ప్రధాన వార్తలు

ఈసీ డ్రామా.. పులివెందులలో రీపోలింగ్ బహిష్కరిస్తున్నాం: అవినాష్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్: పులివెందులలో ఈరోజు జరుగుతున్న రీపోలింగ్ను వైఎస్సార్సీపీ బహిష్కరిస్తున్నట్టు ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆపరేషన్ రిగ్గింగ్ను చాలా గొప్పగా చేశారని మండిపడ్డారు. పులివెందులలో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో చాలా చోట్ల చేయవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నిక కమిషన్పై ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నిన్న జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఎలా జరిగాయో రాష్ట్రం మొత్తం చూశారు. ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది టీడీపీ వారు ఎలా బూత్లు ఆక్రమించారో అందరికీ తెలుసు. ఈరోజు తెల్లవారు జామున 2 గంటలకు కేవలం 2 బూత్లలో మాత్రమే రీపోలింగ్ ప్రకటించారు. మేము స్పష్టంగా 15 బూత్లలో రీపోలింగ్ జరగాలని, కేంద్ర బలగాలతో ఎన్నిక జరపాలని మేము కోరాం. కేవలం తప్పించుకునేందుకు రాత్రికి రాత్రి కేవలం రెండు బూత్లలో రీపోలింగ్ అంటున్నారు. అసలు ఏజెంట్లను కూడా బూత్లోకి రానివ్వలేదు. అన్ని ఆధారాలు బయటకు వచ్చాయి.మహిళల ఓట్లను కూడా మగవాళ్లు వేసేశారు. కోర్టుకు ఆశ్రయిస్తామని ఈ రీపోలింగ్ డ్రామాను తెర మీదకు తెచ్చారా?. మా స్టాండ్ 15 బూత్లలో రీపోలింగ్ జరపాలి. ఈ రెండు బూత్లలో నేడు జరుగుతున్న రీపోలింగ్ మేము బహిష్కరిస్తున్నాం. మొత్తం 15 బూత్లలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. నిన్న మీడియాను కూడా అడ్డుకుని కెమెరాలు లాక్కున్నారు. గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్ని అడిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. పులివెందులలో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపారు.ఒక గ్రామంలో ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కోడానికి జిల్లాలో ఉన్న టీడీపీ కేడర్ మొత్తాన్ని గ్రామంలో దించారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో చాలా చోట్ల చేయవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నిక కమిషన్పై ఉంది. నిన్న జరిగిన అరాచకాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు రీపోలింగ్ పెడుతున్నారు. అన్ని సెంటర్లలో పోలీసుల సంపూర్ణ సహకారంతో మా ఏజెంట్స్ను బయటకు నెట్టేశారు. 15 ఊరులో ప్రజలను అడిగితే నిజానిజాలు తెలుస్తాయి. మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను.. నిజమైన ఓటర్లను, ప్రజలను ప్రశ్నించి చూడండి. నిజాలు బయటకు వస్తాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో రౌడీ రాజ్యంపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి:రాష్ట్రంలో రౌడీ రాజ్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలలో జరిగిన అరాచకాలపై మంగళవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.‘పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న ZPTC సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట ZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగంచేస్తూ, అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని,పోలీసులను వాడుకుని, ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారు.ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈరోజు నిజంగా ఒక బ్లాక్ డే.పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న ZPTC సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్టZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న… pic.twitter.com/aXclpoCv77— YS Jagan Mohan Reddy (@ysjagan) August 12, 2025‘చంద్రబాబు సీట్లో ఉండగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది ఒక డొల్ల మాత్రమే అని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులు అన్నవి ఒట్టిమాటలేనని, వ్యవస్థలనేవి కేవలం అలంకార ప్రాయం మాత్రమేనని మరోమారు రుజువైంది. ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓట్లేసేలా చూడ్డం, ఆ మేరకు ప్రజలకు సహకరిస్తూ, తగిన సదుపాయాలు ఇస్తూ, ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం అన్నది ప్రభుత్వ విధి. కాని, చంద్రబాబుగారు ప్రభుత్వాన్ని వాడుకుని తన ప్రభుత్వ సిబ్బంది, పోలీసుల చేతే ఏకంగా రిగ్గింగ్ చేయించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎలా అనగలుగుతాం? చంద్రబాబుగారు.. ఓట్లను రిగ్గింగ్ చేయగలరేమో కాని, ప్రజల హృదయాలను కాదు...ఎన్నికలు ఏవైనా ఏ గ్రామంలో ఓటర్లకు అదే గ్రామంలో పోలింగ్ నిర్వహించడం గతం వరకూ నుంచో పాటిస్తున్న విధానం. కాని చంద్రబాబుగారి ఆదేశాల మేరకు పులివెందుల ZPTC పరిధిలోని పలు గ్రామాల పోలింగ్ బూత్లను అటు ఇటు మారుస్తూ, 2 కి.మీ, 4 కి.మీ.ల దూరానికి మార్చినప్పడే క్షుద్ర రాజకీయానికి నాందిపడింది. మరోవంక నిన్న రాత్రి నుంచే ఎన్నికలు జరుగుతున్న ప్రతి గ్రామంలోకి, సుమారు 200 మంది చొప్పున బయట ప్రాంతాలకు చెందిన టీడీపీ వాళ్లు యథేచ్ఛగా చొరబడి, తెల్లవారుజామునుంచే ఓటర్లను బయటకు రానివ్వకుండా దిగ్బంధించి, బూత్లను ఆక్రమించుకున్నారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బయట ప్రాంతాలకు చెందిన తమ టీడీపీ నాయకులతో, కార్యకర్తలతో ఓట్లేయించారు. వైఎస్సార్సీపీకి చెందిన ఏజెంట్లు బూత్ల్లో కనీసం కూర్చోనీయలేదు, ఓటర్లను బూత్లవైపునకు రానీయకుండా ఎక్కడికక్కడ భయపెట్టారు, తరిమి కొట్టి రిగ్గింగ్కు పాల్పడ్డారు. మహిళా ఏజెంట్లపైన కూడా దాడులు చేశారు. స్వేచ్ఛగా ప్రజలు ఓట్లేయడానికి కాపలాకాయాల్సిన డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఇతర పోలీసులు, చంద్రబాబుగారి తప్పుడు ఆదేశాలకు తలొగ్గుతూ, టీడీపీ వాళ్లు చేసే దాడులు, దౌర్జన్యాలకు దగ్గరుండి కాపలా కాశారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సిన డీఐజీ కోయ ప్రవీణ్, టీడీపీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావుగారి సమీప బంధువు, పచ్చచొక్కా వేసుకుని దగ్గరుండి ఎన్నికల అక్రమాలను ప్రోత్సహించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎవరైనా అనగలుగుతారా? మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడం?’అని ప్ర శ్నించారు.‘అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు? ఆయన ఏం మంచి చేశాడని ఓట్లేస్తారు. 15నెలల ఆయన పాలనలో వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత, పారిశ్రామిక రంగాలు సహా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. రాష్ట్రం మొత్తం తిరోగమనంలో ఉంది. ప్రతి కుటుంబం తన కాళ్లమీద తాను నిలబడేలా వారికి భరోసా ఉండేలా మా ప్రభుత్వం నాటి పథకాలన్నింటినీ, ఆ స్కీములు అన్నిటినీ రద్దుచేయడమే కాదు, తాను ఇస్తానంటూ ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లనూ మోసాలతో, అబద్ధాలతో ఎగరగొట్టేశాడు. ఇప్పుడు ఏగ్రామానికి వెళ్లినా, ఏ ఇంటికి వెళ్లినా చంద్రబాబునాయుడును, ఆ పార్టీకి చెందిన వారికి, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు రివర్స్లో ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సుమారు రూ.19వేల కోట్ల మేర కరెంటు ఛార్జీలతో బాదుడే బాదుడు. మరోవైపు మట్టి, ఇసుక, సిలికా, క్వార్ట్జ్, లెటరైట్, లిక్కర్, చివరకు కరెంటు కొనుగోలు ఒప్పందాలు, లంచాల కోసం శెనక్కాయలకు, బెల్లాలకు భూములు అప్పనంగా ఇవ్వడం మొదలు, మొబలైజేషన్ అడ్వాన్స్ల పేరిట పనులు జరక్కుండానే, రేట్లు పెంచి ఇవ్వడం మొదలు, రాజధాని నిర్మాణాల పేరిట విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఏ రైతుకూ, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు, విద్యాదీవెన, వసతి దీవెన లేదు, ఆస్పత్రులకు వెళ్తే ఏ పేదవాళ్లకూ ఆరోగ్యశ్రీ లేదు. స్కూళ్లలో నాడు-నేడు లేదు, ట్యాబుల్లేవు, టోఫెల్ పీరియడ్స్తో పాటు ఇంగ్లిషు మీడియం లేదు. మరి ఇలాంటి అబద్ధాలు, మోసాలు, అవినీతి పాలన చేస్తున్న చంద్రబాబుగారికి ప్రజలు ఓట్లెందుకు వేస్తారు?’ ..పోనీ తనకే ప్రజలు ఓట్లేస్తారని అనుకున్నప్పుడు చంద్రబాబుగారు, ఇన్ని దౌర్జన్యాలు, అరాచకాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తనకే ఓట్లేస్తారని అనుకున్నప్పుడు, ఆ ధైర్యం, నమ్మకం ఉన్నప్పుడు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా ఓటర్లను స్వేచ్ఛగా వదిలేసేవారు కదా? ఓటర్లు ఉన్న దగ్గరే పోలింగ్ బూత్లు పెట్టేవాడు కదా? ఆ నమ్మకం లేదు కాబట్టే చంద్రబాబుగారు ఈ అరాచకాలన్నీ చేశారు. రెండు చిన్న ZPTC స్థానాలను లాక్కోవడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు బలగాలను వాడుకుని, ఇన్ని అరాచకాలు చేసి గెలవాలని చూస్తే దాంతో సాధించేది ఏముంటుంది?..2017 నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా చంద్రబాబుగారు ఇదే తరహా కుట్రతో అరాచకాలు చేశారు. ప్రతి వీధికో ఎమ్మెల్యేను పెట్టారు, ప్రతి వార్డుకో మంత్రిని పెట్టి, విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. ఆ రోజు ఆ ఉప ఎన్నికల్లో 27వేల ఓట్లతో గెలిచామంటూ సంబరాలు చేసుకున్నారు, మా పార్టీ పనైపోయిందని, జగన్ పని అయిపోందని టీడీపీకి చెందిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడించారు. ఏడాదిన్నర తర్వాత జరిగిన అదే నంద్యాల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 34,560 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చంద్రబాబుగారి పార్టీ పూర్తిగా క్లీన్బౌల్డ్ అయ్యింది. అవ్వాళ్టి ఎన్నికతో పోలిస్తే ఇవాళ పులివెందుల ఈ రెండు ZPTC ఉప ఎన్నికల్లో అంతకుమించి అరాచకాలు చేశారు. 2019 తరహాలోనే భవిష్యత్తులోకూడా అదే స్థాయిలో పులివెందుల సహా రాష్ట్ర ప్రజలు కచ్చితంగా స్పందించి, చంద్రబాబుకు బుద్ధిచెప్తారు...పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల్లో ఇవాళ ఇన్ని అక్రమాలు జరిగినా, అడ్డుకోవాల్సిన వ్యవస్థలన్నీ మౌనం దాల్చడం విచారకరం. అయినా రాజ్యాంగ వ్యవస్థల మీద మాకున్న విశ్వాసంతో, ఎన్నికల అక్రమాలపై సాక్ష్యాలు, ఆధారాలతో న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తాం. నిజంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారంతా ఈ అన్యాయాన్ని నిలదీస్తూ, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో, వారి భద్రత నడుమ తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరుతాం’ అని చంద్రబాబు రౌడీ రాజ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐరాస సమావేశానికి ప్రధాని మోదీ .. ట్రంప్తో ముఖాముఖీ?
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి(ఐరాస) సర్వసభ్య సమావేశం (యూఎన్జీఏ) వార్షిక ఉన్నత స్థాయి సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే అవకాశం ఉందని పీటీఐ తెలిపింది. ఇదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించనున్నారని పేర్కొంది.భారత దిగుమతులపై ట్రంప్ పరస్పర సుంకాలు విధించడంతో భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ప్రధాని మోదీ యూఎన్జీఏ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం అమెరికాలోని న్యూయార్క్లో జరగనుంది. సెప్టెంబర్ 23 నుండి 29 వరకు జరిగే ఈ సదస్సును సాంప్రదాయకంగా బ్రెజిల్ ప్రారంభించనుంది. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్ సెషన్ ఉంటుందని సమాచారం. భారత ప్రతినిధి సెప్టెంబర్ 26న ఉదయం అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు పీటీఐ పేర్కొంది. అదే రోజున ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రతినిధులు కూడా ప్రసంగించే అవకాశం ఉంది.గత ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికాలోని వైట్ హౌస్లో ట్రంప్తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం భారత్తో వాణిజ్య చర్చలు నడుస్తున్న తరుణంలోనే ట్రంప్ భారతదేశంపై 25 శాతం అదనపు సుంకం విధించారు. దీంతో మొత్తం విధించిన సుంకం 50 శాతంగా మారింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్యను అన్యాయమైనదిగా పేర్కొంది. కాగా సెప్టెంబర్ 26న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ.. అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా పలు దేశాధినేతలతో మోదీ భేటీ కానున్నారని తెలుస్తోంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రధాని మోదీ , అధ్యక్షుడు ట్రంప్ భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా, భారీ వర్ష సూచన దృష్ట్యా తెలంగాణలోని ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలల్లోనూ బుధ, గురువారాల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. INSANE RAINFALL IN MANCHERIAL, ASIFABAD, MULUGU, BHUPALAPALLY, PEDDAPALLI The first round of LPA rains turned MASSIVE as North East TG got extremely heavy rainfall in few places. Bheemini, Kannepalli in Mancherial recorded highest rainfall of 207mm. Other parts too got VERY…— Telangana Weatherman (@balaji25_t) August 13, 2025భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులు, అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంఐటీ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి బుధవారం ఇంటి నుంచి పని చేసే అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుండపోత వానలతో నగరంలోని రోడ్లు జలమయమై, ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందనే అంచనాలతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.5:00 AM Update 🌧️🌧️Scattered Rains across - Adilabad, Asifabad, Nirmal, Mancherial, Nizamabad, Jagtial, Kamareddy, Sircilla, Karimnagar, Peddapalli, Siddipet, Sangareddy, Medak, Hanumakonda, Nalgonda, Suryapet, Nagarkurnool, Mahabubnagar, Wanaparthy, Gadwal districts next 3hrs— Weatherman Karthikk (@telangana_rains) August 12, 2025

విధ్వంసం.. రషీద్ ఖాన్పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన లివింగ్స్టోన్
హండ్రెడ్ లీగ్లో ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు లియామ్ లివింగ్స్టోన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ లీగ్లో బర్మింగ్హమ్ ఫీనిక్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. నిన్న (ఆగస్ట్ 12) ఓవల్ ఇన్విన్సిబుల్స్తో జరిగిన మ్యాచ్లో విధ్వంసం సృష్టించాడు. 27 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 69 పరగులు చేసి తన జట్టును గెలపించాడు.ఈ ఇన్నింగ్స్లో లివింగ్స్టోన్ ఇన్విన్సిబుల్స్ బౌలర్ రషీద్ ఖాన్పై విచక్షణారాహిత్యంగా విరుచుకుపడ్డాడు. వరుసగా ఐదు బంతుల్లో 4,6,6,6,4 (26 పరుగులు) బాదాడు. ఈ మ్యాచ్లో తన కోటా 20 బంతులు వేసిన రషీద్.. ఏకంగా 59 పరుగులు సమర్పించుకున్నాడు. 4,6,6,6,4 BY LIAM LIVINGSTONE AGAINST RASHID KHAN 🥶- 26 runs from just 5 balls by the Captain. pic.twitter.com/DioUvlipWk— Johns. (@CricCrazyJohns) August 13, 2025హండ్రెడ్ లీగ్లో ఇదే అత్యంత ఖరీదైన స్పెల్. రషీద్ టీ20 కెరీర్లోనూ (హండ్రెడ్ మ్యాచ్లు టీ20లుగా పరిగణించబడతాయి) ఇవే అత్యంత చెత్త గణాంకాలుగా (20-3-59-0) నిలిచాయి. దీనికి ముందు రషీద్ చెత్త టీ20 గణాంకాలు 2018 ఐపీఎల్లో (పంజాబ్ కింగ్స్పై 4 ఓవర్లలో 55 పరుగులు) నమోదయ్యాయి.తాజాగా రషీద్ నమోదు చేసిన అత్యంత చెత్త గణాంకాలు మ్యాచ్ స్వరూపానే మార్చేశాయి. 25 బంతుల్లో 61 పరుగులు చేయాల్సిన తరుణంలో లివింగ్స్టోన్ విధ్వంసం సృష్టించడంతో మ్యాచ్ ఫీనిక్స్వైపు తిరిగింది. చివరి ఓవర్ (5 బంతులు) తొలి రెండు బంతులకు వికెట్లు కోల్పోయినా బెన్నీ హోవెల్ బౌండరీని బాది ఫీనిక్స్ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా ఆ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఇన్విన్సిబుల్స్ తొలుత బ్యాటింగ్ చేసి 180 పరుగుల భారీ స్కోర్ చేసినా మ్యాచ్ను కాపాడుకోలేకపోయింది. లివింగ్స్టోన్కు ముందు విల్ స్మీడ్ (29 బంతుల్లో 51; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జో క్లార్క్ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడి ఫీనిక్స్ గెలుపుకు పునాది వేశారు.ONE OF THE CRAZIEST SHOT EVER - THIS IS RASHID KHAN..!!! 🫡 pic.twitter.com/EozpYLhjD2— Johns. (@CricCrazyJohns) August 12, 2025అంతకుముందు ఇన్విన్సిబుల్స్.. డొనొవన్ ఫెరియెరా (29 బంతుల్లో 63; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపుల అనంతరం నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. జోర్డన్ కాక్స్ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖర్లో రషీద్ ఖాన్ రెండు భారీ సిక్సర్లతో చెలరేగాడు. ఇందులో ఓ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది.

‘భారత్కు ఒక్క చుక్క నీటినీ ఇవ్వం’.. మళ్లీ పాక్ తాటాకు చప్పుళ్లు
న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధు నదిలోని ఒక్క చుక్క నీటిని కూడా భారత్కు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ శత్రు దేశం.. సింధునదిలోని ఒక్క చుక్కనీటిని లాక్కున్నా సహించేది లేదన్నారు.జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత ఏప్రిల్ 23న భారత్ 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని (ఐడబ్యూటీ)నిలిపివేసింది. ఈ నేపధ్యంలో ఇదే నీటిపై ఆధారపడిన పాక్.. సింధు ప్రవాహాన్ని అడ్డుకునే ఏ ప్రయత్నమైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని పేర్కొంది. తాజాగా ఇస్లామాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘మీరు మా నీటిని నిలిపివేస్తామని బెదిరిస్తే, పాకిస్తాన్ నుండి ఒక్క చుక్క నీటిని కూడా లాక్కోలేరని గుర్తుంచుకోండి.అలాంటి చర్యకు ప్రయత్నిస్తే, మీకు మళ్లీ గుణపాఠం చెబుతామని, అప్పుడు మీరు మీ చెవులు పట్టుకోవాల్సి వస్తుందని’ హెచ్చరించారు. Shehbaz Sharif warns India of “serious consequences” if the Indus Water Treaty is touched… because in Pakistan’s worldview, water is off-limits but exporting militants is fair game.Four threats in 48 hrs from 4 men reading the same ISI script. Islamabad’s version of water… pic.twitter.com/DwXV9hbsPn— Mariam Solaimankhil (@Mariamistan) August 12, 2025షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించలేదు. కాగా పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఇటీవల.. సింధు జలాల ఒప్పందం రద్దును సింధు నాగరికతపై దాడిగా అభివర్ణిస్తూ, ఈ విషయంలో భారత్.. పాకిస్తాన్ను యుద్ధ పరిస్థితుల్లోకి నెట్టివస్తే.. వెనక్కి తగ్గేది లేదన్నారు. ఇదే అంశంపై స్పందించిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసే ఏ ఆనకట్టనైనా ఇస్లామాబాద్ ధ్వంసం చేస్తుందని వ్యాఖ్యానించారు.భారత్ ఆనకట్ట నిర్మించే వరకు వేచి చూస్తామని, తరువాత దానిని నాశనం చేస్తామని హెచ్చరించినట్లు డాన్ వార్తాపత్రిక పేర్కొంది.

బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు మంచు లక్ష్మీ
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ సాగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేశారు. అలా ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా.. ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. గంటల పాటు సాగిన విచారణకు సహకరించారు. ఇప్పుడు బుధవారం(ఆగస్టు 13) నాడు మంచు లక్ష్మీ.. ఈడీ అధికారుల ముందు హాజరుకానుంది.(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?)ఈ రోజు 11 గంటలకు వ్యక్తిగతంగా మంచు లక్ష్మీ.. ఈడీ కార్యాలయానికి రానుంది. ఇప్పటికే సంబంధిత వివరాలు తీసుకురావాలని ఈమెకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అక్రమ మార్గంలో అనధికారికంగా వచ్చిన డబ్బు ఎంత తీసుకున్నారు? ప్రమోషన్తో ఎంత లాభం చేకూరింది? తదితర అంశాల గురించి ప్రశ్నించనున్నారు. మనీ లాండరింగ్ అంశాలపైన కూడా దర్యాప్తు కొనసాగించనున్నారు.(ఇదీ చదవండి: స్టార్ హీరో కొడుకు కోసం ముగ్గురు హీరోయిన్లు?)

Bihar: ఓటరు జాబితా సవరణపై సుప్రీం సీరియస్.. ఈసీకి వార్నింగ్
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు నెలల వ్యవధి ఉన్న ప్రస్తుత సమయంలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో ఓటర్ల జాబితా సవరణ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తే, ఆయా వర్గాలు కోర్టును ఆశ్రయించేందుకు సమయం కూడా ఉండదని పేర్కొంది.బీహార్లో ముమ్మరంగా జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి అక్రమాలైనా చోటుచేసుకున్నట్లు తేలితే. ఎన్నికలు సమీపించే సెప్టెంబర్లో అయినా ఆ జాబితాను పక్కనపెట్టేస్తామని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈసీ గతంలో.. ఆధార్ కార్డు కలిగి ఉన్నప్పటికీ బీహార్ పౌరుల పౌరసత్వాన్ని నిర్ధారించి, ఓటు హక్కు కల్పించలేమంటూ చేసిన వాదనను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీనిని నిర్ణయించేది ఐదు కోట్ల మంది ఓటర్లని, ఈసీ కాదని ఎన్నికల కమిషన్ పేర్కొంది.పౌరసత్వ నిర్ధారణకు ఈసీ ఏమీ పోలీసు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాగా బీహార్లో ఎన్నికల సంఘం హడావుడిగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. మరోవైపు ఈ జాబితా సవరణలోని లోపాలు ప్రతీ రోజూ బయటపెడుతూనే ఉన్నాయి. వీటిపై సుప్రీంకోర్టులోనూ పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయ. ఈ నేపధ్యంలో ఎన్నికలు తరుముకు వస్తున్న తరుణంలో, ఇంత తక్కువ సమయంలో ఈ భారీ ప్రక్రియ ఎందుకు చేపట్టారని ఎన్నికల సంఘాన్ని నిలదీసింది.దీనిపై స్పందించిన ఈసీ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ, అనర్హులైన ఓటర్లను తొలగిస్తూ, ఓటర్ల జాబితాను శుద్ధి చేసేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు వివరణ ఇచ్చింది. అయితే ప్రతిపక్షాలు ఈ ఓటర్లు జాబితా సవరణ ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇంతలో లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర, కర్నాటకలలో ఓటర్ల జాబితాలో ఓట్ల చోరీని ఆధారాలతో సహా బయటపెట్టడంతో పాటు బీహార్ లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపైనా పలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ కావడం ప్రతిపక్షాలను ఊరటనిచ్చింది.

టారిఫ్ ఒడిదుడుకులు ఇంకెన్ని రోజులు!
అమెరికా టారిఫ్ల వల్ల నెలకొన్న ఒడిదుడుకుల ప్రభావం మనపై స్వల్పకాలికంగానే ఉంటుందని యూనియన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ మధు నాయర్ చెప్పారు. దీర్ఘకాలికంగా చూసినప్పుడు, భారీ రుణభారం ఉన్న అమెరికా, ప్రస్తుతంతో పోలిస్తే కాస్త బలహీనపడొచ్చని ఆయన చెప్పారు. పరిస్థితులు క్రమంగా స్థిరపడి భారత్లాంటి దేశాలకు మేలు జరుగుతుందని ఆయన వెల్లడించారు. మన మార్కెట్లలో తీవ్ర స్థాయిలో కరెక్షన్ రాకపోవచ్చన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల సంగతి అలా ఉంచితే, భారత ఆర్థిక మూలాలు మెరుగ్గా ఉన్న నేపథ్యంలో దేశీయంగా మార్కెట్లలోకి పెట్టుబడుల ప్రవాహం పటిష్టంగా ఉంటోందని నాయర్ చెప్పారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు, ఈపీఎఫ్ నిధులు, రిటైల్ ఇన్వెస్టర్లు, యులిప్స్ వంటి మార్గాల్లో ప్రతి నెలా రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులు వస్తున్నాయని ఆయన తెలిపారు. రూ.లక్ష కోట్ల ఏయూఎం లక్ష్యంరాబోయే అయిదేళ్లలో రూ. లక్ష కోట్ల ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) స్థాయిని సాధించాలని నిర్దేశించుకున్నట్లు నాయర్ చెప్పారు. ప్రస్తుతం ఇది సుమారు రూ. 23,000 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. అధిక వృద్ధి సాధన దిశగా ప్రస్తుత పథకాలపై మరింతగా దృష్టి పెట్టడంతో పాటు కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నట్లు నాయర్ తెలిపారు. సెప్టెంబర్ 1న డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: టెలికాం టారిఫ్లు పెంపు?అర్థయ పేరిట స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఎస్ఐఎఫ్)ను నవంబర్లో అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ప్రస్తుతం కన్జూమర్ డిస్క్రిషనరీ, టెలికం, క్యాపిటల్ గూడ్స్/ఇండస్ట్రియల్స్ రంగాలు పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉండగా ఇంధన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలు కాస్త ప్రతికూలంగా ఉన్నాయని నాయర్ చెప్పారు.

మునీర్ మంతనం.. పాక్ మద్దతుగా అమెరికా సంచలన నిర్ణయం
వాషింగ్టన్: బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ), మజీద్ బ్రిగేడ్లను విదేశీ ఉగ్రవాద సంస్థ (ఎఫ్టీఓ)లుగా అమెరికా ప్రకటించింది. బీఎల్ఏని 2019లోనే.. స్పెషల్లీ డెజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ (ఎస్డీజీటీ) జాబితాలో చేర్చిన అమెరికా.. తాజాగా మజీద్ బ్రిగేడ్ను కూడా బీఎల్ఏలో భాగంగానే భావిస్తున్నట్టు ప్రకటించింది. 2019 నుంచి ఆ రెండు సంస్థలు చేసిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఎఫ్టీవోలుగా గుర్తిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు.ఈ సంస్థల హింసాత్మక చర్యలు పౌరుల భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని, ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడంలో అమెరికా ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. ‘ఉగ్రవాద సంస్థలను ఇలా గుర్తించడం వల్ల వాటికి లభించే సహాయాన్ని, నిధులను నిరోధించవచ్చు. ఈ సంస్థలకు ఆర్థికంగా, భౌతికంగా లభించే మద్దతును చట్టపరంగా నిలిపివేయడం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవడం ఈ చర్య ప్రధాన ఉద్దేశం’అని ఆయన పేర్కొన్నారు. పాక్పై ఔదార్యం.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో ఉండగానే ఈ ప్రకటన రావడం గమనార్హం. ఆయన చేసిన విజ్ఞప్తితోపాటు బలమైన కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. జూన్లో అమెరికా అధ్యక్షుడితో ము నీర్ ఒక ప్రైవేట్ విందుకు హాజరైనప్పటి నుంచి పాకిస్తాన్ పట్ల అమెరికా అమితమైన ఔదా ర్యం చూపుతోంది. బీఎల్ఏని విదేశీ ఉగ్రవాద సంస్థగా ముద్ర వేయడం అందులో భాగం. మునీర్ అమెరికా పర్యటన సందర్భంగానే ఈ ప్రకటన రావడం అతనికి దౌత్యపరమైన విజయాన్ని అందించింది. అయితే.. తమ దేశంలో విధ్వంసక కార్యకలాపాలను నిర్వహించడానికి బీఎల్ఏను భారత్ రెచ్చగొడుతోందని పాకిస్తాన్ ఆరోపిస్తున్న నేపథ్యంలో అమెరికా ఈ ప్రకటన చేయడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. 1970 నుంచి.. బీఎల్ఏ ఖనిజ సంపన్న ప్రావిన్స్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా తిరుగుబాటు చేస్తోంది. 1970వ దశకంలో బీఎల్ఏ ప్రారంభమైంది. పాక్ మాజీ ప్రధాని జులి్ఫకర్ అలీ భుట్టో మొదట అధికారంలోకి వచి్చనపుడు బలూచిస్తాన్లో సాయుధ తిరుగుబాటు మొదలైంది. సైనిక నియంత జియావుల్ హక్ అధికారం చేజిక్కించుకోవడంతో చర్చల తరువాత సాయుధ తిరుగుబాటు ముగిసింది. బీఎల్ఏ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. మళ్లీ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పాలనలో 2000 సంవత్సరంలో బలూచిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ సంస్థలు, భద్రతాదళాలపై వరుస దాడులు చేసింది. 2006లో పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. ఈ సంస్థ చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ ట్రాన్సిట్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో చైనా కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం బీఎల్ఏ బషీర్ జేబ్ నాయకత్వంలో కొనసాగుతోంది. మజీద్ బలూచ్ అనే మిలిటెంట్ పేరుతో మజీద్ బ్రిగేడ్ ఏర్పడింది.హింసాత్మక దాడులు.. అమెరికా నిఘా నేత్ర బీఎల్ఏను చాలా ఏళ్లుగా వెంటాడుతూనే ఉంది. అయితే బీఎల్ఏ 2019 తర్వాత అనేక హింసాత్మక దాడులకు పాల్పడింది. మజీద్ బ్రిగేడ్ పేరుతో అనేక దాడులను నిర్వహించింది. 2024లో కరాచీ విమానాశ్రయం సమీపంలో, అలాగే గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడులకు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీయే బాధ్యత వహించింది. 2025 మార్చిలో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేసింది. ఈ దాడిలో 31 మంది పౌరులు, భద్రతా సిబ్బంది చనిపోగా>.. 300 మందికి పైగా రైలు ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు.
బాలీవుడ్లో నన్ను గ్లామర్ డాల్గానే చూస్తున్నారు: పూజా హెగ్డే
ఆర్మీ దుస్తుల్లో రియాలిటీ షోకి.. ప్రొటోకాల్ ఉల్లంఘనేనా?
ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
న్యూజిలాండ్ను కాదని స్కాట్లాండ్కు వలస వెళ్లిన టీ20 క్రికెటర్
ఎంతమంది హీరోయిన్లు వచ్చినా ఆ రికార్డ్ శ్రీదేవిదే
ధనం వద్దు.. ఆహారం ఇద్దాం!
డీఆర్టీలో వేలానికి వచ్చిన ఇల్లు కొనచ్చా?
తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర!
సస్పెండ్ అయినా.. సగం జీతం వస్తుందిలే!
రూ.5.82 లక్షల కోట్ల రుణాల మాఫీ
'ప్రతి నిమిషం నా తోడుగా ఉంది మీరే'.. తల్లిదండ్రులతో సింగర్ మధుప్రియ (ఫొటోలు)
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సంఘంలో గౌరవం
మనదే బాగుంది.. ఒక్క హామీ అమలు చేయకున్నా నిత్యం కనిపిస్తున్నాం..!!
ఎట్టకేలకు వీడిన సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ.. అసలు కథ ఇదే..
మహేశ్ బాబు నిర్మాతగా కొత్త సినిమా.. ఈ హీరోని గుర్తుపట్టారా?
మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్
మందుబాబులకు ఇక ఇంటి వద్దకే మద్యం: స్విగ్గీ రెడీ
నకిలీ నోట్ల ముఠానట! ఇక్కడికొచ్చి లొంగిపోతున్నాడు!
ఇంకొన్ని ఫిర్యాదులొచ్చే వరకూ ఆగుదాం సార్!!
మరోసారి చెలరేగిపోయిన టీమిండియా యువ సంచలనం.. 119 పరుగులు, 10 వికెట్లు
కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
నన్నెవ్వరూ ఆపలేరు.. ఎన్టీఆర్ కౌంటర్ లోకేష్కేనా?
ఈ రాశి వారు వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు
ఎన్నికల కమిషన్ విఫలం: హైకోర్టు
పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురు
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు
పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్
క్రికెట్లో పెను సంచలనం.. 5 బంతుల్లో మ్యాచ్ ఫినిష్
ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50వేలు: స్పందించిన ఆర్బీఐ గవర్నర్
సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా.. చరిత్రలో తొలిసారి ఇలా..!
బాలీవుడ్లో నన్ను గ్లామర్ డాల్గానే చూస్తున్నారు: పూజా హెగ్డే
ఆర్మీ దుస్తుల్లో రియాలిటీ షోకి.. ప్రొటోకాల్ ఉల్లంఘనేనా?
ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
న్యూజిలాండ్ను కాదని స్కాట్లాండ్కు వలస వెళ్లిన టీ20 క్రికెటర్
ఎంతమంది హీరోయిన్లు వచ్చినా ఆ రికార్డ్ శ్రీదేవిదే
ధనం వద్దు.. ఆహారం ఇద్దాం!
డీఆర్టీలో వేలానికి వచ్చిన ఇల్లు కొనచ్చా?
తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర!
సస్పెండ్ అయినా.. సగం జీతం వస్తుందిలే!
రూ.5.82 లక్షల కోట్ల రుణాల మాఫీ
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సంఘంలో గౌరవం
మనదే బాగుంది.. ఒక్క హామీ అమలు చేయకున్నా నిత్యం కనిపిస్తున్నాం..!!
ఎట్టకేలకు వీడిన సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ.. అసలు కథ ఇదే..
మహేశ్ బాబు నిర్మాతగా కొత్త సినిమా.. ఈ హీరోని గుర్తుపట్టారా?
మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్
మందుబాబులకు ఇక ఇంటి వద్దకే మద్యం: స్విగ్గీ రెడీ
నకిలీ నోట్ల ముఠానట! ఇక్కడికొచ్చి లొంగిపోతున్నాడు!
ఇంకొన్ని ఫిర్యాదులొచ్చే వరకూ ఆగుదాం సార్!!
మరోసారి చెలరేగిపోయిన టీమిండియా యువ సంచలనం.. 119 పరుగులు, 10 వికెట్లు
కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
నన్నెవ్వరూ ఆపలేరు.. ఎన్టీఆర్ కౌంటర్ లోకేష్కేనా?
ఎన్నికల కమిషన్ విఫలం: హైకోర్టు
ఈ రాశి వారు వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు
పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురు
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు
పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్
క్రికెట్లో పెను సంచలనం.. 5 బంతుల్లో మ్యాచ్ ఫినిష్
ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50వేలు: స్పందించిన ఆర్బీఐ గవర్నర్
సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా.. చరిత్రలో తొలిసారి ఇలా..!
ఈ రాశి వారికి ఆశయాలు నెరవేరతాయి.. భూములు కొంటారు
సినిమా

మహేశ్ బాబు నిర్మాతగా కొత్త సినిమా.. ఈ హీరోని గుర్తుపట్టారా?
ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న మహేశ్ బాబు.. ఆ బిజీలో ఉన్నాడు. మరోవైపు నిర్మాతగా కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మేరకు డీటైల్స్ బయటపెట్టారు. 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేశ్ మహా చాన్నాళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వం చేస్తున్నాడు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? హీరో ఎవరు?(ఇదీ చదవండి: మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్ శ్రీదేవి.. ఏంటి విషయం?)టాలీవుడ్లో హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్.. ఇటీవలే 'కింగ్డమ్'లోనూ హీరోకి సరిసమానంగా ఉండే నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు వెంకటేశ్ మహా దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నాడు. దీనికి 'రావు బహదూర్' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా వదిలారు.సత్యదేవ్.. 'రావు బహదూర్' ఫస్ట్ లుక్ పోస్టర్లో డిఫరెంట్గా కనిపించాడు. చెప్పాలంటే గుర్తుపట్టడం చాలా కష్టం. ముసలి రాజు గెటప్లో అస్సలు గుర్తుపట్టలేనట్లు ఉన్నాడు. 'అనుమానం పెనుభూతం' అనే ట్యాగ్ లైన్తో ఈ మూవీ తీస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించేశారు. గతంలో సత్యదేవ్-వెంకటేశ్ మహా 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య' అనే మూవీ చేశారు. కాకపోతే అది రీమేక్. ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్తో వస్తున్నారు. ఈసారి ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఆ సినిమా చేస్తున్నప్పుడు కంఫర్ట్గా అనిపించలేదు: అనుపమ)

ఓటీటీకి వచ్చేస్తోన్న రూ.500 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఇటీవలే విడుదలై లవ్ బర్డ్స్ను తెగ ఏడిపించేసిన సినిమా సయారా. జూలై 18న థియేటర్లలోకి వచ్చిన ఈ బాలీవుడ్ రొమాంటిక్ ఫీల్ గుడ్ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రేమకథ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పటివరకు సయారా చిత్రానికి దాదాపు రూ.500 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఓవర్సీస్లో అయితే ఏకంగా విక్కీ కౌశల్ ఛావా వసూళ్లు దాటేసింది. అంతలా సూపర్ హిట్గా ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ రివీల్ చేశారు. అహాన్ పాండే, అనీత్ పద్దా నటించిన ఈ రొమాంటిక్ చిత్రం వచ్చేనెల 12 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. సయారా మూవీ కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. అయితే ఈ చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే మేకర్స్ సైతం అఫీషియల్గా ప్రకటించే అవకాశముంది.కాగా.. ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో సయారాను తెరకెక్కించారు. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన రొమాంటిక్ చిత్రంగా సయారా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. భారతదేశంలో రూ. 320 కోట్లు వసూలు చేసింది.

మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్
ఈ ఏడాది వచ్చిన హిట్ సినిమాల్లో 'కోర్ట్' ఒకటి. తక్కువ బడ్జెట్తో తీసిన ఈ చిత్రం శ్రీదేవి అనే అమ్మాయి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇప్పుడు అదే ఊపులో తమిళంలో ఒకటి, తెలుగులో ఒకటి రెండు చిత్రాలు చేస్తోంది. కొన్నిరోజుల క్రితమే సొంతంగా కారు కూడా కొనుక్కుంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఈమెకు పెళ్లయిపోయిందనే టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: రిలీజ్కి ముందే 'కూలీ' వసూళ్ల రికార్డ్)శ్రీదేవి.. రీసెంట్గానే రాఖీ పండగని సెలబ్రేట్ చేసుకుంది. తన సోదరుడి చేతికి రాఖీ కట్టింది. ఆ వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అయితే నెటిజన్లు ఈ వీడియో చూసి ఊరుకోకుండా.. ఈమె మెడలో పసుపు తాడు ఉందేంటి అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఏంటి ఈమెకు పెళ్లయిపోయిందా? ఇదెప్పుడు జరిగిందా? అని చాలా డిస్కషన్ నడుస్తోంది. అయితే అసలు సంగతి ఇది కాదు.రాఖీ పండగ శనివారం కాగా.. అంతకు ముందు రోజు తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శుక్రవారం సందడి కనిపించింది. అలా శ్రీదేవి ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. ఈ పూజ తర్వాత పసుపు తాడుకి కట్టిన కాసు(కాయిన్) మెడలో వేసుకుంది. అయితే దీన్ని తాళిబొట్టుగా పొరబడిన నెటిజన్లు.. పెళ్లయిపోయిందా అని కామెంట్స్ పెడుతున్నారు. ఇది అసలు సంగతి!(ఇదీ చదవండి: ఆ సినిమా చేస్తున్నప్పుడు కంఫర్ట్గా అనిపించలేదు: అనుపమ) View this post on Instagram A post shared by Jabili❤️🩹 (@actorsridevi_)

'అలా అడిగితే యాటిట్యూడ్ ఎక్కువంటారు': అనుపమ పరమేశ్వరన్
అనుపమ పరమేశ్వరన్ చాలా రోజుల తర్వాత తెలుగులో చేసిన తాజా చిత్రం 'పరదా'. ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే పరదా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచేసింది. డైరెక్టర్ ప్రవీణ్ సైతం రివ్యూలు బాగుంటేనే పరదా చూడాలని ఆడియన్స్కు సవాల్ విసిరారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న అనుపమ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా మూవీ సెట్లో షాట్ ఆలస్యం కావడంపై స్పందించింది.అనుమప మాట్లాడుతూ..' ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలు నోరు విప్పడానికి భయపడతారు. ఏదైనా అడిగితే ఈమెకు ఆటిట్యూడ్ ఎక్కువ అంటారు. ఉదయం 7 గంటలకు షూట్కు వెళ్తే.. 9:30 వరకు వెయిట్ చేయాలి. ఎందుకు ఆలస్యమైందని అడిగితే మీకు యాటిట్యూడ్ ఎక్కువ అని ముద్ర వేస్తారు. కో యాక్టర్ ఆలస్యంగా వచ్చినప్పుడు మమ్మల్ని ముందు ఎందుకు పిలవాలి. ముందుగానే సెట్కు పిలిచి రెండున్నర గంటల పాటు ఎందుకు వెయిట్ చేయించాలి. ఈ గ్యాప్లో చాలా షాట్స్ తీయొచ్చు కదా అని అడిగితే.. నా డబ్బులు కదా మీకేంటి ఇబ్బంది అని అంటారు. అమ్మాయిలు ఏదైనా డైెరెక్ట్గా అడిగేస్తారు. అబ్బాయిలను మరో విధంగా ట్రీట్ చేస్తారు. అందరూ ఇలానే చేస్తారని నేను చెప్పట్లేదు' అని అన్నారు.కాగా.. అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా ఆగస్టు 22న థియేటర్లలోకి మూవీ రానుంది. ఇందులో అనుపమతో పాటు మలయాళ నటి దర్శన్, సంగీత కూడా కీలక పాత్రల్లో నటించారు.
క్రీడలు

విండీస్ క్రికెట్కు 'వంద' సలహాలు
సెయింట్ జోన్స్: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన వెస్టిండీస్... ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేక విమర్శల పాలవుతోంది. జాతీయ జట్టు తరఫున కరీబియన్లు కలిసికట్టుగా కదంతొక్కగా చాన్నాళ్లయింది. ఫ్రాంచైజీ క్రికెట్లో మెరుపులు మెరిపిస్తున్న విండీస్ ప్లేయర్లు జాతీయ జట్టు తరఫున మాత్రం కనీస ప్రభావం చూపలేకపోతున్నారు. జట్టులో సమష్టితత్వం లోపించిన నేపథ్యంలో... తిరిగి విండీస్ జట్టులో జవసత్వాలు నింపేందుకు క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) చర్యలకు పూనుకుంది. ఇటీవల ఆ్రస్టేలియాతో టెస్టుల్లో 27 పరుగులకే వెస్టిండీస్ జట్టు ఆలౌట్ కావడంతో ఆ దేశ బోర్డు... మాజీ ఆటగాళ్లతో అత్యవసర సమావేశం నిర్వహించింది. ఇందులో సుమారు వంద విషయాలను గుర్తించింది. అందులో దేశవాళీ క్రికెట్ ప్రమాణాలు పెంపొందించడం నుంచి మొదలుకొని... యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేసేంత వరకు పలు అంశాలు ఉన్నాయని బోర్డు వెల్లడించింది. ట్రినిడాడ్ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో దిగ్గజ ఆటగాళ్లు వివ్ రిచర్డ్స్, బ్రియాన్ లారా, క్లయివ్ లాయిడ్, డెస్మండ్ హేన్స్, శివనారాయణ్ చందర్పాల్తో పాటు ప్రస్తుత విండీస్ జట్టు హెడ్ కోచ్ డారెన్ స్యామీ పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం సీనియర్ ఆటగాళ్లు కీలక సూచనలు చేశారు. వాటిలో ప్రధానమైనవి... » మెరుగయ్యేందుకు గుర్తించిన వంద విషయాల్లో ప్రధానమైన ఐదు అంశాలపై మొదట దృష్టిపెట్టాలి. ఆటగాళ్లకు కనీస సౌకర్యాలు, అన్నీ ప్రాంతాల్లో ప్రాక్టీస్ పిచ్లు, దేశవాళీ టోర్నమెంట్ల బలోపేతం అందులో ప్రధానమైనవి. » ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఇతర జట్లతో పోల్చుకుంటే వెస్టిండీస్ జట్టు బలహీనంగా ఉండటంతో దాన్ని పటిష్ట పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తొలుత దృష్టి పెట్టాలి. » వివిధ స్థాయిల్లో నైపుణ్యాల లోపం ఉంది. దేశవాళీల్లో ఇది పెద్దగా ఇబ్బంది పెట్టదు. కానీ అంతర్జాతీయ జట్లతో పోటీపడుతున్న సమయంలో బయటపడుతుంది. అందుకే ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. » దేశవాళీ క్రికెట్ను బలోపేతం చేసేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలి. ఒక్క రోజులో మెరుగైన ఫలితాలు సాధ్యం కావు. నిరంతర కృషి అవసరం. ఎప్పటికప్పుడు టోర్నీలు నిర్వహించాలి. స్థానిక టోర్నీల్లో మెరిపిస్తున్న వారిని గుర్తించి వారికి మరింత తోడ్పాటు అందించడంతో పాటు దిశానిర్దేశం చేయాలి. ఆటగాళ్ల ఆలోచనా సరళిలో మా ర్పు రావాల్సిన అవసరముంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంతో కూడుకున్న విషయమనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. » రీజియన్కు ఒకటి చొప్పున హై పెర్ఫార్మెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయడం. దీంతో ప్రతిభావంతులను గుర్తించడం సులువవుతుంది. మార్గాలు వెతకాలిచాన్నాళ్లుగా వెస్టిండీస్ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. రోజు రోజుకూ ప్రమాణాలు పడిపోతున్నాయి. ప్రస్తుతం ఇతర జట్లతో పోల్చుకుంటే మా జట్టు ఎంతో వెనుకబడి ఉంది. గతంలో నైపుణ్యమే ప్రధాన అంశంగా ఉన్న సమయంలో ప్రపంచంలో మేటి జట్టు విండీసే. కానీ కాలం మారింది. సమయంతో పాటు ఆటలోనూ చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు సాంకేతికత పెరిగింది, విశ్లేషణలు ఎక్కువయ్యాయి. వాటిని అందిపుచ్చుకోవాల్సిన అవసరముంది. క్రికెట్లోకి కొత్తగా వచ్చిన దేశాలు సైతం ఈ రంగాల్లో ముందంజలో ఉన్నాయి. తిరిగి సత్తాచాటేందుకు మార్గాలు వెతకాల్సిన అవసరముంది. – లారా, వెస్టిండీస్ మాజీ కెప్టెన్

రోహిత్ శర్మ సన్నద్ధత
ముంబై: భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కొంత విరామం తర్వాత మళ్లీ క్రికెట్ మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఫిట్నెస్కు పదును పెడుతున్నాడు. తన మిత్రుడు, వ్యక్తిగత కోచ్ అయిన అభిషేక్ నాయర్తో కలిసి అతను మంగళవారం జిమ్ ట్రైనింగ్లో పాల్గొన్నాడు. రోహిత్ ఇప్పటికే టెస్టులు, టి20లనుంచి రిటైర్ కావడం, అన్ని ఫార్మాట్లలో కొత్త ఆటగాళ్లు సత్తా చాటుతుండటంతో వన్డేల్లో కూడా అతను కొనసాగే అంశంపై ఇటీవల చర్చ మొదలైంది. 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడాలనే లక్ష్యంతో రోహిత్ ఉన్నా... ఇప్పటికిప్పుడు దీనిపై ఇంకా స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో నాయర్ పర్యవేక్షణలోనే రోహిత్ త్వరలోనే నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్కు దిగే అవకాశం ఉంది. అతను చివరిసారిగా జూన్ 1న ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత భారత టెస్టు జట్టు ఇంగ్లండ్లో పర్యటించగా... రోహిత్ కూడా అదే సమయంలో ఇంగ్లండ్లోనే సరదాగా సెలవులు గడిపాడు. ఇప్పుడు విరామం తర్వాత మళ్లీ క్రికెట్పై దృష్టి పెట్టాడు. భారత్ తమ తర్వాతి వన్డేలో అక్టోబర్ 19న ఆ్రస్టేలియాలో బరిలోకి దిగుతుంది. 2025–26 సీజన్లో టీమిండియా మరో 9 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడనుంది. ఆసీస్ టూర్తో పాటు స్వదేశంలోనే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లతో భారత్ తలపడుతుంది. భవిష్యత్తు సంగతి ఎలా ఉన్నా... ప్రస్తుతానికి రోహిత్ వన్డేల్లో టాప్ బ్యాటర్గానే కొనసాగుతున్నాడు. 11,168 పరుగులు మాత్రమే కాదు, 32 సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలతో అతనికి ఘనమైన రికార్డు ఉంది. భారత్ ఆడిన తమ చివరి టోర్నీ చాంపియన్స్ ట్రోఫీలో కెపె్టన్గా జట్టును విజేతగా నిలపడంతో పాటు ఫైనల్లో రోహిత్ స్వయంగా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన విషయం గమనార్హం.

అర్జున్–కీమెర్ ఆరో రౌండ్ గేమ్ ‘డ్రా’
చెన్నై: చెన్నై గ్రాండ్మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీ మాస్టర్స్ కేటగిరీలో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఖాతాలో మూడో ‘డ్రా’ చేరింది. విన్సెంట్ కీమెర్ (జర్మనీ)తో మంగళవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్ను అర్జున్ 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఇతర గేముల్లో జోర్డెన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లాండ్స్) 51 ఎత్తుల్లో నిహాల్ సరీన్ (భారత్)పై, అవండర్ లియాంగ్ (అమెరికా) 61 ఎత్తుల్లో ప్రణవ్ (భారత్)పై గెలిచారు. రే రాబ్సన్ (అమెరికా)–కార్తికేయన్ మురళీ (భారత్) గేమ్ 123 ఎత్తుల్లో... విదిత్ గుజరాతి (భారత్)–అనీశ్ గిరి (నెదర్లాండ్స్) గేమ్ 109 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. ఆరో రౌండ్ తర్వాత కీమెర్ 4.5 అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 3.5 పాయింట్లతో అర్జున్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇదే టోర్నమెంట్ చాలెంజర్స్ కేటగిరీలో భారత గ్రాండ్మాస్టర్,హైదరాబాద్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక తొలి విజయం అందుకుంది. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ వైశాలితో జరిగిన ఆరో రౌండ్ గేమ్లో నల్ల పావులతో ఆడిన హారిక 80 ఎత్తుల్లో గెలిచింది.

పార్లమెంట్లో క్రీడా బిల్లు పాస్
న్యూఢిల్లీ: పార్లమెంట్లో జాతీయ క్రీడా బిల్లు పాసయ్యింది. సోమవారం లోక్సభ ఆమోదించిన బిల్లును 24 గంటల్లోనే మోదీ సర్కారు మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లును ఎగువ సభ ఆమోదించింది. అలాగే సవరించిన జాతీయ డోపింగ్ నిరోధక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ రెండు బిల్లులను రాష్ట్రపతి నోటిఫై చేయగానే చట్టంగా మారతాయి. రాజ్యసభలో బిహార్ ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టింది. క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సభలో మాట్లాడుతూ ‘20 దేశాల్లో క్రీడా చట్టం అమలవుతోంది. ఈ 21వ శతాబ్దిలో మన దేశంలో క్రీడా చట్టం ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాం’ అని అన్నారు. అనంతరం బిల్లుపై దాదాపు 2 గంటలకు పైగానే చర్చ జరిగింది. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, ఎంపీ పీటీ ఉష తదితరులు చర్చలో పాల్గొన్నారు. అనంతరం క్రీడారంగంలో పారదర్శకత పెంచేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందడం పట్ల కేంద్ర క్రీడాశాఖ మంత్రి మాండవీయ హర్షం వ్యక్తం చేశారు. చట్టరూపం దాల్చనున్న బిల్లు స్వరూపమిది... » ఈ బిల్లులో అత్యంత కీలకమైంది జాతీయ క్రీడల బోర్డు (ఎన్ఎస్బీ) ఏర్పాటు. జాతీయ సమాఖ్యలకు గుర్తింపు, లేదంటే రద్దులాంటి విశేషాధికారాలు బోర్డుకు ఉంటాయి. సకాలంలో ఎన్నికలు, సక్రమంగా జట్ల ఎంపికలు చేసేలా చూస్తుంది. బోర్డు గుర్తించిన సమాఖ్యలకే కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. » కొత్త బిల్లు ప్రకారం జాతీయ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ కూడా ఏర్పాటు అవుతుంది. సమాఖ్యలో కుమ్ములాటలు, జట్ల ఎంపికల్లో వివాదాలను పరిష్కరించే అధికారం ఈ ట్రైబ్యునల్కే కల్పించారు. ఈ ట్రైబ్యునల్ తీర్పులపై కేవలం సుప్రీం కోర్టులోనే సవాలు చేసే అవకాశముంటుంది. దిగువ కోర్టుల్లో ఇకమీదట కేసుల విచారణ ఉండదు. » క్రీడా పాలకులు ఏళ్లతరబడి తిష్టవేసేందుకు వీలుండదు. అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు గరిష్టంగా 12 ఏళ్ల పాటు పదవుల్లో కొన సాగవచ్చు. కాగా గరిష్ట వయసును 70 నుంచి 75కు పెంచారు. అయితే సదరు సమాఖ్యకు సంబంధించిన అంతర్జాతీయ సమాఖ్య నియమావళికి లోబడే ఈ పరిమితి ఉంటుంది.
బిజినెస్

హిందాల్కో లాభం రూ. 4,004 కోట్లు
న్యూఢిల్లీ: మెటల్ రంగ ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 30 శాతం జంప్చేసి రూ. 4,004 కోట్లకు చేరింది. అత్యుత్తమ ప్రొడక్ట్ మిక్స్, వ్యయ నియంత్రణ ఇందుకు సహకరించాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 3,074 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం 13 శాతం ఎగసి రూ. 64,232 కోట్లను తాకింది. అల్యూమినియంకు అధిక ధరలు లభించడం ఇందుకు దోహదపడింది. గత క్యూ1లో రూ. 57,013 కోట్ల టర్నోవర్ అందుకుంది. యూఎస్ అనుబంధ సంస్థ నోవెలిస్ 1 శాతం అధికంగా 963 కేటీ షిప్మెంట్స్ను సాధించినట్లు కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో హిందాల్కో షేరు 0.7% నీరసించి రూ. 667 వద్ద ముగిసింది.

మరింత దిగొచ్చిన ధరలు
న్యూఢిల్లీ: కూరగాయలు, ఆహారోత్పత్తులు, ధాన్యాల ధరలు మరింత కిందకు దిగొచ్చాయి. ఫలితంగా జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి అయిన 1.55 శాతానికి పడిపోయింది. 2017 జూన్ నెలలో నమోదైన 1.46 శాతం తర్వాత ఇదే అత్యంత కనిష్ట రిటైల్ ద్రవ్యోల్బణం. ఈ ఏడాది జూన్ నెలలో ద్రవ్యోల్బణం 2.1 శాతంతో పోల్చి చూసినా 0.55 శాతం తక్కువగా నమోదైంది.2024 జూన్ నెలలో ఇది 3.6%గా ఉంది. ఈ వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు పెరిగిపోయిన తరుణంలో రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అన్నది వినియోగదారులతో పాటు విధాన నిర్ణేతలకూ ఉపశనమం కలిగిస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ⇒ ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం (కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్/సీఎఫ్పీఐ) మైనస్ 1.76 శాతానికి క్షీణించింది. జూన్లో ఇది మైనస్ 1.01గా ఉంది. 2019 జనవరి తర్వాత ఆహార విభాగంలో అతి తక్కువ ద్రవ్యోల్బణం ఇది. వరి, గోధుమ, చక్కెర, పప్పులు, ధాన్యాలు, కూరగాయలు, గుడ్లు తదితర ఉత్పత్తులు ఈ విభాగం కిందకు వస్తాయి. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం జూలై నెలకు 1.18 శాతంగా నమోదైంది. జూన్లో ఇది 1.72 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంత ఆహార ద్రవ్యోల్బణం మైనస్ 1.74 శాతానికి పతనమైంది. ⇒ పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.05 శాతానికి తగ్గింది.

అధిక వెయిటేజీ షేర్లలో అమ్మకాలు
ముంబై: అధిక వెయిటేజీ షేర్లలో అమ్మకాలతో దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం అరశాతం మేర నష్టపోయాయి. భారత్, అమెరికాల జూలై రిటైల్ ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు అప్రమత్తత చోటు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 368 పాయింట్లు నష్టపోయి 80,235 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు పతనమై 24,487 వద్ద నిలిచింది. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి.ఇంట్రాడేలో సెన్సెక్స్ 833 పాయింట్ల పరిధిలో 80,164 వద్ద కనిష్టాన్ని, 80,998 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 24,465 – 24,702 శ్రేణిలో ట్రేడైంది. చైనాతో వాణిజ్య ఒప్పందానికి అమెరికా మరో 90 రోజుల విరామం, యూఎస్ జూలై ద్రవ్యోల్బణ ప్రకటన నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ⇒ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరు లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్ తాకింది. ఇష్యూ ధర (రూ.70)తో పోలిస్తే బీఎస్ఈలో 67% ప్రీమియంతో రూ.117 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 75% ఎగసి రూ.123 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకి., అక్కడే ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.881 కోట్లుగా నమోదైంది.

50 సార్లు చేతితో రాయండి: ఉద్యోగులకు కంపెనీ పనిష్మెంట్
ఉదయం 9:30 గంటలకు ఆఫీసుకు రాకపోతే.. ఆ రోజు హాఫ్ డే సెలవుగా పరిగణిస్తామని చెప్పిన కంపెనీ ఉదంతం మరువకముందే.. మరో విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రెడ్డిట్ వినియోగదారుడు షేర్ చేసిన పోస్టులో.. నేను కంపెనీ నిర్వహించిన పరీక్షలో 27/33 స్కోర్ చేశాను. అంటే దాదాపు 82 శాతం స్కోర్ అన్నమాట. కానీ యాజమాన్యం మాత్రం 90 శాతం కంటే తక్కువ స్కోర్ వచ్చినవారు.. మొత్తం పరీక్ష పేపరును 50 సార్లు చేతితో రాయమని పనిష్మెంట్ ఇచ్చిందని చెప్పాడు. దీనికి సంబంధించి తన వచ్చిన మెయిల్ స్క్రీన్షాట్ షేర్ చేసాడు.ఫోటో షేర్ చేస్తూ.. ఇలాంటి కంపెనీని నా జీవితంలో చూడలేదని అన్నాడు. 50 సార్లు రాయడం కూడా ఆఫీస్ వర్క్ ముగించుకున్న తరువాత రాయాలని సూచించారని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు.ఇదీ చదవండి: జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామాఇది చాలా కామెడీగా ఉందని ఒకరు, మీ కంపెనీ సీఈఓ ఇంతకు ముందు ఉపాధ్యాయుడా? అని మరొకరు, ఇది చాలా అమానుషం అని ఇంకొకరు కామెంట్స్ చేశారు. భారతీయ కార్యాలయాల్లో ఏమి జరుగుతోంది? అని ఇంకొకరు అన్నారు.
ఫ్యామిలీ

లండన్నుంచి వచ్చి అవకాడో సాగు... కోటి రూపాయల టర్నోవర్
స్వంతంగా ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచన ఆచరణలో పెట్టి విజేతగా నిలిచాడు. కోటి రూపాయల సంపాదనతో నేటి యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. యువరైతుగా ఎదిగి ఎవరూ చేయని విధంగా వినూత్నంగా నిలిచాడు. లండన్లోని ఒక లేబుల్ ద్వారా ప్రేరణ పొంది, ఇజ్రాయెల్లో శిక్షణ పొందిన హర్షిత్ గోధా ఇప్పుడు భారతీయ రైతులకు స్వదేశంలో ప్రపంచ స్థాయి అవకాడోలను పెంచడంలో సహాయం చేస్తున్నాడు. 2023 నాటికి, అతని వెంచర్ ‘ఇండో ఇజ్రాయెల్ అవకాడో’ రూ. 1 కోటి ఆదాయాన్ని ఆర్జించింది.హర్షిత్ రైతు కుటుంబం నుండి రాలేదు. కానీ ఆ ఆలోచన అతన్ని వెంటాడుతూనే ఉంది - ఇజ్రాయెల్ దాని పొడి వాతావరణంతో అవకాడోలను విస్తృతంగా పండించగలిగినపుడు భారతదేశం ఎందుకు చేయలేకపోతుంది? అనే ప్రశ్నతో తన స్వస్థలమైన భోపాల్కు తిరిగి వచ్చాడు. వెంటనే, టూరిస్ట్ వీసాపై ఇజ్రాయెల్కు విమానం ఎక్కాడు. అన్ని విషయాలను ఆకళింపు చేసుకున్నాడు. భోపాల్ శివార్లలో కుటుంబానికి చెందిన ఐదు ఎకరాల బంజరు భూమిని తీసుకొని దానిని మార్చడం ప్రారంభించాడు. నేల అభివృద్ధి, నీటి-సమర్థవంతమైన బిందు వ్యవస్థలు, గ్రీన్హౌస్లు , నర్సరీ ఏర్పాటు కోసం అతను రూ. 50 లక్షలు ఖర్చు చేశాడు. తొలి ఏడాదిలో మంచి లాభాలను సాధించాడు. కానీ మద్య కోవిడ్ మహమ్మారి ఛాలెంజ్ విసిరింది. అయినా నిరాశ పడలేదు. హర్షిత్ ఈ సమయాన్ని విద్య కోసం ఉపయోగించుకున్నాడు. ఒక బ్లాగును ప్రారంభించి అవకాడో వ్యవసాయంపై ఉచిత ఇ-పుస్తకం రాశాడు YouTube, LinkedInలో తన జ్ఞానాన్ని పంచుకోవడం ప్రారంభించాడు. వందలాది మంది ఆశావహులైన రైతులు అతనికి లేఖలు రాయడం ప్రారంభించారు. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా నీటిపారుదలమీద ఆధారణపడకుండా మల్చింగ్పై ఎక్కువగా ఆధారపడుతాడు. రసాయన ఎరువులను వాడడు. అతను నేల ఆరోగ్యం, నీటి నిలుపుదలని పెంచడానికి కంపోస్ట్, సూక్ష్మ పోషకాలు ఉపయోగిస్తాడు.ప్రస్తుతం 20,000 కంటే ఎక్కువ అవకాడో మొక్కలను నిర్వహిస్తున్నాడు. రైతులకు శిక్షణ ఇస్తున్నాడు ,స్థానికంగా పండించిన, అధిక నాణ్యత గల పండ్ల కోసం వెతుకుతున్న లగ్జరీ హోటళ్ళు, బోటిక్ దుకాణాలు, చెఫ్లతో కలిసి పనిచేస్తున్నాడు. అంతేకాదు వర్క్షాప్లు, శిక్షణా సెషన్లు ,మెంటర్షిప్ ద్వారా, హర్షిత్ ఇతరులు కూడా తమ అవకాడో తోటలను ప్రారంభించడంలో సహాయం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫలితాలు కూడా మెరుగ్గా ఉన్నాయి.2023 నాటికి, ఇండో ఇజ్రాయెల్ అవకాడో రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించింది. కానీ హర్షిత్ కోసం, ఇది కేవలం సంపాదన ఆర్జన మాత్రమే కాదు. ,నా లక్ష్యం అవకాడోలను పండించడం మాత్రమే కాదు,” “ప్రతి లేబుల్పై ‘సోర్స్డ్ ఇన్ ఇండియా’ని అనే తన కలను నిజం చేయడమే.” అంటారు. యాంటీఆక్సిడెంట్లు మరియు మోనోశాచురేటెడ్ కొవ్వుల యొక్క గొప్ప మూలం అయిన అవకాడో గుజ్జులో ప్రోటీన్లు (4 శాతం వరకు) , కొవ్వు (30 శాతం వరకు) ఎక్కువగా ఉంటాయి కానీ కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. దీని వలన ఆరోగ్య స్పృహ ఉన్న వినియోగదారులు, హోటళ్ళు, రెస్టారెంట్లు , జిమ్ల నుండి అధిక డిమాండ్ ఉంటుందని గ్రహించాడు. పైగా కరోనా కారణంగా జనాల్లో ఆరోగ్యం, జీవనశైలిమీద అవగాహన పెరిగింది. ఇదీ చదవండి: భార్య గర్భవతి : రూ. కోటిన్నర జాబ్ వదిలేశాడుప్రపంచ బ్యాంకు వాణిజ్య డేటా ప్రకారం, భారతదేశం 2023లో 39 లక్షల కిలోల అవకాడోలను దిగుమతి చేసుకుంది, ఎక్కువగా టాంజానియా, న్యూజిలాండ్, పెరూ, చిలీ,ఆస్ట్రేలియా ఉన్నాయి. అవకాడోకు ఇండియాలో ఉన్న డిమాండ్ను దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.

చాట్జీపీటీ ఆధారిత డైట్తో..ఆస్పత్రి పాలైన వ్యక్తి..!
ఏఐ కారణంగా భవిష్యత్తులో చాలా ఉద్యోగాలు ఉండవు అంటూ సర్వత్రా ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ, ఎంతటి ఏఐ సాంకేతికత అయినా..మానవుని శక్తిమంతమైన పని ముందు అల్పమైనవిగానే మిగిలిపోతున్నాయి. ఏ సాంకేతికతైన కొంత వరకు మానవులు అవసరాన్ని తగ్గిస్తుందేమో గానీ పూర్తిస్థాయిలోమాత్రం కానే కాదు అని చెప్పొచ్చు. అందుకు ఉదాహరణే ఈ ఉదంతం. ఇక్కడొక వ్యక్తి చాట్జీపీటీని నమ్మి చేజేతులారా ఆరోగ్యాన్ని పాడుచేసుకుని ఆస్పత్రి పాలయ్యాడు.తన ఆహారాన్ని మరింత మెరుగుపరుచుకోవడం ఎలా అని చాట్జీపీటీ సలహా కోరాడు. అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని తూచాతప్పకుండా పాటించి ఆస్పత్రి పాలయ్యాడు. అమెరికాకు చెందిన వ్యక్తి ఎలాంటి మానసిక, అనారోగ్య చరిత్ర లేని వ్యక్తిగా గుర్తించారు వైద్యులు. అతడు కేవలం ఏఐ చాట్బాట్ కారణంగానే ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నట్లు నిర్థారించారు. ఆ చాట్జీపీటీలో టేబుల్ సాల్ట్ ప్రతికూలతలను, ఆరోగ్య ప్రభావాల గురించి కూలంకషంగా తెలుసుకుని దాన్ని పూర్తిగా తొలగించాడు. ఆ ఉప్పు స్థానంలో సోడియం బ్రోమైడ్తో భర్తి చేయొచ్చని చాట్జీపీటీ సూచించడంతో దాన్ని గుడ్డిగా ఫాలో అయ్యాడు. నిజానికి ఈ సోడియం బ్రోమైడ్ కూడా టేబుల్ సాల్ట్లాగానే ఉంటుంది. కానీ ఇది చాలా విభిన్నమైన సమ్మేళనం. దీన్ని మందుల్లో ఉపయోగిస్తారు. సాధారణంగా పారిశ్రామిక శుభ్రపరిచే ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. అలాంటి ఈ సమ్మేళనాన్ని అధికంగా తీసుకుంటే దుష్ప్రభావాలు ఎదుర్కొనక తప్పవని వెల్లడించారు వైద్యులు. ఇక ఆ వ్యక్తి ఆ కారణంగానే జస్ట్ 24 గంటల్లోనే ఆస్పత్రి పాలయ్యాడని చెప్పారు వైద్యులు. అంతేగాదు మానసికంగా శారీరకంగా అనారోగ్యం పాలయ్యాడు. ఆ వ్యక్తికి ఎలక్ట్రోలైట్లు, యాంటీసైకోటిక్స్తో చికిత్స అందిచడం, సైక్రియాట్రీక్ పర్యవేక్షణ తదితరాలతో మెరుగయ్యేలా చేశారు. దాదాపు మూడు వారాల పాటు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. అతను కాలేజ్లో న్యూట్రిషన్ ఫుడ్పై అధ్యయనం చేస్తున్నాడని అందులో భాగంగానే తనపై ఇలా ప్రయోగం చేసుకున్నట్లు సమాచారం. ఇక్కడ చాట్జీపీటీ వంటివి సమాచారం ఎల్లప్పుడూ కచ్చితమైనది కాదని కేవలం అవగాహన కల్పించగలదని చెబుతున్నారు నిపుణులు. అది ఇచ్చే సమాచారం నమ్మి స్వీయ చికిత్సలు తీసుకోరాదని, వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించి కికిత్స తీసుకోవడం మంచిదని పేర్కొన్నారు. ఇక ఔషధంగా ఉపయోగించే సోడియం బ్రోమైడ్ వల్ల కలిగే ప్రమాదాలు ఏంటంటే..అధిక మోతాదులో తీసుకుంటే నరాల వ్యవస్థపై ప్రభావం చూపి..తలనొప్పి, మానసిక ఆందోళన, మత్తు వంటి లక్షణాలు ఉత్పన్నమవుతాయిచర్మంపై అలెర్జీ, వాపు వంటి సమస్యలువాంతులు, మలబద్ధకం, ఆకలి లేకపోవడంమూర్ఛ, కోమా, శ్వాస సంబంధిత సమస్యలు, ప్రాణపాయం వంటివి సంభవిస్తాయి. అందువల్ల దీన్ని ఉప్పుగా వాడటం అనేది అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు. దీన్ని వైద్యుల పర్యవేక్షణలోనే ఔషధంగా ఉపయోగించాలని హెచ్చరిస్తున్నారు.(చదవండి: హార్ట్ అటాక్ ముప్పు మహిళల్లోనే ఎక్కువ..! ఎందుకంటే..)

మీరు నమ్మాలేగానీ...అవే నిజమైన ఆస్తి
ఒకప్పుడు పుస్తకం కొనుగోలు చేయడానికి డబ్బులు లేకపోతే లైబ్రరీల బాట పట్టేవారు. చదువుకోడానికి సరైన వసతి లేకపోయినా, పఠనాసక్తి కలిగిన వారు గ్రంథాలయాలనే ఆశ్రయించేవారు. ప్రస్తుతం సాంకేతిక విప్లవం విద్యార్థులను లైబ్రరీల నుంచి దూరం చేసింది. ఏ విషయం కావాలన్నా గూగుల్లో వెతకడం సులభమైపోయింది. కానీ గ్రంథాలయాలలోనే మనసుకు ప్రశాంతత, చదువుకు ఏకాగ్రత లభిస్తాయి. అందుకే నేటి తరాన్ని గ్రంథాలయానికి మళ్లించాల్సిన అవసరం ఉంది.చరిత్రలో మొదటి గ్రంథాలయంగా అసుర్బానిపాల్ లైబ్రరీ (క్రీ.పూ. 7వ శతాబ్దం, నినెవె, ఇరాక్) ప్రసిద్ధి చెందింది. ఇందులో మట్టి పలకలపై క్యూనీఫార్మ్ లిపిలో రాసిన సుమారు 30,000 హస్త ప్రతులు ఉన్నాయి. భారత దేశంలో అతిపెద్ద లైబ్రరీ కలకత్తా పబ్లిక్ లైబ్రరీ. 1836 మార్చి 21న ద్వారకానాథ్ టాగూర్ ప్రారంభించిన ఈ లైబ్రరీ, స్వాతంత్య్రం తర్వాత నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాగా మారి ఇప్పుడు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధీనంలో నడుస్తోంది. ఇక్కడ 25 లక్షల పుస్తకాలు ఉండగా, బెంగాల్ శాస్త్రవేత్త ఆశుతోష్ ముఖర్జీ ఒక్కడే 80,000 పుస్తకాలు దానం చేశారు. మరో విశిష్ట గ్రంథాలయం ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబయి. 1833లో జేమ్స్ మాకింతోష్ దీన్ని ప్రారంభించారు.ఇదీ చదవండి: బాల అమితాబ్ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతి 192 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లైబ్రరీలో లక్షకు పైగా పుస్తకాలు ఉండగా, 15,000 అరుదైన గ్రంథాలు మాణిక్యాల్లా మెరుస్తున్నాయి. ఆధునికతకు అనుగుణంగా, ఇక్కడి అన్ని పుస్తకాలు, లిఖిత ప్రతులు, పత్రికలను డిజిటల్ రూపంలోకి మార్చి ‘గ్రంథ్ సంజీవనీ వెబ్సైట్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంచారు.నేడు జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా ‘సోషల్ మీడియా కోసం కాదు, సొంత మెరుగుదలకు చదువుదాం!’ అనే ప్రతిజ్ఞ తీసుకుందాం.– అర్జునరావు రాజనాల, అరోరా పీజీ కళాశాల గ్రంథాలయ విభాగాధి పతి

ఫరెవర్ మిసెస్ ఇండియా హైదరాబాద్ విజేతగా బంగ్లా చంద్రలేఖ
ఫరెవర్ మిసెస్ ఇండియా 2025 హైదరాబాద్ విజేతగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన బంగ్లా చంద్రలేఖ నిలిచారు. జైపూర్ జీ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ టైటిల్ గెలుచుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెరల్ సిటీ హైదరాబాద్ నుంచి పోటీల్లో పాల్గొని విజేతగా నిలవడం చాలా ఆనందాన్నిచ్చిందని తెలిపారు. షారా ఫ్యాషన్ డిజైనింగ్ వ్యవస్థాపకురాలిగా వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటూ, కార్పొరేట్ కంపెనీలో టీమ్ లీడర్గా రాణిస్తూనే ఫరెవర్ మిసెస్ ఇండియా హైదరాబాద్ పోటీల్లో పాల్గొన్నానని చెప్పారు. నటన, మోడలింగ్ అంటే ఇష్టం. అందుకే ఫ్యాషన్ డిజైనింగ్లో అడుగు పెట్టాను. నా ఇష్టాలకు కుటుంబ సభ్యుల సహకారం తోడైందని ఆమె పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరనే గట్టి నమ్మకాన్ని కలిగిస్తోందన్నారు. అందం, ఆత్మస్థైర్యంహైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తూ ఎస్కే మిసెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్, మిసెస్ తెలంగాణ కిరీటాలను గెలుచుకున్న ప్రియాంక తారే తన వ్యక్తిత్వం, ప్రతిభ, పట్టుదలతో ఈ తరానికి స్ఫూర్తిగా నిలిచారు. నోయిడాలో జరిగిన ప్రతిష్టాత్మక ఎస్కే యూనివర్స్ ఇండియా ఇంటర్నేషనల్ 2025 సీజన్ 27లో ఆమె సౌందర్యం, సమతుల్యత, ఆత్మవిశ్వాసం జడ్జీలతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విజేతగా ఎంపిక చేశారు. ఛత్తీస్గఢ్ భిలాయ్కు చెందిన ప్రియాంక ఈ పోటీల్లో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించారు. కార్పొరేట్ లీడర్గా, ఈవెంట్స్, ఎచ్ఆర్, సీఎస్ఆర్ రంగాల్లో రాణించడమే కాకుండా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా, గాయనిగా, నృత్యకారిణిగా తన బహుముఖ ప్రజ్ఞ చాటుకుంది. టీఎస్ఈ8 ఉమెన్స్ అచీవ్మెంట్ అవార్డు 2025తో పాటు యూట్యూబ్, ఇన్స్టా్రగామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. (చదవండి: International Youth Day: విజయకేతనం ఎగరేసిన ధీర యువత..!)
ఫొటోలు
అంతర్జాతీయం

నోరు పారేసుకున్న మునీర్
న్యూయార్క్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోసారి రెచి్చపోయారు. ప్రస్తుతం అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్న ఆయన భారత్పై నోరుపారేసుకున్నారు. భారత సైన్యం గనుక పాకిస్తాన్పై దాడి చేస్తే తాము నష్టపోవడం కాకుండా సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని గుర్తుచేశారు. శనివారం ఫ్లోరిడాలోని టాంపా పట్టణంలో ప్రవాస పాకిస్తానీల సమావేశంలో మాట్లాడారు. కాశ్మీర్ అంశాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదన్నారు. కాశ్మీర్ అనేది పాకిస్తాన్కు ‘తల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే సిర’ లాంటిదని చెప్పారు. తమ దేశానికి రావాల్సిన నీటిపై హక్కులను వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జల హక్కులకు కాపాడుకుంటామన్నారు. ఇటీవల భారత్–పాక్ మధ్య ఘర్షణలో తాము పైచేయి సాధించమని వ్యాఖ్యానించారు. భారత్ మరోసారి దాడిచేస్తే తగిన సమాధానం చెప్తామన్న సందేశం ఇచ్చామని పేర్కొన్నారు. కాశ్మీర్ అనేది భారతదేశ అంతర్గత వ్యవహారం కాదని, అది పూర్తిగా అంతర్జాతీయ ఎజెండా అని తేల్చిచెప్పారు. పాకిస్తాన్కు కాశ్మీర్ అత్యంత కీలకమని మహ్మద్ అలీ జిన్నా చెప్పారని గుర్తుచేశారు. Pakistan Army Chief Asim Munir in Florida dinner:“We are a nuclear nation — if we go down, we’ll take half the world down with us.”On India’s Indus dam plan: “We’ll wait for them to build it, then destroy it with 10 missiles.”Loose threats, no shame. Remember Kargil — we…— Praffulgarg (@praffulgarg97) August 10, 2025సింధూ నది ఇండియా జాగీర్ కాదు తమ దేశానికి నీరు రాకుండా ఎగువన భారత్ గనుక డ్యామ్లు నిర్మిస్తే వాటిని కచ్చితంగా పేల్చేస్తామని అసిమ్ మునీర్ హెచ్చరించారు. డ్యామ్లు నిర్మించేదాకా వేచి చూస్తామని, వాటి నిర్మాణం పూర్తయ్యాక ధ్వంసం చేస్తామని అన్నారు. సింధూ నది ఇండియా జాగీర్ కాదని స్పష్టంచేశారు. అది సొంత ఆస్తిలాగా భావించొద్దని ఇండియాకు సూచించారు. నదులకు అడ్డుకట్ట వేయాలని చూస్తే అడ్డుకొని శక్తి తమకు ఉందన్నారు. పాకిస్తాన్–అమెరికా మధ్య సంబంధాలు నానాటికీ బలపడుతున్నాయని మునీర్ హర్షం వ్యక్తంచేశారు. నెలన్నర వ్యవధిలోనే తాను మరోసారి అమెరికాకు రావడమే అందుకు నిదర్శనమని తెలిపారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని అపేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మునీర్ మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ⚡️🤯 Asim Munir Threatens Nuclear Armageddon: "We'll Take Half the World Down with Us" - ReportThe Pakistani military chief was speaking at a black-tie event in the US, saying if his country faces an existential threat in a future war with India, “we are a nuclear nation, if we… pic.twitter.com/P8E3n0yUHJ— Tarique Hussain (@Tarique18386095) August 11, 2025

గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు జర్నలిస్టులు మృతి
డెయిర్ అల్–బలాహ్: గాజా నగరంలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో అల్జజీరా అరబిక్ ప్రతినిధి 28 ఏళ్ల అనాస్ అల్ షరీఫ్తోపాటు మరో నలుగురు జర్నలిస్టులు మరణించారు. ఈ దాడుల్లో కరస్పాండెంట్ మహ్మద్ క్రీకే, కెమెరా ఆపరేటర్లు ఇబ్రహీం జహెర్, మహమ్మద్ నౌఫల్, మోమెన్ అలీవా, వారి సహాయకుడు మహ్మద్ నౌఫల్ మరణించినట్లు అల్జజీరా ధ్రువీకరించింది. అల్–షిఫా ఆసుపత్రి ప్రధాన ద్వారం దగ్గర్లో ఉన్న టెంట్ లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. దాడిలో మొత్తం ఏడుగురు మరణించారని అల్–షిఫా ఆస్పత్రి అధికారి ఒకరు తెలిపారు. కాగా, అల్ షరీఫ్ రిపోర్ట్ చేస్తుండగానే బాంబు దాడి జరిగింది. ఈ ప్రాణాంతక దాడికి ముందు, అల్ షరీఫ్ గాజా నగరంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో పెరుగుతున్న దాడులను వివరిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘రెండు గంటలుగా గాజా నగరంపై ఇజ్రాయెల్ దురాక్రమణ తీవ్రమైంది’ అని పోస్ట్లో పేర్కొన్నాడు. అల్ షరీఫ్ ప్రాణాలు కోల్పోవడానికి ముందు రాసిన మెసేజ్ను అతని ఫ్రెండ్ ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఇది నా చివరి వీలునామా, నా చివరి సందేశం. నా ఈ మాటలు మీకు చేరితే, ఇజ్రాయెల్ నన్ను చంపడంలో, నా గొంతును నొక్కేయడంలో విజయం సాధించిందని అర్థం’ . అని ఆ సందేశంలో పేర్కొన్నారు. అల్ షరీఫ్ హమాస్ నాయకుడు: ఐడీఎఫ్అయితే.. వైమానిక దాడిలో మరణించిన అల్ షరీఫ్.. హమాస్ నాయకుడని ఇజ్రాయెల్ సైన్యం చాలా కాలంగా ఆరోపిస్తోంది. ‘అనాస్ అల్ షరీఫ్ హమాస్ ఉగ్రవాద సంస్థలోని ఒక ఉగ్రవాద విభాగానికి అధిపతిగా పనిచేశాడు. ఇజ్రాయెల్ పౌరులు, ఐడిఎఫ్ దళాలపై రాకెట్ దాడులకు ఆయన నాయకత్వం వహించాడు’ అని ఇజ్రాయెల్ సైన్యం అల్ షరీఫ్ మరణానంతరం ఒక ప్రకటనలో తెలిపింది. అల్ షరీఫ్పై ఇజ్రాయెల్ చేసిన వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక నివేదకురాలు ఐరీన్ ఖాన్ కొట్టిపారేశారు. అంతేకాదు.. ఫ్రంట్లైన్ రిపోర్టింగ్ చేస్తున్న ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె గతంలోనే హెచ్చరించారు. ఖండించిన జర్నలిస్టు సంఘాలు.. జర్నలిస్టుల హత్యను పాలస్తీనా జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. వారు ఉగ్రవాదులు కాదని, అలా నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జోడీ గిన్స్బర్గ్ తెలిపారు. ‘ప్రస్తుత యుద్ధంలోనే కాదు, గత దశాబ్దాల్లోనూ ఇజ్రాయెల్ నమూనా ఇది. జర్నలిస్టును చంపడం.. అతను ఉగ్రవాది అని ముద్ర వేయడం ఇజ్రాయెల్ దళాలు పనిగట్టుకొని చేస్తున్నాయి’ అని ఆమె ఆరోపించారు.

భారత విమానాలకు గగనతలం మూసేసి.. రూ.1,240 కోట్లు నష్టపోయిన పాక్
ఇస్లామాబాద్: భారత విమానాలకు గగనతలాన్ని మూసేసిన పాకిస్తాన్ భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ (పీఏఏ) కేవలం రెండు నెలల్లో రూ. 1,240 కోట్లు నష్టపోయింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తరువాత, భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో, భారత్ విమానాలకు పాక్ గగనతలాన్ని మూసేయడం తెలిసిందే. ఇది ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో దేశం ఆదాయంలో భారీ నష్టాన్ని ఎదుర్కొంటోందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ తెలిపారు. దీనివల్ల రోజుకు 100 నుంచి 150 భారతీయ విమానాలు ప్రభావితం అయ్యాయన్నారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 30 మధ్య ఓవర్ఫ్లైయింగ్ ఛార్జీల నుంచి పీఏఏ ఆదాయం పడిపోయిందని పేర్కొన్నారు. ఈ ఆంక్షల వల్ల పాకిస్తాన్ విమాన ట్రాఫిక్ దాదాపు 20 శాతం తగ్గిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. భారత విమానాలకు తన గగనతల మూసివేతను ఆగస్టు 24 వరకు పాక్ పొడిగించింది.

తుర్కియేలో శక్తివంతమైన భూకంపం
ఇస్లాంబుల్: తుర్కియే పశ్చిమప్రాంతాన్ని శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. ఇస్లాంబుల్కు 206 కిలోమీటర్ల దూరంలో భూమిలో సుమారు 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. ఇస్లాంబుల్, చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు ప్రముఖ పర్యాటక ప్రాంతం ఇజి్మర్లోనూ దీని ప్రభావంతో ప్రకంపనలు సంభవించాయి. షిండిర్గిలో ఒక భవనం కూలినట్లు సమాచారం. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. తుర్కియే తరచూ భూకంపాల ప్రభావానికి గురవుతోంది.
జాతీయం

సుప్రీంకోర్టులోనూ వీధికుక్కల సంచారం
న్యూఢిల్లీ: దేశరాజధానిలో వీధికుక్కల స్వైరవిహారంతో విసిగిపోయిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని షెల్టర్లకు తరలించాలని ఆదేశాలిచ్చిన మరుసటిరోజే మరోసారి వాటి ప్రస్తావన తెచ్చింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలోనూ వీధికుక్కల బెడద ఎక్కువగా ఉందని అసహనం వ్యక్తంచేసింది. మిగిలిపోయిన ఆహారాన్ని మూతలున్న చెత్తబుట్టలో పడేయకుండా కోర్టుకాంప్లెక్స్లో ఎక్కడపడితే అక్కడ పడేయడంతో ఈ సమస్య తీవ్రతరమైందని ఆగ్రహం వ్యక్తంచేసింది.ఢిల్లీ–జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్) పరిధిలోని వీధి శునకాలను కచ్చితంగా షెల్టర్లకు తరలించాలంటూ మంగళవారం జారీచేసిన ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు భవన పరిస్థితినీ ధర్మాసనం ప్రస్తావించింది.‘‘ సుప్రీంకోర్టుకు వచ్చి ప్రతి ఒక్కరూ తాము వెంట తీసుకొచ్చిన, కొనుగోలుచేసిన ఆహారం మిగిలిపోతే దానిని కచ్చితంగా మూసిఉన్న డస్ట్బిన్లోనే పడేయండి. ఇష్టమొచ్చిన చోట పడేస్తే దానిని తినేందుకు వీధికుక్కలు సుప్రీంకోర్టు ప్రాంగణమంతా సంచరిస్తున్నాయి. కారిడార్లు మొదలు లిఫ్ట్ల దాకా ప్రతిచోటా వీధి శునకాలు కనిపిస్తున్నాయి. కుక్క కాట్ల నుంచి తప్పించుకోవాలంటే వాటికి ఆహారం దొరక్కుండా మూతలున్న చెత్తబుట్టలో పడేయండి.బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పడేయకండి. ఆహారం లభించకపోవడంతో అవి ఇక సుప్రీంకోర్టు ప్రాంగణాలకు రావడం మానేస్తాయి. కుక్క కాటు ముప్పు తప్పుతుంది. కోర్టుకు వచ్చి ప్రతి ఒక్కరి సహకారంతో న్యాయస్థానం పరిసరాలు వీధికుక్కల కాట్ల నుంచి సురక్షితంగా ఉంటాయి’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఆధార్ ఓటర్ ఐడీ పౌరసత్వ రుజువులు కావు!
న్యూఢిల్లీ: పౌరసత్వ రుజువులకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా పదిహేనేళ్లకు పైగా అన్ని రకాల అవసరాలకూ ఏకైక గుర్తింపు కార్డుగా చెలామణిలో ఉన్న ఆధార్, ఓటు హక్కుకు గుర్తింపు అయిన ఓటర్ కార్డు రెండూ పౌరసత్వానికి రుజువులు కాబోవని కుండబద్దలు కొట్టింది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వైఖరి, వాదన సరైనవేనని స్పష్టం చేసింది. ‘‘పౌరసత్వానికి ఆధార్ పూర్తిస్థాయి రుజువు కాబోదు. దాన్ని ఇతరత్రా మార్గాల ద్వారా నిర్ధారణ చేసుకోవడం తప్పనిసరి’’ అని న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఐఆర్) పేరిట భారీగా ఓట్లను తొలగిస్తున్నారంటూ దాఖలైన కేసుల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. అదే సందర్భంలో బిహార్లో ఎన్నికల జాబితా ధ్రువీకరణకు ఈసీకి ఉన్న అధికారాలపై కీలక ప్రశ్నలు కూడా లేవనెత్తింది. దీన్ని ముందుగా తేల్చాల్సి ఉంటుందని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ‘‘ఈసీకి ఓటర్ల జాబితా ధ్రువీకరణ అధికారమే గనక లేనిపక్షంలో ఈ వ్యవహారం ఇక్కడితో ముగిసిపోయినట్టే అన్నారు.ఎస్ఐఆర్ ముసుగులో బిహార్లో ఈసీ తలపెట్టిన కసరత్తు కారణంగా భారీ సంఖ్యలో ఓటర్లు జాబితా నుంచి గల్లంతవుతున్నారని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ముఖ్యంగా ఈసీ తాజాగా కోరుతున్న డాక్యుమెంట్లు సమర్పించని వారంతా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘అప్పుడెప్పుడో 2003 నాటి ఓటర్ల జాబితాలో ఉన్నవారు కూడా తాజాగా ఈసీ కోరిన అన్ని పత్రాలూ సమర్పించడాన్ని తప్ప నిసరి చేశారు.అలా చేయ ని వాళ్ల పేర్లను నాటికీ, నేటికీ వారి చిరునామాలతో సహా ఎలాంటి మార్పు లూ లేకపోయినా సరే ఓటర్ల జాబితా నుంచి తీసేస్తున్నారు. బిహార్లో 7.24 కోట్ల మంది తాజాగా కోరిన పత్రాలు సమర్పించినట్టు ఈసీ జాబితా వెల్లడిస్తోంది. అయినా సరే, ఏకంగా 65 లక్షల మందిని సరైన విచారణ కూడా లేకుండానే మృతులు, వలసదారులుగా ముద్ర వేసి జాబితా నుంచి తొలగించేశారు!’’ అంటూ సిబల్ వాదించారు. పైగా ఈ విషయంలో శాస్త్రీయమైన సర్వే ఏదీ చేపట్టలేదని అఫిడవిట్ సాక్షిగా ఈసీయే అంగీకరించిందని ధర్మాసనానికి విన్నవించారు. వాస్తవాలా, ఊహలా: ధర్మాసనం బిహార్లో తాజాగా 65 లక్షల ఓట్లు తొలగించారనేందుకు ప్రాతిపదిక ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్ల సందేహాలు, ఆందోళనలు వాస్తవికమా, లేక కేవలం ఊహాజనితాలా అని తెలుసుకోగోరింది. బిహార్లో 2025 జాబితాలో 7.9 కోట్ల ఓటర్లున్నట్టు సిబల్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘వారిలో 4,9 కోట్ల మంది 2003 నాటి ఓటరు జాబితాలోనూ ఉన్నారు. అందులో 22 లక్షల మందిని మృతులుగా నమోదు చేశారు’’ అన్నారు. మృతి, చిరునామా మార్పు కారణంగా ఓటర్ల జాబితా నుంచి మినహాయించిన వారి పేర్లను కోర్టుకు గానీ, వెబ్సైట్లో గానీ ఈసీ అందుబాటులో ఉంచలేదని మరో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు.‘‘అడిగితే, దీనికి సంబంధించి బూత్ స్థాయి ఏజెంట్లకు ఏదో సమాచారం ఇచ్చామంటూ ఈసీ పొంతన లేని సమాధానం చెబుతోంది. అసలు ఇలాంటి సమాచారాన్ని ఎవరికైనా ఇవ్వాల్సిన అవసరమే తమకు లేదని బుకాయిస్తోంది’’ అంటూ ఆక్షేపించారు. ఆధార్, రేషన్ కార్డులను గుర్తింపు కార్డుగా జోడిస్తూ సమర్పించే పత్రాలను ఇతరత్రా మార్గాల ద్వారా ధ్రువీకరించుకోవడం ఈసీ బాధ్యత అని ధర్మాసనం పేర్కొంది. ఓటర్ల జాబితా నుంచి తొలగించడం వంటి కీలక నిర్ణయానికి వచ్చేముందు మిస్సింగ్ డాక్యుమెంట్లకు సంబంధించి బాధ్యులకు ముందుగా సమాచారమిచ్చారా లేదా అని ఈసీని ప్రశ్నించింది.

మళ్లీ డ్రాగన్తో విమాన బంధం!
న్యూఢిల్లీ: కోవిడ్ సంక్షోభం, గల్వాన్ ఉద్రిక్తతలతో బీటువారిన చైనా, భారత్ బంధానికి భారతీయ విమానాలు మళ్లీ ఆకాశ మార్గాన స్నేహవారధి నిర్మించను న్నాయి. నాలుగేళ్లుగా ఆగిపోయిన భారత్, చైనా నేరుగా విమానసర్వీసులను త్వరలో పునరు ద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. టియాజిన్ సిటీలో జరగబోయే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్న నేపథ్యంలో భారత్–చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరు ద్ధరణ బాటలో పయనిస్తుండటం విశేషం.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపె డా టారిఫ్ల మోత మోగించడంతో విసిగి పోయిన భారత్, చైనాలు మళ్లీ స్నేహగీతాన్ని ఆలపించనున్నాయని, అందులో భాగంగానే నేరుగా విమానసర్వీసుల పునర్ప్రారంభానికి శ్రీకారం చుడుతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నాలుగు సరిహద్దు రాకపోకల మార్గాల గుండా సరకు రవాణాకు ఇరుదేశాలూ మొగ్గు చూపుతు న్నవేళ నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు డైరెక్ట్ ఫ్లైట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.నూతన ఎయిర్సర్వీసుల ఒప్పందం త్వరలో ఖరారు కాబోతోందని ఆయా వర్గాలు తెలిపాయి. ఇది ఒకవేళ ఖరారుకాక పోయినాసరే పాత విధానంలో విమాన సర్వీసులను మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఎయిర్ఇండియా, ఇండిగో వంటి దేశీయ పౌర విమానయా సంస్థలు ఇకపై నేరుగా చైనాకు విమాన సర్వీసులను మొదలెట్టాలని మోదీ సర్కార్ సూచించినట్లు తెలుస్తోంది. గల్వాన్ నుంచి గట్టిబంధం దిశగా2020 మేలో తూర్పు లద్దాఖ్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతకు బీజం పడింది. జూన్లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ముష్టిఘాతం, పిడిగుద్దులు, ఘర్షణ కారణంగా ఇరువైపులా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సరిహద్దు వెంట గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉద్రిక్తతలను మరింత పెంచారు. దీంతో భారత్, చైనా సత్సంబంధాలు అడుగంటాయి. పాస్పోర్ట్లు, దిగుమతులు, అనుమతులు మొదలు మరెన్నో రంగాల్లో సత్సంబంధానికి బీటలు పడ్డాయి.అయితే ట్రంప్ ఇష్టారీతిన విధించిన దిగుమతి సుంకాల భారంతో ఇబ్బందులు పడుతున్న భారత్, చైనాలు ఉమ్మడిగా ఈ సమస్యను పరిష్కరించుకుందామని భావిస్తున్నాయి. ఇందుకోసం మళ్లీ స్నేహగీతం పాడక తప్పని నెలకొంది. గత కొద్దినెలలుగా ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనా జాతీయులకు పర్యాటక వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం గత నెలలో అంగీకారం తెలిపింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటనకు సిద్ధపడ్డారు.చైనాతో బంధం బలపడాలని తాము కోరుకుంటున్నామని ఆదేశ పర్యటనను ఖరారుచేసి మోదీ సూచనప్రాయంగా చెప్పారు. భారత్ వంటి దేశాలపై టారిఫ్ను అమెరికా పెంచడాన్ని చైనా సైతం తీవ్రంగా పరోక్షంగా ఖండించింది. ఇలా నెమ్మదిగా బలపడుతున్న మైత్రీ బంధాన్ని నేరుగా విమానసర్వీసుల ద్వారా మరింత పటిష్టంచేయాలని భారత్ ఆశిస్తోంది. చివరిసారిగా మోదీ చైనాలో 2018 జూన్లో పర్యటించారు. ఆ తర్వాతి ఏడాది అక్టోబర్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్లో పర్యటించారు.

అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్..!
ఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చింది. ప్రజాపాలనను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కార్.. ఒకవైపు కక్ష పూరిత పాలనను కొనసాగిస్తూ మరొకవైపు బారీగా అప్పులు చేయడాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్ని అప్పులు చేస్తున్నా సంక్షేమం అనేది సామాన్యుడికి చేరకపోవడంతో అసలు అప్పులు చేసిన సొమ్మంతా ఎటుపోతుందనేది విశ్లేషకులు ప్రశ్న.ఫలితంగా ఏపీలో అసలు పాలన ఉందా అనేది ప్రజల్లో తలెత్తుత్తోంది. రోజురోజుకి ఏపీ అప్పుల భారం పెరిగిపోతోంది. ఏపీలో ప్రస్తుత అప్పుల భారం రూ. 5.6 లక్షల కోట్లుగా ఉంది. ఇది రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి’(జీఎస్డీడీపీ)లో అప్పులు 34.7 శాతంగా ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని నేటి(మంగళవారం, ఆగస్టు 12వ తేదీ) రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక్కడ తెలంగాణ అప్పుల భారం రూ. 4.4 లక్షల కోట్లుగా ఉంది. ఇది తెలంగాణ జీఎస్డీడీపీ 26.2 అప్పుల శాతంగా ఉంది. అంటే తెలంగాణ కంటే అప్పుల్లో దూసుకుపోతోంది ఆంధ్రప్రదేశ్. అభివృద్ధిలో ఎటువంటి ముందంజ లేని చంద్రబాబు ప్రభుత్వం.. అప్పులు చేయడంలో మాత్రం పరుగులు పెడుతుందనేది ఇక్కడ అందరికీ అర్ధమవుతున్న విషయం.
ఎన్ఆర్ఐ

నిమిష ప్రియ కేసు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం
యెమెన్లో మరణశిక్ష పడ్డ కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో భారత ప్రభుత్వ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఆమెను రక్షించే ప్రయత్నాలు చేస్తున్న బృందానికి అక్కడికి వెళ్లకుండా రెడ్ సిగ్నల్ వేసింది. నిమిషను రక్షించేందుకు అనధికారిక మార్గాలైనా చూడాలని సుప్రీం కోర్టు సూచించినప్పటికీ.. విదేశాంగ శాఖ వెనకడుగు వేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.న్యూఢిల్లీ: కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందానికి యెమెన్ వెళ్లేందుకు భారత విదేశాంగ శాఖ(MEA) అనుమతి నిరాకరించింది. ఐదుగురు ప్రతినిధులతో కూడిన ఆ బృందానికి.. భద్రతా కారణాలు, అలాగే.. యెమెన్ ప్రభుత్వంతో అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాల దృష్ట్యా అనుమతించలేమని స్పష్టం చేసింది.సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందం ఆమె శిక్షను తప్పించేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. ఆమె కుటుంబానికి కావాల్సిన న్యాయ సహాయం అందిస్తూ వస్తోంది. మొన్నీమధ్యే సుప్రీం కోర్టులోనూ పిటిషన్ కూడా వేసింది. ఈ నేపథ్యంలోనే ఆ బృందాన్ని యెమెన్ రాజధాని సనాకు వెళ్లేందుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలున్నా అందుకు తాము అనుమతించలేమని విదేశాంగశాఖ ఆ బృందానికి లేఖ ద్వారా బదులిచ్చింది.‘‘సనాలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. అందుకే యెమెన్లోని భారత రాయబార కార్యాలయాన్ని రియాద్కు మార్చాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం మరింత ప్రమాదకరం. నిమిష ప్రియ కుటుంబం, వాళ్ల తరఫున అధికార ప్రతినిధులే చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ వ్యవహారంలో విదేశాంగ శాఖ తరఫున మా వంతు ప్రయత్నాలూ చేస్తున్నాం. మన పౌరుల భద్రతను మేం ప్రాధాన్యంగా పరిగణిస్తున్నాం. కాబట్టి ఎలాంటి ఆదేశాలున్నా.. మీ ప్రయాణానికి మేం అనుమతించలేం’’ అని స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ కేసులో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెబుతూ వస్తోంది. అయితే తాము చేయాల్సిందంతా చేశామని, మిగిలిన మార్గం బ్లడ్ మనీనే అని, అయితే అది ప్రైవేట్ వ్యవహారమని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలోనే చెప్పింది. ఈ తరుణంలో ఇతర మార్గాలనైనా చూడాలంటూ సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది.ఈలోపు ఆమె మరణశిక్ష వాయిదా పడింది. అయితే యెమెన్ బాధిత కుటుంబంతో బ్లడ్మనీ చర్చలు, శిక్షరద్దు అయ్యిందంటూ రోజుకో ప్రచారం తెరపైకి వస్తుండగా.. వాటిని కేంద్రం ఖండిస్తూ వస్తోంది. తాజాగా.. శుక్రవారం విదేశాంగ శాఖ ‘యెమెన్కు మిత్రదేశాల ప్రభుత్వాలతో టచ్లో ఉన్నాం’ అంటూ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.కేరళకు చెందిన నిమిష ప్రియ నర్స్ కోర్సు పూర్తిచేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొంది. ఆ తర్వాత ఆమె యెమెన్లో ఓ క్లినిక్ తెరవాలనుకొంది. కానీ, ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని నిమిష-థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొని అల్అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ను ప్రారంభించారు. ఆ తర్వాత తమ కుమార్తెకు సంప్రదాయ వేడుక కోసం భారత్ వచ్చిన ప్రియా అది ముగియగానే తిరిగి యెమన్ వెళ్లిపోయింది. ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలోనే ఉండిపోయారు. మెహది దీనిని అదునుగా భావించి ఆమె నుంచి డబ్బు లాక్కోవడంతోపాటు వేధించినట్లు ప్రియా కుటుంబం ఆరోపిస్తోంది. ఆమెను తన భార్యగా మెహది చెప్పుకోవడం మొదలుపెట్టి, పాస్పోర్ట్, ఇతర పత్రాలను లాక్కొన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆమెను కుటుంబసభ్యులతో కూడా మాట్లాడనీయలేదు. 2016లో అతడిపై ప్రియా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ, వారు ఆమెను పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్పోర్టును స్వాధీనం చేసుకోవాలని భావించింది. కానీ, ఆ డోస్ ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్లో పారేసింది. చివరికి అక్కడినుంచి సౌదీకి వెళ్లిపోతుండగా.. సరిహద్దుల్లో ఆమెను అరెస్టు చేశారు. 2020లో అక్కడి ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. ఈ తరుణంలో ఈ ఏడాది జులై 16వ తేదీ మరణశిక్ష అమలు కావాల్సి ఉండగా.. సరిగ్గా దానికి ఒక్కరోజు ముందు(జులై 15వ తేదీ) మత పెద్దల జోక్యంతో మరణ శిక్ష వాయిదా పడింది. అప్పటి నుంచి తలాబ్ కుటుంబంతో బ్లడ్ మనీకి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. మధ్యలో కేరళ కాంతాపురం AP అబూబకర్ ముస్లియార్ శిక్ష రద్దైందని ఓ ప్రకటన చేసినప్పటికీ.. అందులో వాస్తవం లేదని కేంద్రం తర్వాత మరో ప్రకటన చేసింది. బ్లడ్మనీ అంటే.. హత్య లేదంటే తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారం. హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదంటే అతని కుటుంబానికి దక్కే సొమ్ము ఇది. ఆ క్షమాధనం అనేది ఎంత ఉండాలి?. ఎంత స్వీకరించాలి? అనేది ఈ రెండవైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించకుంటే శిక్ష అమలు అవుతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. నిమిష కేసులో ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలో స్పష్టం చేసింది.

అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తూ..
లింగాలఘణపురం: అమెరికాలోని ఓక్లహోమ్ రాష్ట్రంలోని ఎడ్జుండ్ నగరంలో ఉంటున్న జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన కుర్రెముల సాయికుమార్ (31) బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో అక్కడి కోర్టు 35 ఏళ్ల శిక్ష విధించింది. దీంతో మానసిక ఆందోళనకు గురై సాయికుమార్ జూలై 26న జైలులోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు గత నెల 31న అమెరికా బయల్దేరారు. సాయికుమార్ పదేళ్ల కిందట అమెరికా (America) వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తూ ఓక్లహోమ్లో ఉంటున్నాడు.2023లో అక్కడి ఎఫ్బీఐ సోషల్ మీడియా మేనేజింగ్ యాప్లో నిందితుడి అకౌంట్పై విచారణ జరపగా 13–15 ఏళ్ల బాలుడిగా నటిస్తూ బాలికలతో నమ్మకంగా ఉంటుండేవాడు. అతని అభ్యర్థనను తిరస్కరించిన వారిని బెదిరించడం, మానసికంగా వేధించడం, అసభ్య చిత్రాలు తీసి పంపించినట్లు ఆరోపణలు రావడంతో సాయికుమార్ను అరెస్ట్ చేశారు. అతను 19 మంది మైనర్లను లైంగికంగా వేధించినట్లు కోర్టులో నిరూపితమవడంతో 35 ఏళ్ల జైలు శిక్ష పడగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చదవండి: ధర్మస్థళ మిస్టరీ.. కీలకంగా ఆ 5 ప్రాంతాలు?

తానా: నవ్వులు కురిపించిన ‘సాహిత్యంలో హాస్యం’
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన “సాహిత్యంలో హాస్యం” నవ్వుల జల్లులు కురిపించింది. తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత 5 సంవత్సరాలకు పైగా, ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్య సదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 82వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “సాహిత్యంలో హాస్యం” (2 వ భాగం) “ప్రముఖ రచయితల హాస్యరచనా వైభవం” చాలా ఉల్లాస భరితంగా, ఆద్యంతం నవ్వులతో నిండింది.తానా నూతన అధ్యక్షులు డా. నరేన్ కొడాలి మాట్లాడుతూ – “తానా ఎన్నో దశాబ్దాలగా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళా వికాసాలకోసం అవిరళకృషి చేస్తోందని, తన పదవీకాలంలో తానా సంస్థ స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకునే దిశగా పయనించడం సంతోషంగాఉందని, అందరి సహకారంతో సంస్థ ఆశయాలను సాకారం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. తెలుగు భాష, సాహిత్యాల పరిరక్షణ, పర్యాప్తిలో తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు అయిన డా. ప్రసాద్ తోటకూర నేతృత్వంలో గత 5 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ సాహిత్య కృషి ఎంతైనా కొనియాడదగ్గదని, ఈ నాటి కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకూ స్వాగతం అంటూ సభను ప్రారంభించారు.”తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “డా. నరేన్ కొడాలి తానా అధ్యక్ష పదవీకాలం ఫలవంతం కావాలని, తానా సంస్థను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికి ఆయనకు అందరూ సహకరించాలని కోరారు. ప్రస్తుత సాహిత్య చర్చాంశం గురించి ప్రస్తావిస్తూ - తెలుగు సాహిత్యంలో కథ, కవిత, నవల, నాటకం, వ్యాసం మొదలైన అన్ని ప్రక్రియలలోనూ హాస్యం పుష్కలంగా పండిందని అన్నారు.కాళ్ళకూరి నారాయణగారి “చింతామణి”, “వరవిక్రయం” నాటకాలు, పానుగంటి లక్ష్మీనరసింహారావుగారి “సాక్షి” వ్యాసాలు, చిలకమర్తి లక్ష్మీ నరసింహారావుగారి “గణపతి” నవల, మునిమాణిక్యం నరసింహారావుగారి “కాంతం కథలు”, సురవరం ప్రతాపరెడ్డిగారి “మొగలాయి కథలు”, గురజాడ అప్పారావుగారి కలం నుండి జాలువారిన “కన్యాశుల్కం” నాటకంలోని అనేక హాస్య సన్నివేశాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. జీవితంలో వత్తిడిని తగ్గించేందుకు హాస్యం మిక్కిలి దోహదపడుతుందని, సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో ఉన్న హాస్యాన్ని అందరూ ఆస్వాదించవచ్చును అన్నారు.”గౌరవఅతిథిగా విచ్చేసిన తెలుగువేద కవి, ప్రముఖ సినీగీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు-సాహిత్యంలో వివిధ హాస్య ఘట్టాలను వివరించి నవ్వించారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రముఖ చలనచిత్ర కథా, సంభాషణా రచయిత్రి, సినీ విమర్శకురాలు బలభద్రపాత్రుని రమణి - సుప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి, విమర్శకురాలు రంగనాయకమ్మ పండించిన హాస్యాన్ని; ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్, నృత్య రూపకాల రచయిత, కథా, సంభాషణా రచయిత బ్నిం – నరసింహారావు పేరుతో ఉన్న వివిధ ప్రముఖ రచయితలు సృష్టించిన హాస్యాన్ని ‘గాండ్రింపులు మానిన హాస్యాలుగా’; ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు సుధామ - ప్రముఖ హాస్యకథా రచయిత్రి, నవలా రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి రచనలలోని హాస్యాన్ని;ప్రముఖ కథా, నవలా రచయిత్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనుమరాలు అయిన లలిత రామ్ - తెనాలి రామకృష్ణుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రిల సాహిత్యంలోని హాస్యాన్ని; కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షురాలు డా. వి. వింధ్యవాసినీ దేవి – సుప్రసిద్ధ హాస్య రచయిత మునిమాణిక్యం నరసింహారావు రచనలలోని హాస్యాన్ని; ప్రముఖ హాస్యనటుడు, రచయిత, ఉపన్యాసకుడు అయిన డా. గుండు సుదర్శన్ – ప్రముఖ హాస్య రచయిత శ్రీరమణతో తనకున్న సాంగత్యం, శ్రీరమణ సాహిత్యంలో హాస్యం; ప్రముఖ రచయిత, సినీనటుడు, దర్శకుడు కాశీ విశ్వనాధ్ – ప్రముఖ రచయితలు వేటూరి సుందర రామమూర్తి, పైడిపల్లి సత్యానంద్, కొడకండ్ల అప్పలాచార్యలు సృష్టించిన హాస్యరీతుల్ని ఇలా పాల్గొన్న అతిథులందరూ వేర్వేరు రచయితలు పండించిన హాస్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించి అందరిని కడుపుబ్బ నవ్వించారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు చిగురుమళ్ళ శ్రీనివాస్ తన వందన సమర్పణలో కార్యక్రమం యావత్తూ హాస్యరస ప్రధానంగా సాగిందని, పాల్గొన్న అతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు, తానా కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదేం పాడుబుద్ధయ్యా.. పైలటూ!
న్యూయార్క్: విమానం ల్యాండయిన 10 నిమిషాలకే ఎన్నారై పైలట్ను అరెస్ట్ చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన పైలట్ను శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco) అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 9.35 గంటల సమయంలో డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానం ల్యాండవగా అధికారులు అందులోకి ఎక్కి పైలట్గా ఉన్న రుస్తొమ్ భగ్వాగర్(34)ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్కు తరలించారు.పదేళ్లలోపు చిన్నారిపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఈ ఏడాది ఏప్రిల్లో కేసు నమోదైంది. తన తల్లితో డేటింగ్ చేసిన రుస్తొమ్ భగ్వాగర్ (Rustom Bhagwagar) తనను లైంగికంగా వేధించినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆరేళ్లప్పుడు మొదలైన వేధింపులు తనకు 11 ఏళ్లు వచ్చేవరకు సాగించాడని, ఈ విషయం తన తల్లికీ తెలుసునని ఆమె పేర్కొంది. ఆమె సమక్షంలోనూ ఇవి సాగాయని ఫిర్యాదు చేసిందని అధికారులు వెల్లడించారు.కెనడా విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి ఒట్టావా: కెనడాలోని న్యూఫౌండ్ల్యాండ్ ప్రాంతంలో చిన్న విమానం కూలిన ఘటనలో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. డీర్ లేక్ సమీపంలో ఈ నెల 26న ఈ ఘటన చోటుచేసుకుంది. డీర్ లేక్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానం కూలింది.చదవండి: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తిపై అమానుషంఈ ఘటనలో విమానంలో ఉన్న ఏకైక వ్యక్తి గౌతమ్ సంతోష్(27) ప్రాణాలు కోల్పోయారని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనలో విమానం పైలట్ సైతం అక్కడికక్కడే చనిపోయారని పేర్కొంది. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉందని తెలిపింది.
క్రైమ్

ఆటోడ్రైవర్తో వివాహేతర సంబంధం.. భర్త చంపిన భార్య..!
కర్ణాటక: అక్రమ సంబంధం బయట పడటంతో ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన ఓ వ్యక్తి తన ప్రియురాలి భర్తను కడతేర్చాడు. ఈ ఘటన బెంగళూరు ఉత్తర తాలూకా మాచోహళ్లిలో చోటుచేసుకుంది. మాచోహళ్లిలో విజయ్కుమార్(35), ఆశ దంపతులు నివాసం ఉంటున్నారు. విజయ్కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆశ ఆటోడ్రైవర్ ధనంజయ్(35)తో సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయం తెలిసి విజయ్కుమార్ గొడవ పడగా పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. సర్దిచెప్పి రాజీ చేసి పంపించారు. అయినప్పటికీ ఆశ ధనంజయ్తో సంబంధం కొనసాగించింది. మరో వైపు ధనంజయ్ని చంపేస్తానని విజయ్కుమార్ చెప్పుకుని తిరుగుతుండేవాడు. దీంతో విజయ్కుమార్ని హత్య చేయాలని ధనంజయ స్కెచ్ వేశాడు. పథకం ప్రకారం సోమవారం రాత్రి విజయ్కుమార్ ఇంట్లోంచి బయటకు రాగానే తన గ్యాంగ్తో కలిసి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు మాదనాయకనహళ్లి పోలీసులు నిర్ధారించారు. ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి భార్య ఆశను అదుపులోకి తీసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ∙

ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్ సుజాత
వికారాబాద్: లంచం తీసుకుంటూ ఓ మహిళా ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కింది. కలెక్టరేట్లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నవాబుపేట మండలం వట్టిమీనపల్లికి చెందిన ఓ రైతు తన రెండెకరాల అసైన్డ్ భూమికి సంబంధించి రికార్డుల్లో తన తల్లి పేరు నమోదు చేయించేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. తహసీల్దార్ కార్యాలయం నుంచి వచ్చిన ఫైల్ను ఈ– సెక్షన్ నుంచి కలెక్టర్ పేషీకి పంపించాల్సి ఉంది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న సుజాత ఇందుకోసం రూ.5 వేలు డిమాండ్ చేసింది. ఈ మొత్తాన్ని పదిహేను రోజుల క్రితమే రైతు నుంచి గూగుల్ పే చేయించుకుంది. అనంతరం కలెక్టర్ ప్రొసీడింగ్ ఇవ్వగా.. తిరిగి ఆ కాపీని తహసీల్దార్ ఆఫీసుకు పంపించాల్సిఉంది. రోజులు గడుస్తున్నా ఫైల్ రాకపోవడంతో బాధితుడు వెళ్లి జూనియర్ అసిస్టెంట్ సుజాతను కలిశాడు. దీనిపై స్పందించిన ఆమె ప్రొసీడింగ్ కాపీ తహశీల్దార్ కార్యాలయానికి పంపాలంటే రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. రూ.15,000 బేరం కుదిరిన అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సుజాతకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. ఈ– సెక్షన్లో సోదాలు నిర్వహించి, పలు ఫైళ్లను పరిశీలించారు. ఆమెను అదుపులోకి తీసుకుని, ఈ వ్యవహారంలో మరెవరి పాత్రయినా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. నిందితురాలిని ఏసీబీ కోర్డులో హాజరు పర్చి, రిమాండ్కు తరలిస్తామని వెల్లడించారు. లంచం అడిగితే 1064 కాల్ చేయండి.. అధికారులు, ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమను సంప్రదించాలని, ఇందుకోసం 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టంచేశారు.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నగర యువతి దుర్మరణం
హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యారి్థని దుర్మరణం చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన శ్రీనివాస వర్మ తన కుటుంబంతో కలిసి 15 ఏళ్ల కిత్రమే నగరానికి వలస వచ్చాడు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ బాలాజీ కాలనీలో నివాసముంటున్నాడు. ఇతనికి భార్య హేమలత, శ్రీజ వర్మ (23), శ్రీయ వర్మ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాస వర్మ బౌరంపేటలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో ట్రాన్స్పోర్ట్ ఇన్చార్జిగా హేమలత ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. శ్రీజ వర్మ మాస్టర్స్ చదివేందుకు మూడేళ్ల క్రితం అమెరికాలో వెళ్లింది. చార్లెస్టన్లోని ఈస్టర్న్ ఇల్లినోయిస్ యూనివర్సిటీలో కంప్యూటర్స్లో మాస్టర్స్ పూర్తి చేసిన శ్రీజ వర్మ ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం తన స్నేహితురాలితో కలిసి భోజనం తెచ్చుకునేందుకు తాము నివసిస్తున్న అపార్ట్మెంట్ పక్కనే ఉన్న రెస్టారెంట్కు వెళ్తున్నారు. వెనుక నుంచి వచి్చన ట్రక్కు శ్రీజను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో కూతురు చనిపోయిందన్న విషాద వార్త విని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బాలాజీ కాలనీలోని శ్రీజ ఇంటి వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి శ్రీజ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని బంధువులు కోరుతున్నారు.

క్లినికల్ ట్రయల్స్..ఎగ్ డొనేషన్స్!
సాక్షి, హైదరాబాద్: సరోగసీ పేరుతో శిశువుల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసును నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఏజెంట్ల నెట్వర్క్ను నార్త్జోన్ పోలీసులు ఛేదించారు. ఈ నెట్వర్క్కు క్లినికల్ ట్రయల్స్ చేసే క్యాంపులతోపాటు అండాన్ని డొనేట్ చేసే మహిళలే మూలమని గుర్తించారు. డాక్టర్ నమ్రతపై గతంలో 15 కేసులు ఉండగా, తాజాగా 9 కేసులు నమోదైనట్లు డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ ప్రకటించారు. ఈ కేసుల్లో ఇప్పటివరకు 25 మంది నిందితులను అరెస్టు చేశామని, వీరిలో డాక్టర్లు, నర్సులు, ఏజెంట్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఏసీపీ పి.సుబ్బయ్యతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్, కొండాపూర్లతో పాటు విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, భువనేశ్వర్, కోల్కతాలో సెంటర్లు నిర్వహిస్తున్న నమ్రత.. దేశవ్యాప్తంగా ఏజెంట్ల నెట్వర్క్ ఏర్పాటు చేసుకుందని తెలిపారు. ఆ క్యాంపుల్లో ఏర్పడిన పరిచయాలతోనే...వివిధ ఔషధాలు, నూతన వైద్య విధానాలపై అధికా రికంగానే క్లినికల్ ట్రయల్స్ జరుగుతుంటాయి. ఇలాంటి క్యాంపులకు వెళ్లే నమ్రత లేదా ఆమె ఉద్యోగులు పురుష వలంటీర్లను ట్రాప్ చేసి ఏజెంట్లుగా మార్చుకున్నారు. అలాగే ఐవీఎఫ్ కేంద్రాల్లో అండం (ఎగ్) డొనేషన్ కోసం వచ్చిన మహిళల్ని తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు. వీరిని ఏజెంట్లు గా చేసుకుంటున్నారు. నమ్రతకు ప్రధాన ఏజెంట్గా వ్యవహరించిన ధనశ్రీ సంతోషి వివిధ ప్రాంతాల్లో సబ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. వీరి ద్వారానే పేద గర్భిణులను గుర్తించి నమ్రత వాడుకుంది. నకిలీ డీఎన్ఏ రిపోర్టులు సృష్టించి... ఐవీఎఫ్ కోసం సికింద్రాబా ద్లోని సృష్టి సెంటర్కు వచ్చే దంపతుల్లో ఖర్చు పెట్టగలిగేవారిని సరో గసీ వైపు మళ్లించే నమ్రత..వారిని విశాఖపట్నం పంపించి పరీక్షలు చేయించేది. వారి అండం, వీర్యంతోనే సరోగసీ జరుగుతున్నట్లు నమ్మించి.. డెలివరీ సమయానికి ఒప్పందం చేసుకున్న పేద గర్భిణులను తీసుకువచ్చి డెలివరీ చేయించి, ఆ శిశువు సరోగసీ ఒప్పందం చేసుకున్న దంపతులకే పుట్టినట్లు నమ్మించి అప్పగించేది. కన్న తల్లిదండ్రులకు నామమాత్రపు మొత్తం చెల్లిస్తూ శిశువును దత్తత ఇస్తున్నట్లు చెప్పేది. ఇందుకోసం నకిలీ డీఎన్ఏ రిపోర్టులు సృష్టించేది. ఈ శిశువుల జనన రిజిస్ట్రేషన్ తదితరాలన్నీ విశాఖలోనే నిర్వహించేవారు. బాధితుల నుంచి నమ్రత రూ.1.6 కోట్లు వసూలు చేసిందని పోలీసులు గుర్తించారు. సరోగసీ పేరుతో ముగ్గురు శిశువుల్ని విక్రయించిన నమ్రత.. మరో కేసులో మాత్రం డెలివరీ సమయంలో శిశువు చనిపోయినట్లు నమ్మించి ఏమాత్రం సంబంధం లేని మృత శిశువును చూపించింది. మరోసారి సరోగసీ చేయాలంటే అదనంగా రూ.15 లక్షలు డిమాండ్ చేసింది. ఈ కేసులో మొత్తం 25 మంది అరెస్టు చేశారు. వీరిలో వైద్యులైన నమ్రత, సదానందం, విద్యుల్లత, ఉషా దేవి, రవిపై ఉన్న 9 కేసుల దర్యాప్తును సీసీఎస్ అధీనంలోని సిట్ బదిలీ చేశారు.