ప్రధాన వార్తలు

టీడీపీ, ఎల్లో మీడియాలతో యుద్ధం చేస్తున్నాం: ప్రెస్ మీట్లో వైఎస్ జగన్
సాక్షి,గుంటూరు: రాష్ట్రంలో జరగుతున్న పరిణామాలపై టీడీపీ, ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడే పల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు.రాష్ట్రంలో దిగజారిన లాండ్ ఆర్డర్, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోంది. చంద్రబాబు అరాచక పాలనకు వ్యతిరేకంగా మే4న ప్రజలు, వైఎస్సార్పీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేశారు. టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్లా. బుధవారం కర్ఫ్యూలాంటి పరిస్థితుల మధ్య నా రెంటపాళ్ల పర్యటన జరిగింది. అయినా విజయవంతమైంది. మా పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా? మొన్నటి పొదిలి పర్యటనలో 40వేల మందిపై రాళ్లేసే ప్రయత్నం చేశారు. రైతులు సంయమనం పాటించారు. అయినా కేసులు పెట్టారు. రైతుల సమస్యల గురించి ఎవరూ మాట్లాడకూడదు. సంఘీభావం తెలపకూడదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు భయం ఎందుకు?చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. ఓ టీవీ ఛానెల్లో చంద్రబాబు అహంకార మాటలు వినండి. ప్రతిపక్షను భూస్థాపితం చేస్తారట. ప్రశ్నిస్తున్న వ్యక్తిని భూస్థాపితం చేస్తారా?. ఏడాది కాలంలోనే ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో చంద్రబాబు పాలనపై అసహనం పెరిగింది. ఆ అసహనాన్ని డైవర్ట్ చేస్తూ వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై, నేతలపై కేసులు పెడుతున్నారు. టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి అరెస్ట్ నిజంగా అశ్చర్యకరం. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని గన్మెన్ను బలవంతం చేశారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనందుకు గన్మెన్పై దాడి కూడా చేశారు. తనపై జరిగిన దాడిని గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీకి గన్మెన్ లేఖ రాశారు. మరో గన్మెన్ను ప్రలోభాలకు గురిచేసి వారికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు.. అరెస్టులు చెవిరెడ్డితో పాటు ఆయన కొడుకును కేసులో ఇరికించారు. సొంత నియోజవకర్గంలో గెలవలేని వ్యక్తి. చంద్రగిరిలో ఇబ్బంది ఉండకూడదనే చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకొచ్చాం. మళ్లీ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. సురేష్ భార్యపైనా కేసులు పెట్టారు. వల్లభనేని వంశీపై 11 కేసులు పెట్టారు. జోగి రమేష్ కొడుకు, కాకాణిపై తప్పుడు కేసులు. కృష్ణమోహన్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డిపైనా అక్రమ కేసులు పెట్టారు. కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్నినాని, వైవి సుబ్బారెడ్డి,ఆయన కుమారుడిపై తప్పుడు కేసులు. దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే,అంబటి రాంబాబు, విడదల రజినిపై తప్పుడు కేసులు దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పైనా అక్రమ కేసులు. బూచేపల్లి శివప్రసాద్రెడ్డిపై, ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్, గోరంట్ల మాధవ్పై కేసులు. ఇలా వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొమ్మినేని ఏం పాపం చేశారు చంద్రబాబు?సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఏం పాపం చేశారు? ఏం చేశారని కొమ్మినేనిని అరెస్ట్ చేశారు?టీవీ డిబెట్లో అనలిస్ట్ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధం? గతంలో కేఎస్ఆర్ ఉద్యోగాన్ని చంద్రబాబు ఊడగొట్టించారు. కేఎస్ఆర్ అరెస్ట్ అక్రమమేనన్న సుప్రీంకోర్టు.. తనకున్న విచక్షణాధికారాల్ని ఉపయోగించి ఆయన్ను వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలించింది. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టులాంటిది.

Air India crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దెబ్బతిన్న బ్లాక్ బాక్స్
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ (Air India Boeing 787-8 Dreamliner) విమాన ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 12న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి గల కారణాల్ని వెలికి తీసే బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.అయితే, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దెబ్బతిన్న బ్లాక్ బాక్స్ నుంచి వివరాల్ని సేకరించేందుకు కేంద్రం అమెరికాకు తరలించినట్లు సమాచారం. తాజా బ్లాక్ బాక్స్ పరిణామంపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.ఏప్రిల్ 12న అహ్మదాబాద్ నుంచి ఎయిరిండియా 787 డ్రీమ్లైనర్ విమానం 242 మందితో లండన్ బయల్దేరింది. కానీ, ఆ విమానం నేల మీద నుంచి పైకి లేచిన కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఘోరమైన తప్పు ఏదో జరిగింది. విమానంలో తీవ్ర ఇబ్బంది తలెత్తింది. అందులో నుంచి ఒక మేడే కాల్ వెళ్లింది. అంతలోనే రద్దీగా ఉండే మేఘానీనగర్ బీజే మెడికల్ కాలేజీ ప్రధాన క్యాంపస్పై కప్పు మీద ఆ విమానం కూలిపోయి (air india crash video) అగ్ని గుండంలా మారింది. విమానంలోని మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ తప్ప మిగిలిన వారందరినీ అగ్ని దహించివేసింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారితో పాటు బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్లో బాధితుల్ని కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది.ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యులు బాధిత కుటుంబ సభ్యుల డీఎన్ఏ ఆధారంగా మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. ఘటనా స్థలంలో మృతదేహాలను డీఎన్ఏతో మ్యాచ్ చేసి చూస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వ వైద్యులు మృతదేహాల్ని ఎనాలసిస్ చేసి మొత్తం 208 మృతదేహాల్ని గుర్తించారు. అలా ఇప్పటి వరకు (ఏప్రిల్ 18) ఉన్న సమాచారం ప్రకారం.. 170 మృతదేహాల్ని డీఎన్ఏతో గుర్తించారు. వారిలో యూకే, ఫోర్చుగల్,కెనడాతో పాటు ప్రమాదంలో మరణించిన మరో ఆరుగురు మృత దేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు.

ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ..!
భారత క్రికెట్ జట్టు రేపటి నుంచి (జూన్ 20) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ను (2025-27) ప్రారంభిస్తుంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ రేపటి నుంచి మొదలవుతుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ హెడింగ్లేలోని లీడ్స్లో జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకున్నాయి. ఇంగ్లండ్ ఇదివరకే తుది జట్టును ప్రకటించింది. భారత్ కూడా తుది జట్టుపై క్లారిటీ ఇచ్చేసింది. రోహిత్, విరాట్, అశ్విన్ల రిటైర్మెంట్ తర్వాత యంగ్ ఇండియా ఎదుర్కోబోయే తొలి అగ్నిపరీక్ష ఇదే.ఈ సిరీస్తో శుభ్మన్ గిల్ టీమిండియా కెప్టెన్గా తన ప్రస్థానాన్ని మొదలుపెడతాడు. భారత తుది జట్టులో చాలా మార్పులకు అవకాశం ఉంది. యువ ఆటగాడు సాయి సుదర్శన్ అరంగేట్రం దాదాపుగా ఖరారైపోయింది. బ్యాటింగ్ స్థానాలపై కూడా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ నిన్నటి ప్రెస్ మీట్లో క్లారిటీ ఇచ్చాడు. నాలుగో స్థానంలో గిల్, ఐదో ప్లేస్తో తను బ్యాటింగ్కు దిగుతామని పంత్ వెల్లడించాడు.ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్.. వన్డౌన్లో సాయి సుదర్శన్ పేర్లు కూడా దాదాపుగా ఖరారైపోయాయి. ఆరో స్థానంపై కూడా టీమిండియా మేనేజ్మెంట్కు నిన్నటి వరకు ఎలాంటి అనుమానం లేకుండింది. 8 ఏళ్ల తర్వాత భారత టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఈ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని మేనేజ్మెంట్ సూచనప్రాయంగా వెల్లడించింది.The incident where Karun Nair got hit at the nets by a delivery from @prasidh43 @RohanDC98 #ENGvsIND #Headingley pic.twitter.com/xGMsiSF8PA— RevSportz Global (@RevSportzGlobal) June 18, 2025అయితే నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్లో టీమిండియాకు ఓ ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తుంది. దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించి టీమిండియా తలుపులు తట్టిన కరుణ్ నాయర్ నెట్స్ గాయపడ్డాడని ప్రచారం జరుగుతుంది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్ను ఎదుర్కోబోయి కరుణ్ పక్కటెముకల్లో దెబ్బ తగిలించుకున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. ఒకవేళ నిజంగానే కరుణ్ గాయపడినట్లైతే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలనట్లవుతుంది. కరుణ్ ఇటీవల ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించి జోరుమీదున్నాడు. అతని గాయం తీవ్రమైందైతే తుది జట్టులో అతని స్థానం గల్లంతైనట్లే. ఇది టీమిండియా బ్యాటింగ్ కూర్పును భారీగా ప్రభావితం చేస్తుంది. ఆరో స్థానం కోసం మేనేజ్మెంట్ మరో ఆప్షన్ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్థానం కోసం ప్రత్యామ్నాయ ఆటగాడిగా ధృవ్ జురెల్ అందుబాటులో ఉన్నప్పటికీ.. అతను మ్యాచ్ కోసం సిద్దంగా ఉండకపోవచ్చు. కరుణ్కు ప్రత్యామ్నాయంగా ఆల్రౌండర్తో ముందుకు వెళ్లాలనుకుంటే కూడా వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉన్నాడు. కరుణ్ గాయం తీవ్రమైందైతేనే ఈ ఈక్వేషన్స్ అన్నిటికీ ఆస్కారం ఉంటుంది. సోషల్మీడియాలోని మరో వర్గం కరుణ్ గాయాన్ని కొట్టిపారేస్తుంది. అతని గాయం తీవ్రమైంది కాదని అంటుంది. తొలి టెస్ట్లో కరుణ్ తప్పక ఆడతాడని చెబుతుంది. ఈ విషయమై మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత తుది జట్టు (అంచనా).. యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి/శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణ/అర్షదీప్ సింగ్టీమిండియాతో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.

ఇరాన్ దెబ్బ అదుర్స్.. ఇజ్రాయెల్కు భారీ ఎదురుదెబ్బ
టెహ్రాన్/టెవీ అవీవ్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు వైపుల నుంచి బాంబు దాడులు పీక్ స్టేజ్ చేరుకున్నాయి. ఇజ్రాయెల్పూ ఇరాన్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ ప్రయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణుల కారణంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. ఇజ్రాయెల్లోని ఆసుపత్రులు, స్కూల్స్, నివాస ప్రాంతాల్లోకి ఇరాన్ క్షిపణులు దూసుకెళ్లాయి. దీంతో, భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది.తాజాగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో బీభత్సం సృష్టించాయి. టెలీ అవీవ్, రామత్గాన్, హోలోన్, బెర్జీబా నగరాలపై ఇరాన్ విరుచుకుపడింది. దీంతో, భయానక వాతావరణం నెలకొంది. బీర్షెబాలోని సోరోకా ఆసుప్రతిపై ఇరాన్ దాడి చేయడంతో భవనం పూర్తిగా దెబ్బతింది. అనంతరం, ఆసుపత్రిలో ఉన్న పేషంట్స్, వైద్యులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. అత్యవసర బృందాలు స్పందించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలు వైరల్గా మారాయి.మరోవైపు.. ఇజ్రాయెల్లోని హోలోన్ ప్రాంతంలో నివాసాలపై ఇరాన్ దాడులకు తెగబడింది. ఈ క్రమంలో పలువురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. దక్షిణ ఇజ్రాయెల్లోని ప్రధాన, అతిపెద్ద ఆసుపత్రిపై ఇరాన్ దాడులు చేయడంతో భారీ నష్టం జరిగిందని చెప్పుకొచ్చింది. ఇజ్రాయోల్ రాజధాని టెలి అవీవ్లోని బహుళ అంతస్తు భవనాలపై క్షిపణి దాడులు జరగడంతో అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. 🚨 🚨 🚨 SOROKA HOSPITAL IN ISRAEL HIT BY IRANIAN BALLISTIC MISSILE pic.twitter.com/xK2HBPSeeV— Breaking911 (@Breaking911) June 19, 2025అంతకుముందు.. ఇరాన్ సైనిక సామర్థ్యం అణ్వస్త్ర స్థాయికి చేరకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా దాడులతో దండయాత్ర చేస్తున్న ఇజ్రాయెల్ బుధవారం తన బాంబుల కుంభవృష్టిని కురిపించింది. ఇరాన్లోని 40 కీలక ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. యురేనియం శుద్ధి ప్రక్రియలో కీలకమైన సెంట్రీఫ్యూజ్లను తయారుచేసే కర్మాగారంపై భీకరస్థాయిలో మిస్సైళ్లను ప్రయోగించింది. ఇరాన్ సాయుధశక్తిని నిర్వీర్యం చేసేందుకు క్షిపణుల ఉత్పత్తి ఆయుధ ప్లాంట్లపైనా ఇజ్రాయెల్ వందల కొద్దీ డ్రోన్లను ఎక్కుపెట్టింది.🚨The recent rocket barrage by the Iranian regime hit a hospital in Southern Israel By the order of Khamenei, who specifically instructed to aim for civilian populations and hospitals.And you still ask why we don’t want them to have nuclear weapons…👇 pic.twitter.com/m2CuAxeFcn— Voice From The East (@EasternVoices) June 19, 2025ఇరాన్ అంతర్గత భద్రత శాఖ ప్రధాన కార్యాలయంపైనా యుద్ధవిమానాలు దాడులు చేశాయి. ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ భూభాగాలపై క్షిపణులను పేలుస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. ఇరాన్ జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా 24 మంది చనిపోయారు. బుధవారం తమవైపు దూసుకొచ్చిన 10 క్షిపణులను నేలకూల్చామని ఇజ్రాయెల్ పేర్కొంది. జవాదాబాద్లో అత్యాధునిక ఎఫ్–35 యుద్ధవిమానాన్ని ఇరాన్ సేనలు పేల్చేశాయి. దాదాపు రూ.140 కోట్ల విలువైన హెర్మెస్ డ్రోన్నూ నేలకూల్చాయి. అత్యంత శక్తివంతమైన ఫతాహ్ హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించామని ఇరాన్ ప్రకటించింది. అయితే తమదేశంలో శుక్రవారం నుంచి ఇప్పటిదాకా 15,871 చోట్ల నిర్మాణాలు, దాదాపు 1,300 వాహనాలు, 1,633 ఆస్తులు నాశనమయ్యాయని ఇజ్రాయెల్ బుధవారం ఒప్పుకుంది.ఇరాన్లో భయానక నిశ్శబ్దం ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా వరకు ధ్వంసంకావడంతో ఎప్పుడు ఎటు నుంచి ఇజ్రాయెల్ క్షిపణులు మీదొచ్చి పడతాయోనన్న భయాలు ఇరాన్ ప్రజల్లో కనిపించాయి. చాలా నగరాలు, పట్టణాల్లో దుకాణాలు, ఆఫీస్లు, స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. సురక్షిత ప్రాంతాలకు నిత్యావసర సామగ్రితో వలసవెళ్లేవాళ్లు తప్పితే రోడ్లపై ఇంకెవరూ కనిపించట్లేదు. ఇజ్రాయెల్లో కాస్తంత భిన్నమైన వాతావరణం కని్పంచింది. ఇరాన్ను సుదూరంగా ఉన్న ఇజ్రాయెల్ పట్టణాల్లో పౌరసంచారాన్ని స్థానిక యంత్రాంగం అనుమతించింది. ‘‘ మా ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకోవడమే ఇరాన్పై విజయానికి ప్రబల నిదర్శనం’’ అని ఇజ్రాయెల్ రక్షణమంత్రి ‘ఇజ్రాయెల్ కట్జ్’ అన్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యంగా నెరవేరేదాకా ఇరాన్తో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేశారు.

‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
మీరట్: మధ్యప్రదేశ్లోని మీరట్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్లు వివాహమయ్యాక హనీమూన్ కోసం మేఘాలకు వెళ్లారు. అక్కడ వారిద్దరూ అదృశ్యమయ్యారు. కొద్దిరోజులకు ఒక లోయలో రఘువంశీ మృతదేహం లభ్యమయ్యింది. ఇంతలో సోనమ్ తాను భర్తను హత్య చేశానంటూ పోలీసులకు లొంగిపోయింది. పోలీసుల దర్యాప్తులో సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా హస్తం ఈ హత్య కేసులో ఉందని తేలింది. కేసు దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.సోనమ్ తన వివాహానికి ముందు, ఆ తరువాత సంజయ్ వర్మ అనే వ్యక్తికి 200 కి పైగా కాల్స్ చేయడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో సోనమ్కు సంజయ్ వర్మతోనూ సంబంధం ఉందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే కేసు దర్యాప్తు చేస్తున్న మేఘాలయ పోలీసులు.. సంజయ్ వర్మ మరెవరో కాదని, సోనమ్ ప్రేమికుడు రాజ్ కుష్వాహానే అని తేల్చారు. సోనమ్.. రాజ్ నంబర్ను ‘సంజయ్ వర్మ’ పేరుతో సేవ్ చేసింది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు అలా చేసిందని పోలీసులు భావిస్తున్నారు. సోనమ్, సంజయ్ల మధ్య 39 రోజుల వ్యవధిలో 239 కాల్స్ నడిచాయి. అయితే సంజయ్ మొబైల్ నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్లో ఉందని పోలీసులు చెబుతున్నారు. తాజాగా సోనమ్ సోదరుడు గోవింద్ తనకు సంజయ్ అనే వ్యక్తితో పరిచయం లేదన్నారు. మేఘాలయ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘డొక్కు బస్సుల్లో పంపిస్తారా?’.. ఇరాన్ విద్యార్థుల ఆగ్రహం

టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఎదురుదెబ్బ తగిలింది. తమ ప్రాంతంలో మద్యం బెల్టు షాపు తీసేయాలని హిందూపురం మండలం ముదిరెడ్డిపల్లి గ్రామస్తుల తీర్మానం చేశారు. విచ్చలవిడిగా మద్యం విక్రయాల వల్ల బయటకు రాలేకపోతున్నామని మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్టు షాపు తొలగించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మందుబాబుల ఆగడాలపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించాలని ముద్దిరెడ్డిపల్లి వాసులు విజ్ఞప్తి చేశారు.

వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్( Abhishek Bachchan) నటించిన కొత్త సినిమా హౌస్ఫుల్ 5 కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. ఆయన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను పొందుతోంది. ఇంతలో, ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను పంచుకున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ప్రియమైన వారికోసం అన్నీ ఇచ్చేశానంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో కుటుంబ సమస్యల వల్ల ఆయన ఇలాంటి పోస్ట్ చేశారా అంటూ నెటిజన్లు సందేహిస్తున్నారు. కొంతకాలంగా నటి ఐశ్వర్యరాయ్( Aishwarya Rai)- అభిషేక్ బచ్చన్ల విడాకుల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆయన చేసిన పోస్ట్ మరింత బలాన్ని ఇచ్చేలా ఉంది.అభిషేక్ బచ్చన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రోజువారీ జీవితంలో ఎదురయ్యే బాధ్యతల మీద మాత్రమే దృష్టి పెట్టడం కంటే, అంతర్గత ఆనందం గురించి ఆలోచించడం ఎంత కీలకమో ఆయన నొక్కి చెప్పారు. ' నేను మరోసారి ఒంటిరిగా ఉండాలని ఉంది. నా కోసం నేను కొంత సమయం కేటాయించుకోవాలనిపిస్తుంది. ఈ జనసమూహం నుంచి దూరంగా ఉంటూ నన్ను నేను వెతుక్కోవాలనుకుంటున్నాను. నా ప్రియమైన వారికోసం అన్నీ ఇచ్చేశాను. ఇప్పుడు నాకూ కొంత సమయం కావాలి. నా గురించి నేను తెలుసుకునేందుకు ఒంటరిగా ఉండాలని ఉంది.' అంటూ హిందీలో రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలు ఉన్నాయి: పురందేశ్వరి)నెటిజన్లు అభిషేక్ బచ్చన్ పోస్ట్పై ఇలా కామెంట్లు చేస్తున్నారు. మిస్ ఇండియాను వివాహం చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి సంతోషంగా లేడు అంటే ఏమిటి..? సంతోషానికి కొలమానం ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరొక వ్యక్తి సలహా ఇచ్చాడు- 'సార్, మీ భార్య, పిల్లలతో కొంత సమయం గడపండి, మీరు మంచిగా రీసెట్ అవుతారు.' అంటూ పేర్కొన్నాడు.సుమారు 17 ఏళ్ల క్రితం అభిషేక్ - ఐశ్వర్యలకు వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరికి ఆరాధ్య(15) అనే కుమార్తె ఉంది. ఈ జంట విడాకులు తీసుకోనున్నారంటూ గత కొంతకాలంగా పలు కథనాలు వైరల్ అయ్యాయి. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని వీరిద్దరూ ఇప్పటికే పరోక్షంగా స్పందించారు. అయినప్పటికీ ఆ వార్తల ప్రచారం ఆగలేదు. ఇప్పుడు అభిషేక్ షేర్ చేసిన పోస్ట్తో మరోసారి విడాకుల అంశం తెరపైకి వచ్చింది.

ఉద్రిక్తతల వేళ.. ఇరాన్ నుంచి ఢిల్లీకి 110 మంది భారత విద్యార్థులు
న్యూఢిల్లీ: ఇరాన్లో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో అక్కడ చిక్కుకుపోయిన 110 మంది భారతీయ విద్యార్థుల తొలి బృందం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ విద్యార్థులలో 90 మంది జమ్ముకశ్మీర్కు చెందినవారు. ఇరాన్లోని ఉర్మియా మెడికల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల తొలి బృందం అర్మేనియా, దోహాల మీదుగా తరలివచ్చింది. నిన్న(బుధవారం) సాయంత్రం వారు ఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కారు.ఇరాన్ ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడులతో అట్టుడుకుతోంది. అక్కడి భారతీయ విద్యార్థులు తమ తరలింపునకు భారత ప్రభుత్వ సహాయం కోరుతున్నారు. ఈ విషయమై కశ్మీర్లో భారీ నిరసనలు కూడా జరిగాయి. ఇరాన్లో 13 వేలకుపైగా భారతీయ విద్యార్థులు ఉన్నారని, వీరిలో అధికశాతం వైద్య విద్య చదువుతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. భారతీయ విద్యార్థులను సకాలంలో తరలించినందుకు జమ్ముకశ్మీర్ విద్యార్థుల సంఘం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు కృతజ్ఞతలు తెలిపింది.విద్యార్థుల కోసం ఢిల్లీ నుండి శ్రీనగర్కు వెళ్లే విమానంతో సహా అన్ని విమాన టిక్కెట్లను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించిందని విద్యార్థుల సంఘం ‘ఎక్స్’లో తెలిపింది. ఇరాన్లో భారతీయ విద్యార్థులతో పాటు, పలువురు పర్యాటకులు కూడా చిక్కుకుపోయారు. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్లైన్ను ఏర్పాటు చేసి, అక్కడి భారతీయులను వెంటనే టెహ్రాన్ను ఖాళీ చేయాలని కోరింది. టెల్ అవీవ్(ఇజ్రాయెల్).. ఇరాన్ అణు కేంద్రాలపై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించిన దరిమిలా ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.ఇది కూడా చదవండి: ఇరాన్పై దాడి ప్లాన్కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్?

పీఎస్యూల డీలిస్టింగ్ సరళతరం
ప్రభుత్వ రంగ సంస్థలు స్వచ్ఛందంగా డీలిస్ట్ అయ్యేందుకు వెసులుబాటు కల్పించేలా నిబంధనలను సడలించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రమోటర్ షేర్హోల్డింగ్ 90 శాతానికి చేరితేనే డీలిస్టింగ్ విజయవంతమైనట్లవుతుంది. దీని కోసం షేరు కనీస ధరను 60 రోజుల సగటు రేటు, గత 26 వారాల్లో గరిష్ట ధర తదితర అంశాల ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు. అయితే, బుక్ వేల్యూ తక్కువగా ఉన్నా లేక ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా గానీ మార్కెట్లో రేటు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ విధానంతో డీలిస్టింగ్ ప్రక్రియ పీఎస్యూలకు చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది.ఈ నేపథ్యంలోనే 90 శాతం పైగా ప్రభుత్వ వాటాలున్న పీఎస్యూల స్వచ్ఛంద డీలిస్టింగ్కి సంబంధించి కనీస ధరను లెక్కించే విధానాన్ని, మూడింట రెండొంతుల మంది పబ్లిక్ షేర్హోల్డర్లు ఆమోదం తెలపాలన్న నిబంధనను సడలించాలని సెబీ భావిస్తోంది. మరోవైపు, కేవలం భారతీయ ప్రభుత్వ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేసే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) పాటించాల్సిన నిబంధనలను సడలించాలని చైర్మన్ తుహిన్ కాంత పాండే సారథ్యంలో జరిగిన రెండో బోర్డు మీటింగ్లో నిర్ణయించింది. స్టార్టప్ వ్యవస్థాపకులకు ఊరట..పబ్లిక్ ఇష్యూకి వెళ్లాలనుకునే అంకుర సంస్థల వ్యవస్థాపకులకు ఊరటనిచ్చే ప్రతిపాదనకు సెబీ ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ఐపీవో ప్రాథమిక పత్రాలను దాఖలు చేయడానికి కనీసం ఒక్క ఏడాది ముందు కేటాయించిన ఎసాప్స్ను (ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు) వారు అట్టే పెట్టుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఐపీవోకెళ్లే సమయంలో ఎసాప్స్ సహా ఇతరత్రా షేర్ల కేటాయింపు రూపంలో ప్రయోజనాలేవీ అంకురాల ప్రమోటర్ల వద్ద ఉండకూడదు. ఒకవేళ ఉంటే, వాటిని ఐపీవోకి ముందుగానే విక్రయించాలి.ఇదీ చదవండి: ‘ఆరు నెలల్లో అంతా తేల్చేస్తాం..’విదేశాల నుంచి భారత్కు తమ ప్రధాన కార్యాలయాన్ని మార్చుకోవాలనుకుంటున్న సంస్థలకు తాజా సడలింపు ఉపయోగపడనుంది. అటు ఎన్ఎస్ఈఎల్ పేమెంట్ సంక్షోభంలో ఎన్ఫోర్స్మెంట్ చర్యలు ఎదుర్కొన్న నిర్దిష్ట స్టాక్ బ్రోకర్ల కోసం సెటిల్మెంట్ స్కీమును ప్రవేశపెట్టినట్లు సెబీ తెలిపింది. ఈ స్కీమును ఎంచుకోవడం ద్వారా తమపై ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించుకునేందుకు వారికి వీలుంటుంది. ఇక, ఐపీవో పత్రాల ఫైలింగ్కు ముందు కీలక మేనేజ్మెంట్ సిబ్బంది, ప్రస్తుత ఉద్యోగులు, డైరెక్టర్లు దగ్గర షేర్లు డీమ్యాట్ రూపంలో ఉండాలనే ప్రతిపాదనకు కూడా సెబీ ఆమోదముద్ర వేసింది.

సైలెంట్ డీ హైడ్రేషన్..! హెచ్చరిస్తున్న వైద్యులు
‘మీకు డీహైడ్రేషన్ సమస్య ఉంది.. అనగానే చాలా మంది ‘నేను బాగానే నీరు తాగుతున్నా కదా అంటారు అయితే అది కొందరి అపోహ. నీరు మాత్రమే తాగితే సరిపోదు అని వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు ఆలివ్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఫిజిషియన్ డా.అబ్దుల్ మజిద్ ఖాన్. నగరంలో వాతావరణ మార్పులకు అతీతంగా వేధిస్తున్న డీహైడ్రేషన్ సమస్య గురించి వైద్యులు ఏం చెబుతున్నారంటే.. ఎండలు మండే సీజన్లో డీహైడ్రేషన్ సమస్య గురించి తరచూ చర్చిస్తుండటం సహజం.. అయితే కాలాలకు అతీతంగా ఈ డీహైడ్రేషన్కు గురయ్యే వారి సంఖ్య ఎక్కువే ఉంటోంది అంటున్నారు భాగ్యనగరం వైద్యులు. దీనికి కారణాల్లో తగినంత నీరు తాగకపోవడం ప్రధాన కారణమైతే.. విభిన్న రకాల జీవనశైలి అలవాట్లు కూడా మరో కారణంగా చెబుతున్నారు. టీ, కాఫీ, ఆల్కహాల్ వంటి పానీయాలతో పాటు ఎనర్జీ డ్రింక్స్ కూడా శరీరంలో ద్రవనష్టాలకు కారణంగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఇవన్నీ సిటిజనుల్ని సైలెంట్ డీహైడ్రేషన్కి గురిచేస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. అలాగే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు సైతం డీహైడ్రేషన్ ముప్పును తెస్తున్నాయన్నారు. నీరు తాగితే చాలదు.. హైడ్రేషన్ అంటే కోల్పోయిన నీటిని పొందడం మాత్రమే అనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే శరీరం ద్రవాలను మాత్రమే కాకుండా, మరిన్నింటిని కూడా పునరుద్ధరించాల్సి ఉంటుందని అంటున్నారు వైద్యులు. దీనినే ఫ్లూయిడ్స్, ఎలక్ట్రొలైట్స్, ఎనర్జీ(ఎఫ్ఇఇ) ఈక్వేషన్ అని పిలుస్తారు. ఉక్కపోత నుంచి అతి వ్యాయమం వరకూ.. వీటి వల్ల శరీరం సోడియం, పొటాషియం, మెగ్నిషియం మొదలైన ఎలక్ట్రోలైట్లను గ్లూకోజ్ను కోల్పోతుంది. గుండె లయ, నరాల సంకేతాలు, కండరాల కదలిక మానసిక ఆరోగ్యానికి కూడా ఇవి చాలా ముఖ్యమైనవి. అయితే కేవలం కోల్పోయిన నీటి భర్తీ వల్ల ఈ సమతుల్యత పునరుద్ధరించడం జరగదు. సాదా నీటిపై మాత్రమే ఆధారపడి ఊరుకుంటే సమస్య మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉంది. ఆహారమూ కీలకమే.. మన ఆహారంలో తరచూ ఊరగాయలు, పాపడ్స్ ఉప్పగా ఉండే స్నాక్స్ ఉంటాయి. అవి కూడా ద్రవనష్టానికి దారి తీస్తాయి. కండరాల సంకోచాలు, నరాల పనితీరు హైడ్రేషన్ను నియంత్రించడానికి కీలకమైన ఖనిజం పొటాషియం. మన దేశంలో పోషకాహార ధోరణులపై జరిపిన అధ్యయనం ప్రకారం, ప్రతి ఐదుగురిలో ఒకరికి పొటాషియం లోపం ఉంది. వేసవిలో పొటాషియం, సోడియం అసమతుల్యత మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అరటిపండ్లు, ఆకుకూరలు, పప్పులు, నారింజ లేత కొబ్బరి వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను అత్యంత తక్కువగా తీసుకుంటారు. ఐసిఎంఆర్ ప్రకారం, ఈ ఆహారాలు మన ఉత్తమ సహజ వనరులు అని గుర్తించింది. సూచనలు: ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్ గ్లూకోజ్. మూడింటి మేళవింపుగా లభించే రెడీ–టు–డ్రింక్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ ఆదరణ పొందుతున్నాయి. సరైనవి ఎంచుకోవచ్చు. డీహైడ్రేటింగ్కు కారణమయ్యే టీ, కాఫీ వంటి కెఫిన్ కలిగిన పానీయాలు, అలాగే ఆల్కహాల్, ఎరేటెడ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం తగ్గించండి. డీహైడ్రేషన్ వల్ల కండరాల తిమ్మిరి, నోరు పొడిబారడం, తలనొప్పి, అలసట లేదా మైకం లాంటివి కలుగుతుంటే విస్మరించవద్దు. వెంటనే లవణాలు గ్లూకోజ్ రెండింటినీ కలిగి ఉన్న హైడ్రేషన్ ద్రావణాన్ని తీసుకోండి విరేచనాలు వంటి తీవ్ర లక్షణాలు లేకుండానే శరీరాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిని నిశ్శబ్ద డీహైడ్రేషన్ అని పిలుస్తారు.– డా.అబ్దుల్ మజిద్ ఖాన్, కన్సల్టెంట్ ఫిజీషియన్, ఆలివ్ హాస్పిటల్ (చదవండి: '4ఏ మోడల్'తో ఒత్తిడిని జయిద్దాం ఇలా..!)
ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత తుదిజట్టు ఇదే!
భవసాగరం అంటే..
చంద్రబాబు.. ‘సాక్షి’పై దాడులు విచ్చలవిడి రౌడీయిజం కాదా?: వైఎస్ జగన్
క్రికెట్ మ్యాచ్ సందర్భంగా విచిత్ర పరిస్థితి
నటుడు 'ఆర్య' వ్యాపార కార్యాలయాల్లో ఐటీ సోదాలు
పుత్తడి ఈ పూట రేటెంతంటే..
బ్యాటరీ సేవ్ చేసే డిస్ప్లే.. యాపిల్ కసరత్తు
దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య
ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ..!
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలు ఉన్నాయి: పురందేశ్వరి
పెళ్లికి మంచి రోజులు లేవని రూంకు తీసుకెళ్లి..!
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగి
రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ఇలియానా
భర్త పుట్టిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని పిచ్చి పని చేసిన భార్య..!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలలో పురోగతి
అది సరే! ఇక్కడ లక్షలాది మంది రోడ్డెక్కొద్దని ఎవరు చెప్పాలి సర్..!
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
ఏపీలో అమ్మకు కష్టాలు (చిత్రాలు)
సాక్షి కార్టూన్ 18-06-2025
118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు
నా భర్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకుంటావా!
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్ రికార్డు బద్దలు
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
అబ్బే తుప్పుపట్టింది ప్రభుత్వనికి కాదయ్య! వంతెనకు!!
125 రోజుల పొట్టి కంది.. ఏడాదికి 3 పంటలు!
ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం'
ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత తుదిజట్టు ఇదే!
భవసాగరం అంటే..
చంద్రబాబు.. ‘సాక్షి’పై దాడులు విచ్చలవిడి రౌడీయిజం కాదా?: వైఎస్ జగన్
క్రికెట్ మ్యాచ్ సందర్భంగా విచిత్ర పరిస్థితి
నటుడు 'ఆర్య' వ్యాపార కార్యాలయాల్లో ఐటీ సోదాలు
పుత్తడి ఈ పూట రేటెంతంటే..
బ్యాటరీ సేవ్ చేసే డిస్ప్లే.. యాపిల్ కసరత్తు
దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య
ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ..!
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలు ఉన్నాయి: పురందేశ్వరి
పెళ్లికి మంచి రోజులు లేవని రూంకు తీసుకెళ్లి..!
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగి
రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ఇలియానా
భర్త పుట్టిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని పిచ్చి పని చేసిన భార్య..!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలలో పురోగతి
అది సరే! ఇక్కడ లక్షలాది మంది రోడ్డెక్కొద్దని ఎవరు చెప్పాలి సర్..!
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
సాక్షి కార్టూన్ 18-06-2025
118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు
నా భర్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకుంటావా!
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్ రికార్డు బద్దలు
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
అబ్బే తుప్పుపట్టింది ప్రభుత్వనికి కాదయ్య! వంతెనకు!!
125 రోజుల పొట్టి కంది.. ఏడాదికి 3 పంటలు!
ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం'
ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!
సినిమా

గుడ్నైట్ దర్శకుడికి శివకార్తికేయన్ ఛాన్స్.. తండ్రి పాత్రలో స్టార్ హీరో
కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan)కు ఇప్పుడు మంచి కథలు వెతుక్కుంటూ వస్తున్నాయి. వరుస విజయాలతో మంచి జోరుమీదున్న శివకార్తికేయన్ కూడా చాలా జాగ్రత్తగా కథలు, దర్శకులను ఎంపిక చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈయన ఇంతకుముందు నటించిన అమరన్ చిత్రం ఘనం విజయం సాధించింది. ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మదరాసి చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. అదేవిధంగా సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రంలో నటిస్తున్నారు. రవిమోహన్, అధర్వ, ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల నాయకిగా నటిస్తున్నారు. ఈచిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది శివకార్తికేయన్ నటిస్తున్న 25వ చిత్రం కావడం గమనార్హం. దీంతో ఈయన తన 26వ చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. దీనికి గుడ్నైట్ చిత్రం ఫేమ్ వినాయక్ చంద్రశేఖరన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలలైనట్లు సమాచారం. ఇది తండ్రీ కొడుకుల అనుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని, శివకార్తికేయన్కు తండ్రిగా మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ ( Mohanlal)ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చిత్ర షూటింగ్ ఆగస్ట్ నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్కు ఆస్కార్ అవార్డు
హాలీవుడ్ ప్రముఖ నటుడు–నిర్మాత టామ్ క్రూజ్ ఎట్టకేలకు ఆస్కార్ అవార్డు అందుకోనున్నారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ పదిహేనేళ్లుగా ప్రతి ఏడాది గవర్నర్స్ అవార్డ్స్ను అందిస్తున్న సంగతి తెలిసిందే. 16వ వార్షిక అవార్డు ప్రదానం ఈ ఏడాది నవంబరులో జరగనుంది. ఈసారి ఆస్కార్ గవర్నర్ అవార్డులను అందుకోనున్న వారి వివరాలను ఆస్కార్ కమిటీ అధికారికంగా వెల్లడించింది. హాలీవుడ్ నటుడు–నిర్మాత టామ్ క్రూజ్తో పాటు అమెరికన్ నటి–దర్శక–నిర్మాత–కొరియోగ్రాఫర్ డెబ్బీ అల్లెన్, ప్రొడక్షన్ డిజైనర్ విన్ థామస్లు ఈ ఏడాది ఆస్కార్ గౌరవ పురస్కారా లను స్వీకరించనున్నారు. అలాగే అమెరికన్ గాయని–నటి–రచయిత– సంగీత దర్శకురాలు డాలీ పార్టన్కు జీన్ హెర్షోల్ట్ హ్యూమానిటేరియన్ అవార్డు లభించింది.సినిమా రంగంలో సుధీర్ఘమైన కెరీర్, సినిమాల పట్ల ఎంతో అంకితభావం చూపిన నలుగురు దిగ్గజ వ్యక్తులను ఈ ఏడాది ఆస్కార్ గవర్నర్స్ అవార్డ్స్తో సత్కరించనున్నాం’’ అని ఆస్కార్ అకాడమీ అధ్యక్షురాలు జానెట్ యాంగ్ పేర్కొన్నారు. ఇక ఈ 16వ ఆస్కార్ గవర్నర్స్ అవార్డ్స్ వేడుక కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్లో నవంబరు 16న జరగనుంది. ఇక ఇప్పటివరకు నాలుగు ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ దక్కించుకున్నప్పటికీ టామ్ క్రూజ్కు అవార్డు దక్కలేదు. ఫైనల్గా ‘అకాడమీ గౌరవ పురస్కారం’ దక్కుతున్నందుకు ఆయన ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. ఇక 98వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది.

ప్రభాస్ 'ది రాజాసాబ్'.. ఏకంగా రూ.5 కోట్లు సేవ్ చేసిన తమన్!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ది రాజాసాబ్. ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రాని మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే టీజర్ విడుదల కాగా.. ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. హారర్, కామెడీతో పాటు విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ముగ్గురు హీరోయిన్లతో ఓ స్పెషల్ సాంగ్ను మారుతి ప్లాన్ చేసినట్లు చేస్తోంది. ఓ ఫుల్ మాస్ సాంగ్ను తీసుకొచ్చేందుకు మేకర్స్ నిర్ణయించారు. దీనికోసం ఓ హిందీ పాటను రీమిక్స్ చేయాలని భావించారు. అయితే ఆ సాంగ్ మ్యూజిక్ రైట్స్ ఉన్న ఆడియో సంస్థ ది రాజాసాబ్ టీమ్ను దాదాపు రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. దీంతో మేకర్స్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు టాలీవుడ్ బీజీఎం కింగ్ ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో మేకర్స్ మరో ప్లాన్కు రెడీ అయ్యారు. తమన్తోనే ఓ ప్రత్యేక సాంగ్ను కంపోజ్ చేయనున్నారట. ముగ్గురు హీరోయిన్లతో చేసే పాటకు తమన్ తన రేంజ్లో అదిరిపోయే సంగీతం కొట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ది రాజాసాబ్ టీమ్కు దాదాపు రూ.5 కోట్ల రూపాయలు సేవ్ అయినట్లే. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం తమన్ ఎలాంటి బీట్స్ అందిస్తాడో వేచి చూడాల్సిందే. ఎందుకంటే స్పెషల్ సాంగ్స్ కంపోజ్ చేయడంలో తమన్ హై టాలెంటెడ్ అని మనందరికీ తెలిసిందే. కాగా.. ది రాజాసాబ్ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.#Prabhas to Groove with Three Heroines in a Special Song!👉 The shooting of #RajaSaab is nearly complete, with just two songs left to be filmed.👉 Initially, the team had planned a high-energy remix of a popular old Hindi classic. However, the music rights came with a… pic.twitter.com/OnBKt4x2FL— PaniPuri (@THEPANIPURI) June 18, 2025

రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కాజోల్.. హైదరాబాద్లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అదో భయంకరమైన ప్రదేశమని, జీవితంలో మళ్లీ అక్కడికి వెళ్లాలని అనుకోవట్లేదని చెప్పుకొచ్చింది. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: కారులో విజయ్-రష్మిక జంటగా.. ప్రేమని కన్ఫర్మ్ చేస్తున్నారా?)హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కాజోల్.. ప్రస్తుతం 'మా' అనే సినిమా చేసింది. జూన్ 20న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీ అత్యంత భయానక ప్రదేశం అని చెప్పుకొచ్చింది. 'ఎందుకో అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు నెగెటివ్ వైబ్స్ వచ్చాయి. కొన్ని ప్రదేశాలు చాలా భయపెడతాయి. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, మరోసారి అక్కడికి రాకూడదు అనిపిస్తుంది. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ అలాంటిదే. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటు అది' అని కాజోల్ చెప్పింది.మరి కాజోల్ని అంతలా భయపెట్టిన సంఘటన ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. కాజోల్ కెరీర్ విషయానికొస్తే.. 1992 నుంచి సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ క్లాసిక్స్లో ఒకటైన 'దిల్ వాలియా దుల్హానియా లే జాయేంగే' సినిమాలో హీరోయిన్ ఈమె. తర్వాత కూడా పలువురు స్టార్స్తో మూవీస్ చేసింది. కొన్నాళ్లకు హీరో అజయ్ దేవగణ్ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ టైంలో సలాం వెంకీ, లస్ట్ స్టోరీస్ 2, దో పత్తి తదితర చిత్రాలతో కాజోల్ ఆకట్టుకుంది. ఇప్పుడు 'మా' అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.(ఇదీ చదవండి: 19 ఏళ్ల హీరోయిన్ అనంతిక.. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?)"I’ve felt negative vibes during shoots. Some places were so scary, I just wanted to leave and never come back.Like Ramoji Film City in Hyderabad itself, which is known as one of the most haunted places in the world."- Bollywood Actress #Kajol pic.twitter.com/0znOCXyQ4s— Movie Threat (@MovieThreat) June 18, 2025
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

వారికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది: కంగనా రనౌత్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, లోక్సభ సభ్యురాలు కంగనా రనౌత్ ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు న్యూఢిల్లీ వేదికగా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ జరగనుంది. వందకు పైగా దేశాల నుంచి పారా అథ్లెట్లు ఈ చాంపియన్షిప్లో పాల్గొంటారు. ‘పారా అథ్లెట్లకు ఎప్పుడూ నా సహకారం ఉంటుంది. వాళ్లు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని ప్రపంచ స్థాయికి వచ్చారు. వారి ఘనతలను గుర్తించాల్సిన అవసరముంది. పారా అథ్లెటిక్స్ అనేవి కేవలం క్రీడలు మాత్రమే కాదు. దాని వెనక వారి పోరాటం, గుండె ధైర్యం దాగి ఉంటుంది. అలాంటి చాంపియన్లకు అంబాసిడర్గా వ్యవహరించనుండటం గర్వంగా భావిస్తున్నా’ అని కంగనా వెల్లడించింది. భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఝఝారియా... కంగనా అంకితభావం, స్ఫూర్తిని కొనియాడాడు.

BCCI: బీసీసీఐకి ‘భారీ’ షాక్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి గట్టి షాక్ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగమైన ఒకప్పటి ఫ్రాంఛైజీ కొచ్చి టస్కర్స్ కేరళకు ముంబై హైకోర్టులో భారీ ఊరట లభించింది. కాగా ఐపీఎల్లో ఒక సీజన్ తర్వాత తగిన కారణాలు లేకుండా తమ జట్టును రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ కొచ్చి టస్కర్స్ కేరళ టీమ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంలో బీసీసీఐదే తప్పని తేల్చింది. అదే విధంగా.. కొచ్చి యాజమాన్యానికి రూ. 538 కోట్లు చెల్లించాలని ముంబై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎనిమిదో స్థానంలోకాగా ఐపీఎల్- 2011 సీజన్లో మాత్రమే ఆడిన టస్కర్స్ టీమ్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయితే జట్టు మేనేజ్మెంట్ నిబంధనలు ఉల్లంఘించిందని, సరైన సమయంలో బ్యాంక్ గ్యారంటీ చెల్లించలేదని పేర్కొంటూ కొచ్చి టీమ్ను బీసీసీఐ లీగ్ నుంచి తప్పించింది.ఈ విషయంపై... టీమ్లో భాగస్వాములైన కొచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (కేసీపీఎల్), రెండేవూ స్పోర్ట్స్ వరల్డ్ (ఆర్ఎస్డబ్ల్యూ) కోర్టుకెక్కాయి. చివరకు 2015లో కోర్టు ఆర్బిట్రేటర్ కొచ్చికి అనుకూలంగా తీర్పునిస్తూ రూ. 538 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. అయితే, ఆర్బిట్రేటర్ నిర్ణయాన్ని బోర్డు హైకోర్టులో సవాల్ చేయగా...ఇప్పుడు అదే తీర్పునకు హైకోర్టు కూడా ఆమోద ముద్ర వేసింది. దీని ప్రకారం కేసీపీఎల్కు రూ.385.50 కోట్లు, ఆర్ఎస్డబ్ల్యూకు రూ.153.34 కోట్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది. దీనిపై మళ్లీ అప్పీల్ చేసేందుకు బీసీసీఐకి ఆరు వారాల గడువు ఉంది. ప్రస్తుతం పదికాగా ఐపీఎల్లో ప్రస్తుతం పది జట్లు ఉన్నాయి. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ క్యాష్ రిచ్ లీగ్లో కొనసాగుతున్నాయి. వీటిలో ముంబై, చెన్నై అత్యధికంగా ఐదేసి సార్లు టైటిల్ గెలవగా.. కోల్కతా మూడుసార్లు ట్రోఫీని ముద్దాడింది. ఇక 2008 నాటి తొలి సీజన్లో రాజస్తాన్ చాంపియన్గా నిలవగా.. సన్రైజర్స్, గుజరాత్ టైటాన్స్ ఒక్కోసారి టైటిల్ అందుకున్నాయి. తాజాగా ఐపీఎల్-2025లో విజేతగా నిలిచి బెంగళూరు జట్టు కూడా చాంపియన్ల జాబితాలో చేరింది. ఇక కొచ్చి టస్కర్స్తో పాటు దక్కన్ చార్జర్స్, గుజరాత్ లయన్స్ కూడా ఇప్పుడు ఉనికిలో లేవు. వీటిలో హైదరాబాద్ ఫ్రాంఛైజీ దక్కన్ చార్జర్స్ కూడా ఓసారి టైటిల్ గెలిచింది.చదవండి: ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు

చరిత్ర సృష్టించిన మోనాంక్ పటేల్.. మేజర్ లీగ్ క్రికెట్లో అత్యధిక స్కోర్
మేజర్ లీగ్ క్రికెట్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఆటగాడు మోనాంక్ పటేల్ చరిత్ర సృష్టించాడు. 2025 ఎడిషన్లో భాగంగా ఇవాళ (జూన్ 19) సియాటిల్ ఓర్కాస్తో జరిగిన మ్యాచ్లో 93 పరుగులు (50 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసిన అతను.. ఈ లీగ్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన అమెరికన్ ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు కోరె ఆండర్సన్ పేరిట ఉండేది. 2023 ఎడిషన్లో ఆండర్సన్ శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్కు ఆడుతూ ముంబై ఇండియన్స్ న్యూయార్క్పై అజేయమైన 91 పరుగులు (52 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చేశాడు. ఎంఎల్సీలో అత్యధిక పరుగులు చేసిన అమెరికన్ ఆటగాళ్ల జాబితాలో మోనాంక్, ఆండర్సన్ తర్వాతి స్థానాల్లో సంజయ్ కృష్ణమూర్తి (79 నాటౌట్), ఉన్ముక్త్ చంద్ (68) ఉన్నారు.ఓవరాల్గా ఎంఎల్సీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రికార్డు ఫిన్ అలెన్ పేరిట ఉంది. అలెన్ ఇదే సీజన్లో వాషింగ్టన్ ఫ్రీడంపై 151 పరుగులు (51 బంతుల్లో) చేశాడు. ఎంఎల్సీ చరిత్రలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు నికోలస్ పూరన్ పేరిట ఉంది. పూరన్ 2023 ఎడిషన్లో అజేయమైన 137 పరుగులు చేశాడు. అలెన్, పూరన్ తర్వాతి స్థానాల్లో క్లాసెన్ (110 నాటౌట్), మ్యాక్స్వెల్ (106 నాటౌట్), రికెల్టన్ (103 నాటౌట్), ఫిన్ అలెన్ (101), డుప్లెసిస్ (100) ఉన్నారు. పైన పేర్కొన్న ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఇప్పటివరకే ఎంఎల్సీలో సెంచరీలు చేశారు. ఇందులో అలెన్ ఒక్కడు రెండు సెంచరీలు చేశాడు. ఇదిలా ఉంటే, ఇవాళ జరిగిన మ్యాచ్లో సియాటిల్ ఓర్కాస్పై ఎంఐ న్యూయార్క్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో మోనాంక్ పటేల్ అద్భుతమైన ఇన్నింగ్స్ (93) ఆడి ఎంఐను గెలిపించాడు. మోనాంక్కు మైఖేల్ బ్రేస్వెల్ (35 బంతుల్లో 50 నాటౌట్), కీరన్ పోలార్డ్ (10 బంతుల్లో 26 నాటౌట్) తోడవ్వడంతో ఓర్కాస్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎంఐ న్యూయార్క్ మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది.అంతకుముందు కైల్ మేయర్స్ మెరుపు ఇన్నింగ్స్ (46 బంతుల్లో 88) ఆడటంతో ఓర్కాస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓర్కాస్ ఇన్నింగ్స్లో షాయాన్ జహంగీర్ 43, క్లాసెన్ 27 (నాటౌట్), హెట్మైర్ 21, వార్నర్ 4, ఆరోన్ జోన్స్ 10 పరుగులు చేశారు. ఎంఐ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ ధారాళంగా పరుగులు సమర్పించుకొని (4 ఓవర్లలో 64) 2 వికెట్లు తీశాడు.

ఎంత మోసమయ్యా మ్యాక్స్వెల్.. ఐపీఎల్లోనేమో అలా, ఎంఎల్సీలో ఇలా..!
మేజర్ లీగ్ క్రికెట్లో భాగంగా నిన్న (జూన్ 18) జరిగిన మ్యాచ్లో ఆసీస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ సుడిగాలి శతకంతో (49 బంతుల్లో 13 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 106 పరుగులు) విరుచుకుపడ్డాడు. ఈ లీగ్లో వాషింగ్టన్ ఫ్రీడంకు సారథ్యం వహిస్తున్న మ్యాక్సీ.. లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ మ్యాచ్లో మ్యాక్సీ తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు.ఈ ఇన్నింగ్స్ అనంతరం మ్యాక్సీ ఆటతీరుపై వాషింగ్టన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. భారత క్రికెట్ అభిమానులకు మాత్రం రగిలిపోతున్నారు. మ్యాక్స్వెల్ తన సొంత దేశానికి (ఆస్ట్రేలియా) ఆడేటప్పుడు కాని, ఇతరత్రా లీగ్ల్లో ఆడేటప్పుడు కాని చెలరేగిపోతాడు. ఐపీఎల్కు వచ్చే సరికి మాత్రం తేలిపోతాడని మండిపడుతున్నారు. మ్యాక్స్వెల్ ఐపీఎల్ ప్రదర్శనలను, ఇతర మ్యాచ్ల్లో ప్రదర్శనలతో పోలుస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు. మ్యాక్స్వెల్ ఐపీఎల్లో లభించే భారీ మొత్తాన్ని దిగమింగుతూ, తనలోని అత్యుత్తమ ప్రదర్శనలను మాత్రం ఇతర లీగ్ల్లో ఇస్తాడంటూ చీవాట్లు పెడుతున్నారు. మ్యాక్సీ ఓ మోసగాడంటూ తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. మ్యాక్స్వెల్ను ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ రూ. 4.2 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే ఈ మొత్తంలో కనిపించే సంఖ్యలకు సరిపడా పరుగులు కూడా చేయలేకపోయాడతను. మ్యాక్సీ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో 5 మ్యాచ్లు ఆడి కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. అదే మేజర్ లీగ్ క్రికెట్ విషయానికొస్తే.. ఈ అమెరికన్ లీగ్లో అతను ఇప్పటివరకు ఆడిన 3 ఇన్నింగ్స్ల్లోనే సెంచరీ సాయంతో 204 స్ట్రయిక్రేట్తో 149 పరుగులు చేశాడు. ఈ వ్యత్యాసాన్ని చూపించే భారత క్రికెట్ అభిమానులు మ్యాక్స్వెల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వాస్తవానికి భారత క్రికెట్ అభిమానులు మ్యాక్సీ ఆటతీరుపై గత రెండేళ్లుగా గుర్రుగానే ఉన్నారు. 2024 ఐపీఎల్ సీజన్లో మ్యాక్సీ ఆర్సీబీకి ఆడుతూ 10 మ్యాచ్ల్లో 52 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సీజన్లోనే భారత అభిమానులు అతనిపై తీవ్రస్థాయి ఆగ్రహ అందోళనలు వ్యక్తం చేశారు. ఆ సీజన్లో ఆర్సీబీ అతనికి రికార్డు స్థాయిలో రూ. 11 కోట్ల మొత్తం చెల్లించింది. ఇంత డబ్బు తీసుకొని కనీస న్యాయం చేయకపోవడం అతనికి కూడా ధర్మం కాదు. మ్యాక్సీ ఐపీఎల్లో ఆడేటప్పుడు చాలా ఉదాసీనంగా కనిపిస్తాడు. ఏదో హాలిడే ఎంజాయ్ చేసేందుకు వచ్చానన్నట్లు ఫీలవుతాడు. వరుస అవకాశాలు ఇచ్చినా సక్సెస్ కాకపోతే గాయం పేరు చెప్పి మధ్యలోనే ఇంటికి చెక్కేస్తాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఇదే జరిగింది.
బిజినెస్

‘ఆరు నెలల్లో అంతా తేల్చేస్తాం..’
మోసాలతో సంక్షోభం బారిన పడిన ఇండస్ఇండ్ బ్యాంక్, జెన్సోల్ ఇంజినీరింగ్ ఆర్థిక నివేదికల పూర్తిస్థాయి పరిశీలనకు, ఆడిట్ పరమైన లోపాలు ఉన్నాయా? అన్నది నిర్ధారించేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని చార్టర్డ్ అకౌంటెంట్ల అత్యున్నత మండలి ఐసీఏఐ ప్రకటించింది. ఇప్పటికే ఐసీఏఐకు చెందిన ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ బోర్డ్ (ఎఫ్ఆర్ఆర్బీ) ఈ రెండు సంస్థల ఆర్థిక నివేదికల సమీక్షను ప్రారంభించిందని, ఇందులో గుర్తించిన వాస్తవాల ఆధారంగా, అవసరమైతే ఆడిటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి: భారత ఆటబొమ్మల నాణ్యత భేష్‘ఖాతాల్లో అసలు ఏమి జరిగిందన్నది తెలుసుకోవడానికి కనీసం ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువే సమయం తీసుకోవచ్చు’ అని ఐసీఏఐ ప్రెసిడెంట్ చరణ్జిత్ సింగ్ నందా తెలిపారు. ఇండస్ఇండ్ బ్యాంక్, జెన్సోల్ ఇంజినీరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో వాస్తవాలు, పారదర్శకత లేదని ఎఫ్ఆర్ఆర్బీ గుర్తించినట్టయితే, అప్పుడు ఐసీఏఐ క్రమశిక్షణ చర్యల కమిటీ ముందుకు ఈ అంశం వెళుతుందని చెప్పారు. జెన్సోల్ ఇంజినీరింగ్ ఖాతాల నుంచి నిధులు మళ్లించినట్టు సెబీ దర్యాప్తులో వెల్లడి కావడం తెలిసిందే. ఇండస్ఇండ్ బ్యాంక్ డెరివేటివ్ పోర్ట్ఫోలియోలో రూ.1,979 కోట్ల మేర ఖాతాల్లో లోపాలున్నట్టు, స్వయంగా బ్యాంకు వెల్లడించడం గమనార్హం.

ఏసీ అమ్మకాల్లో వృద్ధి అంతంతే..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది రూమ్ ఏసీల విక్రయాలు 10–15 శాతమే పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా అధిక డిమాండ్ ఉండే జూన్లో ఉత్తర, పశ్చిమ భారత్లో వేడి వాతావరణం నెలకొనగా, మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో కంపెనీలు తమ అంచనాలను తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఏసీల అమ్మకాలకు వేసవి సీజన్ ఎంతో కీలకం. అధిక శాతం అమ్మకాలు ఈ సీజన్లోనే నమోదవుతుంటాయి. కానీ ఈ ఏడాది వేసవిలో మధ్యంతర వర్షాలు ఈ రంగం ఆశలపై నీళ్లు చల్లింది. జూన్లో ఉత్తరాది అంతటా వేడి వాతావరణం నెలకొనడం ఒక్కటి విక్రయాలకు కాస్తంత మద్దతునిచ్చే అంశం. నిజానికి ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఫిబ్రవరి, మార్చిలోనే రూమ్ ఏసీల అమ్మకాలకు అధికంగా నమోదు కావడం గమనార్హం. దీంతో గతేడాది సీజన్తో పోలి్చతే ఈ ఏడాది 25 శాతం అధిక అమ్మకాలపై కంపెనీలు అంచనాలు వేసుకున్నాయి. తర్వాత మారిన వాతావరణ పరిస్థితులతో ఈ అంచనాలు నిజం కాలేదు. ‘‘25–30 శాతం మేర అమ్మకాల వృద్ధిని ఆశించాం. కానీ, అనుకున్న స్థాయిలో అమ్మకాలు సాధించలేదు. ఈ వేసవి నిరాశపరిచిందనడంలో సందేహం లేదు. కానీ, వ్యాపారంలో ఇదొక భాగమే. ఈ పరిస్థితులను అధిగమించి ముందుకు వెళ్లాల్సిందే’’అని బ్లూస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు. మొత్తానికి ఈ ఏడాది ఆర్ఏసీ విక్రయాలు 10–15% వృద్ధికి పరిమితం కావొచ్చని చెప్పారు. జూన్ మధ్య నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయంటూ భారత వాతావరణ శాఖ గత వారం అంచనాలు వెల్లడించడం గమనార్హం. సెపె్టంబర్ క్వార్టర్లో పుంజుకోవచ్చు.. ప్రస్తుత జూన్ త్రైమాసికం రూమ్ ఏసీ రంగానికి అనుకూలంగా లేదని.. సెపె్టంబర్ త్రైమాసికంలో విక్రయాలు పుంజుకోవచ్చని త్యాగరాజన్ పేర్కొన్నారు. పండుగల సందర్భంగా డిమాండ్ పెరగొచ్చన్నారు. ఎనర్జీ లేబుళ్లు మారుతుండడం, డిస్కౌంట్ ఆఫర్లతో గత నిల్వలను తగ్గించుకోగలమన్నారు. ఇంధన ఆదా లేబుళ్లను మార్చే ముందు ముందస్తు కొనుగోళ్లు పెరగడం సహజమేనన్నారు. 2024 అమ్మకాలతో పోల్చి చూసినప్పుడు గత రెండు నెలల్లో ఎలాంటి వృద్ధి కనిపించలేదని వోల్టాస్ ఎండీ, సీఈవో ప్రదీప్ బక్షి సైతం తెలిపారు. కనుక జూన్ త్రైమాసికంలో అమ్మకాల పరంగా పెద్ద వృద్ధి నమోదు కాకపోవచ్చని, గతేడాది మాదిరిగా 25 శాతం వృద్ధిని సాధించడం సవాలుగా పేర్కొన్నారు. వేసవిలో అమ్మకాలు గరిష్టంగా ఉండే సమయంలో వర్షాలు దెబ్బతీసినట్టు చెప్పారు. ఏప్రిల్, మే నెలలో అమ్మకాల వృద్ధిని కోల్పోవడంతో, మిగిలిన ఏడాదిలో కోలుకోవడం కష్టమని అభిప్రాయపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి ఉత్తరాదిలో వేడి వాతావరణంతో ఏసీల అమ్మకాలు పుంజుకున్నాయంటూ, ఇదొక్కటే సానుకూలతగా పేర్కొన్నారు. జూన్లో కాస్త మెరుగు.. హైయర్ అప్లయన్సెస్ ఇండియా మాత్రం ఈ ఏడాది ఇప్పటి వరకు మెరుగైన వృద్ధిని సొంతం చేసుకుంది. గతేడాదితో పోలి్చతే రూమ్ ఏసీల అమ్మకాలు 30 శాతం పెరిగినట్టు సంస్థ ప్రెసిడెంట్ ఎన్ఎస్ సతీష్ వెల్లడించారు. ‘‘ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలకు సానుకూలంగా లేవు. 10–15 శాతం మేర అమ్మకాలు తగ్గాయి. జూన్లో తిరిగి అమ్మకాలు పుంజుకున్నాయి. ఫిబ్రవరి, మార్చిలోనే ప్రణాళిక మేరకు ముందస్తు కొనుగోళ్లు జరిగాయి’’అని వివరించారు. కానీ, ఏప్రిల్, మే నెలల్లో కొనుగోలు చేద్దామనుకున్న కస్టమర్లు.. ఉష్ణోగ్రతలు పెరగకపోవడంతో వాయిదా వేసుకున్నట్టు చెప్పారు. ముఖ్యంగా జూన్లో గత పది రోజులుగా ఉత్తరాది ప్రాంతంలో అమ్మకాలు పెరిగినట్టు తెలిపారు. 2025 సంవత్సరంలో మిగిలిన కాలానికి పరిశ్రమ అంచనాలు తగ్గించుకున్నట్టు సతీష్ తెలిపారు. గతేడాది స్థాయిలో వృద్ధి ఉండకపోవచ్చంటూ.. అమ్మకాలు 10–15 శాతం వృద్ధికి పరిమితం కావొచ్చన్నారు.

రెడిట్ ప్రచారకర్తగా సచిన్ టెండుల్కర్
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫాం రెడిట్కు ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఇకపై తన రెడిట్ ప్రొఫైల్ ద్వారా తన అభిప్రాయాలు, మ్యాచ్ల విశ్లేషణ, ఎక్స్క్లూజివ్ కంటెంట్ను ఆయన షేర్ చేస్తారు. అలాగే భారత్తో పాటు ఇతరత్రా మార్కెట్ల కోసం రూపొందించే కొత్త మార్కెటింగ్ ప్రచార ప్రకటనల్లో ఆయన కనిపిస్తారని కంపెనీ వివరించింది. వివిధ వర్గాలందరినీ ఒక చోటికి చేర్చే రెడిట్తో జట్టు కట్టడం సంతోషకరమైన విషయమని టెండుల్కర్ తెలిపారు. శ్రేష్టమైన క్రికెట్కు టెండుల్కర్ పేరు పర్యాయపదమని రెడిట్ వైస్ ప్రెసిడెంట్ దుర్గేశ్ కౌశిక్ వివరించారు. తమ ప్లాట్ఫాంలో క్రీడలపై ఆసక్తి వార్షికంగా 30 శాతం పెరగడంతో స్పోర్ట్స్ కంటెంట్కి మరింత ప్రాధాన్యం ఇవ్వడం మీద రెడిట్ దృష్టి పెడుతోంది. ఈ మధ్యే ఇటాలియన్ ఫుట్బాల్ లీగ్ సిరీ ఏ, గతేడాది ఎన్ఎఫ్ఎల్, ఎన్బీఏ, ఎంఎల్బీ తదితర అమెరికన్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ లీగ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

‘బ్యాటరీ సర్వీస్’ ఆప్షన్తో విడా ఎలక్ట్రిక్ స్కూటర్
న్యూఢిల్లీ: వచ్చే నెల ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీఎక్స్2 కోసం సబ్స్క్రిప్షన్ ఆధారిత బ్యాటరీ–యాజ్–ఏ–సర్వీస్ (బీఏఏఎస్) ఆప్షన్ను అందించనున్నట్లు టూ–వీలర్ల దిగ్గజం హీరో మోటోకార్ప్ తెలిపింది. దీనితో వాహనానికి ముందుగా చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా తగ్గుతుందని, మరింత మందికి ఎలక్ట్రిక్ మొబిలిటీ చేరువయ్యేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. కస్టమర్లు తమ రోజువారీ, నెలవారీ బడ్జెట్, వినియోగాన్ని బట్టి సరళతరమైన సబ్్రస్కిప్షన్ ప్లాన్లను ఎంచుకోవచ్చని వివరించింది. స్కూటర్ చాసిస్, బ్యాటరీకి వేర్వేరుగా ఫైనాన్స్ తీసుకునే ఆప్షన్ ఉండటం వల్ల ముందస్తుగా పెద్ద మొత్తం చెల్లించాల్సిన భారం తగ్గుతుందని కంపెనీ తెలిపింది. బీఏఏఎస్ మోడల్, సబ్స్క్రిప్షన్ ప్లాన్లు, ధర మొదలైన పూర్తి వివరాలను జూలై 1న కంపెనీ ప్రకటించనుంది.
ఫ్యామిలీ

Tip of the day కాన్సంట్రేషన్ కుదరడం లేదా? ఇవిగో చిట్కాలు!
ఒక పనిలో విజయం సాధించాలంటే పట్టుదల అవసరం. సాధించాలనే కసితో పనిపై దృష్టి పెడితే ఎలాంటి కష్టాన్నైనా అధిగమించవచ్చు. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా కాన్సెంట్రేషన్ పెంచుకోవడం ఎలాగో చూద్దాం. ఒత్తిడికి ఆందోళనకు దూరంగా ఉండాలి.ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.పని, ప్రాజెక్ట్, లేదా కొత్తగా నేర్చుకోవాలనుకున్నపుడు పనికి ప్రణాళిక అవసరం. పనిని చిన్న భాగాలుగా విభజించి, ఒక్కొక్కటిగా దృష్టి పెట్టాలి.ప్రతి రోజు ఒక నిర్దిష్ట సమయాన్ని పని చేయడానికి కేటాయించండి.ఆ సమయంలో ఇతర విషయాలను పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లకు దూరంగా ఉండండి. కనీసం ఫోన్ను, నోటిఫికేషన్లను మ్యూట్లో పెట్టేయండి. బాగా అలసిపోయినప్పుడు, చిన్న విరామాలు తీసుకోండి. మెడిటేషన్ చేయండి.సందేహాలు, అనుమానాల నివృత్తి కోసం నిపుణుల సలహాలను తీసుకోండి. అడగడానికి ఏ మాత్రం సంకోచించకండి.మీరు పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారంటే, దాని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. వాటిలో కొన్ని:అధిక ఒత్తిడి లేదా ఆందోళన మీ మెదడును గందరగోళంగా మార్చేస్తాయి. కాన్ సంట్రేషన్ కుదరదు.ఎక్కువ అలిసిపోయినా మెదడు చురుకుగా పనిచేయదుచుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా, ఏకాగ్రతకు అనుకూలంగా ఉండేలా చూసుకోండి. చుట్టూ ఉన్న శబ్దాలు లేదా ఇతర విషయాలు మిమ్మల్ని సులభంగా పరధ్యానంలోకి నెట్టేయవచ్చు. పట్టుదలతో ప్రయత్నిస్తే అనుకున్న విజయం సాధించడం తధ్యం. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఏకాగ్రత నిలపలేక పోవడానికి కారణం కావచ్చు. ఉదాహరణకు, దృష్టి లోపం, లేదా ADHD వంటివి.ఇలాంటి పరిస్థితుల్లో వైద్య సలహాలు తీసుకోవడం ఉత్తమం.

నీట్లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..!
ఆర్థికంగా వెనకబడిని వారికి ఉన్నత చదువులు అందని ద్రాక్షలాంటివే. చదవగలిగే ప్రతిభ ఉన్న..అందుకు తగిన ఆర్థిక సాయం, ప్రోత్సాహం కరువైతే..వారి ప్రతిభ అడుగంటిపోతుంది. పైగా దేశం గొప్ప మేధావులను కోల్పోతుంది కూడా. ఆ ఉద్దేశ్యంతో వెనుబడిన వర్గాల కోసం ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్ల రూపంలో చదువుకునే అవకాశాన్ని అందిస్తోంది. అలా ప్రభుత్వం అందించే అవకాశాలను వినియోగించుకుని ఈ మూగ్గురు అమ్మాయిలు ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్షల్లో సత్తా చాటారు. అంతేగాదు సర్కారు చదువు సత్తా ఏంటో తెలిసేలా చేశారు. యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అక్కడ మారిహాన్ గ్రామంలోని ప్రభుత్వ సర్వోదయ విద్యాలయానికి చెందిన మొత్తం 12 మంది బాలికలు వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. హాజరైన బాలికల్లో దాదాపు సగానికి పైగా అందరు వెనుకబడిన వర్గాలకు చెందినవారే. యూపీ సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాల ఘనత ఇది. ఆర్థికంగా వెనుకబడిన పిల్లల కోసం ఏర్పాటైన సర్వోదయలో బాలికలు ఉచిత రెసిడెన్షియల్ పాఠశాలలో వారంత ఆరు నుంచి 12 తరగతులు వరకు చదువుకుంటారు. అక్కడే రెడిడెన్షియల్ స్కూల్లో ఈ ఏడాది జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు కోచింగ్ కూడా పోందారుద. వారిలో వ్యవసాయ కూలీ కూతురు ప్రిన్సీ, రైతు కూతురు పూజ రంజన్, సైకిల్ సీట్ కవర్లు అమ్మే దుకాణందారుడు కూతురు కౌశాంబి శ్వేత ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వారి వచ్చిన నేపథ్యం దృష్ట్యా డాక్టర్ కావలనే కోరిక మసకబారిపోతుందనే అనుకున్నారు. అందులోనూ ప్రభుత్వ పాఠశాల చదవే తాము ఈ నీట్ ఎగ్జామ్ లాంటి వాటి కోసం కోచింగ్ తీసుకునే ఛాన్సే లేదు. కాబట్టి డాక్టర్ కావడం అనేది ఓ కలేనేమో అనుకున్నారు ఆ అమ్మాయిలు. వారి అదృష్టమో లేక వరమో గానీ నవోదయ పూర్వ విద్యార్థుల నెట్ వర్క్ అయిన టాటా AIG, మాజీ నవోదయ ఫౌండేషన్ మద్దతుతో వారు ఉంటున్న మారిహాన్ గ్రామంలోనే నీట్ కోచింగ్ 2024 చిన్నగా ప్రారంభమైంది. అది వారికి వరమైన ఆ ఎగ్జామ్కి ప్రిపేరయ్యిందుకు తోడ్పడింది. ఆ చిన్న ప్రోత్సాహాన్ని ఉపయోగించుకుని ఈ ఎగ్జామ్లో ఈ ముగ్గురు అమ్మాయిలు ఉత్తీర్ణులై తమ కలను సాకారం చేసుకున్నారు. ఆ స్వచ్ఛంధ సంస్థలో సుమారు 39 అడ్మిషన్ పోందగా వారిలో 25 మంది నీట్కి, మిగతా 14 మంది జేఈఈకి ప్రిపేరయ్యారు. అయితే ఆ నీట్ ఎగ్జామ్కి హాజరైన 25 మందిలో 12 మంది ఉత్తీర్ణులు కావడం విశేషం. దీన్ని మిగతా సర్వోదయ విద్యాలయాల్లో కూడా అందించి.. వెనుబడిన వర్గాల పిల్లలందరూ ఇలాంటి ఉన్నత చదవులు చదువుకుని తమ కలను సాకారం చేసుకునేలా చేయడమే తమ ధ్యేయం అని మారిహాన్ సాంఘిక సంక్షేమ డైరెక్టర్ కుమార్ ప్రశాంత్ అన్నారు. (చదవండి: అమ్మాయిలూ.. బహుపరాక్!)

118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో
అధిక బరువుతో ఉండే వ్యక్తులు వారి వ్యక్తిగత బాధలు, శారీరక అనారోగ్యం కంటే చుట్టూ ఉండే వారు ఏమనుకుంటారో అనేదానితో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అవమానాలు, వెక్కిరింపుల ఎదుర్కోవాలంటే బరువు తగ్గాల్సిందే అనుకుంటారు. కానీ బరువు తగ్గాలి.. తగ్గాలి.. స్మార్ట్గా ఉండాలి, నచ్చిన బట్టలువేసుకోవాలి, పార్టీలకు, ఫంక్షన్లకు అందంగా వెళ్లాలి అని అనుకుంటూ సరిపోదు. దానికి తగ్గట్టుగా కఠోర శ్రమ చేయాలి. బాడీ వెయిట్కు తగ్టట్టు ఎంత బరువు తగ్గాలి అనేది అంచనా వేసుకుని నిపుణుల సలహా మేరకు ముందుకు సాగాలి. అలా 6-7 నెలల్లో 118 కిలోల నుండి 80 కిలోలకు చేరిన యువకుడి స్టోరీ గురించి తెలుసుకుందాం. నోయిడాలో నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు రజత్ బన్సల్ (30). ఫ్రెండ్స్ వేళాకోళాలతో పాటు, అద్దంలో తనను తాను చూసుకుని బాధపడేవాడు. 118 కిలోల బరువు పెరగడం అతని ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడమే కాకుండా, మానసికంగా అతడ్ని బలహీనుడిని చేసింది. నచ్చిన బట్టలు వేసుకోవడానికి లేదు. దర్జాగా పెళ్లికో, ఫంక్షనకో వెళ్లాలంటే..సిగ్గుగా ఉండేది. బంధువుల మాటలు, స్నేహితుల జోకులు మరింత బాధించేవి. అంతే వన్ ఫైన్ మార్నింగ్ కేవలం బరువు తగ్గాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కేవలం 6-7 నెలల్లో 38 కిలోల బరువు తగ్గి ఔరా అనిపించు కున్నాడు.ఏలా ఊపిరాడుతోందిరా బాబూరజత్ వెయిట్ లాస్ జర్నీలో ఫ్రెండ్స్ జోకులు, ఎగతాళి మాటలు కీలక పాత్ర పోషించాయని చెప్పవచ్చు 'నువ్వు చాలా బరువు పెరిగావు, ఏ బట్టలు ధరిస్తావు?' ‘ఎలా నడుస్తావ్.. ఊపిరి ఆడుతోందా? అంటూ అని ఎగతాళి చేసేవారు. చివరికి నోయిడాలోని డైట్ మంత్ర క్లినిక్కు చెందిన డైటీషియన్ డాక్టర్ కామిని సిన్హా, రజత్ బరువు తగ్గి, ఫిట్గా ఉండేందుకు రంగంలోకి దిగాడు.జంక్ ఫుడ్ - స్వీట్లు వీక్నెస్ రజత్కు అతిపెద్ద సవాలు ఏమిటంటే జంక్ ఫుడ్ , స్వీట్లు తినే అలవాటు మార్చుకోవడం. ఏది ఏమైనా సరే తన లైఫ్,ఆరోగ్యంతో రాజీపడకూడదని నిర్ణయించుకున్నాడు.ఆహార అలవాట్లలో విప్లవాత్మక మార్పులు చేసుకున్నాడు.ఉదయాన్నే మార్నింగ్ వాక్ కు వెళ్లేవాడు.చెమటలు పట్టేదాకా వ్యాయామం మెట్లు ఎక్కడం చేసేవాడు. అల్పాహారం: ఉడికించిన ఓట్స్ లేదా పోహా.మధ్యాహ్నం: ఉడికించిన పప్పులు, సలాడ్ మరియు పెరుగు.సాయంత్రం 4 గంటలు: కాల్చిన చిక్పీస్ , పండ్లతో భేల్.రాత్రి భోజనం: ఫ్రూట్ రైతా , సలాడ్.దీనితో పాటు హోం చిట్కాలు కూడా పాటించాడు. మెంతులు, సోంపు, జీలకర్ర, క్యారమ్ గింజలు ,దాల్చిన చెక్కను రాత్రిపూట నానబెట్టి ఉదయం ఉడకబెట్టి, ఉదయం సగం గ్లాసు , రాత్రి సగం గ్లాసు తాగేవాడు.తొలి వారాల్లో చాలా కష్టపడేవాడు. ఆకలిని తట్టుకోవడం కష్టంగా ఉండేది. చాలా నీరసంగా అనిపించేది. కానీ వెక్కిరింపులు, వేళాకోళాలు గుర్తొచ్చేవి. అద్దంలో తగ్గిన వెయిట్ చూసుకొని ఉత్సాహాన్ని తెచ్చుకునేవాడు. అలా శరీరంలో మాత్రమే కాదు, మనస్సులో ఉత్సాహంలో కూడా వచ్చిన మార్పు గమనించి మరింత పట్టుదలగా సాగాడు.6-7 నెలల కృషి తర్వాత, తన బాడీ వెయిట్ 80 కిలోలకు చేరేసరికి కళ్ళలో ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి.కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం, గౌరవం కూడా తిరిగి వచ్చింది. ఎందుకు బరువు తగ్గడం నీ వల్ల కాదురా అని హేళన చేసినవాళ్లంతా 'నువ్వు ఇంత బరువు ఎలా తగ్గావు?' అని ఆశ్చర్యపోవడమే రజత్ వెయిట్ లాస్లో జర్నీలో పెద్ద సక్సెస్..

World Crocodile Day 2025 : ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్, అలరించిన సాండ్ క్రొకోడైల్స్
World Crocodile Day ను ప్రతీ ఏడాది జూన్ 17న జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని తొలిసారిగా 2017లో జరుపుకున్నారు. మొసలి పరిశోధన కూటమి దీన్ని మొదలు పెట్టింది., ది బెలిజ్ జూ & ట్రాపికల్ ఎడ్యుకేషన్ సెంటర్ ప్రారంభించాయి. ప్రాముఖ్యత:అనేక నదులు , చిత్తడి ప్రాంతాల పర్యావరణ వ్యవస్థలో మాంసాహారాలుమొసళ్లు. నీరు , భూమి పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మాంసాహారులుమొసళ్ళు సహాయపడతాయి.మొసళ్ళు అంతరించిపోతే, ఆహార గొలుసు తీవ్రంగా ప్రభావితమవుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మొసళ్ళ గురించి ఆసక్తికరమైన విషయాలు: ప్రపంచంలో దాదాపు 23 జాతుల మొసళ్ళు ఉన్నాయి.ఉప్పునీటి మొసలి ప్రపంచంలోనే అతిపెద్ద సరీసృపాలు - ఇది 7 మీటర్ల పొడవు ,1000 కిలోల వరకు బరువు ఉంటుంది.గుడ్లు పెట్టడం ద్వారా జాతిని వృద్ధి చేస్తాయి.భారతదేశంలో మొసళ్ల స్థితి:భారతదేశంలో మూడు ప్రధాన జాతులు కనిపిస్తాయి:మగ్గర్ లేదా మార్ష్ మొసలిఉప్పునీటి మొసలిఘరియల్ఘరియల్ను IUCN తీవ్రంగా ప్రమాదంలో ఉన్నట్లు ప్రకటించింది.భారతదేశంలో 1975లో "మొసలి సంరక్షణ ప్రాజెక్ట్" ప్రారంబించారు.దీని ఫలితంగా ఒడిశాలోని భితార్కనికా వంటి ప్రాంతాలలో వాటి సంఖ్య భారీగా పెరిగింది.పరిరక్షణ సవాళ్లు: నదీ తీరాలు అక్రమణలకు గురవుతున్న నేపథ్యంలో వీటి ఉనికి ప్రమాదంలో పడింది. మొసళ్లు అంతరించిపోవడంలో వేట(చర్మం, మాంసం, మందుల కోసం) అనేది మరో ప్రధాన కారణం. చేపల వేటలో చిక్కుకోవడం వల్ల మరి కొన్నిమరణాలు సంభవిస్తున్నాయి. ఆకర్షించిన సైకత మొసళ్లు రాష్ట్రంలో మొసళ్ల సంతతి సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రాజెక్టు క్రోకోడైల్ ఇన్ ఒడిశా’ కార్యక్రమం చేపట్టి మంగళవారం నాటికి 50 ఏళ్లు పూర్తయింది. మరోవైపు ప్రపంచ మొసళ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని పూరీ సాగర తీరంలో పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత మొసళ్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షించాయి.
ఫొటోలు
అంతర్జాతీయం

‘భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. ఐలవ్ పాకిస్తాన్’
వాషింగ్టన్: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే భారత్-పాక్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఊదరగొట్టిన ట్రంప్ తాజాగా మరోసారి అదే పాటపాడారు. భారత్-పాకిస్తాన్ సీజ్ఫైర్లో అమెరికా జోక్యం చేసుకోలేదని ప్రధాని మోదీ ప్రకటన చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘యుద్ధాన్ని నేనే ఆపా.. ఐలవ్ పాకిస్తాన్.రెండు న్యూక్లియర్ దేశాలు కావడంతో యుద్ధాన్ని ఆపాను. మోదీ గొప్ప వ్యక్తి ఆయనతో రాత్రి మట్లాడా. గత రాత్రే భారత్ - అమెరికా ట్రేడ్ గురించి ఆయనతో మాట్లాడాను’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

తలదూర్చితే చావుదెబ్బ తప్పదు.. ట్రంప్కు ఖమేనీ వార్నింగ్!
తెహ్రాన్: హెచ్చరికలు,అల్టిమేట్టంలు ఆఖరికి చంపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు బెదిరింపులకు దిగినా సరే వెనక్కి తగ్గబోమని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ(83) ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ భీకర దాడుల్లో ఖమేనీ తన సన్నిహితులతో పాటు సైన్యంలో కీలక పాత్రపోషిస్తున్న అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరుణంలో ఖమేనీ లొంగిపోవాలని నెతన్యాహు,ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ఆ బెదిరింపులకు తానేమి లొంగిపోనని, కాదు కూడదని ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో తలదూర్చాలని చూస్తే కోలుకోలేని నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు.ఎక్స్ వేదికగా ఖమేనీ ఏమన్నారంటే?ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోకూడదు. కాదు కూడదని సైనిక పరంగా జోక్యం చేసుకుంటే మాత్రం అమెరికాను కోలుకోలేని విధంగా దెబ్బకొడతామని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ గురించి ఖమేనీ స్పందించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అవివేకంతో ఇరానియన్లు తనకు లొంగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ ఎవరికో (ఇజ్రాయెల్ దేశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ) భయపడి తమను బెదిరిస్తే.. తాము బెదిరిపోమని పునరుద్ఘాటించారు. పదేపదే అమెరికా కవ్వింపు చర్యలకు దిగితే ప్రస్తుతం ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ ఎదుర్కొంటున్న హానికంటే ఎక్కువ హాని అమెరికా ఎదుర్కొవాల్సి ఉంటుందని ఇరాన్ అమెరికాకు చేయబోయే నష్టం గురించి హెచ్చరించారు. The US entering in this matter [war] is 100% to its own detriment. The damage it will suffer will be far greater than any harm that Iran may encounter.— Khamenei.ir (@khamenei_ir) June 18, 2025ఖమేనీని చంపే ఉద్దేశం మాకు లేదు.. కానీ సుప్రీం లీడర్ అనే వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడో మాకు ఖచ్చితంగా తెలుసు. అతని ఆచూకీ పెద్ద కష్టమేమీ కాదు. అతను అక్కడ సురక్షితంగా ఉన్నాడు. ప్రస్తుతం మేం అతన్ని చంపే ఉద్దేశంతో లేము. ఖమేనేని చంపితే మా వారిపై దాడులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నాకు ఓపిక నశిస్తున్నది. ఖమేనీ భేషరతుగా లొంగిపోతే మంచిది. మా సహనాన్ని పరీక్షించొద్దు. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ట్రంప్ ట్వీట్పై ఖమేనీ పైవిధంగా స్పందించారు.

ఇజ్రాయెల్-స్ట్రైకర్.. ఇరాన్ ఫతా ఎంత డేంజరో తెలుసా?
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్ ప్రజల పట్ల కనికరం చూపించే ప్రసక్తే లేదని ఇరాన్ సుప్రీం అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. ఈ క్రమంలోనే శక్తివంతమైన హైపర్సోనిక్ మిస్సైల్స్ను ప్రయోగించినట్లు ప్రకటించారాయన. మరోవైపు.. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా ‘ఫతా-1 మిస్సైల్స్’ను ప్రయోగాన్ని ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఈ క్షిపణి అంత శక్తివంతమైందా? దాని సామర్థ్యం ఏపాటిదో ఓ లుక్కేద్దాం. ఫతా(Fattah) హైపర్సోనిక్ మిస్సైల్.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించుకుంది. అయితే ఈ విషయంలో పలు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే హైపర్సోనిక్ క్షిపణి సాంకేతికతను అభివృద్ధి చేయడం చాలా క్లిష్టమైన పని. ఇరాన్ గతంలో రష్యా, చైనా వంటి దేశాలతో రక్షణ రంగంలో పరస్పర సహకారం కొనసాగించింది. బహుశా ఈ దేశాల భాగస్వామ్యంతోనే ఫతాను రూపొందించి ఉండొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తుంటారు. అయితే.. ఈ క్షిపణి అభివృద్ధితో అమెరికా, రష్యా, చైనా తర్వాత హైపర్సోనిక్ క్షిపణి కలిగిన నాలుగో దేశంగా ఇరాన్ నిలిచింది. అలాగని ఇజ్రాయెల్ మీదకు ఫతా హైపర్సోనిక్ మిస్సైల్స్ను ఇరాన్ ప్రయోగించడం ఇప్పుడే తొలిసారేం కాదు!. కిందటి ఏడాది అక్టోబర్ 1వ తేదీన జరూసలేం మీదకు ఈ క్షిపణలను ప్రయోగించినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇటు ఇరాన్, అటు ఇజ్రాయెల్ ఈ ప్రచారంపై ఇప్పటిదాకా మౌనం వీడలేదు. అయితే తాజాగా మాత్రం ఇరాన్ అధికారిక ప్రకటనతో వీటి ప్రయోగం జరిగిందన్న విషయం వెలుగు చూసింది. హైపర్సోనిక్ అనే పదాన్ని సాధారణంగా అత్యంత వేగమైన రవాణా వ్యవస్థకు ఉపయోగిస్తుంటారు. ఆ తర్వాతి కాలంలో అది యుద్ధ రంగానికి అన్వయించడం మొదలుపెట్టారు. హైపర్ సోనిక్ మిస్సైల్స్ అంటే.. అత్యాధునికమైన క్షిపణులు అని అర్థం. ఇవి శబ్ధ వేగం కంటే అధిక రెట్లతో ప్రయాణిస్తాయి. అత్యంత వేగంతో ప్రయాణించడం వల్ల శత్రుదేశాలు గుర్తించడంగానీ, మార్గంమధ్యలోనే నాశనం చేయడంగానీ చాలా కష్టం. ఫతాను 2003లో ఇరాన్ ఆవిష్కరించింది. దీనికి ఆ పేరు పెట్టింది ఇరాన్ సుప్రీం ఖమేనీనే. దీని పొడవు 12 మీటర్లు. 1,400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది చేధించగలదు. సుమారు 200 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. శబ్ద వేగం కంటే 13 నుంచి 15 రెట్లు అధికంగా ఇది ప్రయాణించగలదు. అంటే దాదాపు గంటకు 16,000–18,500 కిలోమీటర్లు వేగం ఉంటుందన్నమాట. ఇది హైపర్సోనిక్ గ్లైడ్ వెహికిల్ (HGV), హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ (HCV) లక్షణాలను కలిగి ఉంది. కానీ, ఫతా సామర్థ్యానికి సంబంధించిన సరైన వివరాలను ఇరాన్ ఇప్పటిదాకా వెల్లడించకపోవడం గమనార్హం. కాకుంటే.. ఐరన్ డోమ్, ఆరో లాంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉన్న ఇజ్రాయెల్కు సైతం ఈ క్షిపణి అంతు చిక్కదు. అందుకే ఇరాన్ దీనిని ముద్దుగా ఇజ్రాయెల్-స్ట్రైకర్ అని అభివర్ణిస్తుంటుంది. ఇజ్రాయెల్ మాత్రమే కాదు.. హిందూమహాసముద్రంలో సంచరించే అమెరికా యుద్ధ నౌకలను కూడా ఇది ఆనాశనం చేయగలదని ఇరాన్ తరచూ ధీమాగా చెబుతుంటుంది. తాజా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల గగన తలాలను పూర్తిగా ఇరాన్ తమ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగిందంటే మాత్రం.. అందుకు ఫతాలాంటి హైపర్సోనిక్ మిస్సైల్ కారణం.

పాకిస్తాన్లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ రైలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. సింధ్ ప్రావిన్స్లో రైల్వే ట్రాక్పై పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు అదుపు తప్పి కింద పడిపోయాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్లోని జకోబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్పై బుధవారం ఉదయం పేలుళ్లు సంభవించింది. ఈ పేలుడు కారణంగా పాకిస్తాన్కు చెందిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలులోని అనేక బోగీలు పట్టాలు తప్పాయి. పేలుడు కారణంగా మూడు అడుగుల మేర గుంత పడినట్లు ధ్రువీకరించిన పోలీసులు. కాగా, సదరు రైలు.. బలూచిస్తాన్లోని రెసిడెన్షియల్ ప్రావిన్స్లోని క్వెట్టా నుండి పెషావర్కు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. రైలు ఆగిపోయిన అనంతరం, ప్రయాణీకులు అక్కడి నుంచి వెళ్లిపోతున్న వీడియో వైరల్గా మారింది. بلوچستان کے علاقے بولان پمپ کے صدر تھانے کی حدود میں ریلوے ٹریک پر دھماکے کے نتیجے میں جعفر ایکسپریس کی چھ بوگیاں پٹری سے اتر گئیں۔An explosion on the railway track in Balochistan's Bolan Pump area caused six carriages of the Jaffar Express to derail. pic.twitter.com/S9CBiMLknR— Brahag Baluch (@brahagbaluch) June 18, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ రైల్వేస్కు చెందిన జాఫర్ ఎక్స్ప్రెస్ క్వెట్టా నుంచి పెషావర్ మధ్య నడుస్తుంది. దాదాపు 34 గంటల 10 నిమిషాల్లో 1,632 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది. అయితే, జాఫర్ ఎక్స్ప్రెస్ రైలునే ఈ ఏడాది మార్చిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. క్వెట్టాకు దక్షిణంగా ఉన్న పర్వత ప్రాంతం సమీపంలో వందలాది మంది ప్రయాణికులను బందీలుగా తీసుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీకి భద్రతా సిబ్బందిని బీఎల్ఏ దళాలు హతమార్చాయి.NEWSFLASH: Four bogies of the Peshawar to Quetta Jaffar Express derailed after an explosion near Jacobabad. No casualties reported. The Jaffar Express was hijacked by terrorists earlier in the year near Sibi. pic.twitter.com/cLQaZREBhM— Khabar Kada (@KhabarKada) June 18, 2025
జాతీయం

‘కబుర్ల దేవత’ కేంద్ర బాల సాహిత్య పురస్కారం
ఢిల్లీ: బాల సాహిత్య, యువ పురస్కారాలను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. 24 భాషల్లో ఉత్తమ రచనలను ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. తెలుగు భాషకు సంబంధించి గంగిశెట్టి శివకుమార్ రచించిన 'కబుర్ల దేవత' (స్టోరీ) పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం లభించింది. సాహిత్య యువ పురస్కారానికి ప్రసాద్ సూరి రచించిన మైరావణ నవల ఎంపికైంది.భారతీయ భాషల్లో సాహిత్య రంగంలో పలు పుస్తకాలను ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు జ్యూరీ సభ్యులు సిఫారసు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ నేతృత్వంలోని సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అవార్డు గ్రహీతల వివరాలు వెల్లడించింది. ఈ ఏడాది డోగ్రీ భాషకు సంబంధించి యువ పురస్కారాన్ని ప్రకటించలేదు. 23 భాషల్లో ప్రచురితమైన పుస్తకాలకు మాత్రమే యువ పురస్కారాలను ప్రకటించింది.

ఈ నేషనల్ హైవేలపై బీకేర్ఫుల్!
నేషనల్ హైవేలపై రయ్ అంటూ దూసుకుపోతున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. మన దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల్లో క్షతగాత్రులవుతున్నారు. సుదూర ప్రాంతాలను కలిపే జాతీయ రహదారులపైనా జరుగుతున్న యాక్సిడెంట్లు ఎంతో మందిని బలితీసుకుంటున్నాయి. 2022 కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. నేషనల్ హైవేలపై 1,51,997 యాక్సిడెంట్లు చోటుచేసుకున్నాయి. అదే ఏడాది మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 1,68,491 మరణాలు నమోదయ్యాయి. జాతీయ రహదారులపై జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 61,038.మోస్ట్ డేంజర్.. ఎన్హెచ్-44 అయితే జాతీయ రహదారుల్లో కొన్ని అత్యంత ప్రమాదకరంగా మారాయని సేవ్లైఫ్ ఫౌండేషన్ వెల్లడించింది. 2023 ప్రమాదాల గణాంకాల ప్రకారం 100 హైవేలకు ఈ సంస్థ ర్యాంకులు ఇచ్చినట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులు తెలిపారు. ఉత్తరాన శ్రీనగర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి, దేశంలోని అతి పొడవైన రహదారిగా గుర్తింపు పొందిన ఎన్హెచ్-44 అత్యంత ప్రమాదకరమైన హైవేగా తేలింది. హరియాణా, ఢిల్లీలో 44వ నంబరు జాతీయ రహదారిపై 2023లో జరిగిన ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవించినట్టు వెల్లడైంది.కిలోమీటర్కు 3 మరణాలుఎన్హెచ్-44 హరియాణాలో 266 కిలోమీటర్లు విస్తర్తించి ఉంది. 2023లో ఈ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో 715 మంది దుర్మరణం పాలయ్యారు. అంటే కిలోమీటర్కు మూడు మరణాలు సంభవించాయి. ఢిల్లీలో 30 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ హైవేపై 63 మంది మృత్యువాత పడ్డారు. కిలోమీటర్కు దాదాపు 2 మరణాలు నమోదయ్యాయి. ముకర్బా చౌక్- సంఘూ బోర్డర్, ఆశారాం- బహదూర్పూర్ డేంజర్ స్పాట్లగా గుర్తించారు. హరియాణా పరిధిలో 85 కిలోమీటర్ల మేర ఎన్హెచ్-48 విస్తరించివుంది. ఈ రూట్లో గుర్గావ్- రాజస్థాన్ బోర్డర్ను మూడో డేంజర్ జోన్గా పేర్కొంటున్నారు.చదవండి: 6 వారాల్లో 3 హెలికాప్టర్ ప్రమాదాలు.. ఏం జరుగుతోంది?జాతీయ రహదారులపై ఎక్కడెక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయో గుర్తించి, వాటిని నివారించడానికి చేపట్టాల్సిన చర్యలు చేపట్టడానికి ఈ డేటా ఉపయోగపడుతుందని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. రక్షణ చర్యల కోసం హైవే బిల్డర్లు, ఆపరేటర్లను ఆదేశించడానికి ఈ గణాంకాలు దోహదపడతాయన్నారు.

ఇది 20 ఏళ్ల కల.. కొడుకుతోపాటే కానిస్టేబుల్ జాబ్ కొట్టాడు
అతనికి పోలీస్ కావాలనే కల. చదువుకునే టైంలో కష్టపడ్డప్పటికీ ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు. ఈలోపు కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. ఆర్మీ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. కట్ చేస్తే.. ఇరవై ఏళ్ల తర్వాత తన కన్నకొడుకుతో కలిసి పోలీస్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యాడు. కఠోర శ్రమ తర్వాత కొడుకుతో పాటే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఉత్తర ప్రదేశ్లో రెండేళ్ల కిందట(2023 డిసెంబర్లో) 60 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆ పరీక్షలో యశ్పాల్ అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి(41) ఎంపికయ్యాడు. అయితే ఇదే నోటిఫికేషన్లో ఆయన కొడుకు శేఖర్(21)కు కూడా ఉద్యోగం వచ్చింది. అందుకే లక్నో జరిగిన ఈవెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఇద్దరికీ అపాయింట్మెంట్ లెటర్లు ఇప్పించారు ఈ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్. అందుకు ప్రత్యేకంగా కారణం ఉంది.యశ్పాల్ స్వస్థలం హపూర్ జిల్లా ధౌలానా తాలుకా ఉదయ్పూర్ ఉదయ్రాంపూర్ నంగ్లా గ్రామం. రెండు దశాబ్దాల కిందట కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. రెండు అటెంప్ట్లలో జాబ్ కొట్టలేకపోయాడు. ఆపై 2003లో ఆర్మీలో చేరాడు. 16 ఏళ్ల సర్వీస్ తర్వాత వలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని.. ఢిల్లీ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్లో పని చేస్తూ వచ్చారు. ఈలోపు యూపీలో మెగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలదైంది. అప్పటికి ఇంటర్ పూర్తి చేసిన యశ్ పాల్ పెద్ద కొడుకు శేఖర్ ఈ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. భోజనాల దగ్గర తరచూ ఈ మాట ఆ తండ్రి చెవిన పడింది. తనకు పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు. ఆ మాటతో భార్య అనిత సంతోషించింది. రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగులకు వయోపరిమితి సడలింపుతో ఇలాంటి ఉద్యోగాలకు అనుమతిస్తారని తెలుసు కదా. అలా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యశ్పాల్ భావించాడు. మొత్తం 60 వేల ఉద్యోగాలకు.. 48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట్లో శేఖర్ తన తండ్రితో కలిసి పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే యశ్పాల్కు జీకేతో పాటు పలు సబ్జెక్టులలో విపరీతమైన నాలెడ్జ్ ఉంది. అది గమనించి తండ్రి నుంచి తన అనుమానాలను నివృత్తి చేసుకునేవాడట. అలాగే తన తండ్రికి లాజికల్, న్యూమరికల్ రీజనింగ్ సాయం చేస్తూ.. ఇద్దరూ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. లోకల్గా ఉన్న లైబ్రరీకి కలిసి వెళ్లి చదువుకునేవాళ్లు. అలా రెండేళ్ల ప్రిపరేషన్తో.. యూపీ కానిస్టేబుల్ పరీక్షతో పాటు సీడీఎస్, ఎస్సై ఎగ్జామ్లు కూడా రాశారు. 2024 ఆగష్టులో రాతపరీక్ష జరిగింది. ఈలోపు పేపర్లీక్ వ్యవహారంతో ఈ తండ్రీకొడుకుల నెత్తిన పిడుగుపడ్డట్లు అయ్యింది. అయితే తమ శ్రమనే నమ్ముకున్న ఆ తండ్రీకొడుకులు.. తమ ప్రిపరేషన్ను మాత్రం ఆపలేదు. అదే ఏడాది చివర్లో ఫిజికల్ టెస్టులూ జరిగాయి. ఫలితాల్లో.. కొడుకుతో పాటే ఆ తండ్రీ కూడా జాబ్ కొట్టాడు. దీంతో భార్యాపిల్లలు మాత్రమే కాదు.. వాళ్లు ఉంటున్న వాడంతా సంబురాలు చేసుకుంది. లక్నోలో తాజాగా(జూన్ 15వ తేదీన) జరిగిన గ్రాండ్ ఈవెంట్లో అమిత్షా చేతుల మీదుగా ఆ తండ్రీకొడుకులు అపాయింట్మెంట్ లెటర్ అందుకున్నారు. శిక్షణ కోసం షాహ్జహాన్పూర్కు యశ్పాల్, బరేలీకి శేఖర్ వెళ్లారు. రెండు దశాబ్దాల తర్వాత తన కల నెరవేరినందుకు యశ్పాల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

అన్నంలో విషం కలిపి.. భర్తపై నవవధువు ‘కాఠిన్యం’
గర్హ్వా: మేఘాలయకు హనీమూన్ కోసం వెళ్లిన మధ్యప్రదేశ్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ల కథనం మరువకముందే జార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలో ఇదే తరహా దారుణం చోటుచేసుకుంది. హనీమూన్ కేసులో సోనమ్ తన భర్తను అంతమొందించేందుకు కాంట్రాక్టు కిల్లర్లను ఆశ్రయిస్తే, జార్ఖండ్కు చెందిన నవ వధువు సునీతా దేవి భర్తను చంపేందుకు అన్నంలో విషం కలిపింది.జార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలో ఒక నవ వధువు తన భర్తకు విషం ఇచ్చినందుకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రాంకా ప్రాంతానికి చెందిన సునీతా దేవి జూన్ 15న రాత్రి భర్త బుద్ధనాథ్ సింగ్(24)కు పురుగుల మందు కలిపిన ఆహారాన్ని వడ్డించింది. మరుసటి రోజు ఉదయం అతను మృతిచెందాడు. ఈ ఘటనకు ముందు రోజు వ్యవసాయ అవసరాలకు పురుగుమందు అవసరమంటూ భర్త చేత సునీత పురుగుమందు కొనిపించిందని పోలీసులు తెలిపారు. బుద్ధనాథ్ సింగ్ తల్లి రాజమతి దేవి తన కోడలు తన కుమారునిపై విషప్రయోగం చేసిందని ఆరోపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేసింది.రంగంలోకి దిగిన రాంకా పోలీసులు సునీతను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బుద్ధనాథ్ సింగ్ మృతికి గల కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు పోస్ట్మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. కాగా సునీత పోలీసుల ముందు అత్తపై పలు ఆరోపణలు చేస్తూ , కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించింది. అయితే ఆ తరువాత భర్త భోజనంలో తానే విషం కలిపానని,అందుకే భర్త చనిపోయాడని తెలిపింది. బహోకుందర్ గ్రామానికి చెందిన బుద్ధనాథ్ సింగ్, ఛత్తీస్గఢ్కు చెందిన సునీతలకు 2025, మే 11న వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: ‘నాన్న ముఖంపై దిండుతో అదిమి..’ తల్లి దారుణాన్ని బయటపెట్టిన బాలుడు
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి ఎన్కౌంటర్
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సాక్షి, పాడేరు : ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవా రుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కీలక నేతలు సహా ము గ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కింటుకూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్ బల గాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మావోయి స్టుల కు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకు న్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్, అలి యాస్ బిర్సు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, ఏఓబీ జోనల్ కమిటీ ఏరియా కమిటీ సభ్యురాలు అంజు మరణించారు. వీరిలో రవి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం. అరుణ ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్య. ఈమెది విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. గాజర్ల రవి, అరుణపై పోలీస్ రివార్డులున్నాయి. మావో యిస్టులకు సంబంధించిన పలు కీలక సంఘటనల్లో వీరు పాల్గొన్నట్లు పోలీస్ కేసులు నమోదయ్యాయి. అంజుది ఛత్తీ స్గఢ్ అని తెలిసింది. కాగా సంఘటన స్థలంలో పలు ఏకే–47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సేఫ్జోన్ అని..: ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యాన్ని పోలీస్ బలగాలు జల్లెడపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరు స ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో పాపికొండలు, అభయార ణ్యంలోని కొండమొదలు, కింటుకూరు ప్రాంతాలను సేఫ్జోన్గా భావించిన మావోయిస్టులు ఇక్కడకు వచ్చినట్లు భావిస్తున్నారు. సుమారు ఆరునెలల క్రితమే పది మంది మావోయిస్టులు కింటుకూరు అటవీ ప్రాంతానికి వచ్చినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలో నెలరోజుల క్రితం వై. రామవరం–కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.అరుణ అలియాస్ అరుణక్క..వెంకటలక్ష్మి చైతన్య అలియాస్ అరుణ, అలియాస్ అరుణక్క (55) మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు. 20 ఏళ్ల వయస్సు లోనే మావోయిస్టు ఉద్యమం బాటపట్టారు. అమె తమ్ముడు గోపి అలియాస్ ఆజాద్ కూడా 2006లో అక్క మార్గంలోనే ఉద్యమంలో చేరాడు. 2016లో జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్ మృతిచెందారు. అరుణక్క మావోయిస్టు పార్టీలో ఏఓబీ స్పెష ల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉంటూ మహిళా విభాగాల్లో 30 ఏళ్లుగా కీలకంగా వ్యవహరించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి భార్య చనిపోవడంతో అరుణక్కను రెండో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవ రిలో ఒడిశా–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చలప తి మరణించారు. భర్త మరణంతో అరుణ కుంగిపోలేదు. అనేక ఎన్కౌంటర్ల నుంచి ఆమె తప్పించుకున్నారు. పోలీసుల నిర్బంధం తీవ్రంగా ఉండడంతో ఇటీవల కాలంలో రంపచోడ వరం అటవీ ప్రాంతాన్ని సేఫ్జోన్గా మార్చుకుని తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఆరుగురు మావోయిస్టులు భద్ర త ఉన్నప్పటికీ ఎన్కౌంటర్లో బలయ్యారు. ఆమెకు భద్రతగా ఉన్న అంజూ కూడా మృతిచెందారు. ఇక అరుణక్కపై ఏపీలో రూ. 20 లక్షల రివార్డు ఉంది. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసిన ఘటనలో అరుణక్క పాల్గొన్నట్లు పోలీసులు కేసు నమోదుచేశారు. కొద్ది రోజుల క్రితమే పట్టుకుని..నా కుమార్తెను పోలీసులు కొద్ది రోజుల క్రితమే పట్టుకుని బంధించి ఇప్పుడు హతమార్చారు. దీన్ని ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నాం. గతంలో నా కుమారుడు ఆజాద్ను బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం .– లక్ష్మణరావు, అరుణక్క తండ్రిఅగ్రనేతగా ఎదిగి.. శాంతి చర్చల్లో పాల్గొని..సాక్షి ప్రతినిధి, వరంగల్/టేకుమట్ల: మావోయిస్టు అగ్రనేత, శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్ మృతితో ఆయన స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాడిక ల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) నుంచి అజ్ఞాతవాసంలోకి వెళ్లిన రవి.. దళ సభ్యుడిగా మొదలు పెట్టి కేంద్ర కమిటీ వరకు ఎదిగారు. విద్యార్థి దశనుంచే ఉద్యమాలపై ఆసక్తితో విప్లవాల బాట పట్టారు. 1985–86 సంవత్సరంలో వరంగల్లోని ఐటీఐలో చదువుతున్న క్రమంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై ఆర్ఎస్యూలో పనిచేశారు. తన అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ అప్పటికే ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండటంతో ఆ ప్రభావం రవిపై పడింది. 1992లో పూర్తిస్థాయిలో ఉద్యమంలోకి వెళ్లారు. 1994–98 మధ్య ఏటూరునాగారం దళ సభ్యుడిగా, మహాదేవ పూర్లో కమాండర్గా పని చేశారు. 1994లో లెంకలగడ్డలో మందుపాతర పేల్చి ఏడుగురు పోలీసులను చంపిన కేసులో నిందితుడిగా ఉన్నారు. 1998లో ఎన్టీఎస్జెడ్సీ సభ్యుడిగా నియమితుల య్యారు. 2000 సంవత్సరంలో ఖమ్మం – కరీంనగర్ – వరంగల్ (కేకే డబ్ల్యూ) కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2001లో ఏటూరునాగారం పోలీస్ స్టేషన్పై జరిగిన దాడిలో పాల్గొన్నట్టు సమాచారం ఉంది. 2002 సంవత్సరంలో మహాదేవపూర్ కమాండర్గా పనిచేస్తున్న స్వరూప అలియాస్ జిలానీ బేగంను వివాహం చేసుకోగా ఆమె ఏవోబీలోని రామగూడలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయింది. 2007లో ఆంధ్ర ఒడిశా బోర్డర్కు బదిలీ అయిన రవి.. అక్కడ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతూనే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శాంతి చర్చల ఎజెండా రూపకల్పనలో కీలకపాత్రగాజర్ల రవి 2004లో శాంతి చర్చల ప్రతినిధిగా వ్యవహరించారు. కాల్పుల విరమణ, శాంతి చర్చల కు మేధావులు జరిపిన సంప్రదింపులకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు చర్చల ప్రతినిధులుగా జనశక్తి పార్టీ నుంచి వెంకటేశ్ అలియాస్ రియాజ్, మావోయిస్టు పార్టీ నుంచి అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గౌతమ్ అలియాస్ సుధాకర్లతో పాటు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో గాజర్ల రవి కూడా పాల్గొన్నారు. శాంతి చర్చల ఎజెండాను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. రవి అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ (మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ సభ్యుడు) 2008 ఏప్రిల్ 2న ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందగా, ఆయన తమ్ముడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉంటూ అనారోగ్యంతో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.రవి మృతిపై జిల్లా పోలీసులు బుధవారం మధ్యాహ్నం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వెలిశాలకు తీసుకువచ్చి గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎన్కౌంటర్పై అనుమానాలు.. నా సోదరుడి మరణంపై అనుమానాలున్నాయి. ఇప్పటివరకు మృతదేహాల ఫొటోలను విడుదల చేయలేదు. పోలీసులు మృతుల కుటుంబసభ్యులకు మధ్యాహ్నం వరకు సమాచారమివ్వలేదు. ఇది ఎన్కౌంటరో?.. పట్టుకుని కాల్చి చంపారో? ఏదైనా విష ప్రయోగం చేసి ఉండొచ్చు. – మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్

ప్రేమను పెద్దలు అంగీకరించలేదని..
వర్గల్(గజ్వేల్): తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదన్న మనస్తాపంతో ప్రేమ జంట బలవన్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన మంగళవారం వర్గల్ మండలం అవుసులోనిపల్లిలో చోటుచేసుకున్నది. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెక్కల ఆంజనేయులు, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు కల్పన(18) ఉంది. కల్పన ఇంటర్మీడియట్ చదివి ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఉప్పరి మల్లేశం, మంజుల దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు శివకుమార్ (21) ఉన్నారు. ఒకే గ్రామానికి చెందిన కల్పన, శివకుమార్ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. కుటుంబీకులు వారి ప్రేమను అంగీకరించలేదు. మరోవైపు కూతురు వివాహం కోసం సంబంధం కుదుర్చుకునే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ నేపథ్యంలో తమ ప్రేమ విఫలమైందని కల్పన, శివకుమార్ మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం ఉదయం శివకుమార్ తన వ్యవసాయ క్షేత్రంలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ విషయం తెలిసిన కొద్ది వ్యవధిలోనే కల్పన తన ఇంట్లో పైకప్పు పైపునకు చున్నీతో ఉరివేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గజ్వేల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు.

కసాయి కూతురు.. ప్రియుడితో కలిసి కన్నతండ్రినే కడతేర్చింది
సాక్షి, మహబూబాబాద్: కూతురి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని ఆ తండ్రి భయపడ్డాడు. ఆమె ప్రేమ వ్యవహారం తెలిసి ‘వద్దూ.. బిడ్డా’ అని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపు ఆమెకు నచ్చలేదు. తండ్రిపైనే కోపం పెంచుకుంది. ప్రియుడిని రప్పించి ఆ తండ్రినే హతమార్చింది. మరిపెడ మండలం జండాల తండాలో జరిగిన ఈ దారుణం వివరాల్లోకి వెళ్తే.. దారావత్ కిషన్ తన కూతురు ఓ కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుందని తెలిసి మందలించాడు. దీంతో తన ప్రియుడిని రప్పించిన ఆమె.. తండ్రిని కట్టేసి చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన కిషన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ తండ్రి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కూతురి ఘాతుకం పట్ల స్థానికులు రగిలిపోతున్నారు. అయితే ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని సమాచారం.

భర్తను కలవాలి, ఎవరికైనా మంత్రాలు తెలుసా?
అన్నానగర్(తమిళనాడు): నెల్లై జిల్లాలోని పనగుడి సమీపం పళవూర్ మదన్పిళ్లై ధర్మం గ్రామానికి చెందిన శివలింగదురై కుమార్తె కయల్విళి (28). ఆమె వివాహం చేసుకుని భర్త నుండి విడిపోయి తల్లిదండ్రులతో నివశిస్తోంది. గత ఏడాది అక్టోబర్ 5న ఆలయానికి వెళ్తున్నానని చెప్పి కనిపించకుండా పోయిన కయల్విళి అదృశ్యమైంది. ఫిర్యాదు ఆధారంగా పళవూరు పోలీసులు గత 8 నెలలుగా కేసు నమోదు చేసి వెతుకుతున్నారు. ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాల రికార్డింగులను పరిశీలించినప్పుడు, కన్యాకుమారి జిల్లాలోని కొట్టారం ప్రాంతానికి చెందిన శివ స్వామి అనే పూజారి కయల్విళిని కారులో తీసుకెళ్లినట్లు వెల్లడైంది. దీని తరువాత అతన్ని అరెస్టు చేసి విచారించారు. అతను తన సహచరులతో కలిసి కయల్విళి మెడలో ఉన్న 7 సవర్ల బంగారు చైన్ కోసం ఆమెను గొంతు నులిమి హత్య చేసి, 80 అడుగుల కోయ మహాదేవి కాలువలోకి విసిరేసినట్లు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలువడ్డాయి. కాలువ నుండి కయల్విళి అస్థిపంజరాన్ని స్వా«దీనం చేసుకున్నారు. ఖైదీలను విచారించగా దిగ్భ్రాంతికరమైన సమాచారం వెల్లడైంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ఈమె 2022లో బెంగళూరులో పనిచేస్తున్న యువకుడిని వివాహం చేసుకుంది. ఆమె ఫిబ్రవరి 2024లో తన భర్త నుండి విడిపోయింది. కయల్విళి తన భర్తతో తిరిగి కలవాలని ప్రార్థించడానికి అనేక దేవాలయాలను సందర్శిస్తోంది. ఈ పరిస్థితిలో ఆమె ఫేస్బుక్లో తన భర్తతో కలపటానికి మంత్రం బాగా తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని పోస్ట్ చేసింది. మాయాండి రాజా మొదట ఈ విషయంపై కయల్విళిని సంప్రదించాడు. వారు ఆమెను మంత్రవిద్య చేసే శివస్వామి వద్దకు తీసుకెళ్లి, ఆమె నుండి డబ్బు వసూలు చేయాలని ప్లాన్ చేశారు. దీని ప్రకారం శివస్వామి, మాయాండి వీరు కయల్విళిని నుంచి అనేక వాయిదాలలో మొత్తం రూ.5 లక్షలు చెల్లించాడు. ఆమెను మళ్లీ ఆమె భర్తతో కలిసి జీవించనిస్తానని చెప్పాడు. ఒకానొక సమయంలో, వారు మోసం చేస్తున్నారని తెలిసిన కయల్విళి వారిని తన డబ్బు తిరిగి ఇవ్వమని కోరింది. మాయాండి, శివస్వామి, అతని కుమారుడు శివ, సంఘటన జరిగిన రోజున కయల్విళికి ఫోన్ చేసి, డబ్బు ఇస్తామని హామీ ఇచ్చారు. తరువాత మాయాండి రాజా, అతని సోదరి కుమారుడు, వీరవనల్లూరుకు చెందిన కన్నన్, శివనేశ్వరి సహా నలుగురు హత్య చేశారు. తరువాత ఆమె ధరించిన 7 తులాల నగలను తీసుకొని, కయల్విళి మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి, చేరన్మాదేవి పక్కన ఉన్న గంగానకుళం సమీపంలోని 80 అడుగుల కాలువలో విసిరేసి, సాధారణ జీవితాన్ని గడిపారని తేలింది. ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేసిన నలుగురిని కోర్టులో హాజరుపరిచారు. తదనంతరం, శివనేశ్వరిని కొక్కిరాకుళం మహిళా జైలుకు, మిగిలిన ముగ్గురిని పాలైయంగోటై సెంట్రల్ జైలుకు తరలించారు.