ప్రధాన వార్తలు

చదువు‘కొనలేం’
ఫీజు రీయింబర్స్మెంట్...! ఎందరో పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివేలా చేసి జీవితంలో స్థిరపడేలా చేసిన గొప్ప పథకం..! మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా కాలేజీకి వెళ్లి ఏకాగ్రతతో పాఠాలు విని తమ లక్ష్యాలను సాధించిన విద్యార్థులు ఎందరో..? అయితే, కూటమి ప్రభుత్వంలో అలాంటి గొప్ప పథకానికి తూట్లు పడుతున్నాయి. మొండి బకాయిలతో.. యువత భవిష్యత్తో చెలగాటం ఆడుతోంది. ఒకటీ, అర కాదు.. ఏకంగా ఆరు క్వార్టర్ల చెల్లింపులు పక్కనపెట్టింది.. చివరకు విద్యార్థులు విసుగెత్తి చదువు మానేసేలా చేస్తోంది..సాక్షి, అమరావతి: ఏడాదికి పైగా ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తాం.. అంటూ ఊరించి ఉసూరుమనిపించడం తప్ప కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు..! కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా పాత బకాయిల విడుదల ఊసే లేదు..! ప్రభుత్వం కనీస కనికరం చూపకుండా.. తమ జీవితాలతో చెలగాటం ఆడుతుండడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నత విద్యకు భరోసా దక్కక దిగులు చెందుతున్నారు. దీంతో అర్థంతరంగా చదువులు మానేస్తున్నారు. ఇదంతాచూసి విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇదేనా? ఉన్నత విద్య పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి..?? అని నిలదీస్తున్నారు. ⇒ 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికం నిధులు ఆ ఏడాది మే నెలలో ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల కోడ్ కారణంగా అగిపోయింది. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అప్పటినుంచి ఇప్పటివరకు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క త్రైమాసికం (క్వార్టర్) కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వం నుంచి ఆరు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.4,200 కోట్లు, విద్యార్థులకు హాస్టల్ మెయింటినెన్స్ (వసతి దీవెన) కింద మరో రూ.2,200 కోట్లు వెరసి రూ.6,400 కోట్లు బకాయిలు పేరుకుపోవడం గమనార్హం. వాస్తవానికి గత నెలలోనే ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల అసోసియేషన్ సమావేశంలో, ప్రభుత్వం స్పందించకుంటే కోర్టుకు వెళ్తామని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ స్పందన కొరవడింది. ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్లో చదువులతో పాటు హాస్టల్ వసతి దీవెన (మెయింటెనెన్స్) కింద ఆర్థిక సాయం చేసింది. ఏడాదికి రూ.1100 కోట్లు అందించింది. కూటమి ప్రభుత్వం వసతి దీవెన ఎత్తేసింది. విద్యార్థులకు రూ.2,200 కోట్లు బకాయి పెట్టింది. నెలకు రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్లు ఖర్చు రాష్ట్రంలో 230 వరకు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద మొత్తం సీట్లలో 70 శాతం భర్తీ చేస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేస్తోంది. అంటే, కళాశాలల నిర్వహణ దాదాపు ప్రభుత్వం విడుదల చేసే నిధులపైనే ఆధారపడి ఉంది. కానీ, ఏడాదికి పైగా ప్రైవేటు కళాశాలలకు రావాల్సిన బకాయిలను మంజూరు చేయకుండా కూటమి సర్కారు తాత్సారం చేస్తోంది. ఫలితంగా ఒక్కో కళాశాలకు బకాయిలు కొండలా పేరుకుపోయాయి. చిన్న కళాశాలలకు రూ.6–10 కోట్లు, పెద్ద కళాశాలలకు రూ.40–60 కోట్ల వరకు పెండింగ్ కనిపిస్తున్నాయి. ఫలితంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. ⇒ ప్రైవేటు యాజమాన్యాల్లోని 20–30 శాతం కళాశాలలు మినహా.. మిగిలినవి ఏ పూటకు ఆ పూటే అన్న చందాన నిధుల కొరత ఎదుర్కొంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. ఉద్యోగుల నెలవారీ జీతభత్యాలు, ఇతర నిర్వహణ కోసం చిన్న కళాశాలలు రూ.50 లక్షలు నుంచి పెద్ద కళాశాలలు రూ.3 కోట్లు వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతోపాటు కొండలా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చూస్తే యాజమాన్యాల గుండె బరువెక్కుతోంది. వడ్డీలకు అప్పులు తెచ్చి నడిపించాల్సి వస్తుండడం ఆర్థికంగా భారం అవుతోంది. సర్కారు నుంచి మొండిచేయి ఎదురవుతుండడంతో నిర్వహణ కుంటుపడుతోంది. బాబ్బాబు కాస్త సర్దుకోరూ...! ప్రభుత్వం న్యాయబద్ధంగా చెల్లించాల్సిన ఫీజు రీయిబర్స్మెంట్ను బకాయి పెట్టడంతో ప్రైవేటు కళాశాలలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితిలో నడుస్తున్నాయి. చాలా కళాశాలల్లో 2–3 నెలల జీతాలు పెండింగ్లో ఉంటున్నాయి. కొన్ని కాలేజీలైతే నెల జీతంలో కొంత మొత్తం చెల్లిస్తూ సర్దుకోండి అంటూ ఉద్యోగులను బతిమలాడుకునే పరిస్థితి. ఆర్థికంగా పరపతి ఉన్న కళాశాలలు అప్పు తెచ్చి ఉద్యోగులకు జీతాలిస్తున్నాయి. ⇒ కాలేజీలు ఇలా అప్పుల్లో నెట్టుకొస్తున్న తరుణంలో మారుతున్న సాంకేతిక అవసరాలను ఎంతవరకు అందిపుచ్చుకుంటాయన్నది ప్రశ్న. మార్కెట్కు అనుగుణంగా బోధన అందించకుంటే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తద్వారా ఒక తరం వెనుకబడిపోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మాటంటే.. జరగదంట? పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పూటకో మాట చెప్పుకొచ్చారు. పైసా ఖర్చు లేకపోవడంతో తన ఎక్స్ ఖాతాలో ట్వీట్లు చేస్తూ ప్రజలు, కళాశాలల యాజమాన్యాలను మభ్యపెడుతూ వచ్చారు. ఈ తంతు నిరుడు జూన్ నుంచి మొదలైంది. ఈ ఏడాది జూన్ వెళ్లిపోయినా బకాయిలు మాత్రం విడుదల కాలేదు. ⇒ గత నెలలో మంత్రిని కలిసిన కళాశాలల యాజమన్యాలకు జూలైలో కచ్చితంగా ఫీజు బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తొలుత జూలై 10న ఇస్తామన్నారు. ఇప్పుడు 20వ తేదీ దాటినా ఎక్కడా రూపాయి విడుదల కాలేదు. ఇదేంటని అడిగితే మరో నాలుగు రోజుల్లో నిధులు విడుదల చేస్తామని మళ్లీ చెబుతున్నారని ఇంజినీరింగ్ కళాశాలల అసోసియేషన్ వాపోతోంది. ఇక్కడ మంత్రి మాట ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి న్యాయం జరగకపోవడం గమనార్హం. మొత్తానికి కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఓ పెద్ద ప్రహసనంగా మారింది. ఇదీ మా గోడు... ‘‘ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రభుత్వం నుంచి బకాయిలువిడుదల కావట్లేదు. కళాశాలల నిర్వహణ ముందుకు జరగట్లేదు. ఆర్థికంగా బలంగా ఉంటేనే కదా? నాణ్యమైన బోధనా సామర్థ్యాలను సమకూర్చుకుని విద్యార్థులకు మెరుగైన చదువు అందించగలం. డబ్బులు లేకుండా ఇవన్నీ ఎక్కడినుంచి తెస్తాం...? ఇంజనీరింగ్ కాలేజీ అంటే బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వట్లేదు. ఆస్తులు అమ్ముదామంటే మార్కెట్లో రేట్లు లేవు. తాకట్టు పెట్టి తెద్దామంటే రూ.2–5 వరకు వడ్డీలు అవుతున్నాయి. ఇంకేం చేయాలి...?’’ అని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల యజమాని వాపోయారు. ఇక్కడ ఒక్క ఇంజినీరింగ్ కళాశాలలే కాదు, అదే యాజమాన్యాల్లో డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి. తమ పరిస్థితి ఇలా ఉండగా... ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదల ఊసే ఎత్తకపోతుండడంతో ప్రైవేటు యాజమాన్యాలు భవిష్యత్తు కార్యాచరణ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఇదే అనుభవం ఎదురవగా అక్కడి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. వాటికి అనుకూలంగా తీర్పులొచ్చాయి. ఈ స్ఫూర్తితో ఏపీలోని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు చెల్లింపులుఐదేళ్లలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు జగనన్న వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు జమ⇒ 2019 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యార్థులకు రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచింది. 2017–19 వరకు నాటి టీడీపీ సర్కారు 16.73 లక్షల మంది విద్యార్థులకు రూ.1,778 కోట్లు బకాయిపెడితే వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు ప్రతి త్రైమాసికానికి క్రమంతప్పకుండా చెల్లించి... ఏ లోటు లేకుండా కళాశాలలు సక్రమంగా నడిచేలా, విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేలా ప్రోత్సహించింది. ⇒ ఇక జగనన్న వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లను విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేశారు. ఇలా మొత్తం ఐదేళ్లలో ప్రభుత్వం ఉచిత ఉన్నత విద్యపై రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది.

కేంద్రానిదే బాధ్యత: రాహుల్గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే దేశానికే మార్గదర్శకమని, ఇందుకు సంబంధించి రాష్ట్రం తీసుకొచ్చిన బిల్లును ఆమోదించే బాధ్యత కేంద్రంపైనే ఉందని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బిల్లును ఆమోదించే విషయంలో జాప్యం చేయరాదని అన్నారు. దేశంలో సామాజిక న్యాయానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే మైలు రాయిగా నిలుస్తుందని కొనియాడారు. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయంలో తెలంగాణలో చేపట్టిన కుల గణన సర్వేపై ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన పార్టీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇదొక సామాజిక, ఆర్థిక, రాజకీయ పనిముట్టు ‘కుల గణన అనేది రేవంత్రెడ్డికి అంత సులువు కాదని భావించాం. సీఎంగా ఇది ఆయనకు ఇబ్బందికరమని అనుకున్నాం. ఆయన సామాజిక వర్గం ఆయనను సమర్థించదని భావించాం. కానీ రేవంత్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు నేను ఆశించిన దానికంటే అద్భుతంగా పనిచేశారు. సరైన దృక్పథంతో సర్వేను పూర్తి చేశారు. బీజేపీ దీనిని ఇష్టపడినా, పడకున్నా.. దేశంలో కుల గణన చేపట్టేందుకు ఇది ఒక దిక్సూచిగా మారుతుంది. ఇది నాలుగు గోడల మధ్య చేయలేదు. తెలంగాణలోని లక్షల మంది ప్రజలు, అన్ని వర్గాలను 56 ప్రశ్నలు అడిగి సర్వే చేశారు. వేరే ఏ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సర్వే జరగలేదు. 21వ శతాబ్దపు సామాజిక, రాజకీయ, ఆర్థిక డేటా తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఈ సర్వే వివరాల ఆధారంగానే కులం, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇదొక సామాజిక, ఆర్థిక పనిముట్టు. బీజేపీకి ఇష్టం లేకపోయినా ఇదొక రాజకీయ పనిముట్టు..’ అని రాహుల్ అభివర్ణించారు. కుల గణనను కేంద్రం సరిగా చేయదు ‘ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్ల అడ్డుగోడను తొలగించే అవసరం వచ్చింది. కానీ దీనిని కేంద్రం విస్మరిస్తోంది. కుల గణన సర్వే వివరాల ఆధారంగా తెలంగాణలో జరిగే అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. హిందుత్వ పేరుతో స్థానిక రాజకీయాల్లో, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల అడ్డుగోడ సామాజిక అభివృద్ధికి విఘాతంగా మారింది. ఈ అడ్డుగోడను తొలగించే విషయంపై నేను, రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా బీజేపీపై ఒత్తిడి తెస్తున్నాం. మాకు తెలిసినంత వరకు కుల గణనను కేంద్రం సరైన రీతిలో నిర్వహిస్తుందని అనుకోవడం లేదు. వాళ్లు అలా చేయరు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీల వాస్తవ పరిస్థితులు ఏంటో దేశ ప్రజలకు చెప్పాలన్న ఆలోచన కూడా వారికి లేదు. కులగణన వాస్తవాలు వారు ఎప్పుడు బయటకు వెల్లడిస్తారో అప్పుడు బీజేపీ భావజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది..’ అని రాహుల్గాంధీ పేర్కొన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంగ్లీష్ వద్దా? ‘దేశాభివృద్ధికి డబ్బు, భూములు కాదు.. ఇంగ్లీష్ విద్యే మార్గం. తెలంగాణ కుల గణనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. ఈ సర్వేకు ముందు భూములే విలువైనవని నేను కూడా అనుకునేవాడిని. కానీ ఇంగ్లీష్ ప్రాధాన్యమైన అంశం అని కుల గణన నిపుణుల కమిటీ చెప్పినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇంగ్లీష్ అవసరం..అలాగని హిందీ, ఇతర ప్రాంతీయ భాషలు అక్కర్లేదని నేను చెప్పడం లేదు. ఏ బీజేపీ నేతను ప్రశ్నించినా ఇంగ్లీష్ వద్దంటారు. వారి పిల్లలు ఏ స్కూల్, కాలేజీలో చదువుతున్నారని ప్రశ్నిస్తే మాత్రం.. ఇంగ్లీష్ మీడియం అనే సమాధానమే వస్తుంది. మరి ఆ అవకాశాన్ని దేశంలోని వెనుకబడిన వర్గాలైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు బీజేపీ నేతలు ఎందుకు ఇవ్వరు?..’ అని రాహుల్ నిలదీశారు. రేవంత్రెడ్డి తదితరులను అభినందిస్తున్నా.. ‘రాష్ట ప్రభుత్వం కులగణన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం అడ్డుగోడను తొలగించాలనుకుంటున్నట్లు అందులో పేర్కొంది. అయితే అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పకోవడం లేదు. దీనిని పార్లమెంటులో లేవనెత్తడమే మన కర్తవ్యం. రేవంత్రెడ్డి చేసిన దాన్ని మనం ప్రోత్సహించాలి. సర్వే నిర్వహించిన రేవంత్రెడ్డి, నిపుణుల కమిటీ, కాంగ్రెస్ నేతలను నేను అభినందిస్తున్నా. జరిగిన దానిని ఖర్గే పెద్దగా సమర్థించలేదు. అయినప్పటికీ ఆయనకు కూడా నా ధన్యవాదాలు..’ అని రాహుల్ అన్నారు. భవిష్యత్తు లేదనే కేంద్రం కులగణన నిర్ణయం: ఖర్గే ఓబీసీలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ఉండదని గమనించే దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో కులగణనను భాగం చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘భారత్ జోడో యాత్ర, సంవిధాన్ బచావ్ ర్యాలీల్లో రాహుల్గాం«దీకి ఓబీసీలంతా మద్దతు ఇచ్చారు. ‘జై బాపూ.. జై భీమ్.. జై సంవిధాన్’ అనే రాహుల్ నినాదంతో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు లాభం జరిగింది. ఇది గమనించిన ఇతర పార్టీలు తమకు భవిష్యత్తు లేదని భావించి మన బాటలో నడుస్తున్నాయి. కేంద్రం తీసుకున్న జనగణనలో కులగణన నిర్ణయం అందుకు నిదర్శనం. కుల గణన సర్వే తెలంగాణ సాధించిన పెద్ద విజయం. ప్రభుత్వం చేసిన కుల గణన దేశానికి దిశానిర్దేశం చేసింది. కుల గణన చేపట్టడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన చర్య. రాజకీయంగా శక్తి లభించింది కాబట్టే రేవంత్రెడ్డి ఇది చేయగలిగారు. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల్లోని ప్రతి బ్లాక్కు తీసుకెళ్లాలి. పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నేతలంతా ఈ బాధ్యత తీసుకోవాలి. అందరి ఎక్స్రే తీశారు కానీ.. ఈ సర్వేలో అంటరానివారే లేరని సీఎం, మంత్రులకు చెప్పాను. బీసీలు సామాజికంగా వెనుకబడ్డారు. కానీ దళితులు అంటరానివారిగా ఉన్నారు. అలా ఉన్నామని భావిస్తున్నారు. ఈ అంతరాన్ని చెరిపేయాలి. వీరిని ఒక్కతాటి పైకి తీసుకురావాలి. ఈ సర్వేలో భాగస్వామ్యం వహించిన వారందరికీ అభినందనలు. భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణలో కుల గణనను ప్రోత్సహించిన రాహుల్ గాందీని అభినందిస్తున్నా. రాహుల్ గాంధీ ఒత్తిడితోనే ప్రధాని మోదీ దేశ వ్యాప్త జన గణనలో కుల గణనను భాగం చేస్తూ దిగిరాక తప్పలేదు..’ అని ఖర్గే పేర్కొన్నారు.

ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం; తిథి: శు.పాడ్యమి రా.11.55 వరకు, తదుపరి విదియ; నక్షత్రం: పుష్యమి సా.5.24 వరకు, తదుపరి ఆశ్లేష; వర్జ్యం: లేదు; దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.31 నుండి 1.23 వరకు; అమృత ఘడియలు: ప.11.20 నుండి 12.38 వరకు.సూర్యోదయం : 5.40సూర్యాస్తమయం : 6.32రాహుకాలం : ఉ.10.30నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం.... వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆనారోగ్య సూచనలు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.వృషభం... పనులలో పురోగతి సాధిస్తారు. సంఘంలో గౌరవం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.మిథునం.... కుటుంబంలో సమస్యలు. ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.కర్కాటకం... పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు.వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.సింహం.... మిత్రులతో విరోధాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దైవదర్శనాలు. పనులు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.కన్య.... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.తుల.... పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృశ్చికం... రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. పనులు మధ్యలో వాయిదా. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.ధనుస్సు.... ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.మకరం..... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఉత్సాహంగా పనులు పూర్తి. బంధువులతో సత్సంబంధాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.కుంభం... కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో మార్పులు. అనుకోని ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.మీనం.... కొత్త పనులకు శ్రీకారం. విందువినోదాలు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక వృద్ధి. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

పార్లమెంట్లో రచ్చ రచ్చ
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వరుసగా నాలుగో రోజు గురువారం ఎలాంటి కార్యకలాపాలు చోటుచేసుకోలేదు. బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతోపాటు కీలక అంశాలపై విపక్షాలు తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. ఆయా అంశాలపై వెంటనే చర్చ ప్రారంభించాలని, ప్రభుత్వం స్పందించాలని తేలి్చచెప్పాయి. నిరసనలు, నినాదాలు యథావిధిగా కొనసాగించాయి. ఉభయ సభలకు అంతరాయం కలిగించాయి. దీంతో సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. గురువారం ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. వెల్లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. సభకు సహకరించాలని, వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని స్పీకర్ బిర్లా కోరినా వారు వినిపించుకోలేదు. సభకు అంతరాయం సరైన పద్ధతి కాదని స్పీకర్ హితవు పలికారు. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత పరిస్థితిలో మార్పు రాలేదు. గోవా అసెంబ్లీలో ఎస్టీలకు సీట్ల కేటాయింపునకు సంబంధించిన బిల్లుపై చర్చలో పాల్గొనాలని స్పీకర్ స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్æ విజ్ఞప్తి చేయగా, విపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. ఎస్టీలకు సంబంధించిన బిల్లుపై చర్చకు అడ్డుపడడం పట్ల విపక్షాలపై న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినప్పటికీ నినాదాలు ఆగకపోవడంతో సభాపతి లోక్సభను శుక్రవారానికి వాయిదావేశారు. రాజ్యసభలోనూ గందరగోళం బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఉదయం రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వారు అలజడి సృష్టించడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత క్యారేజీ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లుపై చర్చ మొదలైంది. దీనిపై ఏఐఏడీఎంకే నేత తంబిదురై మాట్లాడారు. ఇంతలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. వెల్లోకి చేరుకొని నినాదాలతో హోరెత్తించారు. తంబిదురై తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆయోధ్యరామిరెడ్డి మాట్లాడారు. విపక్ష ఎంపీలు తమ నినాదాలు ఆపలేదు. సభలో వారి ప్రవర్తన పట్ల బీజేపీ ఎంపీ లక్ష్మీకాంత్ బాజ్పాయ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని సభాపతి స్థానంలో ఉన్న భువనేశ్వర్ కలితాను కోరారు. ప్రతిపక్ష నేత ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ విన్నవించారు. అందుకు సభాపతి అంగీకరింకపోవడంతో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. దాంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రాంగణంలో నిరసన బిహార్లో ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. ఓటు బందీని ఆపాలని ప్లకార్డులు ప్రదర్శించారు. సోనియా గాం«దీ, ప్రియాంకా గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విపక్షాలు ప్రదర్శించిన ప్లకార్డుల్లో లోక్తంత్ర బదులు లోక్తంతర్ అని రాసి ఉండడంతో బీజేపీ‡ నేత మాలవీయా వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ఏది ఎలా రాయాలో తెలియనివారు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

ఇక స్వేచ్ఛా వాణిజ్యం
లండన్: భారత్, బ్రిటన్ సంబంధాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. పరస్పర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెండు రెట్లు పెంచుకోవాలని వ్యూహాత్మక భాగస్వామ్యపక్షాలైన భారత్, యూకే నిర్ణయించుకున్నాయి. అమెరికా వాణిజ్య విధానాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించాయి. భారత ప్రధాని మోదీ గురువారం లండన్లో యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘యూకే–ఇండియా విజన్ 2035’ రోడ్మ్యాప్ను ఆవిష్కరించారు. అధికారికంగా సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ)గా పిలుస్తున్న డీల్పై మోదీ, కీర్ స్టార్మర్ సమక్షంలో భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, బ్రిటిష్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల భారత్, యూకే మధ్య వాణిజ్యం ఏటా 34 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తు న్నారు. ఎఫ్టీఏపై సంతకాలు జరగడం పట్ల మోదీ హర్షం వ్యక్తంచేశారు. భారత్, యూకే సంబంధాల్లో ఇదొక చరిత్రాత్మక దినమని అభివరి్ణంచారు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయినట్లు తెలిపారు. కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. యూరోపియన్ యూనియన్(ఈయూ) తా ము బయటకు వచి్చన అనంతరం కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదేనని స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగానే.. కీర్ స్టార్మర్తో చర్చల అనంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు యూకే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, యూకే ఐక్యంగా పనిచేస్తున్నాయని చెప్పా రు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదన్నారు. భారత్కు ఎనలేని మేలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్కు ఎనలేని మేలు జరుగుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు. భారత వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పరిశ్రమకు బ్రిటిష్ మార్కెట్లో నూతన అవకాశాలు లభిస్తాయన్నారు. భారతీయ యువత, రైతులు, మత్స్యకారులతోపాటు సూక్ష్మ, చిన్న, మ ధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) లబ్ధి చేకూరుతుందని స్పష్టంచేశారు. భారతీయ వ్రస్తాలు, పాదరక్షలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, సముద్ర ఆహారం, ఇంజనీరింగ్ వస్తువులకు యూకే మార్కెట్లోకి ప్రవేశం లభిస్తుందన్నారు. ‘విజన్–2030’ రోడ్మ్యాప్పై ఇండియా, యూకే అంకితభావంతో ముందుకెళ్తున్నాయని ఉద్ఘాటించారు.మోదీకి స్టార్మర్ విందు యూకే పర్యటన కోసం బుధవారం రాత్రి లండన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో తరలివచి్చన ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలికారు. లండన్కు 50 కిలోమీటర్ల దూరంలోని తన నివాసంలో గురువారం మోదీకి బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్, యూకే కలిసికట్టుగా పనిచేస్తాయని స్టార్మర్ అన్నారు. రెండు దేశాలు సహజ భాగస్వామ్య పక్షాలు అని మోదీ చెప్పారు. చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించుకుంటున్నాయని తెలిపారు. డబుల్ కంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్(డీసీసీ)పై ఏకాభిప్రాయానికి వచ్చామని వెల్లడించారు. రెండు దేశాల్లో టెక్నాలజీ, ఫైనాన్స్తోపాటు సేవల రంగానికి మేలు జరుగుతుందన్నారు. సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. భారత్–యూకే సంబంధాలపై మోదీ క్రికెట్ పరిభాషలో వివరణ ఇచ్చారు. కొన్నిసార్లు స్వింగ్ అండ్ మిస్ ఉండొచ్చని, అయినప్పటికీ ఎప్పటికీ స్ట్రెయిట్ బ్యాట్తో ఆడుతూనే ఉంటామన్నారు. హైస్కోరింగ్తోపాటు బలమైన భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాయని స్పష్టంచేశారు. మోదీ, స్టార్మర్ ‘బకింగ్హమ్ స్ట్రీట్ క్రికెట్ క్లబ్’ క్రీడాకారులతో సంభాíÙంచారు. ఒప్పందంతో లాభమేంటి? వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడేళ్ల చర్చల తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇది అమల్లోకి వస్తే జరిగేది ఏమిటంటే.. → బ్రిటిష్ ఉత్పత్తులపై ఇండియాలో సగటు సుంకాలు 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గిపోతాయి. → బ్రిటన్ నుంచి విస్కీ, చాక్లెట్లు, సాఫ్ట్ డ్రింకులు, కాస్మెటిక్స్, కార్లు, వైద్య పరికరాలు భారత మార్కెట్లోకి విస్తృతంగా ప్రవేశిస్తాయి. → బ్రిటిష్ విస్కీపై ప్రస్తుతం విధిస్తున్న 150 శాతం సుంకాన్ని భారత ప్రభుత్వం 75 శాతానికి తగ్గిస్తుంది. రాబోయే పదేళ్లలో 40 శాతానికి తగిస్తుంది. అంటే బ్రిటిష్ విస్కీ ఇండియాలో చౌకగా లభిస్తుంది. → భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలను యూకే సర్కార్ సగానికి తగ్గిస్తుంది. వ్రస్తాలు, పాదరక్షలు, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిపోతాయి. → ప్రధానంగా భారతీయ రైతులకు భారీ లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయ ఉత్పత్తులపై యూకేలో టారిఫ్లు దాదాపు 95 శాతం తగ్గుతాయి. జర్మనీ, నెదర్లాండ్స్తోపాటు ఈయూ రైతులతో సమానంగా, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే భారతీయ రైతులు లాభపడతారు. ఇండియా నుంచి దిగుమతి అయ్యే తేయాకు, పండ్లు, కూరగాయలు, మసాలా పొడులు, తృణధాన్యాలు, పచ్చళ్లు, రెడీ–టు–ఈట్ ఆహారం, పండ్ల గుజ్జుతోపాటు శుద్ధి చేసిన ఆహారంపై టారిఫ్లు సున్నాకు పడిపోతాయి. → మత్స్య, సముద్ర ఉత్పత్తులపై సుంకాలను 99 శాతం తగ్గించబోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడులో చేపలు, రొయ్యల పెంపకం చేస్తున్న రైతులకు లాభమే. → ఇండియా నుంచి యూకేకు దిగుమతి అయ్యే స్మార్ట్ఫోన్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, ఇన్వర్టర్లపై ఎలాంటి టారిఫ్ ఉండదు. → దేశీయ మద్యం ఉత్పత్తులు, పానీయాలు యూకే మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. సంప్రదాయ గోవా ఫెనీ, నాసిక్ వైన్స్, కేరళ కల్లు ఇందులో ఉన్నాయి. → ఎఫ్టీఏతో రానున్న మూడేళ్లలో ఇండియా నుంచి యూకేకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 20 శాతానికి పైగా పెరుగుతాయని అంచనా. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. → దేశీయ రైతులు, పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని పాడి ఉత్పత్తులు, వంట నూనెలు, యాపిల్స్ను ఎఫ్టీఏ నుంచి భారత ప్రభుత్వం మినహాయించింది. బ్రిటన్ నుంచి వచ్చే ఈ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు ఉండబోదు. మీరు ఆంగ్ల పదాలు వాడొచ్చు ఎఫ్టీఏపై సంతకాల తర్వాత మోదీ, స్టార్మర్ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్టార్మర్ స్పీచ్ను హిందీలోకి అనువాదం చేస్తున్న దుబాసీ కొంత ఇబ్బందిపడ్డారు. ఆయనకు అప్పటికప్పుడు సరైన హిందీ పదాలు తగల్లేదు. అది గమనించిన మోదీ ‘‘ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మీరు మధ్యలో ఆంగ్ల పదాలు వాడొచ్చు. దాని గురించి చింతించకండి’’ అని సూచించారు. దుబాసీ క్షమాపణ కోరగా, ఫర్వాలేదని మోదీ అన్నారు. ఇదంతా చూసిన స్టార్మర్ చిరునవ్వు చిందించారు.

కూటమి నేతల ప్లాన్.. మైనర్లతో దొంగల ముఠా తయారీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మైనర్లకు లిక్కర్, గంజాయి అలవాటు చేసి వారితో చోరీలు చేయిస్తూ రూ.కోట్లు వెనకేసుకున్నారు అధికార కూటమికి చెందిన ఇద్దరు నేతలు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఏడాదిగా సాగుతున్న ఈ దందా బండారం ఎట్టకేలకు బయటపడింది. చోరీ చేసిన సెల్ఫోన్లో సిమ్ వేసిన మైనర్లు బుధవారం దొరికిపోవడంతో కూటమి నేతల పాపం పండింది. సేకరించిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం నవీన్మిట్టల్ కాలనీకి చెందిన జనసేన నేత బందరు పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేత పీఏకు సన్నిహితంగా ఉంటాడు.ఈయన బందరు మండలం చినకరగ్రహారం గ్రామ శివారు పల్లెపాలెంకు చెందిన టీడీపీ నేత కొక్కిలిగడ్డ రాముతో జత కట్టి ఈజీగా డబ్బు సంపాదించాలని ‘మాస్టర్’ ప్లాన్ వేశారు. ముగ్గురు మైనర్లకు మాయమాటలుచెప్పి లిక్కర్, గంజాయి అలవాటు చేశారు. చోరీలకు పాల్పడేలా ముగ్గులోకి దింపారు. వారి చేత తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేయించారు. ఏడాదిగా దందా సాగిస్తున్నారు. ఇప్పటివరకు పదికిపైగా చోరీలు చేయించినట్టు సమాచారం. 100 గ్రాములు బంగారు ఆభరణాలతోపాటు సుమారు 700 గ్రాముల వెండి వస్తువులు, రూ.లక్షల్లో నగదును చోరీ చేయించారు. మైనర్లకు అడిగినప్పుడల్లా అవసరాలకు చిల్లర విసిరి, చోరీ సొత్తునంతా ఇద్దరు నేతలే పంచుకున్నారు. తెచ్చిన బంగారు ఆభరణాలన్నీ చిలకలపూడి బంగారమని మైనర్లను నమ్మించి మోసం చేసేవారు. పట్టించిన సిమ్ ఇటీవల చోరీ చేసే సమయంలో నగదుతోపాటు సెల్ఫోన్ను అపహరించిన మైనర్లు ఆ ఫోన్లో సిమ్ తీసేసి కొంతకాలం దాన్ని దాచిపెట్టారు. ఇటీవల ఫోన్పై మోజుతో ఓ మైనర్ కొత్త సిమ్ తీసుకుని దానిలో వేశాడు. అప్పటికే నేరస్తుల కోసం నిఘా పెట్టి ఉంచిన పోలీసులకు సెల్ఫోన్ సిగ్నల్ ట్రేస్ కావటంతో బుధవారం ముగ్గురు మైనర్లను అరెస్టు చేశారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చే క్రమంలో కూటమి నేతల బండారం బయటపడింది. ఈ విషయం విని పోలీసులే నిర్ఘాంతపోయారు. మంత్రి ఫోన్తో 41ఏ నోటీసులతో సరి..!విషయం తెలిసిన పోలీసులు ఇద్దరు కూటమి నేతల అరెస్టుకు సిద్ధమయ్యారు. దీంతో అలర్ట్ అయిన కంత్రీ నాయకులు మంత్రిని ఆశ్రయించారు. విషయం బయట పడితే కూటమి పరువు పోతోందని భావించిన మంత్రి కేసును నీరుగార్చాలని పోలీసులకు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు కూటమి నేతలను పిలిపించి 41ఏ నోటీసులు ఇచ్చి పంపించారు. ఆ తర్వాత జనసేన నేతను ఏకంగా కేసు నుంచి తప్పించారు. ఇతని సోదరుడు జనసేన డివిజన్ అధ్యక్షుడు కావడం, పార్లమెంటు ముఖ్యనేత పీఏకు సన్నిహితంగా ఉండడంతో కేసు నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. పోలీసులు రికవరీ చేసిన సొమ్ము కూడా తక్కువ చేసి, చూపినట్లు అనుమానాలు ఉన్నాయి. కూటమి నేతల మాయమాటలతో చోరీలకు పాల్పడిన ముగ్గురూ మైనర్లు కావడంతో కోర్టు వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అమానుషంపై స్పందించి తీరుదాం!
నాకెందుకో నిమిష ప్రియకు మరణ దండనను అమలుపరచకపోవచ్చు అనిపిస్తోంది. ఇరాన్ అండదండలున్న హూతి దళాల పాలనలో ఉన్న యెమెన్లోని భాగంలో షరియా చట్టం అమలులో ఉంది. కేరళకు చెందిన 38 ఏళ్ళ నర్సు నిమిష ప్రియ ఆమె వ్యాపార భాగస్వామిని హత్య చేసిందంటూ అక్కడి చట్టం ఆమెకు మరణ దండనను విధించింది. హూతీల రాజకీయ, న్యాయ పాలనా సౌధంలో ప్రతి ఒక్కరు ఆ శిక్షను ధ్రువపరచేశారు. పాలక్కాడ్లో జన్మించిన ఆ క్రైస్తవ మతస్థురాలు అరెస్టు అయి, శిక్షపడినప్పటి నుంచి ఇప్పటికి అనేక నెలలుగా ఫైరింగ్ స్క్వాడ్ ను ఎదుర్కోవలసిన స్థితిలో ఉంది. మరణ దండనను అమలుపరచేందుకు యెమెన్లో కాల్పులు జరిపి చంపే విధానం అమలులో ఉంది. నాలుగు ఆశలువర్తమాన భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో భారతదేశానికున్న ప్రాధాన్యం వల్లనైతేనేమి లేదా నిమిష కేసు దాదాపుగా మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించడం వల్లనైతేనేమి లేదా మరణ దండనకు వ్యతిరేకంగా ఇరాన్, సౌదీ అరేబియాలు యెమెన్కు నచ్చజెప్పడం వల్లనైతేనేమి ఆ దేశం బుల్లెట్లకు ఇంకా పనిచెప్పలేదు. నిమిషను కాపాడేందుకు ‘సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్’ పేరుతో కొందరు ఒక సంఘంగా ఏర్పడ్డారు. నిమిష లీగల్ డిఫెన్స్ను సమన్వయపరచుకుంటూ ఆ కౌన్సిల్ పనిచేస్తోంది. కేరళలోని ఇస్లామిక్ మత పెద్దలు, ప్రసిద్ధ స్కాలర్లు బహిరంగంగా, తెర వెనుక మార్గాల ద్వారా శిక్షను ఆపు చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ప్రయత్నాలు వృథా పోవని అనిపిస్తోంది. మరణ దండనకు గురిచేయకుండా ఆమెను విడిచిపెట్టవచ్చుననడానికి నాకు మరో నాలుగు కారణాలు తోస్తున్నాయి. ఒకటి– షరియా అమలులో ఉండటం నిజం. హతుని కుటుంబ ఆగ్రహం కూడా అర్థం చేసుకోదగిందే. నమ్మశక్యం కాకపోయినా, కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతాన్ని ప్రపంచం అసహ్యించుకుంటుందని సానా(యెమెన్ రాజధాని) లోని అధికార వర్గాలకు తెలియదనుకోలేం. రెండు– యెమెన్లోని ఆ భాగంలో ఉన్న అధికారులు మానవ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ నిబంధనలకు జవాబుదారులు ఏమీ కారు. గతంలో మరణ దండనలను గణనీయంగానే అమలు జరిపి ఉండవచ్చు. అంతమాత్రాన, ప్రపంచ మనోభిప్రాయాన్ని లెక్క చేయనివారుగా బాహాటంగా కనిపించకూడదని వారు అనుకుంటూ ఉండవచ్చు. మూడు– జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వంటి సమర్థులు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉన్నారు. పరాయి దేశంలో బందీగా ఉన్న ఒక భారతీయ మహిళను కాపాడలేకపోయినదిగా కనిపించడం భారత ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. నిమిష ప్రాణాలను కాపాడేందుకు హంగు ఆర్భాటాలు లేకుండా ఎంత ప్రయత్నించాలో అంతా న్యూఢిల్లీ చేస్తుంది. నాలుగు– హతుని కుటుంబం దోషిని క్షమించినందుకు పరిహారంగా ఇచ్చే నగదు(బ్లడ్ మనీ) మొత్తంపైనే ఇపుడు సంప్రదింపులు సాగుతున్నట్లు చెబుతున్నారు. వాటిలో ప్రభుత్వం పాల్గొన్నా పాల్గొనకపోయినా ప్రపంచంలోనే నాల్గవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ నగదు కొరతతో బాధపడుతున్నదిగా ముద్రపడలేదు.ఒకవేళ ఆశలు అడియాసలైతే...పైన పేర్కొన్న కారణాలన్నింటివల్ల నిమిష ప్రియను కాపాడారు అనుకుందాం. అదృష్టం బాగుండి ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది అనుకుందాం. ఆమెకు ఘన స్వాగతం లభిస్తుంది. ఆమె ప్రాణాలను కాపాడిన ఘనత తమదేనని చెప్పుకునేవారూ చాలా మంది ఉంటారు. కానీ, నా ఈ అంచనాలన్నీ ఘోరంగా తలకిందులు కావచ్చు. సానాలోని పాలకులు నిమిష ప్రియకు మరణ దండనను అమలుపరిస్తే, నేను పైన చెప్పిన విషయాలన్నీ బుద్ధి హీనమైనవిగా తేలతాయి. నిజంగానే, ఘోరం జరిగితే, భారత్ ఏం చేయవలసి ఉంటుంది? భారత్ తన అసంతృప్తిని సానాకు తెలిపి తీరాలి. ‘‘ఇది టెర్రరిజం కేసు కాదు కదా. ఆ పని భారత్ను ఉద్దేశించి చేసింది కాదు. ఆ చర్య భారత రాజ్య వ్యవస్థకు లేదా ప్రజానీకానికి వ్యతిరేకంగా తీసుకున్నది కాదు’’ అని ఎవరూ అనుకోకూడదు. ఎందుకంటే, సానాలోని రాజకీయ వ్యవస్థ చట్టబద్ధమైనదని ప్రపంచం గుర్తించలేదు. అటువంటి వ్యవస్థ తమ దేశంలో ఉంటున్న ఒక భారతీయురాలి జీవితాన్ని అంతమొందిస్తే మనం మౌనంగా చూస్తూ ఊరుకోవాలా? అందులోనూ ఆమె సేవా భావంతో నిండి ఉండే నర్సింగ్ వృత్తిలో ఉన్న వ్యక్తి. ఆమెకు అలాంటి గతి పట్టవచ్చా? అనేక దేశాలలో వివిధ వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్న భారతీయులు సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వారిలో నర్సులు గణనీయమైన వర్గం కిందకు వస్తారు. ఆ యా దేశాలు అన్నింటి దృష్టిలో మనం చులకన అయిపోమా? నిమిష చేసిన నేరం తక్కువదేమీ కాదు. దాన్ని గర్హించకుండా ఉండటమో లేదా ఉపేక్షించడమో చేయలేం. దాన్నలా ఉంచినా, హతుని దేహాన్ని ఆమె ముక్కలు చేసిన తీరు ఇంకా ఘోరం. కానీ, ఆమె హంతకురాలిగా మారడానికి పురికొల్పిన అంశాలను కూడా విస్మరించలేం. అటువంటి నేరమే భారతదేశంలో జరిగి ఉంటే, దిగువ కోర్టు ఉరి శిక్ష విధించినా సంబంధిత హైకోర్టు లేదా సుప్రీం కోర్టు దాన్ని జీవిత ఖైదు శిక్షగా తగ్గించే అవకాశాలు ఎక్కువ. కోర్టులన్నీ మరణ దండనను సమర్థించినా, క్యాబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించి శిక్షను తగ్గించే అవకాశమూ ఉంది. అసంతృప్తిని చాటి తీరాలి!సరే. అది ఇపుడు అప్రస్తుతం. దేశపు చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తింపు పొందని కొన్ని శక్తుల నియంత్రణలో ఉన్న యెమెన్లోని ఒక భూభాగంలో ఫైరింగ్ స్క్వాడ్ నిమిషను కాల్చి చంపితే, ఇండియా ఎలా స్పందించాలి? ఆపరేషన్ రాహత్ కింద, ఆ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో భారతీయులను భారత ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చింది. యెమెన్లోని ఆ ప్రాంతంలో ఇప్పటికీ కొద్ది వేల మంది భారతీయులు ఉన్నారని చెబుతున్నారు. వారినందరినీ ఏకమొత్తంగా వెనక్కి తీసుకొచ్చే అంశాన్ని భారత్ పరిశీలించవలసి ఉంటుందా? వారిలో కొంత మందికి స్వదేశానికి రావడం ఇష్టం లేకపోయినా ప్రభుత్వం ఆ పని చేయాలా? దానివల్ల యెమెన్కు వాటిల్లే నష్టం ఏమైనా ఉంటుందా? అక్కడున్న భారతీయుల భద్రత పట్ల భారత్కు నమ్మకం కలగడం లేదనే అంశాన్ని మనం వెల్లడించి తీరాలి. యెమెన్లోని ఆ ప్రాంతంతో వాణిజ్యాన్ని (అది లెక్కలోకి వచ్చేది కాకపోయినా) మనం తీవ్రంగా పరిమితం చేయాలి. సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాన్ని మనం ఈ విషయంలో అనుసరించినా తప్పు లేదు. కానీ, నేను మొదట ధైర్యంగా అనుకుంటున్నదే నిజమవ్వాలని ఆశిద్దాం. ఇలాంటి స్పందనలకు వెళ్ళాల్సిన అవసరం రాకూడదనే ప్రార్థిద్దాం. ఈ సందర్భంగా భారత్ చేసి తీరవలసిన పని మరొకటుంది. పాకిస్తాన్లో మరణ దండనను ఎదుర్కొంటున్న కులభూషణ్ జాధవ్ను స్వదేశానికి తిరిగి రప్పించాలన్న మన డిమాండ్ను ఇది మరింత బలోపేతం చేయాలి. నిమిష కేసును (ఒకవేళ ఆమె శిక్షను మనం నిలువరించలేకపోతే) ఆసరాగా చేసుకుని, జాధవ్కు కూడా అటువంటి గతి పట్టించే సాహసం పాకిస్తాన్ అధికారులకు కలుగకుండా మనం ప్రతిఘటించి తీరాలి. ఇది చాలా ముఖ్యం. అన్నింటికన్నా మించి, అరుదైన కేసుల్లోనే విధిస్తున్నప్పటికీ, మన దేశంలోనూ ఉరి శిక్షకు అవకాశం కల్పిస్తున్నాం. శిక్షా స్మృతికి సంబంధించి నీతి నియమాలు పరిణామం చెందుతున్న పరిస్థితులలో, ఆ రకమైన (ఉరి) శిక్ష తగినది కాదని మనం గ్రహించవలసి ఉంది.గోపాలకృష్ణ గాంధీవ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, ఆధునిక భారతదేశ చరిత్ర విద్యార్థి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)

ENG VS IND 4th Test Day 2: దంచికొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్లు
మాంచెస్టర్: నాలుగో టెస్టులో ఇంగ్లండ్ మళ్లీ ‘బజ్బాల్’ ఆటకు దిగినట్లుంది. ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్లిద్దరూ వన్డేను తలపించే బ్యాటింగ్ దూకుడు కనిపించడంతో ఒక్క సెషన్లోనే 148 పరుగులు చేసింది. అంతకుముందు భారత ఇన్నింగ్స్ను గాయపడిన రిషభ్ పంత్ బ్యాటింగ్కు దిగి ఆదుకున్నాడు. టెస్టులో పోరాడేందుకు తనవంతు పరుగులు జతచేసే నిష్క్రమించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 114.1 ఓవర్లలో 358 పరుగుల వద్ద ఆలౌటైంది. రిషభ్ పంత్ (75 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్స్లు), శార్దుల్ ఠాకూర్ (88 బంతుల్లో 41; 5 ఫోర్లు) రాణించారు. లోయర్ ఆర్డర్పై ప్రతాపం చూపిన బెన్ స్టోక్స్ 5 వికెట్లు పడగొట్టగా, ఆర్చర్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 46 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (113 బంతుల్లో 84; 13 ఫోర్లు, 1 సిక్స్), బెన్ డకెట్ (100 బంతుల్లో 94; 13 ఫోర్లు) అదరగొట్టారు. పోప్ (20 బ్యాటింగ్; 3 ఫోర్లు), రూట్ (11 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. జడేజా, అన్షుల్ కంబోజ్లకు ఒక్కో వికెట్ దక్కింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లండ్ ఇంకా 133 పరుగులు వెనుకబడి ఉంది. తడబడిన మిడిలార్డర్ రెండో రోజు ఓవర్నైట్ స్కోరు 264/4తో గురువారం ఆట ప్రారంభించిన భారత్ ఆదిలోనే కీలకమైన వికెట్ను కోల్పోయింది. క్రితం రోజు స్కోరుకు కేవలం ఒక పరుగే జతచేసిన జడేజా (20; 3 ఫోర్లు)ను ఆర్చర్ బోల్తా కొట్టించాడు. ఈ దశలో శార్దుల్కు వాషింగ్టన్ సుందర్ జతయ్యాడు. ఇద్దరు అడపాదడపా బౌండరీలు కొడుతూ జట్టు స్కోరును 300 దాటించారు. ఈ సెషన్ ముగిసే దశలో ఉండగా క్రీజులో పాతుకుపోయిన శార్దుల్ను స్టోక్స్ అవుట్ చేసి భారత్ను కష్టాల్లోకి నెట్టాడు. తొలిరోజు రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగిన రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. ఈ దశలో 321/6 స్కోరు వద్ద వర్షం కాసేపు ఆటంకపరిచింది. అక్కడితోనే తొలి సెషన్ ముగిసింది. రెండో సెషన్లో పంత్, సుందర్ ఇన్నింగ్స్ను గాడినపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ జోడీ బలపడుతుండగానే స్టోక్స్ మళ్లీ గట్టిదెబ్బే కొట్టాడు. నాలుగు బంతుల వ్యవధిలో సుందర్ (90 బంతుల్లో 27; 2 ఫోర్లు), అన్షుల్ కంబోజ్ (0)లను అవుట్ చేశాడు. ఆర్చర్ బౌలింగ్లో 6 కొట్టిన పంత్... స్టోక్స్ వేసిన మరుసటి ఓవర్లో బౌండరీతో 69 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తిచేసుకున్నాడు. తర్వాత కాసేపటికే ఆర్చర్... పంత్తో పాటు బుమ్రా (4) వికెట్ పడగొట్టడంతో భారత్ ఇన్నింగ్స్కు తెరపడింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బ్రూక్ (బి) డాసన్ 58; రాహుల్ (సి) క్రాలీ (బి) వోక్స్ 46; సుదర్శన్ (సి) కార్స్ (బి) స్టోక్స్ 61; గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టోక్స్ 12; పంత్ (బి) ఆర్చర్ 54; జడేజా (సి) బ్రూక్ (బి) ఆర్చర్ 20; శార్దుల్ (సి) డకెట్ (బి) సోŠట్క్స్ 41; సుందర్ (సి) వోక్స్ (బి) స్టోక్స్ 27; అన్షుల్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 0; బుమ్రా (సి) స్మిత్ (బి) ఆర్చర్ 4; సిరాజ్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 30; మొత్తం (114.1 ఓవర్లలో ఆలౌట్) 358. వికెట్ల పతనం: 1–94, 2–120, 3–140, 4–235, 5–266, 6–314, 7–337, 8–337, 9–349, 10–358. బౌలింగ్: వోక్స్ 23–5–66–1, ఆర్చర్ 26.1–3–73–3, కార్స్ 21–1–71–0, స్టోక్స్ 24–3–72–5, డాసన్ 15–1–45–1, జో రూట్ 5–0–19–0. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) రాహుల్ (బి) జడేజా 84; డకెట్ (సి) సబ్–జురేల్ (బి) అన్షుల్ 94, ఒలీ పోప్ (బ్యాటింగ్) 20; రూట్ (బ్యాటింగ్) 11; ఎక్స్ట్రాలు 16; మొత్తం (46 ఓవర్లలో 2 వికెట్లకు) 225. వికెట్ల పతనం: 1–166, 2–197. బౌలింగ్: బుమ్రా 13–4–37–0, అన్షుల్ కంబోజ్ 10–1–48–1, సిరాజ్ 10–0–58–0, శార్దుల్ 5–0–35–0, జడేజా 8–0–37–1. ఫ్రాక్చరైనా... ప్యాడ్లు కట్టుకొని... తొలి రోజే రిషభ్ పంత్ గాయపడటంతో భారత్కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. వోక్స్ సంధించిన బంతి పంత్ కుడికాలి బొటనవేలికి బలంగా తగలడంతో అతను విలవిలలాడుతూ రిటైర్ట్హర్ట్గా వెనుదిరిగాడు. తదనంతరం స్కానింగ్లో బొటనవేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలడంతో ఇక ఆడే పరిస్థితి లేనట్లేనని భావించారంతా! కానీ 2022, డిసెంబర్లో పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన పంత్ నడవలేని స్థితి నుంచి... పట్టుదలతో నడవడమే కాదు ఏకంగా పిచ్పై చకచకా పరుగులు తీస్తున్న ఈ పోరాటయోధుడు రెండో రోజు బ్యాటింగ్కు దిగి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గాయాన్ని పంటిబిగువన భరించి అసౌకర్యంగా నడుకుకుంటూ వచ్చిన రిషభ్ పంత్ క్రీజ్లో మొండిగా పోరాడి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. దెబ్బ తగలగానే అడుగుతీసి అడుగు వేయడంలో ఇబ్బంది పడిన పంత్ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ బౌలర్లకు ఎదురీది అర్ధసెంచరీ సాధించడం విశేషం. ఈ స్పెషలిస్ట్ బ్యాటర్ ఆడటం వల్లే భారత్ తొలి ఇన్నింగ్స్లో 350 పైచిలుకు స్కోరు చేయగలిగింది. లేదంటే భారత్ పరిస్థితి భిన్నంగా ఉండేది. మొత్తమ్మీద అతని పోరాటం దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను గుర్తుకుతెచ్చింది. 2002లో కరీబియన్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో అప్పటి బౌలింగ్ దళానికి తురుపుముక్కలాంటి కుంబ్లే తలకు గాయమైంది. అయినాసరే తలకు బ్యాండేజ్ కట్టుకొని వచ్చి మరీ 14 ఓవర్లు వేసిన కుంబ్లే... వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాను అవుట్ చేశాడు.

రాయలసీమలో అనకొండ ఐపీఎస్
మహేశ్బాబు నటించిన పోకిరి సినిమాలో అవినీతిపరుడు, దందాలు చేసే సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా ఆశిష్ విద్యార్థి తుపాకీ గురిపెట్టి మరీ సెటిల్మెంట్లు సాగిస్తుంటాడు. భూములు, ఫ్లాట్లు రాయించుకుంటాడు. మరి.. అదే తరహా దందాకు ఏకంగా ఓ ఐపీఎస్ స్థాయి పోలీసు తెగబడితే ఎలా ఉంటుందో ప్రస్తుతం రాయల సీమ వాసులు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అందుకే ఆయనకు ‘అనకొండ ఐపీఎస్’ అని పోలీసు వర్గాలే పేరు పెట్టాయి. ఆయన టీడీపీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అత్యంత అవినీతి ఐపీఎస్ అధికారి.. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడు. ఇదే అదనుగా భూ సెటిల్మెంట్లతో హడలెత్తిస్తున్నారు. అందుకోసం సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని చెలరేగిపోతున్నారు. దాంతో రాయలసీమలో సామాన్యుల భూములకు రక్షణ లేని పరిస్థితి నెలకొంది. ఆయనను కాదంటే ప్రాణాలకే దిక్కుండదని కణతకు తుపాకీ గురిపెట్టి మరీ బెదిరిస్తున్నారు. సాక్షి, అమరావతి: కర్నూలు కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న ఆ ఐపీఎస్ అధికారి సెటిల్మెంట్ల దందా కోసం ఎంపిక చేసిన పోలీసు అధికారులతో ఓ టీమ్ను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ డీఎస్పీ, దాదాపు 12 మంది కిందిస్థాయి అధికారులు, కానిస్టేబుళ్లు అందులో సభ్యులుగా ఉన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన 2007 బ్యాచ్ సీఐ ఒకరు ఈ టీమ్కు పైలట్గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్య నేత పేరుతో ఉన్న ఆ సీఐ కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో ఎక్కడెక్కడ ప్రైవేట్ భూ వివాదాలు ఉన్నాయన్నది ఆరా తీస్తారు. అందులోని ఇరువర్గాల్లో కాస్త మెతకగా ఎవరు ఉన్నారో, ఎవర్ని బెదిరించి లొంగదీసుకోవచ్చునో గుర్తిస్తారు. ఆ వివరాలను అనకొండ ఐపీఎస్కు చేరవేరుస్తారు. తర్వాత ఆ ఐపీఎస్ భూ వివాదంలోని ఇరువర్గాల్లో అవతలి పక్షాన్ని పిలిపించి డీల్ మాట్లాడతారు. ‘‘కోర్టు కేసులంటూ ఎన్నేళ్లు తిరుగుతారు? నేను సెటిల్ చేస్తా’’నంటూ పెద్ద బేరం కుదుర్చుకుంటారు. అడ్వాన్స్ అందగానే ఆ ఐపీఎస్ తన బృందంలోని పోలీసు అధికారులను రంగంలోకి దింపుతారు. భూ వివాదంలో కాస్త మెతకగా ఉన్న కుటుంబ పెద్దను ఆ పోలీస్ పార్టీ అక్రమంగా ఎత్తుకు వస్తుంది. గుర్తుతెలియని ప్రదేశంలో నిర్బంధించి తమ మార్కు ట్రీట్మెంట్ రుచి చూపిస్తుంది. భూ వివాదాన్ని తాము చెప్పినట్టుగా సెటిల్ చేసుకోవాలని వేధిస్తారు. పోలీసు దెబ్బలు తట్టుకోలేక... ఎవరికీ చెప్పుకోలేక ఆ కుటుంబసభ్యులు ఐపీఎస్ అధికారి చెప్పినట్టు భూమిపై హక్కులు వదులుకునేందుకు సమ్మతిస్తారు. ఒక డీల్ సెట్ కాగానే ఐపీఎస్ అధికారి టీమ్ మరో భూ వివాదంపై దృష్టిపెడుతుంది. ప్రస్తుతం రాయలసీమలో యథేచ్ఛగా సాగుతున్న ఐపీఎస్ దందాలో ఏడాది కాలంలో పదుల సంఖ్యలో భూ వివాదాలను తనదైన శైలిలో సెటిల్ చేశారు. భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. కర్నూలులో ఆయన కార్యాలయం ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని తలపిస్తోందని పోలీసువర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.కాకినాడ పోర్టులోనూ దందానే! గత టీడీపీ ప్రభుత్వం ఆ ఐపీఎస్ను మౌలిక వసతుల కల్పన శాఖలో కీలక పోస్టులో నియమించింది. వాస్తవానికి ఇది ఐఏఎస్ అధికారితో భర్తీ చేయాల్సిన పోస్టు. కానీ, ఐపీఎస్కు కట్టబెట్టడం వివాదాస్పదమైంది. ఇక ఆ పోస్టు దక్కించుకున్న ఆ ఐపీఎస్ విచ్చలవిడిగా అవినీతికి తెగించారు. ప్రధానంగా కాకినాడ పోర్టు కాంట్రాక్టులు, అక్కడి నుంచి బియ్యం, ఇతర ఎగుమతుల్లో ఆయన చేసిన దందా అంతా ఇంతా కాదు. అక్రమంగా 40 మందిని నియమించుకుని మరీ భారీ వసూళ్లకు పాల్పడ్డారు. ఇద్దరి మధ్య వేలు పెట్టిరూ.1.80 కోట్లు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇద్దరు వ్యక్తుల మధ్య 4.2 ఎకరాల భూ వివాదాన్నీ ఆ ఐపీఎస్ అదే రీతిలో సెటిల్ చేశారు. ఓ వ్యక్తికి అనుకూలంగా వ్యవహరించి అవతలి పక్షాన్ని బెంబేలెత్తించారు. ఆయన ఇంటిలోకి పోలీసులు జొరబడి మరీ కుటుంబ సభ్యుల ముందే తీవ్రంగా కొట్టారు. ఈ వివాదంలో వెనక్కితగ్గకపోతే మున్ముందు పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దాంతో హడలిపోయిన ఆ కుటుంబం భూ వివాదం నుంచి వెనక్కుతగ్గింది. ఈ డీల్లో ఆ ఐపీఎస్ రూ.1.80 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.ఉపాధ్యాయుడినీ వదల్లేదు...కర్నూలులో 1.50 ఎకరాల భూమిపై వివాదం ఏర్పడింది. ఓ ఉపాధ్యాయుడికి తాతతండ్రుల నుంచి సంక్రమించిన ఈ భూమి తనది అంటూ రియల్టర్ వివాదం సృష్టించారు. ఉపాధ్యాయుడికి అనుకూలంగా కింది కోర్టులో తీర్పు వచి్చనా హైకోర్టులో అప్పీల్ చేశారు. ఇదంతా తెలిసిన అనకొండ ఐపీఎస్ రంగంలోకి దిగారు. పోలీసులతో కిడ్నాప్ చేయించి, భూమిపై హక్కులు విడిచి పెట్టాలని బెదిరించారు. ఆయన సమ్మతించ లేదని.. పోలీసులు 2రోజులు తమదైన శైలిలో టార్చర్ చూపించి, కదల్లేని స్థితిలోకి తీసుకొచ్చారు. పోలీసులే కిడ్నాప్ చేసి మరీ దాడి చేయడంతో కుటుంబం బెంబేలెత్తింది. అయినాసరే తాము చెప్పినట్టు సెటిల్మెంట్కు ఒప్పుకోలేదని ఉపాధ్యాయుడిపై అక్రమ కేసు నమోదుచేసి విచారణ పేరుతో వేధిస్తున్నారు.ఏవోబీ గంజాయి మాఫియా నుంచి నేటికీ వసూళ్లే అనకొండ ఐపీఎస్ అవినీతి ఊడలు ఆంధ్రా–ఒడిశా సరిహద్దులు (ఏవోబీ) దాక విస్తరించాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పనిచేశారు. అప్పుడు ఏవోబీలో గంజాయి సాగు, స్మగ్లింగ్ మాఫియాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వారిని నిరోధించకుండా ఉండేందుకు మామూళ్ల డీల్ సెట్ చేసుకున్నారు. ప్రైవేట్ ఏజెంట్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు కూడా. రెండేళ్ల తరువాత విశాఖపట్నం జిల్లా నుంచి బదిలీ అయినా సరే గంజాయి మాఫియా నుంచి మామూళ్ల వసూళ్లు మాత్రం ఆపలేదు. గత ఐదేళ్లలో ఆ ఐపీఎస్ ఆటలు సాగలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే మరోసారి ఏవోబీలో ఏజెంట్ల వ్యవస్థను క్రియాశీలం చేశారు. ప్రస్తుతం రాయలసీమలో పోస్టింగులో ఉన్నా సరే ఏవోబీలోని గంజాయి స్మగ్లర్లు మామూళ్లు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడినైన తాను త్వరలో రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం, ఉత్తరాంధ్రలో గానీ పోస్టింగ్ తెచ్చుకుంటానని చెబుతున్నారు. ఇప్పుడు మామూళ్లు ఇవ్వకపోతే ఉత్తరాంధ్ర వచ్చాక అందరి సంగతి తేలుస్తానని బెదిరిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు ఆ అధికారి సన్నిహితుడని తెలిసిన గంజాయి స్మగ్లర్లు మామూళ్లు సమర్పించుకుంటున్నారు. వందల్లో ఫిర్యాదులు..పట్టించుకోని ప్రభుత్వం రాయలసీమలో అనకొండ ఐపీఎస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బలవంతపు భూ సెటిల్మెంట్లతో వందలమంది ఆస్తులు కోల్పోయారు. పలువురు బాధితులు ఆ అధికారికి వ్యతిరేకంగా ఏసీబీ, పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. ఆయనపై వస్తున్న ఫిర్యాదులతో ఏసీబీ వర్గాలే విస్తుపోతుండడం గమనార్హం. ఈ విషయాన్ని ప్రభుత్వ ముఖ్య నేత దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు సమాచారం. కానీ తమకు సన్నిహితుడైన ఆ ఐపీఎస్కు ప్రభుత్వ పెద్దలు కొమ్ముకాస్తున్నారు. పక్కా ఆధారాలతో సహా నివేదిక సమర్పించినా సరే ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రభుత్వ పెద్దల మనోగతం అర్థమైంది. ఇదే అదనుగా అనకొండ ఐపీఎస్ మరింతగా సెటిల్మెంట్ల దందాతో పెట్రేగిపోతున్నారు. రైస్ మిల్లులో కోటి.. అనకొండ ఐపీఎస్... వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తనదైన శైలిలో భారీ సెటిల్మెంట్ చేశారు. దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ఓ రైస్ మిల్లుపై సివిల్ వివాదం ఏర్పడింది. దానిగురించి తెలుసుకున్న అనకొండ ఐపీఎస్ తన టీమ్ను పంపారు. ఆ డీల్ సెట్ చేస్తామని ఓ వర్గానికి ఆఫర్ ఇచ్చారు. వైరి వర్గానికి చెందిన వ్యక్తిని పోలీసులు అపహరించుకువచ్చారు. ట్రీట్మెంట్ రుచి చూపించారు. కేవలం నామమాత్రపు రేటుకు రైస్ మిల్లుపై హక్కు వదలుకునేలా చేశారు. ఈ డీల్లో ఆ ఐపీఎస్ అధికారికి రూ.కోటి దక్కిందని పోలీసు వర్గాలే చెబుతున్నాయి.

బ్లూ–గ్రే కాలర్ ఉద్యోగాల్లో మహిళలకు మరింత వాటా
ముంబై: కార్మిక, నైపుణ్య ఉద్యోగాల్లో (బ్లూ–గ్రే కాలర్ ఉద్యోగాలు) మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. అదే సమయంలో చెప్పుకోతగ్గ సంఖ్యలో ఉద్యోగం వీడుతుండడం (వలసల రేటు/అట్రిషన్) ఆందోళన కలిగిస్తోంది. 2023–24లో బ్లూ–గ్రే కాలర్ ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం 19 శాతానికి పెరిగింది. 2020–21 నాటికి వీరి భాగస్వామ్యం 16 శాతంగా ఉండడం గమనార్హం. కానీ, వలసలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ముఖ్యంగా ఏడాది లోపు అనుభవం ఉన్న మహిళల ఎక్కువగా ఉద్యోగం మానేస్తున్నారు. ఈ వివరాలను ఉదైతి ఫౌండేషన్, క్వెస్కార్ప్ నివేదిక వెల్లడించింది. రిటైల్, తయారీ, బీఎఫ్ఎస్ఐ, సేవల రంగాల్లో ఉద్యోగం చేస్తున్న 10,000 మంది మహిళలతోపాటు, ఉద్యోగం మానేసిన 1,500 మందిని సర్వే చేసి ఈ వివరాలు విడుదల చేసింది. వలసలు ఎక్కువగా ఉండడం ఉత్పాదకతకు, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్వప్న సాకారానికి విఘాతం కలిగిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మహిళల అభిప్రాయాలు.. వచ్చే 12 నెలల్లో ఉద్యోగం వీడనున్నట్టు ఏడాది లోపు అనుభవం ఉన్న 52 శాతం మహిళా ఉద్యోగులు సర్వేలో తెలిపారు. అదే రెండేళ్లకు పైగా అనుభవం ఉన్న వారిలో ఇలా చెప్పిన వారు 3 శాతంగానే ఉండడం గమనార్హం. వలసల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల్లోనూ 54 శాతం తమ వేతనం విషయమై సంతృప్తిగా లేరు. 80 శాతం మంది నెలకి రూ. 2,000 కన్నా తక్కువే పొదుపు చేస్తున్నారు. మంచి వేతనం ఇస్తే ఉద్యోగాల్లో తిరిగి చేరతామని 42 శాతం మంది చెప్పారు. 57 శాతం మంది రవాణా పరమైన సవాళ్లను ఎదుర్కొంటుంటే, 11 శాతం మంది రాత్రి షిఫ్టుల్లో పని ప్రదేశానికి వెళ్లి రావడాన్ని భద్రంగా భావించడం లేదు. రూ.20వేల కంటే అధిక వేతనం పొందుతున్న వారు సమీప కాలంలో ఉద్యోగం విడిచి పెట్టిపోవడం 21 శాతం తక్కువగా ఉండొచ్చన్నది ఈ నివేదిక సారాంశం. వ్యవస్థలోనే లోపం.. ‘‘భారత్ ఆర్థిక సామర్థ్యాల విస్తరణకు అద్భుతమైన అవకాశాలున్నాయి. పని ప్రదేశాల్లో మహిళలకు ద్వారాలు తెరిచాం. కానీ, వారికి అనుకూలమైన వ్యవస్థల ఏర్పాటుతోనే వృద్ధి చెందగలరు. సామర్థ్యాలు లేకపోవడం వల్ల మహిళల ఉద్యోగాలు వీడడం లేదు. మహిళలు పనిచేసేందుకు, విజయాలు సాధించేందుకు అనుకూలమైన వసతులను మనం కలి్పంచలేకపోతున్నాం’’అని ఉదైతి ఫౌండేషన్ సీఈవో పూజ గోయల్ వివరించారు.
అందుకే ఆ యువ ఐఏఎస్పై వేటు!
బ్లూ–గ్రే కాలర్ ఉద్యోగాల్లో మహిళలకు మరింత వాటా
కలసి తింటూ.. బరువెక్కుతున్నారు
అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు.. ఆక్వా వ్యాలీ తప్ప
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
విశాఖ రైల్వేజోన్ డీపీఆర్కు పచ్చజెండా!
ఐఆర్డీఏఐ కొత్త చైర్మన్ అజయ్ సేత్
సొసైటీల్లోనూ ‘పచ్చ’మేత
మళ్లీ ఐపీవో హవా..!
ఉద్యోగులకు ఒక్క డీఏ ఇవ్వడానికీ మనసు రావడం లేదు
బుల్లితెర నటుడి ఎంగేజ్మెంట్! నటికి మాత్రం రెండో పెళ్లి!
నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన
తెలుగు ప్రేక్షకులంటే మరీ అంత చులకనా?
HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ
లిక్కర్ కేసు సంగతి చూడమంటే తిరిగి తిరిగి మళ్లీ నా దగ్గరికే వచ్చారేంటయ్యా!!
ఫ్యాటీ లివర్.. పారాహుషార్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
ఐటీ రిటర్న్ కొత్త డెడ్లైన్.. మిస్ అయితే పెద్ద తలనొప్పే!
ముడతలు లేకుండా అందంగా.. ఆకర్షణీయంగా మెరిసిపోవాలంటే..!
మీరు నటనకు ఎప్పుడూ దూరంగా లేర్సార్! నటిస్తూనే ఉన్నారు!
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు
ఇండస్ట్రీ నే షేక్ చేస్తోన్న.. రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్
రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్
హరిహర వీరమల్లు పార్ట్-2.. నిర్మాత రత్నం షాకింగ్ సమాధానం!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. పలుకుబడి పెరుగుతుంది
.. నొక్కకుండా ఉండటానికట!
‘గుడ్ న్యూస్.. పెద్ద క్రాష్ రాబోతోంది’
బగారా రైస్. చికెన్ కర్రీతో టీచర్ల విందు..కట్ చేస్తే కలెక్టర్..!
బీటెక్ విద్యార్థితో వివాహిత జంప్.. మూడు రోజులకే ట్విస్ట్!
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ?
అందుకే ఆ యువ ఐఏఎస్పై వేటు!
బ్లూ–గ్రే కాలర్ ఉద్యోగాల్లో మహిళలకు మరింత వాటా
కలసి తింటూ.. బరువెక్కుతున్నారు
అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు.. ఆక్వా వ్యాలీ తప్ప
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
విశాఖ రైల్వేజోన్ డీపీఆర్కు పచ్చజెండా!
ఐఆర్డీఏఐ కొత్త చైర్మన్ అజయ్ సేత్
సొసైటీల్లోనూ ‘పచ్చ’మేత
మళ్లీ ఐపీవో హవా..!
ఉద్యోగులకు ఒక్క డీఏ ఇవ్వడానికీ మనసు రావడం లేదు
బుల్లితెర నటుడి ఎంగేజ్మెంట్! నటికి మాత్రం రెండో పెళ్లి!
నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన
తెలుగు ప్రేక్షకులంటే మరీ అంత చులకనా?
HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ
లిక్కర్ కేసు సంగతి చూడమంటే తిరిగి తిరిగి మళ్లీ నా దగ్గరికే వచ్చారేంటయ్యా!!
ఫ్యాటీ లివర్.. పారాహుషార్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
ఐటీ రిటర్న్ కొత్త డెడ్లైన్.. మిస్ అయితే పెద్ద తలనొప్పే!
ముడతలు లేకుండా అందంగా.. ఆకర్షణీయంగా మెరిసిపోవాలంటే..!
మీరు నటనకు ఎప్పుడూ దూరంగా లేర్సార్! నటిస్తూనే ఉన్నారు!
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు
రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్
హరిహర వీరమల్లు పార్ట్-2.. నిర్మాత రత్నం షాకింగ్ సమాధానం!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. పలుకుబడి పెరుగుతుంది
.. నొక్కకుండా ఉండటానికట!
‘గుడ్ న్యూస్.. పెద్ద క్రాష్ రాబోతోంది’
బగారా రైస్. చికెన్ కర్రీతో టీచర్ల విందు..కట్ చేస్తే కలెక్టర్..!
బీటెక్ విద్యార్థితో వివాహిత జంప్.. మూడు రోజులకే ట్విస్ట్!
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ?
‘హరి హర వీరమల్లు’ ట్విటర్ రివ్యూ
సినిమా

HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ
టైటిల్: హరిహర వీరమల్లునటీటులు: పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, సునీల్, నాజర్, రఘు బాబు తదితరులునిర్మాణ సంస్థ: మెగా సూర్య ప్రొడక్షన్స్నిర్మాత: ఎ. దయాకర్ రావుసమర్పణ: ఏఎం రత్నందర్శకత్వం: క్రిష్, జ్యోతికృష్ణసంగీతం: ఎంఎం కీరవాణిసినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంసవిడుదల తేది: జులై 24, 2025ఎట్టకేలకు హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ..నేడు(జులై 24) థియేటర్స్లో రిలీజైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఇది 16వ శాతాబ్దంలో జరిగే కథ. హరి హర వీరమల్లు (పవన్ కల్యాణ్) ఓ గజ దొంగ. ఉన్నవాళ్ల దగ్గర దోచుకొని లేని వాళ్లకు పంచేస్తుంటాడు. మొఘల్ సైన్యం తరలించుకుపోతున్న వజ్రాల్ని దొంగలించి చిన్న దొర(సచిన్ కేడ్కర్) దృష్టిలో పడతాడు. చిన్న దొర అతన్ని పిలుపించుకొని గోల్కొండ నవాబుకు పంపాల్సిన డైమాండ్స్ని దొంగిలించి తనకు ఇవ్వాలని కోరతాడు. దానికి బదులుగా రెండు వజ్రాలను ఇస్తానని ఒప్పందం చేసుకుంటాడు. వీరమల్లు మాత్రం వజ్రాలతో పాటు చిన్నదొర దగ్గర బంధీగా ఉన్న పంచమి(నిధి అగర్వాల్)ని విడిపించాలనుకుంటాడు. కానీ వీరమల్లు ప్లాన్ బెడిసి కొట్టి గొల్కొండ నవాబుకు బంధీగా దొరికిపోతాడు. వీరమల్లు నేపథ్యం తెలిసిన నవాబ్.. ఢిల్లీలోని ఎర్రకోటలో ఔరంగజేబు(బాబీ డియోల్) ఆధీనంలో ఉన్న కొహినూర్ వజ్రాన్ని వెనక్కి తెచ్చి ఇవ్వాలని కోరతాడు. వీరమల్లు తన స్నేహితులు(నాజర్, సునీల్, రఘు బాబు,సుబ్బరాజు)తో పాటు నవాబు మనుషులతో కలిసి ఢిల్లీకి పయనం అవుతాడు. వీరమల్లు ఢిల్లీ ప్రయాణం ఎలా సాగింది? ఈ జర్నీలో ఆయనకు ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు ఔరంగజేబు దగ్గర ఉన్న కొహినూర్ వజ్రాన్ని తీసుకురాగలిగాడా లేడా? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu Review) చిత్రంపై మొన్నటి వరకు పెద్ద అంచనాల్లేవు. ప్రచార చిత్రాలు చూసి ఫ్యాన్స్ సైతం ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై కాస్త బజ్ క్రియేట్ చేసింది. దానికి తోడు పవన్ కూడా తొలిసారి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో సినిమా బాగుందేమో అందుకే ఆయన రంగంలోకి దిగాడని ఫ్యాన్స్తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా భావించారు. కానీ వారి ఆశలపై వీరమల్లు నీళ్లు చల్లాడు. కథే రొటీన్ అంటే అంతకు మించిన అవుట్ డేటెడ్ స్క్రీన్ప్లేతో ఫ్యాన్స్కి సైతం ఇరిటేషన్ తెప్పించాడు. ఇక సీజీ వర్క్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఈ మధ్య చిన్న చిన్న సినిమాలలో కూడా వీఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. మరి స్టార్ హీరో, బడా నిర్మాత ఉండి కూడా గ్రాఫిక్స్ వర్క్ ఇంత పేలవంగా ఉండడానికి కారణం ఎవరో..? తెలియదు.గుర్రాల సీక్వెన్స్లతో పాటు క్లైమాక్స్లో వచ్చే సుడిగుండం సీన్ వరకు ప్రతీ చోట గ్రాఫిక్స్ టీం ఘోరంగా విఫలం అయింది. ఇక యాక్షన్ సీన్లు అయితే కొన్ని చోట్ల మరీ సిల్లీగా అనిపిస్తాయి. కథ కథనం విషయానికొస్తే.. అసలీ కథే గందరగోళంగా ఉంటుంది. ప్రేక్షకుడు ఏ ఎమోషన్కి కనెక్ట్ కావాలో అర్థం కాక.. అలా కుర్చీలో కూర్చిండిపోతాడు. హిందువులపై మొగల్ సైన్యం చేసిన అరచకాలకు సంబంధించిన సన్నివేశాలు ఇటీవల వచ్చిన ఛావా చిత్రాన్ని గుర్తు చేస్తాయి. వీరమల్లు పాత్ర ఫిక్షనల్ కాబట్టి కనీసం ఆ ఎమోషన్తో కూడా సరిగ్గా కనెక్ట్ కాలేం. ఇక వీరమల్లు చేసే దొంగతనాల సీన్స్ రాబిన్ హుడ్ పాత్రతో వచ్చిన పలు సినిమాలను పోలి ఉంటాయి. హీరో హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు మొదలు వార్ సీక్వెన్స్ అన్నీ బాహుబలి చిత్రాన్ని గుర్తు చేస్తాయి. కొన్ని చోట్ల మంచి సన్నివేశాలు ఉన్నా.. పేలవమైన సీజీ వర్క్ కారణంగా అవి కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఉన్నంతలో ఫస్టాఫ్ పర్వాలేదు. దర్శకుడు క్రిష్ కొన్ని సీన్లను బాగానే డీల్ చేశాడు. సెకండాఫ్ వచ్చే సరికే కథ ఎటో వెళ్లిపోయింది. పవన్ కోసమే అన్నట్లు కొన్ని సన్నివేశాలను బలవంతంగా ఇరికించడం.. ఆ ఇరికించిన సీన్లలో ఎమోషన్ సరిగా పండకపోవడంతో ద్వితియార్థం మొత్తంగా బోర్ కొట్టిస్తుంది. క్లైమాక్స్ ముందు వచ్చే సుడిగుండం సీన్ అయితే ప్రేక్షకుడి సనహానికి పరీక్ష పెడుతుంది. అసలు క్లైమాక్స్ సన్నివేశాన్ని అంతలా ఎందుకు సాగదీశారో అర్థం కాక.. హీటెక్కిన బుర్రతో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. ఎవరెలా చేశారంటే..పవన్ కల్యాణ్ పాత్ర కొత్తగా ఉంది కానీ నటన పరంగా చేయడానికేమి లేదు. ఆయనకు ఎలివేషన్ ఇవ్వడమే తప్ప.. నటనతో మెప్పించాడానికి ఏమీ లేదు. కొన్ని యాక్షన్స్ సీన్స్ పరవాలేదు. చాలా వరకు డూప్తోనే కవర్ చేసినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. నిధి అగర్వాల్ పాత్ర నిడివి తక్కువే అయినా... ఉన్నంతలో ఆకట్టుకుంది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఒకటి ఫస్టాఫ్కే హైలెట్ అని చెప్పొచ్చు. అయితే షూటింగ్ ఐదేళ్లుగా సాగింది కాబట్టి కొన్ని చోట్ల బొద్దుగా కనిపించింది.ఔరంగజేబుగా బాబీ డియోల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. చిన్న దొరగా సచిన్ ఖేడేకర్, పెద్ద దొర పాత్రలో కోట శ్రీనివాసరావు ఒకటి రెండు సీన్లలో కనిపించినా.. బాగానే నటించారు. రఘుబాబు, సునీల్, సుబ్బరాజ్, సత్యతో పాటు మిగిలిన నటీనటులు తమ పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. కీరవాణి సంగీతమే ఈ సినిమాకు కాస్త ప్లస్ అయిందని చెప్పాలి. అయితే అదే బీజీఎం కొన్ని చోట్ల చిరాకుగానూ అనిపిస్తుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ ఫస్టాఫ్ వరకు పర్వాలేదు. సెకండాఫ్కి వచ్చేసరికి ఘోరంగా విఫలం అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. (గమనిక : ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

హరిహర వీరమల్లుపై ట్రోలింగ్.. పంచతంత్రం సీరియల్ బెటర్!
హరిహర వీరమల్లు (Harihara Veeramallu Movie).. ఐదేళ్ల కిందట మొదలైన సినిమా! ఎన్నో ఆలస్యాల తర్వాత జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరిహర వీరమల్లుకు ఎటువంటి బజ్ లేకపోయేసరికి హీరోయిన్ నిధి అగర్వాల్ సినిమాను తన భుజాలపై వేసుకుని ప్రమోషన్ చేసుకుంది. అసలే నిర్మాత పెట్టిన డబ్బులు వస్తాయో, లేదోనన్న భయంతో నిలువునా వణికిపోతున్నాడు. ఏం లాభం?అతడి బాధ అర్థం చేసుకుందో, ఏమోకానీ కెరీర్ను పక్కనపెట్టి మరీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్లో చురుకుగా పాల్గొంది నిధి. తననలా చూశాక పవన్ కల్యాణ్కు బుద్ధి వచ్చినట్లుంది. సినిమా కోసం ఇంతలా కష్టపడుతున్న నిధిని చూస్తే సిగ్గేసిందంటూ వెంటనే ప్రమోషన్స్లో పాల్గొన్నారు. అయినా లాభం లేదనుకోండి, అది వేరే విషయం!(చదవండి: హరిహర వీరమల్లు మూవీ రివ్యూ)అభిమానులకే నచ్చట్లేదుపవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమా అనగానే అభిమానులు నానా హడావుడి చేశారు. కానీ సాయంత్రమయ్యేసరికి దాదాపుగా సైలెంట్ అయిపోయారు. కొందరు అభిమానుల నుంచి కూడా సినిమాకు నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి. కక్కలేక మింగలేక అన్నట్లుంది వారి పరిస్థితి! హరిహర వీరమల్లు వరస్ట్గా ఉంది.. ఓజీ సినిమాకు చూసుకుందాంలే అని వారే ఒప్పేసుకుంటున్నారు.పేలవమైన వీఎఫ్ఎక్స్ముఖ్యంగా రూ.250 కోట్ల బడ్జెట్ అన్నప్పుడు వీఎఫ్ఎక్స్ కూడా దానికి తగ్గట్లే ఉండాలి. కానీ ఈ చిత్రంలో కొన్ని పేలవమైన గ్రాఫిక్స్ సినీప్రియులను తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. సినిమా అంత కలగూర గంపలా కనిపిస్తుంది. సినిమా కంటే తక్కువ.. సీరియల్ కంటే ఎక్కువ అని నెటిజన్లు హరిహరవీరమల్లును ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో పవన్.. కోహినూర్ వజ్రాన్ని తేవడం ఏమో కానీ ప్రేక్షకులకు మాత్రం కావాల్సినంత తలనొప్పి అందించారు. బహుశా అందుకునేమో.. నిర్మాత రత్నం ఈ సినిమా హిట్టయితేనే పార్ట్ 2 ఉంటుందని థియేటర్ బయట నెమ్మదిగా జారుకున్నాడు. Done with my show #HHVM 🦅 Meeru ikkada review lu ichinantha worst ga aithe ledu antha kanna daridram ga undi💥 pic.twitter.com/NJLv3nEZ0f— 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 𝐈𝐜𝐨𝐧🗡️ (@icon_trolls) July 23, 2025Panchatantram 1episode>#HHVM whole movie 🤣— 🅰️llu🅰️rjun🔥mb🦁ntr🐯 (@BiBrfvr111388) July 24, 2025మిమ్మల్ని ఎవరూ ఆపాల్సిన పని లేదు మార్నింగ్ షోస్ కి మీరే ఆగిపోయారు 😂😂#HariHaraVeeeraMallu #DisasterHariHaraVeeraMallu pic.twitter.com/NyhOAQH8q8— Graduate Adda (@GraduateAdda) July 24, 2025#HHVM review raddam anukunna..Kani review rayadam kosam movie chudali anna kuda bhayam ga undi😭We wait for OG🫡— Telugu Meme Club (@telugumemeclub) July 24, 2025Cinema ki Thakkuva serial ki ekkuva 🍪🐶#HHVM #HHVMReview— GL 𝗔𝗔 DIATOR (@Gowthureddy_) July 24, 2025Manaki #OG undi idi #HHVM already decide ina output average ga untadi anukunnam kani worst ga undi feenini moyalsina pani ledu #OG lekkalu anni sarichestadi— NimmakuruNatukodi (@brolaughsalot) July 24, 2025Aurangzeb: ఎవరు నువ్వు ? చార్మినార్ దగ్గర ఏం పని ? Veera Mallu: నేను చార్మినార్ లోనే పుట్టాను....#HHVM #HariHaraVeeraMallu pic.twitter.com/mBBtePsyvK— 2.0 (@alanatiallari) July 23, 2025చదవండి: నీళ్ల కిచిడీయే ఆహారం.. మా పేదరికాన్ని చూసి వెక్కిరించేవాళ్లు

మహేశ్ ఎన్నో కష్టాలు చూశాడు, అయినా పైకి మాత్రం..!
మనసుకు నచ్చినవారు దూరమైతే తట్టుకోలేం. అందులోనూ కన్నవారు ఒకరివెంట మరొకరు మనల్ని వీడి వదిలి వెళ్లిపోతే ఆ బాధను భరించలేము. కానీ, అంతకు మించిన బాధనే భరించాల్సి వచ్చింది సూపర్ స్టార్ మహేశ్బాబు (Mahesh Babu)కు! 2022 జనవరిలో మహేశ్ సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. అదే ఏడాది సెప్టెంబర్లో తల్లి ఇందిరా దేవి, నవంబర్లో తండ్రి కృష్ణ చనిపోయారు. ఒక్క ఏడాదిలోనే ముగ్గురిని కోల్పోయి తీవ్ర బాధలో కూరుకుపోయాడు.ఎన్నో కష్టాలుఆ విషయాన్ని మహేశ్ మరదలు, ఒకప్పటి హీరోయిన్ శిల్ప శిరోద్కర్ గుర్తు చేసుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో నాకు తెలిసిన అత్యుత్తమ మానవుల్లో మహేశ్ బావ ఒకరు. ఫ్యామిలీ కోసం ధృడంగా నిలబడతాడు. కానీ, తను చాలా కష్టాలు చూశాడు. కుటుంబాన్ని (తల్లిదండ్రులు, సోదరుడు)ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ తనను అభిమానించేవారికోసం చిరునవ్వుతో కనిపించేవాడు. మా పేరెంట్స్ను కోల్పోయినప్పుడు అక్కకు మహేశ్, నాకు నా భర్త అండగా నిలబడి ఓదార్చారు. వీళ్లిద్దరూ మాకోసం ఎంతో చేశారు అని చెప్పుకొచ్చింది.తనకు చంటిబిడ్డనయ్యానమ్రత గురించి మాట్లాడుతూ.. నమ్రత నాకంటే పెద్దది. కానీ సినిమాల్లోకి నేనే ముందు వచ్చాను, నాకే ఫస్ట్ పెళ్లయింది, నాకే ముందు పాప పుట్టింది. దీంతో అందరూ నన్నే పెద్దదాన్ని అనుకుంటారు. నాకు పెళ్లయ్యాకే నమ్రతకు మరింత క్లోజయ్యాను. మా పేరెంట్స్ చనిపోయాక నేను తనకు చంటిబిడ్డగా మారిపోయాను. తన కన్నబిడ్డల కంటే నా గురించే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్క నాపై అంత ప్రేమ చూపిస్తుంది అని శిల్ప శిరోద్కర్ చెప్పుకొచ్చింది.చదవండి: కాస్టింగ్ కౌచ్.. అసహ్యంతో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా

ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ శుక్రవారం 14 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారాంతంలో మిమ్మల్ని అలరించేందుకు బోలెడన్నీ సినిమాలు, వెబ్ సిరీస్లు సిద్ధమైపోయాయి. ప్రస్తుతం థియేటర్లలో పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సందడి చేస్తోంది. ఈ శుక్రవారం పెద్ద సినిమాలేవీ రిలీజ్ లేకపోవడంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ప్రియులను అలరించేందుకు సరికొత్త థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. ఈ వర్షాకాలంలో ఫ్యామిలీతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వారాంతంలో తెలుగు సినిమా షో టైమ్తో పాటు విజయ్ ఆంటోనీ చిత్రం మార్గన్, హిందీలో సర్జామీన్ మూవీ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.అమెజాన్ ప్రైమ్నోవాక్సిన్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 25రంగీన్ (హిందీ సిరీస్) - జూలై 25మార్గన్(తమిళ సినిమా)- జూలై 25సన్ నెక్స్ట్షో టైమ్ (తెలుగు మూవీ) - జూలై 25ఎక్స్ & వై (కన్నడ చిత్రం) - జూలై 25నెట్ఫ్లిక్స్మండల మర్డర్స్ (హిందీ సిరీస్) - జూలై 25ది విన్నింగ్ ట్రై- (కొరియన్ మూవీ)- జూలై 25ట్రిగ్గర్ (కొరియన్ సిరీస్) - జూలై 25హ్యాపీ గిల్మోర్-2- (హాలీవుడ్ కామెడీ చిత్రం) - జూలై 25ఆంటిక్ డాన్-(హాలీవుడ్ హారర్ మూవీ)- జూలై 25జీ5సౌంకన్ సౌంకనీ 2 (పంజాబీ సినిమా) - జూలై 25లయన్స్ గేట్ ప్లేజానీ ఇంగ్లీష్ స్టైక్స్ ఎగైన్(ఇంగ్లీష్ సినిమా) - జూలై 25ద ప్లాట్ (కొరియన్ మూవీ) - జూలై 25ద సస్పెక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25
న్యూస్ పాడ్కాస్ట్

అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు కూటమి సర్కారు వెన్నుపోటు... తల్లికి వందనం సొమ్ము ఇవ్వకుండా దగా

ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలంటే ఆంధ్రానే అమ్మాలట... ఏపీలో మహిళలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం

లేని మద్యం స్కామ్పై సిట్ కట్టుకథలు..జరగని స్కామ్లో రూ.3500 కోట్ల దోపిడీ అంటూ భేతాళ విక్రమార్క కథ..సిట్ చార్జ్షీట్ సాక్షిగా వెల్లడైన బాగోతం

మద్యం అక్రమ కేసులో మిథున్రెడ్డికి రిమాండ్... ఆగస్టు ఒకటో తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు... తాను ఎలాంటి తప్పు చేయలేదన్న మిథున్రెడ్డి

పరాకాష్టకు చేరిన చంద్రబాబు భేతాళ కుట్ర... మద్యం అక్రమ కేసులో బరితెగింపు... వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి అక్రమ అరెస్టు

రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయండి... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనలో అన్నదాతల మృత్యుఘోష... ఏడాదిలో 250 మందిపైగా బలవన్మరణం

తప్పుడు కేసులకు భయపడం, మేము ఎల్లప్పుడూ ప్రజాపక్షమే... తేల్చిచెప్పిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వచేస్తేనే బనకచర్లకు గోదావరి జలాలు... పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు నీళ్లందించడం అసాధ్యం అంటున్న సాగు నీటి రంగ నిపుణులు

70 ఏళ్ల కిందట కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో, కేసీఆర్ పాలనలో కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చర్చిద్దామా?. బీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్
క్రీడలు

ENG VS IND 4th Test: దుమ్మురేపిన ఓపెనర్లు.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్
బెన్ డకెట్ 94 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. కాగా 40 ఓవర్ల తర్వాత ప్రస్తుతం స్కోరు 205/2గా ఉంది.మాంచెస్టర్ టెస్ట్లో ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలే చెలరేగిపోయారు. తొలి వికెట్కు మెరుపు వేగంతో 166 పరుగులు జోడించారు. అనంతరం 84 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జాక్ క్రాలే (113 బంతుల్లో 84; 13 ఫోర్లు, సిక్స్) ఔటయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో క్రాలే పెవిలియన్కు చేరాడు.క్రాలే ఔటైనా బెన్ డకెట్ ధాటిగా ఆడుతున్నాడు. 91 పరుగుల వద్ద (98 బంతుల్లో 13 ఫోర్లు) ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 37 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 192/1గా ఉంది. డకెట్కు జతగా ఓలీ పోప్ (8) క్రీజ్లో ఉన్నాడు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఓవర్నైట్ స్కోర్కు మరో 94 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇవాల్టి ఆటలో ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా అతను 5 వికెట్లు తీశాడు. ఆర్చర్కు సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

WWF దిగ్గజం హల్క్ హోగన్ కన్నుమూత
దిగ్గజ రెజ్లర్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (ప్రస్తుతం డబ్ల్యూడబ్ల్యూఈ) సూపర్ స్టార్ హల్క్ హోగన్ (Hulk Hogan) (71) ఇవాళ (జులై 24) ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో గల తన నివాసంలో హోగన్ తుది శ్వాస విడిచారని సమాచారం. కార్డియాక్ అరెస్ట్ కారణంగా హోగన్ మృతి చెందినట్లు తెలుస్తుంది.1953 ఆగస్ట్ 11న జన్మించిన హోగన్ అసలు పేరు టెర్రి జీనీ బోల్లియా. 80వ దశకంలో హోగన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (WWF) ద్వారా విశేష ప్రజాదరణ పొందారు. హోగన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రెజిల్ మానియాలోని తొలి తొమ్మిది ఎడిషన్లలో ఎనిమిది టైటిళ్లు సాధించాడు.హోగన్కు డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్లలో కూడా చోటు దక్కింది. 1984లో హోగన్ తన తొలి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నాడు. హోగన్ తన కెరీర్ ఉన్నతిలో ఆండ్రీ ద జెయింట్, మాఛో మ్యాన్ రాండీ సావేజ్, అల్టిమేట్ వారియర్ లాంటి దిగ్గజ రెజర్లతో కుస్తీ పడ్డాడు. హోగన్కు అతని మీసాలు చాలా ప్రత్యేకతనిచ్చాయి.హోగన్ రెజ్లింగ్ కాకుండా సినిమాలు, టీవీ రియాలిటీ షోల్లో కూడా నటించాడు. హోగన్ గడిచిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రచారం చేశాడు. హోగన్కు భారత్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. 80వ దశకంలో పిల్లలకు హోగన్ సుపరిచితుడు.

ఎట్టకేలకు పాకిస్తాన్కు ఓ విజయం
బంగ్లాదేశ్ పర్యటనలో పాకిస్తాన్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై ఇదివరకే సిరీస్ కోల్పోయిన ఆ జట్టు, ఇవాళ (జులై 24) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో కంటితుడుపు విజయం నమోదు చేసింది. ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 74 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. సాహిబ్జాదా ఫర్హాన్ (63) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్లో హసన్ నవాజ్ (33), మొహమ్మద్ నవాజ్ (27), సైమ్ అయూబ్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3, నసుమ్ అహ్మద్ 2, షొరిఫుల్ ఇస్లాం, సైఫుద్దీన్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్.. పాక్ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 16.4 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. తద్వారా సిరీస్లో తొలి పరాజయం ఎదుర్కొంది. టెయిలెండర్ మొహమ్మద్ సైఫుద్దీన్ అజేయమైన 35 పరుగులతో రాణించడంతో బంగ్లాదేశ్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. బంగ్లా ఇన్నింగ్స్లో సైఫుద్దీన్తో పాటు మొహమ్మద్ నైమ్ (10), మెహిది హసన్ మిరాజ్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 3, ఫహీమ్ అష్రాఫ్, మొహమ్మద్ నవాజ్ చెరో 2, అహ్మద్ దెనియాల్, సల్మాన్ అఘా, హుసేన్ తలాట్ తలో వికెట్ తీశారు.

ENG VS IND 4th Test: దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లు
మాంచెస్టర్ టెస్ట్లో ఇంగ్లండ్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. రెండో రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 77 పరుగులు (14 ఓవర్లలో) చేసింది. బెన్ డకెట్ 43, జాక్ క్రాలే 33 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ సెషన్లో భారత బౌలర్లు ఎంత శ్రమించినా వికెట్ దక్కలేదు. బుమ్రా, అన్షుల్ కంబోజ్ తలో 5, సిరాజ్ 4 ఓవర్లు వేయగా.. ఇంగ్లండ్ బ్యాటర్లు వన్డేలను తలపించి ఆడారు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 281 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఓవర్నైట్ స్కోర్కు మరో 94 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇవాల్టి ఆటలో ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 5 వికెట్లు తీశాడు. ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
బిజినెస్

గూగుల్ క్రోమ్కు సవాల్.. ఎన్విడియా ఏఐ వచ్చేస్తోంది!
ప్రపంచవ్యాప్తంగా వెబ్ బ్రౌజర్ల మార్కెట్ లీడర్గా కొనసాగుతున్న ఆల్ఫాబెట్కు చెందిన గూగుల్ క్రోమ్కు సవాల్ విసిరేందుకు టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఎన్విడియాకు చెందిన పర్పెక్స్సిటీ ఏఐ సిద్ధమవుతోంది. త్వరలోనే కామెట్ పేరుతో ఏఐ ఆధారిత సామర్థ్యంగల వెబ్ బ్రౌజర్ను తీసుకురానుంది. – సాక్షి, సెంట్రల్డెస్క్మార్కెట్.యూఎస్ అనే సంస్థ నివేదిక ప్రకారం 2024లో 4.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్ల మార్కెట్.. 2034 నాటికి 76.8 బిలియన్ డాలర్లకు చేరుకొనే అవకాశం ఉంది. స్టాట్కౌంటర్ అనే సంస్థ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ నాటికి ప్రపంచ వెబ్ బ్రౌజర్ల మార్కెట్లో క్రోమ్ 68 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యధికం మంది యూజర్లు ఉపయోగిస్తున్న వెబ్ బ్రౌజర్గా మార్కెట్ను సుస్థిరం చేసుకొని ఇతర ప్రముఖ వెబ్ బ్రౌజర్లయిన సఫారీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఫైర్ఫాక్స్కు అందనంత ఎత్తులో ఉంది.యూజర్లకు లభించేవి ఇవీ..సాధారణ బ్రౌజర్లతో పోలిస్తే ఏఐ ఆధారిత బ్రౌజర్లు యూజర్లు కోరిన కంటెంట్ను సంక్షిప్తంగా అందించగలవు. అలాగే టాస్క్లను ఆటోమేట్ చేయగలవు. ఉదాహరణకు ఈ–మెయిళ్లకు ఆటోమెటిక్గా రిప్లైలు పంపడం, సోషల్ మీడియా పోస్ట్లను షెడ్యూల్ చేయడం, దరఖాస్తుల్లోని డేటాను సంగ్రహించడం లాంటివి అన్నమాట.ముఖ్యంగా సందర్భానుసారంగా జవాబులు అందించగలవు. అంటే యూజర్లు అందించే ఇన్పుట్లు, డేటా హిస్టరీని పరిగణనలోకి తీసుకొని, వాటిని విశ్లేషించి జవాబులను అందించడం, వివిధ డేటా సోర్స్ల నుంచి సమాచారాన్ని క్రోడీకరించి నేరుగా సమాధానాలు ఇవ్వ డం చేయగలవు. అపాయింట్మెంట్ల బుకింగ్లు, ఉత్పత్తులను పోల్చడం వంటి సంక్లిష్ట పనులను కూడా చక్కబెట్టగలవు.

రూ.75 లక్షల జాబ్ ఆఫర్.. తీసుకోవాలా.. వద్దా?
ఎక్కువ జీతం వచ్చే జాబ్ ఆఫర్ వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇంకేం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏడాదికి రూ.75 లక్షల జీతంతో జాబ్ ఆఫర్ వచ్చింది.. తీసుకోవాలా.. వద్దా అని సందిగ్ధంలో ఉన్నానని ఇటీవల ఓ సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారతదేశంలో అధిక పన్ను కారణంగా ఈ ఆఫర్ను తాను స్వీకరిస్తానని ఖచ్చితంగా చెప్పలేనన్నారు.తాను ఇప్పటికే దాదాపు రూ.12 లక్షల పన్నులు చెల్లిస్తున్నానని, కొత్త జాబ్ ఆఫర్ స్వీకరిస్తే ఆ పన్ను మొత్తం దాదాపు రెట్టింపు అయి రూ.22 లక్షలకు చేరుకుంటుందని చెప్పారు. ‘20 ఏళ్ల అనుభవంతో ప్రస్తుతం భారత్ లో ఏటా రూ.48 లక్షలు సంపాదిస్తున్నాను. ఈ మధ్యనే రూ.75 లక్షలకు ఆఫర్ వచ్చింది. ఇది గణనీయమైన పెరుగుదల అయినప్పటికీ, ప్రధానంగా పన్ను బాధ్యతలో విపరీతమైన పెరుగుదల కారణంగా దానిని అంగీకరించాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ప్రస్తుతం రూ.12 లక్షల వరకు పన్నులు చెల్లిస్తున్నాను. రూ .50 లక్షలకు పైగా ఆదాయంపై వర్తించే అదనపు 10% సర్ఛార్జ్ కారణంగా కొత్త ఆఫర్తో ఆ మొత్తం దాదాపు రెట్టింపు అయి రూ .22 లక్షలకు చేరుకుంటుంది" అని యూజర్ రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు.ట్యాక్స్ ఎక్కువ కట్టేందుకు పనిచేయాలా?కొత్త వేతన నిర్మాణంలో పన్ను ఆదా చేసే అంశాలను చేర్చే వెసులుబాటు లేదని ఆయన అన్నారు. ‘కాబట్టి, నా టేక్-హోమ్ వేతనం సుమారు 50% పెరగవచ్చు, పన్ను భారం దాదాపు రెట్టింపు అవుతుంది. తక్కువ పన్ను లేదా అస్సలు చెల్లించని వారితో పోలిస్తే ఎటువంటి అదనపు స్పష్టమైన ప్రయోజనాలను పొందకుండా, ప్రభుత్వానికి ఎక్కువ పన్ను చెల్లించడానికి నేను ఎందుకు ఎక్కువగా కష్టపడాలి?" అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సదరు వ్యక్తికి వచ్చిన సందిగ్ధ పరిస్థితిపై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తూనే అభిప్రాయాలనూ వ్యక్తీకరించారు. నేరుగా ఉద్యోగంలో చేరకుండా కన్సల్టెంట్ గా పరిహారం అందుకుంటే పెద్ద మొత్తంలో పన్ను ఆదా చేసుకోవచ్చని, కానీ ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ చెల్లించడం ఇష్టం లేక వేతన పెంపు తీసుకోకపోవడం సరికాదంటూ ఓ యూజర్ సలహా ఇచ్చారు. ఇప్పుడొస్తున్న దానికంటే 50% ఎక్కువ జీతం వస్తున్నా కూడా ట్యాక్స్ పెరుగుతుంది కాబట్టి జాబ్ ఆఫర్ను వదులుకుంటాననడం మూర్ఖత్వం అని మరో వ్యక్తి పేర్కొన్నారు.దేశంలో ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను విధానంలో రూ .4 లక్షల వరకు ఆదాయంపై సున్నా పన్ను ఆ తర్వాత 5% నుండి 30% వరకు పన్ను రేట్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రూ.12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు (వేతన జీవులకు రూ.12.75 లక్షలు) అధిక రిబేట్, స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక పాత విధానం ఎంచుకునేవారికి 80సీ, హెచ్ఆర్ఏ వంటి సెక్షన్ల కింద మినహాయింపులు ఉన్నాయి. అధిక ఆదాయం ఉన్న వ్యక్తులకు సర్ ఛార్జీలు వర్తిస్తాయి.👉 ఇదీ చదవండి: ఐటీ రిటర్న్ కొత్త డెడ్లైన్.. మిస్ అయితే పెద్ద తలనొప్పే!

రియల్టీ కంపెనీలలో వాటా విక్రయం.. 2 కోట్ల షేర్లు అమ్మేసిన ఇన్వెస్కో
దేశీ రియల్టీ రంగ కంపెనీలు ఒబెరాయ్ రియల్టీ, లోధా డెవలపర్స్లో యూఎస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఇన్వెస్కో తాజాగా 2 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఒబెరాయ్ రియల్టీలో 2.95 శాతం వాటాకు సమానమైన కోటికిపైగా షేర్లను అమ్మివేసింది.బీఎస్ఈ బల్క్డీల్ వివరాల ప్రకారం అనుబంధ సంస్థ ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ షేరుకి రూ. 1,754.26 ధరలో వీటిని విక్రయించింది. తద్వారా రూ. 1,883 కోట్లకు అందుకుంది. 2025 జూన్కల్లా ఇన్వెస్కో ఫండ్కు ఒబెరాయ్ రియల్టీలో 3.01 శాతం వాటా ఉంది. కాగా.. ఈ బాటలో లోధా డెవలపర్స్లోనూ 1 శాతం వాటాకు సమానమైన 95.25 లక్షల షేర్లను విక్రయించింది. ఎన్ఎస్ఈ బల్క్డీల్ ప్రకారం షేరుకి రూ. 1384.93 ధరలో అమ్మివేయడం ద్వారా రూ. 1,319 కోట్లకుపైగా సమకూర్చుకుంది. ఎస్బీఐ ఫండ్ కొనుగోలు ఒబెరాయ్ రియల్టీలో 1.13% వాటాకు సమానమైన 40.94 లక్షల షేర్లను ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సొంతం చేసుకుంది. షేరుకి రూ. 1,754.10 సగటు ధరలో రూ. 718.2 కోట్లకు కొనుగోలు చేసింది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం ఇతర కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. ఇదేవిధంగా ఎన్ఎస్ ఈ గణాంకాల ప్రకారం లోధా డెవలపర్స్ షేర్ల కొనుగోలుదారుల వివరాలు సైతం వెల్లడికాలేదు.

సరికొత్తగా రెనో ట్రైబర్...
ఫ్రెంచ్ వాహన తయారీ దిగ్గజం రెనో సరికొత్త ‘ఆల్–న్యూ రెనో ట్రైబర్’ను లాంచ్ చేసింది. ఈ కొత్త ట్రైబర్లో దాని ప్రత్యేకమైన 7 సీటర్ కెపాసిటీని, సీట్లను మార్చుకునే వెసులుబాటును అలాగే ఉంచుతూ డిజైన్, ఫీచర్లలో పలు మార్పులు తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.6.29 లక్షలుగా ఉంది.ఈ సందర్భంగా రెనో ఇండియా ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లి మాట్లాడుతూ.. భారత్లో ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థ మెరుగైన వృద్ధి సాధించిన తర్వాతే మార్కెట్లోకి ఈవీ ఉత్పత్తులను విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం భారత ఈవీ మార్కెట్, నిబంధనలు, ఎకో సిస్టమ్ అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామన్నారు. సరైన సమయంలో ఈవీలను ఆవిష్కరిస్తామన్నారు.డిజైన్లో చేసిన మార్పులు ఎక్స్టీరియర్ నుంచే కనిపిస్తున్నాయి. ఫేస్లిఫ్టెడ్ ట్రైబర్ పూర్తిగా పునరుద్ధరించిన ఫ్రంట్ ఫేస్ను కలిగి ఉంది. వర్టికల్ స్లాట్లను కలిగి ఉన్న గ్లాస్ బ్లాక్ గ్రిల్ ఎల్ఈడీ డీఆర్ఎల్తో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్ల్యాంప్లలోకి అనుసంధానమై ఉంటుంది.ఫ్రంట్ బంపర్ను కూడా పూర్తీగా మార్చేశారు. సిల్వర్ యాక్సెంట్లతో పెద్ద ఎయిర్ డ్యామ్, రీపోజిషన్ చేసిన ఫాగ్ ల్యాంప్లు, వర్టికల్ ఎయిర్ ఇన్లెట్లను కలిగి ఉంటుంది.కొత్త ట్రైబర్లో రెనాల్ట్ సొగసైన 2డీ డైమండ్ లోగోను తీసుకొచ్చారు. స్టైలిష్ 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, గ్లాస్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్, పూర్తిగా నల్లటి రూఫ్ను పొందుతుంది. వెనుక భాగంలో, టెయిల్గేట్లో స్లీకర్ ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్లు, గ్లాస్ బ్లాక్ ట్రిమ్ ప్యానెల్, 'TRIBER' లెటరింగ్, రీడిజైన్ చేసిన బంపర్ ఉన్నాయి.లోపల, క్యాబిన్ పాత బ్లాక్ అండ్ సిల్వర్ లేఅవుట్ స్థానంలో ఇప్పుడు ఫ్రెష్ గ్రే అండ్ బీజ్ థీమ్ను కలిగి ఉంది. నవీకరించిన డాష్బోర్డ్ డిజైన్లో 8-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ ఉంది. ఏసీ వెంట్స్ కింద ఇచ్చారు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటోమేటిక్ హెడ్లైట్లు, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి ఫీచర్లు అదనంగా ఉన్నాయి. ఫేస్లిఫ్టెడ్ ట్రైబర్ ఇప్పుడు అన్ని వేరియంట్లలో 6 ఎయిర్బ్యాగ్లను ప్రామాణికంగా అందిస్తుంది.
ఫ్యామిలీ

సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలంటే ఏమిటి?
సమాజంలో ప్రతి ఒక్కరూ మంచి జీవితాన్ని కోరుకుంటారు. శాంతి, సుఖ సంతోషాలు తమ సొంతం కావాలని అభిలషిస్తారు. కష్టనష్టాలను, అశాంతిని ఎవ్వరూ ఆశించరు. కానీ ఏదీ ఆశించినట్లు, అనుకున్నట్లు జరగదు. జీవితంలో అనుకూల, ప్రతికూల పరస్థితులు వస్తూనే ఉంటాయి. ఎగుడు దిగుళ్ళు మానవ జీవితంలో అనివార్యం. అనుకూల పరిస్థితుల్లో ΄ పొంగిపోవడం, ప్రతికూల పరిస్థితుల్లో కుంగిపోవడం మానవుడి చంచల స్వభావానికి నిదర్ళనం. అసలు మంచి జీవితమంటే ఏమిటి? సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలంటే ఏమిటి? అందమైన భవంతి, కళ్ళు చెదిరే ఆస్తులు, హోదా, అధికారం, వాహనాలు, భార్యాపిల్లలు, కుటుంబం – ఇవన్నీ సమకూరితే మంచిజీవితం లభించినట్లేనా? సుఖసంతోషాలు సొంతమైనట్లేనా? కాదు..ఇవన్నీ ఆనందంలో ఒక భాగమే తప్ప, పరిపూర్ణ సంతోషానికి సోపానాలు కాలేవు. ఇది అనుభవం చెప్పే యథార్ధం. ఎందుకంటే, అందమైన ఇల్లు, కోరుకున్న భార్య, రత్నాల్లాంటి బిడ్డలు, విలాసవంతమైన వాహనాలు, కావలసినంత బ్యాంకుబ్యాలెన్సు, బలం, అధికారం, – ఇంకా రకరకాల విలాసవంతమైన సాధనా సంపత్తి నిత్యం అందుబాటులో ఉన్నప్పటికీ, సంతోషంకోసం, సంతృప్తికరమైన జీవితం కోసం వెదుకులాట మానవ సమాజంలో ప్రతినిత్యం మనం చూస్తున్నాం. అన్నీ ఉండికూడా అనుభవించలేని అనేకమంది సంపన్నులూ మనకు పరిచయమే. అంటే ఇవన్నీపాక్షిక ఆనందాన్ని మాత్రమే అందించగలవుకాని, పరిపూర్ణసంతోషానికి సోపానం కాలేవని మనకు అర్థమవుతోంది. అయినా మనిషి అనాదిగా శాంతి, సంతోషాలకోసం తంటాలు పడుతూనే ఉన్నాడు. తనకు తోచిన ప్రయోగాలతోపాటు, తనలాంటి వారు చెప్పే సూత్రాలన్నిటినీ పాటిస్తున్నాడు. ఎవరెవరి చుట్టూనో తిరుగుతూ, చెప్పిందల్లా చేస్తూ, తులమో ఫలమో సమర్పించుకుంటూ ఉన్నాడు. కాని ఎక్కడా శాంతి, సంతోషం లభించడంలేదు. ధనం ధారపోసి కొనుక్కుందామంటే, అది మార్కెట్లో లభ్యమయ్యే వస్తువు కూడా కాదాయె. మరేమిటీ మార్గం? మంచిజీవితం, శాంతి, సంతోషం, సంతృప్తి ఇవన్నీ ఎండమావేనా? ఇదే విషయాన్ని ఒక శిష్యుడు ముహమ్మద్ ప్రవక్త (స) వారిని అడిగాడు. అప్పుడాయన గారు,’ అల్లాహ్ ను (దైవాన్ని) బాగా స్మరించు. అనాథలను ఆదరించు. పేదసాదలకు శక్తిమేర సహాయం చెయ్యి.’ అని ఉపదేశించారు. అంటే, ఇలా చెయ్యడం ద్వారా నువ్వు కోరుకుంటున్న శాంతి, సంతోషాలతో నిండిన మంచి జీవితం ప్రాప్తమవుతుంది అని అర్థం. కాని నాలుగు రాళ్ళసంపాదన సమకూరగానే దుర దృష్ట వశాత్తూ మనుషుల్లో అహం పెరిగి పోతోంది. దైవాన్ని స్మరించడం తరువాత సంగతి, అసలు దైవాన్నే మరిచి పోయి, పేదసాదలను దగ్గరికి రానివ్వని పరిస్థితి నెలకొంటోంది. మరిక శాంతి లభించాలంటే ఎలా లభిస్తుంది.? కాబట్టిసర్వకాల సర్వావస్థల్లో దైవాన్ని స్మరిస్తూ, సాధ్యమైనంతమేర మంచి పనులు చేస్తూ, చెడులకు దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. సత్కార్వాల్లో లభించే సంతోషం సంతృప్తి మరెందులోనూ లభించదు. ధర్మబద్ధమైన సంపాదన, ధర్మసమ్మతమైన ఖర్చు, సత్కార్యాల్లో సమయాన్ని వెచ్చించడం – ఇదిగనక మనం ఆచరించగలిగితే నిత్య సంతోషం, ఇహపర సాఫల్యం సొంతమనడంలో సందేహమే లేదు.– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్

ఫుఫు డిష్.. పోషకాలు ఫుల్..!
ఫుఫు డిష్.. వినడానికి కాస్త వెరైటీగా ఉన్నా.. ప్రస్తుతం నగరంలో ఈ డిష్ ప్రాచుర్యం పొందుతోంది.. ఫుఫు అనేది పశ్చిమ ఆఫ్రికా దేశస్తుల ఫేవరెట్ ఆహారం.. ఆ దేశంలో పుట్టిన ఈ సాధారణ ఆహారం.. కాసావా (కర్రపెండలం), యమ్ లేదా ఆకుపచ్చని అరటి వంటి దుంప కూరగాయలతో తయారు చేస్తారు. ప్రధానంగా కాసావాని యుకా/మానియోక్ అని కూడా పిలుస్తారు. పశ్చిమ ఆఫ్రికాతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇది ప్రధాన ఆహారంగా ఉపయోగంచే పిండి పదార్థాలు కలిగిన దుంప కూరగాయ. దీని శాస్త్రీయ నామం మనిహోట్ ఎసు్కలెంటా. ప్రస్తుతం ఈ వంటకం హైదరాబాద్ నగరంలో ఆఫ్రికా వాసులు నివాసముండే పలు ప్రాంతాల్లోని రెస్టారెంట్లలో ఆహారప్రియులను అలరిస్తోంది. ఫుఫు అనే వంటకాన్ని యమ్/ ఆకుపచ్చని అరటి వంటి దుంపను తొక్క(వెరడు) తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్చేసి నానబెడతారు.. అనంతరం బాగా ఉడకబెట్టడం ద్వారా దీనిని తయారు చేస్తారు.. దీనిని మిక్సీలో మెత్తగా పిండిచేసి మృదువైన, సాగే ముద్దగా తయారుచేస్తారు.ఈ మిశ్రమాన్ని పెనంమీదపోసి రుచికి సరిపడా ఉప్పువేసి ఉడికిస్తారు. ఈ వేడివేడి మిశ్రమాన్ని రాగిముద్దలా చేసి చికెన్, మటన్ గ్రేవీ, ఫిష్ గ్రేవీలతో పాటు వెజిటబుల్ గ్రేవీలతోనూ.. సాధారణ సూప్లు, సాస్చ చిక్కుళ్లు లేదా ఇతర వంటకాలతో పాటు సైడ్ డిష్గానూ తింటారు. పోషక విలువలు... ఆఫ్రికన్ వాసులకు ఎంతో ఇష్టమైన ఈ ఫుఫు డిష్లో అనేక పోషక విలువలు దాగివున్నాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, పొటాయం, విటమిన్–సీ తో కూడిన అనేక విటమిన్లు, ఖనిజాలతో పాటు క్యాలరీలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు పెరగడం, జీర్ణక్రియ, రక్త ప్రసరణకు సహాయపడుతుందట. అంతేకాదు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యానికి ప్రయోజనకారంగా ఉంటుందట. అయితే కాసావాలో సైనోజెనిక్ గ్లూకోసైడ్లు ఉంటాయి. దీనిని సరిగ్గా ఉడికించకపోతే సైనైడ్ను విడుదల చేస్తుందట. పూర్తిగా ఉడికించడం వల్ల ఇందులోని టాక్సిన్లు పూర్తిగా నశించి ఆరోగ్యప్రయోజనాలను అందజేస్తుంది. (చదవండి:

పొంగల్లో పురుగు : మరో వివాదంలో రామేశ్వరం కెఫే
రామేశ్వరం కేఫే శుభ్రమైన, నాణ్యమైన దక్షిణ భారతీయ వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఘీ ఇడ్లీ , సాంబార్, ఇడ్లీ, వడ, దోస, పొంగల్, ఫిల్టర్ కాఫీ ఇలా రకాలు చాలా ఫ్యామస్. సామాన్యుల నుంచి భోజన ప్రియులు, పర్యాటకుల దాకా రామేశ్వరం కేఫే ఫుడ్ బాగా ప్రాచుర్యం పొందింది. తాజాగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రామేశ్వరం కేఫే అందించిన ఫుడ్లో పురుగు కన్నించడం వివాదాన్ని రేపింది.గురువారం ఉదయం కేఫ్లోని ఒక కస్టమర్ అల్పాహారం కోసం ఆర్డర్ చేసిన పొంగల్లో పురుగు కనిపించింది. దీనిపై వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన తర్వాత కేఫ్ సిబ్బంది మొదట్లో దీన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో రెస్టారెంట్ అంతటా పాక్షికంగా కెమెరాను ప్యాన్ చేయడంతోపాటు, కస్టమర్ ఒక చెంచా పొంగల్లో పురుగును హైలైట్ చేస్తూ చూపించాడు. ఈ వీడియోను, సిబ్బంది ప్రతిస్పందనను వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించిన తర్వాత మాత్రమే వారు క్షమాపణలు చెప్పడం ప్రారంభించారని పేర్కొన్నాడు. ఆ తరువాత సిబ్బంది తనకు రూ. 300 పూర్తి వాపసును అందించారని వెల్లడించాడు. ఇదీ చదవండి: జిమ్కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్ లుక్ వైరల్అయితే ఈసంఘటనపై రామేశ్వరం కేఫే ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.కాగా బెంగళూరుకు చెందిన రామేశ్వరం కేఫ్కు పలు శాఖలున్నాయి. హైదరాబాద్లోని మాదాపూర్లో కూడా ఒక శాఖ ఉంది. కాగా హైదరాబాద్లోని గత సంవత్సరం మే నెలలో, గడువు ముగిసిన , తప్పుగా లేబుల్ చేసిన అనేక ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్న తర్వాత తెలంగాణ ఆహార భద్రతా శాఖ తనిఖీ కిందకు వచ్చాయి. వీటిలో మార్చి 2024లో గడువు ముగిసిన 100 కిలోల మినప పప్పు, అలాగే 10 కిలోల గడువు ముగిసిన పెరుగు, ఎనిమిది లీటర్ల గడువు ముగిసిన పాలు ఉన్నాయి. అలాగే గత ఏడాది మార్చిలో బెంగళూరులోని రామేశ్వరంకేఫ్లో జరిగిన IED పేలుడులో అనేక మంది గాయపడిన సంగతి తెలిసిందే. చదవండి: Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే!

అలా కుందేలు ఓడిపోయింది... ఆ తరువాత..?
రన్నింగ్ రేస్లో తాబేలుతో పోటీ పడి అతి ఆత్మవిశ్వాసంతో ఓడిపోయిన కుందేలు కథ గురించి మనకు తెలిసిందే. మరి ఆ తరువాత ఏం జరిగింది?’ కుందేలులో ఆత్మవిశ్వాసం లేకుండా పోయిందా? తాబేలులో వోవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసిందా?‘అసలు ఆ తరువాత ఏం జరిగింది?’ అనే పాయింట్పై వచ్చిన నాటకం....సూపర్ టార్టైస్, సూపర్ రాబిట్. హాంగ్ సెంగ్హీ దర్శకత్వం వహించిన ఈ కొరియన్ నాటకాన్ని ఇటీవల బెంగళూరులో ప్రదర్శించారు. ‘ఒకసారి వచ్చిన ఫలితంతో వ్యక్తులను నిర్ణయించలేము అని చెప్పడానికి, పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ నాటకం ఉపయోగపడుతుంది’ అంటున్నాడు హాంగ్. కొరియన్ డ్రామా కంపెనీ ఈ నాటకాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తోంది.‘భారతీయ ప్రేక్షకుల ముందు నటించాలనే నా కల నెరవేరింది’ అంటున్నాడు కిమ్ మిన్–కి అనే ఆర్టిస్ట్. హాస్యాన్ని, సందేశాన్ని మిళితం చేస్తూ సాగే ఈ నాటకంలో సంగీతం, రిథమ్స్ ప్రత్యేక ఆకర్షణ.నాటకంలో అత్యంత ఆకట్టుకునే ఘట్టం? డైరెక్టర్ హాంగ్ ఇలా అంటున్నాడు...‘చివరి ఘట్టం. నేనేమిటి? నేను నిజంగా కోరుకునేది ఏమిటి? అని నాటకంలో ప్రతి క్యారెక్టర్ తనను తాను తెలుసుకుంటుంది’. (చదవండి: ఎవరీ మీరా మురాటీ..? టెస్లా టు థింకింగ్ మెషిన్ ల్యాబ్..)
ఫొటోలు


జలజల.. జలపాతాలు (ఫోటోలు)


ఇంగ్లండ్ టూర్లో ప్రియుడు కూడా.. స్మృతి మంధాన ఫొటోలు వైరల్ (ఫోటోలు)


కేటీఆర్ జన్మదినం.. తల్లులకు కేసీఆర్ కిట్లు పంపిణీ (ఫోటోలు)


అంబానీ కుటుంబం ఆధ్యాత్మిక పరవశం.. లండన్ స్వామినారయణ్ ఆలయంలో ప్రత్యేక పూజలు (ఫోటోలు)


వరలక్ష్మీ శరత్కుమార్ భర్త సర్ప్రైజ్.. కోట్ల విలువైన కారు గిఫ్ట్..! (ఫోటోలు)


తొలి సినిమాకే సెన్సేషన్.. ఎవరీ బ్యూటీ! (ఫోటోలు)


హ్యుందాయ్ ఇండియా కౌచర్ వీక్ 2025 ఈవెంట్లో మెరిసిన తమన్నా (ఫొటోలు)


69 ఏళ్ల ఏజ్లో స్లిమ్ అండ్ ట్రిమ్గా : ఈ సిక్రెట్ వెనకాల ‘జగదేక సుందరి’ (ఫొటోలు)


ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం..జనజీవనం అస్తవ్యస్తం (ఫొటోలు)


హరి హర వీరమల్లు నటి నిధి అగర్వాల్ (ఫొటోలు)
అంతర్జాతీయం

గాజాలో అన్నమో రామచంద్రా!
కల్లోలిత గాజాలో ఆకలి కేకలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఎటు చూసినా మనసును కలిచివేసే దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కఠిన ఆంక్షలతో ఆహారం, మానవతా సాయం అందక పాలస్తీనా పౌరుల డొక్కలెండిపోతున్నాయి. రోజుల తరబడి తిండి లేక నీరసించి, ప్రాణాలు విడిచేస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలోనే కనీసం 15 మంది మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు గాజా అరోగ్య శాఖ ప్రకటించింది. ఆకలి చావులు ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత గాజాలోని పాలస్తీనా పౌరులకు ఒక్కసారిగా కష్టాలు వచ్చిపడ్డాయి. కనీస సౌకర్యాల సంగతి పక్కనపెడితే కడుపునిండా తిండి దొరకడమే గగనంగా మారింది. అధికారిక గణాంకాల ప్రకారమే ఇప్పటివరకు 111 ఆకలి చావులు సంభవించాయి. వీరిలో 80 మందికిపైగా చిన్నారులే ఉండడం గమనార్హం. గాజాలో అత్యంత భయానక వాతావరణం కనిపిస్తోందని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. నిత్యం ఇజ్రాయెల్ దాడుల్లో అమాయక జనం బలైపోతున్నారని వెల్లడించింది. ఆకలి చావులు సంభవిస్తుండడం ఇటీవలి కాలంలో అతిపెద్ద సంక్షోభమమని స్పష్టంచేసింది. ప్రాణాలకు తెగిస్తేనే.. ఉత్తర గాజాలోని ఓ ఆసుపత్రిలో ఆరేళ్ల బాలుడు యూసుఫ్ అల్–సఫాదీ మరణించాడు. తల్లి పాలు అందక అతడు మృతిచెందినట్లు బంధువులు చెప్పారు. యూసుఫ్ తల్లికి కొన్ని నెలలుగా సరైన పౌష్టికాహారం దొరకడం లేదు. అనారోగ్యం బారినపడింది. తన బిడ్డకు స్తన్యం ఇవ్వడానికి ఆమె వద్ద పాలు లేకుండాపోయాయి. చివరకు యూసుఫ్ ప్రాణమే పోయింది. బయట ఆవు పాలు, గేదె పాలు కొందామన్న ఎక్కడా లేవు. ఒకవేళ దొరికినా లీటర్ 100 డాలర్లు(రూ.8,639) చెబుతున్నారు. 13 ఏళ్ల బాలుడు అబ్దుల్ హమీద్ అల్–గల్బాన్ది మరో వ్యధ. అతడికి చాలా రోజులుగా తిండి లేదు. చివరకు మృత్యువు కబళించింది. గాజాలో ఆకలి చావులుగా గత ఐదు నెలలుగా కొనసాగుతున్నాయి. గాజాలోకి మానవతా సాయం సరఫరా కాకుండా ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంటోంది. విదేశాల నుంచి ఆహారం, నీరు, ఇంధనం, ఔషధాలు, నిత్యావసరాలు రానివ్వడం లేదు. ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి మేరకు మే నెలలో ఆంక్షలు కొంత సడలించింది. మానవతా సాయాన్ని పరిమితంగానే అనుమతిస్తోంది. ఐక్యరాజ్యసమితి మద్దతున్న గాజా హుమానిటేరియన్ ఫౌండేషన్(జీహెచ్ఎఫ్) గాజా ప్రజలకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేస్తున్నప్పటికీ అవి ఏ మూలకూ చాలడం లేదు. ఆహార పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరిన జనంపై ఇజ్రాయెల్ సైన్యం విచ్చలవిడిగా కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో 1,000 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. కడుపు నింపుకోవాలంటే ప్రాణాలకు తెగించాల్సిన పరిస్థితి దాపురించింది. అభాగ్యుల ఎదురుచూపులు ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పేరుగాంచిన గాజా స్ట్రిప్లో 20 లక్షల మందికిపైగా నివసిస్తున్నారు. ఒకవైపు ఆహార లేమి, మరోవైపు పౌష్టిహాకార లోపం జనాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఆహారం దొరకడం ఒక ఎత్తయితే, అది నాణ్యంగా లేకపోవడం మరో సవాల్గా మారింది. చాలినంత తిండి లేక అల్లాడుతున్నారు. చాలామంది అర్ధాకలితో కాలం గడపాల్సి వస్తోంది. ఆకలి భూతం ప్రతి ఇంటి తలుపును తడుతోంది. ఆదుకొనే ఆపన్నహస్తాల కోసం అభాగ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇజ్రాయెల్ దయ తలిస్తే తప్ప గాజా పౌరులు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వ్యాఖ్యానించారు. నిండిపోయిన ఆసుపత్రులు పౌష్టికాహార లోపంతో అనారోగ్యం పాలై ఆసుపత్రు ల్లో చేరుతున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. బాధితులకు చికిత్స చేయడానికి సరైన సదుపాయాలు కూడా లేవని, వారు తమ కళ్ల ముందే మరణిస్తున్నారని, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని సెంట్రల్ గాజాలోని అల్–అక్సా హాస్పిటల్ వైద్యుడు ఖలీల్ అల్–డక్రాన్ తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం కాల్పుల్లో గాయపడినవారితో ఆసుపత్రులో నిండిపోయాయని, ఇతర రోగులను చేర్చులేకపోతున్నామని మరికొందరు డాక్టర్లు వెల్లడించారు. గాజాలో ప్రస్తుతం 6 లక్షల మందికిపైగా జనం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు అంచనా. వీరిలో 60 వేల మంది గర్భిణులే కావడం గమనార్హం. ఆహార లేమికి తోడు డీహైడ్రేషన్, రక్తహీనతతో గర్భిణులు మరణం అంచులకు చేరుకుంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం గాజాను పూర్తిగా ఖాళీ చేయించే పనిలో నిమగ్నమైంది.ప్రపంచ దేశాలు స్పందించాలి గాజా పరిణామాలపై 100కిపైగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఆకలి చావులు ఆపడానికి వెంటనే చర్యలు చేపట్టాలని, తక్షణమే కాల్పుల విరమణ పాటించేలా ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాయి. టన్నుల కొద్దీ ఆహారం, నీరు, ఔషధాలు గాజా బయటే ఉండిపోయాయని, ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా అవి పాలస్తీనా పౌరులకు అందడం లేదని మెర్సీ కారప్స్, నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ తదితర సంస్థలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ దమనకాండ వల్ల గాజాలో మృత్యుఘోష మొదలైందని, ఆకలి చావులు పెరిగిపోతున్నాయని వెల్లడించాయి. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా స్పందించాలని, గాజా ప్రజల ప్రాణాలు కాపాడాలని స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు బుధవారం ఉమ్మడిగా లేఖ విడుదల చేశాయి. సాక్షి, నేషనల్ డెస్క్

ఎయిరిండియా ఘటన.. ఆ మృతదేహాలు మా వాళ్లవి కావు
లండన్: గత నెలలో జరిగిన భారత విమానయాన చరిత్రలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఒకటైన అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ప్రమాదంపై మరో వివాదం నెలకొంది. ‘అహ్మదాబాద్ ఎయిరిండియా (Air India Flight 171) ప్రమాదంలో ఇద్దరు యూకే ప్రయాణికులు మృతి చెందారు. మృతదేహాల్ని గుర్తించేందుకు కుటుంబ సభ్యుల నుంచి అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి వైద్యులు డీఎన్ఏ నమోనాల్ని సేకరించారు. వాటి ఆధారంగా ఘటనా స్థలంలో లభ్యమైన రెండు మృతదేహాలు వారి కుటుంబ సభ్యులవేనంటూ యూకే కుటుంబసభ్యులకు అప్పగించారు.అసలు మృతదేహాలు ఎక్కడా?కానీ డీఎన్ఏ పరీక్షల్లో యూకే కుటుంబ సభ్యుల డీఎన్ఏకు.. భారత్ వైద్యులు అప్పగించిన మృతదేహాలకు డీఎన్ఏ వేరుగా ఉందని తెలిపారు. మరి యూకే మృతుల బంధువులకు అప్పగించిన మృతదేహాలు ఎవరివి? అసలు మృతదేహాలు ఎక్కడ ఉన్నాయనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇదే విషయంపై యూకే ప్రయాణికుల కుటుంబ సభ్యులు భారత్తో న్యాయపోరాటం చేస్తున్నారు. మృతదేహాల మార్పుపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు.డీఎన్ఏ మ్యాచ్ అవ్వలేదుమృతదేహాల మార్పుపై బాధితుల తరుఫు న్యాయవాది జేమ్స్ హీలీ మీడియాతో మాట్లాడారు. ‘జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమానం ఏఐ 171 విమానంలో 12,13 సీట్లలో మా క్లయింట్ (యూకే ప్రయాణికులు) ప్రయాణించారు. మృతదేహాల గుర్తింపు కోసం మృతుల కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ సేకరించారు. వాటి ఆధారంగా మృతదేహాల్ని గుర్తించారు. మాకు అప్పగించారు. మాకు అప్పగించిన మృతదేహాల్ని.. కుటుంబసభ్యుల డీఎన్ఏతో టెస్ట్ చేశాం. కానీ మాకు అప్పగించిన మృతదేహాల డీఎన్ఏకు, కుటుంబ సభ్యుల డీఎన్ఏకు మ్యాచ్ అవ్వడం లేదని వెల్లడించారు.260 మంది ప్రయాణికులు దుర్మరణంఅహ్మదాబాద్ నుంచి జూన్ 12న లండన్ బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్లైనర్ విమానం.. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఘటన సమయంలో విమానంలో 242 మంది ఉండగా.. ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 241 మంది మృతిచెందారు. ఇక, ఈ విమానం అహ్మదాబాద్ మేఘాణి నగర్లో బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై పడటంతో అందులోని పలువురు మృతిచెందారు. మొత్తంగా ఈ దుర్ఘటనలో 260 మంది మృతి చెందగా వారిలో 19మంది ప్రమాద సమయంలో బీజే మెడికల్ కాలేజీలో ఉన్నవారివేనని అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి సూపరిటెండెంట్ రాకేష్ జోషి తెలిపారు. యూకే బాధిత ప్రయాణికులకు మద్దతుగా ఎయిరిండియాడీఎన్ఏ రిపోర్టుల ఆధారంగా మృతదేహాల్ని గుర్తించడం, కుటుంబ సభ్యులకు అప్పగించే బాధ్యత ఎయిరిండియాది కానప్పటికీ.. యూకే ప్రయాణికుల కుటుంబ సభ్యులకు ఎయిరిండియా యాజమాన్యం అండగా నిలిచింది. బాధితుల మృతదేహాలను గుర్తించే విషయంలో తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చింది.అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన యూకే ప్రయాణికుల మృతదేహాల్ని డీఎన్ఏ ఆధారంగా గుర్తించారు. ఆ మృతదేహాల్ని అంతర్జాతీయ అత్యవసర సేవ కెన్యన్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ను ఉపయోగించింది. ఎయిర్ ఇండియా కార్గో ద్వారా మృతదేహాల అవశేషాలను మోసుకెళ్లే శవపేటికలను యూకేకి పంపారు.

పాక్ ఆస్పత్రిలో.. 26/11 ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతి
ఇస్లామాబాద్: భారత పార్లమెంట్పై దాడి(2001), 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో కీలక పాత్ర పోషించిన లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్లోని బహవల్పూర్లో గల ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మీడియాకు అందిన వివరాల ప్రకారం మే 6న భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన సమయంలో క్షిపణి దాడి కారణంగా అబ్దుల్ అజీజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇతను లష్కర్ ఎ తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరికి అత్యంత సన్నిహితుడని సమాచారం.అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తోయిబాకు నిధులను అందించే అగ్రశ్రేణి నిర్వాహకుడు. సోషల్ మీడియాలో ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ అంత్యక్రియలకు సంబంధించిన దృశ్యాలు పత్యక్షమయ్యాయి. వీటిలో డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి, అబ్దుర్ రవూఫ్ తదితర సీనియర్ లష్కర్ నేతలు ఆయన మరణానికి దుఃఖిస్తున్నట్లు కనిపిస్తోంది. అజీజ్ గతంలో గల్ఫ్ దేశాలతో పాటు యూకే, యూఎస్లోని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు, పాకిస్తాన్ కమ్యూనిటీల నుండి నిధులు సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే వివిధ ఉగ్రవాద కార్యకలాపాలకు లాజిస్టిక్స్, ఆయుధ సరఫరా, నియామకాలను అజీజ్ చేపట్టాడని తెలుస్తోంది.అతని మృతి లష్కర్ ఎ తోయిబాకు తీరని లోటుగా ఉగ్రవాదనేతలు భావిస్తున్నారు. అబ్దుల్ అజీజ్ భారత్లో జరిగిన పలు ఉగ్రదాడులతో సంబంధం ఉంది. 2001 పార్లమెంట్ దాడికి పాకిస్తాన్ నుండి డబ్బు, పరికరాలను తరలించడంలో సహాయం చేశాడని నిఘా నివేదికలు తెలియజేస్తున్నాయి. 2006 ముంబై లోకల్ రైలు పేలుళ్లకు కూడా ఇతను ఆర్థిక సహాయం అందించాడని భావిస్తున్నారు. 2008 ముంబై దాడుల సమయంలో, అజీజ్ సముద్ర మార్గాల ద్వారా ఆయుధాలు, ఉపగ్రహ ఫోన్లను అందజేసినట్లు తెలుస్తోంది.

Pakistan: ఇమ్రాన్ ఖాన్కు కోలుకోలేని దెబ్బ.. ఏడుగురు పీటీఐ నేతలకు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్: పాక్ న్యాయస్థానం నుంచి పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్కు కోలుకోలేని దెబ్బ పడింది. దేశంలో గతంలో జరిగిన అల్లర్ల కేసుల్లో ఏడుగురు పీటీఐ నేతలకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. 2023, మే 9న పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్టు దరిమిలా దేశంలోని సైనిక స్థావరాలు, ప్రభుత్వ యాజమాన్యంలోని భవనాలపై పీటీఐ నేతలు దాడులకు తెగబడ్డారు. ఈ నేపధ్యంలో పలువురు నేతలతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ అల్లర్ల కేసులో లాహోర్లోని ఉగ్రవాద నిరోధక కోర్టు (ఏటీసీ) తాజాగా పీటీఐకి చెందిన ఏడుగురు సీనియర్ నేతలకు పదేళ్ల జైలుశిక్ష విధించింది. కోర్టు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం జైలు శిక్ష పడిన నేతలలో సెనేటర్ ఎజాజ్ చౌదరి (పార్టీ సీనియర్ మహిళా నేత) సర్పరాజ్ చీమా (పంజాబ్ మాజీ గవర్నర్), డాక్టర్ యాస్మిన్ రషీద్ (పంజాబ్ మాజీ ఆరోగ్య మంత్రి) , మెహమూదూర్ రషీద్ (మాజీ మంత్రి) న్యాయవాది అజీమ్ పహత్ (పార్టీ న్యాయ సలహాదారు) ఉన్నారు. మరో ఇద్దరు నేతలు కూడా శిక్ష పడినవారిలో ఉన్నారు. అయితే పలు మీడియా నివేదికలు ఐదుగురి పేర్లను హైలైట్ చేశాయి. ఈ కేసులో పీటీఐ వైస్ చైర్మన్, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.మరో కేసులో పంజాబ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత మాలిక్ అహ్మద్ ఖాన్ భచర్, పీటీఐ పార్లమెంటేరియన్ అహ్మద్ చట్టా, మాజీ శాసనసభ్యుడు బిలాల్ ఎజాజ్లకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. నాడు జరిగిన అల్లర్ల తర్వాత పోలీసులు వేలాది మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ఖాన్ 2023, ఆగస్టు నుండి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పీటీఐ నేతలకు విధించిన శిక్షను ఫెడరల్ ప్రభుత్వం స్వాగతించింది. దీనిని సానుకూల చర్యగా అభివర్ణించింది. కాగా పీటీఐ పంజాబ్ చాప్టర్ హెడ్ అలియా హంజా, సీనియర్ నేత బాబర్ అవాన్, శాసనసభ్యుడు అసద్ కైసర్ ఈ శిక్షలను ఖండించారు. ఈ కేసులలో చట్టపరమైన విధానాలను అనుసరించలేదని, విశ్వసనీయ సాక్షులను హాజరుపరచలేదని వారు ఆరోపించారు.
జాతీయం

నటుడు దర్శన్.. మళ్లీ జైలుకేనా?
కన్నడ అగ్రనటుడు దర్శన్ తూగుదీప బెయిల్ వ్యవహారంపై సుప్రీం కోర్టు మళ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో న్యాయాధికారం దుర్వినియోగమైందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేసింది. దర్శన్ బెయిల్ రద్దు పిటిషన్పై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నాలుగు నెలలపాటు జైలులో గడిపాడు నటుడు దర్శన్. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్తో ఉపశమనం పొందిన సంగతి తెలిసిందే. అయితే.. దర్శన్తో సహా మరో ఏడుగురి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ పార్థీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై వాదనలు వింది. ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి CCTV ఫుటేజ్, ఫోటోలు, రేణుకాస్వామిపై జరిగిన హింసకు సంబంధించిన ఆధారాలు చూపిస్తూ, బెయిల్ రద్దు అవసరం ఉందని లూథ్రా వాదించారు. ఇది అత్యంత క్రూరమైన హత్యగా పేర్కొంటూ, రేణుకాస్వామి శరీరంపై గాయాలు, అంగవైకల్యం, రక్తస్రావం వంటి అంశాలను వివరించారు. ఇక దర్శన్ తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. అయితే.. జులై 17నాటి విచారణ సందర్భంగా జస్టిస్ పార్థీవాలా దర్శన్ తరఫు లాయర్ కపిల్ సిబాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘హైకోర్టు తీర్పు చదివితే, వాళ్లు నిందితులను ఎలా విడుదల చేయాలో చూస్తున్నట్టు ఉంది. ఈ కేసులో సుప్రీం కోర్టు ఎందుకు జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నారో వివరించాంలి’’ అని సిబాల్ను కోరారు. దానికి కపిల్ సిబాల్ స్పందిస్తూ.. హైకోర్టు తీర్పును పక్కన పెట్టి, సాక్షుల స్టేట్మెంట్లను పరిశీలించాలంటూ కోరారు. ఈ తరుణంలో ఇవాళ్టి విచారణ సందర్భంగానూ సుప్రీం కోర్టు దర్శన్ బెయిల్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది న్యాయ అధికార వికృత వినియోగం అని వ్యాఖ్యానించింది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించిన తెలిపిన బెంచ్.. పదిరోజుల్లో తీర్పు ఏంటన్నది వెల్లడిస్తామంది.కేసు ఏంటంటే..రేణుకాస్వామి అనే అభిమాని, దర్శన్ ప్రేయసి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. 2024 జూన్లో దర్శన్, అతని సహచరులు రేణుకాస్వామిని అపహరించి, బెంగళూరులోని షెడ్లో మూడు రోజుల పాటు హింసించారు. అనంతరం అతని శవాన్ని డ్రెయిన్లో పడేశారు. ఈ కేసులో దర్శన, పవిత్రగౌడ, మరో 15 మంది అరెస్ట్ అయ్యారు. ఆపై వాళ్లు బెయిల్ మీద బయటకు వచ్చారు. 2024 డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు దర్శన్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక ప్రభుత్వం ఏడుగురి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అయితే విచారణలో దర్శన్కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. ఒకవేళ సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు అయితే, దర్శన్ మళ్లీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కేసు టైంలైన్2024 జూన్: రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు. 2024 సెప్టెంబర్ 21: అనారోగ్య కారణంగా బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.2024 అక్టోబర్ 31: కర్ణాటక హైకోర్టు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.2024 డిసెంబర్ 13: హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

Himachal: లోయలో పడిన బస్సు.. ఐదుగురు మృతి
మండీ: హిమాచల్లోని మండీలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (హెచ్ఆర్టీసీ)కు చెందిన బస్సు లోయలో పడి, ఐదుగురు మృతిచెందగా, 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులంతా ప్రస్తుతం సర్కాఘాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నదని తెలుస్తోంది.ఈ దుర్ఘటన హిమాచల్లోని మండీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్కాఘాట్ సబ్-డివిజన్లోని మాసెరాన్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు విచారం వ్యక్తం చేశారు. హెచ్ఆర్టీసీ బస్సు లోయలో పడిపోవడం హృదయ విదారకమైనదని ఆయన పేర్కొన్నారు.బాధితులకు వెంటనే వైద్యసాయం అందించాలని తాను అధికారులను ఆదేశించానని ఆయన తెలిపారు. ‘ఈ దుఃఖ సమయంలో, మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని సుఖ్విందర్ సింగ్ సుఖు‘ఎక్స్’ పోస్టులో తెలిపారు. పోలీసులు, స్థానిక అధికార యంత్రాంగం రిలీఫ్ ఆపరేషన్లలో చురుకుగా పాల్గొంది.

కొత్త వందేభారత్ రైళ్లు.. కర్నాటక, మహారాష్ట్ర.. వయా తెలంగాణ
బెంగళూరు: దక్షిణాదికి మరిన్ని వందేభారత్ రైళ్లు రానున్నాయి. ఇవి కర్నాటకలోని బెలగావితో పూణే, హైదరాబాద్లను అనుసంధానించనున్నాయి. ఈ కొత్త రైళ్లు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలోని ప్రధాన నగరాలకు రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనున్నాయి.భారతీయ రైల్వే పూణే నుండి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇది బెలగావి, షెగావ్, వడోదర, సికింద్రాబాద్ (హైదరాబాద్) లకు కనెక్టివిటీని పెంచనున్నాయి. ప్రస్తుతం రెండు వందే భారత్ రైళ్లు పూణే నుండి నడుస్తూ, కొల్హాపూర్ హుబ్బళ్లి మార్గాలకు సేవలు అందిస్తున్నాయి. త్వరలో మరో నాలుగు అదనపు రైళ్లను ప్రవేశపెట్టాక పూణే నుండి బయలుదేరే మొత్తం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్య ఆరుకు చేరనుంది.కర్నాటకలోని కలబుర్గి నుంచి పూణే- హైదరాబాద్ మధ్య నడిచే కొత్త వందే భారత్ రైలు మహారాష్ట్ర, కర్ణాటక తెలంగాణలోని ప్రధాన నగరాలను కలపనుంది. కర్నాటకలోని బెలగావి ప్రజలు చాలా కాలంగా హుబ్బళ్లి-బెలగావి-పుణే మార్గంలో రోజువారీ సెమీ-హై-స్పీడ్ రైలును నడపాలని కోరుతున్నారు. ప్రస్తుతం వారానికి మూడుసార్లు నడపబోయే ఈ కొత్త వందే భారత్ రైలు ఈ డిమాండ్ను తీర్చనుంది. పూణే-షెగావ్ వందే భారత్ రైలు దౌండ్, అహ్మద్నగర్, ఛత్రపతి సంభాజీనగర్ జల్నాలలో ఆగనుంది. మహారాష్ట్రలోని ప్రసిద్ధ గజానన్ మహారాజ్ ఆలయాన్ని సందర్శించే పర్యాటకులకు ఈ రైలు సౌకర్యవంతంగా ఉండనుంది. అలాగే పూణే-వడోదర మధ్య నడవబోయే రైలు మహారాష్ట్ర గుజరాత్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని ఏర్పరుస్తుంది. ఈ రైలు మహారాష్ట్ర, గుజరాత్ మధ్య వాణిజ్యం, పర్యాటకాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. వందేభారత్ రైళ్లలో సౌకర్యవంతమైన సీటింగ్, ఆటోమేటిక్ డోర్లు, వైఫై యాక్సెస్, ఆధునిక టాయిలెట్లు మెరుగైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. కాగా ఈ కొత్త వందేభారత్ రైలు సేవల అధికారిక షెడ్యూల్ను రైల్వే శాఖ ఇంకా ధృవీకరించలేదు. త్వరలోనే దీనిపై ప్రకటన రావచ్చని సమాచారం.

ఎదురింటి యువకుడితో వివాహేతర సంబంధం..!
తమిళనాడు: వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడితో కలిసి భార్య.. భర్తను హత్య చేయించిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. మూడేళ్ల కుమార్తె చెప్పిన సమాచారంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వేలూరు జిల్లా ఒడుకత్తూర్ వద్ద కుప్పంపాళ్యానికి చెందిన భారత్ చెన్నైలో ఓ హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ఐదేళ్ల కిందట బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల నందినితో వివాహమైంది. వారికి నాలుగు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారాంతపు సెలవు రోజుల్లో భార్యాపిల్లలను చూసేందుకు భారత్ ఇంటికొస్తుంటాడు. ఈ నెల 21న ఇంటికొచ్చిన భారత్ సరకుల కోసం భార్య, చిన్న కుమార్తెను తీసుకుని ద్విచక్ర వాహనంపై దుకాణానికి వెళ్లాడు. తిరిగొస్తున్నప్పుడు రోడ్డులో కొబ్బరిమట్టలు అడ్డుగా ఉండటంతో వాటిని దాటే యత్నంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. అక్కడే దాక్కున్న ఓ వ్యక్తి ఆయుధంతో భారత్పై తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు. బాధితుడు ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. విచారణలో నందిని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు అనుమానం కలిగింది.భారత్ చిన్న కుమార్తెను ఆరా తీయగా.. మూడేళ్ల చిన్నారిని పోలీసులు అడిగారు. తన ఇంటి ఎదురుగా ఉండే సంజయ్ మామ తండ్రిని కొట్టి చంపి పారిపోయాడని తెలిపాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. వెంటనే నందినితోపాటు సంజయ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఎన్ఆర్ఐ

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై నాట్స్ సంతాపం
ప్రముఖ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణ వార్త పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 750 సినిమాల్లో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించిన కోట తెలుగు వారి మనస్సుల్లో చెరిగి పోని ముద్ర వేశారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. తండ్రిగా, తాతగా, కామెడీ విలన్గా, పోలీసుగా, మాంత్రికుడిగా ఎన్నో పాత్రలను పోషించిన కోటను తెలుగు వారు ఎన్నటికి మరిచిపోలేరని ఓ ప్రకటనలో తెలిపారు. కోట మృతి పట్ల నాట్స్ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చింది. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నామని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు.కాగా ‘కోట’గా పాపులర్ అయిన నటుడు కోట శ్రీనివాసరావు (83) జూలై 13 తెల్లవారుజామున హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో కన్నుమూసారు. 83వ పుట్టినరోజు జరుపుకున్న కేవలం మూడు రోజులకే ఆయన మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక శకం ముగిసింది అంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

అమెరికా స్టోర్లో రూ. లక్ష కొట్టేసిన భారత మహిళ, అరెస్ట్ : నెట్టింట చర్చ
భారతదేశానికి చెందిన మహిళను దొంగతనం ఆరోపణల కింద అమెరికాలో అరెస్ట్ చేశారు. ఇల్లినాయిస్ లోని టార్గెట్ స్టోర్ నుండి 1,300 డాలర్ల (సుమారు రూ.1.11 లక్షలు) విలువైన వస్తువులను దొంగిలించినట్టు ఆరోపణలు నమోదైనాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైఐరల్గా మారింది. తీవ్ర చర్చకు దారితీసింది.స్టోర్ ఉద్యోగుల ప్రకారం, విలువైన వస్తువులను కొట్టేసే ఆలోచనతోనే ఆ మహిళ ఏడు గంటలకు పైగా స్టోర్లో సంచరిస్తూ, తన ఫోన్ను నిరంతరం తనిఖీ చేసుకుంటూ కనిపించింది. చివరికి డబ్బు చెల్లించ కుండానే పశ్చిమ గేటు నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నించిందని దీంతో వారు పోలీసులకు సమాచారం అందించించారు. దీంతో ఆమెను అమెరికా పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె చేతికి సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై నేరపూరిత దొంగతనం అభియోగం మోపారు. అయితే దీనిపై డబ్బులు చెల్లిస్తానంటూ క్షమాపణలు చెప్పిన మహిళ తాను ఇక్కడికి చెందిన దాన్ని కాదని, తన ఫ్యామిలీ ఇండియాలో ఉంది, వాళ్లకి ఫోన్ చేయాలి లేకపోతే నేను ఎక్కడ ఉన్నానో వారికి తెలియదు.. అమెరికాకు ఒంటరిగా వచ్చాను.. ఇంట్లో 20 ఏళ్ల కూతురు ఉంది అంటూ దీనంగా చెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు. చదవండి: Vidya Balan మైండ్ బ్లోయింగ్.. గ్లామ్ అవతార్, అభిమానులు ఫిదా!ఈ ఏడాది మే 1న జరిగినట్టుగా చెబుతున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో చర్చకు దారి తీసింది. అలా ఎలా చేసింది? అని కొంతమంది ప్రశ్నించగా, మరికొంతమంది దేశం పరువుతీసింది అంటూ విమర్శించారు. ఈ ఘనకార్యం కోసమేనా పాస్పోర్ట్తో విదేశాలకు వెళ్లింది. ఇలాంటి వారి వల్లనే అమెరికా సోషల్ మీడియా భారతీయుల పట్ల ద్వేషం, అసహ్యంతో నిండిపోయింది అని మరొకరు కమెంట్ చేశారు."ప్రపంచ వేదికపై భారతదేశానికి తలవంపులు తెచ్చి పెడుతోంది. విదేశాలలో దేశానికి అవమానం తీసుకురావద్దు. గౌరవంగా ప్రవర్తించండి అని మరొకరు హితవు పలకడం విశేషం. నోట్: అయితే ఆ మహిళ ఏ ప్రదేశానికి చెందినవారు, ఎవరు? అనే వివరాలేవీ అందుబాటులో లేవు.

నిమిషా ప్రియను క్షమించలేం
సనా: తన సోదరుడు తలాల్ అబ్దో మెహదీని దారుణంగా హత్య చేసిన కేరళ నర్స్ నిమిషా ప్రియను క్షమించలేమని అబ్దెల్ ఫతాహ్ మెహదీ తేల్చిచెప్పారు. ఆమె నుంచి క్షమాపణ గానీ, నష్టపరిహారం(బ్లడ్ మనీ) గానీ తాము కోరుకోవడం లేదని స్పష్టంచేశారు. తమ కుటుంబానికి న్యాయం జరగాలని అన్నారు. యెమెన్లో నిమిష తల్లి ప్రేమకుమారియెమెన్లో మాజీ వ్యాపార భాగస్వామి అయిన తలాల్ అబ్దో మెహదీని 2017లో విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినందుకు నిమిషా ప్రియకు స్థానిక కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆమెకు బుధ వారం శిక్ష అమలు చేయాల్సి ఉండగా, చివరి నిమి షంలో వాయిదా పడింది. బాధితుడి సోదరుడు అబ్దెల్ ఫతాహ్ మెహదీ బీబీసీ చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఖిసాస్’ తప్ప ఇంకేమీ కోరుకోవడం లేదని చెప్పారు. షరియా చట్టం ప్రకారం తమకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. తన సోదరుడిని చంపినందుకు నిమిషా ప్రియను ఉరి తీయాల్సిందేనని, అంతకుమించి ఇంకేదీ అక్కర్లే దని వెల్లడించారు.

నిమిష మరణశిక్ష వాయిదా
యెమెన్లో కేరళ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించింది. ఆమె మరణ శిక్షను వాయిదా వేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. యెమెన్ సనా జైలులో బుధవారం మధ్యాహ్నాం నిమిషకు శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో బాధిత కుటుంబంతో భారత్కు చెందిన మత పెద్దల చర్చల నేపథ్యంతో శిక్ష వాయిదా పడినట్లు సమాచారం.నిమిష శిక్ష వాయిదా పడ్డ విషయాన్ని యెమెన్లో ‘‘సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’’ సభ్యుడు శ్యామూల్ జోరెమ్ భాస్కరన్ ధృవీకరించారు. అయితే.. బాధిత కుటుంబం బ్లడ్మనీ(పరిహారం సొమ్ము)కుగానీ, శిక్షరద్దుకుగానీ అంగకరించలేదని ఆయన తెలిపారు. చర్చల్లో ఇంకా పురోగతి రావాల్సి ఉందని అంటున్నారాయన.కేరళకు చెందిన ఇండియా గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్, షేఖ్ హబీబ్ ఉమ్మర్ వంటి మత గురువులు తమ ప్రతినిధులతో క్షమాభిక్ష కోసం రాయబారం జరుపుతున్నారు. తలాల్ అబ్దో మహ్దీ కుటుంబంతో మతపెద్దలు ఉత్తర యెమెన్లో అత్యవసర భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శిక్ష వాయిదా పడడం గమనార్హం. మరోవైపు.. నిమిషా ప్రియ విషయంలో భారత విదేశాంగశాఖ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంఈఏ అక్కడి జైలు అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. హౌతీ నియంత్రణలోని యెమెన్తో భారతకు అంతగా దౌత్యపరమైన సత్సంబంధాలు లేవు. ఈ తరుణంలో తామ చేయగలిగినదంతా చేశామని, ఇంతకు మించి చేయలేమని కేంద్రం సోమవారం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. అయితే.. నిమిష కేసును బాధాకరంగా పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అనధికారిక మార్గాలను పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. అయితే తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీని హత్య చేసిన నేరంలో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. కేరళ ప్రభుత్వం సైతం కేంద్రానికి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతూ వచ్చినా.. కేంద్రం యెమెన్ న్యాయవిభాగానికి విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. భర్తతో నిమిషఇంకోవైపు క్షమాభిక్షపైగానీ, బ్లడ్మనీపైగానీ చర్చించేందుకు సైతం తలాల్ కుటుంబం ఇంతకాలం ముందుకు రాలేదు. అయితే తాజా భేటీలో ఆయన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యలు మొదటిసారి పాల్గొన్నట్లు తెలస్తోంది. ఈ పురోగతితో నిమిష శిక్ష రద్దయ్యే అవకాశాలపై ఆశలు చిగురిస్తున్నాయి.
క్రైమ్

విశాఖ పోలీసుల థర్డ్ డిగ్రీ.. మేజిస్ట్రేట్ ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: పొక్సో కేసులో ఏసీపీ చేతివాటం బయటపడింది. ఇంటర్ చదువుతున్న బాలికపై రామకృష్ణ అనే యువకుడు వేధింపులకు పాల్పడుతున్నాడు. తాను చెప్పినట్టు చేయకపోతే చంపేస్తానంటూ బాలిక ఇంటికి వచ్చి మరి.. బెదిరింపులకు దిగాడు. దీంతో తమ కూతురికి ప్రాణహాని ఉందని.. వేధింపులు భరించలేక పోతుందని హార్బర్ ఏసీపీ కాళిదాసును బాలిక తల్లిదండ్రులు ఆశ్రయించారు.పోక్సో కేసులో సెటిల్మెంట్ చేసుకోవాలంటూ బాధితులపై ఏసీపీ కాళిదాసు తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. కాగా, ఏసీపీ అండతో పోలీస్ స్టేషన్లోనే బాధితురాలు తండ్రిపై నిందితుడు రామకృష్ణ దాడి చేశాడు. దాడి చేసినా కానీ బాధితులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ కాళిదాసు తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ హార్బర్ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది.ఇదిలా ఉండగా.. ఈ కేసులో పోలీసులు డబుల్ గేమ్ ఆడారు. పోలీస్ స్టేషన్లో గొడవ బయటకి రావటంతో నిందితుడికి పోలీసులు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. నిందితుడి ప్రైవేట్ పార్ట్స్పై వేడి మైనపు చుక్కల్ని వేశారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితుడు రామకృష్ణ.. రిమాండ్ సమయంలో మేజిస్ట్రేట్ ఎదుట థర్డ్ డిగ్రీ విషయం బయట పెట్టాడు. పోలీసులపై మేజిస్ట్రేట్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలంటూ సీపీ శంఖబ్రతబాగ్చికి మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగి ప్రాణం తీసిన నిజాయితీ.. విచారణకు సీఎం ఆదేశం
దిస్పూర్: విధి నిర్వహణలో నిజాయితీ ఓ ప్రభుత్వ ఉద్యోగిని ప్రాణం తీసింది. ప్రాజెక్ట్లు పూర్తి కానప్పటికీ.. పూర్తయ్యాయని బిల్లులు ఇవ్వాలంటూ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD)లో అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేస్తున్న బాధితురాల్ని ఆమె సీనియర్ ఉద్యోగులు వేధించారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాల్ని వివరిస్తూ ఓ లేఖను రాసింది. ఆ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నా పని ఒత్తిడి కారణంగా నేను ఈ చర్య తీసుకుంటున్నాను. ఆఫీసులో నాకు అండగా ఎవరూ లేరు. పూర్తిగా అలసిపోయాను నా తల్లిదండ్రులు నా గురించి ఆందోళన చెందుతున్నారు’అని సూసైడ్ నోట్లో రాశారు.బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా, ఇటీవల పదోన్నతి పొందిన సూపరింటెండెంట్ ఇంజనీర్, గతంలో బొంగైగావ్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన దినేష్ మేధి శర్మ, ప్రస్తుతం బొంగైగావ్లో పనిచేస్తున్న సబ్-డివిజనల్ ఆఫీసర్ (ఎస్డిఓ) అమీనుల్ ఇస్లాంలను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సైతం దర్యాప్తు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రేమించిన మరదలితో వివాహం చేయడం లేదని..
కృష్ణా: ప్రేమించిన మరదలితో కుటుంబ సభ్యులు వివాహం చేయడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఇక సెలవు (మిస్యూ మా, మిస్యూ ఆల్ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ) అంటూ తన ఫొన్లో స్టేటస్ పెట్టి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని చేగుంటలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల మేరకు.. చేగుంటకు చెందిన సంగెంబండ బస్సప్ప – తిమ్మవ్వ దంపతులకు మల్లప్ప, భీమ్రాయ, పరశివ సంతానం. వీరి తల్లి తిమ్మవ్వ కొన్నేళ్ల క్రితం మృతిచెందగా.. మొదటి కొడుకు మల్లప్ప తన భార్యతో కలిసి జీవనోపాధి నిమిత్తం బెంగళూరుకు వలస వెళ్లారు. ఆరేళ్ల క్రితం పదో తరగతి పూర్తిచేసుకున్న చిన్నకొడుకు పరశివ (22) కూడా ఉపాధి నిమిత్తం బెంగళూరులోని తన అన్న మల్లప్ప వద్దకు వెళ్లాడు. బెంగళూరులో పరశివ పనిచేసుకుంటూ.. తన రెండో అన్న భీమ్రాయ భార్య సునీత చెల్లెలు నిఖితతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరు వరుసకు బావమరదలు కావడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని స్వగ్రామంలో ఉన్న తన సోదరుడు భీమ్రాయ, వదిన సునీతకు చెప్పేందుకు గాను వారం రోజుల క్రితం పరశివ బెంగళూరు నుంచి చేగుంటకు వచ్చాడు. ఈ క్రమంలో పరశివ, నిఖిత వివాహానికి అన్న, వదినలు అడ్డు చెప్పారు. ప్రేమించిన యువతి ఆరోగ్యం బాగా లేదని, నీకు మరో అమ్మాయితో వివాహం చేస్తామని పరశివకు సర్దిచెప్పారు. ఇక వీరి మాటకు ఎదురు చెప్పలేక తిరిగి బెంగళూరుకు బయలుదేరాడు. ఆదివారం బెంగళూరు నుంచి మళ్లీ బయలుదేరిన పరశివ.. రాష్ట్ర సరిహద్దులోని దేవసూగూర్లో గల కృష్ణానది తీరానికి చేరుకున్నట్లు తెలిసింది. అక్కడ తన ఫోన్లో ‘మీస్యూ ఆల్ మై ఫ్రెండ్స్, అండ్ ఫ్యామిలీ’ అంటూ స్టేటస్ పెట్టాడు. అలాగే తాను ప్రేమించిన నిఖితతో దిగిన ఫొటోలు, వీడియోలు స్టేటస్లో పెట్టుకొని ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మొదట కృష్ణా, ఆ తర్వాత శక్తినగర్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే కృష్ణానదిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడేమో అని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానికుల సహాయంతో కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టగా.. ఆచూకీ లభించలేదు. యువకుడి అదృశ్యం ఘటనకు సంబంధించి శక్తినగర్ ఎస్ఐ తిమ్మణ్ణను వివరణ కోరగా.. ఈ విషయంపై బెంగళూరులో కేసు నమోదైందని త తెలిపారు. తాము స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదన్నారు. ఇప్పటికే బెంగళూరులో కేసు నమోదైనందున తాము కేసు చేయలేదని తెలిపారు.

ఎదురింటి యువకుడితో వివాహేతర సంబంధం..!
తమిళనాడు: వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడితో కలిసి భార్య.. భర్తను హత్య చేయించిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. మూడేళ్ల కుమార్తె చెప్పిన సమాచారంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వేలూరు జిల్లా ఒడుకత్తూర్ వద్ద కుప్పంపాళ్యానికి చెందిన భారత్ చెన్నైలో ఓ హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ఐదేళ్ల కిందట బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల నందినితో వివాహమైంది. వారికి నాలుగు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారాంతపు సెలవు రోజుల్లో భార్యాపిల్లలను చూసేందుకు భారత్ ఇంటికొస్తుంటాడు. ఈ నెల 21న ఇంటికొచ్చిన భారత్ సరకుల కోసం భార్య, చిన్న కుమార్తెను తీసుకుని ద్విచక్ర వాహనంపై దుకాణానికి వెళ్లాడు. తిరిగొస్తున్నప్పుడు రోడ్డులో కొబ్బరిమట్టలు అడ్డుగా ఉండటంతో వాటిని దాటే యత్నంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. అక్కడే దాక్కున్న ఓ వ్యక్తి ఆయుధంతో భారత్పై తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు. బాధితుడు ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. విచారణలో నందిని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు అనుమానం కలిగింది.భారత్ చిన్న కుమార్తెను ఆరా తీయగా.. మూడేళ్ల చిన్నారిని పోలీసులు అడిగారు. తన ఇంటి ఎదురుగా ఉండే సంజయ్ మామ తండ్రిని కొట్టి చంపి పారిపోయాడని తెలిపాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. వెంటనే నందినితోపాటు సంజయ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
వీడియోలు


Visakha : పోక్సో కేసులో పోలీసులు డబుల్ గేమ్


Sajjala: చంద్రబాబు మద్యం కేసులో బెయిల్ మీద ఉన్నారు


ఒక్క వర్షంతోనే మునిగిన కానూరు ప్రధాన రహదారి


నమ్ముకున్న వారిని ప్రాణం అడ్డుపెట్టి అయినా కాపాడుకునే వ్యక్తి YS జగన్


Anantapur: ఉపాధ్యాయుడినే బెదిరించిన విద్యార్థిని


పథకాలు అమలు చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారని మహిళల నిలదీత


Gachibowli: పీజీ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువతి


KTR Birthday: ఆశీర్వదించండి నాన్న


సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైఎస్ జగన్


YS జగన్మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టింది