil the #DeAr trailer!🎉 Happy to have played a small part in it 😁. Check it out and let me know what you think ❤️ ▶️ https://t.co/bqvULPCmRi#DeArTrailer #DeArFromApril11 @NutmegProd @tvaroon #AbhishekRamisetty #PruthvirajGK @mynameisraahul #RomeoPictures… pic.twitter.com/tB1S6KXYUI — Ashwin 🇮🇳 (@ashwinravi99) April 5, 2024 -
పిచ్చకొట్టుడు కొట్టిన అశ్విన్.. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చి మరీ..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ వెటరన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్లో చెలరేగిపోయాడు. ఆర్డర్లో ముందుకు వచ్చి మరీ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 19 బంతుల్లో 3 భారీ సిక్సర్ల సాయంతో 29 పరుగులు చేశాడు. అశ్విన్ ఈ మూడు సిక్సర్లు బాదింది సాదాసీదా బౌలర్ల బౌలింగ్లో అనుకుంటే పొరబడ్డట్టే. తొలుత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు దిమ్మతిరిగిపోయేలా చేసిన అశ్విన్.. ఆ తర్వాత ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జేకు మతి పోగొట్టాడు. కుల్దీప్ బౌలింగ్లో ఓ సిక్సర్తో సరిపెట్టుకున్న అశ్విన్.. నోర్జే బౌలింగ్లో ఏకంగా రెండు భారీ సిక్సర్లు బాదాడు. SIX-HITTER ASHWIN IN T20..!!! 🔥pic.twitter.com/80j0Dm6uLz — Johns. (@CricCrazyJohns) March 28, 2024 తరుచూ బంతితో మ్యాజిక్ చేసే అశ్విన్.. కొత్తగా బ్యాట్కు పని చెప్పడంతో అతని అభిమానులు తెగ సంబుర పడిపోతున్నారు. యాష్లోని ఈ కోణాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కాగా, అశ్విన్కు టెస్ట్ క్రికెట్లో బ్యాటర్గా మంచి ట్రాక్ రికార్డే ఉంది. సుదీర్ఘ ఫార్మాట్లో అతను ఏకంగా ఐదు సెంచరీలు బాదాడు. అయితే యాష్ శతక్కొట్టుడు టెస్ట్ క్రికెట్కు మాత్రమే పరిమితమైంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అతను రాణించడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో అశ్విన్ శైలికి భిన్నంగా విజృంభించడంతో అభిమానులు కొత్తగా ఫీలవుతున్నారు. అశ్విన్ చితక్కొట్టుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇదిలా ఉంటే, అశ్విన్తో పాటు రియాన్ పరాగ్ (45 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో డీసీపై రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఢిల్లీ 173 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. రాజస్థాన్ బౌలర్లు బర్గర్ (3-0-29-2), చహల్ (3-0-19-2), ఆవేశ్ ఖాన్ (4-0-29-1) రాణించారు. -
IPL 2024: రాజస్తాన్ రాయల్స్కు ఊహించని షాక్!
ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు రాజస్తాన్ రాయల్స్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బౌలర్, ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా లీగ్ నుంచి తప్పుకొంటున్నట్లు సమాచారం. వ్యక్తిగత కారణాల దృష్ట్యా పదిహేడో ఎడిషన్కు దూరం కానున్నట్లు తెలిసింది. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ మేనేజర్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో పేర్కొంది. కాగా ఐపీఎల్-2023 మినీ వేలంలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ రూ. 1.50 కోట్లు ఖర్చు చేసి ఆడం జంపాను కొనుగోలు చేసింది. గతేడాది అతడు రాజస్తాన్ తరఫున ఆరు మ్యాచ్లు ఆడి ఎనిమిది వికెట్లు తీశాడు. ఈ క్రమంలో 2024 వేలానికి ముందు జంపాను రిటైన్ చేసుకుంది రాజస్తాన్. అయితే, అనూహ్యంగా తాజా సీజన్ ఆరంభానికి ముందు జంపా జట్టు నుంచి తప్పుకోవడం అభిమానులను విస్మయానికి గురిచేసింది. ఇప్పటికే టీమిండియా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ కూడా ఈ ఎడిషన్కు అందుబాటులో ఉండటం లేదు. గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. ఇక 31 ఏళ్ల ఆడం జంపా గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా ఇప్పటి వరకు ఐపీఎల్లో 20 మ్యాచ్లు ఆడి 29 వికెట్లు కూల్చాడు. కాగా ఇప్పటికే జేసన్ రాయ్, గస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్ తదితర విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్-2024 బరి నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. ఇక మార్చి 22న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో తాజా ఎడిషన్ మొదలుకానుంది. ఈ క్రమంలో సంజూ శాంసన్ సేన(రాజస్తాన్ రాయల్స్) మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్తో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఇక జంపా తప్పుకోగా.. టీమిండియా దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ రూపంలో ఇద్దరు మేటి స్పిన్నర్లు అందుబాటులో ఉండటం రాయల్స్కు సానుకూలాంశం. చదవండి: #MSDhoni: స్వర్ణ యుగం ముగిసింది.. గుండె ముక్కలైంది!.. ఆ ఊహే కష్టంగా ఉంది.. Just a legend doing his thing in Pink. 🔥 pic.twitter.com/rpQ2KCDTmV — Rajasthan Royals (@rajasthanroyals) March 20, 2024 -
SRH: రెండుసార్లు చాంపియన్గా నిలబెడితే ఇలా చేస్తారా? షాకయ్యా
SRH- IPL 2024: సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్పు నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐడెన్ మార్క్రమ్నే సారథిగా కొనసాగించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇందుకు గల కారణాన్ని కూడా అశూ వెల్లడించాడు. గత మూడు సీజన్లుగా చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం కోసం పోటీ పడుతోంది సన్రైజర్స్. డేవిడ్ వార్నర్ తర్వాత ఎంత మంది కెప్టెన్లను మార్చినా జట్టు తలరాతను మాత్రం మార్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 వేలంలో వ్యూహాత్మకంగా పావులు కదిపింది. రూ. 20. 50 కోట్ల భారీ ధరకు ఆస్ట్రేలియా కెప్టెన్, వన్డే వరల్డ్కప్-2023 విజేత ప్యాట్ కమిన్స్ను కొనుగోలు చేసింది. గత ఎడిషన్లో రైజర్స్ జట్టును ముందుకు నడిపించిన ఐడెన్ మార్క్రమ్ స్థానంలో సారథిగా నియమించింది. ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్.. సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణయం సరైంది కాదేమోనని అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ అరంగేట్ర, తాజా సీజన్లో సన్రైజర్స్ ఈస్ట్రర్న్కేప్ను చాంపియన్గా నిలబెట్టిన మార్క్రమ్పై వేటు వేయకుండా ఉండాల్సిందని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ వరుసగా రెండు టైటిళ్లు గెలిచింది. అత్యద్బుతమైన జట్టుతో ట్రోఫీలు అందుకుంది. కానీ ఇక్కడ మార్క్రమ్ను కాదని వాళ్లు ప్యాట్ కమిన్స్ను కెప్టెన్ చేశారు. నిజంగా ఇది షాకింగ్గా అనిపించింది. మార్క్రమ్నే సారథిగా కొనసాగిస్తారని ఊహించాను. సౌతాఫ్రికాలో సన్రైజర్స్ కెప్టెన్గా అత్యద్బుత ప్రదర్శన కనబరిచాడు. కానీ ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. కమిన్స్ను కెప్టెన్గా ప్రకటించినందు వల్ల తుదిజట్టు కూర్పులో రైజర్స్ కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ట్రవిస్ హెడ్ను బ్యాకప్గా ఉపయోగించుకున్నా.. మార్క్రమ్, హెన్రిచ్క్లాసెన్, వనిందు హసరంగలను ప్రధాన ప్లేయర్లుగా ఆడించాల్సి ఉంటుంది. ఒకవేళ హసరంగ లేకుంటే కొన్ని వేదికల్లో ఫజల్హక్ ఫారూకీ లేదంటే మార్కోజాన్సెన్లను ఆడించే అవకాశం ఉంది. ఏదేమైనా విదేశీ ప్లేయర్లను ఆడించే విషయంలో రైజర్స్కు ఇబ్బందులు తప్పవు’’ అని రాజస్తాన్ రాయల్స్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. కాగా మార్చి 23న కేకేఆర్తో సన్రైజర్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: పేరు మార్చుకున్న ఆర్సీబీ... కన్నడలో మాట్లాడిన కోహ్లి.. వీడియో -
గుంటూరు కారం సాంగ్.. అంత భయంకరంగా ఉందన్న టీమిండియా స్టార్ క్రికెటర్!
కొత్త ఏడాదిలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించిన భామ శ్రీలీల. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రంలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్కు అభిమానులకు అయితే ఏకంగా పూనకాలు తెప్పించింది. ఈ సాంగ్లో శ్రీలీల స్టెప్పులకు ఫిదా కానీ వారు ఉండరేమో. అంతలా తన డ్యాన్స్తో అదరగొట్టింది ఈ కన్నడ భామ. అయితే తాజాగా గుంటూరు కారం సాంగ్పై టీమిండియా క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా శ్రీలీల, మహేశ్బాబు డ్యాన్స్కు తాను ఫిదా అయ్యానని వెల్లడించారు. ఓ అభిమానితో మాట్లాడుతూ గుంటూరు కారం సాంగ్ను ప్రస్తావించారు. మహేశ్ బాబు మూవీ గుంటూరు కారం సాంగ్లో శ్రీలీల, మహేశ్ బాబు డ్యాన్స్ భయంకరంగా ఉందని అన్నారు. ఇప్పటికీ ఆ సాంగ్ చూడకపోతే యూట్యూబ్కు వెళ్లి గుంటూరు కారం శ్రీలీల డ్యాన్స్ టైప్ చూడమని అశ్విన్ సలహా కూడా ఇచ్చాడు. మహేశ్ బాబు ఎక్స్ట్రార్డినరీ డ్యాన్సర్ అని.. అతనితో పాటు శ్రీలీల అదరగొట్టిందని అశ్విన్ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సాంగ్ ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ టీమ్కు ఊపు తీసుకొస్తుందని రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Cricketer @ashwinravi99 about #GunturKaaram 🔥@urstrulyMahesh @sreeleela14 pic.twitter.com/8mV2JNreU2 — Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) March 19, 2024 -
‘ధోనికి రుణపడి ఉంటా’అశ్విన్ భావోద్వేగం
చెన్నై: దాదాపు 13 ఏళ్ల క్రితం తనకంటూ ఎలాంటి గుర్తింపు లేని రోజుల్లో అండగా నిలిచి అవకాశాలు కల్పించిన మహేంద్ర సింగ్ ధోనికి తాను జీవితకాలం రుణపడి ఉంటానని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. 100 టెస్టులు పూర్తి చేసుకోవడంతో పాటు 500 వికెట్ల మైలురాయిని దాటిన అశ్విన్ను శనివారం తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్సీఏ) ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా తన కెరీర్ను మలుపు తిప్పిన 2011 ఐపీఎల్ ఫైనల్ను అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. ‘కొత్త బంతితో నన్ను క్రిస్ గేల్కు బౌలింగ్ చేసే అవకాశాన్ని ధోని కల్పించాడు. నాలుగో బంతికే నేను వికెట్ తీయగలిగా. ఇప్పటికీ చాలా మంది దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే అందుకు ధోనినే కారణం. అతనికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. సాధారణంగా నేను మాట్లాడేప్పుడు పదాల కోసం ఎప్పుడూ తడబడను. కానీ ఈ రోజు నా పరిస్థితి భిన్నంగా ఉంది. టీఎన్సీఏ నాకు ఎంతో గౌరవం కల్పించింది కాబట్టే ఎప్పుడైనా క్లబ్ క్రికెట్ కూడా సిద్ధంగా ఉంటా. నేను రేపు చచ్చిపోయినా నా ఆత్మ ఈ స్టేడియంలోనే తిరుగుతూ ఉంటుంది’ అని అశ్విన్ అన్నాడు. ఈ సన్మాన కార్యక్రమంలో అశ్విన్కు ప్రత్యేక జ్ఞాపికగా ‘సెంగోల్’ అందించడం, అతని పేరిట స్టాంప్ విడుదలతో పాటు రూ. 1 కోటి నగదు పురస్కారాన్ని కూడా అందించారు. -
రోహిత్ శర్మ కోసం ప్రాణాలైనా ఇవ్వొచ్చు
-
నెం1 స్థానంలోకి దూసుకెళ్లిన రవిచంద్రన్ అశ్విన్..
-
ప్రపంచ నెంబర్ వన్ టెస్ట్ బౌలర్గా రవిచంద్రన్ అశ్విన్..
టెస్టు క్రికెట్లో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్గా మరోసారి టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన బౌలర్ల ర్యాంకింగ్స్లో అశ్విన్ అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అశ్విన్... టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను వెనక్కినెట్టి టాప్ ర్యాంక్ను కైవసం చేసుకున్నాడు. కాగా అశ్విన్ తన కెరీర్లో ఫస్ట్ ర్యాంక్ను సాధించడం ఇది ఆరోసారి. 2015 డిసెంబర్లో తొలిసారి టాప్ ర్యాంక్ను అశూ సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ సిరీస్లో అశ్విన్ తన స్పిన్ మయాజాలన్ని ప్రదర్శించాడు. ఓవరాల్గా ఈ ఐదు టెస్టుల సిరీస్ లో 26 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. అశ్విన్తో పాటు ఈ సిరీస్లో సంచలన ప్రదర్శన కనబరిచిన కుల్దీప్ యాదవ్ తన కెరీర్లో బెస్ట్ ర్యాంక్ను పొందాడు. కుల్దీప్ 15 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్కు చేరుకున్నాడు. ఇక ఇప్పటివరకు టాప్ ర్యాంక్లో కొనసాగిన బుమ్రా.. మూడో స్ధానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ టెస్టు సిరీస్లో సత్తాచాటిన హేజిల్వుడ్ రెండో స్థానానికి ఎగబాకాడు. చదవండి: ICC Test Rankings: సత్తాచాటిన రోహిత్ శర్మ, జైశ్వాల్.. టాప్ 10 లోకి -
మురళీథరన్ రికార్డు బద్దలు కొట్టిన అశ్విన్
ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్ట్లో 9 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్.. ఈ ప్రదర్శనతో దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీథరన్ పేరిట ఉన్న పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఇందులో ఓ రికార్డు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ టెస్ట్ సిరీస్లో 25 అంతకంటే ఎక్కువ వికెట్లు అత్యధిక సార్లు తీసిన బౌలర్గా అశ్విన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మురళీథరన్ పేరిట ఉండిన ఈ రికార్డును అశ్విన్ బద్దలుకొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (800) సాధించిన మురళీ తన టెస్ట్ కెరీర్లో (ఓ టెస్ట్ సిరీస్లో) 25 అంతకంటే ఎక్కువ వికెట్ల ఘనతను ఆరు సార్లు నమోదు చేయగా.. అశ్విన్ ఏడు సందర్భాల్లో ఈ ఘనత సాధించాడు. కేవలం 100 టెస్ట్ల్లోనే 516 వికెట్లు (36 ఐదు వికెట్ల ఘనతలు) తీసిన అశ్విన్.. మరో 285 వికెట్లు తీస్తే మురళీథరన్ పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును బద్దలు కొడతాడు. కాగా, ధర్మశాల వేదికగా జరిగిన టెస్ట్లో ఇంగ్లండ్పై ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. ఐదు మ్యాచ్ల టెస్ట్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ సిరీస్లో 5 మ్యాచ్ల్లో 26 వికెట్లు పడగొట్టిన అశ్విన్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ సిరీస్లో యాష్ రెండు ఐదు వికెట్ల ఘనతలు, ఓ నాలుగు వికెట్ల ఘనత నమోదు చేశాడు. -
ప్రపంచంలో మొట్ట మొదటి బౌలర్గా అశ్విన్ అరుదైన ఘనత
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్రికెట్ ప్రపంచంలో ఏ బౌలర్కూ ఇంత వరకు సాధ్యం కాని ఘనత సాధించాడు. కాగా 2011లో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు ఈ చెన్నై ఆటగాడు. ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో తన తొలి టెస్టు ఆడాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసిన ఈ రైటార్మ్ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లతో చెలరేగాడు. అలా తన కెరీర్లో తొలి ఐదు వికెట్ల హాల్ నమోదు చేశాడు. తాజాగా తన వందో టెస్టులోనూ ఈ ఘనత సాధించాడు అశ్విన్. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లకే పరిమితమైన అశూ.. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లతో దుమ్ములేపాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఈ నేపథ్యంలో.. అరంగేట్రంలో, వందో టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్గా అశ్విన్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్గా నిలిచాడు. కాగా అశ్విన్ తన కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 36 సార్లు ఐదు వికెట్ల హాల్ సాధించడం విశేషం. తద్వారా టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు(35 సార్లు) బద్దలు కొట్టాడు. అంతేకాదు ఒకే ప్రత్యర్థి జట్టుపైన అత్యధిక టెస్టు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గానూ నిలిచాడు. ఇప్పటి వరకు అశ్విన్.. ఆస్ట్రేలియా మీద 114, ఇంగ్లండ్ మీద 114 వికెట్లు తీశాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగానే 500 వికెట్లు క్లబ్లో చేరాడు. అతడి ఖాతాలో ప్రస్తుతం 516 వికెట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ధర్మశాలలో ఇంగ్లండ్తో జరిగిన నామమాత్రపు ఆఖరి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 చదవండి: #Sarfaraz: తెగ మిడిసిపడుతున్నాడు.. గిల్- బెయిర్స్టో గొడవలో సర్ఫరాజ్.. వైరల్ -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి భారత క్రికెటర్గా
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు.కెరీర్లో వందో టెస్టు ఆడిన అశ్విన్.. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి జట్టుకు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టిన అశూ.. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లతో సత్తాచాటాడు. జాక్ క్రాలీ, డకెట్, పోప్ వంటి కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లీష్ జట్టును దెబ్బతీశాడు. ఓవరాల్గా అశ్విన్ తన వందో టెస్టులో 9 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లతో చెలరేగిన అశ్విన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్ర అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్గా అశ్విన్ రికార్డులెక్కాడు. అశ్విన్ ఇప్పటివరకు తన టెస్టు కెరీర్లో 36 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే 132 మ్యాచ్ల్లో 35 సార్లు ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. తాజా మ్యాచ్లో కుంబ్లే ఆల్టైమ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. టీమిండియా ఘన విజయం.. ఇక ధర్మశాల టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ను ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. 259 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇంగ్లండ్.. 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్ ఘోర ఓటమి చవిచూసింది. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లతో చెలరేగగా.. జడేజా, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో సైతం 218 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 477 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రోహిత్ శర్మ(103), గిల్(110) సెంచరీలతో మెరిశారు. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 259 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక వరుసగా నాలుగు టెస్టుల్లో విజయం సాధించిన భారత్.. ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు ►టాస్: ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 218 ►భారత్ తొలి ఇన్నింగ్స్లో చేసిన పరుగులు: 477 (ఓవరాల్గా 259 పరుగుల ఆధిక్యం) ►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 195 ►విజేత: టీమిండియా.. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపు ►ఐదు మ్యాచ్ల సిరీస్ 4-1తో టీమిండియా కైవసం View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ సొంతం
India vs England 5th Test Day 3: ఇంగ్లండ్తో నామమాత్రపు ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఉపఖండ పిచ్లపై ‘బజ్బాల్’ ఆటలు చెల్లవంటూ మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించి దిమ్మతిరిగేలా షాకిచ్చింది. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్తో పాటు.. బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ(103), శుబ్మన్ గిల్(110) అద్భుత ప్రదర్శనల కారణంగా ఈ విజయం సాధ్యమైంది. ఫలితంగా సొంతగడ్డపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి ప్రధాన బ్యాటర్లు లేకుండానే యువ క్రికెటర్లతో కూడిన జట్టుతోనే భారీ విజయం అందుకుని తమ స్థాయిని చాటుకుంది టీమిండియా. That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 స్పిన్నర్ల ఆధిపత్యం ఇక ఈ మ్యాచ్లో అశ్విన్ కెరీర్లో వందో టెస్టు. ఇందులో అశూ మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి సత్తా చాటగా.. ఓవరాల్గా కుల్దీప్ యాదవ్ 7, రవీంద్ర జడేజా రెండు, జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. కుల్దీప్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, డబుల్ సెంచరీల వీరుడు యశస్వి జైస్వాల్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. ధర్మశాలలో మ్యాచ్ సాగిందిలా గురువారం మొదలైన ధర్మశాల టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ ఐదు(5/72) వికెట్లతో చెలరేగగా.. వందో టెస్టు వీరుడు రవిచంద్రన్ అశ్విన్ నాలుగు (4/51) వికెట్లతో దుమ్ములేపాడు. రవీంద్ర జడేజా తాను సైతం అంటూ ఒక వికెట్(1/17) దక్కించుకున్నాడు. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్(57), రోహిత్ శర్మ శుభారంభం అందించారు. ఇక రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ సెంచరీ(103) పూర్తి చేసుకోగా.. వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్(110) సైతం శతక్కొట్టాడు. వీరిద్దరికి తోడు అరంగేట్ర బ్యాటర్ దేవ్దవ్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) అర్ధ శతకాలతో రాణించారు. ఫలితంగా శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 473 పరుగులు స్కోరు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో.. 473/8 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి.. కేవలం నాలుగు పరుగులు జతచేసి భారత్ ఆలౌట్ అయింది. 477 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించి.. 259 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. టీమిండియా స్పిన్నర్ల ధాటిని తట్టుకోలేకపోయింది. 195 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ జయభేరి మోగించింది. ఐదుగురి అరంగేట్రం ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ సందర్భంగా రెండో టెస్టులో మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్.. మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్.. నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్.. ఐదో టెస్టులో దేవ్దత్ పడిక్కల్ అంతర్జాతీయ క్రికెట్లో అడగుపెట్టారు. వీరిలో రజత్ పాటిదార్ మినహా మిగిలిన నలుగురు తమదైన ముద్ర వేయగలిగారు. ముఖ్యంగా ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం(56) సాధించగా.. అరంగేట్రంలోనే పడిక్కల్ సైతం హాఫ్ సెంచరీ(65)తో మెరిశాడు. టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు ►టాస్: ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 218 ►భారత్ తొలి ఇన్నింగ్స్లో చేసిన పరుగులు: 477 (ఓవరాల్గా 259 పరుగుల ఆధిక్యం) ►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 195 ►విజేత: టీమిండియా.. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపు ►ఐదు మ్యాచ్ల సిరీస్ 4-1తో టీమిండియా కైవసం ►హైదరాబాద్లో తొలి టెస్టు గెలిచిన ఇంగ్లండ్.. ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్కోట్, రాంచి.. తాజాగా ధర్మశాలలో టీమిండియా వరుస విజయాలు. పూర్తి అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
#Ash: వారెవ్వా.. 4.2 ఓవర్లలోనే మూడు వికెట్లు..
టీమిండియా వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వందో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇంగ్లండ్తో ఐదో టెస్టు సందర్భంగా ఈ అరుదైన మైలురాయికి చేరుకున్న అశూ.. ధర్మశాలలో తన స్పిన్ మాయాజాలం ప్రదర్శిస్తున్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇంగ్లండ్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. గింగిరాలు తిరిగే బంతితో ప్రత్యర్థి జట్టు టాపార్డర్ను కుప్పకూల్చాడు. శనివారం మొదలైన మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా 477 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్కు దిగింది. ఈ క్రమంలో అశ్విన్ ఆరంభం(1.5 ఓవర్)లోనే ఓపెనర్ బెన్ డకెట్(2)ను బౌల్డ్ చేశాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) అనంతరం మరో ఓపెనర్ జాక్ క్రాలే(1- 5.3వ ఓవర్ వద్ద)ను కూడా వెనక్కి పంపాడు. ఆ తర్వాత వన్డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(19- 9.2 ఓవర్ వద్ద) రూపంలో మూడో వికెట్ కూడా తానే దక్కించుకుని టాపార్డర్ పతనాన్ని శాసించాడు ఈ చెన్నై బౌలర్. ఓవరాల్గా శనివారం నాటి ఆటలో తన బౌలింగ్లో వేసిన 4.2 ఓవర్లలోనే అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ జానీ బెయిర్ స్టో(39) రూపంలో నాలుగో వికెట్ దక్కించుకోగా.. బెన్ స్టోక్స్ను అవుట్ చేసి ఐదో వికెట్ను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో భారత స్పిన్నర్ల దెబ్బకు భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 103 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్కు ముందు అశూకు నాలుగు వికెట్లు దక్కగా.. కుల్దీప్ ఒక వికెట్ తీశాడు. ఇక టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 156 పరుగులు వెనుకబడి ఉంది. -
వందో టెస్ట్.. చెత్త రికార్డు మూటగట్టుకున్న అశ్విన్
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు వందో టెస్ట్ అన్న విషయం తెలిసిందే. ఈ చిరస్మరణీయ మ్యాచ్లో అశ్విన్ ఓ అనవసరపు చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసి బంతితో రాణించిన యాష్.. బ్యాటింగ్లో నిరాశపరిచి డకౌటయ్యాడు. తద్వారా వందో టెస్ట్లో డకౌటైన మూడో భారత క్రికెటర్గా, ఓవరాల్గా తొమ్మిదో ఆటగాడిగా ఘోర అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. వందో టెస్ట్లో డకౌటైన తొలి ఆటగాడిగా భారత క్రికెటర్ దిలీప్ వెంగసర్కార్ (1988) రికార్డుల్లోకెక్కాడు. ఆతర్వాత అలెన్ బోర్డర్ (1991), కోట్నీ వాల్ష్, మార్క్ టేలర్ (1998), స్టీఫెన్ ఫ్లెమింగ్ (2006), బ్రెండన్ మెక్కల్లమ్ (2016), అలిస్టర్ కుక్ (2019), చతేశ్వర్ పుజారా (2023) తమతమ వందో టెస్ట్లో ఖాతా తెరవకుండా ఔటయ్యారు. ఇదిలా ఉంటే, ఐదో టెస్ట్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసి, 255 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కుల్దీప్ యాదవ్ (27), జస్ప్రీత్ బుమ్రా (19) క్రీజ్లో ఉన్నారు. 135/1 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. రోహిత్ శర్మ (103), శుభ్మన్ గిల్ (110) శతకాలతో రెచ్చిపోవడంతో భారీ స్కోర్ చేసింది. వీరిద్దరికి యువ మిడిలార్డర్ బ్యాటర్లు దేవ్దత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56) తోడవ్వడంతో పరుగుల వరద పారింది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (57) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. తొలి రోజు ఆటలో కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
Viral Video: ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అశ్విన్ను చూసే నేర్చుకోవాలి..!
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. తొలుత ఇంగ్లండ్ను 218 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. ఆతర్వాత బ్యాటింగ్లోనూ రెచ్చిపోయి భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోయి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (57) మెరుపు అర్దశతకం చేసి ఔట్ కాగా.. హిట్మ్యాన్ రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజ్లో కొనసాగుతున్నాడు. రోహిత్కు జతగా శుభ్మన్ గిల్ (26) క్రీజ్లో ఉన్నాడు. భారత్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు కేవలం 83 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. First Kuldeep Yadav give the ball to Ravi Ashwin but Ashwin return the ball to Kuldeep Yadav to celebrate his 5-Wicket haul. - Beautiful moments of the day...!!!! pic.twitter.com/64ev9CFM4f — CricketMAN2 (@ImTanujSingh) March 7, 2024 కాగా, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత మైదానంలో తారసపడిన ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇంగ్లండ్ను ఆలౌట్ చేసిన అనంతరం భారత ఆటగాళ్లు పెవిలియన్కు వెళ్తుండగా వందో టెస్ట్ ఆడుతున్న అశ్విన్ను ముందుగా నడవమని సహచర ఆటగాళ్లు కోరారు. అయితే ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ ఇన్నింగ్స్ హీరో కావడంతో అశ్విన్ సహచరుల మాటకు ఒప్పుకోలేదు. కుల్దీప్నే ముందుగా నడవాల్సిందిగా కోరాడు. ఇలా నువ్వు-నేను అంటూ అశ్విన్, కుల్దీప్ మధ్య కాసేపు చర్చ జరిగింది. చివరికి అశ్విన్.. కుల్దీప్ను ఒప్పించాడు. కుల్దీప్ టీమ్ను లీడ్ చేస్తూ పెవిలియన్వైపు నడిచాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడయో నెట్టింట వైరలవుతుంది. వందో టెస్ట్ ఆడుతూ 500కు పైగా వికెట్లు తీసిన అశ్విన్ హుందాతనం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంత ఎదిగినా ఒదగడం అశ్విన్ను చూసే నేర్చుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
Ind vs Eng: ‘బజ్బాల్’ను కట్టడి చేసి.. బ్యాటింగ్లో అదరగొట్టి!
India vs England, 5th Test Day 1 Highlights: ఇంగ్లండ్తో ఐదో టెస్టు తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా పైచేయి సాధించింది. ‘బజ్బాల్’ విధానంతో దూకుడు ప్రదర్శించాలనుకున్న స్టోక్స్ బృందాన్ని కట్టడి చేసి.. స్పిన్ మాయాజాలంతో చుక్కలు చూపించింది. స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే భారత్ 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ధర్మశాలలో గురువారం నామమాత్రపు ఆఖరి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత స్పిన్నర్లు ఆది నుంచే అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తూ.. ఇంగ్లిష్ జట్టును తిప్పలు పెట్టారు. ఓపెనర్ జాక్ క్రాలే(79) ఒక్కడే పట్టుదలగా నిలబడగా.. మిగతా వాళ్లలో ఒక్కరి నుంచి కూడా అతడికి సహకారం అందలేదు. కుల్దీప్, అశ్విన్ స్పిన్ మాయ (Kuldeep Yadav- Ravichandran Ashwin Spin Magic) ఈ క్రమంలో 218 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. టీమిండియా స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు(5/72) వికెట్లతో చెలరేగగా.. వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ నాలుగు(4/51) వికెట్లతో రాణించాడు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్(1/17) దక్కింది. 𝙈𝙤𝙢𝙚𝙣𝙩𝙨 𝙇𝙞𝙠𝙚 𝙏𝙝𝙚𝙨𝙚! R Ashwin 🤝 Kuldeep Yadav Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ashwinravi99 | @imkuldeep18 | @IDFCFIRSTBank pic.twitter.com/hJyrCS6Hqh — BCCI (@BCCI) March 7, 2024 అర్ధ శతకాలతో చెలరేగి భారత ఓపెనర్లు (Yashasvi Jaiswal- Rohit Sharma) ఇక తొలి రోజే ఇంగ్లండ్ ఆట కట్టించిన టీమిండియా.. బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫిఫ్టీ(58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు)తో ఇరదగీశాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అర్ధ శతకంతో చెలరేగాడు. అయితే, షోయబ్ బషీర్ బౌలింగ్లో అనూహ్య రీతిలో యశస్వి స్టంపౌట్గా వెనుదిరగగా.. శుబ్మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా స్కోరు 135/1 కాగా.. రోహిత్ శర్మ 52, శుబ్మన్ గిల్ 26 పరుగులతో అజేయంగా ఉన్నారు. Yashasvi goes BIG & how! 🔥 Follow the match ▶️ https://t.co/jnMticF6fc#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/NRqpSKAg2K — BCCI (@BCCI) March 7, 2024 -
పెట్రోల్ ట్యాంకు మీద కిట్ పెట్టి.. ఆ తర్వాత నన్నూ కూర్చోబెట్టి!
R Ashwin's Emotional Tribute On 100th Test: ‘‘క్రికెట్ టోర్నీల్లో ఐపీఎల్కు ఉన్న ఆదరణ వేరు. అందుకే చాలా మంది టీ20 క్రికెట్ ఆడి ఐపీఎల్లోకి రావాలని భావిస్తారు. వాళ్ల కలలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే, ఒక్క విషయం మాత్రం ఆశావహ క్రికెటర్లందరూ గుర్తుపెట్టుకోవాలి. టెస్టు ఫార్మాట్ అనేది జీవితం నేర్పలేని పాఠాలెన్నింటినో నేర్పిస్తుంది. నా దృష్టిలో టెస్టు క్రికెట్ అంటే.. జీవితానికి సరికొత్త అర్థాన్నిచ్చే మంత్రం. ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి.. ప్రతికూలతలను ఎలా అధిగమించాలన్న విషయాలను బోధిస్తుంది. నా మనసులో ఎన్నో భావోద్వేగాలు చెలరేగుతున్నాయి. నాతో పాటు చెన్నైలో కూర్చుని ఉన్న ఓ వ్యక్తి కూడా ఉద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటాడు. నా క్రికెట్ కిట్ బైక్ పెట్రోల్ ట్యాంకు మీద పెట్టి.. దురదృష్టవశాత్తూ ఆయన ఇక్కడ లేరు. చిన్నతనంలో.. నా క్రికెట్ కిట్ బైక్ పెట్రోల్ ట్యాంకు మీద పెట్టి.. ఆ తర్వాత నన్ను కూడా ముందు కూర్చోబెట్టుకుని.. కోచింగ్ క్యాంపునకు తీసుకువెళ్లేవాడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయన.. తన కుమారుడు జీవితంలో.. కెరీర్లో ముందుకు వెళ్లాలని బలంగా కోరుకున్నారు. మా అమ్మ, మా తాతయ్య సహకారంతోనే ఆయన నన్ను ఈ స్థాయికి తీసుకురాగలిగారు. ప్రతి అడుగులోనూ నా వెన్నంటే ఉంది ఇక నా భార్య.. నన్ను పెళ్లి చేసుకునే సమయంలో నా ఈ ప్రయాణం ఎక్కడిదాకా వెళ్తుందో ఆమెకు తెలియదు. అయినా.. ప్రతి అడుగులోనూ నా వెన్నంటే ఉంది. నాకు ఇద్దరు ముద్దులొలికే పిల్లలు ఉన్నారు. వాళ్లు కూడా గత కొన్నేళ్లుగా నా క్రికెట్ జర్నీని అర్థం చేసుకుంటూ ఆస్వాదించగలుగుతున్నారు’’ అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. భారత్ తరఫున 100వ టెస్టు బరిలో దిగిన తరుణంలో.. తాను క్రికెటర్గా ఎదగడంలో తన తండ్రి రవిచంద్రన్ పాత్ర.. సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించడంలో తన భార్య ప్రీతి అండదండగా నిలిచిన తీరును గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యాడు. కాగా ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆఖరిదైన టెస్టు గురువారం మొదలైంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ అశ్విన్ కెరీర్లో వందో టెస్టు. ఇక ఈ ఘనత సాధించిన 14వ భారత ఆటగాడిగా చెన్నై ఆల్రౌండర్ అశూ చరిత్రకెక్కాడు. చదవండి: టీమిండియా స్టార్ సంచలన నిర్ణయం?! Number 9⃣9⃣ gets ready for his 💯th Test Match! 👏👏 📽️ WATCH 🔽 - Life, Cricket & Beyond ft. @ashwinravi99#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank — BCCI (@BCCI) March 7, 2024 -
'సెంచరీ' కొట్టిన అశ్విన్.. ఫోటోలు, వీడియోలు వైరల్
టీమిండియా స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో 100 మ్యాచ్ల మైలురాయి అందుకున్నాడు. టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన 14వ భారత ఆటగాడిగా అశ్విన్ రికార్డులకెక్కాడు. ఈ సందర్భంగా భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకమైన జ్ఞాపికతో పాటు వందో టెస్టు క్యాప్ను అందజేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన ఈ వేడుకలో అశ్విన్ సతీమణి ప్రీతి నారాయణన్ కూడా పాల్గొన్నారు. అదే విధంగా భారత ఆటగాళ్ల నుంచి అశ్విన్ గార్డ్ ఆఫ్ హనర్ కూడా స్వీకరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి. The joy in the face of #RavichandranAshwin 's kids tells us how happy & proud they are. Just a lovely & memorable family picture for them.#RaviAshwin #INDvsENGTest pic.twitter.com/3UV9bfW1QS — Abishek (@ItsAbishek04) March 7, 2024 స్పిన్ మాంత్రికుడు.. 2011లో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అశ్విన్.. తన పేరును ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. భారత టెస్టు జట్టులో కీలక ఆటగాడిగా ఆశూ కొనసాగుతున్నాడు. ముఖ్యంగా స్వదేశంలో అయితే అశ్విన్ రికార్డు ఘనంగా ఉంది. భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా అశ్విన్ కొనసాగుతున్నాడు. అశూ ఇప్పటివరకు స్వదేశంలో టెస్టుల్లో 350 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఇంగ్లండ్ సిరీస్లోనే తన 500వ టెస్టు వికెట్ల మార్కును కూడా అశ్విన్ అధిగమించాడు. కుంబ్లే తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్గా అశ్విన్ నిలిచాడు. ఓవరాల్గా ఈ అరుదైన ఫీట్ సాధించిన తొమ్మిదో క్రికెటర్గా అశ్విన్ ఉన్నాడు. అశ్విన్ తన టెస్టు కెరీర్లో ఇప్పటివరకు 100 మ్యాచ్ల్లో 507 వికెట్లు పడగొట్టాడు. Guard of Honour for Ravi Ashwin 🙌🫡#RavichandranAshwin #INDvsENGTest pic.twitter.com/5Jfea8pd7s — cricketuncut (@cricketunc89165) March 7, 2024 టీమిండియా తరపున 100పైగా టెస్టులు ఆడిన ఆటగాళ్లు వీరే.. సచిన్ టెండూల్కర్ - 200 టెస్టులు రాహుల్ ద్రవిడ్ - 163 టెస్టులు వీవీఎస్ లక్ష్మణ్ - 134 టెస్టులు అనిల్ కుంబ్లే - 132 టెస్టులు కపిల్ దేవ్ - 131 టెస్టులు సునీల్ గవాస్కర్ - 125 టెస్టులు దిలీప్ వెంగ్సర్కార్ - 116 టెస్టులు సౌరవ్ గంగూలీ - 113 టెస్టులు విరాట్ కోహ్లి - 113 టెస్టులు ఇషాంత్ శర్మ - 105 టెస్టులు హర్భజన్ సింగ్ - 103 టెస్టులు చెతేశ్వర్ పుజారా -103 టెస్టులు వీరేంద్ర సెహ్వాగ్ - 103 టెస్టులు అశ్విన్-100 టెస్టులు 💯 reasons to celebrate the moment!#TeamIndia Head Coach Rahul Dravid presents a special memento to @ashwinravi99 on the occasion of his 100th Test match 👏👏 Follow the match ▶️ https://t.co/OwZ4YNua1o#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vxvw5jQ1z1 — BCCI (@BCCI) March 7, 2024 A special video on Ravi Ashwin's 100th Test match 👌pic.twitter.com/hamrGQuAD7 — CricTracker (@Cricketracker) March 7, 2024 An unforgettable milestone 🙌 Ravichandran Ashwin's 100th Test honoured with a guard of honour!#INDvENGpic.twitter.com/mIqaYNA78e — OneCricket (@OneCricketApp) March 7, 2024 -
Ind vs Eng: ముగిసిన తొలి రోజు ఆట.. టీమిండియాదే ఆధిపత్యం
India vs England 5th Test Day 1 updates: టీమిండియాతో ధర్మశాల వేదికగా గురువారం మొదలైన టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. భారత స్పిన్నర్ల దెబ్బకు 218 పరుగులకే తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది. ఈ క్రమంలో భారత్ బ్యాటింగ్కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సరికి 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధ శతకం(52)తో ఆకట్టుకుని.. వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్(26)తో కలిసి క్రీజులో ఉన్నాడు. ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 57 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అతడి ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్గా ఐదో టెస్టులో టీమిండియా తొలిరోజు 10 వికెట్లు తీయడంతో పాటు.. 135 పరుగులు చేసి ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) 24.2: రోహిత్ శర్మ అర్ధ శతకం బషీర్ బౌలింగ్లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్మ్యాన్ తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా యశస్వి జైస్వాల్(57) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. షోయబ్ బషీర్ బౌలింగ్లో జైస్వాల్ స్టంపౌట్గా వెనుదిరిగాడు. శుబ్మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 104-1(21) 1000 పరుగుల వీరుడు 14.3: టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న యశస్వి జైస్వాల్. 16 ఇన్నింగ్స్లోనే అరుదైన మైలురాయిని చేరుకుని.. ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్గా రికార్డు. 13 ఓవర్ల ముగిసే సరికి భారత్ స్కోరు: 57/0 రోహిత్ 30, జైస్వాల్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. 11.4: హాఫ్ సెంచరీ కొట్టిన టీమిండియా 10 ఓవర్లలో టీమిండియా స్కోరు: 47/0 జైస్వాల్ 25, రోహిత్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లలో టీమిండియా స్కోరు: 18-0 ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 4, రోహిత్ శర్మ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. 218 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్ ఐదో టెస్ట్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకే ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. అశ్విన్ ఖాతాలో మూడో వికెట్ 218 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో బెన్ ఫోక్స్ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎనిమిదో వికెట్ డౌన్ 49.4: అశ్విన్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి మార్క్ వుడ్ డకౌట్గా వెనుదిరిగాడు. షోయబ్ బషీర్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 183-8(50) ఏడో వికెట్ డౌన్ 49.2: వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్కు ఇంగ్లండ్ టెయిలెండర్ టామ్ హార్లే రూపంలో ధర్మశాల మ్యాచ్లో తొలి వికెట్ దక్కింది. మార్క్ వుడ్ క్రీజులోకి వచ్చాడు. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ కుల్దీప్ బౌలింగ్లో స్టోక్స్ ఎల్బీడబ్ల్యూ. స్టోక్స్ రూపంలో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోగా.. కుల్దీప్ యాదవ్కు ఐదో వికెట్ దక్కింది. టామ్హర్లే క్రీజులోకి వచ్చాడు. ►ఇంగ్లండ్ జో రూట్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన రూట్.. జడేజా బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో వికెట్ డౌన్.. 175 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ బెన్ స్టోక్స్ వచ్చాడు. మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 37.2: టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి తన మాయాజాలం ప్రదర్శించాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టి ప్రమాదకరంగా మారిన ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే(79)ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. ఫలితంగా మూడో వికెట్నూ తనఖాతాలోనే వేసుకున్నాడు. వందో టెస్టు ఆడుతున్న జానీ బెయిర్ స్టో క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 143-3(38) రెండో వికెట్ డౌన్.. 100 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ఓలీ పోప్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. లంచ్ విరామానికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలే(61) పరుగులతో ఉన్నాడు. తొలి వికెట్ డౌన్.. 64 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన బెన్ డకెట్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి ఓలీ పోప్ వచ్చాడు. 14.2: హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న ఇంగ్లండ్.. స్కోరు: 51/0. డకెట్ 21, క్రాలే 29 పరుగులతో ఆడుతున్నారు. 12 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు: 43/0 నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్.. ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే(11), డక్కెట్(8) నిలకడగా ఆడుతున్నారు. 7 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోర్: 20/0 4 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 9/0 4 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో డక్కెట్, జాక్ క్రాలే(7) ఉన్నారు. ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రజిత్ పాటిదార్ స్ధానంలో పడిక్కల్కు చోటు దక్కింది. అదే విధంగా జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆకాష్ దీప్ ప్లేస్లో బుమ్రా తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ సైతం ఒక మార్పుతో బరిలోకి దిగింది. పేసర్ రాబిన్సన్ స్ధానంలో మార్క్ వుడ్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కింది. ఇక భారత స్పిన్ లెజండ్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్లో 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో సైతం తన వందో టెస్టులో బరిలోకి దిగాడు. తుది జట్లు: భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్స్టో, బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ -
అప్పుడు పుజారాకు ఫోన్ చేశా.. రోహిత్కు థాంక్స్: అశూ భార్య
‘‘రాజ్కోట్ టెస్టు జరుగుతున్న సమయంలో పిల్లలు స్కూలు నుంచి వచ్చిన ఐదు నిమిషాల తర్వాత.. తను 500 వికెట్ల మార్కు అందుకున్నాడు. వెనువెంటనే మమ్మల్ని అభినందిస్తూ ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. ఇంతలో మా అత్తయ్య పెద్దగా కేక పెట్టి కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించాం. అశ్విన్కు ఈ విషయం గురించి చెప్పకూడదని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే.. చెన్నై- రాజ్కోట్ మధ్య విమాన రాకపోకలు అంత ఎక్కువగా లేవని తెలుసు. అందుకే నేను ఛతేశ్వర్ పుజారాకు ఫోన్ చేసి అతడి కుటుంబ సభ్యుల సహాయం కోరాను. ఆ తర్వాత అశ్విన్కు ఫోన్ చేశాను. ఎందుకంటే ఆంటీని పరీక్షించిన తర్వాత.. ‘ఇలాంటి పరిస్థితుల్లో కొడుకు దగ్గరగా ఉంటే బాగుంటుంది’ అని డాక్టర్ చెప్పారు. అదే విషయం అశ్విన్తో చెప్పగానే తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వెంటనే కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత 20 -25 నిమిషాలకు గానీ మళ్లీ మాట్లాడలేకపోయాడు. రోహిత్ శర్మ, రాహుల్(ద్రవిడ్) భాయ్, బీసీసీఐలోని ఇతర సభ్యులకు ధన్యవాదాలు. అశ్విన్ చెన్నైకి చేరేంతవరకు క్షేమసమాచారాలు అడుగుతూ మాకు అండగా నిలబడ్డారు. ఆరోజు అశ్విన్ వచ్చేసరికి అర్ధరాత్రి అయింది’’ అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సతీమణి ప్రీతి నారాయణన్ ఉద్వేగానికి లోనైంది. అశ్విన్ ఐదు వందల టెస్టు వికెట్ల క్లబ్లో చేరాడన్న సంతోష సమయంలోనే అత్తగారు అనారోగ్యం పాలవడం తమను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని పేర్కొంది. కష్టకాలంలో ఛతేశ్వర్ పుజారా కుటుంబం, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ తమకు అండగా నిలిచారని ప్రీతి కృతజ్ఞతాభావం చాటుకుంది. కాగా ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్ సందర్భంగా మూడో టెస్టు మధ్యలోనే అశ్విన్ జట్టును వీడిన విషయం తెలిసిందే. 500 వికెట్ల క్లబ్లో చేరిన తర్వాత తల్లి అనారోగ్యం పాలైన నేపథ్యంలో సెలవు తీసుకుని చెన్నైకి వెళ్లాడు. అయితే, ఆమె ఆరోగ్యం కుదుటపడగానే మళ్లీ జట్టుతో చేరాడు. ఇక ప్రస్తుతం ధర్మశాలలో జరిగే ఐదో టెస్టుతో అశ్విన్ మళ్లీ బిజీ కానున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో అశూకు ఇది వందో టెస్టు కావడం విశేషం. ఈ నేపథ్యంలో అశ్విన్ భార్య ప్రీతి.. ఈ సిరీస్ సమయంలో తమ కుటుంబం మానసిక వేదనకు గురైన తీరును వివరిస్తూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కాలమ్లో తన మనసులోని భావాలు పంచుకుంది. చదవండి: Rohit Sharma: సాకులు చెప్పి తప్పించుకోవచ్చు.. కానీ ఉదయం 5.30 గంటలకే ఇలా.. -
100th Test: అశ్విన్పై మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కల్చర్ తెలిసినవాళ్లే తనలాంటి పెద్దలను గౌరవిస్తారంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా అశ్విన్ ఇప్పటికే 500 టెస్టు వికెట్ల క్లబ్లో చేరాడు. అదే విధంగా సిరీస్లో ఆఖరిదైన ధర్మశాల మ్యాచ్ సందర్భంగా తన కెరీర్లో వందో టెస్టు ఆడబోతున్నాడు ఈ చెన్నై ఆల్రౌండర్. ఇలా ఇంగ్లండ్తో తాజా సిరీస్ను తన ప్రయాణంలో మరుపురాని జ్ఞాపకంగా పదిలం చేసుకోబోతున్న ఆనందంలో ఉన్నాడు అశ్విన్. ఈ నేపథ్యంలో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అశూ అన్నకు ఆల్ ది బెస్ట్ చెబుతూ అభిమానులు నెట్టింట సందడి చేస్తుండగా.. సహచర ఆటగాళ్లు సైతం అతడిని అభినందిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్, తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ శివరామకృష్ణన్ మాత్రం అశ్విన్పై మరోసారి అక్కసు వెళ్లగక్కాడు. అశ్విన్ను ప్రశంసిస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్కు స్పందిస్తూ.. ‘‘వందో టెస్టు ఆడబోతున్న అతడిని విష్ చేద్దామని ఫోన్ కాల్ చేశాను. కానీ అతడు నా కాల్ కట్ చేశాడు. మెసేజ్ పంపినా బదులివ్వలేదు. మాజీ క్రికెటర్లమైన మాకు దక్కే గౌరవం ఇది’’ అని అశ్విన్పై ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో అశూ అభిమాని ఒకరు.. ‘‘బౌలింగ్ ఆవరేజ్ 44.. 26 వికెట్లు... బౌలింగ్ ఆవరేజ్ 23.9.. 507 వికెట్లు’’ అంటూ లక్ష్మణ్, అశ్విన్ బౌలింగ్ గణాంకాలను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చాడు. ప్రతిస్పందనగా.. ‘‘కల్చర్ తెలిసిన వాళ్లకే ఎదుటివాళ్లను గౌరవించే సంస్కారం ఉంటుంది. గతంలో అశ్విన్ బౌలింగ్ యాక్షన్ గురించి నేను కొన్ని కరెక్షన్లు చెప్పాను. అంతేకానీ అతడిని విమర్శించలేదు. నేను టీమిండియా తరఫున 9 టెస్టులు, 16 వన్డేలు ఆడాను. మీలో ఎవరైనా భారత్కు నా కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడారా?’’ అని లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఫైర్ అయ్యాడు. Tried calling him a few times to wish him for his 100th Test. Just cut off my call. Sent him a message, no reply. Thats the respect we former cricketers get — Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) March 6, 2024 కాగా వన్డే వరల్డ్కప్-2023 ఆరంభానికి ముందు శివరామకృష్ణన్ అశ్విన్ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. భారత గడ్డ మీద అతడి కోసం తయారు చేసే పిచ్ల మీద మాత్రమే అశ్విన్ వికెట్లు తీయగలడని.. విదేశాల్లో మాత్రం అతడి పప్పులు ఉడకవని కామెంట్ చేశాడు. అంతేగాకుండా అశ్విన్ ఓ అన్ఫిట్ క్రికెటర్ అని.. వేరే వాళ్లకు ఛాన్సులు రాకుండా చేస్తున్నాడంటూ ఆరోపించాడు. తాజాగా మరోసారి ఇలా అరుదైన మైలురాయికి అశూ చేరువైన సమయంలో శివరామకృష్ణన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: Sachin Tendulkar: ఇషాన్, శ్రేయస్ల కాంట్రాక్ట్ రద్దు.. నేనైతే అంటూ సచిన్ పోస్ట్ వైరల్ -
రోజు వ్యవధిలో సెంచరీలు కొట్టనున్న నలుగురు స్టార్ క్రికెటర్లు
అంతర్జాతీయ క్రికెట్లో ఒక్క రోజు వ్యవధిలో నలుగురు స్టార్ క్రికెటర్లు సెంచరీలు కొట్టబోతున్నారు. మార్చి 7, 8 తేదీల్లో టీమిండియాకు చెందిన రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్కు చెందిన జానీ బెయిర్స్టో, న్యూజిలాండ్కు చెందిన కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలు తమ కెరీర్లలో వందో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. రోజు వ్యవధిలో నలుగురు స్టార్ క్రికెటర్లు వందో టెస్ట్ మ్యాచ్ ఆడటం క్రికెట్ చరిత్రలో బహుశా జరిగి ఉండకపోవచ్చు. ఈ రికార్డుకు సంబంధించిన సరైన సమాచారం లేదు కానీ, ఇలాంటి సందర్భం రావడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మరో విశేషమేమిటంటే.. పై పేర్కొన్న తేదీల కంటే కొద్ది రోజుల ముందు (ఫిబ్రవరి 15న) ఇంగ్లండ్కే చెందిన మరో ఆటగాడు వంద టెస్ట్ సెంచరీల మార్కును తాకాడు. ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భారత్తో జరిగిన మూడో టెస్ట్తో వంద సెంచరీల అరుదైన మైలురాయిని తాకాడు. ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మార్చి 7న మొదలయ్యే ఐదో టెస్ట్ మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్స్టోలకు వందో టెస్ట్ మ్యాచ్ కానుండగా.. క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న మొదలయ్యే రెండో టెస్ట్ మ్యాచ్ కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలకు సెంచరీ మ్యాచ్ అవుతుంది. జానీ బెయిర్స్టో- 99 టెస్ట్ల్లో 12 సెంచరీలు, 5974 పరుగులు రవింద్రన్ అశ్విన్- 99 టెస్ట్ల్లో 5 సెంచరీలు, 3309 పరుగులు, 507 వికెట్లు కేన్ విలియమ్సన్- 99 టెస్ట్ల్లో 32 సెంచరీలు, 8675 పరుగులు, 30 వికెట్లు టిమ్ సౌథీ-99 టెస్ట్ల్లో 6 హాఫ్ సెంచరీలు, 2072 పరుగులు, 378 వికెట్లు టెస్ట్ల్లో ఇప్పటివరకు 75 మంది 100 టెస్ట్ల మార్కును తాకారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తరఫున 15 మంది, భారత్ తరఫున 13, వెస్టిండీస్ నుంచి 9, సౌతాఫ్రికా 8, శ్రీలంక 6, పాకిస్తాన్ 5, న్యూజిలాండ్ తరఫున నలుగురు 100 టెస్ట్ల మార్కును తాకారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. -
100th Test: కెప్టెన్ అయితే బాగుండేది!.. అశ్విన్ భావోద్వేగం
టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన మైలురాయి ముంగిట నిలిచాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన ఈ ఆల్రౌండర్.. ధర్మశాలలో ‘సెంచరీ’ పూర్తి చేసుకోనున్నాడు. ఇంగ్లండ్తో జరుగనున్న ఐదో టెస్టు సందర్భంగా అశూ ఈ ఫీట్ అందుకోనున్నాడు. ఈ నేపథ్యంలో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేతో మాట్లాడుతూ అశ్విన్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. కెప్టెన్ అయితే బాగుండేది.. అశ్విన్ భావోద్వేగం ‘‘నా కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు. ఎన్నో సవాళ్లు. ప్రతికూల సమయంలో.. ‘నాకే ఎందుకిలా జరుగుతోంది?’ అని బాధపడేవాడిని. అయితే, క్లిష్ట పరిస్థితులు, ఒత్తిళ్లను దాటినందు వల్లే ఈరోజు నాకంటూ ఈ గుర్తింపు వచ్చిందని, ఈ స్థాయికి చేరుకోగలిగానని అనిపిస్తోంది. చాలా మంది నా దగ్గరకు వచ్చి.. ‘నీకు కెప్టెన్గా అవకాశం ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది’ అని అంటూ ఉంటారు. కానీ.. అది ఎప్పటికీ జరుగదనే విషయం నాకు తెలుసు. అందుకే మనసులో ఎలాంటి సంశయాలు పెట్టుకోకుండా హాయిగా ఉంటాను’’ అని అశూ భావోద్వేగానికి లోనయ్యాడు. వాళ్లకు విఫలం కావడానికి మరిన్ని ఛాన్సులు ఇదిలా ఉంటే.. విదేశీ గడ్డపై ముఖ్యంగా SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అశ్విన్ను కాదని.. మరో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకే బీసీసీఐ ప్రాధాన్యం ఇస్తోందన్న విషయం తెలిసిందే. ఈ అంశం గురించి ప్రస్తావనకు రాగా అశ్విన్ హుందాగా సమాధానమిచ్చాడు. ‘‘బ్యాటర్లతో పోలిస్తే బౌలర్లను ద్వితీయ శ్రేణి కిందే పరిగణిస్తారు. నేను ఒక్క మ్యాచ్లో విఫలమైతే వెంటనే పక్కనపెట్టేస్తారు. అదే వేరే వాళ్లకు విఫలం కావడానికి మరిన్ని ఛాన్సులు ఇస్తారు. నాకు ఆ స్వార్థం లేదు అయినా, నేను మనశ్శాంతిగానే ఉండగలుగుతాను. ఎందుకంటే.. కొన్ని కఠిన వాస్తవాలను అంగీకరించకతప్పదని నాకు తెలుసు. ఐదు రోజుల ఆట ముగిసిన తర్వాత జట్టు గెలిచిందా లేదా అన్న విషయానికి ప్రాధాన్యం ఇస్తాను. టీమిండియా గెలిస్తే నాకంతకంటే సంతోషం మరొకటి ఉండదు. అంతేగానీ స్వప్రయోజనాల కోసం జట్టు ప్రయోజనాలను తాకట్టుపెట్టాలనే స్వార్థం నాకు లేదు’’ అని అశ్విన్ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. ఈ మేరకు జియో సినిమా షోలో అశూ వ్యాఖ్యలు చేశాడు. 500 వికెట్ల క్లబ్లో చేరిన ఘనుడు కాగా ఇంగ్లండ్తో తాజా సిరీస్ మూడో టెస్టు సందర్భంగా అశ్విన్ 500 వికెట్ల క్లబ్(టెస్టు)లో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ధర్మశాలలో అశూతో పాటు ఇంగ్లండ్ క్రికెటర్ జానీ బెయిర్స్టో కూడా తన వందో టెస్టు ఆడబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి.. అశ్విన్ సారథ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా వందో టెస్టు సెలబ్రేట్ చేస్తారని అభిమానులు భావించారు. అయితే, రోహిత్ ఇప్పటికే జట్టుతో చేరడంతో అశూకు ఆ ఛాన్స్ లేనట్లే కనిపిస్తోంది. చదవండి: Anant- Radhika: రోహిత్ తిరుగు పయనం.. భయ్యాకు కోపం వచ్చిందంటే! -
చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్.. ప్రపంచంలో తొలి క్రికెటర్గా!
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ మ్యాచ్లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన స్పిన్ మయాజాలంతో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు పడగొట్టిన లియోన్.. కివీస్ పతనాన్ని శాసించాడు. అతడి స్పిన్ దాటికి న్యూజిలాండ్ కేవలం 196 పరుగులకే కుప్పకూలింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి 10 వికెట్లను లియోన్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో సంచలన ప్రదర్శన కనబరిచిన లియోన్ ఓ అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్గా నాథన్ నిలిచాడు. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు ఈ ఆసీస్ దిగ్గజం 10 సార్లు 5 వికెట్ల హాల్ సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. అశ్విన్ 9 సార్లు ఈ ఫీట్ సాధించాడు. తాజా మ్యాచ్తో అశ్విన్ రికార్డును లియోన్ బ్రేక్ చేశాడు. -
'మాకు ఓ అశ్విన్ దొరికేశాడు.. అతడొక సూపర్ స్టార్'
ధర్మశాల వేదికగా భారత్తో ఐదో టెస్టులో తలపడేందుకు ఇంగ్లండ్ సిద్దమవుతోంది. విజయంతో ఇండియా టూర్ను ముగించాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్ 3-1తో సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ మాత్రం అందరని అకట్టుకున్నాడు. రాంఛీ టెస్టులో బషీర్ 8 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఈ క్రమంలో బషీర్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్తో బషీర్ను వాన్ పోల్చాడు. "ఇంగ్లండ్ జట్టుకు మరో వరల్డ్ క్లాస్ సూపర్స్టార్ దొరికాడు. అతడే యువ సంచలనం షోయబ్ బషీర్ . అతడి కెరీర్లో తన రెండో టెస్టులోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఏకంగా 8 వికెట్టు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును భయపెట్టాడు. వరల్డ్ క్రికెట్లో మరో అశ్విన్ పుట్టుకొచ్చాడు. మాకు ఓ అశ్విన్ దొరికినందుకు సెలబ్రేషన్స్ జరపుకుంటున్నామునజ ఇక ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధిస్తుందని భావిస్తున్నా. మా జట్టు అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్తో బరిలోకి దిగాలి. ధర్మశాల వాతావారణం ఇంగ్లండ్ జట్టుకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇంగ్లండ్కు గెలిచే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి. భారత్ మాత్రం తమ జట్టులో కొన్ని మార్పులు చేసే ఛాన్స్ ఉందని ఓ యూట్యాబ్ ఛానల్లో వాన్ పేర్కొన్నాడు. చదవండి: #BCCI: 'అతడొక లీడింగ్ వికెట్ టేకర్.. అయినా కాంట్రాక్ట్ నుంచి' -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం
టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘట్టానికి భారత్-ఇంగ్లండ్ మధ్య ధర్మశాల వేదికగా జరుగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ వేదిక కానుంది. ఈ మ్యాచ్ ఇద్దరు ఆటగాళ్లకు 100వ టెస్ట్ మ్యాచ్ కానుంది. టీమిండియాకు చెందిన రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ జానీ బెయిర్స్టో తమ కెరీర్లలో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్తో ఇద్దరు ఆటగాళ్లు (వేర్వేరు జట్లకు చెందిన వారు) 100 టెస్ట్ల మార్కును తాకడం ఇది మూడోసారి మాత్రమే. అశ్విన్, బెయిర్స్టోలకు చిరకాలం గుర్తుండిపోయే ఈ మ్యాచ్ కోసం వారితో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కాగా, కెరీర్లో అత్యంత ముఖ్యమైన మైలురాయిని (100వ టెస్ట్) చేరుకునే ముందు ఇంగ్లండ్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ జానీ బెయిర్స్టోను ఫామ్ లేమి సమస్య తెగ కలవరపెడుతుంది. భారత్తో సిరీస్లో అతను ఆడిన నాలుగు మ్యాచ్ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ALERT 🚨. In the next match, both Ravi Ashwin and Jonny Bairstow will play their 100th Test match. This will be only the 3rd time in 147 years of Test history that players from two different teams will play their 100th Test in the same match. pic.twitter.com/nYq4ytbhHm — Vishal. (@SPORTYVISHAL) February 29, 2024 తొలి టెస్ట్లో 47 పరుగులు (37, 10) చేసిన బెయిర్స్టో.. రెండో టెస్ట్లో 51 (25, 26), మూడో టెప్ట్లో 4 (0, 4), నాలుగో టెస్ట్లో 68 పరుగులు (30, 38) మాత్రమే చేసి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. బెయిర్స్టో వందో మ్యాచ్లోనైనా రాణిస్తాడో లేదో వేచి చూడాలి. బెయిర్స్టో ఇప్పటివరకు ఆడిన 99 టెస్ట్ల్లో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీల సాయంతో 36.43 సగటున 5974 పరుగులు చేశాడు. అశ్విన్ విషయానికొస్తే.. యాష్ ఇదే సిరీస్లోని మూడో మ్యాచ్లో 500 వికెట్ల మార్కును తాకి చరిత్రపుటల్లోకెక్కాడు. ప్రస్తుతం అతను ఓ మోస్తరు ఫామ్తో పర్వాలేదనిపిస్తున్నాడు. ఈ సిరీస్లో యాశ్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసి, సిరీస్ లీడింగ్ వికెట్టేకర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు 99 టెస్ట్లు ఆడిన అశ్విన్.. 507 వికెట్లు, 3309 పరుగులు చేశాడు. ఇందులో 35 ఐదు వికెట్ల ఘనతలు, 5 సెంచరీలు ఉన్నాయి. కాగా, ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. మార్చి 7 నుంచి ఐదో టెస్ట్ ప్రారంభంకానుంది. -
#Ind vs Eng: టీమిండియాదే సిరీస్.. రసవత్తర మ్యాచ్లో ఆ ఇద్దరు ‘హీరోల’ వల్లే!
India vs England, 4th Test- India Beat England By 5 Wickets: రసవత్తరంగా సాగిన రాంచి టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. గిల్, జురెల్ హీరోచిత ఇన్నింగ్స్ వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్ అద్భుత అజేయ అర్ధ శతకం(52)తో మెరవగా.. ధ్రువ్ జురెల్(39 నాటౌట్) మరో విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయాలకు చేర్చాడు. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది భారత్. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 కాగా ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు భారత్లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ తొలి టెస్టులో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఆ మరుసటి మ్యాచ్లోనే తిరిగి పుంజుకున్న టీమిండియా.. వరుసగా విజయాలు సాధించింది. విశాఖపట్నం తర్వాత రాజ్కోట్.. తాజాగా రాంచి టెస్టులో గెలుపొంది ఇంగ్లండ్పై ఆధిపత్యాన్ని చాటుకుంది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, మిడిలార్డర్లో కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ లేకున్నా యువ ఆటగాళ్లతోనే సిరీస్ గెలిచి సత్తా చాటింది రోహిత్ సేన. రాంచి టెస్టు రసవత్తరంగా సాగిందిలా.. రాంచి వేదికగా శుక్రవారం ఇంగ్లండ్తో మొదలైన మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. తొలిరోజు ఆట ఆరంభంలో అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ వరుసగా వికెట్లు పడగొట్టడంతో మొదటి సెషన్లో పైచేయి సాధించింది. ఆ తర్వాత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలా ఓ చెయ్యి వేయగా.. 112 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను జో రూట్ అజేయ సెంచరీతో ఆదుకున్నాడు. ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగుల చేసి పైచేయి సాధించింది. జురెల్ ‘జువెల్’ ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో భాగంగా ఇంకో 51 పరుగులు జతచేసి.. 353 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ 2 పరుగులకే అవుట్ కాగా.. రజత్ పాటిదార్ (17), రవీంద్ర జడేజా(12), సర్ఫరాజ్ ఖాన్(14) విఫలమయ్యారు. వన్డౌన్బ్యాటర్ శుబ్మన్ గిల్(38) ఫర్వాలేదనపించాడు. అయితే, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 73 పరుగులతో జట్టును ఆదుకోగా.. మూడో రోజు ఆటలో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అదరగొట్టాడు. వికెట్లు పడుతున్నా కుల్దీప్ యాదవ్(28) సహకారంతో పట్టుదలగా నిలబడి 90 పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా ఆదివారం నాటి ఆటలో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 307 పరుగులు పూర్తి చేయగలిగింది. అశూ దెబ్బకు ఇంగ్లండ్ కుదేలు ఇక అదే రోజు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. 145 పరుగులకే ఆలౌట్ చేశారు. రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా 5, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. మూడో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. అయితే, నాలుగో రోజు ఆరంభంలోనే సీన్ రివర్స్ అయింది. ఇంగ్లండ్ పేసర్ యశస్వి జైస్వాల్(37)ను పెవిలియన్కు పంపగా.. స్పిన్నర్ టామ్ హార్లే రోహిత్ శర్మ(55)ను అవుట్ చేశాడు. బషీర్ భయపెట్టాడు.. గిల్, జురెల్ పూర్తి చేశారు ఇక రోహిత్ స్థానంలో క్రీజులోకి వచ్చిన రజత్ పాటిదార్ను యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు పంపాడు. అతడి స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్నూ డకౌట్గా వెనక్కి పంపాడు. ఇలా షోయబ్ బషీర్ స్పిన్ మాయాజాలంలో చిక్కుకున్న టీమిండియాను వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కలిసి గట్టెక్కించారు. ఆఖరి వరకు పట్టుదలగా నిలబడి టీమిండియాను గెలిపించారు. క్లిష్ట పరిస్థితుల్లో గిల్ అర్ధ శతకం(52), జురెల్ 39 పరుగులతో అజేయంగా నిలిచి హీరోలయ్యారు. టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ నాలుగో టెస్టు స్కోర్లు ఇంగ్లండ్ - 353 & 145 ఇండియా- 307 & 192/5 ఫలితం- ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ధ్రువ్ జురెల్ -
IND VS ENG 4th Test: కుంబ్లే రికార్డును సమం చేసిన అశ్విన్
రాంచీ టెస్ట్లో రవిచంద్రన్ అశ్విన్ రికార్డులను కొల్లగొడుతున్నాడు. తొలుత భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్ల (351) రికార్డును బద్దలుకొట్టిన అశ్విన్.. సెకెండ్ ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల (5/51) ప్రదర్శన అనంతరం కుంబ్లే పేరిట ఉండిన అత్యధిక ఐదు వికెట్ల ఘనతల రికార్డును (భారత్ తరఫున) సమం చేశాడు. కుంబ్లే 132 టెస్ట్ల్లో 35 ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేస్తే.. అశ్విన్ కేవలం 99 టెస్ట్ల్లోనే ఈ ఘనతను (35 ఐదు వికెట్ల ఘనతలు) సమం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేసిన రికార్డు స్పిన్ దిగ్గజం మురళీథరన్ పేరిట ఉంది. మురళీ 133 టెస్ట్ల్లో ఏకంగా 67 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. మురళీ తర్వాత అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనల రికార్డు స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ (145 టెస్ట్ల్లో 37 సార్లు) పేరిట ఉంది. వార్న్ తర్వాతి స్థానంలో రిచర్డ్ హ్యాడ్లీ (86 మ్యాచ్ల్లో 36 సార్లు) ఉన్నాడు. ఈ మ్యాచ్లో అశ్విన్ తొలుత బద్దలుకొట్టిన రికార్డు (భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్ల రికార్డు) కూడా కుంబ్లే పేరిట ఉండినదే కావడం విశేషం. భారత్లో కుంబ్లే 350 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ విషయానికొస్తే.. అశ్విన్ ఐదేయడంతో (5/51) ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 145 పరుగులకే కుప్పకూలి భారత్ ముందు 192 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. అశ్విన్తో పాటు కుల్దీప్ (4/22) కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసి లక్ష్యానికి మరో 152 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) క్రీజ్లో ఉండగా.. భారత్ చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్స్టో (30), ఫోక్స్ (17), డకెట్ (15), రూట్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్ 0, స్టోక్స్ 4, హార్ట్లీ 7, రాబిన్సన్ 0, ఆండర్సన్ 0 పరుగులకే ఔటయ్యారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (122) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులు చేసింది. రాబిన్సన్ (58), జాక్ క్రాలే (42), బెయిర్స్టో (38), ఫోక్స్ (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 307 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (73), దృవ్ జురెల్ (90) అర్దసెంచరీలతో రాణించారు. షోయబ్ బషీర్ (5/119) టీమిండియా పతనాన్ని శాశించగా.. హార్ట్లీ 3, ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
ఐదేసిన అశ్విన్.. టీమిండియాను ఊరిస్తున్న విజయం
రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియాను విజయం ఊరిస్తుంది. ఈ మ్యాచ్లో భారత్ మరో 152 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) క్రీజ్లో ఉండగా.. భారత్ చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. అంతకుముందు సెకెండ్ ఇన్నింగ్స్లో 145 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకుని టీమిండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అశ్విన్ (5/51), కుల్దీప్ (4/22) ధాటికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. And just like Ravichandran Ashwin started the innings,he ends it with a wicket as he gets yet another 5 wicket haul which gets him equal to the most with Anil Kumble(35th) ❤️🔥 a MODERN DAY LEGEND !!! #INDvENG • #Ashwin • #INDvsENG pic.twitter.com/iUWkXuKRQr— ishaan (@ixxcric) February 25, 2024 ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్స్టో (30), ఫోక్స్ (17), డకెట్ (15), రూట్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్ 0, స్టోక్స్ 4, హార్ట్లీ 7, రాబిన్సన్ 0, ఆండర్సన్ 0 పరుగులకే ఔటయ్యారు. Two Wickets in the Over for Ravichandran Ashwin. pic.twitter.com/7bDGwD1L2x— CricketGully (@thecricketgully) February 25, 2024 ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (122) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులు చేసింది. రాబిన్సన్ (58), జాక్ క్రాలే (42), బెయిర్స్టో (38), ఫోక్స్ (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 307 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (73), దృవ్ జురెల్ (90) అర్దసెంచరీలతో రాణించారు. షోయబ్ బషీర్ (5/119) టీమిండియా పతనాన్ని శాశించగా.. హార్ట్లీ 3, ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. MOST WICKETS IN TESTS IN INDIA...!!!!- One & only Ravichandran Ashwin. 🫡🇮🇳pic.twitter.com/R9ov9nk8za— Johns. (@CricCrazyJohns) February 25, 2024 -
IND VS ENG 4th Test: ఇంగ్లండ్ను మడతపెట్టిన అశ్విన్
రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగిపోయాడు. యాష్ (5/51).. ఇంగ్లండ్ను సెకెండ్ ఇన్నింగ్స్లో 145 పరుగులకే మడతపెట్టాడు. అశ్విన్కు కుల్దీప్ యాదవ్ (4/22) తోడవ్వడంతో ఇంగ్లండ్ కనీసం 150 పరుగుల మార్కును కూడా చేరుకోలేకపోయింది. రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్స్టో (30), ఫోక్స్ (17), డకెట్ (15), రూట్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్ 0, స్టోక్స్ 4, హార్ట్లీ 7, రాబిన్సన్ 0, ఆండర్సన్ 0 పరుగులకే ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్లో లభించిన లీడ్ కలుపుకుని ఇంగ్లండ్ టీమిండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (122) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులు చేసింది. రాబిన్సన్ (58), జాక్ క్రాలే (42), బెయిర్స్టో (38), ఫోక్స్ (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 307 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (73), దృవ్ జురెల్ (90) అర్దసెంచరీలతో రాణించారు. షోయబ్ బషీర్ (5/119) టీమిండియా పతనాన్ని శాశించగా.. హార్ట్లీ 3, ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి బౌలర్గా
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అశ్విన్ రికార్డులకెక్కాడు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓలీ పోప్ను ఔట్ చేసిన అశ్విన్.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్ ఇప్పటివరకు భారత్ గడ్డపై టెస్టుల్లో 351 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(350) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో కుంబ్లే ఆల్టైమ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. చదవండి: IND vs ENG: పాపం దృవ్.. జస్ట్ సెంచరీ మిస్! అయినా హీరోనే -
అశ్విన్ అన్నతో ఆటలా.. దిమ్మతిరిగిపోయిందిగా! వీడియో వైరల్
టీమిండియాతో టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో తన పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. తొలి మూడు టెస్టుల్లో విఫలమైన బెయిర్ స్టో.. ఇప్పుడు రాంఛీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులోనూ అదే తీరును కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 38 పరుగులు చేసి బెయిర్ స్టో ఔటయ్యాడు. ఇంగ్లండ్ 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో.. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెటరన్ స్పిన్నర్ అశ్విన్ను ఎటాక్లోకి తీసుకుచ్చాడు. అయితే అశ్విన్ను తన తొలి ఓవర్ నుంచే ఎటాక్ చేయడానికి బెయిర్ స్టో ప్రయత్నించాడు. ఈ క్రమంలో 20 ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్లో సిక్స్ బాదిన బెయిర్ స్టో.. తనదే పై చేయి అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ 22 ఓవర్ బౌలింగ్ చేయడానికి అశూ వచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతినే బౌండరీగా మలిచిన జానీ.. రెండో బంతిని సైతం ఫోర్ కొట్టడానికి ప్రయత్నించాడు. అశ్విన్ వేసిన క్యారమ్ బాల్కు రివర్స్ స్వీప్ ఆడటానికి బెయిర్ స్టో ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి అతడి ప్యాడ్కు తాకింది. వెంటనే బౌలర్తో పాటు వికెట్ కీపర్ ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపాడు. వెంటనే రోహిత్ శర్మ డీఆర్ఎస్కు వెళ్లాడు. రీప్లేలో బంతికి మిడిల్ స్టంప్ను హిట్ చేస్తున్నట్లు తేలింది. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఔట్గా ప్రకటించాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అశ్విన్ అన్నతో ఆటలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అంతకముందు రెండో టెస్టు సమయంలోనూ వీరిద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకున్నసంగతి తెలిసిందే. pic.twitter.com/apGSs6wnjS — Muskaan Bhatt (@MuskaanBhatt11) February 23, 2024 -
ఇంగ్లండ్పై ‘సెంచరీ’ కొట్టిన అశ్విన్.. వీడియో వైరల్
India vs England, 4th Test : టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్లో అత్యుత్తమ దశను ఆస్వాదిస్తున్నాడు. ఇంగ్లండ్తో రాజ్కోట్ టెస్టు సిరీస్ సందర్భంగా 500 వికెట్ల క్లబ్లో చేరిన ఈ రైటార్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్.. రాంచి మ్యాచ్లో మరో అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు ఫార్మాట్లో ఒకే ప్రత్యర్థిపై 1000 పరుగులు చేయడం సహా 100 వికెట్లు తీసిన క్రికెటర్గా 37 ఏళ్ల ఈ ఆల్రౌండర్ చరిత్ర సృష్టించాడు. టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుకెక్కాడు. అశ్విన్ కంటే ముందు వాళ్లు ఇంగ్లండ్తో నాలుగో టెస్టు సందర్భంగా జానీ బెయిర్స్టోను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ ఘనత సాధించాడు. అశ్విన్ కంటే ముందు జార్జ్ జిఫెన్(ఇంగ్లండ్ మీద), మోనీ నోబుల్(ఇంగ్లండ్ మీద), విల్ఫ్రెడ్ రోడ్స్(ఆస్ట్రేలియా మీద), గ్యారీఫీల్డ్ సోబర్స్(ఇంగ్లండ్ మీద), ఇయాన్ బోతం(ఆస్ట్రేలియా మీద), స్టువర్ట్ బ్రాడ్(ఆస్ట్రేలియా మీద) టెస్టుల్లో ఈ ఫీట్ నమోదు చేశారు. కాగా రాంచి వేదికగా టీమిండియాతో నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. భోజన విరామ సమయానికి 24.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 112 పరుగులు స్కోరు చేసింది. టీమిండియా బౌలర్లలో అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ టాపార్డర్ను కుప్పకూల్చి మూడు వికెట్లు వికెట్లు తీయగా.. అశ్విన్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. చదవండి: IND vs ENG: కల నేరవేరింది.. ఎట్టకేలకు అరంగేట్రం! ఎవరీ ఆకాష్ దీప్? Ash gets a century against England... of wickets!#IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/X2wxTkk7xL — JioCinema (@JioCinema) February 23, 2024 -
Ind vs Eng: ఆ 48 గంటలు నరకం.. గర్వంగా ఉంది!
India vs England, 3rd Test: ‘‘హైదరాబాద్లోనే 500 అందుకోవాలని భావించాం. కానీ కుదరలేదు. పోనీ.. వైజాగ్లోనైనా సాధిద్దామనుకుంటే.. అదీ జరుగలేదు. అందుకే.. 499 వద్ద ఉన్నపుడే నేను స్వీట్లు కొనుక్కొచ్చి ఇంటి దగ్గర అందరికీ పంచిపెట్టాను. ఆ తర్వాత 500 మార్కు అందుకున్నాం. అయితే, 500- 501 మధ్య చాలా జరిగింది. మా జీవితకాలంలో ఆ 48 గంటలు అత్యంత సుదీర్ఘమైనవి. ఇదంతా ఆ ప్రత్యేకమైన 500 గురించి, ఆ 499 గురించే! అద్భుతమైన విజయం. అత్యద్భుతమైన వ్యక్తి. నిన్ను చూసి నేను ఎంత గర్విస్తున్నానో నాకే తెలుసు’’ అంటూ టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ ఉద్వేగానికి లోనయ్యారు. 500 వికెట్ల క్లబ్లో టెస్టు క్రికెట్లో భర్త సాధించిన అద్వితీయమైన విజయం, అందుకున్న అరుదైన మైలురాయిని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ పెట్టారు. కాగా ఇంగ్లండ్తో మూడో టెస్టు సందర్భంగా అశ్విన్ 500 వికెట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. Moment when Ravi Ashwin reached his 500th Test wicket. 🐐 pic.twitter.com/MUlGtPgm9c — Mufaddal Vohra (@mufaddal_vohra) February 16, 2024 తన 98వ టెస్టు మ్యాచ్లో అశూ ఈ ఘనత సాధించాడు. భారత్ తరఫున టెస్టుల్లో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బౌలర్(అనిల్ కుంబ్లే-619)గా నిలిచాడు. అయితే, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా రాజ్కోట్లో అశూ ఈ మైలురాయిని అందుకున్న తర్వాత అర్ధంతరంగా జట్టును వీడాడు. తన తల్లి అనారోగ్య కారణాల దృష్ట్యా చెన్నైకి తిరుగుపయనమయ్యాడు. ఈ క్రమంలో మూడో రోజు ఆటకు దూరమైన అశూ.. నాలుగోరోజు(ఆదివారం) మళ్లీ జట్టుతో చేరాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్లే(16)ను బౌల్డ్ చేసి 501వ వికెట్ తన ఖాతాలో జమ చేసుకున్నాడు. మానసిక వేదన ఈ నేపథ్యంలో తల్లి అనారోగ్యం సందర్భంగా అశ్విన్ పడిన మానసిక వేదన.. అదే సమయంలో ఆట పట్ల అంకిత భావంతో అతడు తిరిగి జట్టుతో చేరిన తీరును ప్రస్తావిస్తూ అతడి సతీమణి ప్రీతి ఈ మేరకు భావోద్వేగపూరిత క్యాప్షన్తో.. అశ్విన్ ఫొటోను పంచుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో 434 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా.. ఇంగ్లండ్పై 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య రాంచి వేదికగా ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు మొదలుకానుంది. చదవండి: #Dhruv Jurel: రెప్పపాటులో.. మెరుపులా కదిలిన జురెల్.. ‘సెంచరీ వీరుడి’ రనౌట్ చూశారా? View this post on Instagram A post shared by 𝒫𝓇𝒾𝓉𝒽𝒾 𝒜𝓈𝒽𝓌𝒾𝓃 (@prithinarayanan) -
టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడొచ్చేస్తున్నాడు
టీమిండియాకు గుడ్ న్యూస్. తల్లి అనారోగ్య సమస్య కారణంగా మ్యాచ్ మధ్యలోనే చెన్నైకి వెళ్లిపోయిన రవిచంద్రన్ అశ్విన్ తిరిగి జట్టులో చేరనున్నాడు. యాష్ ఇవాళ (ఫిబ్రవరి 18) లంచ్ విరామం సమయానికంతా జట్టుతో జతకడతాడని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. కాగా, తల్లిని చూసేందుకు హుటాహుటిన ఇంటికి బయల్దేరిన అశ్విన్కు బీసీసీఐ మద్దతుగా నిలిచింది. ఆటగాళ్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం తమకెంతో ముఖ్యమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే, మూడో టెస్ట్లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 383 పరుగుల లీడ్లో ఉంది. ఇవాల్టి ఆటలో కుల్దీప్ తప్పిదం కారణంగా శుభ్మన్ గిల్ (91) అనవసరంగా రనౌటయ్యాడు. గాయం కారణంగా నిన్న రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన యశస్వి ఇవాళ తిరిగి క్రీజ్లోకి వచ్చాడు. ప్రస్తుతం యశస్వి (114), కుల్దీప్ (27) క్రీజ్లో ఉన్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్లో జాక్ క్రాలే వికెట్ తీయడం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. స్కోర్ వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153) భారత్ సెకెండ్ ఇన్నింగ్స్: 257/3 (యశస్వి 115 నాటౌట్) -
Ind vs Eng 3rd Test: ముగిసిన మూడో రోజు ఆట.. 322 పరుగుల ఆధిక్యంలో భారత్
Ind vs Eng 3rd Test Day 3 Updates: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రాజ్కోట్ టెస్టులో మూడో రోజు ఆట ఆరంభమైంది. 207/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టింది ఇంగ్లండ్. ఈ మ్యాచ్లో టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌట్ కాగా.. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ 319 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. మూడో రోజు ముగిసిన ఆట.. మూడో రోజు ఆటలో ఇంగ్లీష్ జట్టుపై టీమిండియా పైచేయి సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో భారత్ 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(65), కుల్దీప్ యాదవ్(3) పరుగులతో ఉన్నారు. అదే విధంగా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(104) సెంచరీతో మెరిశాడు. అయితే వెన్ను నొప్పి కారణంగా ఆట మధ్యలోనే రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 322 పరుగుల భారీ అధిక్యంలో భారత్ కొనసాగుతోంది. కాగా అంతకముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు ఆలౌటైంది. జైశ్వాల్ రిటైర్డ్ హార్ట్.. టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సెంచరీతో చెలరేగిన యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. వెన్ను నొప్పి కారణంగా జైశ్వాల్ మూడో రోజు ఆట ఆఖరి సెషన్లో మైదానాన్ని వీడాడు. జైశ్వాల్(104) పరుగులు చేశాడు. 47 ఓవర్లకు భారత్ స్కోర్: 190/1. టీమిండియా ప్రస్తుతం 321 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది. శుబ్మన్ గిల్ హాఫ్ సెంచరీ.. జైశ్వాల్తో పాటు క్రీజులో ఉన్న మరో టీమిండియా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. రెండో వికెట్కు వీరిద్దరూ ఇప్పటివరకు 153 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెకెండ్ ఇన్నింగ్స్లో భారత్ స్కోర్: 184/1. భారత్ ప్రస్తుతం 310 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. జైశ్వాల్ సూపర్ సెంచరీ.. ఇంగ్లండ్తో మూడో టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. 121 బంతుల్లో జైశ్వాల్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. జైశ్వాల్కు ఇది మూడో టెస్టు సెంచరీ. జైశ్వాల్ ప్రస్తుతం 102 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడితో పాటు గిల్(45) పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. 41 ఓవర్లకు టీమిండియా స్కోర్: 171/1. భారత్ ప్రస్తుతం 297 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది. హాఫ్ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్.. సెకెండ్ ఇన్నింగ్స్లో యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 80 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్స్లతో జైశ్వాల్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. యశస్వీ తనదైన స్టైల్లో సిక్స్ కొట్టి అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 30 ఓవర్లకు భారత్ స్కోర్: 116/1, క్రీజులో జైశ్వాల్(65)తో పాటు శుబ్మన్ గిల్(26) ఉన్నారు. నిలకడగా ఆడుతున్న గిల్, జైశ్వాల్.. టీమిండియా యువ ఆటగాళ్లు శుబ్మన్ గిల్(8), యశస్వీ జైశ్వాల్(23) నిలకడగా ఆడుతున్నారు. 19 ఓవర్లకు భారత్ స్కోర్: 50/1 టీ విరామానికి భారత్ స్కోర్: 44/1 16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(19), శుబ్మన్ గిల్(5) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 170 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది. తొలి వికెట్ కోల్పోయిన భారత్ 11.3: జో రూట్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా రోహిత్ శర్మ(19) వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. గిల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 34-1(12). జైస్వాల్ 10 పరుగులతో ఆడుతున్నాడు. బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ భారత రెండో ఇన్నింగ్స్ ఆరంభించారు. స్కోరు: 13/0 (4) ఈ క్రమంలో మూడో రోజు ఆటలో భాగంగా తమ స్కోరుకు 112 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 319 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 126 పరుగులు వెనుకబడి ఉంది. ►టీమిండియా తొలి ఇన్నింగ్స్- 445 ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 319 పదో వికెట్ డౌన్ 71.1: సిరాజ్ బౌలింగ్ ఆండర్సన్ బౌల్డ్. పదో వికెట్గా ఆండర్సన్ వెనుదిరగడంతో... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్కు తెర పడింది. 71.1 ఓవర్లలో 319 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. మరో షాక్.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 70.2: జడేజా బౌలింగ్లో టామ్ హార్లే(9)ను వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ స్టంపౌట్ చేశాడు. ఆండర్సన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 314/9 (70.2) ఎనిమిదో వికెట్ డౌన్ 69.5: సిరాజ్ బౌలింగ్లో రెహాన్ అహ్మద్ బౌల్డ్(6). ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. మార్క్ వుడ్ క్రీజులోకి వచ్చాడు. హార్లే తొమ్మిది పరుగులతో ఉన్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 314-8(70) వరుస షాకులు.. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ స్టోక్స్ అవుటైన మరుసటి బంతికే బెన్ ఫోక్స్ కూడా పెవిలియన్ చేరాడు. సిరాజ్ బౌలింగ్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ , టామ్ హార్లే క్రీజులో ఉన్నారు. స్కోరు: 299/7 (65.3).టీమిండియా కంటే 146 పరుగులు వెనుకబడి ఉంది. భోజన విరామం తర్వాత వికెట్ బెన్ స్టోక్స్ రూపంలో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి స్టోక్స్ 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. నిలకడగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఇంగ్లండ్ 61వ ఓవర్ పూర్తయ్యేసరికి స్టోక్స్ 39, ఫోక్స్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 290 పరుగుల వద్ద నిలిచింది. 56వ ఓవర్ ముగిసే సరికి ఇలా ఆచితూచి ఆడుతున్న స్టోక్స్, ఫోక్స్. ఇంగ్లండ్ స్కోరు: 275/5 (56). స్టోక్స్ 28, ఫోక్స్ రెండు పరుగులతో ఆడుతున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 50.1: ఎట్టకేలకు సెంచరీ వీరుడు బెన్ డకెట్ అవుటయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శుబ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్గా వెనుదిరిగాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్. 151 బంతుల్లోనే 23 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 153 పరుగులు చేసిన డకెట్.. శతకాన్ని ద్విశతకంగా మార్చాలని భావించగా.. కుల్దీప్ అతడి జోరుకు బ్రేక్ వేశాడు. బెన్ ఫోక్స్ క్రీజులోకి వచ్చాడు. స్టోక్స్ 20 పరుగులతో ఉన్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 260-5(51) నిలకడగా ఆడుతున్న డకెట్, స్టోక్స్ 48 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 247/4 . డకెట్ 153, స్టోక్స్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 198 పరుగులు వెనుబడి ఉంది. నాలుగో వికెట్ డౌన్ ఆట మొదలెట్టిన కాసేపటికే భారత బౌలర్లు ఇంగ్లండ్ను దెబ్బకొట్టారు. బుమ్రా రూట్ను అవుట్ చేయగా.. కుల్దీప్ యాదవ్ దెబ్బకు బెయిర్ స్టో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. బెయిర్ స్టో రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. బెన్ స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. డకెట్ 142 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 225-4(41) మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 207/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన కాసేపటికే ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో జో రూట్(18) జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జానీ బెయిర్ స్టో క్రీజులోకి వచ్చాడు. బెన్ డకెట్ 141 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 224-3. అశ్విన్ లేకుండానే ఇక కీలక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేకుండానే భారత్ శనివారం బరిలో దిగింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. కన్కషన్ సబ్స్టిట్యూట్(ఆటగాడి తలకు దెబ్బతగిలినపుడు), కోవిడ్-19 వంటి విపత్కర పరిస్థితుల్లో మాత్రమే మ్యాచ్ మధ్యలో వైదొలిగిన ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయాలి. అది కూడా సదరు సబ్స్టిట్యూట్ ఫీల్డింగ్ వరకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే, అశ్విన్ తన తల్లి అనారోగ్య కారణాల దృష్ట్యా వైదొలిగినందున అతడి స్థానంలో వేరే ప్లేయర్ను తీసుకునే అవకాశం లేదు. ఫలితంగా మూడో రోజు ఆటలో టీమిండియా పది మంది యాక్టివ్ ప్లేయర్లతో మైదానంలో దిగింది. రెండో రోజు హైలైట్స్ ►ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మెరుపు సెంచరీ ►తొలి ఇన్నింగ్స్లో 207/2 ►భారత్ 445 ఆలౌట్ ►అశ్విన్కు 500వ వికెట్ తుదిజట్లు: భారత్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్(అరంగేట్రం), రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్- అరంగేట్రం), కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్. -
రాజ్కోట్ టెస్ట్: టీమిండియాకు షాక్.. అశ్విన్ ఔట్
ఢిల్లీ: టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. ఇంగ్లండ్తో రాజ్కోట్లో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ నుంచి భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వైదొలిగాడు. వ్యక్తిగత కారణాలతో అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. అతని తల్లికి ఆరోగ్యం బాగోలోద ఇటువంటి పరిస్థితుల్లో అతడికి జట్టుతో పాటు బోర్డు అండగా నిలుస్తుందని తెలిపింది. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతోనే అశ్విన్ మ్యాచ్ నుంచి దూరమైనట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు తమకు ఎంతో ముఖ్యమని తెలిపింది. ఈ కష్టకాలంలో అశ్విన్కు అవసరమైన సహాయాన్ని బోర్డు, టీమ్ఇండియా జట్టు అందిస్తుందని పేర్కొంది. R Ashwin withdraws from the 3rd India-England Test due to family emergency. In these challenging times, the Board of Control for Cricket in India (BCCI) and the team fully supports Ashwin.https://t.co/U2E19OfkGR — BCCI (@BCCI) February 16, 2024 ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఎక్స్(ట్విటర్) వేదికగా ఒక పోస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో తన తల్లికి దగ్గర ఉండడం కోసం అశ్విన్ రాజ్కోట్ నుంచి చెన్నై వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆమె తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. రెండోరోజు బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. మ్యాచ్లో అశ్విన్ శుక్రవారం ఒక వికెట్ తీసి 500 వికెట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. భారత్ టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్గా ఘనతకెక్కాడు. మూడో టెస్టులో అశ్విన్ 37 పరుగులు చేసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇటువంటి తరుణంలో జట్టుకు అశ్విన్ దూరం కావడం పెద్దదెబ్బే.