ప్రధాన వార్తలు

APMDC ద్వారా బాండ్ల జారీ.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, అమరావతి: అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరోసారి అదే తప్పు చేసేందుకు బరితెగించింది. హైకోర్టులో కేసు నడుస్తున్నా సరే లెక్క చేయకుండా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా రెండోసారి ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్) బాండ్లు జారీ చేసింది. రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం (జూన్22) ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న చంద్రబాబు తీరును ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎండీసీ ద్వారా మళ్లీ రుణ సమీకరణకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ఖజానా నుండి ప్రయివేటు వ్యక్తులు నిధులు డ్రా చేసుకునేలా ఆదేశాలు ఇవ్వటం రాజ్యాంగ ఉల్లంఘనే. శాసనసభ ఆమోదం లేకుండా ప్రభుత్వ ఖజానా నుండి నిధుల డ్రా చేయడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం యధేచ్చగా ఆర్టికల్స్ 203, 204 ఉల్లంఘించింది.ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలను ప్రయివేటు వ్యక్తుల చేతిలో పెట్టటం చట్ట ఉల్లంఘనే. రూ. 1,91,000 కోట్ల విలువైన ఖనిజ సంపదను ప్రయివేటు వ్యక్తులకు తాకట్టు పెట్టారు. ఇది రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేయటమే. ఈ వ్యవహారంపై హైకోర్టులో కేసు నడుస్తోంది. ఆ కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. ఆ కేసు నడుస్తుండగానే ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ బాండ్లు జారీ చేయటం సరికాదు. ఇది కచ్చితంగా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే. అంతేకాదు రాష్ట్ర భవిష్యత్తును కూడా ప్రభుత్వం నాశనం చేస్తోంది’ అంటూ ఎక్స్లో పేర్కొన్నారు.Another breach of the Constitution of India by the AP Government. It is learnt that, APMDC is attempting another Bond (NCD) issuance on 24th June, 2025, on terms violative of the Constitution of India, in an unprecedented manner.Private parties are being… pic.twitter.com/QVgwk7dKe8— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2025

సింగయ్య మరణంపై కుట్రలు.. ఎల్లో మీడియాకు బిగ్ షాక్
సాక్షి,గుంటూరు: సింగయ్య మరణంపై పుంకాలు పుంకాలుగా ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా అండ్ గ్యాంగ్కు బిగ్ షాక్ తగిలింది. సింగయ్య ప్రమాదం సమయంలో ఏం జరిగిందో తెలిపేలా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా చేస్తున్న కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి. వైఎస్ జగన్పై కొనసాగుతున్న ప్రజల ఆదరాభిమానాలను చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతోంది. అందుకే వైఎస్ జగన్ను ప్రజల్లో తిరిగే అవకాశం లేకుండా, ఆటంకాలు సృష్టించేందుకు తన ఎల్లో మీడియాతో కలిసి కుట్రకు తెరతీసింది. అందుకు రెంటపాళ్ల వైఎస్ జగన్ పర్యటనను వినియోగించుకుంది కూటమి ప్రభుత్వంలో నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక పల్నాడు జిల్లా, సత్తెన పల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, నాగమల్లేశ్వరరావు కుటుంబసభ్యుల్ని పరామర్శించేందుకు జూన్ 18న వైఎస్ జగన్ రెంటపాళ్ల వెళ్లారు. వెళ్లే సమయంలో వైఎస్ జగన్ కాన్వాయ్ ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని ఎల్లో మీడియా అబద్ధాలు ప్రచారం చేసింది. కానీ కొద్ది సేపటికే ఎల్లో మీడియా కుట్రలు బయటపడ్డాయి. వైఎస్ జగన్ కాన్వాయ్కి కంటే ముందు వెళ్లిన వాహనం ఢీకొట్టిన తర్వాత సింగయ్య రోడ్డు పక్కన గాయాల పాలవ్వగా.. అప్రమత్తమైన స్థానికులు 108 ఫోన్ చేశారు. 108 వాహనం రావడం, అందులో సింగయ్యను తరలించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వీడియో లభ్యం కావడంతో ఎల్లో మీడియా కుట్ర బట్టబయలైంది. వైఎస్ జగన్ వాహనం ఢీకొట్టడంతో సింగయ్య మరణించారంటూ పచ్చ మీడియా విష ప్రచారం చేసిన కొద్ది సేపటికే ఒరిజినల్ వీడియో రావడంతో ఎల్లో గ్యాంగ్ అడ్డంగా దొరికింది.

అంపైర్తో వాగ్వాదం.. సహనం కోల్పోయిన పంత్
లీడ్స్: భారత్ -ఇంగ్లండ్ల మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రిషభ్ పంత్ సహనం కోల్పోయాడు. ఆదివారం మూడో రోజు ఆటలో భాగంగా తొలి సెషన్లో భారత వైస్ కెప్టెన్ పంత్ కాస్త దూకుడుగా వ్యవహరించాడు. అంపైర్ పాల్ రఫెల్ వద్దకు వెళ్లి బాల్ను మార్చాలంటూ విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో బాల్ను పట్టుకుని చూసిన అంపైర్ రఫెల్.. అవసరం లేదు అంటూ అదే బాల్ను తిరిగి పంత్కు చేతికిచ్చాడు. దాంతో అసంతృప్తి చెందిన పంత్.. అదే బాల్తో నేలకేసి కొట్టాడు. ఇది 63 ఓవర్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ క్రీజ్లో ఉన్న సమయంలో జరిగింది. పంత్ ఇలా ప్రవర్తించడం ఐసీసీ క్రమశిక్షణా చర్యలు ఉల్లంఘన చర్యలు కిందకు రావడంతో భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఇది ఐసీసీ నియమావళికి విరుద్ధం కావడంతో పంత్పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. Rishabh Pant asked the umpire to change the ball, got denied and then threw it in frustration 😭😭😭 pic.twitter.com/F1A78XGwWV— Sandy (@flamboypant) June 22, 2025 కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 471 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ కూడా అంతే ధీటుగా బదులిస్తోంది. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ లో భాగంగా ఓలీ పోప్)106) సెంచరీ చేయగా, హారీ బ్రూక్ 99 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

అమెరికా దాడులు.. ఇరాన్కు అండగా రష్యా..!
టెహ్రాన్: ఇరాన్పై యుద్ధం వద్దూ అంటూ ఇది వరకే అమెరికాను హెచ్చరించిన రష్యా... ఈ మేరకు దిద్దబాటు చర్యలు చేపట్టడానికి నడుంబిగించింది. ఇరాన్కు అణ్వాయుధాలు సరఫరా చేయడానికి చాలా దేశాలే సిద్ధంగా ఉన్నాయని రష్యా మరోసారి హెచ్చరికలు పంపింది.రష్యాకు ఇరాన్ రక్షణమంత్రిఇజ్రాయిల్, అమెరికాలు.. ఇరాన్ను అతలాకుతులం చేసే దిశగా యుద్ధాన్ని తీవ్రతరం చేయడంతో ఇరాన్ ఏం చేయాలనే దానిపై ఆలోచనలో పడింది. దీనిలో భాగంగా తమకు అండగా ఉన్న రష్యా సహకారం కోసం ఇరాన్ ప్రయత్నాలు ఆరంభించింది. ఈ మేరకు ఇరాన్ రక్షణమంత్రి అబ్బాస్ అరాగ్చీ.. అగమేఘాల మీద రష్యాకు బయల్దేరారు. రేపు(సోమవారం) రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ఇరాన్ రక్షణశాఖ అధికారికంగా వెల్లడించింది. రక్షణమంత్రి అరాగ్చీ.. రష్యాకు వెళ్లే విషయాన్ని వెల్లడించారు. మూడు ఇరాన్ కీలక అణుస్థావరాలపై అమెరికా బాంబుల దాడితో విరుచుకుపడిన తరుణంలో.. రష్యా ఆదేశాలతో ఇరాన్ ముందుకెళ్లే అవకాశం ఉంది.‘ఇరాన్కు రష్యా మిత్రదేశం. మేము ఎప్పుడూ రష్యాను ఆశ్రయిస్తూనే ఉంటాం. నేను మాస్కోకు అత్యవసరంగా బయల్దేరి వెళుతున్నా. రష్యా అధ్యక్షుడు పుతిన్తో కీలక సమావేశం ఉండనుంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం మాపై అమెరికా చేసే దాడి కచ్చితంగా అతిక్రమణ కిందకే వస్తుంది. మా అణుస్థావరాలపై దాడులకు దిగిన అమెరికా రెడ్ లైన్ క్రాస్ చేసింది. ఐక్యరాజ్యసమితిలో మాకున్న హక్కులను కాపాడుకోవడమే మా తదుపరి కర్తవ్యం. మేము కచ్చితంగా వారికి బుద్ధి చెబుతాం’ అని అరాగ్చీ స్పష్టం చేశారు. ట్రంప్ మరో యుద్ధాన్ని మొదలుపెట్టారు..ఇరాన్పై అమెరికా దాడులకు దిగడాన్ని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ ఖండించారు. ఇరాన్పై దాడులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో యుద్ధానికి తెరలేపారని విమర్శించారు. ఈ యుద్దంతో అమెరికా సాధించింది ఏమీ లేదనే విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. ప్రస్తుతం ఇరాన్పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎటువంటి గణనీయమైన సైనిక లక్ష్యాలను ఛేదించడంలో విఫలమైందన్నారు. ఇక్కడ ఇరాన్ స్వల్ప నష్టాన్ని మాత్రమే చవిచూసిందన్నారు.ఆ దుస్సాహసం వద్దు.. రష్యా వార్నింగ్ఇరాన్పై అమెరికా సైనిక చర్యకు దిగడం సరైన చర్య కాదంటూ హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా దాడులు చేయడానికి దిగడానికి ముందుగానే రష్యా క్లియర్ మెస్సేజ్ ఇచ్చింది. ఇజ్రాయిల్-ఇరాన్ల యుద్ధంలో అమెరికా సైనిక చర్యకు దిగితే అది ఎంతమాత్రం సమర్థనీయంగా కాదని రష్యా విదేశాంగా ప్రతినిధి మారియా జకారోవా ఇదివరకే స్పష్టం చేశారు. ‘అమెరికాను ముందుగా హెచ్చరించే విషయం ఏంటంటే.. ‘ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధానికి అమెరికా దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ అమెరికా సైనిక చర్యకు దిగితే అది దుస్సాహసమే అవుతుంది. ఈ యుద్ధంలో ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సైనిక చర్యకు దిగడం అనేది చాలా ప్రమాదకరం. ఊహించని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. ఆ యోచనను పక్కన పెడితేనే మంచిది’ అని ఆమె స్పష్టం చేశారు.మరొకవైపు ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడి చెర్నోబిల్(1986లో ఉక్రెయిన్లో సంభవించిన ఒక పెద్ద అణు విపత్తే చెర్నోబిల్. అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ పేలిపోయి, రేడియోధార్మిక పదార్థాలు గాలిలోకి విడుదలయ్యాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదాలలో ఒకటిగా లెక్కించబడింది) తరహా విపత్తుకు దారితీయవచ్చని రష్యా అణుశక్తి కార్పొరేషన్ సైతం హెచ్చరించింది. ఏదైనా జరగొచ్చు..ఇరాన్కు అణ్వాయుధాలు సరఫరా చేయడానికి చాలా దేశాలే సిద్ధంగా ఉన్నాయని అమెరికాను పరోక్షంగా హెచ్చరించిన రష్యా.. నేరుగా రంగంలోకి దిగితే యుద్ధం మరింత ముదరడం ఖాయం. ఇరాన్కు ఆది నుంచి మద్దతు ఇస్తూ వస్తున్న రష్యా.. ఇప్పుడు ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తోంది. ఇరాన్ రక్షణమంత్రితో భేటీ అనంతరం రష్యా తదుపరి కర్తవ్యం ఏమటనేది తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ రష్యా యుద్ధంలోకి దిగి ఇరాన్కు మద్దతిస్తే మాత్రం భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ శాంతి చర్చలు అనేది చాలా కీలకమని వారు భావిస్తున్నారు. ఇరాన్ రక్షణమంత్రితో జూన్ 23వ తేదీన పుతిన్ భేటీలో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యుద్ధాన్ని ఇక్కడితో ముగిస్తే మంచిదని ఇరాన్కు పుతిన్ ఆదేశాలు ఇస్తే ఫర్వాలేదు కానీ, నేరుగా రష్యా కూడా యుద్ధంలోకి వస్తే మాత్రం సైనిక పరంగా రెండు అగ్రదేశాల మధ్య వార్ మరింత హీట్ పుట్టించే అవకాశాలు కూడా లేకపోలేదు.

ఇజ్రాయెల్,అమెరికా విరుచుకు పడుతున్న వేళ.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!
సాక్షి,ఢిల్లీ: ఇరాన్పై ఇజ్రాయెల్,అమెరికా దాడులకు తెగబడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాలు శాంతి నెలకొల్పేలా చర్చలు జరపాలంటూ భారత ప్రధాని మోదీ (Narendra Modi) ఇరాన్ అధ్యక్షుడితో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో (Masoud Pezeshkian) ఫోన్లో మాట్లాడారు. ఈమేరకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో నేను మాట్లాడాను. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా జరుపుతున్న దాడుల గురించి చర్చించాం. ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేశాం. ప్రాంతీయంగా శాంతి, భద్రత, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి, తక్షణ ఉద్రిక్తతలను తగ్గించడం, శాంతి చర్చలు జరపాలని చెప్పినట్లు ’ పేర్కొన్నారు. Spoke with President of Iran @drpezeshkian. We discussed in detail about the current situation. Expressed deep concern at the recent escalations. Reiterated our call for immediate de-escalation, dialogue and diplomacy as the way forward and for early restoration of regional…— Narendra Modi (@narendramodi) June 22, 2025సుదీర్ఘకాలం నుంచి ఇరాన్తో పాటు ఇరాన్ మద్దతిస్తున్న హమాస్, హెజ్బొల్లా వంటి మిలిటెంట్లు గ్రూపులు ఇజ్రాయెల్పై దాడులకు తెగబడుతున్నాయి. ఈ దాడులు తన భద్రతకు ముప్పుగా భావిస్తోంది. అందుకే ఇజ్రాయెల్ హమాస్, హెజ్బొల్లాతో పాటు ఇరాన్పై దాడుల్ని తీవ్రతరం చేసింది.ఇరాన్పై అమెరికా ఎందుకు దాడులు చేస్తోంది?ఈ ఇరు దేశాల యుద్ధంలో ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా సైన్యం శనివారం (జూన్ 21, 2025న) ఇరాన్లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అనే అణు కేంద్రాలపై B-2 స్పిరిట్ బాంబర్లతో భారీ బాంబుల వర్షం కురిపించింది. ట్రంప్ సైతం ఈ దాడి విజయవంతమైందని పేర్కొన్నారు. ( ఫొటొ:ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా ప్రయోగించిన బీ-2 స్పిరిట్ బాంబార్స్), image source: (యూఎస్ఏ టుడే)ఈ దాడి ద్వారా అమెరికా అధికారికంగా యుద్ధంలోకి దిగినట్టయింది. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే ప్రధాన ఉద్దేశమని ట్రంప్ తెలిపారు. అయితే, ఈ చర్యపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది యుద్ధాన్ని మరింత పెంచుతుందా లేక శాంతికి దారి తీస్తుందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కావొచ్చని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధానికి కారణంఇరాన్ ప్రధానంగా హమాస్ (పాలస్తీనా), హెజ్బొల్లా (లెబనాన్) వంటి మిలిటెంట్ గ్రూపులకు ఆర్థిక సహాయం, ఆయుధాలు, శిక్షణ అందిస్తోంది. ఈ శిక్షణను ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)లోని ఖుద్స్ ఫోర్స్ అనే విభాగం నిర్వహిస్తోంది.హమాస్: ఇజ్రాయెల్పై అక్టోబర్ 7,2023న జరిగిన దాడికి ముందు, హమాస్ మిలిటెంట్లు ఇరాన్లో శిక్షణ పొందినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. వీరికి డబ్బు,ఆయుధాలు,సాంకేతిక సహాయం కూడా అందించినట్లు ఆరోపించింది. హెజ్ బొల్లా: ఇది లెబనాన్లో ఉన్న షియా మిలిటెంట్ గ్రూప్. దీనికి ఇరాన్ మద్దతు ఇస్తుంది. హెజ్ బొల్లాకు ఆయుధాలు, శిక్షణతో పాటు వ్యూహాత్మక సలహాలు సూచనలు ఇస్తోంది.అందకు హెజ్బొల్లా, హమాస్తో పాటు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రతరం చేసింది. హెజ్బొల్లా,హమాస్ గ్రూపుల్ని నిర్విర్యం చేసింది. ఆ రెండు గ్రూపులకు కీలకంగా వ్యవహరిస్తున్న టాప్ కమాండర్లను హతమార్చింది. ఇప్పుడు ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది.

ఫైనల్లీ కనిపించిన 'కన్నప్ప' డైరెక్టర్.. ఈయన ఎవరంటే?
మంచు ఫ్యామిలీ తీసిన 'కన్నప్ప'.. ఈ వీకెండ్ (జూన్ 27న) థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో కాస్త జోరు పెంచారు. తాజాగా శనివారం రాత్రి హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. టీమ్ అంతా మూవీ కబుర్లు చెబుతూ సందడి చేశారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ చిత్ర దర్శకుడు కూడా కనిపించడం ఆసక్తికరంగా అనిపించింది. ఇంతకీ ఆయనెవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు)గత కొన్నాళ్ల నుంచి 'కన్నప్ప' ప్రమోషన్లు చేస్తున్నారు. చాలావరకు హీరో కమ్ నిర్మాత అయిన మంచు విష్ణునే కనిపిస్తున్నాడు. చిత్ర సంగతులన్నీ చెప్పాడు. ఇప్పటికీ ఏదో ఓ ఇంటర్వ్యూ ఇస్తూ మరిన్ని విషయాలు చెబుతూనే ఉన్నాడు. సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ దగ్గరుందంటే దర్శకుడు కూడా ప్రమోషన్లలో కనిపిస్తారు. 'కన్నప్ప' విషయంలో సదరు డైరెక్టర్ తప్పితే అందరూ కనిపిస్తూ వచ్చారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఈయన కనిపించారు.సడన్గా 'కన్నప్ప' దర్శకుడు ఎవరిని అడిగితే చాలామంది చెప్పలేరు. ఎందుకంటే తొలి నుంచి విష్ణు, ప్రభాస్ లేదంటే మోహన్ లాల్ పేర్లు మాత్రమే ప్రమోషన్లలో వినిపించాయి. కానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ముకేశ్ కుమార్ సింగ్ కూడా మామూలోడు ఏం కాదు. ఎందుకంటే 2012లో రామాయణ్, 2013-14లో మహాభారత్ సీరియల్స్లో కొన్ని ఎపిసోడ్స్కి దర్శకత్వం వహించారు. వీటితో పాటు తెనాలి రామ, మేరే సాయి తదితర భక్తిరస సీరియల్స్ తీసిన అనుభవం ఈయన సొంతం. 2008 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాకపోతే ఎక్కువశాతం సీరియల్స్కి మాత్రమే దర్శకత్వం వహించడంతో సినిమా ప్రేక్షకులకు ఈయన గురించి పెద్దగా తెలియలేదు.(ఇదీ చదవండి: ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని.. : మంచు విష్ణు)అలా పీరియాడికల్, భక్తి సీరియల్స్ తీసిన అనుభవం ఉండటంతోనే ముకేశ్ కుమార్ సింగ్కి.. 'కన్నప్ప' దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ట్రైలర్ చూస్తే ఆయన పనితనం బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. రిలీజ్ తర్వాత ఆయన వర్క్ ఏంటనేది పూర్తిగా తెలుస్తుంది. కాకపోతే ప్రమోషన్లలో ఆయనని ఎక్కువగా హైలైట్ చేయకపోవడానికి కూడా కారణమున్నట్లు కనిపిస్తుంది. స్వతహాగా ఆయనో హిందీ డైరెక్టర్. తెలుగు వాళ్లకు తెలిసింది చాలా తక్కువ. అందుకేనేమో మంచు విష్ణు.. ప్రమోషన్ల బాధ్యతని తన నెత్తిన వేసుకున్నాడు. దర్శకుడిని పెద్దగా కష్టపెట్టలేదనిపిస్తుంది.మంచు విష్ణు హీరో కమ్ నిర్మాతగా తీసిన 'కన్నప్ప'లో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు అతిథి పాత్రలు పోషించారు. మోహన్ బాబు, కాజల్, మధుబాల లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై తెలుగులో ఓ మాదిరి అంచనాలున్నాయి. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: మోహన్ బాబు ఇంటికొచ్చి ప్రాధేయపడ్డారు: బ్రహ్మనందం)

తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. దీనిలో భాగంగా ఆదివారం(జూన్ 22) తెలంగాణ భవన్ను ముట్టడించడానికి యత్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు.. తెలంగాణ భవన్లోకి దూసుకుపోవడానికి యత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తల్ని చెదరగొట్టి పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. సీఎం బినామీలే అక్రమ మైనింగ్ చేస్తున్నారని, తెలంగాణ మంత్రులు ఇసుక దందాకు పాల్పడుతున్నారని నిన్న(శనివారం) వరంగల్లో కౌశిక్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను తెలంగాణ భవన్ వేదికగా బయటపెడతాననని కౌశిక్రెడ్డి విమర్శించారు.

‘పహల్గామ్’ ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరు అరెస్ట్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో భాగస్వామ్యం కలిగిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ఆదివారం అరెస్టు చేసింది. వీరిని పహల్గామ్కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్లుగా గుర్తించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా (ఎల్ఈటీ)తో సంబంధం కలిగిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించడంలో పాటు వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉగ్రదాడి కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ దాడికి ముందు హిల్ పార్క్ ప్రాంతంలోని ఈ ఉగ్రవాదులను నిందితులు దాచి ఉంచారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. విచారణ సమయంలో పర్వైజ్, బషీర్ ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నవారి గుర్తింపులను వెల్లడించారని, వారు పాకిస్తానీ జాతీయులని నిర్ధారించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. పర్యాటకులను వారి మతపరమైన గుర్తింపు ఆధారంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇది ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన భారీ ఉగ్రదాడులలో ఒకటిగా నిలిచింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 19 కింద వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి, 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడుల్లో16 మంది గాయపడ్డారు.ఇది కూడా చదవండి: అమెరికా అంతటా హై అలర్ట్.. ఇరాన్పై దాడుల ఫలితం

ఐఐటీలకు ధీటుగా ఎల్పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ
భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్మార్క్ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)లో ఇటీవలి ఫ్లేస్మెంట్ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్పీయూ ప్లేస్మెంట్ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్మెంట్ డ్రైవ్తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్తో భారీ ఎల్పీయూ ప్లేస్మెంట్ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్వర్క్స్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్పీయూ తాజా ప్లేస్మెంట్ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్మెంట్ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్కు ప్రపంచ ఖ్యాతిఎల్పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్మెంట్ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్పీయూ ఎందుకంటే?ఎల్పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్మెంట్ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్ ప్లేస్మెంట్ ట్రెయినింగ్ పొందుతారు.‘ఎల్పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్మెంట్ ల్యాండ్ స్కేప్లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి.

మరో హనీమూన్ మర్డర్?: తెలుగు రాష్ట్రాల్లో కలకలం.. పెళ్లైన నెల రోజులకే భర్త హత్య?
సాక్షి,కర్నూల్: మేఘాలయ హనీమూన్ మర్డర్ (meghalaya honeymoon case) తరహాలో.. తెలుగు రాష్ట్రాల్లో మరో హనీమూన్ మర్డర్ కలకలం రేపుతోంది. పెళ్లైన నెలరోజులకే, కొత్త పెళ్లి కొడుకు దారుణంగా హతమయ్యాడు. ఈ హత్యకు పాల్పడింది బాధితుడి భార్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.11 రోజులకే హనీమూన్ పేరుతో ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi)తన భర్త రాజా రఘువంశీని (raja raghuvanshi) మేఘాలయాలో హతమార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహా ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ హనీమూన్ హత్య ప్రణాళికా హత్యా? లేక పాతకక్షల కారణంగా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లాలో అదృశ్యమైన యువకుడు నంద్యాల జిల్లా పాండ్యంలో హత్యకు గురయ్యాడు. మహబూబ్ నగర్ పట్టణం ఘంటవీధికి చెందిన జి.తేజేశ్వర్ లైసెన్స్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17నుంచి తేజేశ్వర్ కనపకడపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేజేశ్వర్ నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని పిన్నాపురంలో దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తేజేశ్వర్కు కర్నూల్ చెందిన యువతితో వివాహం జరిగింది. నిందితుల్ని గుర్తించిన కఠినంగా శిక్షించాలని బాధితుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.మే 18న బీచ్పల్లిలో తేజేశ్వర్కు కర్నూలు జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన రోజుల వ్యవధిలో భర్త తేజేశ్వర్ హత్యకు గురికావడం కలకలం రేపింది. తేజేశ్వర్ హత్యపై అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నేను నటించగలనని శేఖర్ కమ్ముల నిరూపించారు: రష్మిక
APMDC ద్వారా బాండ్ల జారీ.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
భారత్తో టెస్టు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఇలా.. !
మీనాక్షి ఇలా.. ట్రెండింగ్ బ్యూటీ ఇవానా అలా
అంపైర్తో వాగ్వాదం.. సహనం కోల్పోయిన పంత్
ప్రభాస్ 'రాజాసాబ్' హీరోయిన్కి అవార్డ్
శాంతి నెలకొని ఒక దశాబ్దం.. సమైక్యతా సమయం
'లోపలికి రా చెప్తా' ట్రైలర్ రిలీజ్
సింగయ్య మరణంపై కుట్రలు.. ఎల్లో మీడియాకు బిగ్ షాక్
ఇరాన్ అన్నంత పని చేసింది.. ప్రపంచ దేశాలపై ప్రభావం!
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు
‘డిప్యూటీ సీఎం కనబడుటలేదు’
నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు
'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?
రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
Kuberaa: ‘కుబేర’ మూవీ రివ్యూ
అబ్బే పార్టీ పరిస్థితి అలా ఉందని కాదయ్యా..! యోగా చేస్తున్నారు.
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. స్థిరాస్తివృద్ధి
దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?
సాక్షి కార్టూన్ 20-06-2025
తోడబుట్టిన బలగం
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
మీరు ఎవరికీ నోటీసులు ఇవ్వొద్దు.. విచారణ చేయొద్దు
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
శేఖర్ కమ్ముల కుబేర.. అసలు ఈ క్యారెక్టర్ను ఎలా ఒప్పుకున్నాడు?
నేను నటించగలనని శేఖర్ కమ్ముల నిరూపించారు: రష్మిక
APMDC ద్వారా బాండ్ల జారీ.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
భారత్తో టెస్టు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఇలా.. !
మీనాక్షి ఇలా.. ట్రెండింగ్ బ్యూటీ ఇవానా అలా
అంపైర్తో వాగ్వాదం.. సహనం కోల్పోయిన పంత్
ప్రభాస్ 'రాజాసాబ్' హీరోయిన్కి అవార్డ్
శాంతి నెలకొని ఒక దశాబ్దం.. సమైక్యతా సమయం
'లోపలికి రా చెప్తా' ట్రైలర్ రిలీజ్
సింగయ్య మరణంపై కుట్రలు.. ఎల్లో మీడియాకు బిగ్ షాక్
ఇరాన్ అన్నంత పని చేసింది.. ప్రపంచ దేశాలపై ప్రభావం!
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు
‘డిప్యూటీ సీఎం కనబడుటలేదు’
నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు
'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?
రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
Kuberaa: ‘కుబేర’ మూవీ రివ్యూ
అబ్బే పార్టీ పరిస్థితి అలా ఉందని కాదయ్యా..! యోగా చేస్తున్నారు.
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. స్థిరాస్తివృద్ధి
దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?
సాక్షి కార్టూన్ 20-06-2025
తోడబుట్టిన బలగం
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
మీరు ఎవరికీ నోటీసులు ఇవ్వొద్దు.. విచారణ చేయొద్దు
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
శేఖర్ కమ్ముల కుబేర.. అసలు ఈ క్యారెక్టర్ను ఎలా ఒప్పుకున్నాడు?
సినిమా

కూతురి అన్నప్రాసన వేడుకలో రాకింగ్ రాకేశ్
కమెడియన్గా కెరీర్ ప్రారంభించి.. 'జబర్దస్త్' కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేశ్ ప్రస్తుతం పలు సినిమాలు, ఈవెంట్స్ చేసుకుంటున్నాడు. గత కొన్నాళ్లుగా టీవీ కామెడీ షోల్లో ఎక్కడా కనిపించట్లేదు. 2023లో యాంకర్ సుజాతని పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు వీళ్లిద్దరూ వీడియోలు పోస్ట్ చేస్తూ వచ్చారు. 8 నెలల క్రితం వీళ్లకు కూతురు పుట్టగా.. ఇప్పుడు ఆ చిన్నారి తొలి పండగని సెలబ్రేట్ చేసుకున్నారు.(ఇదీ చదవండి: నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు)తన కూతురు ఖ్యాతికకు అన్నప్రాసన జరిగిన విషయాన్ని కాస్త ఆలస్యంగానే రాకేశ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఫొటోగ్రాఫర్స్ ఆలస్యం వల్ల ఇలా లేటుగా ఫొటోలు పెట్టానని విషయాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు. దేవుడికి పూజ చేయడం, అమ్మాయిని చూపించడం లాంటివి చేశారు గానీ పాప ఏం దేన్ని ఒడిసి పట్టుకుందనేది మాత్రం రివీల్ చేయలేదు.రాకేశ్ భార్య సుజాత విషయానికొస్తే.. న్యూస్ యాంకర్గా కెరీర్ మొదలుపెట్టింది. బిగ్బాస్ 4వ సీజన్లో పాల్గొంది. కాకపోతే ఎక్కువ వారాలు హౌసులో ఉండలేకపోయింది. ప్రస్తుతం ఈమె కూడా ఎక్కడా పనిచేయట్లేదు. పాపని చూసుకుంటోంది. ప్రస్తుతానికైతే ఫ్యామిలీ లైఫ్ని రాకేశ్- సుజాత ఎంజాయ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. 'జన నాయగణ్' వీడియో రిలీజ్)

న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie) మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్లో ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బ్రహ్మానందం.. కన్నప్పను ఆదరించాలే తప్ప అల్లరి చేయొద్దని కోరాడు.జోక్ చేసిన మోహన్బాబుఇకపోతే కన్నప్ప షూటింగ్ అంతా న్యూజిలాండ్లోనే జరిగింది. ఆ సమయంలో చిత్రయూనిట్ సరదాగా తీసుకున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. అందులో మోహన్బాబు.. ఓ మైదానంలో నిల్చుని ఇదంతా నాది, విష్ణుదే.. అన్నాడు. వీడియో తీస్తున్న బ్రహ్మాజీ.. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లు వింటున్నారుగా.. మొత్తం బ్లాక్మనీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని సరదాగా అన్నాడు.7 వేల ఎకరాలు కొన్నాందాంతో మోహన్బాబు.. మా దగ్గర బ్లాక్మనీయే లేదు. న్యూజిలాండ్లోని వనాకాలో ఓ ఇల్లు, 7000 ఎకరాలు కొన్నాం. ఇదంతా మనదే అని జోక్ చేశాడు. ఇంతలో ప్రభుదేవా అక్కడికి రావడంతో ప్రభుదేవాతో కలిసి ఏడు వేల ఎకరాలు కొన్నట్లు మాట మార్చాడు. ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కన్నప్ప విషయానికి వస్తే.. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది. మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. Mohanbabu Mass 😂😂😂#JustforGags pic.twitter.com/Nbb2y053R6— V@ndeM@taR@m (@patriotatwork99) June 22, 2025 చదవండి: నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు

'కుబేర' రెండో రోజు కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు?
ఈ వారం ఓ మాదిరి అంచనాలతో రిలీజైంది 'కుబేర'. రిలీజ్కి ముందు బుకింగ్స్ కూడా అలా అలా అన్నట్లే ఉన్నాయి. ఎప్పుడైతే మార్నింగ్ షో పూర్తయి పాజిటివ్ టాక్ వచ్చిందో మిగతా షోలన్నీ హౌస్ఫుల్స్ కావడం మొదలుపెట్టాయి. అలా తొలిరోజు యావరేజ్ వసూళ్లు రాగా.. రెండో రోజు వచ్చేసరికి ఆ నంబర్స్ కాస్త పెరిగాయి. ఇంతకీ రెండు రోజుల కలెక్షన్స్ ఎంత? ఓవర్సీస్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?ధనుష్ నటించిన 'కుబేర'.. ఓ బిచ్చగాడు ఓ మల్టీ మిలియనీర్ మధ్య సాగే థ్రిల్లింగ్ డ్రామా కథతో తీశారు. బిచ్చగాడిగా ధనుష్ విశ్వరూపం చూపిస్తే.. సీబీఐ అధికారిగా నాగ్ ఆకట్టుకున్నాడు. రష్మిక కూడా తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసింది. దేవిశ్రీ ప్రసాద్ కూడా తనదైన మ్యూజిక్తో మార్కులు కొట్టేశాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా తన రూట్ మార్చి హిట్ కొట్టేశాడు.(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)ఇలా అంతటా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'కుబేర'కు తొలిరోజు మన దేశంలో రూ.14 కోట్ల మేర నెట్ వసూళ్లు రాగా.. రెండో రోజు రూ.16 కోట్ల మేర వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా రెండు రోజులకు రూ.31.25 నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. గ్రాస్ రూ.36 కోట్ల మేర ఉండొచ్చని తెలుస్తోంది. ఓవర్సీస్లోనూ ప్రస్తుతం 1.4 మిలియన్ డాలర్ల వసూళ్లు దాటేశాయి. అంటే రూ.15 కోట్ల మేర వచ్చేసినట్లే. మొత్తంగా చూస్తే రూ.50 కోట్ల మార్క్ అయితే దాటేసిందని చెప్పొచ్చు. మరి లాంగ్ రన్లో ఈ సినిమాకు ఎంత డబ్బులు వస్తాయో చూడాలి?'కుబేర' విషయానికొస్తే.. ఆయిల్ రిగ్ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?)

షూ విప్పడం కూడా రాదా? ఇంకేం యోగా చేస్తావ్?
బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ బరుచ (Nushrratt Bharuccha) విమర్శలపాలైంది. యోగా ఈవెంట్కు వెళ్లి ఆమె చేసిన పనికి అందరూ ఆమెను తిట్టిపోస్తున్నారు. అసలేం జరిగిందంటే.. శనివారం నాడు ముంబైలో జరిగిన యోగా ఉత్సవాల్లో నుష్రత్ పాల్గొంది. తెలుపు దుస్తుల్లో అక్కడికి హాజరైన ఆమెకు సొంతంగా షూలు విడిచేందుకు కూడా కష్టమైంది. అక్కడున్న మహిళా వాలంటీర్ల సాయం తీసుకుంది. అమ్మాయి కింద కూర్చుని హీరోయిన్ కాలు పట్టుకుని ఆమె షూ లేస్ తీసింది.. ఇంతలో నుష్రత్.. మరో కాలి షూ కూడా తీసేయమని వేలు పెట్టి చూపించింది. దీంతో ఆమె మరో కాలి షూ కూడా తీసేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.అది కూడా చేతకాదా?'నీ చేతులతో నువ్వు షూ లేస్ తీసేసి పక్కన విడిచిపెట్టలేవా?', 'నీ కాలికున్న షూలు తీసుకోలేవు కానీ యోగా చేస్తున్నావా?', 'నువ్వింకా చిన్న పిల్ల అనుకుంటున్నావా? డబ్బు, పాపులారిటీ చూశాక గర్వం తలకెక్కినట్లుంది' అని నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నుష్రత్.. చివరగా చోరీ 2 సినిమాలో కనిపించింది. విశాల్ ఫ్యురియా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈమె తెలుగులో శివాజీ తాజ్మహల్ (2010) మూవీలో హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by TCX.official (@tellychakkar) చదవండి: న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

బెంగళూరు తొక్కిసలాట ఎఫెక్ట్.. విజయోత్సవాలకు బీసీసీఐ సరికొత్త నిబంధనలు
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఆర్సీబీ విజయోత్సవ సంబరాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు.ఈ క్రమంలో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కఠిన నియమాలను తీసుకురానుంది. ఇకపై విన్నింగ్ సెలబ్రేషన్స్, సత్కార కార్యక్రమాలు సురక్షితంగా జరిగేలా భద్రతా నియమాలను రూపొందించడానికి బీసీసీఐ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధ్రువీకరించారు.బీసీసీఐ ప్రతిపాదించిన గైడ్లైన్స్ ఇవే..👉కూలింగ్-ఆఫ్ పీరియడ్: ఏ జట్టు అయినా టైటిల్ గెలిచిన తర్వాత మూడు, నాలుగు రోజుల్లోపు వేడుకలు నిర్వహించడానికి అనుమతి నిరాకరణ.👉బీసీసీఐ క్లియరెన్స్ తప్పని సరి: జట్లు ఏదైనా వేడుకను నిర్వహించే ముందు బీసీసీఐ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలి.👉బోర్డు నుండి లిఖిత పూర్వకంగా అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు.👉భద్రతా బ్లూప్రింట్ను ముందే సమర్పించాలి. ఫైవ్ టైర్ సెక్యూరిటీ కచ్చితంగా ఉండాలి.👉విమానాశ్రయం నుండి కార్యక్రం జరిగే వేదిక వరకు జట్టు వెళ్లే మార్గమంతా భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలి.👉ఈవెంట్ షెడ్యూల్ అంతటా ఆటగాళ్లు, సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించడం.👉జిల్లా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారుల నుండి అనుమతి పొందాలి.

మెడల్స్ ఏమీ లేవు.. ఇంత చెత్త ఫీల్డింగ్ చేస్తారా! గవాస్కర్ ఫైర్
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్లో టీమిండియాకు ఇంగ్లీష్ జట్టు ధీటైన జవాబు ఇస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్రీజులో ఓలీ పోప్(100), హ్యారీ బ్రూక్(0) ఉన్నారు. స్టోక్స్ సేన టీమిండియా స్కోరుకు ఇంకా 262 పరుగులు వెనుకబడి ఉంది.బుమ్రా ఒక్కడే భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టి ఒంటరి పోరాటం చేశాడు. సిరాజ్, జడేజా, ప్రసిద్ద్ కృష్ణ, శార్ధూల్ రెండో రోజు ఆటలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. తొలి ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేసిన బుమ్రా.. ఆ తర్వాత కూడా తన పేస్ బౌలింగ్తో నిప్పులు చెరిగాడు. అతడిని ఎదుర్కొవడానికి ఇంగ్లండ్ బ్యాటర్లు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కానీ మిగితా ముగ్గురు పేసర్లు వన్డేను తలపిస్తూ పరుగులు సమర్పించుకున్నారు.ఆ మూడు క్యాచ్లు పట్టుంటే..అయితే ఈమ్యాచ్లో బుమ్రాకు ఫీల్డర్ల నుంచి మద్దతు లభించి ఉంటే టీమిండియా కచ్చితంగా పైచేయి సాధించి ఉండేది. అతడి బౌలింగ్లో భారత ఫీల్డర్లు మొత్తం మూడు క్యాచ్లను జారవిడిచారు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ఐదో బంతికి డకెట్ ఇచ్చిన క్యాచ్ను గల్లీలో యశస్వి జారవిడవగా... భారత అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడైన జడేజా కూడా డకెట్ క్యాచ్ నేలపాలు చేశాడు.డకెట్ బ్యాక్వర్డ్ పాయింట్లో ఇచ్చిన క్యాచ్ను అందుకోవడంలో జడ్డూ విఫలమయ్యాడు. బుమ్రా వేసిన 31వ ఓవర్లో పోప్ ఇచ్చిన క్యాచ్ను సైతం జైస్వాల్ నేలపాలు చేశాడు. దీంతో అతడు ఏకంగా సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలో గిల్ సేన చెత్త ఫీల్డింగ్పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు."గత కొంత కాలంగా అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి డ్రెస్సింగ్ రూమ్లో అవార్డు ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. కానీ ఈ రోజు మాత్రం ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఎవరికి ఎటువంటి అవార్డు ఇవ్వడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భారత ఫీల్డర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు.యశస్వి జైస్వాల్ చాలా మంచి ఫీల్డర్, కానీ ఈ మ్యాచ్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. రెండు క్యాచ్లను జారవిడిచాడు. నిజంగా ఇది నన్ను తీవ్ర నిరాశపరిచిందని" కామెంటరీ బాక్స్లో ఉన్న గవాస్కర్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్

చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్
ఇంగ్లండ్ సూపర్ స్టార్ జో రూట్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రూట్ నిలిచాడు. లీడ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు. రూట్ ఇప్పటివరకు ఇంగ్లండ్లో భారత్తో జరిగిన టెస్టుల్లో 1589 పరుగులు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఇంగ్లండ్ గడ్డపై సచిన్ 1575 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్తో సచిన్ ఆల్టైమ్ రికార్డును జో బ్రేక్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రూట్ తన మార్క్ చూపించలేకపోయాడు. కేవలం 28 పరుగులు మాత్రమే చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు.ఇంగ్లండ్లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు..👉జో రూట్ (ఇంగ్లాండ్) – 1579*👉సచిన్ టెండూల్కర్ (భారత్) – 1575👉రాహుల్ ద్రవిడ్ (భారత్) – 1376👉అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్) – 1196👉సునీల్ గవాస్కర్ (భారత్) – 1152👉గ్రహం గూచ్ (ఇంగ్లాండ్) – 1134ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్..తొలి ఇన్నింగ్స్లో భారత్కు ఇంగ్లండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఒలీ పోప్ (131 బంతుల్లో 100 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... బెన్ డకెట్ (94 బంతుల్లో 62; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 359/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 113 ఓవర్లలో 471 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్,శుబ్మన్ గిల్, యశస్వి జైశ్వాల్ సెంచరీలతో మెరిశారు.చదవండి: IND vs ENG: జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత.. ఫస్ట్ ఓవర్ కింగ్గా

BAN Vs SL: బంగ్లా-శ్రీలంక తొలి టెస్టు డ్రా.. మాథ్యూస్కు ఘన వీడ్కోలు
గాలె: బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్న బంగ్లాదేశ్, శ్రీలంక తొలి టెస్టు చివరకు ‘డ్రా’గా ముగిసింది. శనివారం వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం వాటిల్లడంతో... రసవత్తర ఫలితానికి అవకాశం లేకుండా పోయింది. ఓవర్నైట్ స్కోరు 177/3తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్... 87 ఓవర్లలో 285/6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెప్టెన్ నజ్ముల్ హసన్ షంటో (199 బంతుల్లో 125 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) ఈ మ్యాచ్లో రెండో సెంచరీని తన పేరిట రాసుకున్నాడు. ముష్ఫికర్ రహీమ్ (102 బంతుల్లో 49; 4 ఫోర్లు) రాణించాడు.అయితే బంగ్లా కెప్టెన్ సెంచరీ పూర్తి చేసుకునే క్రమంలో... నిధానంగా ఆడటంతో మ్యాచ్ ఆసక్తికర మలుపు వైపు మొగ్గు చూపలేదు. శ్రీలంక బౌలర్లలో తిరిందు రత్ననాయకే 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 296 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన శ్రీలంక ఆట నిలిచిపోయే సమయానికి 32 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. తైజుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీసి భయపెట్టినా... తగినంత సమయం లేకపోవడంతో శ్రీలంక ‘డ్రా’తో గట్టెక్కింది. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 495 పరుగులు చేయగా... శ్రీలంక 485 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన బంగ్లాదేశ్ సారథి నజ్ముల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి కొలంబో వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.మాథ్యూస్కు వీడ్కోలు..ఈ మ్యాచ్తో శ్రీలంక ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. జాతీయ జట్టు తరఫున 119 టెస్టులు ఆడిన మాథ్యూస్ 44.40 సగటుతో 8214 పరుగులు చేశాడు. బంతితోనూ ఫర్వాలేదనిపించిన అతడు 33 వికెట్లు సైతం పడగొట్టాడు. 2014లో ఇంగ్లండ్ గడ్డపై ఏకైక టెస్టు సిరీస్ గెలిచిన శ్రీలంక జట్టుకు మాథ్యూస్ కెప్టెన్గానూ వ్యవహరించాడు.చదవండి: IND vs ENG 1st Test: అప్పుడు స్టుపిడ్.. స్టుపిడ్! ఇప్పుడు సూపర్బ్.. సూపర్బ్
బిజినెస్

సెబీ నిబంధనల్లో వెసులుబాటు
పెట్టుబడి సలహాదారులు (ఐఏలు), పరిశోధన విశ్లేషకులకు (ఆర్ఏలు) సెబీ నిబంధనల్లో వెసులుబాటు కల్పించింది. తమ డిపాజిట్ అవసరాలకు అనుగుణంగా వారు ఇప్పటి వరకు నిబంధనల ప్రకారం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఎఫ్డీలకు అదనంగా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, ఓవర్నైట్ మ్యూచువల్ ఫండ్స్కు సైతం సెబీ అనుమతించింది.ఏదేనీ షెడ్యూల్డ్ బ్యాంకులో ఎఫ్డీ చేసి, అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఏఎస్బీ) పేరిట లీన్మార్క్డ్ (హక్కులు కల్పించడం) చేయాల్సి వచ్చేది. ఎఫ్డీ ఖాతాల ప్రారంభం విషయంలో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు సెబీ దృష్టికి తీసుకెళ్లారు.ఎఫ్డీకి ప్రత్యామ్నాయంగా ఏఎస్బీకి అనుకూలంగా మార్క్ చేసిన లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కూడా అనుమతించవచ్చని వారు సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు సెబీ బోర్డు తాజాగా ఆమోదం తెలిపింది.ఈ ప్రతిపాదనను ఆమోదించిన సెబీ బోర్డు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లను తక్కువ రిస్క్, తక్కువ అస్థిర సాధనాలుగా పరిగణించవచ్చని పేర్కొంది. అంతేకాకుండా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ పై కూడా లైను మార్క్ చేయవచ్చు. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై లీన్ నిర్వహణ, లీన్ అమలు సెక్యూరిటీస్ మార్కెట్ ఎకోసిస్టమ్ పరిధిలోనే ఉందని, ఇది మరింత సమర్థతను తీసుకువస్తుందని సెబీ తెలిపింది.

హైదరాబాద్లో కమర్షియల్ స్థలం.. కొంటున్నారా?
వాణజ్య సముదాయాల్లో పెట్టే పెట్టుబడిపై 8 నుంచి 11 శాతం అద్దె గిట్టుబాటు అయితే.. ఇళ్లపై రాబడి 2 నుంచి 4 శాతం వరకే ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అధిక సరఫరా, ప్రతికూల మార్కెట్, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు తదితర కారణాలతో ప్రధాన నగరాల్లో వాణిజ్య స్థలాల ధరలు తగ్గాయి. దీంతో వీటిలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. వాణిజ్య సముదాయల్లో స్థలం కొన్న తర్వాత దాన్ని అమ్ముకోగానే మెరుగైన ఆదాయం గిట్టుబాటు అవుతుంది. ఇదొక్కటే కాదు ప్రతినెలా ఆశించిన స్థాయిలో అద్దె కూడా లభిస్తుంది. అన్ని విధాలా అభివృద్ధికి ఆస్కారం ఉన్న చోట నిర్మించే వాణిజ్య నిర్మాణాల్లో స్థలం తీసుకోవాలి. కాకపోతే పెట్టుబడి పెట్టే ముందు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే తుది నిర్ణయానికి రావాలి. –సాక్షి, సిటీబ్యూరోఇవే కీలకం..వాణిజ్య భవనాల్లో స్థలం తీసుకోవడం మెరుగైన నిర్ణయం అయినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అధ్యయనం, ముందుచూపు, ప్రణాళిక.. ఈ మూడు ఉంటేనే వీటిలో మదుపు చేయాలి.ఒక ప్రాంతంలో నిర్మించే వాణిజ్య సముదాయంలో స్థలం కొనడానికి వెళ్లే ముందు ఆయా స్థలానికి గిరాకీ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేయాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీరు కొనే భవనానికి ప్రజలు వచ్చే అవకాశం ఉందా? అనే విషయాన్ని బేరీజు వేయాలి.భవనాన్ని నిర్మించే డెవలపర్ గత చరిత్రను గమనించాలి. ఆయా సముదాయానికి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందా? భవన నిర్వహణ సక్రమంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి భవనాల్లో నిర్వహణ మెరుగ్గా ఉంటేనే గిరాకీ ఉంటుంది.👉 ఇది చదివారా? ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!మీరు వాణిజ్య స్థలం కొనాలనుకున్న ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశముందా? ఉద్యోగావకాశాలు పెరగానికి ఆస్కాముందా? ఆయా ప్రాంతంలో జనాభా పెరుగుతుందా వంటి అంశాల్ని గమనించాలి.మీరు కొనాలని భావించే స్థలం వాణిజ్య సముదాయంలో ఎక్కడుంది? సందర్శకులకు నేరుగా కనిపిస్తుందా? స్థలం ముందు భాగాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా? ఇలాంటి విషయాల్ని కూడా తప్పకుండా చూడాలి.వాణిజ్య సముదాయంలో స్థలం కొనాలన్న నిర్ణయానికి వచ్చేముందు.. నెలసరి నిర్వహణ సొమ్ము ఎంత? ఆస్తి పన్ను, భవనం బీమా వంటివి కనుక్కోవాలి. ఖాళీ లేకుండా ఉండేలా చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కోరుకున్న రాబడి గిట్టుబాటవుతుంది.

కొత్త లుక్తో హోండా సిటీ స్పోర్ట్ కారు
హోండా కార్స్ ఇండియా సంస్థ న్యూ సిటీ స్పోర్ట్ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ. 14,88,900గా (ఢిల్లీ ఎక్స్ షోరూం) ఉంటుంది. లైఫ్ ఈజ్ ఏ స్పోర్ట్ ట్యాగ్లైన్తో ప్రవేశపెట్టిన ఈ కార్లు పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉంటాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు. వెలుపల స్పోర్టీ బ్లాక్ గ్రిల్, అలాయ్ వీల్స్, అలాగే లోపల ప్రీమియం లెదర్ బ్లాక్ సీట్లు, రూఫ్ లైనింగ్తో ఇంటీరియర్స్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు వివరించారు.మార్కెట్లోకి మహీంద్రా ఫ్యూరియో 8 ట్రక్మహీంద్రా ట్రక్ అండ్ బస్ బిజినెస్ తాజాగా అత్యధిక మైలేజీ గ్యారంటీతో ఫ్యూరి యో 8 పేరిట తేలికపాటి వాణిజ్య వాహన ట్రక్కులను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సెగ్మెంట్లో అత్యుత్తమ మైలేజీనివ్వకుంటే ట్రక్కును వాపసు చేయొచ్చనే ఆఫరుతో దీన్ని అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ వాహనం 4, 6 టైర్ల కార్గో వేరియంట్స్లో లభిస్తుంది.కొనుగోలుదారుకు అధిక ఆదాయాలు, కనిష్ట స్థాయిలో నిర్వహణ వ్యయాలతో అన్ని రకాల ప్రయోజనకరంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ ప్రెసిడెంట్ వినోద్ సహాయ్ పేర్కొన్నారు. అలాగే, సరీ్వసింగ్ విషయానికొస్తే 36 గంటల టర్నెరౌండ్ సమయం లేదా జాప్యం జరిగిన ప్రతి అదనపు రోజుకు రూ. 3,000 చొప్పున చెల్లించేలా సర్వీస్ హామీ ఉంటుందని వివరించారు.

కొత్త ఫోన్.. రూ.25 వేలకే 3డీ కర్వ్డ్ డిస్ప్లే
స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో కొత్తగా వై సిరీస్లో వై400 ప్రో ఫోన్ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 24,999 (8జీబీ, 128 జీబీ) నుంచి ప్రారంభమై రూ. 26,999 వరకు (8 జీబీ, 256 జీబీ) వరకు ఉంటుంది. ఈ సెగ్మెంట్లోనే అత్యంత పల్చని 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 6.78 అంగుళాల ఎఫ్హెచ్డీ, అమోలెడ్ డిస్ప్లే, 90వాట్ ఫ్లాష్చార్జ్, సోనీ మల్టీఫోకల్ పోర్ర్టెయిట్, ముందు.. వెనుక కెమెరాలతో 4కే వీడియో రికార్డింగ్ సామర్థ్యాలు మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇది ఫ్రీస్టైల్ వైట్, నెబ్యులా పర్పుల్, ఫెస్ట్ గోల్డ్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది.వివో వై400 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు6.77 అంగుళాల ఫుల్ హెచ్ డీ అమోలెడ్ 20:9 యాస్పెక్ట్ రేషియో స్క్రీన్ విత్ హెచ్ డీఆర్ 10+, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్2.5 గిగాహెర్ట్జ్ వరకూ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 4ఎన్ఎం ప్రాసెసర్, మాలి-జీ615 ఎంసీ2 జీపీయూ8 జీబీ LPDDR4X ర్యామ్ విత్ 128 జీబీ / 256 జీబీ (యూఎఫ్ఎస్ 2.2) స్టోరేజ్ఆండ్రాయిడ్ 15 విత్ ఫన్ టచ్ ఓఎస్ 15డ్యూయల్ సిమ్ (నానో + నానో)50 మెగాపిక్సెల్ కెమెరా విత్ సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్, ఓఐఎస్, ఎఫ్ / 1.79 ఎపర్చర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ విత్ ఎఫ్ / 2.4 ఎపర్చర్, ఆరా లైట్32 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్యూఎస్బీ టైప్-సీ ఆడియో, స్టీరియో స్పీకర్లు👉 ఇది చదివారా? కొత్త ఫోనొచ్చింది.. రూ.10 వేలకే పవర్ఫుల్ 5జీ ఫోన్దుమ్ము, స్ప్లాష్ రెసిస్టెంట్ (IP65 రేటింగ్)90వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో 5500 ఎంఏహెచ్ బ్యాటరీఅమెజాన్, ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్లైన్ స్టోర్లలో జూన్ 27 నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
ఫ్యామిలీ

అరుదైన వేడుక ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’..!
అస్సాంలో జరిగే ‘అంబుబాచీ మేళా’ అరుదైన వేడుక. గువాహటిలో కొలువైన శక్తిపీఠం కామాఖ్య దేవి ఆలయంలో ఏటా జరిగే ఈ మేళా ఒక విలక్షణ ఆధ్యాత్మిక ఉత్సవం. ఇది ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’గా ప్రసిద్ధి చెందింది, ప్రకృతిని, స్త్రీ శక్తిని ఆరాధించే ఈ మేళా పురాతన శాక్తేయ సంప్రదాయానికి, అస్సామీ సంస్కృతికి ప్రతీక.అంబుబాచీ మేళా అనేది కామాఖ్యదేవి రుతుచక్రాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో దేవి గర్భగుడిలో ఉన్న యోని పీఠం నుంచి రుతుస్రావం జరుగుతుందని విశ్వసిస్తారు. ఈ కాలాన్ని భూమి తన పునరుత్పత్తి శక్తిని తిరిగి పొందే సమయంగా భావిస్తారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసి ఉంచుతారు. ఈ కాలంలో ఏ విధమైన వ్యవసాయ పనులు, పూజలు, శుభకార్యాలు నిర్వహించరు. ఐదోరోజు శుద్ధి కార్యక్రమం నిర్వహించిన తర్వాత, ఆలయం తిరిగి తెరిచి, దర్శనం చేసుకోవడానికి భక్తులను అనుమతిస్తారు. అంబుబాచీ మేళా ఈ ఏడాది జూన్ 22న ప్రారంభమై జూన్ 26న ముగుస్తుంది.ఈ మేళాలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా హిమాలయాల నుంచి వేలాదిమంది సన్యాసులు, అఘోరాలు, తాంత్రికులు వస్తారు. వీరి దర్శనం, ఆశీర్వచనాల కోసం భక్తులు బారులు తీరుతుంటారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసినా, పరిసరాలన్నీ మంత్ర పఠనాలతో, భజనలతో, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో హోరెత్తుతాయి. మేళా ముగిసిన తర్వాత, దేవి ‘శుద్ధి’ అయినప్పుడు, భక్తులకు ప్రత్యేకమైన ‘అంబుబాచీ వస్త్రం’ లేదా ‘అంబుబాచీ సిందూరం’ ప్రసాదంగా ఇస్తారు. ఈ వస్త్రం దేవి రుతు రక్తంతో తడిసిందని నమ్ముతారు. (చదవండి: అక్కడ ప్రతిరోజూ.. క్రిస్మస్ వేడుకే..!)

అక్కడ ప్రతిరోజూ.. క్రిస్మస్ వేడుకే..!
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ ఏడాదికోసారి వస్తుంది. ఏటా డిసెంబర్ 25న వివిధ దేశాల్లోని క్రైస్తవులు ఈ వేడుకను ఘనంగా జరుపుకొంటారు. కాని, ఒకచోట మాత్రం ఏడాది పొడవునా– ప్రతిరోజూ క్రిస్మస్ వేడుక జరుగుతుంది. అదెక్కడి వింత ప్రదేశం అనుకుంటున్నారా? ఇక అసలు కథలోకి వచ్చేద్దాం.అదొక థీమ్ పార్కు. ఇంగ్లండ్లోని చెసింగ్టన్ పట్టణంలో ఉంది. ఏడాది పొడవునా– ప్రతిరోజూ జరిగే క్రిస్మస్ వేడుకలకు ఇదే కేంద్ర బిందువు. దీని పేరు ‘చెసింగ్టన్ వరల్డ్ ఆఫ్ అడ్వెంచర్స్’. ఈ థీమ్ పార్కులో కూడా మిగిలిన థీమ్ పార్కుల్లో మాదిరిగానే అన్ని రకాల క్రీడా వినోద విలాసాలన్నీ ఉంటాయి. రంగుల రాట్నాలు, ఇతర వినోద క్రీడా సౌకర్యాలన్నీ ఉంటాయి. ఇదే పార్కు ప్రాంగణంలో ఒక ఫోర్స్టార్ సఫారీ హోటల్ కూడా ఉంది. ఈ హోటల్లోని కొన్ని గదుల్లో నిత్యం క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి.ఈ హోటల్లోని ఓరియో, జుమాంజీ, గ్రఫాలో అనే ప్రత్యేక గదుల్లో ప్రతిరోజూ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. క్రిస్మస్ పండుగ రోజున ఇళ్లల్లో అలంకరించినట్లుగానే ఈ గదులు నిత్యం క్రిస్మస్ అలంకరణతో కళకళలాడుతూ కనువిందు చేస్తాయి. గదుల మూలల్లో క్రిస్మస్ ట్రీలు, గదుల్లో పైనుంచి వేలాడే రంగురంగుల బెలూన్లు, బంగారు రంగులో ధగధగలాడే నక్షత్రాలు, కిటికీలకు ఎర్రని కర్టెన్లు సహా కళ్లుచెదిరే రంగుల అలంకరణలతో ఈ గదుల్లోకి అడుగుపెడుతూనే పండుగ వాతావరణం కనిపిస్తుంది. గదుల్లోని మంచాలపై ఎర్రని దుప్పట్లు, ‘మెర్రీ క్రిస్మస్’ అని రాసి ఉన్న దిండు గలీబులు పండుగ వాతావరణాన్ని మరింతగా ఇనుమడింపజేస్తాయి. ఈ ఆకర్షణ కోసమే చాలా కుటుంబాలు పిల్లలతో కలసి ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చి, రోజుల తరబడి బస చేస్తుంటాయి. ఈ హోటల్ గదుల కారిడార్లో ప్రతి సాయంత్రం క్రిస్మస్ బ్యాండ్ సంగీతం అతిథులను ఉర్రూతలూపుతుంది. ఇక్కడ బసచేసే వారికి క్రిస్మస్ మెనూ వంటకాలనే వడ్డిస్తారు. పిల్లలకు ప్రత్యేకంగా చాక్లెట్లు, బాణసంచా, బెలూన్లు వంటివి పంచిపెడతారు. క్రిస్మస్ టోపీలు, పూలగుత్తులు వంటివి కూడా ఇస్తారు. శాంటాక్లాజ్ వేషధారులు పిల్లలకు సర్ప్రైజ్ గిఫ్టులు ఇచ్చి, వారిని ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుతారు. ఈ హోటల్లో నిత్యక్రిస్మస్ గదులను బుక్ చేసుకుంటే, ఉచితంగా థీమ్పార్కు టికెట్లు ఇస్తారు. (చదవండి: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాషన్ సీక్రెట్..! అదొక్కటి చాలు..)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాషన్ సీక్రెట్..! అదొక్కటి చాలు..
చిరునవ్వుతో ట్రెండ్ సెట్ చేయడమే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టయిలింగ్ టెక్నిక్! మేకప్ కాదు, ఫిట్నెస్, ఫన్ , ఫ్యాషన్ ఈ మూడింటి మిక్స్తో తన లుక్ని మెరిపిస్తుండటం ఆమె అలవాటు. అయితే, ఆమె లుక్లో అసలైన మెరుపు చిరునవ్వులోనే దాగి ఉందట!నేను ఫాలో అయ్యే స్టయిలింగ్ రూల్ ‘ఒకటి ఎక్కువ అయితే, మరొకటి తక్కువ’. అంటే, చెవిపోగులు హెవీగా ఉంటే, మెడలో జ్యూలరీ ఉండదు. డ్రెస్ హైలైట్ అయితే, మేకప్ మ్యూట్గా ఉంటుంది. ఇది నా ఫ్యాషన్ సీక్రెట్! కానీ ఇన్నాళ్ల ఫ్యాషన్ జర్నీలో నేర్చుకున్న అసలైన విషయం ఏంటంటే, ఏది ధరించినా హ్యాపీగా ఉంటే చాలు, అదే బ్యూటీ! అంటోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్అందాన్ని రెట్టింపు చేయాలంటే ముందుగా చేతులనే ముస్తాబు చేయాలి! దానికి బెస్ట్ ఆప్షన్ ఈ ‘హాథ్ ఫూల్’ జ్యూలరీ. ఇది బ్రేస్లెట్ కాదు, రింగ్ కాదు... చేతి మణికట్టు నుంచి వేళ్ల చివరి వరకు సాగే ఒక గొలుసు. ఇది వేసుకున్నాక చూసే వాళ్లు చేతులను చూడకుండా ఉండలేరు. అంతలా అట్రాక్ట్ చేస్తుంది. పూర్వం రాజకుమార్తెలు, మహారాణులు వేసుకునే ఈ ఆభరణం, ఇప్పుడు మోడ్రన్ పెళ్లికూతుర్లకు, ఫ్యాషన్ లవర్స్కి ఫేవరెట్గా మారింది. అయితే, ఇది వేసుకున్నాక చేతులను చాలా జాగ్రత్తగా స్టయిలింగ్ చేసుకోవాలి. హాథ్ ఫూల్ పెద్దదైతే చేతిని వేరే ఏ జ్యూలరీతోనూ స్టయిల్ చేయొద్దు.లేదంటే మీ చెయ్యి ఒక డిజైనర్ షోరూమ్లా కనిపిస్తుంది. సింపుల్ మేకప్, లైట్ జ్యూలరీ, మల్లెపూల బన్ దీనికి బెస్ట్ కాంబినేషన్. అప్పుడు చీర, లెహంగా, అనార్కలీ డ్రెస్ ఏదైనా హాథ్ ఫూల్ వేసుకుంటే లుక్కే మారిపోతుంది. ముఖ్యంగా ఫొటో షూట్స్, మెహందీ ఫంక్షన్లు, సంగీత్ పార్టీల్లో ఇది ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. ఇక్కడ జాక్వెలిన్ ధరించిన జ్యూలరీ బ్రాండ్: కోహార్ బై కనికా, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఆమె ధరించిన చీర బ్రాండ్: ఎకయాధర: రూ. 40,075.(చదవండి: సైలెంట్ డీ హైడ్రేషన్..! హెచ్చరిస్తున్న వైద్యులు)

పురిటినొప్పులను గుర్తించడం ఎలా..?
గర్భిణులకు తొమ్మిది నెలలు నిండాక వచ్చే ప్రతి నొప్పులూ పురిటినొప్పుల్లాగానే అనిపిస్తుంటాయి. అలాంటి నొప్పులతో కొన్నిసార్లు ఆసుపత్రి వరకు వెళ్లాక కూడా అవి నిజమైన పురిటినొప్పులు కావంటూ... ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రసవం అయిన కేసులూ ఉంటాయి. ఈ నేపథ్యంలో నెలలు నిండాక వచ్చే నొప్పులు పురిటినొప్పులేనా అని తెలుసుకోడానికి తోడ్పడే అంశాలేమిటో చూద్దాం.గర్భవతులకు నెలలు నిండాక గర్భసంచి కండరాల సంకోచ వ్యాకోచాల వల్ల నొప్పులు వస్తున్నట్లుగా అనిపిస్తాయి. నిజానికి గర్భవతుల్లోనే కాకుండా మామూలు మహిళల్లోనూ గర్భసంచికి సంకోచ వ్యాకోచాలు కలుగుతూనే ఉంటాయి.బ్రాక్స్టన్ – హిక్స్ కంట్రాక్షన్స్?ఇక గర్భవతుల్లోనైతే ప్రసవానికి చాలా రోజుల ముందు నుంచే గర్భసంచి కండరాల్లో సంకోచవ్యాకోచాలు ఒక తెర తర్వాత మరో తెర... ఇలా తెరలు తెరలుగా వస్తూ ఉంటాయి. వీటినే ‘బ్రాక్స్టన్–హిక్స్ కంట్రాక్షన్స్’ అంటారు. ఈ సంకోచ వ్యాకోచాలు తొమ్మిది నెలలపాటూ వస్తూనే ఉంటాయి. కాకపోతే నెలలు నిండేకొద్దీ ఇవి వచ్చే వ్యవధీ అలాగే ఫ్రీక్వెన్సీ పెరుగుతూ పూర్తిగా నెలలు నిండేనాటికి అవి పురిటినొప్పులుగా రూపాంతరం చెందుతాయి. ఈ సంకోచవ్యాకోచాల సమయంలో పొట్ట కండరాలు బిగుసుకుని, ఆ తర్వాత మెత్తబడుతూ ఉంటాయి. ఏవి పురిటినొప్పులు? గర్భసంచి కండరాల్లోని సంకోచ–వ్యాకోచాల్లో ఏవి పురిటి నొప్పులో గుర్తించడానికి ఒక కొండగుర్తు ఏమిటంటే... ఈ సంకోచ సమయంలో పొట్ట కండరాలు గట్టిబడటంతోపాటు నొప్పి కూడా వస్తుంటుంది. ఈ నొప్పి నడుము వెనక భాగం నుంచి మొదలై క్రమంగా ముందు భాగంలో తొడల వరకు వ్యాపిస్తూ ఉంటుంది. పురిటి నొప్పులు మొదలయ్యాక ఇక ఆ నొప్పులు వస్తూ తగ్గుతూ... ఉంటాయి. ఈ పురిటినొప్పులు గరిష్ఠ స్థాయిలో ప్రభావం చూపుతున్నప్పుడు గర్భసంచి పైభాగం ముడుచుకుంటూ, ముఖద్వార భాగం తెరచుకుంటూ ఉంటే అవి నిజమైన పురిటి నొప్పులని గ్రహించవచ్చు. నిజమైన పురిటినొప్పులు వస్తున్నప్పుడు... 10 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు కండరాల సంకోచాలు వస్తూ... ఒక్కో సంకోచ సమయం కనీసం 45 సెకన్ల పాటు కొనసాగుతూ, అదే టైమ్లో గర్భాశయ ముఖద్వారం తెరచుకుంటూ ఉంటే అది నిజమైన ప్రసవ సమయం (ట్రూ లేబర్) అని చెప్పవచ్చు. డాక్టర్ దగ్గరకు ఎప్పుడు? ఇక చాలామంది గర్భవతులకు ఒక డౌట్ వస్తుంటుంది. తాము నొప్పులను గుర్తించాక డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్లడం మంచిదనే సందేహాన్ని వ్యక్తం చేస్తుంటారు. గర్భవతులకు భరించలేనంత నొప్పులు వస్తూ ఉన్నప్పుడుగాని; ఇలా పురిటినొప్పులు వస్తూ అదే టైమ్లో ఏదైనా రక్తస్రావం కనపడుతున్నా గాని; తమ ప్రమేయం లేకుండానే ఉమ్మనీరు పడిపోతున్నాగాని; లేదా కడుపులో బిడ్డ తిరిగినట్లు అనిపించకపోయినా గానీ... ఈ నాలుగు సందర్భాల్లో తప్పని సరిగా, అత్యవసరంగా డాక్టర్ను కలవాలి. నిజానికి పురిటినొప్పులను గుర్తించడమన్నది కాబోయే తల్లి కంటే డాక్టర్లకే ఎక్కువగా తెలిసే అవకాశముంటుంది. కాబట్టి అవి ట్రూ లేబర్ పెయిన్స్ అయినా కాకపోయినా... నొప్పి వస్తున్నట్లు గుర్తించగానే అత్యవసరంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాలి. ఒకవేళ అవి ట్రూ లేబర్ పెయిన్స్ అయితే డాక్టర్లు గర్భవతి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. దాంతో ప్రసవం సురక్షితంగా జరుగుతుంది. ఒకవేళ అది హై–రిస్క్ ప్రెగ్నెన్సీ అయితే ముందుగానే వచ్చి హాస్పిటల్లో చేరాల్సిందిగా డాక్టర్లు సూచిస్తారు. డా. నర్సేపల్లి శోభారాణి, సీనియర్ అబ్స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ (చదవండి: చేతి రాతే భవిష్యత్తుకు బాట.. )
ఫొటోలు
అంతర్జాతీయం

ధ్వంసమైన ఇరాన్ అణుకేంద్రాల సామర్థ్యం ఇదే..
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య భీకరయుద్ధం జరుగుతోంది. తాజాగా అమెరికా టెహ్రాన్లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై బాంబు దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచింది. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ వివాదంలో అమెరికా సైనిక జోక్యం తొలిసారిగా ఈ దాడులలో ప్రత్యక్షంగా కనిపించింది.ట్రూత్ సోషల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్లో అమెరికన్ విమానాలు విజయవంతమైన దాడిని పూర్తి చేశాయని పేర్కొన్నారు. ఇప్పుడు అన్ని విమానాలు ఇరాన్ వైమానిక స్థలం వెలుపల ఉన్నాయి. బాంబుల పేలోడ్ను ప్రాథమిక సైట్ అయిన ఫోర్డోలో ఉంచారు. విమానాలన్నీ సురక్షితంగా తిరిగి వెళ్తున్నాయి. అమెరికన్ వారియర్స్కు అభినందనలు. ఇంతటి సత్తాచాటిన సైన్యం ప్రపంచంలో మరోచోట లేదు. ఇప్పుడు శాంతికి సమయం వచ్చిందని ట్రంప్ అన్నారు.ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా ఈ వివాదంలోకి ప్రవేశించాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి రెండు వారాల సమయం పడుతుందని ట్రంప్ గతంలో చెప్పారు. అయితే ఇంతలోనే అమెరికా ఈ దాడులను చేసింది. ఇజ్రాయెట్ గతవారం రోజులుగా ఇరాన్ అణు సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని, దాడులు కొనసాగిస్తోంది. తాజాగా అమెరికా సాగించిన దాడులలో ఇరాన్లోని మూడు అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయి.ఫోర్డో అణు సామర్థ్యంఇరాన్లోని అత్యంత రక్షణతో కూడిన అణు కేంద్రం ఇది. ఇది ఒక పర్వతం కింద ఉంది. ఫోర్డోను ఢీకొట్టేందుకు అమెరికా బీ-2 బాంబర్లను ఉపయోగించిందని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ఫోర్డో అణు కేంద్రంలో దాదాపు మూడు వేల సెంట్రిఫ్యూజ్లను ఉంచగల సామర్థ్యం ఉంది. వైమానిక దాడులను ఎదుర్కొనే సామర్థ్యంతో దీనిని నిర్మించారు. 2009లో కొన్ని విదేశీ నిఘా సంస్థలు ఈ ప్లాంట్ వివరాలను బహిర్గతం చేశాయి. ఫలితంగా ఇరాన్ అధికారికంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) దీనిని బహిర్గతం చేయకతప్పలేదు.నటాంజ్ అణు సామర్థ్యంనటాంజ్.. టెహ్రాన్కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక యురేనియం నిల్వ కేంద్రం. ఈ కేంద్రం ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులకు గురైంది. 50 వేలకుపైగా సెంట్రిఫ్యూజ్లను ఇది నిర్వహిస్తోంది. చాలా కాలంగా అంతర్జాతీయ ఆందోళనకు కేంద్ర బిందువుగా నిలిచింది. వైమానిక దాడుల నుండి రక్షణ కల్పించేందుకు దీనిని భూగర్భంలో నిర్మించారు.ఇస్ఫహాన్ అణు కేంద్రం1984లో చైనా సహకారంలో ఇస్ఫహాన్ సైట్ ఏర్పడింది. టెహ్రాన్కు ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో ఈ కేంద్రం ఉంది. ఇది చైనా పరిశోధన రియాక్టర్లు, ప్రయోగశాలలకు నిలయంగా ఉంది. ఇరాన్ అణు కార్యక్రమంలో ఈ అణు కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ యురేనియం మార్పిడి కేంద్రం, అణు ఇంధన తయారీ కర్మాగారం ఉన్నాయి.ఇది కూడా చదవండి: ‘అంతర్జాతీయ చట్టానికి తూట్లు’.. అమెరికా దాడులను ధృవీకరిస్తూ ఇరాన్

‘అంతర్జాతీయ చట్టానికి తూట్లు’.. అమెరికా దాడులను ధృవీకరిస్తూ ఇరాన్
టెహ్రాన్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై యావత్ ప్రపంచం దృష్టి సారించింది. తాజాగా ఇరాన్ అణుశక్తి సంస్థ (ఆటమిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్) ఆదివారం తెల్లవారుజామున తమ దేశంలోని మూడు అణుశక్తి కేంద్రాలపై జరిగిన దాడులను ధృవీకరించింది. ఈ విధంగా అణుకేంద్రాలపై దాడులు జరిపి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించింది.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల కారణంగా ఎంత నష్టం జరిగిందో స్పష్టం చేయకుండా, దాడుల వివరాలను ప్రకటించారని ఇరాన్ పేర్కొంది. అణు కేంద్రాలపై సాగించిన దాడులు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం కిందకువస్తుందని టెహ్రాన్ ఏజెన్సీ పేర్కొంది. అమెరికా సైన్యం తాజాగా ఇరాన్లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలపై దాడులు చేసింది. ఇరాన్ అణుశక్తి సంస్థపై శత్రువుల కుట్రలు సాగుతున్నప్పటికీ, శాస్త్రవేత్తలు, నిపుణుల ప్రయత్నాలతో ఏర్పడిన ఈ జాతీయ పరిశ్రమ అభివృద్ధిని ఆపబోమని ఇరాన్ ఒక ప్రకటనలో పేర్కొంది.ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో ఫోన్లో సంభాషిస్తూ జియోనిస్ట్ పాలనలోని దురాక్రమణకు తమ ప్రతిస్పందన మరింత వినాశకరంగా ఉంటుందని హెచ్చరించారని అధికారిక ఇర్నా వార్తా సంస్థ పేర్కొంది. ఈ దాడుల కారణంగా టెహ్రాన్కు దక్షిణంగా ఉన్న కోమ్ నివాసితులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇక్కడికి సమీపంలోని పర్వతాలలోగల అణు కేంద్రంపై అమెరికా దాడి చేసింది.ఇది కూడా చదవండి: ట్రంప్ చరిత్రను తిరగరాశారు: నెతన్యాహు

ట్రంప్ చరిత్రను తిరగరాశారు: నెతన్యాహు
టెల్ అవీవ్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ద యుద్ధం కొనసాగుతోంది. తాజాగా అమెరికా దళాలు మూడు ఇరానియన్ అణు కేంద్రాలపై విజయవంతంగా దాడి చేశాయి. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రశంసించారు. ట్రంప్ తీసుకున్న ధైర్యమైన నిర్ణయం చరిత్రను మారుస్తుందంటూ వ్యాఖ్యానించారు.అధ్యక్షుడు ట్రంప్, తాను తరచూ బలప్రయోగం ద్వారా శాంతి స్థాపన జరుగుతుందని చెబుతుంటామని, మొదట బలప్రయోగం జరిగితే, తరువాత శాంతి ఉద్భవిస్తుందన్నారు. డోనాల్డ్ ట్రంప్, యునైటెడ్ స్టేట్స్ తమ శక్తిని పూర్తిస్థాయిలో ప్రదర్శించాయని నెతన్యాహు అన్నారు. కాగా ఫోర్డోపై ఆరు బంకర్-బస్టర్ బాంబులను వేశామని, ఇతర అణు కేంద్రాలపై 30 టోమాహాక్ క్షిపణులను ప్రయోగించామని ట్రంప్ ‘ఫాక్స్ న్యూస్’కు తెలిపారు. యుద్ధంలో ట్రంప్ సహకారంపై స్పందిస్తూ, ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవాలనే మీ సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మారుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని పేర్కొన్నారు.ఆపరేషన్ రైజింగ్ లైన్లో ఇజ్రాయెల్ తన శక్తియుక్తులను ప్రదర్శించింది. అయితే గత రాత్రి ఇరాన్ అణు కేంద్రాలపై.. అమెరికా ఏ ఇతర దేశం చేయలేని రీతిలో దాడులు చేసింది. అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్లోని అత్యంత ప్రమాదకరమైన పాలనను, ప్రమాదకరమైన ఆయుధాల వినియోగాన్ని తిరస్కరించే విధంగా వ్యవహరించారని చరిత్రలో నమోదవుతుందని నెతన్యాహు పేర్కొన్నారు. దేముడు అమెరికాను, ఇజ్రాయెల్ను దీవించాలని, మన బలిష్టమైన కూటమిని, అచంచలమైన విశ్వాసాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని నెతన్యాహు అన్నారు.ఇది కూడా చదవండి: భయంతో బంకర్లో ఇరాన్ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు?

శాంతిని నెలకొల్పే బాధ్యత ఇరాన్దే: ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: ఇరాన్ అణు స్థావరాల ధ్వంసమే అమెరికా టార్గెట్ అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దాడులను అధికారికంగా ప్రకటించారు. ఇరాన్పై దాడులు అమెరికా మిలటరీ విజయమని ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో శాంతిని నెలకొల్పే బాధ్యత ఇరాన్దే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై అమెరికా దాడుల తర్వాత అధ్యక్షుడు ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ట్రంప్ వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ..‘ఇరాన్పై మేము దాడులు చేశాం. కీలకమైన ఇరాన్ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాం. ప్రపంచం ఎదుర్కొంటున్న అణుముప్పును ఆపడమే మా లక్ష్యం. అమెరికా, ఇజ్రాయెల్, ప్రపంచానికి ఇది చారిత్రక క్షణం. ఇది మా మిలటరీ విజయం. మేం చేసిన దాడులు చాలా కష్టతరం. ప్రపంచంలో ఏ దేశానికి ఇది సాధ్యం కాదు. మేము ఇజ్రాయెల్తో కలిసి పనిచేస్తాం. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే బాధ్యత ఇరాన్దే. ఇరాన్ శాంతి మార్గం వెళ్లకపోతే భవిష్యత్లో మరిన్ని ఎక్కువ దాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నా’ అంటూ వ్యాఖ్యలు చేశారు.#WATCH | US strikes Iran's three nuclear facilitiesUS President Donald Trump says, "Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's number one state sponsor of terror. Tonight, I can report to the… pic.twitter.com/KQdMgczaJo— ANI (@ANI) June 22, 2025యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్ వచ్చింది. ఇక, యుద్ధం కొనసాగకూడదు. గత 40 ఏళ్లుగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల కారణంగా అక్కడ ఉంటున్న అమెరికన్లు చనిపోయారు. ఇంకా చనిపోతూనే ఉన్నారు. ఇప్పటికైనా ఇరాన్ దాడులను ఆపాలి. ఇప్పటికి శాంపిల్ మాత్రమే చూపించారు. ఇరాన్ తన తీరు మార్చుకోకపోతే మరిన్ని దాడులు జరుగుతున్నాయి. మా టార్గెట్స్ మాకు ఉన్నాయి. మేము తలుచుకుంటే అన్నింటినీ నాశనం చేయగలం. మా లక్ష్యాలు ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. #WATCH | US strikes Iran's three nuclear facilities President Donald Trump says, "This cannot continue. There will be either peace or there will be tragedy for Iran, far greater than we have witnessed over the last eight days. Remember, there are many targets left. Tonight's… pic.twitter.com/koWkXYjXBA— ANI (@ANI) June 22, 2025
జాతీయం

ఒకప్పటి ఆ రాజసం వేరేలేవల్.. పాపం చివరిక్షణాల్లో ఇలా!
ఎంతటి గొప్పవాడైనా సరే.. చివరి రోజులలో అదే మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు.. సహజ సిద్ధమైన విషయాలనే అనుభవిస్తాడు. ఇది మనిషికి మాత్రమే కాదు.. ఇతర ప్రాణులకూ వర్తిస్తుంది. ఆరోహెడ్ ఠీవిగా అడవిలో అలా నడిచి వస్తుంటే ఒకప్పుడు రాజసం ఉట్టిపడేది. అలాంటి దాని చివరి క్షణాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ ‘అయ్యో.. పాపం’ అనుకునేలా చేసింది. మొసళ్ల బలం నీటిలోనే. అలాంటిది ఆ నీటి నుంచి మొసళ్లను బయటకు లాక్కొచ్చి మరీ వేటాడే సత్తా ఉన్న పెద్దపులిగా మాతామహి మచ్చ్లీ ఓ పేరుండేది. మరి ఆ మచిలీ మునిమనవరాలిగా.. తాను అలాంటి సత్తా ఉన్నదానినే అని నిరూపించుకుంది ఆరోహెడ్. అదీ ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డాకే!. Arrowhead (T-84) రాజస్థాన్లోని రన్థాంబోర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో నివసించిన ఒక ప్రసిద్ధ పులి. జూన్ 19వ తేదీన.. తన 14 ఏళ్ల వయసులో అది కన్నుమూసింది. బోన్ క్యాన్సర్తో అది మరణించిందని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే.. చనిపోయే కొన్నిగంటల ముందు దాని కూనను మరో టైగర్ రిజర్వ్కు తరలించడం పలువురిని కదిలించింది కూడా. ఈలోపు.. ఆరోహెడ్ చివరి క్షణాలను సచిన్ రాయ్ అనే నేచర్ ఫొటోగ్రాఫర్ బంధించారు. లాస్ట్ వాక్ అంటూ ఆయన తన సోషల్ మీడియాలో ఆరోహెడ్ వీడియోను షేర్ చేసింది. ‘‘అది జూన్ 17వ తేదీ. పదమ్ తలాబ్ వద్ద తీసిన వీడియో ఇది. లెజెండరీ టైగ్రస్ ఆరోహెడ్ తన చివరి క్షణాల్లో నరకయాతన అనుభవించింది. అది పసికూనగా ఉన్నప్పటి నుంచి నేను దానిని చూస్తున్నా. View this post on Instagram A post shared by Sachin Rai (@sachin_rai_photography)దాని ధైర్యం, సహనం, పోరాటం.. ఆరోహెడ్ ఎదిగిన ప్రతీ దశ ఒక అధ్యాయమే. కృష్ణ (T-19), మాతామహి మచ్చ్లీ (T-16) వారసురాలిగా రన్థాంబోర్ అడవుల్లో తనదైన ముద్ర వేసుకుంది అది. అలాంటిది చివరిక్షణాల్లో.. కొన్ని అడుగులు వేస్తూ కింద పడిపోవడం ఎంతో బాధించింది. అలా అది ఓ చెట్టు కిందకు వెళ్తుండడం.. అదే దాని చివరి క్షణాలు అని నా మనసు చెప్పింది. కాసేపటికే అది ప్రకృతి ఒడిలోకి ఒరిగి శాశ్వత నిద్రలోకి జారుకుంది అని భావోద్వేగంగా ఓ సందేశం ఉంచారాయన. T-84కు ఆరోహెడ్ అని పేరు పెట్టడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. దాని ఎడమ చెంపపై బాణం ఆకారపు గుర్తు ఉండడం వల్ల అలా పేరు పెట్టారు. రన్థాంబోర్ టైగర్ రిజర్వ్ ప్రాంతం జోన్ 2, 3, 4లను ఇది చివరి క్షణాల దాకా తన ఆధీనంలో ఉంచుకుంది. ఫొటోగ్రాఫర్లు, ప్రకృతి ప్రేమికులు దీని రాజసానికి ఫిదా అయిపోయేవారు. బోన్ క్యాన్సర్ బారిన పడ్డాక.. చివరిరోజుల్లోనూ ఓ మొసలిని ఎదుర్కొని చంపిన వీడియో కూడా ఆ మధ్య బాగా వైరల్ అయ్యింది.

రాహుల్ గాంధీ డిమాండ్ను తిరస్కరించిన ఈసీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లలోని CCTV ఫుటేజ్ విడుదల చేయాలన్న డిమాండ్ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఓటర్ల గోప్యతా హక్కును పరిగణనలోకి తీసుకోవడంతో పాటు చట్టపరమైన ఆటంకాల కారణంగా వాటిని బహిరంగపర్చలేమని తేల్చి చెప్పింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సీసీ ఫుటేజీలు బహిరంగపర్చాలని ప్రతిపక్షాల డిమాండ్లు చేస్తున్న సంగతి తెలిసిందే. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇలా చేయడం ఓటర్ల గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఈసీ వర్గాలు ఏం చెప్పాయంటే.. ఓటర్ల గోప్యత: సీసీటీవీ ఫుటేజీ ఫుటేజ్ ద్వారా ఓటు వేసినవారిని, వేయని వారిని గుర్తించవచ్చు. తద్వారా వాళ్లపై వివక్ష లేదంటే బెదిరింపులకు పాల్పవచ్చు. చట్టపరమైన పరిమితులు: ఈ ఫుటేజ్ను బయట పెట్టడం ద్వారా.. ప్రజాప్రతినిధుల చట్టం (Representation of the People Act) ఉల్లంఘన అవుతుంది. పైగా ఓటు వేయడం.. ఓటు వేయకపోవడం వ్యక్తిగత హక్కు అని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. అంతర్గత వినియోగం మాత్రమే: ఈ వీడియోలు కేవలం అంతర్గత పర్యవేక్షణ కోసం మాత్రమే. ఒకవేళ కోర్టు ఆదేశిస్తే మాత్రమే వాటిని పంచుతాం. ఫుటేజ్ తొలగింపు: ఎన్నికల ఫలితాలపై 45 రోజుల్లోగా కోర్టులో పిటిషన్ దాఖలు కాకపోతే, ఆ తర్వాత వీడియో ఫుటేజ్ను తొలగించడం సాధారణ ప్రక్రియనే అని ఈసీ తెలిపింది కిందటి ఏడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మయూతీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే.. ఆ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. అయితే ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ఈసీ పదే పదే చెబుతూ వస్తోంది.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ మధ్యే 2024 లోక్సభ ఎన్నికలు, మహారాష్ట్ర సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కన్సాలిడేటెడ్, డిజిటల్ ఓటర్ రోల్స్ను ప్రచురించాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరారు. అలాగే, మహారాష్ట్రలో ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ బూత్లలో రికార్డ్ అయిన అన్ని CCTV ఫుటేజ్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈసీ తాజాగా చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల ఫిక్సింగ్ అని.. ప్రజాస్వామ్యానికి ఇదొక విషమని పేర్కొంటూ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు.

DGCA సీరియస్.. ఎయిరిండియా నుంచి ముగ్గురి తొలగింపు
న్యూఢిల్లీ: ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆగ్రహం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఆ సంస్థ కార్యకలాపాలపై డీజీసీఏ క్షణ్ణంగా పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. శనివారం ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. ఇటీవల బెంగళూరు నుంచి లండన్ హీత్రోకు బయలుదేరిన రెండు విమానాలు(మే 16, 17వ తేదీల్లోని AI133 సర్వీస్).. గరిష్ట విమాన ప్రయాణ సమయ పరిమితి 10 గంటలు మించిపోయాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి డీజీసీఏ.. ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఏడు రోజుల గడువు విధించింది. అదే సమయంలో..నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లే ఎయిరిండియాకు చెందిన ముగ్గురు సిబ్బందిపై చర్యలకు డీజీసీఏ ఉప్రకమించింది. ఈ ముగ్గురు అధికారులు సిబ్బంది షెడ్యూల్, రోస్టర్ విధులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. లైసెన్సింగ్, సర్వీసింగ్ లోపాలు ఉన్నా ఎయిరిండియా విమాన సిబ్బందిని షెడ్యూల్ చేయడంపై DGCA ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్లైన్స్ వెల్లడించిన విషయాల ఆధారంగా అలసత్వంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేయాలని సిఫార్సు చేసింది. ‘‘నిబంధనలు పాటించకుండానే విమానాలను షెడ్యూల్ చేశారు. అంతేకాకుండా, వారు ఈ తప్పిదాలపై జవాబుదారీతనంతో వ్యవహరించలేదు. ఎలాంటి జాప్యం చేయకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని డీజీసీఏ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో.. వెంటనే వారిపై అంతర్గత క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది. ముగ్గురు అధికారులపై తీసుకున్న చర్యలను 10 రోజులలోపు డీజీసీఏకి నివేదించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంతేకాకుండా వీరి స్థానంలో కొత్త అధికారులను నియమించాలని.. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు కొత్త వారినే కొనసాగించాలని తెలిపింది. విమాన సిబ్బంది క్రూ షెడ్యూల్, రోస్టరింగ్ పనులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులు.. పైలెట్లకు తగిన లైసెన్సింగ్, రెస్ట్, తప్పనిసరి నిబంధనలను ఉల్లంఘించారన్నది డీజీసీఏ వాదన. ఐవోసీసీ అడిటింగ్లో ఈ విషయం బయటపడింది. అయితే ఇటీవలి అహ్మదాబాద్ ఘటన నేపథ్యంలోనే డీజీసీఏ చర్యలకు ఎయిరిండియాకు సిఫారసు చేసినట్లు స్పష్టం అవుతోంది. అంతేకాదు.. క్రూ షెడ్యూలింగ్ నిబంధనలు, లైసెన్సింగ్, ఫ్లైట్ టైం లిమిటేషన్స్ తదితర అంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే ఇక నుంచి భారీ జరీమానాలు విధిస్తామని డీజీసీఏ హెచ్చరిస్తోంది కూడా. కాగా.. జూన్ 12వ తేదీ మధ్యాహ్నాం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది ఓ భవనంపై కూలి.. ముక్కలై.. పేలిపోయింది. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు విమానం కూలినచోట మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న వైద్య విద్యార్థులు, పలువురు స్థానికులు కూడా కన్నుమూశారు. మొత్తంగా ఈ దుర్ఘటనలో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 278కి చేరింది. మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, వారి కుటుంబీకులకు అందజేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

Bihar: దగ్గరపడుతున్న ఎన్నికలు.. పింఛను పెంచిన సీఎం నితీష్
పట్నా:ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటి నుంచే రాష్ట్రలోని రాజకీయ పార్టీలు ఉత్సాహంగా తమ పనులు మొదలుపెట్టాయి. నేడు(శనివారం) బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్టంలోని వృద్ధులు, వికలాంగులు,వితంతువులకు ఇచ్చే నెలవారీ పెన్షన్ను రూ.400 నుండి రూ.1,100కి పెంచుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని కోటీ తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకం ప్రయోజనం చేకూర్చనుంది. मुझे यह बताते हुए खुशी हो रही है कि सामाजिक सुरक्षा पेंशन योजना के तहत सभी वृद्धजनों, दिव्यांगजनों और विधवा महिलाओं को अब हर महीने 400 रु॰ की जगह 1100 रु॰ पेंशन मिलेगी। सभी लाभार्थियों को जुलाई महीने से पेंशन बढ़ी हुई दर पर मिलेगी। सभी लाभार्थियों के खाते में यह राशि महीने की 10…— Nitish Kumar (@NitishKumar) June 21, 2025‘సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇకపై ప్రతి నెలా రూ. 400 కు బదులుగా రూ. 1,100 పెన్షన్ అందజేయనున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను. జూలై నుండి పెరిగిన పెన్షన్ లభిస్తుంది. దీనివలన ఒక కోటి 9 లక్షల 69 వేల 255 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందని’ నితీష్ కుమార్ ప్రకటించారు. వృద్ధులు సమాజంలో విలువైన భాగస్వాములు, వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం మా బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటుంది’ అని ఆయన అన్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఇటువంటి ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: కోడలి కోసం ‘గొయ్యి’ తవ్విన మామ.. పోలీసుల జోక్యంతో..
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

గాయకునికి కిలాడీ మోసం
యశవంతపుర: హెల్ప్లైన్ పేరుతో గాయకునికి మహిళ టోపీ వేసిన ఘటన మంగళూరులో వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గాయకుడైన కె.రాజేశ్ సంగీత కచేరీలను నిర్వహించేవాడు. ఈయన స్వస్థలం దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి. ఆయనకు గతేడాది ఫేస్బుక్ ద్వారా సంధ్య పవిత్ర అనే మహిళ పరిచయమైంది, ఈమెది బెంగళూరు అని తెలిసింది. మోసపోయిన వ్యక్తులకు సాయం చేస్తానని చెప్పుకొంది. ఓ వ్యవహారంలో హైకోర్టు ద్వారా కేసును పరిష్కారించుకోవాలని చెప్పి రాజేశ్ నుంచి రూ.3.2 లక్షలను పలు విడతలుగా వసూలు చేసింది. కానీ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. రాజేశ్ నిలదీయగా, వేరేవాళ్లకు డబ్బులు ఇచ్చి మోసపోయినట్లు కట్టుకథలు చెప్పిందామె. బాధితుడు గట్టిగా అడగడంతో, నీ కాళ్లు చేతులు విరిచేయిస్తానని సంధ్య బెదిరించింది. రాజేశ్ బెళ్తంగడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దారుణం.. భార్యపై అనుమానంతో పిల్లలను చంపిన తండ్రి
మైలవరం(కృష్ణా): భార్యపై అనుమానంతో అభం శుభం తెలియని చిన్నారులను పొట్టనబెట్టుకున్న తండ్రి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈ నెల 12న వెలుగులోకి వచ్చిన ఇద్దరు చిన్నారుల మృతి ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సాంకేతిక పరిజ్ఞానంతో నింది తుడిని పట్టుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మైలవరంలోని మారుతీనగర్లో నివసించే వేములవాడ రవిశంకర్, చంద్రిక దంపతులకు కుమార్తె లక్ష్మీహిరణ్య(9), కుమారుడు లీలాసాయి నృసింహ (7) ఉన్నారు. వారిద్దరూ జి.కొండూరులోని ఓ వసతి గృహంలో ఉంటూ ఐదు, మూడో తరగతులు చదువుతున్నారు. రవిశంకర్, చంద్రక నిత్యం గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో చంద్రిక ఉపాధి నిమిత్తం ఇటీవల బహ్రెయిన్ వెళ్లింది. మొదటి నుంచి భార్య తీరుపై రవిశంకర్కు అనుమానం ఉంది. భార్య బహ్రెయిన్ వెళ్లినప్పటి నుంచి పిల్లలను చంపేందుకు రవిశంకర్ పథకం రచించాడు. ఈ క్రమంలో ఈ నెల ఎనిమిదో తేదీన రవిశంకర్ పుట్టిన రోజున పిల్లలు ఇద్దరిని హత్య చేసేందుకు నిర్ణయించాడు. పథకం ప్రకారం ‘నీకు చాలా అన్యాయం చేశాను చంద్రిక’ అంటూ పిల్లలు ఇద్దరినీ చంపి తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాశాడు. అనంతరం పిల్లలు ఇద్దరినీ హత్య చేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఈ నెల 12న రవిశంకర్ తండ్రి ఇంటికి వచ్చి చూడగా మనవడు, మనవరాలు బెడ్పై విగతజీవుల్లా కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులకు రవిశంకర్ ఇంట్లో అతను చంద్రికకు రాసిన లేఖ దొరికింది. దీంతో రవిశంకర్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావించారు. రవిశంకర్ ఫోన్ సిగ్నల్ చివరిగా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద లభించడంతో రెండు రోజులపాటు రవిశంకర్ ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కృష్ణానదిలో గాలింపు చేపట్టారు. అయినప్పటికీ రవిశంకర్ ఆచూకీ లభించకపోవడంతో బతికే ఉంటాడని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.ఫోన్ సిగ్నల్ ఆధారంగా..ఇద్దరు బిడ్డలను హత్య చేసిన అనంతరం రవిశంకర్ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్దకు చేరుకొని అక్కడి సిమ్తో పాటు సెల్ఫోన్ను పడేసి పరారయ్యాడు. ఈ క్రమంలో కొత్తగా కొనుగోలు చేసిన సెల్ నుంచి మైలవరంలో ఒకరికి ఇటీవల ఫోన్ చేయడాన్ని పోలీసులు గుర్తించి, ఫోన్ సిగ్నల్ను ట్రాక్చేసి రవిశంకర్ ఆచూకీని కనిపెట్టారు. సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో తలదాచుకున్న నిందితుడిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని మైలవరం తరలించి విచారణ చేపట్టారు. ఈ నెల ఎనిమిదో తేదీన రవిశంకర్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు మధ్యాహ్నం బిర్యానీ తీసుకొచ్చి దానిలో పురుగుమందు కలిపి ఇద్దరు బిడ్డలకు బలవంతంగా తినిపించి, వారిద్దరూ స్పృహ కోల్పోయే వరకు అక్కడే ఉండి ఆ తరువాత ఇంటికి తాళం వేసి పరారైనట్లు పోలీసుల విచారణలో తేలిందని సమా చారం. నిందితుడిని ఆదివారం మీడియా ముందు ప్రవేశపెడతారని తెలుస్తోంది.

ఇద్దరు బాలికల బలవన్మరణం
హైదరాబాద్: తల్లిదండ్రులు మందలిస్తున్నారనే కారణంతో అక్కాచెల్లెళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ కథనం ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్, రమణమ్మ దంపతులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో స్థిరపడ్డాడు. వీరికి వెనీల (17), అఖిల(16) సంతానం. వీరు ఇంటర్ ద్వితీయ, ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. డిఫెన్స్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసే వెంకటేశ్ను మూడు నెలల కోసం బాలాపూర్ ఆర్సీఐకి బదిలీ చేశారు. దీంతో వారు మూడు వారాల క్రితం కుటుంబంతో సహా వచ్చి మల్లాపూర్లోని శు¿ోదయ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా కుమార్తెలు అప్పుడప్పుడు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్తుండడంతో తల్లిదండ్రులు మందలించేవారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం వెంకటేశ్ డ్యూటీకి, అతని భార్య కిరాణా దుకాణానికి వెళ్లిన సమయంలో ఇద్దరు కుమార్తెలు వెంటిలేటర్ గ్రిల్స్కు చున్నీలతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కాసేపటికి ఇంటికి వచ్చి చూసిన రమణమ్మ ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహేశ్వరం ఏసీపీ జానకీ రెడ్డి, బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. గతంలో వెనీల బెంగళూరులో అదృశ్యం కావడంతో వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారాల కారణంగానే తల్లిదండ్రులు మందలించినట్లుగా విశ్వసనీయ సమాచారం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

వివాహేతర సంబంధం: చెట్టుకు కట్టేసి.. రాళ్లతో కొట్టి హత్య
నల్గొండ: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో మహిళ భర్త, ఆయన కుటుంబ సభ్యులు ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నోముల గ్రామానికి చెందిన నర్సింగ్ జానయ్య(35)కు ఇంకా వివాహం కాలేదు. జానయ్యకు అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళతో పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. గతేడాది ఇదే విషయమై ఆ మహిళ కుటుంబ సభ్యులకు, జానయ్యకు మధ్య గొడవలు జరిగాయి. పలుమార్లు పెద్దమనుషుల మధ్య పంచాయితీలు కూడా నడిచాయి. ఇదే విషయంపై జానయ్యపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో అతడు జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుంచి వచ్చాక కూడా జానయ్య ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసి జానయ్యను అంతమొందించాలని ఆ మహిళ భర్త నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన భార్యతోనే జానయ్యను శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి పిలిపించాడు. ఇంటికి వచ్చిన జానయ్య కళ్లలో కారం చల్లి.. కాళ్లు, చేతులు కట్టేసి ఆ మహిళతోపాటు ఆమె భర్త కర్రలతో చితకబాదారు. అనంతరం మరికొందరితో కలసి ఇంటి పక్కన ఉన్న వీధిలో చెట్టుకు జానయ్యను తాళ్లతో కట్టేసి అతడి తల, కాళ్లు, చేతులు, మర్మాంగాలపై విచక్షణారహితంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన జానయ్య అసస్మారకస్థితిలోకి వెళ్లాడు. చుట్టుపక్కల వారు గమనించి జానయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి జానయ్యను నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై జానయ్య తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.