Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YSRCP President YS Jagan Mohan Reddy Key Press Meet At 11 AM1
టీడీపీ, ఎల్లో మీడియాలతో యుద్ధం చేస్తున్నాం: ప్రెస్‌ మీట్‌లో వైఎస్‌ జగన్‌

సాక్షి,గుంటూరు: రాష్ట్రంలో జరగుతున్న పరిణామాలపై టీడీపీ, ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నామని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడే పల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు.రాష్ట్రంలో దిగజారిన లాండ్‌ ఆర్డర్‌, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోంది. చంద్రబాబు అరాచక పాలనకు వ్యతిరేకంగా మే4న ప్రజలు, వైఎస్సార్‌పీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేశారు. టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్లా. బుధవారం కర్ఫ్యూలాంటి పరిస్థితుల మధ్య నా రెంటపాళ్ల పర్యటన జరిగింది. అయినా విజయవంతమైంది. మా పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా? మొన్నటి పొదిలి పర్యటనలో 40వేల మందిపై రాళ్లేసే ప్రయత్నం చేశారు. రైతులు సంయమనం పాటించారు. అయినా కేసులు పెట్టారు. రైతుల సమస్యల గురించి ఎవరూ మాట్లాడకూడదు. సంఘీభావం తెలపకూడదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు భయం ఎందుకు?చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. ఓ టీవీ ఛానెల్‌లో చంద్రబాబు అహంకార మాటలు వినండి. ప్రతిపక్షను భూస్థాపితం చేస్తారట. ప్రశ్నిస్తున్న వ్యక్తిని భూస్థాపితం చేస్తారా?. ఏడాది కాలంలోనే ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో చంద్రబాబు పాలనపై అసహనం పెరిగింది. ఆ అసహనాన్ని డైవర్ట్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై, నేతలపై కేసులు పెడుతున్నారు. టాపిక్‌ డైవర్ట్‌ చేస్తున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. చెవిరెడ్డి అరెస్ట్‌ నిజంగా అశ్చర్యకరం. ‌తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని గన్‌మెన్‌ను బలవంతం చేశారు. తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇవ్వనందుకు గన్‌మెన్‌పై దాడి కూడా చేశారు. తనపై జరిగిన దాడిని గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రపతి, గవర్నర్‌, డీజీపీకి గన్‌మెన్‌ లేఖ రాశారు. మరో గన్‌మెన్‌ను ప్రలోభాలకు గురిచేసి వారికి అనుకూలంగా స్టేట్‌మెంట్‌ ఇప్పించుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు.. అరెస్టులు చెవిరెడ్డితో పాటు ఆయన కొడుకును కేసులో ఇరికించారు. సొంత నియోజవకర్గంలో గెలవలేని వ్యక్తి. చంద్రగిరిలో ఇబ్బంది ఉండకూడదనే చెవిరెడ్డిని అరెస్ట్‌ చేశారు. తప్పుడు కేసులో పిన్నెల్లిని అరెస్ట్‌ చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్‌ తీసుకొచ్చాం. మళ్లీ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. సురేష్‌ భార్యపైనా కేసులు పెట్టారు. వల్లభనేని వంశీపై 11 కేసులు పెట్టారు. జోగి రమేష్‌ కొడుకు, కాకాణిపై తప్పుడు కేసులు. కృష్ణమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిపైనా అక్రమ కేసులు పెట్టారు. కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్నినాని, వైవి సుబ్బారెడ్డి,ఆయన కుమారుడిపై తప్పుడు కేసులు. దేవినేని అవినాష్‌, మాజీ ఎమ్మెల్యే ఆర్కే,అంబటి రాంబాబు, విడదల రజినిపై తప్పుడు కేసులు దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పైనా అక్రమ కేసులు. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిపై, ఉషశ్రీచరణ్‌, తోపుదుర్తి ప్రకాష్‌, గోరంట్ల మాధవ్‌పై కేసులు. ఇలా వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌ చేయాలని చూస్తున్నారు. కొమ్మినేని ఏం పాపం చేశారు చంద్రబాబు?సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు ఏం పాపం చేశారు? ఏం చేశారని కొమ్మినేనిని అరెస్ట్‌ చేశారు?టీవీ డిబెట్‌లో అనలిస్ట్‌ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధం? గతంలో కేఎస్‌ఆర్‌ ఉద్యోగాన్ని చంద్రబాబు ఊడగొట్టించారు. కేఎస్‌ఆర్‌ అరెస్ట్‌ అక్రమమేనన్న సుప్రీంకోర్టు.. తనకున్న విచక్షణాధికారాల్ని ఉపయోగించి ఆయన్ను వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలించింది. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టులాంటిది.

Air India crash: Black box heavily damaged, India to send it to US to recover data2
Air India crash: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. దెబ్బతిన్న బ్లాక్‌ బాక్స్‌

సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌ లైనర్‌ (Air India Boeing 787-8 Dreamliner) విమాన ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్‌ 12న గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి గల కారణాల్ని వెలికి తీసే బ్లాక్ బాక్స్‌ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.అయితే, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దెబ్బతిన్న బ్లాక్‌ బాక్స్‌ నుంచి వివరాల్ని సేకరించేందుకు కేంద్రం అమెరికాకు తరలించినట్లు సమాచారం. తాజా బ్లాక్‌ బాక్స్‌ పరిణామంపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.ఏప్రిల్‌ 12న అహ్మదాబాద్‌ నుంచి ఎయిరిండియా 787 డ్రీమ్‌లైనర్ విమానం 242 మందితో లండన్‌ బయల్దేరింది. కానీ, ఆ విమానం నేల మీద నుంచి పైకి లేచిన కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఘోరమైన తప్పు ఏదో జరిగింది. విమానంలో తీవ్ర ఇబ్బంది తలెత్తింది. అందులో నుంచి ఒక మేడే కాల్ వెళ్లింది. అంతలోనే రద్దీగా ఉండే మేఘానీనగర్‌ బీజే మెడికల్ కాలేజీ ప్రధాన క్యాంపస్‌పై కప్పు మీద ఆ విమానం కూలిపోయి (air india crash video) అగ్ని గుండంలా మారింది. విమానంలోని మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్‌ తప్ప మిగిలిన వారందరినీ అగ్ని దహించివేసింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారితో పాటు బీజే మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌లో బాధితుల్ని కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది.ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యులు బాధిత కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ ఆధారంగా మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. ఘటనా స్థలంలో మృతదేహాలను డీఎన్‌ఏతో మ్యాచ్‌ చేసి చూస్తున్నారు. గుజరాత్‌ ప్రభుత్వ వైద్యులు మృతదేహాల్ని ఎనాలసిస్‌ చేసి మొత్తం 208 మృతదేహాల్ని గుర్తించారు. అలా ఇప్పటి వరకు (ఏప్రిల్‌ 18) ఉన్న సమాచారం ప్రకారం.. 170 మృతదేహాల్ని డీఎన్‌ఏతో గుర్తించారు. వారిలో యూకే, ఫోర్చుగల్‌,కెనడాతో పాటు ప్రమాదంలో మరణించిన మరో ఆరుగురు మృత దేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు.

India Dealt With Injury Blow To Star Player Ahead Of Headingley Test Says Reports3
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ..!

భారత క్రికెట్‌ జట్టు రేపటి నుంచి (జూన్‌ 20) వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ కొత్త సైకిల్‌ను (2025-27) ప్రారంభిస్తుంది. భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ రేపటి నుంచి మొదలవుతుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌ హెడింగ్లేలోని లీడ్స్‌లో జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకున్నాయి. ఇంగ్లండ్‌ ఇదివరకే తుది జట్టును ప్రకటించింది. భారత్‌ కూడా తుది జట్టుపై క్లారిటీ ఇచ్చేసింది. రోహిత్‌, విరాట్‌, అశ్విన్‌ల రిటైర్మెంట్‌ తర్వాత యంగ్‌ ఇండియా ఎదుర్కోబోయే తొలి అగ్నిపరీక్ష ఇదే.ఈ సిరీస్‌తో శుభ్‌మన్‌ గిల్‌ టీమిండియా కెప్టెన్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెడతాడు. భారత తుది జట్టులో చాలా మార్పులకు అవకాశం ఉంది. యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ అరంగేట్రం దాదాపుగా ఖరారైపోయింది. బ్యాటింగ్‌ స్థానాలపై కూడా వైస్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ నిన్నటి ప్రెస్‌ మీట్‌లో క్లారిటీ ఇచ్చాడు. నాలుగో స్థానంలో గిల్‌, ఐదో ప్లేస్‌తో తను బ్యాటింగ్‌కు దిగుతామని పంత్‌ వెల్లడించాడు.ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌.. వన్‌డౌన్‌లో సాయి సుదర్శన్‌ పేర్లు కూడా దాదాపుగా ఖరారైపోయాయి. ఆరో స్థానంపై కూడా టీమిండియా మేనేజ్‌మెంట్‌కు నిన్నటి వరకు ఎలాంటి అనుమానం లేకుండింది. 8 ఏళ్ల తర్వాత భారత టెస్ట్‌ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్‌ నాయర్‌ ఈ స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడని మేనేజ్‌మెంట్‌ సూచనప్రాయంగా వెల్లడించింది.The incident where Karun Nair got hit at the nets by a delivery from @prasidh43 @RohanDC98 #ENGvsIND #Headingley pic.twitter.com/xGMsiSF8PA— RevSportz Global (@RevSportzGlobal) June 18, 2025అయితే నిన్న జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో టీమిండియాకు ఓ ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తుంది. దేశవాలీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి టీమిండియా తలుపులు తట్టిన కరుణ్‌ నాయర్‌ నెట్స్‌ గాయపడ్డాడని ప్రచారం జరుగుతుంది. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌ను ఎదుర్కోబోయి కరుణ్‌ పక్కటెముకల్లో దెబ్బ తగిలించుకున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఒకవేళ నిజంగానే కరుణ్‌ గాయపడినట్లైతే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలనట్లవుతుంది. కరుణ్‌ ఇటీవల ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ సాధించి జోరుమీదున్నాడు. అతని గాయం తీవ్రమైందైతే తుది జట్టులో అతని స్థానం గల్లంతైనట్లే. ఇది టీమిండియా బ్యాటింగ్‌ కూర్పును భారీగా ప్రభావితం చేస్తుంది. ఆరో స్థానం కోసం మేనేజ్‌మెంట్‌ మరో ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్థానం కోసం ప్రత్యామ్నాయ ఆటగాడిగా ధృవ్‌ జురెల్‌ అందుబాటులో ఉన్నప్పటికీ.. అతను మ్యాచ్‌ కోసం సిద్దంగా ఉండకపోవచ్చు. కరుణ్‌కు ప్రత్యామ్నాయంగా ఆల్‌రౌండర్‌తో ముందుకు వెళ్లాలనుకుంటే కూడా వాషింగ్టన్‌ సుందర్‌ అందుబాటులో ఉన్నాడు. కరుణ్‌ గాయం తీవ్రమైందైతేనే ఈ ఈక్వేషన్స్‌ అన్నిటికీ ఆస్కారం ఉంటుంది. సోషల్‌మీడియాలోని మరో వర్గం కరుణ్‌ గాయాన్ని కొట్టిపారేస్తుంది. అతని గాయం తీవ్రమైంది కాదని అంటుంది. తొలి టెస్ట్‌లో కరుణ్‌ తప్పక ఆడతాడని చెబుతుంది. ఈ విషయమై మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు భారత తుది జట్టు (అంచనా).. యశస్వి జైశ్వాల్‌, కేఎల్ రాహుల్‌, సాయి సుదర్శన్‌, శుభ్‌మన్ గిల్‌(కెప్టెన్‌), రిషబ్ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌), కరుణ్‌ నాయర్‌, నితీష్ కుమార్ రెడ్డి/శార్దూల్‌ ఠాకూర్‌, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణ/అర్షదీప్‌ సింగ్‌టీమిండియాతో తొలి టెస్టుకు ఇంగ్లండ్‌ తుదిజట్టు..జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌, జేమీ స్మిత్‌ (వికెట్‌ కీపర్‌), క్రిస్‌ వోక్స్‌, బ్రైడన్‌ కార్సే, జోష్‌ టంగ్‌, షోయబ్‌ బషీర్‌.

Iran hits major hospital in Israel conflict Live Updates4
ఇరాన్‌ దెబ్బ అదుర్స్‌.. ఇజ్రాయెల్‌కు భారీ ఎదురుదెబ్బ

టెహ్రాన్‌/టెవీ అవీవ్‌: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు వైపుల నుంచి బాంబు దాడులు పీక్‌ స్టేజ్‌ చేరుకున్నాయి. ఇజ్రాయెల్‌పూ ఇరాన్‌ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇరాన్‌ ప్రయోగిస్తున్న బాలిస్టిక్‌ క్షిపణుల కారణంగా ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రులు, స్కూల్స్‌, నివాస ప్రాంతాల్లోకి ఇరాన్‌ క్షిపణులు దూసుకెళ్లాయి. దీంతో, భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది.తాజాగా ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులు ఇజ్రాయెల్‌లోని పలు నగరాల్లో బీభత్సం సృష్టించాయి. టెలీ అవీవ్‌, రామత్‌గాన్‌, హోలోన్‌, బెర్జీబా నగరాలపై ఇరాన్‌ విరుచుకుపడింది. దీంతో, భయానక వాతావరణం నెలకొంది. బీర్షెబాలోని సోరోకా ఆసుప్రతిపై ఇరాన్‌ దాడి చేయడంతో భవనం పూర్తిగా దెబ్బతింది. అనంతరం, ఆసుపత్రిలో ఉన్న పేషంట్స్‌, వైద్యులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. అత్యవసర బృందాలు స్పందించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలు వైరల్‌గా మారాయి.మరోవైపు.. ఇజ్రాయెల్‌లోని హోలోన్‌ ప్రాంతంలో నివాసాలపై ఇరాన్‌ దాడులకు తెగబడింది. ఈ క్రమంలో పలువురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ప్రధాన, అతిపెద్ద ఆసుపత్రిపై ఇరాన్‌ దాడులు చేయడంతో భారీ నష్టం జరిగిందని చెప్పుకొచ్చింది. ఇజ్రాయోల్‌ రాజధాని టెలి అవీవ్‌లోని బహుళ అంతస్తు భవనాలపై క్షిపణి దాడులు జరగడంతో అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. 🚨 🚨 🚨 SOROKA HOSPITAL IN ISRAEL HIT BY IRANIAN BALLISTIC MISSILE pic.twitter.com/xK2HBPSeeV— Breaking911 (@Breaking911) June 19, 2025అంతకుముందు.. ఇరాన్‌ సైనిక సామర్థ్యం అణ్వస్త్ర స్థాయికి చేరకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా దాడులతో దండయాత్ర చేస్తున్న ఇజ్రాయెల్‌ బుధవారం తన బాంబుల కుంభవృష్టిని కురిపించింది. ఇరాన్‌లోని 40 కీలక ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. యురేనియం శుద్ధి ప్రక్రియలో కీలకమైన సెంట్రీఫ్యూజ్‌లను తయారుచేసే కర్మాగారంపై భీకరస్థాయిలో మిస్సైళ్లను ప్రయోగించింది. ఇరాన్‌ సాయుధశక్తిని నిర్వీర్యం చేసేందుకు క్షిపణుల ఉత్పత్తి ఆయుధ ప్లాంట్‌లపైనా ఇజ్రాయెల్‌ వందల కొద్దీ డ్రోన్లను ఎక్కుపెట్టింది.🚨The recent rocket barrage by the Iranian regime hit a hospital in Southern Israel By the order of Khamenei, who specifically instructed to aim for civilian populations and hospitals.And you still ask why we don’t want them to have nuclear weapons…👇 pic.twitter.com/m2CuAxeFcn— Voice From The East (@EasternVoices) June 19, 2025ఇరాన్‌ అంతర్గత భద్రత శాఖ ప్రధాన కార్యాలయంపైనా యుద్ధవిమానాలు దాడులు చేశాయి. ప్రతిగా ఇరాన్‌ సైతం ఇజ్రాయెల్‌ భూభాగాలపై క్షిపణులను పేలుస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. ఇరాన్‌ జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా 24 మంది చనిపోయారు. బుధవారం తమవైపు దూసుకొచ్చిన 10 క్షిపణులను నేలకూల్చామని ఇజ్రాయెల్‌ పేర్కొంది. జవాదాబాద్‌లో అత్యాధునిక ఎఫ్‌–35 యుద్ధవిమానాన్ని ఇరాన్‌ సేనలు పేల్చేశాయి. దాదాపు రూ.140 కోట్ల విలువైన హెర్మెస్‌ డ్రోన్‌నూ నేలకూల్చాయి. అత్యంత శక్తివంతమైన ఫతాహ్‌ హైపర్‌సోనిక్‌ క్షిపణిని ప్రయోగించామని ఇరాన్‌ ప్రకటించింది. అయితే తమదేశంలో శుక్రవారం నుంచి ఇప్పటిదాకా 15,871 చోట్ల నిర్మాణాలు, దాదాపు 1,300 వాహనాలు, 1,633 ఆస్తులు నాశనమయ్యాయని ఇజ్రాయెల్‌ బుధవారం ఒప్పుకుంది.ఇరాన్‌లో భయానక నిశ్శబ్దం ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థ చాలా వరకు ధ్వంసంకావడంతో ఎప్పుడు ఎటు నుంచి ఇజ్రాయెల్‌ క్షిపణులు మీదొచ్చి పడతాయోనన్న భయాలు ఇరాన్‌ ప్రజల్లో కనిపించాయి. చాలా నగరాలు, పట్టణాల్లో దుకాణాలు, ఆఫీస్‌లు, స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. సురక్షిత ప్రాంతాలకు నిత్యావసర సామగ్రితో వలసవెళ్లేవాళ్లు తప్పితే రోడ్లపై ఇంకెవరూ కనిపించట్లేదు. ఇజ్రాయెల్‌లో కాస్తంత భిన్నమైన వాతావరణం కని్పంచింది. ఇరాన్‌ను సుదూరంగా ఉన్న ఇజ్రాయెల్‌ పట్టణాల్లో పౌరసంచారాన్ని స్థానిక యంత్రాంగం అనుమతించింది. ‘‘ మా ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకోవడమే ఇరాన్‌పై విజయానికి ప్రబల నిదర్శనం’’ అని ఇజ్రాయెల్‌ రక్షణమంత్రి ‘ఇజ్రాయెల్‌ కట్జ్‌’ అన్నారు. ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ లక్ష్యంగా నెరవేరేదాకా ఇరాన్‌తో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేశారు.

Who is Sanjay Verma whom Sonam Raghuvanshi Called 119 Times5
‘హనీమూన్‌’ కేసు: బిగ్‌ ట్విస్ట్‌.. సంజయ్‌వర్మ మరెవరో కాదు..

మీరట్‌: మధ్యప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌లు వివాహమయ్యాక హనీమూన్‌ కోసం మేఘాలకు వెళ్లారు. అక్కడ వారిద్దరూ అదృశ్యమయ్యారు. కొద్దిరోజులకు ఒక లోయలో రఘువంశీ మృతదేహం లభ్యమయ్యింది. ఇంతలో సోనమ్‌ తాను భర్తను హత్య చేశానంటూ పోలీసులకు లొంగిపోయింది. పోలీసుల దర్యాప్తులో సోనమ్‌ ప్రియుడు రాజ్‌ కుష్వాహా హస్తం ఈ హత్య కేసులో ఉందని తేలింది. కేసు దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.సోనమ్ తన వివాహానికి ముందు, ఆ తరువాత సంజయ్ వర్మ అనే వ్యక్తికి 200 కి పైగా కాల్స్ చేయడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో సోనమ్‌కు సంజయ్ వర్మతోనూ సంబంధం ఉందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే కేసు దర్యాప్తు చేస్తున్న మేఘాలయ పోలీసులు.. సంజయ్‌ వర్మ మరెవరో కాదని, సోనమ్‌ ప్రేమికుడు రాజ్ కుష్వాహానే అని తేల్చారు. సోనమ్.. రాజ్ నంబర్‌ను ‘సంజయ్ వర్మ’ పేరుతో సేవ్‌ చేసింది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు అలా చేసిందని పోలీసులు భావిస్తున్నారు. సోనమ్, సంజయ్‌ల మధ్య 39 రోజుల వ్యవధిలో 239 కాల్స్ నడిచాయి. అయితే సంజయ్ మొబైల్ నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్‌లో ఉందని పోలీసులు చెబుతున్నారు. తాజాగా సోనమ్ సోదరుడు గోవింద్ తనకు సంజయ్ అనే వ్యక్తితో పరిచయం లేదన్నారు. మేఘాలయ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘డొక్కు బస్సుల్లో పంపిస్తారా?’.. ఇరాన్‌ విద్యార్థుల ఆగ్రహం

Setback for Hindupur MLA Nandamuri Balakrishna, Villagers Resolve to Shut Liquor Shop6
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!

శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఎదురుదెబ్బ తగిలింది. తమ ప్రాంతంలో మద్యం బెల్టు షాపు తీసేయాలని హిందూపురం మండలం ముదిరెడ్డిపల్లి గ్రామస్తుల తీర్మానం చేశారు. విచ్చలవిడిగా మద్యం విక్రయాల వల్ల బయటకు రాలేకపోతున్నామని మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్టు షాపు తొలగించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మందుబాబుల ఆగడాలపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించాలని ముద్దిరెడ్డిపల్లి వాసులు విజ్ఞప్తి చేశారు.

Abhishek Bachchan Sher Everything Give To Her Post7
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్‌ బచ్చన్‌

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్( Abhishek Bachchan) నటించిన కొత్త సినిమా హౌస్‌ఫుల్ 5 కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. ఆయన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను పొందుతోంది. ఇంతలో, ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది. ప్రియమైన వారికోసం అన్నీ ఇచ్చేశానంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో కుటుంబ సమస్యల వల్ల ఆయన ఇలాంటి పోస్ట్‌ చేశారా అంటూ నెటిజన్లు సందేహిస్తున్నారు. కొంతకాలంగా నటి ఐశ్వర్యరాయ్‌( Aishwarya Rai)- అభిషేక్ బచ్చన్‌ల విడాకుల వార్తలు వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆయన చేసిన పోస్ట్‌ మరింత బలాన్ని ఇచ్చేలా ఉంది.అభిషేక్‌ బచ్చన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రోజువారీ జీవితంలో ఎదురయ్యే బాధ్యతల మీద మాత్రమే దృష్టి పెట్టడం కంటే, అంతర్గత ఆనందం గురించి ఆలోచించడం ఎంత కీలకమో ఆయన నొక్కి చెప్పారు. ' నేను మరోసారి ఒంటిరిగా ఉండాలని ఉంది. నా కోసం నేను కొంత సమయం కేటాయించుకోవాలనిపిస్తుంది. ఈ జనసమూహం నుంచి దూరంగా ఉంటూ నన్ను నేను వెతుక్కోవాలనుకుంటున్నాను. నా ప్రియమైన వారికోసం అన్నీ ఇచ్చేశాను. ఇప్పుడు నాకూ కొంత సమయం కావాలి. నా గురించి నేను తెలుసుకునేందుకు ఒంటరిగా ఉండాలని ఉంది.' అంటూ హిందీలో రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలు ఉన్నాయి: పురందేశ్వరి)నెటిజన్లు అభిషేక్‌ బచ్చన్‌ పోస్ట్‌పై ఇలా కామెంట్లు చేస్తున్నారు. మిస్ ఇండియాను వివాహం చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి సంతోషంగా లేడు అంటే ఏమిటి..? సంతోషానికి కొలమానం ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరొక వ్యక్తి సలహా ఇచ్చాడు- 'సార్, మీ భార్య, పిల్లలతో కొంత సమయం గడపండి, మీరు మంచిగా రీసెట్‌ అవుతారు.' అంటూ పేర్కొన్నాడు.సుమారు 17 ఏళ్ల క్రితం అభిషేక్‌ - ఐశ్వర్యలకు వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరికి ఆరాధ్య(15) అనే కుమార్తె ఉంది. ఈ జంట విడాకులు తీసుకోనున్నారంటూ గత కొంతకాలంగా పలు కథనాలు వైరల్‌ అయ్యాయి. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని వీరిద్దరూ ఇప్పటికే పరోక్షంగా స్పందించారు. అయినప్పటికీ ఆ వార్తల ప్రచారం ఆగలేదు. ఇప్పుడు అభిషేక్‌ షేర్‌ చేసిన పోస్ట్‌తో మరోసారి విడాకుల అంశం తెరపైకి వచ్చింది.

110 Indian Students Evacuated from Iran, Lands in Delhi8
ఉద్రిక్తతల వేళ.. ఇరాన్‌ నుంచి ఢిల్లీకి 110 మంది భారత విద్యార్థులు

న్యూఢిల్లీ: ఇరాన్‌లో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో అక్కడ చిక్కుకుపోయిన 110 మంది భారతీయ విద్యార్థుల తొలి బృందం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ విద్యార్థులలో 90 మంది జమ్ముకశ్మీర్‌కు చెందినవారు. ఇరాన్‌లోని ఉర్మియా మెడికల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల తొలి బృందం అర్మేనియా, దోహాల మీదుగా తరలివచ్చింది. నిన్న(బుధవారం) సాయంత్రం వారు ఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కారు.ఇరాన్ ప్రస్తుతం ఇజ్రాయెల్‌ దాడులతో అట్టుడుకుతోంది. అక్కడి భారతీయ విద్యార్థులు తమ తరలింపునకు భారత ప్రభుత్వ సహాయం కోరుతున్నారు. ఈ విషయమై కశ్మీర్‌లో భారీ నిరసనలు కూడా జరిగాయి. ఇరాన్‌లో 13 వేలకుపైగా భారతీయ విద్యార్థులు ఉన్నారని, వీరిలో అధికశాతం వైద్య విద్య చదువుతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. భారతీయ విద్యార్థులను సకాలంలో తరలించినందుకు జమ్ముకశ్మీర్ విద్యార్థుల సంఘం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపింది.విద్యార్థుల కోసం ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు వెళ్లే విమానంతో సహా అన్ని విమాన టిక్కెట్లను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించిందని విద్యార్థుల సంఘం ‘ఎక్స్‌’లో తెలిపింది. ఇరాన్‌లో భారతీయ విద్యార్థులతో పాటు, పలువురు పర్యాటకులు కూడా చిక్కుకుపోయారు. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసి, అక్కడి భారతీయులను వెంటనే టెహ్రాన్‌ను ఖాళీ చేయాలని కోరింది. టెల్ అవీవ్(ఇజ్రాయెల్‌).. ఇరాన్ అణు కేంద్రాలపై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించిన దరిమిలా ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.ఇది కూడా చదవండి: ఇరాన్‌పై దాడి ప్లాన్‌కు ట్రంప్‌ గ్రీన్‌ సిగ్నల్‌?

SEBI approved framework for the voluntary delisting of PSUs9
పీఎస్‌యూల డీలిస్టింగ్‌ సరళతరం

ప్రభుత్వ రంగ సంస్థలు స్వచ్ఛందంగా డీలిస్ట్‌ అయ్యేందుకు వెసులుబాటు కల్పించేలా నిబంధనలను సడలించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రమోటర్‌ షేర్‌హోల్డింగ్‌ 90 శాతానికి చేరితేనే డీలిస్టింగ్‌ విజయవంతమైనట్లవుతుంది. దీని కోసం షేరు కనీస ధరను 60 రోజుల సగటు రేటు, గత 26 వారాల్లో గరిష్ట ధర తదితర అంశాల ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు. అయితే, బుక్‌ వేల్యూ తక్కువగా ఉన్నా లేక ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా గానీ మార్కెట్‌లో రేటు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ విధానంతో డీలిస్టింగ్‌ ప్రక్రియ పీఎస్‌యూలకు చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది.ఈ నేపథ్యంలోనే 90 శాతం పైగా ప్రభుత్వ వాటాలున్న పీఎస్‌యూల స్వచ్ఛంద డీలిస్టింగ్‌కి సంబంధించి కనీస ధరను లెక్కించే విధానాన్ని, మూడింట రెండొంతుల మంది పబ్లిక్‌ షేర్‌హోల్డర్లు ఆమోదం తెలపాలన్న నిబంధనను సడలించాలని సెబీ భావిస్తోంది. మరోవైపు, కేవలం భారతీయ ప్రభుత్వ బాండ్లలోనే ఇన్వెస్ట్‌ చేసే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) పాటించాల్సిన నిబంధనలను సడలించాలని చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే సారథ్యంలో జరిగిన రెండో బోర్డు మీటింగ్‌లో నిర్ణయించింది. స్టార్టప్‌ వ్యవస్థాపకులకు ఊరట..పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లాలనుకునే అంకుర సంస్థల వ్యవస్థాపకులకు ఊరటనిచ్చే ప్రతిపాదనకు సెబీ ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ఐపీవో ప్రాథమిక పత్రాలను దాఖలు చేయడానికి కనీసం ఒక్క ఏడాది ముందు కేటాయించిన ఎసాప్స్‌ను (ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్లు) వారు అట్టే పెట్టుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఐపీవోకెళ్లే సమయంలో ఎసాప్స్‌ సహా ఇతరత్రా షేర్ల కేటాయింపు రూపంలో ప్రయోజనాలేవీ అంకురాల ప్రమోటర్ల వద్ద ఉండకూడదు. ఒకవేళ ఉంటే, వాటిని ఐపీవోకి ముందుగానే విక్రయించాలి.ఇదీ చదవండి: ‘ఆరు నెలల్లో అంతా తేల్చేస్తాం..’విదేశాల నుంచి భారత్‌కు తమ ప్రధాన కార్యాలయాన్ని మార్చుకోవాలనుకుంటున్న సంస్థలకు తాజా సడలింపు ఉపయోగపడనుంది. అటు ఎన్‌ఎస్‌ఈఎల్‌ పేమెంట్‌ సంక్షోభంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలు ఎదుర్కొన్న నిర్దిష్ట స్టాక్‌ బ్రోకర్ల కోసం సెటిల్మెంట్‌ స్కీమును ప్రవేశపెట్టినట్లు సెబీ తెలిపింది. ఈ స్కీమును ఎంచుకోవడం ద్వారా తమపై ఉన్న పెండింగ్‌ కేసులను పరిష్కరించుకునేందుకు వారికి వీలుంటుంది. ఇక, ఐపీవో పత్రాల ఫైలింగ్‌కు ముందు కీలక మేనేజ్‌మెంట్‌ సిబ్బంది, ప్రస్తుత ఉద్యోగులు, డైరెక్టర్లు దగ్గర షేర్లు డీమ్యాట్‌ రూపంలో ఉండాలనే ప్రతిపాదనకు కూడా సెబీ ఆమోదముద్ర వేసింది.

Dehydration: Causes Symptoms Treatment and Prevention10
సైలెంట్‌ డీ హైడ్రేషన్‌..! హెచ్చరిస్తున్న వైద్యులు

‘మీకు డీహైడ్రేషన్‌ సమస్య ఉంది.. అనగానే చాలా మంది ‘నేను బాగానే నీరు తాగుతున్నా కదా అంటారు అయితే అది కొందరి అపోహ. నీరు మాత్రమే తాగితే సరిపోదు అని వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు ఆలివ్‌ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్‌ ఫిజిషియన్‌ డా.అబ్దుల్‌ మజిద్‌ ఖాన్‌. నగరంలో వాతావరణ మార్పులకు అతీతంగా వేధిస్తున్న డీహైడ్రేషన్‌ సమస్య గురించి వైద్యులు ఏం చెబుతున్నారంటే.. ఎండలు మండే సీజన్‌లో డీహైడ్రేషన్‌ సమస్య గురించి తరచూ చర్చిస్తుండటం సహజం.. అయితే కాలాలకు అతీతంగా ఈ డీహైడ్రేషన్‌కు గురయ్యే వారి సంఖ్య ఎక్కువే ఉంటోంది అంటున్నారు భాగ్యనగరం వైద్యులు. దీనికి కారణాల్లో తగినంత నీరు తాగకపోవడం ప్రధాన కారణమైతే.. విభిన్న రకాల జీవనశైలి అలవాట్లు కూడా మరో కారణంగా చెబుతున్నారు. టీ, కాఫీ, ఆల్కహాల్‌ వంటి పానీయాలతో పాటు ఎనర్జీ డ్రింక్స్‌ కూడా శరీరంలో ద్రవనష్టాలకు కారణంగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఇవన్నీ సిటిజనుల్ని సైలెంట్‌ డీహైడ్రేషన్‌కి గురిచేస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. అలాగే వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులు సైతం డీహైడ్రేషన్‌ ముప్పును తెస్తున్నాయన్నారు. నీరు తాగితే చాలదు.. హైడ్రేషన్‌ అంటే కోల్పోయిన నీటిని పొందడం మాత్రమే అనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే శరీరం ద్రవాలను మాత్రమే కాకుండా, మరిన్నింటిని కూడా పునరుద్ధరించాల్సి ఉంటుందని అంటున్నారు వైద్యులు. దీనినే ఫ్లూయిడ్స్, ఎలక్ట్రొలైట్స్, ఎనర్జీ(ఎఫ్‌ఇఇ) ఈక్వేషన్‌ అని పిలుస్తారు. ఉక్కపోత నుంచి అతి వ్యాయమం వరకూ.. వీటి వల్ల శరీరం సోడియం, పొటాషియం, మెగ్నిషియం మొదలైన ఎలక్ట్రోలైట్‌లను గ్లూకోజ్‌ను కోల్పోతుంది. గుండె లయ, నరాల సంకేతాలు, కండరాల కదలిక మానసిక ఆరోగ్యానికి కూడా ఇవి చాలా ముఖ్యమైనవి. అయితే కేవలం కోల్పోయిన నీటి భర్తీ వల్ల ఈ సమతుల్యత పునరుద్ధరించడం జరగదు. సాదా నీటిపై మాత్రమే ఆధారపడి ఊరుకుంటే సమస్య మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉంది. ఆహారమూ కీలకమే.. మన ఆహారంలో తరచూ ఊరగాయలు, పాపడ్స్‌ ఉప్పగా ఉండే స్నాక్స్‌ ఉంటాయి. అవి కూడా ద్రవనష్టానికి దారి తీస్తాయి. కండరాల సంకోచాలు, నరాల పనితీరు హైడ్రేషన్‌ను నియంత్రించడానికి కీలకమైన ఖనిజం పొటాషియం. మన దేశంలో పోషకాహార ధోరణులపై జరిపిన అధ్యయనం ప్రకారం, ప్రతి ఐదుగురిలో ఒకరికి పొటాషియం లోపం ఉంది. వేసవిలో పొటాషియం, సోడియం అసమతుల్యత మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అరటిపండ్లు, ఆకుకూరలు, పప్పులు, నారింజ లేత కొబ్బరి వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను అత్యంత తక్కువగా తీసుకుంటారు. ఐసిఎంఆర్‌ ప్రకారం, ఈ ఆహారాలు మన ఉత్తమ సహజ వనరులు అని గుర్తించింది. సూచనలు: ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్‌ గ్లూకోజ్‌. మూడింటి మేళవింపుగా లభించే రెడీ–టు–డ్రింక్‌ ఎలక్ట్రోలైట్‌ సొల్యూషన్స్‌ ఆదరణ పొందుతున్నాయి. సరైనవి ఎంచుకోవచ్చు. డీహైడ్రేటింగ్‌కు కారణమయ్యే టీ, కాఫీ వంటి కెఫిన్‌ కలిగిన పానీయాలు, అలాగే ఆల్కహాల్, ఎరేటెడ్‌ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ తీసుకోవడం తగ్గించండి. డీహైడ్రేషన్‌ వల్ల కండరాల తిమ్మిరి, నోరు పొడిబారడం, తలనొప్పి, అలసట లేదా మైకం లాంటివి కలుగుతుంటే విస్మరించవద్దు. వెంటనే లవణాలు గ్లూకోజ్‌ రెండింటినీ కలిగి ఉన్న హైడ్రేషన్‌ ద్రావణాన్ని తీసుకోండి విరేచనాలు వంటి తీవ్ర లక్షణాలు లేకుండానే శరీరాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిని నిశ్శబ్ద డీహైడ్రేషన్‌ అని పిలుస్తారు.– డా.అబ్దుల్‌ మజిద్‌ ఖాన్, కన్సల్టెంట్‌ ఫిజీషియన్, ఆలివ్‌ హాస్పిటల్‌ (చదవండి: '4ఏ మోడల్‌'తో ఒత్తిడిని జయిద్దాం ఇలా..!)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement