ప్రధాన వార్తలు

నువ్వు ఏదైతే విత్తావో అదే చెట్టవుతుంది చంద్రబాబూ: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని.. సీనియర్ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఇదే సంప్రదాయం కొనసాగితే… టీడీపీలో అందరూ జైలుకెళ్లాల్సిందేనని ఆయన హెచ్చరించారు. వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మిథున్రెడ్డి అరెస్ట్ బాధాకరమన్నారు.‘‘మిథున్ను, గౌతం రెడ్డిని రాజకీయాల్లో నా ద్వారా వచ్చారు. నన్ను చూసి ప్రేరణ పొంది రాజకీయాల్లోకి వచ్చారు. వారి తండ్రులతో కన్నా, వీరితోనే నాకు ఎక్కువ సాన్నిహిత్యం. నన్ను చూసి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రంలోని అంశాలకు మిథున్కు ఏం సంబంధం?. మిథున్ తండ్రి పెద్దిరెడ్డిగారు ఆ శాఖను కూడా చూడలేదు. కేవలం వేధించాలన్న ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టారు. చంద్రగిరి చంద్రబాబు సొంత నియోజకవర్గం. గతంలో చంద్రబాబు మంత్రిగా పనిచేసి చంద్రగిరిలో ఓడిపోయారు. తర్వాత ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని మళ్లీ టీడీపీలో చేరాడు. తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు...కుప్పం బీసీల నియోజకవర్గం కాబట్టి అక్కడికి వెళ్లిపోయాడు. చంద్రబాబు కంట్లో భాస్కర్రెడ్డి కంట్లో నలుసులా మారాడు. భాస్కర్ కొడుకును కూడా జైలులో పెట్టాలని కుట్రపన్నాడు. భాస్కర్ కొడుకు లండన్లో చదువుకుని వచ్చాడు. అలాంటి వారిమీద కూడా కేసులు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారు. నందిగం సురేష్, ఒక సాధారణ స్థాయి నుంచి ఎంపీగా ఎదిగాడు. గట్టిగా తన స్వరాన్ని వినిపిస్తున్నాడని 191 రోజులు జైల్లో పెట్టారు. కేసు మీద కేసు పెట్టి వేధిస్తున్నారు. కాకాణి గోవర్ధన్ మీద కూడా కేసులు మీద కేసులు పెట్టారు...టోల్గేట్ల వద్ద ఫీజుల వద్దకూడా వసూలు చేశారని తప్పుడు కేసు. లేని అక్రమాలు చూపించి.. తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు మళ్లీ మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. దీని కోసం తప్పుడు వాంగ్మూలం చెప్పించే ప్రయత్నంచేశారు. మెజిస్ట్రేట్ వద్ద తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని శ్రీకాంత్రెడ్డి అనే వ్యక్తి చెప్పాడు. పార్టీలో ఇలా ముఖ్యమైన, క్రియాశీలకంగా ఉన్నవారిపై కేసులు పెడుతున్నారు. ప్రజల తరఫున గొంతు వినిపించనీయకూడదన్నది చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబు పాలన ఘోరంగా ఉంది. అసలు పరిపాలనే కనిపించడంలేదు..సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఏ హామీలు నిలబెట్టుకోలేదు. ఘోరంగా వైఫల్యం చెందాడు కాబట్టే… ఈ తప్పడు కేసులు. మాజీ మంత్రి రోజామీత తీవ్రంగా దుర్భాషలాడారు. మన పార్టీలో ఉన్న మహిళలకు ఆత్మగౌరవం ఉండదా?. బీసీ మహిళ, కృష్ణాజడ్పీ ఛైర్మన్ హారిక మీద నేరుగా దాడులు చేశారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిమీద హత్యాయత్నమే లక్ష్యంగా దాడులు చేశారు. ఆ రోజు ప్రసన్న ఇంట్లో ఉండి ఉంటే.. ఆయన పరిస్థితి ఏంటి?. రాడ్లతో, కర్రలతో దాడులు చేశారు. తాడిపత్రి నియోజకవర్గ హెడ్ క్వార్టర్కు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్లలేకపోతున్నాడు...ఏకంగా సీఐ గన్ చూపించి మనుషులను భయపెట్టే ప్రయత్నంచేస్తున్నాడు. కొంతమంది డీఐజీలు, పోలీసు అధికారులు అవినీతిలో భాగస్వామ్యం అయ్యారు. ఈ కొంతమంది పోలీసులు కలెక్షన్ ఏజెంట్లుగా మారారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలకు కలెక్షన్లు పంచుతున్నారు. ముఖ్య నేతకు, ముఖ్య నేత కొడుక్కి.. కలెక్షన్లు పంచుతున్నారు. వ్యవస్థీకృతంగా అవినీతి జరుగుతోంది. బెల్టుషాపులకు వేలం పాటలు వేస్తున్నారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ర్వార్ట్జ్, సిలికా, లెటరైట్ మాఫియాలు జరగుతున్నాయి. కొంతమంది పోలీసు అధికారుల సహాయంతో అవినీతిపై పంచాయతీలు చేయిస్తున్నారు. మనం ఎప్పుడూ చూడని విధంగా అవినీతి జరుగుతోంది..రేషన్ బియ్యం మాఫియా కొనసాగుతోంది. పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. కొంతమంది డీఐజీలు కలెక్షన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంత అధ్వాన్నమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని, ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మాలి అంటున్నారు, ఇంతకన్నా పచ్చిమోసం ఉంటుందా?. ఫీజురియింబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల పిల్లల చదువులు మానేస్తున్న పరిస్థితులు వచ్చాయి. రూ.4200 కోట్లు పీజు రియింబర్స్ మెంట్ బకాయలు ఉన్నాయి, ఆరు క్వార్టర్లనుంచి పెండింగ్. వసతీ దీవెన కింద రూ.2200 కోట్లు బకాయిలు ఉన్నాయి...ఆరోగ్యశ్రీ బిల్స్ నెలకు రూ.300 కోట్ల చొప్పున, రూ.4200 కోట్లు పెండింగ్. ఆరోగ్య ఆసరా కింద ఒక్క పైసా ఇవ్వడంలేదు. నెట్ వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తివేశాయి. ఏ రైతుకూ, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులను పరామర్శించడానికి వెళ్తే కేసులు పెడుతున్నారు. ఉచిత పంటల బీమా తీసేశారు. ఆర్బీకేలు, ఇ- క్రాప్ నిర్వీర్యం. నాడు-నేడు పనులు ఆగిపోయాయి. స్కూళ్లు మూసేస్తున్నారు. రాష్ట్రంలో అసలు పాలన ఎక్కడుంది?. రెండేళ్లపాటు కోవిడ్ ఉన్నా.. మనం ప్రజలకు మెరుగైన సంక్షేమం అందించాం...ఐదేళ్లలో మనం చేసిన అన్నిరకాల అప్పులు రూ.3.32 లక్షల కోట్లు చేశాం. ఈ 14 నెలల్లో చంద్రబాబు అందులో 52 శాతం వెళ్లాడు. ఏ పథకం లేదు. ఏ స్కీమూ లేదు. కేవలం దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి మాత్రమే సింగపూర్ పర్యటన. పోర్టులు, హార్బర్లు కట్టాం, స్కూళ్లు బాగుచేశాం, ఆర్బీకేలువ కట్టాం, సచివాలయాలు కట్టాలం, విలేజ్ క్లినిక్స్ కట్టాం, మెడికల్ కాలేజీలు కట్టాం. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలేదు, అంతా దోచుకుంటున్నారు. దేశం ఆదాయం సగటున 12 శాతం పెరిగితే, రాష్ట్రం ఆదాయాలు 3శాతంకూడా పెరగడంలేదు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు ఆయన జేబులోకి పోతున్నాయి...పార్టీ తరఫున త్వరలో యాప్ విడుదలచేస్తాం. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా.. వెంటనే యాప్లో నమోదు చేయవచ్చు. పలానా వ్యక్తి, పలానా అధికారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డానని చెప్పొచ్చు. ఆధారాలు కూడా ఆ యాప్లో పెట్టొచ్చు. ఆ ఆధారాలన్నీకూడా అప్లోడ్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ ఆటోమేటిగ్గా మన డిజిటల్ సర్వర్లోకి వచ్చేస్తోంది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలన చేస్తాం. అన్యాయానికి గురైన వారంతా ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు...ఆధారాలుగా ఉన్న వీడియోలు, పత్రాలను అప్లోడ్ చేయొచ్చు. ఈ ఫిర్యాదులపై పరిశీలన జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం. చంద్రబాబు ఏదైతో విత్తారో అదే చెట్టవుతోంది. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో.. కార్యక్రమం కింద బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ.. కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. మండలాల్లో కూడా దాదాపుగా పూర్తికావొచ్చింది. 90 నియోజకవర్గాల్లో గ్రామస్థాయిలోకూడా ప్రారంభమై ముమ్మరంగా సాగుతోంది. వచ్చే నెలలో రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ కార్యక్రమం ఉద్ధృతంగా చేయాలి. క్యూ ఆర్ కోడ్ ద్వారా చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు, ప్రతి కుటుంబానికీ ఎంత బాకీ పడ్డాడో చెప్పాలి..పీఏసీ సభ్యులు ఈ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొనాలి. పీఏసీ సభ్యులంతా సీనియర్ లీడర్లు. మీ అనుభవాన్ని పార్టీ కార్యక్రమాలకు జోడించాలి. పార్టీని క్రియాశీలంగా నడిపే బాధ్యతను తీసుకోవాలి. గ్రామ స్థాయిలో మనం కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. రచ్చబండ కార్యక్రం ద్వారా కమిటీల ఏర్పాటు కూడా ఉద్ధృతంగా సాగుతోంది. దీన్ని నాయకులంతా పర్యవేక్షణ పరిశీలన చేయాలి. గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్తా పార్టీ సంస్థాగత నిర్మాణంలోకి రావాలి. బాబుష్యూరిటీ, మోసం గ్యారంటీ కింద గ్రామస్థాయిలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమం చాలా పగడ్బందీగా జరగాలి...ప్రతి గ్రామంలోనూ జరగాలి, అక్కడే గ్రామ కమిటీల నిర్మాణం జరగాలి. ఇది కచ్చితంగా నూటుకు నూరుశాతం జరగాలి. మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామన్న భావన ప్రజల్లో బాగా వెల్లడవుతోంది. ఇస్తానన్న బిర్యానీ లేదు. ఉన్న పలావూ పోయింది. అందుకే మన కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో పీఏసీ సభ్యులంతా భాగస్వాములు కావాలి. పీఏసీ సభ్యులంతా క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. పెద్దరికంతో కలుపుగోలుగా ఉండాలి. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తీసుకోవాలి. అందరం ఐక్యతతో పనిచేయాలి...పార్టీ పరంగా ఉన్న వ్యవస్థలను ఉపయోగించుకోవాలి. చిన్న చిన్న విభేదాలను రూపుమాపి అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకు రావాలి. పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇదో మంచి అవకాశం. పార్టీకోసం కష్టపడేవారు ఎవరన్నది ఇప్పుడే బయటకు వస్తుంది. పార్టీలో మంచి గుర్తింపు పొందడానికి ఇదొక అవకాశం. గ్రామ కమిటీలు అయ్యాక బూత్ కమిటీలు వేయాలి. ఈసారి కార్యకర్తలకు పెద్దపీట. మరో 30 ఏళ్లు పార్టీ బలంగా సాగేలా కార్యకర్తలకు తోడుగా, అండగా ఉంటాం. కోవిడ్ కారణంగా ఆశించినంతగా మనం వారికి చేయలేకపోయాం. రెండేళ్లపాటు కోవిడ్ సంక్షోభంతో చాలా ఇబ్బందులు పడ్డాం. వందేళ్లకు ఒకసారి వచ్చే కోవిడ్ లాంటి మహమ్మారిని చాలా ప్రభావంతంగా హేండిల్ చేశాం. ప్రజలను బాగా ఆదుకున్నాం...కార్యకర్తల విషయంలో గతంలోలా కాదు. కచ్చితంగా వారికి పెద్ద పీట ఉంటుంది. ప్రస్తుతం గ్రామ కమిటీల మీద దృష్టిపెట్టాలి. తర్వాత బూత్కమిటీల మీద దృషిపెట్టాలి. ప్రతి గ్రామంలోనూ సోషల్మీడియా ఉండాలి. అలాగే గ్రామాల వారీగా అనుబంధ విభాగాలు ఉండాలి. కమిటీల ఏర్పాటు వల్ల క్రియాశీలక కార్యకర్తలను చైతన్యం చేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తారు, పార్టీ నిర్మాణంలో, కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటారు. పార్టీ కమిటీల్లో ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి’’ అని వైఎస్ జగన్ చెప్పారు.వైఎస్ జగన్ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళనవైఎస్ జగన్ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళన వ్యక్తమమైంది. జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉందని పీఏసీ సభ్యులు తెలిపారు. ‘‘మీరు భద్రంగా ఉంటేనే మేం, ప్రజలు బాగుంటాం. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే వైయస్.జగన్ భద్రతపై సమస్యలు సృష్టిస్తోంది. ఏ పర్యటన చూసినా భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. భద్రత విషయంలో ఉపేక్షించడం కరెక్టు కాదు. మీ భద్రత విషయంలో కొత్త కొత్త వార్లు వింటున్నాం. మా అందరికీ చాలా ఆందోళన కరంగా ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ఇందులో రాజీ వద్దని పీఏసీ సభ్యులు.. జగన్కు సూచించారు. బంగారుపాళ్యం సహా ఇతర పర్యటనల్లో భద్రత విషయంలో పోలీసులు, ప్రభుత్వం కావాలనే రాజీ పడిందన్నారు.

‘ ఇక్కడ ఉంది రష్యా.. ఇజ్రాయిల్, ఇరాన్ కాదు’
వాషింగ్టన్: ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపాలని రష్యాకు అమెరికా ఇచ్చిన డెడ్లైన్పై ఇప్పుడు ఆ రెండు(అమెరికా-రష్యా) దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్లో రష్యా సృష్టిస్తున్న రక్తపాతాన్ని ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువును యూఎస్ రిపబ్లిక్ సెనేటర్ లిండే గ్రాహం గుర్తు చేశారు. ట్రంప్ గడువును రష్యా సీరియస్గా తీసుకున్నట్లు కనబడుటం లేదు. గడువు సమీపిస్తోంది. దీనిపై రష్యా స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయంపై రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఆ దేశ అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితుడైన దిమిత్రి మెద్వెదేవ్ తీవ్రంగా స్పందించారు. లిండే గ్రాహం చేసిన ట్వీట్ను కోడ్ చేస్తూ మెద్వెదేవ్ కౌంటరిచ్చారు. To those in Russia who believe that President Trump is not serious about ending the bloodbath between Russia and Ukraine:You and your customers will soon be sadly mistaken. You will also soon see that Joe Biden is no longer president.Get to the peace table. https://t.co/IRWk9I0Ljf— Lindsey Graham (@LindseyGrahamSC) July 28, 2025 ఇక్కడ అమెరికా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. రష్యాతో ట్రంప్ అల్టిమేటం గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ ఉంది రష్యా.. ఇజ్రాయిలో లేక ఇరాన్ దేశమో కాదు. 50 రోజులు లేదా 10... అని కాదు 2 విషయాలను గుర్తుంచుకోవాలి. ప్రతి అల్టిమేటం ముప్పు యుద్ధం వైపు అడుగు అనే విషయం ట్రంప్ గుర్తుంచుకోవాలి. ట్రంప్ చేస్తున్నది రష్యాపైనో, ఉక్రెయిన్ పైనో యుద్ధం కాదు. వేరే పరిణామాలకు దారి తీయొచ్చు(మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని సంకేతాలిస్తూ) ’ అంటూ ఘాటుగా స్పందించారు మెద్వెదెవ్.రష్యాకు 50 రోజుల సమయమేఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వారి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు భారీ సుంకాలు ముప్పుతో హెచ్చరించారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్కు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సోమవారం( జూలై 14) నాడు హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు 50 రోజుల సమయం ఇస్తున్నా, ఆ లోపు యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. ‘ పుతిన్ చర్యలు చాలా నిరాశను కల్గిస్తున్నాయి. యుద్ధంపై 50 రోజుల్లో డీల్కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్లు చవిచూస్తుంది. ఆ టారిఫ్లు కూడా వంద శాతం దాటే ఉంటాయి. రష్యా యొక్క మిగిలిన వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే ద్వితీయ సుంకాలు అవుతాయి.- ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాం’ అని ట్రంప్ స్పష్టం చేశారు. వైట్ హౌస్లో నాటో చీఫ్ మార్క్ రూట్ను కలిసిన నేపథ్యంలో ట్రంప్ కాస్త ఘాటుగా స్పందించారు.

ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేయడానికి ముహూర్తం కావాలా ఏంటి?: మోదీ
సాక్షి,న్యూఢిల్లీ: రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపుతో భారత్-పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ఇతర ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ లోక్సభలో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ను ఆపమని ఏ ప్రపంచాది నేతలు చెప్పలేదని స్పష్టం చేశారు. మంగళవారం లోక్సభలో ఆపరేషన్ సిందూర్పై కొనసాగుతున్న చర్చలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్పై లోక్సభలో జరుగుతున్న చర్చపై మోదీ మాట్లాడుతూ.. ఈ వర్షాకాల సమావేశాలు భారత్ విజయోత్సవానికి నిదర్శనం. ఆపరేషన్ సిందూర్ విజయానికి ప్రతీకగా విజయ్ ఉత్సవ్. మన సైనికులు ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపారు. ఆపరేషన్ సిందూర్ను దేశం మొత్తం విజయోత్సవాలు చేసుకుంటోంది. ఉగ్రస్థావరాలను మనసైన్యం నేలమట్టం చేసింది.140కోట్ల మంది భారతీయులు నాపై నమ్మకం ఉంచారు. సైన్యం వెనుక దేశ ఉంది. మతం కోణంలో పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. శత్రువుకు ఊహకు అందని విధంగా శిక్ష విధించాం. సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.పాక్ బిత్తర పోయింది ‘పహల్గాం ఉగ్రదాడికి ప్రతీ కారం తీర్చుకుంటామని చెప్పాం.. చేసి చూపించాం. పాక్లోకి చొచ్చుకెళ్లి ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేశాం. పాక్లోని ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్ను కూల్చేశాం. కలుగులో దాక్కున్న ముష్కరులకు పొగపెట్టిమరీ మట్టిలో కలిపాం. పథకం ప్రకారం ఆపరేషన్ సిందూర్. భారత్ ప్రతీకార చర్యలను చూసి పాక్ బిత్తర పోయింది. ఆపరేషన్ సిందూర్ ముందు పాక్ తేలిపోయింది.ఆపరేషన్ సిందూర్ ముందుకు బ్లాక్ మెయిల్స్ పనిచేయవని చూపించాం’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు హెడ్లైనే గతి56 ఇంచ్ల చెస్ట్ ప్రధాని ఎక్కడా అంటూ కాంగ్రెస్ నాపై విమర్శలు చేసింది. పహల్గాం ఉగ్రదాడి విషయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కాంగ్రెస్ నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకుంది. ప్రపంచం మొత్తం కాంగ్రెస్ను కాదు.. దేశాన్ని సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ హెడ్లైన్స్లో ఉండొచ్చు కానీ.. ప్రజల హృదయాల్లో నిలవలేదు. మాస్టర్ మైండ్కు నిద్ర కరువైందిఉగ్రవాదానికి ఊతం ఇస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పాక్కు బదులిచ్చాం.మనం చేసిన దాడులనుంచి పాక్ ఎయిర్ బేస్లు ఇంకా కోలుకోలేదు. ఆపరేషన్ సిందూర్లో మన ఎయిర్ఫోర్స్ 100శాతం విజయం సాధించాయి. సిందూ నుంచి సిందూర్ వరకు పరాక్రమాన్ని ప్రదర్శించాం. ఆపరేషన్ సిందూర్ తర్వాత మాస్టర్ మైండ్కు నిద్ర కరువైంది. పాక్ ప్రాధేయపడిందిఉగ్రవాదులతో పాకిస్తాన్ బంధం బహిరంగ రహస్యమే. ఉగ్రవాదాన్ని అణిచి వేయడమే భారత్ లక్క్ష్యం. మన మిస్సైల్స్ పాక్ మూల మూలల్లోకి చొచ్చుకుని వెళ్లాయి. మనం ఆపరేషన్ సిందూర్తో స్పందిస్తామని పాక్ కలలో కూడా ఊహించలేదు. ఆపరేషన్ సిందూర్తో సైనికులు పాక్ ఉగ్రవాదుల్ని చీల్చి చెండాడారు. ఇక చాలు అంటూ డీజీఎంవో సమావేశంలో పాక్ ప్రాధేయపడింది. మన దాడులతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. దయచేసి ఇంక దాడులు ఆపండి అంటూ ప్రాధేయపడింది."प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः"Ready to Strike, Trained to Win.#IndianArmy pic.twitter.com/M9CA9dv1Xx— ADG PI - INDIAN ARMY (@adgpi) May 6, 2025 ఆపరేషన్ సిందూర్: ట్రంప్ ప్రమేయం లేదుఆపరేషన్ సిందూర్ను ఆపమని ఏ ప్రపంచాది నేతలు మాకు ఫోన్ చేయలేదు. మే9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాకు ఫోన్ చేశారు.నేను బిజీగా ఉన్నాను. వాన్స్ చాలాసార్లు నాకు ఫోన్ చేశారు. పాక్ భారత్పై భారీ ఎత్తున మిస్సైళ్లతో దాడి చేయబోతోందని వాన్స్ నాకు చెప్పాడు. పాక్ దాడి చేస్తే తిప్పి కొడతామని చెప్పాను. పాక్ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఆపరేషన్ సిందూర్ ఆన్లోనే ఉంది. పాక్ అజెండాను ఇంపోర్ట్ చేసుకునే పనిలో కాంగ్రెస్ ఉంది. ఆపరేషన్ సిందూర్ దాడి తాలూకా ఫొటోలు కావాలని కాంగ్రెస్ అడుగుతోంది. పాక్ మళ్లీ దుస్సహానికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మన దేశ సామర్ధ్యాలపై కాంగ్రెస్కు నమ్మకం లేదుఅధమ్ పూర్ బేస్పై దాడి అంటూ పాక్ అసత్య ప్రచారాలు చేసింది. ఆ మరుసటి రోజే నేను అక్కడి వెళ్లి మన సైనికుల్ని అభినందించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ దేశాన్నిపాలించింది. కానీ మనదేశ సామర్ధ్యాలపై కాంగ్రెస్కు నమ్మకం లేదు. పాక్ తప్పుడు వార్తల్ని కాంగ్రెస్ నేతలు ఇక్కడ ప్రచారం చేశారు. ఒక్క పాక్ మిసైల్ కూడా భారత్ను టచ్ చేయలేదు. ముమూర్తం కావాలా ఏంటి?ఆపరేషన్ మహాదేవ్పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆపరేషన్లో భాగంగా భారత్ సైనికులు పహల్గాం ఉగ్రవాదుల్ని హతమార్చింది. నిన్న టెర్రరిస్టులను ఎందుకు చంపారని విపక్షాలు అడిగాయి. ఎన్నిగంటలు ఆపరేషన్ మహాదేవ్ చేపట్టారని అఖిలేష్ యాదవ్ అడిగారు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడానికి ఏమైనా ముమూర్తం కావాలా?కాంగ్రెస్ను పీవోకేను కోల్పోయాంకాంగ్రెస్ విధానం వల్ల పీవోకే విషయంలో భారత్ మూల్యం చెల్లించుకుంటోంది. కాంగ్రెస్ హయాంలో భారత్ పీవోకేని కోల్పోయింది. కాంగ్రెస్ వల్లే పీవోకే మనకు కాకుండా పోయింది.నెహ్రూ చేసిన తప్పులకు భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోంది.కాంగ్రెస్ వల్ల 33వేల చదరపు అడుగుల భూభాగాన్ని భారత్ కోల్పోయింది. కచ్చతీవును శ్రీలంకకు ఇందిర గిఫ్ట్గా ఇచ్చింది. పీవోకేను ఎప్పుడు వెనక్కి తెస్తారని అడుగుతున్నారు. పాక్కు నీళ్లు అప్పగించి భారత్లో సంకటస్థితి సృష్టించారు. సింధూ ఒప్పందం లేకుండా భారీ ప్రాజెక్ట్లు వచ్చేవి. నీళ్లు కాదు.. కాలువలు తవ్వేందుకు నెహ్రూ పాక్కు నిధులిచ్చారు. నెహ్రూ పాక్ అనుకూల విధానాలతో నిధి మనది.. నీళ్లు మనది పెత్తనం వాళ్లదా. నీళ్ల వివాదాల పరిష్కార బాధ్యతల్ని నెహ్రూ వరల్డ్ బ్యాంక్కు అప్పగించారు.

న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్
రేపటి నుంచి (జులై 30) జింబాబ్వేతో ప్రారంభం కాబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. భుజం గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ టామ్ లాథమ్ తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. లాథమ్ గైర్హాజరీలో మిచెల్ సాంట్నర్ న్యూజిలాండ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. సాంట్నర్ న్యూజిలాండ్ టెస్ట్ జట్టుకు 32వ కెప్టెన్ అవుతాడు.లాథమ్ ఇటీవల ఇంగ్లండ్లో జరిగిన ఓ టీ20 మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. జింబాబ్వేతో తొలి టెస్ట్ సమయానికి లాథమ్ పూర్తిగా కోలుకోకపోవడంతో అతనికి ప్రత్యామ్నాయంగా సాంట్నర్ను కెప్టెన్గా ఎంపిక చేశారు.సాంట్నర్ ఇటీవల జింబాబ్వేలోనే జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్లో న్యూజిలాండ్ను విజేతగా నిలిపాడు. ఈ టోర్నీ మొత్తంలో అజేయ జట్టుగా నిలిచిన న్యూజిలాండ్.. ఫైనల్లో సౌతాఫ్రికాతో జరిగిన క్లోజ్ ఫైట్లో 3 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ టోర్నీలో ఫైనల్ సహా అన్ని మ్యాచ్ల్లో రాణించిన మ్యాట్ హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి.జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జులై 30 నుంచి ఆగస్ట్ 3- తొలి టెస్ట్ (బులవాయో)ఆగస్ట్ 7 నుంచి 11- రెండో టెస్ట్ (బులవాయో)జింబాబ్వేతో టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు..హెన్రీ నికోల్స్, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, మైఖేల్ బ్రేస్వెల్, నాథన్ స్మిత్, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, టామ్ బ్లండెల్, విలియమ్ ఓరూర్కీ, అజాజ్ పటేల్, జేకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్, మ్యాచ్ హెన్రీ

ఆ పని కోసం రూ. 2 లక్షలు ఆఫర్.. స్టార్ హీరోపై యువతి ఆరోపణలు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిపై ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు ఇప్పుడు తమిళనాడులో దుమారం రేపాయి. ఓ యువతిని విజయ్ చాలా ఏళ్లుగా ఇబ్బంది పెట్టాడని, క్యారవాన్ ఫేవర్ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలు ఆఫర్ చేశాడని ఆరోపించింది. అంతేకాదు సదరు యువతి ప్రస్తుతం రిహబిలేషన్ సెంటర్ చికిత్స పొందుతోందని సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించి.. కాసేపటికే ఆ పోస్ట్ని డిలీట్ చేసింది.అసలేం జరిగింది?కోలీవుడ్లో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందంటూ రమ్యా మోహన్ అనే యువతి నిన్న(జులై 28) మధ్యాహ్నం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది .అందులో తనకు తెలిసిన ఓ యువతికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ..దానికి కారణం విజయ్ సేతుపతే అని ఆరోపించింది.‘తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కల్చర్ ఎక్కువైంది. ఇది జోక్ కాదు. నాకు తెలిసిన, మీడియాకు బాగా పరిచయం ఉన్న ఓ యువతి ఇప్పుడు ఊహించని ఒక ప్రపంచంలోకి లాగబడింది. ఆమె ఇప్పుడు రిహాబిలేషన్ సెంటర్లో ఉంది. క్యారవాన్ ఫేవర్ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలను స్టార్ హీరో విజయ్ సేతుపతి ఆఫర్ చేశాడు. ఆమెను అతను చాలా ఏళ్లుగా వేధించాడు. ఇదొక్కటే కాదు.. ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. బాధితులను విస్మరిస్తూ... ఇలాంటి వ్యక్తులను మీడియా దేవుడిగా చిత్రీకరిస్తుంది’అంటూ రమ్య విమర్శించింది. అంతేకాదు నిజాన్ని గుర్తించకుండా.. బాధితురాలిపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. డైరీ, ఫోన్ చాట్ల ద్వారా ఆ యువతి అనుభవించిన బాధ బయటకు వచ్చిందని, ఇది కట్టు కథకాదని, ఆమె జీవితం..ఆమె బాధ..అంటూ మరో ట్వీట్ చేసింది.అందుకే డిలీట్ చేశావిజయ్ని ఆరోపిస్తూ చేసిన ట్వీట్లను కాసేపటికే ఆమె డిలీట్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు వచ్చాయి. నిజమే అయితే ఎందుకు డిలీట్ చేశావంటూ నెటిజన్స్ రమ్యపై మండిపడ్డారు. దీంతో దానికి వివరణ ఇస్తూ రమ్య మరో ట్వీట్ చేసింది. కోపంతో ఆ ట్వీట్ పెట్టానని, అది అంత వైరల్ అవుతుందని ఊహించలేదని, బాధితురాలి గోప్యత , శ్రేయస్సు కోసం తన పోస్ట్ను తొలగించినట్లు ఆ ట్వీట్లో పేర్కొంది.I shared that tweet out of frustration and to vent. Didn’t expect it to get this much attention. Getting too many enquiries about it now. Out of concern for her privacy and wellbeing I’ve decided to take it down. Hope that’s respected.— Ramya Mohan (@_Ramya_mohan_) July 28, 2025

ధర్మస్థళ కేసు: 15 అనుమానిత ప్రాంతాల గుర్తింపు!
ధర్మస్థళ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో ఆసక్తికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. దేవాలయ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఒకరు తాను ధర్మస్థళ పరిసరాల్లో వందలాది శవాల అంత్యక్రియలు నిర్వహించానని, ఈ నెల నాలుగున ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందం (ఎస్ఐటీ)ని ఏర్పాటు చేసింది కూడా. ఈ నేపథ్యంలో.. ఫిర్యాదుదారు తాజాగా తాను శవాలను కాల్చిన, పూడ్చిన 15 ప్రాంతాలను విచారణ అధికారులకు చూపించారు. వీటిల్లో ఒకటి హైవే పక్కనే ఉండగా మిగిలినవన్నీ నేత్రావతి నది ఒడ్డున ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇతర కార్యకలాపాలు జరక్కుండా సిట్ అధికారులు వాటికి జియో ట్యాగింగ్ చేశారు. అంతేకాకుండా ఫొటోలు తీసి కాపలా కోసం సాయుధ పోలీసులను ఏర్పాటు చేశారు. 1998 -2014 మధ్య కాలంలో తాను కొందరి ఒత్తిడి కారణంగా వందలాది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించానని, వీరిలో చాలామంది మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసింది. జూలై నాలుగున ఫిర్యాదు ఇచ్చిన సందర్భంగా అతడు ఒక పుర్రెను సాక్ష్యంగా అందించారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం జూలై 19న డీజీపీ ప్రణబ్ మహంతి నేతృత్వంలో ఒక ఎస్ఐటీని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు తరువాత ఫిర్యాదుదారుణ్ణి రెండు రోజుల పాటు మంగళూరులో ప్రశ్నించారు. దర్యాప్తు అధికారి జితేంద్ర కుమార్ దయామా ఆ వివరాలను రికార్డు చేశారు. ఆ తరువాత సోమవారం ఫిర్యాదుదారుడితో కలిసి ఆన్సైట్ పరిశీలనలను జరిపింది. మొత్తం 15 అనుమానిత ప్రాంతాలను గుర్తించింది. ఈ కార్యకలాపాల్లో ఫోరెన్సిక్స్, ఆంత్రోపాలజీ, రెవెన్యూ విభాగాల నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లో త్వరలో తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.మరోవైపు ఈ దర్యాప్తును ధర్మస్థళ మంజునాథేశ్వర ఆలయం స్వాగతించింది. విచారణ పారదర్శకంగా జరగాలని కోరింది. ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కొందరు ఎస్ఐటీ విచారణపై న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ అవసరమని కోరారు. అలాగే నిస్పక్షికత కోసం ఫోరెన్సిక్స్ సాయం తీసుకోవాలని సూచించారు.

ఆఫీస్ ఫర్నీచర్ అడ్డుపెట్టుకుని.. శరణార్థి కాస్త సూపర్ హీరోగా!
అగ్రరాజ్యపు ప్రముఖ నగరంలో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. న్యూయార్క్ మిడ్టౌన్ మాన్హటన్ ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలోకి తుపాకీతో ప్రవేశించిన దుండగుడు రెచ్చిపోయాడు. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి సహా నలుగురు మృతి చెందారు. అయితే.. ఉద్యోగులు సమయస్ఫూర్తితో చాకచక్యంగా వ్యవహరించి ఉండకపోతే పెను ప్రాణ నష్టమే సంభవించి ఉండేదని తెలుస్తోంది. 345 పార్క్ అవెన్యూలో.. పలు ప్రముఖ సంస్థల కార్యకలాపాలు జరుగుతున్నాయి. అక్కడి కాలమానం ప్రకారం.. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కాల్పుల ఘటన చోట చేసుకుంది. ఆ సమయంలో కాల్పుల శబ్దాలు విన్న మిగతా ఉద్యోగులు.. బయట ఏం జరుగుతుందో అనే ఆందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకుని తలుపులను బిగించుకున్నారు. సోఫాలు, కుర్చీలు, చేతికి దొరికిన ఫర్నీచర్ను తలుపులకు అడ్డుగా పెట్టుకున్నారు. కొంత మంది తమ డెస్కులను లాక్కెళ్లి అడ్డంగా పెట్టారు. BREAKING: Photo from inside the Blackstone office pic.twitter.com/8DeVVbX5CD— Exec Sum (@exec_sum) July 29, 2025మేము పని ముగించుకుని బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో, పబ్లిక్ అడ్రస్ ద్వారా ‘shelter in place’ అని హెచ్చరించారు అని షాద్ సాకిబ్ అనే ఉద్యోగి తెలిపారు. జెస్సికా చెన్ అనే ఉద్యోగి మాట్లాడుతూ.. మేము ప్రెజెంటేషన్ చూస్తున్న సమయంలో, ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. వెంటనే టేబుళ్లను తలుపు దగ్గర బారికేడ్ చేశాం అని తెలిపింది. ‘‘ఇది భయంకరమైన అనుభం.. దాడి చేస్తూ అతను(దుండగుడు)పైకి వెళ్లాడు. ప్రాణాలు అరచేతపట్టుకుని వణికిపోయాం’’ అని ఓ మహిళా ఉద్యోగి తెలిపారు. మరో 9/11 దాడి జరుగుతుందేమోనని వణికిపోయాం అని మరికొందరు చెప్పడం గమనార్హం.దుండగుడు ఎవరంటే.. కాల్పుల్లో పోలీస్ అధికారి సహా నలుగురిని దుండగుడు హతమార్చాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ తర్వాత 33వ అంతస్తులోకి వెళ్లిన దుండగుడు.. తనను తాను కాల్చుకుని చనిపోయాడు. దుండగుడిని లాస్ వెగాస్ నెవెడాకు చెందిన షేన్ తమురా(27)గా గుర్తించారు. గ్రెనాడా హిల్స్ హై స్కూల్లో ఫుట్బాల్ ప్లేయర్గా ఉన్నాడు. లాస్ వెగాస్లోనే ఒక క్యాసినోలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. 2022 జూన్ 14న గన్ లైసెన్స్ పొందాడు. దాడి సమయంలో AR-15 రైఫిల్, బుల్లెట్ రెసిస్టెంట్ వెస్ట్ ధరించి ఉంచడం గమనార్హం. నిందితుడికి సంబంధించిన నెవాడా నంబర్ ప్లేట్ ఉన్న BMW కారులో రైఫిల్, రివాల్వర్, మందులు, మ్యాగజైన్లు లభించాయి. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటన ప్రకారం.. తమురాకు మానసిక సమస్యలు ఉన్నాయి. అయితే ఈ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డాడనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సూపర్ హీరో దిదారుల్ ఇస్లాం షేన్ తమురా జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు మృతి చెందారు. చనిపోయిన వ్యక్తి.. ఎన్వైపీడీ పోలీస్ అధికారి దిదారుల్ ఇస్లాం. దుండగుడిని అడ్డుకునే క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే మూడేళ్ల కిందటి దాకా ఈయన బంగ్లాదేశ్ శరణార్థి. విధుల్లో చేరినప్పటి నుంచి నిబద్ధతతో పని చేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం భార్య 8 నెలల గర్భవతిగా ఉంది. దిదారుల్ నిజమైన న్యూయార్కర్. దేవుడిని నమ్మే వ్యక్తి. ఆయన రియల్ హీరో అంటూ న్యూయార్క్ మేయర్ ఎరిక్ అడమ్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. దిదాఉల్ నగరాన్ని రక్షించేందుకు ప్రాణ త్యాగం చేశారు. ఆయన సేవలను ఎప్పటికీ గౌరవిస్తాం అని NYPD కమిషనర్ జెస్సికా టిష్ తెలిపారు. తాజా ఘటన.. ఈ సంవత్సరం అమెరికాలో జరిగిన 254వ సామూహిక కాల్పుల ఘటనగా కావడం గమనార్హం.

ఆలోచనలతో కంప్యూటర్ని కంట్రోల్ చేస్తున్న తొలి మహిళ!
సాంకేతికత కూడిన వైద్యం ఎందరో రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అందుకు ఎన్నో ఉదంతాలు నిదర్శనం. అయితే బ్రెయిన్ సంబంధిత విషయంలో మాత్రం సాంకేతికతను వాడటం కాస్త సవాలు. అయితే దాన్నికూడా అధిగమించి..స్ట్రోక్కి గురై పక్షవాతంతో బాధపడుతున్న పేషెంట్లలో కొత్త ఆశను అందించేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది ఎలోన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ (Neuralink) కంపెనీ. ఇది మానవ మెదడు, కంప్యూటర్ మధ్య నేరుగా కమ్యూనికేషన్ ఏర్పరిచే బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ (BCI) టెక్నాలజీపై పని చేస్తోందనే విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ ద్వారా, మెదడులో చిన్న చిప్ను అమర్చి, ఆలోచనల ద్వారా డిజిటల్ పరికరాలను నియంత్రిస్తారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ క్లినకల్ ట్రయల్ దశలో ఉంది. అందులో భాగంగానే ఈ న్యూరాలింక్ చిప్ను పొందింది ఆడ్రీక్రూస్ అనే మహిళ. ఎవరామె.? ఆమె ఈ సాంకేతికత సాయంతో ఏం చేసిందంటే..రెండు దశాబ్దాలకు పైగానే ఆడ్రీ కూస్ పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైంది. క్లినికల్ ట్రయల్లో భాగంగా ఎలోన్ మస్క్ న్యూరాలింక్ చిప్ను ఆమె మెదడులో అమర్చారు. దీంతో న్యూరాలింక్ బ్రెయిన్ ఇంప్లాట్ ద్వారా తన ఆలోచనలతో కంప్యూటర్ని నియంత్రిస్తున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె తన మానసిక ఆదేశాలతో తన పేరుని డిజిటల్ రూపంలో రాసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేసుకున్నారామె. ఆ పోస్ట్లో ఆండ్రీ డిజిటల్ సిరాతో తన పేరును( ఆడ్రీ) సూచించే ల్యాప్టాప్ స్క్రీన్ ఫోటోని షేర్ చేశారు. అంతేగాదు దాంతోపాటు ఎర్రటి హార్ట్ సింబల్, ఒక పక్షి, పిజ్జా ముక్క ఉండే డూడుల్ని కూడా పంచుకుంది. దీన్ని ఆమె టెలిపతి ద్వారా గీసినట్లుగా ఆ పోస్ట్కి క్యాప్షన్ ఇచ్చింది ఆడ్రీ. ఆమె 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా తన పేరును రాసిన క్షణం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఎందుకంటే ఆమె గత 20 ఏళ్లకు పైగా పక్షవాతానికి గురై కదలలేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారామె. ఆమె తన చూపుడు వేలుని క్లిక్గా, కర్సర్గా మణికట్టుని ఊహించుకుంటూ.. తన మానసిక ఆలోచనలతో కంప్యూటర్ని నియంత్రిస్తుందామె. ఇదంతా ఆమె తన బ్రెయిన్తో చేస్తుంది. ఇక్కడ ఆడ్రికి ఈ న్యూరాలింక్ క్లినికల్ ట్రయల్లో తొమ్మిదొ పేషెంట్గా ఈ చిప్ను ఆమెకు అమర్చారు. పుర్రెలో రంధ్రం చేసి మోటారు కార్టెక్స్లో సుమారు 128 కనెక్షన్లతో ఈ చిప్ని అమర్చారు. ఈ బీసీఐ(బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ) ఆమె మెదడు కదలికలు, సంకేతాలను చదివి వాటిని కర్సర్ కదలికలుగా అనువదిస్తుంది. ఈ బ్రెయిన్ చిప్ ఆమెను మళ్లీ నడిచేలా సాయం చేయలేకపోయినా..డిజిటల్ పరికరాలతో తన మనసులోని మాటలను వ్యక్తం చేయడానికి వీలు కల్పిస్తోంది. ఇది పూర్తి మానసిక ఆలోచనలతో పనిచేస్తుంది. న్యూరాలింక్ అంటే.. 2016లో ఎలోన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్, మానవ మెదడును నేరుగా కంప్యూటర్లకు అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుంది. పక్షవాతం వంటి నాడీ సంబంధిత పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు డిజిటల్ స్వాతంత్య్రాన్ని పొందేలా.. సంభాషించడంలో సహాయపడటమే ఈ సాంకేకతికత లక్ష్యం.కాగా, ఇక్కడ ఆడ్రీ ఇలాంటి మరిన్ని పోస్ట్లను వీడియోలను పంచుకోవాలని ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అంతేగాదు ఆమె తన పోస్ట్లో తాను త్వరలో ఇంటికి వస్తానని, ఈ ప్రక్రియ గురించి మరింత వివరంగా తెలిపేలా వీడియోలను కూడా పోస్ట్ చేస్తానని పేర్కొనడం విశేషం. ఈ న్యూరాలింక్ సాంకేతికతను వినియోగించిన తొలి మహిళగా ఆమె ప్రస్థానం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని ఆశిద్దాం.(చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!)

‘సరస్వతీ’ షేర్ల వ్యవహారం.. వైఎస్ జగన్కు బిగ్ రిలీఫ్
సాక్షి, హైదరాబాద్: సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల వ్యవహారంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి భారీ ఊరట లభించింది. షేర్ల బదిలీ ప్రక్రియను నిలుపుదల చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) హైదరాబాద్ ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి తన కుటుంబ సభ్యులు అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని, ఈ ప్రక్రియ నిలిపివేయాలంటూ కిందటి ఏడాది సెప్టెంబర్లో వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. రిజిస్టర్లో వాటాదారుల పేర్లను సవరించి, తమ వాటాలను పునరుద్ధరించాలంటూ కోరారాయన. జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘గిఫ్ట్’ పూర్తికాకుండానే మోసపూరితంగా వాటాల బదలాయింపు జరిగిందని తెలిపారు. వాటాల పత్రాలు, వాటాల బదలాయింపు ఫారాలు సమర్పిస్తేనే కంపెనీ వాటాలను బదలాయించాల్సి ఉందన్నారు. దీనికి విరుద్ధంగా కంపెనీ వాటాలను బదలాయించిందన్నారు. పిటిషన్లపై తుది తీర్పు వెలువడేవరకు బదలాయింపు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని జగన్ తదితరులు కోరారు. వైఎస్ జగన్ పిటిషన్పై పది నెలలపాటు విచారణ జరిగింది. ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యులు రాజీవ్ భరద్వాజ్, సాంకేతిక సభ్యుడు సంజయ్ పురీ విచారణ జరిపి రెండు వారాల కిందట తీర్పు రిజర్వ్ చేశారు. చివరకు.. జగన్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ట్రిబ్యునల్.. సీబీఐ, ఈడీ కేసులు విచారణలో ఉండగా బదిలీలు సాధ్యం కాదంటూ ఇవాళ తీర్పు వెల్లడించారు.

‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’
టెక్ రంగంలో ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేస్తుందనే భయాలు నెలకొంటున్న తరుణంలో జోహో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఆశలు రేకెత్తిస్తోంది. జోహోలో ఇంజినీర్లను ఏఐ భర్తీ చేయగలదా అని కంపెనీ సీఈఓ మణి వెంబును అడిగినప్పుడు ప్రస్తుతానికి దాని ప్రభావం లేదని సమాధానం చెప్పారు. ఇటీవల ఓ సమావేశంలో వెంబు మాట్లాడారు.‘కృత్రిమ మేధ కారణంగా జోహోలో ఉద్యోగాల్లో కోత లేదు. మీరు ఏఐ వ్యవస్థను ఒక కంటెంట్ను సృష్టించమని అడిగితే అది చాలా మెరుగ్గా కంటెంట్ను ఇస్తుంది. అయితే కేవలం ఈ ఫీచర్ మా కంపెనీలో ఉద్యోగాలను తొలగించలేదు. ఇప్పటివరకు కృత్రిమ మేధ కారణంగా మేము సిబ్బందిని తగ్గించలేదు. వాస్తవానికి మరికొందరు ఇంజినీర్లను నియమించుకోవాలని యోచిస్తున్నాం’ అని చెప్పారు.ఇటీవల బెంగళూరులో జరిగిన జోహోలిక్స్ కార్యక్రమంలో వెంబు ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో జియా అని పిలువబడే కంపెనీ సొంత లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం)ను ఆవిష్కరించారు. ఈ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ భారతదేశపు మొట్టమొదటి ఎంటర్ప్రైజ్ ఏఐ అని చెప్పారు. ఇది సాధారణ ప్రజల కోసం ఉద్దేశించింది కానప్పటికీ, ఈ నమూనా వ్యాపారాలకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. దీన్ని జోహో ఉత్పాదకత, ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్లతో అనుసంధానించినట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ లేఆఫ్స్తో ఆర్థిక ప్రకంపనలుకృత్రిమ మేధ కంపెనీ వర్క్ ఫ్లోలో భాగమవుతోందని వెంబు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగులకు మరింత సహాయపడుతుందని నమ్ముతున్నారు. ‘ఇప్పటివరకు (జోహోలో) మేము కంపెనీలో ఏఐ కచ్చితంగా ఉద్యోగులను భర్తీ చేయడాన్ని చూడలేదు. దానికి బదులుగా ఇది ఉద్యోగులకు సహాయపడుతుంది. ఉదాహరణకు, ఒక సపోర్ట్ రిప్రజెంటేటివ్ సాధారణంగా రోజుకు 20 టిక్కెట్లను హ్యాండిల్ చేస్తాడనుకోండి.. ఏఐ సాయంతో 25 టిక్కెట్లను నిర్వహించే అవకాశం ఉంది. ఇది 20 శాతం వరకు ఉత్పాదకతను పెంచుతుంది’ అని చెప్పారు.
టర్కీ చెంత ‘మోస్ట్ పవర్ఫుల్’ నాన్ న్యూక్లియర్ బాంబు
వంద రూపాయలకే రూ.260 కోట్ల సినిమా.. ఎక్కడ చూడాలంటే?
పెళ్లయిన వ్యక్తితో ప్రేమలో.. ఆసక్తికరంగా థాంక్యూ డియర్’ ట్రైలర్
ఆరేసిన అజ్మల్.. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన పాకిస్తాన్
ఇండియాలో డిజిటల్ చెల్లింపులు జోరు
ఓటీటీకి మౌనీ రాయ్ స్పై థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
IPL: కేకేఆర్కు సంబంధించి బిగ్ న్యూస్
మహేష్,విజయ్ దేవరకొండ,అల్లు అర్జున్,రవితేజ.. ‘మల్టీ’స్టారర్
‘ ఇక్కడ ఉంది రష్యా.. ఇజ్రాయిల్, ఇరాన్ కాదు’
కూలీ పవర్ఫుల్ సాంగ్.. తెలుగు వర్షన్ వచ్చేసింది
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
డిప్యూటీ సీఎం డ్యూటీ.. వెంటనే సీఎం డ్యూటీ
'నేను చేసిన తప్పు మీరు చేయకండి.. నాలుగేళ్లలో 750 ఇంజెక్షన్లు'
మీకు దండం పెడతా.. దయచేసి కూర్చోండి..!
నాన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చేయకు
చరిత్ర సృష్టించిన రాహుల్-గిల్ జోడీ.. ప్రపంచంలోనే
‘సృష్టి’ మాయ.. 90వేలకు కొనుగోలు చేసి.. 40లక్షలకు శిశువు అమ్మకం
పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్ చేయాలనుంది: నాగచైతన్య
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
చాలా సంతోషంగా ఉంది.. అందుకే వారు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు: గిల్
కెరీర్ పతనంతో డిప్రెషన్.. పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్? 25 ఏళ్లుగా మిస్సింగ్
చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్
'హరి హర వీరమల్లు'కు జూనియర్ దెబ్బ
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
కొత్త రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీ
అల్లు అరవింద్కు 'మహావతార్ నరసింహా' వరం
ఈ అప్పులు, హమీల అమలు ఎందుకు సార్! రాష్ట్రాన్నే దత్తత ఇచ్చేస్తే పోలా!!
.. రాష్ట్రాన్ని నెంబర్వన్ చేస్తారంటే.. అప్పుల్లోనా సార్!
TCS layoffs: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!
తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్, అనన్య మార్క్స్ షీట్ వైరల్
టర్కీ చెంత ‘మోస్ట్ పవర్ఫుల్’ నాన్ న్యూక్లియర్ బాంబు
వంద రూపాయలకే రూ.260 కోట్ల సినిమా.. ఎక్కడ చూడాలంటే?
పెళ్లయిన వ్యక్తితో ప్రేమలో.. ఆసక్తికరంగా థాంక్యూ డియర్’ ట్రైలర్
ఆరేసిన అజ్మల్.. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన పాకిస్తాన్
ఇండియాలో డిజిటల్ చెల్లింపులు జోరు
ఓటీటీకి మౌనీ రాయ్ స్పై థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
IPL: కేకేఆర్కు సంబంధించి బిగ్ న్యూస్
మహేష్,విజయ్ దేవరకొండ,అల్లు అర్జున్,రవితేజ.. ‘మల్టీ’స్టారర్
‘ ఇక్కడ ఉంది రష్యా.. ఇజ్రాయిల్, ఇరాన్ కాదు’
కూలీ పవర్ఫుల్ సాంగ్.. తెలుగు వర్షన్ వచ్చేసింది
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
డిప్యూటీ సీఎం డ్యూటీ.. వెంటనే సీఎం డ్యూటీ
'నేను చేసిన తప్పు మీరు చేయకండి.. నాలుగేళ్లలో 750 ఇంజెక్షన్లు'
మీకు దండం పెడతా.. దయచేసి కూర్చోండి..!
నాన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చేయకు
చరిత్ర సృష్టించిన రాహుల్-గిల్ జోడీ.. ప్రపంచంలోనే
‘సృష్టి’ మాయ.. 90వేలకు కొనుగోలు చేసి.. 40లక్షలకు శిశువు అమ్మకం
పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్ చేయాలనుంది: నాగచైతన్య
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
చాలా సంతోషంగా ఉంది.. అందుకే వారు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు: గిల్
చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్
కెరీర్ పతనంతో డిప్రెషన్.. పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్? 25 ఏళ్లుగా మిస్సింగ్
'హరి హర వీరమల్లు'కు జూనియర్ దెబ్బ
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
కొత్త రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీ
అల్లు అరవింద్కు 'మహావతార్ నరసింహా' వరం
ఈ అప్పులు, హమీల అమలు ఎందుకు సార్! రాష్ట్రాన్నే దత్తత ఇచ్చేస్తే పోలా!!
.. రాష్ట్రాన్ని నెంబర్వన్ చేస్తారంటే.. అప్పుల్లోనా సార్!
TCS layoffs: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!
రేవ్ పార్టీకి పిలుస్తాడు.. రేప్ చేస్తాడు
సినిమా

జాన్వీ కపూర్ వారెవ్వా.. మృణాల్ డోలు ప్రాక్టీస్
డోలు వాయించడం నేర్చుకుంటున్న మృణాల్అతిలోక సుందరిలా మెరిసిపోతున్న జాన్వీఫిట్నెస్ ఛాలెంజ్లో సమంత సూపర్ హిట్తాజ్ మహల్ని సందర్శించిన ప్రియమణి, అనన్యపట్టుచీరలో బుట్టబొమ్మలా ఐశ్వర్యా రాజేశ్మత్స్య కన్యలా మాయ చేస్తున్న ఫరియా అబ్దుల్లాఫ్రూట్స్లా డ్రస్సింగ్ చేసుకున్న రెజీనా కసాండ్రా View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Take 20 (@take20health) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra)

ఓటీటీలోకి ఒకరోజు గ్యాప్లో రెండు తెలుగు థ్రిల్లర్స్
ప్రతివారంలానే ఈసారి కూడా ఓటీటీల్లోకి దాదాపు 20కి పైగా సినిమాలు వస్తున్నాయి. వాటిలో తమ్ముడు, 3 బీహెచ్కే లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు ఈ వీకెండ్లోనే స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు వీటికి తోడు మరో రెండు తెలుగు థ్రిల్లర్స్ కూడా రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ చిత్రాలేంటి? ఎందులోకి రానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.కొన్నిరోజుల క్రితం తమిళ హారర్ ఫాంటసీ సినిమా 'జిన్ ద పెట్'.. సన్ నెక్స్ట్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం తమిళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుండగా.. ఆగస్టు 01 నుంచి తెలుగులోనూ చూడొచ్చని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా పోస్ట్ పెట్టింది. చిన్న వీడియో బిట్ కూడా రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)'జిన్ ద పెట్' విషయానికొస్తే.. జిన్ అనే దెయ్యం ఉన్న పెట్టెని శక్తి(ముగెన్ రావ్).. తన ఇంటికి తీసుకొస్తాడు. అయితే దీని వల్ల తన ఫ్యామిలీ కష్టాలపాలవుతుందని అనుకుంటాడు. కానీ బాక్స్లోని దెయ్యం వీళ్లకు సాయం చేస్తుంది. ఇంతకీ ఆ దెయ్యం సంగతేంటి? వీళ్లకు ఎందుకు సాయం చేస్తుందనేది మిగతా స్టోరీ.'నెట్వర్క్' అనే టెక్నో థ్రిల్లర్ సిరీస్.. నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. జూలై 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీరామ్ , శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రల్లో నటించారు. మనకు రోజువారీ ఫోన్ అనేది చాలా అలవాటు అయిపోయింది. ఒకవేళ మన ఫోన్లో సిగ్నల్ రోజంతా మిస్ అయితే? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇలా నలుగురికి జరిగితే ఏమవుతుంది అనే కాన్సెప్ట్తో తీసిన తెలుగు సిరీస్ ఇది. థ్రిల్లర్స్ కావాలనుకునేవాళ్లు వీటిపై ఓ లుక్కేయొచ్చు.(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా) View this post on Instagram A post shared by SUN NXT (@sunnxt)

'కింగ్డమ్ మూవీ.. నా లైఫ్లో ఫస్ట్ క్యారవాన్ సినిమా'
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల కాగా.. అంచనాలు మరింత పెంచేసింది. రిలీజ్కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో కింగ్డమ్ మూవీ మేకర్స్ హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.అయితే ఈ ఈవెంట్కు హాజరైన కింగ్డమ్ నటుడు వెంకటేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్లో నటించడం తన అదృష్టమని అన్నారు. ఎందుకంటే తనకు ఫస్ట్ క్యారవాన్ దొరికిన చిత్రం కింగ్డమ్ మాత్రమేనని వెంకటేశ్ ఆనందం వ్యక్తం చేశారు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన వెంకటేశ్ కింగడమ్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.వెంకటేశ్ మాట్లాడుతూ..'హలో హైదరాబాద్.. ఇలాంటి పెద్ద క్రౌడ్ను చూడడం నా లైఫ్లో ఫస్ట్ టైమ్. నాది కేరళ.. నాపేరు వెంకటేశ్.. మలయాళ ఇండస్ట్రీలో ఒక సీరియల్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి ఆ తర్వాత చిన్నపాత్రలు, తమిళ సినిమాలో హీరో.. ఈరోజు కింగ్డమ్. ఈ రోజు క్షణాలకు నాకు తొమ్మిదేళ్లు పట్టింది. ఈ జర్నీ పట్ల నాకు సంతోషంగా ఉంది. నాగవంశీకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా లైఫ్లో క్యారవాన్ డోర్ దొరికిన మొదటి చిత్రం. ఇదే నాకు పెద్ద విషయం. మళ్లీ సితారా ఎంటర్టైన్మెంట్స్లో పనిచేయాలి. భవిష్యత్తులో హీరోగా చేయాలి' అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

ఆ పని కోసం రూ. 2 లక్షలు ఆఫర్.. స్టార్ హీరోపై యువతి ఆరోపణలు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిపై ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు ఇప్పుడు తమిళనాడులో దుమారం రేపాయి. ఓ యువతిని విజయ్ చాలా ఏళ్లుగా ఇబ్బంది పెట్టాడని, క్యారవాన్ ఫేవర్ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలు ఆఫర్ చేశాడని ఆరోపించింది. అంతేకాదు సదరు యువతి ప్రస్తుతం రిహబిలేషన్ సెంటర్ చికిత్స పొందుతోందని సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించి.. కాసేపటికే ఆ పోస్ట్ని డిలీట్ చేసింది.అసలేం జరిగింది?కోలీవుడ్లో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందంటూ రమ్యా మోహన్ అనే యువతి నిన్న(జులై 28) మధ్యాహ్నం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది .అందులో తనకు తెలిసిన ఓ యువతికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ..దానికి కారణం విజయ్ సేతుపతే అని ఆరోపించింది.‘తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కల్చర్ ఎక్కువైంది. ఇది జోక్ కాదు. నాకు తెలిసిన, మీడియాకు బాగా పరిచయం ఉన్న ఓ యువతి ఇప్పుడు ఊహించని ఒక ప్రపంచంలోకి లాగబడింది. ఆమె ఇప్పుడు రిహాబిలేషన్ సెంటర్లో ఉంది. క్యారవాన్ ఫేవర్ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలను స్టార్ హీరో విజయ్ సేతుపతి ఆఫర్ చేశాడు. ఆమెను అతను చాలా ఏళ్లుగా వేధించాడు. ఇదొక్కటే కాదు.. ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. బాధితులను విస్మరిస్తూ... ఇలాంటి వ్యక్తులను మీడియా దేవుడిగా చిత్రీకరిస్తుంది’అంటూ రమ్య విమర్శించింది. అంతేకాదు నిజాన్ని గుర్తించకుండా.. బాధితురాలిపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. డైరీ, ఫోన్ చాట్ల ద్వారా ఆ యువతి అనుభవించిన బాధ బయటకు వచ్చిందని, ఇది కట్టు కథకాదని, ఆమె జీవితం..ఆమె బాధ..అంటూ మరో ట్వీట్ చేసింది.అందుకే డిలీట్ చేశావిజయ్ని ఆరోపిస్తూ చేసిన ట్వీట్లను కాసేపటికే ఆమె డిలీట్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు వచ్చాయి. నిజమే అయితే ఎందుకు డిలీట్ చేశావంటూ నెటిజన్స్ రమ్యపై మండిపడ్డారు. దీంతో దానికి వివరణ ఇస్తూ రమ్య మరో ట్వీట్ చేసింది. కోపంతో ఆ ట్వీట్ పెట్టానని, అది అంత వైరల్ అవుతుందని ఊహించలేదని, బాధితురాలి గోప్యత , శ్రేయస్సు కోసం తన పోస్ట్ను తొలగించినట్లు ఆ ట్వీట్లో పేర్కొంది.I shared that tweet out of frustration and to vent. Didn’t expect it to get this much attention. Getting too many enquiries about it now. Out of concern for her privacy and wellbeing I’ve decided to take it down. Hope that’s respected.— Ramya Mohan (@_Ramya_mohan_) July 28, 2025
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్
రేపటి నుంచి (జులై 30) జింబాబ్వేతో ప్రారంభం కాబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. భుజం గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ టామ్ లాథమ్ తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. లాథమ్ గైర్హాజరీలో మిచెల్ సాంట్నర్ న్యూజిలాండ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. సాంట్నర్ న్యూజిలాండ్ టెస్ట్ జట్టుకు 32వ కెప్టెన్ అవుతాడు.లాథమ్ ఇటీవల ఇంగ్లండ్లో జరిగిన ఓ టీ20 మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. జింబాబ్వేతో తొలి టెస్ట్ సమయానికి లాథమ్ పూర్తిగా కోలుకోకపోవడంతో అతనికి ప్రత్యామ్నాయంగా సాంట్నర్ను కెప్టెన్గా ఎంపిక చేశారు.సాంట్నర్ ఇటీవల జింబాబ్వేలోనే జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్లో న్యూజిలాండ్ను విజేతగా నిలిపాడు. ఈ టోర్నీ మొత్తంలో అజేయ జట్టుగా నిలిచిన న్యూజిలాండ్.. ఫైనల్లో సౌతాఫ్రికాతో జరిగిన క్లోజ్ ఫైట్లో 3 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ టోర్నీలో ఫైనల్ సహా అన్ని మ్యాచ్ల్లో రాణించిన మ్యాట్ హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి.జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జులై 30 నుంచి ఆగస్ట్ 3- తొలి టెస్ట్ (బులవాయో)ఆగస్ట్ 7 నుంచి 11- రెండో టెస్ట్ (బులవాయో)జింబాబ్వేతో టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు..హెన్రీ నికోల్స్, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, మైఖేల్ బ్రేస్వెల్, నాథన్ స్మిత్, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, టామ్ బ్లండెల్, విలియమ్ ఓరూర్కీ, అజాజ్ పటేల్, జేకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్, మ్యాచ్ హెన్రీ

Divya Deshmukh: అసలైన హీరో మాత్రం ఆమెనే: ఆనంద్ మహీంద్ర
దివ్య దేశ్ముఖ్ (Divya Deshmukh).. భారత చెస్ వర్గాల్లో ప్రస్తుతం ఈ పేరు మారుమ్రోగి పోతోంది. చదరంగ దిగ్గజాలు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక (Dronavalli Harika)లకు కూడా సాధ్యం కాని అరుదైన ఘనతను దివ్య సాధించడమే ఇందుకు కారణం. ఫిడే మహిళల ప్రపంచకప్ (FIDE Women's World Cup) ఫైనల్లో ఏకంగా హంపినే ఓడించిన దివ్య.. ఈ టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది.దూకుడు ప్రదర్శిస్తూనేపందొమిదేళ్ల వయసులోనే ఈ మహారాష్ట్ర అమ్మాయి ఈ అరుదైన రికార్డు సాధించడం మరో విశేషం. దూకుడుగా ఎత్తులకు పైఎత్తులు వేస్తూనే.. కీలక సమయాల్లో ఒత్తిడి దరిచేరనీయకుండా ప్రశాంతంగా ఉండటం దివ్యలోని అరుదైన లక్షణం. ప్రత్యర్థి ఎంతటివారైనా ఏమాత్రం తడబాటుకు లోనుకాకుండా తన పనిని పూర్తి చేయడంలో ఆమె దిట్ట.అందుకే భారత చదరంగ మహారాణిగా వెలుగొందుతున్న 38 ఏళ్ల హంపిని కూడా.. ఇంత చిన్నవయసులోనే దివ్య ఓడించగలిగింది. క్లాసిక్ గేమ్స్ను డ్రా చేసుకున్న దివ్య.. ర్యాపిడ్ రౌండ్స్లో మాత్రం చక్కటి ప్రదర్శనతో ఆద్యంతం సానుకూల దృక్పథంతో ముందుకు సాగి చాంపియన్గా అవతరించింది.అసలైన ‘హీరో’కు కూడా క్రెడిట్ఈ నేపథ్యంలో దివ్య దేశ్ముఖ్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ తదితరులు దివ్యను కొనియాడగా.. తాజాగా వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ జాబితాలో చేరారు. అయితే, ఆయన దివ్యను ప్రశంసిస్తూనే ఆమె వెనుక ఉన్న అసలైన ‘హీరో’కు కూడా క్రెడిట్ ఇవ్వడం విశేషం.ఈ మేరకు.. ‘‘ఫిడే ప్రపంచకప్-2025 విజేత దివ్య దేశ్ముఖ్. ఈ విజయంతో ఆమె గ్రాండ్ మాస్టర్ హోదాను కూడా పొందింది. పందొమిదేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించింది.అయినా, ప్రతీ గ్రాండ్ మాస్టర్ వెనుక ఓ తల్లి ఉంటుంది. ఎంతో మంది ఇలాంటి స్టార్ల వెనుక అన్సంగ్ హీరోగా నిలబడిపోతుంది’’ అంటూ దివ్య దేశ్ముఖ్ తన తల్లి నమ్రతను ఆలింగనం చేసుకున్న వీడియోను ఆనంద్ మహీంద్ర పంచుకున్నారు.ఇక ఆయన వ్యాఖ్యలతో నెటిజన్లు కూడా ఏకీభవిస్తున్నారు. ఈ సందర్భంగా చెన్నై చెస్ స్టార్లు ఆర్.ప్రజ్ఞానంద, ఆర్.వైశాలిల తల్లి నాగలక్ష్మిని గుర్తుచేస్తూ అమ్మలకు సెల్యూట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.దివ్య భావోద్వేగంప్రపంచకప్ గెలవగానే దివ్య తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ‘‘ఈ విజయానుభూతిని ఆస్వాదిస్తున్నాను. దీని నుంచి తేరుకునేందుకు ఇంకా కొంత సమయం పడుతుంది. ఇక్కడికి వచ్చే ముందు నాకు ఒక్క జీఎం నార్మ్ కూడా లేదు.నేను ఎప్పుడు నార్మ్ సాధిస్తానో అని ఆలోచించేదాన్ని. కానీ ఇక్కడ ఇలా గ్రాండ్మాస్టర్ కావాలని నాకు రాసి పెట్టి ఉంది. నాకు ఈ ఆనందంలో మాటలు రావడం లేదు. ఈ విజయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. నా దృష్టిలో ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు ఇంకా ఇలాంటివి చాలా సాధించాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొంది. ఇక ఫైనల్ గెలవగానే తల్లి నమ్రతను హత్తుకుని దివ్య ఆనందభాష్పాలు రాల్చింది. ఆ తల్లి కూడా విజయగర్వంతో ఉప్పొంగిపోయింది. కాగా మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన దివ్య దేశ్ముఖ్ తల్లిదండ్రులు నమ్రత, జితేంద్ర దేశ్ముఖ్. వీరిద్దరూ డాక్టర్లే!చదవండి: ‘కోహ్లిపై వేటుకు సిద్ధమైన ఆర్సీబీ.. అతడి స్థానంలో మాజీ క్రికెటర్’ Divya Deshmukh, the Winner of the 2025 FIDE Women’s World Cup.Through this victory she also achieves Grandmaster status. At the age of 19. And behind the Grandmaster is the caring mother…As always, the unsung hero behind many stars…pic.twitter.com/9AyeBBPbM5— anand mahindra (@anandmahindra) July 28, 2025

గౌతమ్ గంభీర్కు వార్నింగ్ ఇచ్చిన పిచ్ క్యూరేటర్.. తనదైన శైలిలో ఫైరైన టీమిండియా హెడ్ కోచ్
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్కు వేదికైన కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఇవాళ (జులై 29) ఘర్షనాత్మక వాతావరణం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినట్లు సమాచారం. HEATED ARGUMENT BETWEEN INDIA'S HEAD COACH GAUTAM GAMBHIR & OVAL STADIUM'S PITCH CURATOR. 🥶🤯 (PTI).pic.twitter.com/WX9R9fWvQ8— Tanuj (@ImTanujSingh) July 29, 2025ఫోర్టిస్పై గంభీర్ ఫైరవడానికి గల అసలు కారణాలు తెలియనప్పటికీ.. పిచ్ ప్రిపరేషన్ విషయంలో వాగ్వాదం తలెత్తినట్లు సోషల్మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియోల ద్వారా తెలుస్తుంది.పిచ్పై అతిగా పచ్చిక అమర్చడాన్ని గంభీర్ వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ విషయమై గంభీర్ ఫోర్టిస్ను సంప్రదించగా తలబిరుసుగా సమాధానం చెప్పాడట. Gautam Gambhir has a heated argument with The Oval stadium's pitch curator. 🤯 (Raysportz).pic.twitter.com/RbTyMGcDSV— Tanuj (@ImTanujSingh) July 29, 2025దీంతో చిర్రెత్తిపోయిన గంభీర్ ఫోర్టిస్పై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడని సమాచారం. ఓ దశలో ఫోర్టిస్ గంభీర్పై ఫిర్యాదుకు ధమ్కీ ఇచ్చాడని.. ఇందుకు ప్రతిగా గంభీర్ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో అని అన్నాడని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది.గంభీర్ ఫోర్టిస్పై ఫైరవుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండ్ అవుతుంది. వీడెవడో పోయి పోయి గంభీర్తో పెట్టుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గంభీర్ ముక్కోపి అన్న విషయం తెలిసిందే. అతనికి కోపం వస్తే తనా మనా అని చూడడు. ఇది గతంలో చాలా సందర్భాల్లో చూశాం. 2024 ఐపీఎల్ సందర్భంగా గంభీర్ విరాట్ కోహ్లి లాంటి దిగ్గజ ఆటగాడిని కూడా వదిలిపెట్టలేదు.కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ కోసం ఓవల్ మైదానంలో దట్టమైన పచ్చికతో పిచ్ను తయారు చేసినట్లు తెలుస్తుంది. దీని వల్ల ఇంగ్లండ్ పేసర్లకు అదనపు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ఇందుకే గంభీర్ క్యూరేటర్తో గొడవ పడి ఉండవచ్చు.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో మొదటి, మూడు టెస్ట్లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో టెస్ట్లో విజయం సాధించింది. తాజాగా జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు వీరోచితంగా పోరాడి ఇంగ్లండ్ గెలుపును అడ్డుకున్నారు. జులై 31 నుంచి ఐదో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఇంగ్లండ్ గెలిచినా లేదా డ్రా అయినా సిరీస్ వారి వశమే అవుతుంది.

సెంచరీ కొట్టిన ఆడమ్ జంపా.. నాలుగో ఆస్ట్రేలియన్ ప్లేయర్గా రికార్డు
ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. 33 ఏళ్ల జంపా పొట్టి ఫార్మాట్లో ఆసీస్ తరఫున 100 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో ఆసీస్ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. జంపాకు ముందు గ్లెన్ మ్యాక్స్వెల్ (121), డేవిడ్ వార్నర్ (110), ఆరోన్ ఫించ్ (103) మాత్రమే ఈ ఘనత సాధించారు.ఇవాళ (జులై 29) వెస్టిండీస్తో జరిగిన ఐదో టీ20 జంపా కెరీర్లో 100వ మ్యాచ్. ఈ మ్యాచ్లో జంపా ఓ మోస్తరుగా (3-0-20-1) రాణించి ఆసీస్ విజయంలో తనవంతు పాత్రను పోషించాడు. ఈ మ్యాచ్లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్ల సిరీస్ను 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. డ్వార్షుయిస్ (4-0-41-3), నాథన్ ఇల్లిస్ (3.4-0-32-2), ఆరోన్ హార్డీ (4-0-39-1), సీన్ అబాట్ (4-0-30-1), మ్యాక్స్వెల్ (1-0-6-1), జంపా (3-0-20-1) ధాటికి 19.4 ఓవరల్లో 170 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్లో షిమ్రోన్ హెట్మైర్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. రూథర్ఫోర్డ్ (35) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. కెమరూన్ గ్రీన్ (32), టిమ్ డేవిడ్ (30), మిచెల్ ఓవెన్ (37), ఆరోన్ హార్డీ (28 నాటౌట్) తలో చేయి వేయడంతో 17 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది (7 వికెట్లు కోల్పోయి). విండీస్ బౌలర్లలో అకీల్ హోసేన్ 3, జేసన్ హోల్డర్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు తీశారు.కాగా, ఈ సిరీస్కు ముందు విండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను కూడా ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తద్వారా భారత్ తర్వాత ఓ పర్యటనలో వరుసగా 8 మ్యాచ్లు (3 టెస్ట్లు, 5 టీ20లు) గెలిచిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. భారత్ 2017 శ్రీలంక పర్యటనలో వరుసగా 9 మ్యాచ్ల్లో గెలిచింది. విండీస్తో టీ20 సిరీస్ను వైట్ వాష్ చేయడంతో ఆసీస్ మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో టెస్ట్ హోదా కలిగిన జట్టును క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది.
బిజినెస్

పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. వరుసగా నాలుగు సెషన్ల నుంచి తగ్గుతున్న పసిడి ధరల్లో ఈ రోజు కూడా ఊరట లభించింది. సోమవారంతో పోలిస్తే మంగళవారం పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

బీఎస్ఎన్ఎల్ టారిప్లపై కీలక ప్రకటన
ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ టారిఫ్లను పెంచే యోచన లేదని కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. భారతదేశం అంతటా 4జీ వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. బీఎస్ఎన్ఎల్ త్వరలో టారిఫ్లను పెంచబోతుందనే వాదనలను తోసిపుచ్చుతూ మంత్రి ఈమేరకు స్పష్టత ఇచ్చారు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్లు (సీజీఎంలు) పాల్గొన్నారు.బీఎస్ఎన్ఎల్ ఎప్పటినుంచో 2జీ, 3జీ నెట్వర్క్ల్లో వాడుతున్న పాత చైనీస్ పరికరాలను స్వదేశీ 4జీ మౌలిక సదుపాయాలతో భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు మంత్రి పెమ్మసాని చెప్పారు. అయితే, ఎప్పటిలోపు దీన్ని పూర్తి చేస్తారో నిర్దిష్ట కాలపరిమితి తెలపలేదు. బీఎస్ఎన్ఎల్ 2జీ, 3జీ సేవలను దశలవారీగా నిలిపివేస్తున్నప్పటికీ, 5జీకి మారే ప్రణాళికలు మాత్రం ప్రస్తుతానికి లేవనే సంకేతాలు వెలువడుతున్నాయి.బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ప్రస్తుతం 4జీ సరిపోతుందని మంత్రి అన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా 4జీ నెట్వర్క్ను అందించడమే ప్రస్తుత ప్రాధాన్యమని పెమ్మసాని తెలిపారు. ఇతర టెల్కోల్లో 75 శాతం మంది వినియోగదారుల అవసరాలను 4జీ తీరుస్తుందన్నారు. స్వదేశీ 5జీ కోర్, అందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నాయని, ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నప్పుడే ఈ విషయంలో ముందుకెళ్తామన్నారు.మొబైల్ కస్టమర్ గ్రోత్, ఏఆర్పీయూ, ఫిక్స్డ్ వైర్లెస్ వంటి విభాగాల్లో ప్రతి సర్కిల్కు లక్ష్యాలు కేటాయించినట్లు చెప్పారు. ఏటా 20-30 శాతం ఆదాయ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ 1,00,000 స్వదేశీ 4జీ టవర్లను ఏర్పాటు చేసిందని, వీటి ఇంటిగ్రేషన్ ప్రక్రియ సవాలుతో కూడుకున్నదని మంత్రి అన్నారు. నోకియా, ఎరిక్సన్ వంటి గ్లోబల్ కంపెనీలకు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దశాబ్దాలు పట్టిందని, కానీ బీఎస్ఎన్ఎల్ కేవలం 2–3 ఏళ్లలోనే 90–95% సమస్యలను పరిష్కరించిందని తెలిపారు.ఇదీ చదవండి: క్లెయిమ్ చేయని డిపాజిట్లు రూ.67వేల కోట్లుమౌలిక సదుపాయాలను వేగవంతం చేయడం, పౌర కేంద్రీకృత సేవల పంపిణీని మెరుగుపరచడం, భారత టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ వ్యూహాత్మక పాత్రను బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని కేంద్రమంత్రి సింథియా చెప్పారు. కంపెనీ పరివర్తనను ఆయన ప్రశంసించారు. కస్టమర్ అనుభవం, ఆదాయ సృష్టిలో గణనీయమైన మెరుగుదల అవసరాన్ని నొక్కి చెప్పారు.

క్లెయిమ్ చేయని డిపాజిట్లు రూ.67వేల కోట్లు
బ్యాంక్ల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు (కాల వ్యవధి ముగిసిపోయినప్పటికీ వెనక్కి తీసుకోనివి) జూన్ చివరికి రూ.67,003 కోట్లకు చేరాయి. ఇందులో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రూ.58,330 కోట్లు ఉంటే, రూ.8,673.72 కోట్లు ప్రైవేటు బ్యాంకుల పరిధిలోనివి. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు.ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒక్క ఎస్బీఐలోనే అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.19,330 కోట్లుగా ఉన్నాయి. ఆ తర్వాత పీఎన్బీలో రూ.6,910 కోట్లు, కెనరా బ్యాంక్లో రూ.6,278 కోట్లు చొప్పున ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంకుల్లో రూ.2,063 కోట్లు క్లెయిమ్ లేకుండా పడి ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో రూ.1,609 కోట్లు, యాక్సిస్ బ్యాంకులో రూ.1,360 కోట్ల చొప్పున అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్గమ్ పోర్టల్ ద్వారా క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోవచ్చు. దేశంలోని దాదాపు 30 ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లోని క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలు ఇందులో పొందుపరిచారు.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ సర్వీసుల నిలిపివేతఅన్క్లెయిమ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకునేందుకు ముందుగా..ఉద్గమ్ పోర్టల్(https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login)ను సందర్శించాలి.రిజిస్టర్ బటన్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి రిజిస్టర్ అవ్వాలి.మీ పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి.రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి.తర్వాత పేజీలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులను ఎంచుకోవాలి.ధ్రువీకరణ కోసం పుట్టిన తేదీ, ఓటరు ఐడీ, పాస్ పోర్ట్ నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు వంటి వివరాలు ఇవ్వాలి.ఒకవేళ అన్క్లెయిమ్ డిపాజిట్లు ఉంటే అన్క్లెయిమ్ డిపాజిట్ రిఫరెన్స్ నంబర్ (యూడీఆర్ఎన్) వస్తుంది.ఈ పోర్టల్ ద్వారా ప్రతి బ్యాంకుకు క్లెయిమ్ సూచనలు వెళుతాయి.యూడీఆర్ఎన్ ద్వారా బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది.

మైక్రోసాఫ్ట్ సర్వీసుల నిలిపివేత
రష్యన్ కంపెనీలపై యూరోపియన్ యూనియన్ ఆంక్షల నేపథ్యంలో నయారా ఎనర్జీకి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలు నిలిపివేసింది. దీనితో గతంలోనే పుర్తిగా చెల్లించి, లైసెన్సులను కొనుగోలు చేసినప్పటికీ సొంత డేటా, ఇతరత్రా టూల్స్ మొదలైనవి తమకు అందుబాటులోకి లేకుండా పోయాయని నయారా వెల్లడించింది. ఇలాంటివి చాలా ప్రమాదకర ధోరణులని ఆందోళన వ్యక్తం చేసింది.మైక్రోసాఫ్ట్ ఏకపక్షంగా, హఠాత్తుగా సర్వీసులను నిలిపివేయడంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు వివరించింది. సర్వీసులను పునరుద్ధరించేలా ఆదేశించాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసినట్లు పేర్కొంది. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాను కట్టడి చేసే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నయారా ఎనర్జీపై కూడా యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలు విధించింది. ఇదీ చదవండి: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!అయితే, ఇవి ఈయూ చట్టాల పరిధిలోకే వస్తాయి తప్ప మైక్రోసాఫ్ట్లాంటి అమెరికన్ కంపెనీలకు, భారతీయ సంస్థలకు వర్తించవని నయారా ఎనర్జీ తెలిపింది. రిఫైనింగ్ సామర్థ్యంలో 8 శాతం, రిటైల్ పెట్రోల్ బంకుల నెట్వర్క్లో ఏడు శాతం వాటాతో భారత ఇంధన భద్రతలో తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని వివరించింది.
ఫ్యామిలీ

12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!
నచ్చిన రంగంలో రాణించాలని ఎంతో ప్రయాసపడతారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని డ్రీమ్ సాధించుకుందామనే తరుణంలో ఊహకందని మలుపు తీసుకుంటుంది జీవితం. అనుకోని ఆ యూటర్న్ని జీర్ణించుకోలేక సతమతమవుతారు చాలామంది. కానీ కొందరు జీవితంలో ఇలాంటివి భాగమే అని సానుకూల దృక్పథంతో ఆ అవాంతరం లేదా ఆపదను జయించి అనుకున్న కలను సాకారం చేసుకుని స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి గాథే ఈ యువకుడి కథ. అతడి స్టోరీ ఆద్యంతం ఆసక్తికరంగానూ..స్పూర్తిదాయకంగానూ ఉంటుంది. అతడే పరాస్ బజాజ్. 12వ తరగతికే చదవుకి స్వస్తి పలికాడు. చదవు కంటే ఫిటెనెస్ పట్ల పరాస్కి మక్కువ ఎక్కువ. ఆ ఇష్టంతోనే చదువుని మధ్యలోనే ఆపేసి ఢిల్లీలోని ఫిట్నెస్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. అక్కడ ఫిట్నెస్ అంటే.. శారీరక పరివర్తన మాత్రమే కాదు, క్రమశిక్షణతో బాధ్యతగా మెలిగేలా చేసే ఒక ప్రక్రియ అని పరాస్ గుర్తిస్తాడు. తాను సరైన రంగాన్ని ఎంచుకున్నానని భావించి కొద్దికాలంలోనే దానిపై మంచి పట్టు సాధించి..ఇతరుల ఫిట్నెస్ లక్ష్యాలను సాధించడంలో సాయం అదించే స్థాయికి చేరుకున్నాడు. అలా అతడు ఆ ఫిట్నెస్ రంగంలో అచిరకాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ నమ్మకంతో ప్రభుత్వ స్టార్టప్ కింద రుణం తీసుకుని మరీ ఉత్తరాఖండ్లోని సితార్గంజ్లో సొంతంగా జిమ్ను ప్రారంభించాడు. అంతా హాయిగా సాగిపోతుంది అనుకున్న తరుణంలో జీవితం ఊహించని విధంగా సవాలు విసిరింది. ఇలా సొంతంగా జిమ్ ప్రారంభించాడో లేదో జస్ట్ రెండు నెలలకే కేన్సర్ బారినపడ్డాడు. ఆ తర్వాత కీమోథెరపీ వంటి చికిత్సల కారణంగా..అప్పటి దాక మంచి ఫిట్గా ఉండే అతడి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. జుట్టు ఊడిపోయింది, మజిల్స్ తగ్గిపోయాయి, ఆఖరికి ఒంట్లో శక్తి కూడా సన్నగిల్లినట్టుగా రోజువారి పనులు చేయలేనంత బలహీనమైన దయనీయ స్థితికి వచ్చేశాడు. ఏదిఏమైతేనేం కఠినమైన శస్త్రచికిత్సలతో ఏప్రిల్ 30,2024న కేన్సర్ని జయించాడు. అది అతడిలో ఏ మూలనో దాగి ఉన్న ఆశకు కొత్త ఊపిరిని పోసింది. కేవలం శస్త్ర చికిత్స చేయించుకున్న ఒకటిన్నర నెలకే జిమ్కి తిరిగి వచ్చి..తనను తాను మరింత స్ట్రాంగ్ మెన్గా మార్చుకోవాలనుకున్నాడు. ఆ ఉద్దేశ్యంతోనే బాడీ బిల్డింగ్పై ఫోకస్ పెట్టి వివిధ విభాగాలలో బరువులను ఎత్తడంపై కసరత్తులు చేశాడు. అలా 220 కిలోల బరువుని ఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ కేన్సర్ తన శరీరంపై గాయంలా కాకుండా..మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునే గుర్తుగా మలచాలన్నా.. ఆలోచన ఈ విజయానికి దారితీసింది. అంతేగాదు తనలా ఇలా చిన్నవయసులోనే కేన్సర్తో బారినపడుతున్న వాళ్లకు ఒక స్ఫూర్తిగా నిలబడేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు సగర్వంగా తెలిపాడు. అదీగాక తాను వెనుదిరిగి చూసుకున్నప్పడల్లా..తన ఒంటిపై మిగిలిని కేన్సర్ గుర్తులు తనను మరింత బలవంతుడిగా మార్చిందే తప్ప..తన కలను దూరం చేయలేకపోయిందని అంటాడు పరాస్. ఈ కష్ట సమయం తనకు ఓ గుణ పాఠాన్నినేర్పందని చెబుతున్నాడు. ప్రతిదీ మార్చగలమనే సంకల్పం బలంగా ఉంటే దేన్నైనా సులభంగా ఉన్నతికి మార్గంగా మార్చుకోవచ్చని అంటాడు పరాస్. నెటిజన్లు సైతం అతడి సంకల్పానికి ఫిదా అయ్యి, అతడిపై ప్రశంసల జల్లులు కురిపిస్తూ..పోస్టులు పెట్టారు. (చదవండి: World Hepatitis Day: ఐబ్రోస్ థ్రెడింగ్తో ఇంత ప్రమాదమా..! ఏకంగా కాలేయంపై..)

ఈ గింజలతో మెకాళ్ల నొప్పి, అధిక బరువుకు చెక్ !
ఒక వయసు పెరిగిన తరువాత, ప్రస్తుతం ఆధునికకాలంలో మారిన జీవనశైలి కారణంగా కీళ్లు (Cartilage) అరిగి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు చాలామంది.కొందరికి నడవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. అయితే ఈ నొప్పులకు పెయిన్కిల్లర్స్తో తాత్కాలిక ఉపశమనం లభించినా, అవి ఎక్కువ కాలం వాడలేం. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయామోనని భయం. అందుకే తేలికపాటి వ్యాయామం, కొన్ని ఆయుర్వేద చిట్కాలతో మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా మహాబీర గింజల ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.అసలు మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి?సాధారణంగా మోకాళ్లలోని రెండు ఎముకల మధ్య గుజ్జు Cartilage కరుగిపోతుంది. ఇలా రెండు ఎముకల మధ్య ఉండే ఈ గుజ్జు పూర్తిగా కరిగిపోతే నడవడం, మెట్లు ఎక్కడం కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి కింద కూర్చుని లేవడం కూడా కష్టం. అలాగే మోకాళ్లలో తీవ్రమైన నొప్పి, మంట వంటివి కలుగుతుంటాయి. దీన్నే ఆర్థరైటిస్ అని పిలుస్తారు.మోకాళ్లలో గుజ్జు పెరగడానికి స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా వంటి రకరకాల వ్యాయామాలతో పాటు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నొప్పిగా ఉంది కదా అని భయపడకూడదు. మెల్లిగా నడక లాంటి వ్యాయామాలు చేస్తూ, కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలను చేయాలి. (Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే!)మహాబీర గింజలు- ప్రయోజనాలుమహాబీర గింజలువీటినే వనతులసి గింజలు అంటారు. తులసి జాతికి చెందిన మొక్కల ద్వారా వచ్చిన గింజలు. చూడటానికి సబ్జా గింజలలాగానే కనిపించే ఈ మహాబీర గింజలు ఆయుర్వేద దుకాణాల్లో లభిస్తాయి. వీటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి తినడం మోకాళ్లలో నొప్పి తగ్గుతుంది. మహాబీర విత్తనాల్లో క్యాల్షియం, విటమిన్ డి, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు జీర్ణక్రియ మెరుగువుతుంది. వెయిట్లాస్కు కూడా ఉపయోపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఇవి చర్మ సంబంధింత ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఒత్తిడి, శ్వాసకోశ రుగ్మతలు తగ్గడానికి కూడా మహాబీర గింజలు ఉపయోగపడతాయి.మహాబీర విత్తనాల్లో వున్న యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీరాడికల్స్తో పోరాడి కేన్సర్ వంటి వాటిని నిరోధిస్తుంది.మహాబీర గింజలను ఎలా వాడాలి?ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ మహాబీర గింజలు వేసి ఎనిమిది గంటల పాటు నాన బెట్టాలి. ఉదయాన్నే పరగడుపున అలాగే తీసుకోవాలి. గింజలు బాగా నమిలాలని ఆయుర్వేదం చెబుతోంది.ఇంకా నిమ్మరసంలో, పెరుగులో లేదంటే సలాడ్లు, స్మూతీలు వంటి వాటిలో వీటిని కలుపుకుని తినచ్చు. ప్రతి రోజు క్రమం తప్పకుండా తిన్నారంటే మోకాళ్ల నొప్పుల సమస్యలు తగ్గుముఖం పడతాయి. వీటి పౌడర్ను నూనెలో కలిపి నొప్పి ఉన్న ప్రదేశాలలో రాస్తారు.మహాబీర చెట్టు ఆకుల రసాన్ని చర్మవ్యాధులైన గజ్జి, తామర నివారణలో కూడా వాడతారు. ఎవరు తినకూడదు: మహాబీర విత్తనాలు ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతాయి. థైరాయిడ్ సమస్యలను కలిగించవచ్చు, కాబట్టి, గర్భిణీ స్త్రీలు, థైరాయిడ్ ఉన్నవారు తీసుకోకుండా ఉండటం మంచిది. గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం కేవలం అవగాహనకోసమే అని గమనించాలి. మోకాళ్ల నొప్పి గల కారణాలను వైద్యుల ద్వారా నిర్ధారించుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్యలకు వైద్యుడిని సంప్రదించి, వారి సలహా మేరకు మాత్రమే చికిత్స తీసుకోవడం మంచిది.ఇదీ చదవండి: Today tips : బొద్దింకలతో వేగలేకపోతున్నారా?

ముద్దుల తనయకు గణపతి బప్పా ఆశీర్వాదం : న్యూ డాడ్ సిద్ధార్థ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ముద్దుల కుమార్తె కోసం ఆదివారం ఆలయంలో ప్రార్థనలు చేసి గణపతి బప్పా ఆశీర్వాదం తీసుకున్నారట. తన తల్లి రిమ్మా మల్హోత్రాతో సిద్ధి వినాయకుణ్ణి సందర్శించారు. దీనికి సంబంధించినొకవీడియో నెట్టింట ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది.ఆలయ సందర్శనకు సంబంధించిన అనేక వీడియోలు ఆన్లైన్లో కనిపించాయి. ఒక ఛాయాచిత్రకారుడు షేర్ చేసిన క్లిప్లో, సిద్ధార్థ్ నీలిరంగు కుర్తా ,బ్లాక్డెనిమ్ ధరించి సిద్దార్థ్, పింక్ సూట్లో తల్లి రిమ్మా గణపతిని దర్శించుకున్నారు. భక్తితో చేతులు జోడించి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి పూజారి దేవుని పాదాల దగ్గరి పూమాలను వారికి ఇచ్చారు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal)s="text-align-justify"> కాగా స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara advani)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాఫీ విత్ కరణ్ సీజన్ 8లో కనిపించిన కియారా, ఇటలీలోని రోమ్లో సిద్ధార్థ్ మల్హోత్రా తనకు ప్రపోజ్ చేశాడని వెల్లడించింది. షేర్షా సినిమా షూటింగ్ సమయంలో డేటింగ్లో ఉన్న వీరిద్దరూ 2023, ఫిబ్రవరి 7న రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో వివాహం జరిగింది. ఈ జంట జూలై 16న తమ తొలి సంతానానికి (ఆడబిడ్డ) జన్మనిచ్చారు.

100 ఏళ్లకు పెళ్లి, 103వ బర్త్డేకి తీరనున్న డ్రీమ్ : లైఫ్ సీక్రెట్ అదేనట!
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన రెండవ ప్రపంచ యుద్దంలోని పాల్గొన్న హెరాల్డ్ టెరెన్స్ (Harold Terens) ఈ ఏడాది ఆగస్టుకి 103 ఏట అడుగు పెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా పెంటగాన్లో తన బార్ మిట్జ్వా (Bar Mitzvah)ను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నాడు. తద్వారా 13 ఏళ్ల నాటి డ్రీమ్ను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అసలేంటీ బార్ మిట్జ్వా? అతని కోరిక ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలో.తన 102వ పుట్టిన రోజు సందర్భంగా తాతగారు ఈవిషయాన్ని ప్రకటించారు. యుక్త వయస్సులో స్వీకరించాలని కలలుగన్న బార్ మిట్జ్వా (యూదుల ఆచారం)ను తన తదుపరి పుట్టినరోజు సందర్భంగా స్వీకరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. యూదు మతాన్ని అనుసరించే తల్లి పోలాండ్కు చెందిన వారు కాగా, రష్యాకు చెందిన చెండికి మతాలంటే ఇష్టం ఉండదు. ఈ దంపతులకు రెండో సంతానంగా పుట్టాడుహెరాల్డ్ టెరెన్స్. బార్ మిట్జ్వా అంటే ?బార్ మిట్జ్వా అనేది యూదు సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. ఇది 13 ఏళ్ల వయసు వచ్చిన యూదు బాలుడు తన మతపరమైన నైతిక బాధ్యతలను స్వీకరించే సందర్భాన్ని బార్మిట్జ్వా అంటారు. ‘మిట్జ్వోట్’ అంటే ‘మత ఆజ్ఞలు’ అని, ‘బార్’ అనే హీబ్రూ అంటే ‘కుమారుడు’ అని అర్థం. సాధారణంగా బార్ మిట్జ్వా వేడుకలో బాలుడు సినగాగ్లో తోరా (యూదు మత గ్రంథం) నుండి ఒక భాగాన్ని చదువుతాడు లేదా హాఫ్తారా పఠిస్తారు. ఈ సందర్భం బాలుడు సమాజంలో పెద్దవాడిగా గుర్తింపు పొందే సందర్భంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే తాను కూడా బార్మిట్జ్వా స్వీకరించాలని భావిస్తున్నానని తెలిపారు. ఇప్పటికే హెరాల్డ్ సోదరుడు తల్లి మతవిశ్వాసాలను అనుసరిస్తూ యుక్త వయస్సులోనే బార్ మిట్జ్వాను స్వీకరించారు. తల్లి తండ్రుల విశ్వాసాల కారణంగా అప్పుడు నెరవేర్చుకోలేకపోయిన కలను,ఇన్నాళ్ల తర్వాత తన 103 ఏట బార్ మిట్జ్వా పొందాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 6న వాషింగ్టన్ డీసీ (Washington DC)లోని పెంటగాన్ (Pentagon)లో అతడి బార్ మిట్జ్వా జరగనుంది.ఇంకో విశేషం ఏమిటంటేగత ఏడాది 100 ఏళ్ల వయసులో 97 ఏళ్ల జీన్ స్వెర్లిన్ను వివాహం చేసుకుని ఈయన వార్తల్లో నిలిచాడు. నార్మాండీలో జరిగిన వివాహం, తన జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటన అని గుర్తు చేసుకున్నాడు. నీ లైఫ్లో అదే మధురమైందన్నాడు. లైఫ్ ఒక అందమైన కథ లాంటిది. తన జీవితాన్ని పూర్తిగా జీవించాలీ అంటే ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో నేర్చుకుంటే చాలు తిరుగు ఉండదు. కనీసం పదేళ్లు ఆయువు జోడించుకున్నట్టే అంటారాయన. ఒత్తిడి లేని జీవితం నంబర్ వన్ అయితే, రెండోది 90 శాతం అదృష్టం అంటూ తన లైఫ్ రహస్యాన్ని పంచుకున్నాడు.అంతేకాదు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కూడా టెరెన్స్ చాలా సార్లు మృత్యువు నుంచి బయటపడ్డాడు. ఇరాన్లో ఒక రహస్య మిషన్లో ఒకసారి, లండన్ పబ్లో జర్మన్ రాకెట్ నుండి తప్పించుకున్నాడట. తన జీవితం "ఒక పెద్ద అద్భుత కథ" అని అతను పేర్కొన్నాడు మరియు తన జీవితాన్ని పూర్తిగా జీవించాలని అనుకున్నాడు. "ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో మీరు నేర్చుకోగలిగితే, మీరు చాలా దూరం వెళ్తారని నేను అనుకుంటున్నాను. మీరు మీ జీవితానికి కనీసం 10 సంవత్సరాలు జోడిస్తారు. కాబట్టి అది నంబర్ వన్. మరియు 90% అదృష్టం," అని అతను చెప్పాడు, సుదీర్ఘమైన, సంతోషకరమైన జీవితానికి తన రహస్యాన్ని పంచుకున్నాడు. కాగా హెరాల్డ్ టెరెన్స్ 1942లో US ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో చేరాడు . P-47 థండర్బోల్ట్ ఫైటర్ స్క్వాడ్రన్కు రేడియో రిపేర్ టెక్నీషియన్గా పనిచేశాడు. 1944లో D-డే నాడు, అతను ఫ్రాన్స్ నుండి తిరిగి వచ్చే విమానాలను మరమ్మతు చేయడంలో సహాయం చేశాడు. ఆ తరువాత నార్మాండీ నుండి విముక్తి పొందిన యుద్ధ ఖైదీలను ఇంగ్లాండ్కు రవాణా చేయడంలో సహాయం చేశాడు. జూన్ 2024లో, నాజీ ఆక్రమణ నుండి దేశం విముక్తి పొందిన 80వ వార్షికోత్సవం సందర్భంగా ఫ్రెంచ్ ప్రభుత్వం అతన్ని సత్కరించింది.
ఫొటోలు
అంతర్జాతీయం

‘దయ చూపండి.. మా అమ్మ ఉరిశిక్షను ఆపండి’
యెమెన్ దేశంలో ఓ హత్య కేసులో ఇరుక్కుని జీవన్మరణ పోరాటం చేస్తున్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియను కాపాడేందుకు కుటుంబ సభ్యులు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజులు క్రితం ఆమెకు పడాల్సిన ఉరిశిక్ష చివరి నిమిషంలో రద్దు కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు నిమిష. బ్లడ్మనీ(క్షమాధనం లేక నష్టపరిహారం) ఇచ్చేందుకు కూడా సిద్ధమైన తరుణంలో ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది. అయితే బాధిత తలాల్ అబ్దో మెహదీ కుటుంబం మాత్రం తమకు బ్లడ్మనీ వద్దని ఇప్పటికే తెగేసి చెప్పింది. ఆమెకు శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. దాంతో నిమిష ఉరిశిక్ష రద్దు అనేది పక్కకు పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా నిమిష కూతరు 13 ఏళ్ల మిషెల్ తన తల్లియందు దయ చూపించాలని యెమెన్ అధికారుల్ని వేడుకోంటుంది. ఈ మేరకు మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో తల్లిని రక్షించాలంటూ ప్రాధేయపడుతోంది. ‘ఐ లవ్ యూ మమ్మీ. ఐ మిస్ యూ. మా అమ్మను తిరిగి వెనక్కి పంపడానికి సాయం చేయండి. మా అమ్మ పట్ల దయ చూపండి. తలాల్ కుటుంబానికి థాంక్స్ చెప్పేందుకు మిషెల్ ఇక్కడ ఉంది. మీరు మా అమ్మపై కరుణ చూపి అక్కడ నుంచి విడుదలకు మార్గం చూపండి. రేపు, రేపు మరుసటి రోజు మీ పట్ల మేము చాలా కృతజ్ఞులమై ఉంటాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు’ అని వేడుకుంటోంది. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్తో కలిసి నిమిష ప్రియ కుటుంబ సభ్యులు యెమెన్లో తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే కేఎ పాల్తో కలిసి నిమిష కూతురు మిషెల్ మీడియాతో మాట్లాడింది.

ఫలించిన ట్రంప్ దౌత్యం.. థాయ్-కంబోడియా తక్షణ కాల్పుల విరమణ
ఆసియా దేశాలు థాయ్-కంబోడియా తాజా సరిహద్దు ఘర్షణలకు ఎట్టకేలకు ముగింపు పడింది. ఇరు దేశాలు ఎలాంటి షరతులు లేకుండా తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన మలేషియా ప్రధాని అన్వర్ అబ్రహీం సోమవారం ప్రకటించారు.ఈ ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతున్నదే. అయితే.. ఈ ఏడాది మే చివరి వారంలో కంబోడియన్ సైనికుడి కాల్చివేత ఘటన నుంచి 817 కిలోమీటర్ల సరిహద్దు వెంట ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాల పరస్పర ఆరోపలతో దాడులను మొదలై.. తీవ్రతరం అవుతూ వచ్చాయి. ఈ క్రమంలో.. గత నాలుగైదు రోజుల ఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన 34 మంది మరణించగా, లక్షా 68వేల మంది నిర్వాసితులు అయ్యారు. దీంతో యుద్ధం ఆపేందుకు థాయ్-కంబోడియా నేతలతో తాను మాట్లాడానని, వారు చర్చలు జరిపేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారని జులై 26వ తేదీన సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో.. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్యవర్తిత్వం చేసేందుకు ముందుకొచ్చారు. ఆయన ఆహ్వానం మేరకు పుత్రజయ(మలేషియాలో)లోని ఇబ్రహీం నివాసంలో సోమవారం థాయ్ తాత్కాలిక ప్రధాని పుమ్తామ్ వేచాయచాయ్, కంబోడియా ప్రధాని హున్మానెట్ సమావేశయ్యారు. ఈ భేటీకి చైనా, అమెరికా రాయబారులు కూడా హాజరయ్యారు. భేటీ తర్వాత మలేషియా ప్రధాని అన్వర్ ఇరు దేశ ప్రధానుల చేతులను చేతిలో ఉంచి సంధి కుదిర్చినట్లు ప్రకటించారు. ట్రంప్ ప్రతిపాదన మేరకు ఇరు దేశాల ప్రధానులం కాల్పుల విరమణకు అంగీకరించాం అని కంబోడియా ప్రధాని హున్మానెట్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. అయితే సోమవారం చర్చల సమయంలోనూ ఇరు దేశాల సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగినట్లు సమాచారం.ఇరుదేశాల ఘర్షణలు దేనికంటే..ప్రాచీన హిందూ దేవాలయాలు అయిన తా మోయాన్ థామ్, 11వ శతాబ్దపు ప్రేహ్ విహార్ ఆలయాలు ఇరు దేశాల సరిహద్దు వివాదాలకు కేంద్రంగా ఉన్నాయి. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ప్రేహ్ విహార్ ఆలయాన్ని కంబోడియాకే చెందుతుందని తీర్పు ఇచ్చింది. అయితే.. థాయ్లాండ్ ఆ తీర్పును ఖండిస్తూ ఇచ్చింది. 2008లో UNESCO వారసత్వ ప్రదేశంగా నమోదు చేయాలన్న ప్రయత్నం తర్వాత ఇరు దేశాల ఉద్రిక్తతలు పెరిగాయి.2025 మే నెల చివర్లో నుంచి సరిహద్దు వివాదం ముదరసాగింది. ఈ క్రమంలో ప్రైవేట్గా సంధి కోసం ప్రయత్నించిన పేటోంగ్టార్న్ షినవత్రా.. కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్కి ఫోన్ కాల్ చేసి ‘అంకుల్’ అంటూ మాట్లాడింది. ఆ కాల్ రికార్డ్ బయటకు రావడంతో.. అనూహ్యంగా ఆమె పదవి నుంచి వైదొలగాల్సి(సస్పెండ్) వచ్చింది. ఈ తరుణంలో.. జూన్లో కంబోడియా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని వివాద పరిష్కారానికి కోరింది. థాయ్లాండ్ మాత్రం న్యాయస్థాన అధికారాన్ని అంగీకరించలేదు, ద్వైపాక్షిక చర్చలే సరైన మార్గమని పేర్కొంది.

బ్యాంకాక్లో కాల్పుల కలకలం
బ్యాంకాక్: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో సోమవారం ఓ వ్యక్తి ఐదుగురిని కాల్చి చంపాడు. వ్యవసాయ ఉత్పత్తులతోపాటు ఆహారాన్ని విక్రయించే ఓర్ టోర్ కోర్ మార్కెట్లో ఈ ఘటన జరిగింది. నలుగురు సెక్యూరిటీ గార్డులను, ఒక మహిళను కాల్చి చంపిన దుండగుడు చివరకు తనను తాను కాల్చుకున్నాడు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. బ్యాంకాక్లోని ప్రధాన పర్యాటక కేంద్రంగా సందర్శకులను ఆకటుఏ్టకునే చతుచక్ మార్కెట్కు కొద్ది దూరంలోనే ఈ ఓర్ టోర్ కోర్ మార్కెట్ ఉంది. దుండగుడు వరుస కాల్పులు జరుపుతుండగా ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెత్తుతున్న దృశ్యం, మృతదేహాలు వీధిలో చెల్లా చెదురుగా పడి ఉన్న దృశ్యం మార్కెట్ సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో కనిపించింది. కాల్పుల తర్వాత నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని, అతడిని గుర్తించడానికి పోలీసులు ప్రయతి్నస్తున్నారు. ప్రస్తుతం థాయ్లాండ్, కంబోడియా మధ్య సరిహద్దు ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఘర్షణలకు, కాల్పులకు ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. థాయిలాండ్లో కాల్పులు చాలా సాధారణం. నియంత్రణ అమలులో లోపాల కారణంగా ఇక్కడ తుపాకీలు పొందడం చాలా సులభం. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ తుపాకీ హింస విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది మేలో థాయ్లాండ్లోని యు థాంగ్ జిల్లాలో 33 ఏళ్ల వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ముగ్గురు మరణించారు. 2023 అక్టోబర్లో బ్యాంకాక్లోని సియామ్ పారగాన్ మాల్లో 14 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు.చాలా మంది గాయపడ్డారు. 2022 అక్టోబర్లో జరిగిన మరో దారుణ సంఘటన జరిగింది. థాయ్ మాజీ పోలీసు ఒకరు పిల్లల సంరక్షణ కేంద్రంలో జరిపిన కాల్పుల్లో 24 మంది పిల్లలు సహా దాదాపు 36 మంది మరణించారు. #BreakingNews A shooting incident occurred in Bangkok, Thailand, leaving 6 people dead, according to Thai police. The gunman opened fire in the A.T.K. market and later committed suicide.photo footage @CIBThailand #กราดยิง #Thailand #Bangkok pic.twitter.com/AsbACMKdMH— 鳳凰資訊 PhoenixTV News (@PhoenixTV_News) July 28, 2025

ముగ్గురు భర్తల ముద్దుల పెళ్లాం!
ఒక వ్యక్తికి పలువురు భార్యలున్న కథలు మనం చాలానే విని ఉంటాం.. ఈమధ్యే హిమాచల్ యువతి ఆచారం ప్రకారం అన్నదమ్ముల్ని మనువాడడం చూశాంమహాభారతంలోని ‘‘పాంచాలి.. పంచ భర్తుక’’ అన్నట్టు కాదు కానీ...ఒక మహిళకు ముగ్గురు భర్తలుండటం గురించి మీరెప్పుడైనా విన్నారా?విని ఉండరు లెండి. ఎందుకంటే ఆమె ఉండేది టాంజానియాలో మరి!. ఇక్కడో విశేషం ఏంటంటే.. ముగ్గురు భర్తలుండటం కాదు, వాళ్లందరి పోషణ బాధ్యత తనే తీసుకోవడం!. ఎంచక్కా.. ఎలాంటి కీచులాటలూ లేకుండా అందరూ ఒకే ఇంట్లో కాపురం కొనసాగిస్తూండటం!. ఆ విశేషాలేవో చూసేద్దాం రండి..నెల్లి... టాంజానియా సరిహద్దులోని ఒకానొక పట్టణంలో ఉంటోంది. కార్లు అమ్మడం, కొనడం వృత్తి. బాగా సక్సెస్ఫుల్ కూడా. ఎనిమిదేళ్ల కాలంలో ఈమె వరుసగా ముగ్గురిని పెళ్లి చేసుకుంది. అంతకంటే ముందు కూడా ఒక భర్త ఉండేవాడు. కానీ.. ఓ కారు ప్రమాదంలో అతడు మరణించాడు. ఆ తరువాత ఒంటరిగానే ఉండాలని అనుకుంది. కానీ.. మరణించిన భర్త తమ్ముడు హసన్ ఆమె పంచన చేరాడు. మొదటి భర్తకు పుట్టిన పిల్లల పెంపకంలో చేదోడు వాదోడుగా ఉన్నాడు. కొంతకాలానికి ఈ వ్యవహారం కాస్తా ప్రేమకు ఆ తరువాత పెళ్లికి దారితీసింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. కొన్నేళ్లు గడిచాయో లేదో.. ఆమె జీవితంలోకి ‘జిమ్మీ’ ఎంటరయ్యాడు. ఇతగాడు అప్పట్లో బాగా డిప్రెషన్లో ఉండేవాడట. తనకు ఎవరూ లేరన్న ఫీలింగ్తో బాధపడేవాడు. పాపం అనుకుందేమో నెల్లీ అతడిని రెండో మొగుడిగా స్వీకరించింది. ఇది జరిగిన కొంత కాలానికి నెల్లీకి డానీ పరిచయమయ్యాడు. అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకున్న డానీ ఉద్యోగం వేటలో ఉన్నాడు. దొరుకుతుందో లేదో అన్న బెంగ, దొరకదేమో అన్న అత్మనూన్యత భావం డానీని వెంటాడేవట. ఈ నేపథ్యంలో నెల్లీ అతడికి ధైర్యం చెప్పేది. ఆ తరువాత ఇతడిని మూడో భర్తగా స్వీకరించింది!అందరూ ఒకే ఇంట్లో..నెల్లీ, అమె ముగ్గురు భర్తలు కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఒకొక్కరికి ఒక్కో బెడ్రూమ్ కూడా ఉంది. ప్రస్తుత ముగ్గురు భర్తలూ నిరుద్యోగులు. దీంతో కార్ల డీలర్గా నెల్లీ సంపాదిస్తున్న దాంతోనే కుటుంబ నడుస్తోంది. ముగ్గురిలో ఎవరితో ఎంత సేపు గడపాలన్న విషయంలో నెల్లీ మాటే చెల్లుతుంది. వారానికి తగిన షెడ్యూల్ వేసుకుని ఆ ప్రకారం వారితో గడుపుతానంటోంది నెల్లీ. ‘‘ముగ్గురు భర్తలూ నాకు సమానమే. అందరినీ ఒకేలా చూసుకుంటా. వాళ్లు కూడా ఎంతో అనోన్యంగా ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ అని పిలుచుకుంటారు కూడా’’ అంటుంది నెల్లీ. హసన్, జిమ్మీ, డానీలు కూడా తమ ఉమ్మడి భార్య విషయంలో సంతోషంగానే ఉన్నారు. ఈ ఏర్పాటు బాగానే ఉందని చెబుతున్నారు. ‘‘మగాడికి ఎక్కువ మంది భార్యలున్నప్పుడు లేని అభ్యంతరం.. ఒక మహిళకు ఎక్కువమంది భర్తలుంటే ఎందుకుండాలి?’’ అని ఎదురు ప్రశ్నిస్తాడు జిమ్మీ. చిక్కులూ లేకపోలేదు..నెల్లీ వ్యవహారం టాంజానియాలో కొంతమేరకు చిక్కులు సృష్టించింది. చట్టం ప్రకారం ఈ దేశంలో బహుభార్యత్వం తప్పు కాదు కానీ.. బహుభర్తృత్వం(Polyandry) మాత్రం తప్పు. కేసు పెడితే నెల్లీకి మూడేళ్ల జైలు శిక్ష పడవచ్చునని టాంజానియా లాయర్ ఒకరు చెబుతున్నారు. అంతేకాదు.. నెల్లీ ఇరుగుపొరుగు కూడా ఈ వ్యవహారంపై చెవులు కొరుక్కుంటూనే ఉన్నారు. అయితే ఒక్కటైతే స్పష్టం. మానవ సంబంధాలన్నవి అంత సులువుగా అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం అని!!:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా
జాతీయం

అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యూయార్క్ సెంట్రల్ మాన్హట్టన్లో జరిగిన ఈ కాల్పుల ఘటనలో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారితో సహా ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. సీఎన్ఎస్ నివేదిక ప్రకారం కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వెగాస్కు చెందిన 27 ఏళ్ల షేన్ తమురాగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కూడా గాయాలతో మృతిచెందాడని పోలీసులు తెలిపారు.గ్రాండ్ సెంట్రల్ స్టేషన్, రాక్ఫెల్లర్ సెంటర్, మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్లకు సమీపంలోని మిడ్టౌన్ మాన్హట్టన్లోని రద్దీగా ఉండే ప్రాంతంలోని ఒక భవనంపైకి కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతంలో లాక్డౌన్ విధించారు. ఈ ప్రాంతంలో పలు ఫైవ్ స్టార్ హోటళ్లు, కోల్గేట్-పామోలివ్, ఆడిటింగ్ సంస్థ కేపీఎంజీతో సహా పలు కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలన్నాయి. మేయర్ ఎరిక్ ఆడమ్స్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఈ దాడిపై విచారం వ్యక్తం చేశారు. పోలీసు అధికారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.4 people, including NYPD officer, killed in shooting at Manhattan office building. https://t.co/7Fj8zQKr5b— Ground News (@Ground_app) July 29, 2025పోలీసులు ‘ఎక్స్’లో పార్క్ అవెన్యూలో జరిగిన ఘటనలో నిందితుడు మృతి చెందాడని, అతని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఘటన జరిగిన అనంతరం ఆ స్థలాన్ని తమ స్వాధీనంలోనికి తీసుకున్నామని, ఒంటరి షూటర్ను చుట్టుముట్టామని పోలీసు కమిషనర్ జెస్సికా టిష్ ‘ఎక్స్’ లో రాశారు. ఫాక్స్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనలో ఒక పోలీసు అధికారితో సహా కనీసం ఆరుగురిపై కాల్పులు జరిగాయని, ఆ అధికారి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. సాయంత్రం రద్దీ సమయంలో పార్క్ అవెన్యూ సమీపంలో అధికారులు ఉన్న సమయంలో కొందరు సాయుధులు, బాలిస్టిక్ షర్టులను ధరించి కాల్పులు జరిపారని సమాచారం.

డాగ్ బాబు సన్నాఫ్ కుత్తా బాబు!
పట్నా: బిహార్లో రెవెన్యూ అధికారులు ఓ శునకానికి రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేశారు. డాగ్ బాబు పేరిట ఈ నివాస ధృవీకరణ పత్రం జారీ అయింది. ఇందులో అభ్యర్థి పేరు డాగ్బాబు అని, అతని తండ్రి పేరు కుత్తా బాబు, తల్లి పేరు కుత్తియా దేవి అని రాసి ఉంది. వీళ్ల ఇంటి చిరునామా కాలమ్లో ‘మొహల్లా కౌలిచక్, వార్డు నంబర్–15, నగర పరిషత్, మసౌరీ పట్టణం’’అని రాసి ఉంది. గోల్డెన్ రిట్రీవర్ జాతి వీధి శునకం ఫొటోతో ఈ ధృవపత్రం జారీచేశారు. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్పై అక్కడి రెవెన్యూ అధికారి మురారీ చౌహాన్ డిజటల్ సంతకం ఉంది. ఇది 2025 జూలై 24న ఈ సర్టిఫికేట్ను జారీచేశారు. సంబంధిత ప్రభుత్వ పోర్టల్లో ఆన్లైన్లో ప్రత్యక్షమవడంతో ఈ అంశం ఇప్పుడు బిహార్లో చర్చనీయాంశమైంది. ఢిల్లీకి చెందిన ఒక మహిళ పత్రాలకు ఈ సర్టిఫికేట్ జారీ కోసం దురి్వనియోగం చేసినట్లు తెలుస్తోంది. బిహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) నేపథ్యంలో శునకానికీ రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీకావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఎస్ఐఆర్ ఆమోదం పొందుతున్న సర్టిఫికెట్లలో ఇలాంటి వింతలు ఎన్నో ప్రత్యక్షమవుతున్నాయని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ‘మీరే చూడండి. జూలై 24వ తేదీన ఒక శునకానికి బిహార్లో నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ఆమోదం పొందుతున్న సర్టిఫికెట్లలో చాలా వరకు ఇలాంటివి ఉన్నాయి. అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్న ఓటర్లకు గతంలో జారీ అయిన ఆధార్, రేషన్ కార్డులు నకిలీవని అధికారులు ఓవైపు చె బుతూనే మరోవైపు ఇలా శునకాలకు నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు’’అని విమర్శకులు సంబంధిత శునకం సర్టిఫికెట్ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్చేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్గా మారింది. సర్టిఫికెట్ జారీపై అంతటి విమర్శలు రావడంతో పట్నా జిల్లా మేజి్రస్టేట్ వెంటనే స్పందించారు. ‘మసౌరీ జోన్లో డాగ్ బాబు పేరుతో నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేసిన అధికారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం. దోషులైన ఉద్యోగులు, అధికారులపై శాఖాపరమైన, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం’’అని జిల్లా మేజి్రస్టేట్ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్ చేశారు.

డిసెంబర్లో రోబోట్ సహిత అంతరిక్ష నౌక ప్రయోగం
సాక్షి, చెన్నై: రోబోట్తో కూడిన మొదటి అంతరిక్ష నౌకను డిసెంబర్లో ప్రయోగించనున్నామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. చెన్నై విమానాశ్రయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 30వ తేదీన శ్రీహరి కోట నుంచి నాసా సహకారంతో ఇస్రో నిషార్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఆయన చెప్పారు. ఇందులోని ఎస్–బ్యాండ్ సింథటిక్ యాక్సిలేటర్ పూర్తిగా దేశీయంగా తయారు కాగా, మరో ఎల్బ్యాండ్ సింథటిక్ యాక్సిలేటర్ అమెరికాలో తయారైందని వివరించారు. సింథటిక్ ఎపర్చర్ రాడార్(ఎస్ఏఆర్) ఉపగ్రహం 24 గంటలు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమికి సంబంధించి చక్కటి ఫొటోలను తీస్తుందన్నారు. సహజ వనరులు, కొండ చరియలు విరిగి పడే విపత్తులను గుర్తిస్తుందన్నారు. ఇది 12 రోజులకోసారి మొత్తం భూమి చిత్రాన్ని తీసి భారత్తోపాటు అన్ని దేశాలతో పంచుకుంటుందన్నారు. మానవ రహిత రోబోట్తో కూడిన అంతరిక్ష నౌకను శ్రీహరికోటలో సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. 2027లో మానవ సహిత అంతరిక్ష యాత్రపై దృష్టి పెట్టనున్నామన్నారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆమోదం తెలిపారని, చంద్రయాన్ –4 పనులు చురుగ్గా జరుగుతున్నాయని, చంద్రయాన్–5 పైనా ఇక దృష్టి పెడుతామని నారాయణన్ పేర్కొన్నారు.

ఎస్ఐఆర్పై స్టే ఇవ్వలేం
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియపై ఇప్పటికిప్పుడు మధ్యంతర స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పిన అత్యున్నత న్యాయస్థానం.. ఓటరు జాబితా సవరణకు ఆధార్తోపాటు ఓటరు గుర్తింపు కార్డును పరిగణనలోకి తీసుకోవాలని ఈసీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ధ్రువీకరణలను వాస్తవమై నవిగా భావిస్తున్నామంది. ‘రేషన్ కార్డులకు సంబంధించి చూస్తే వీటిని తేలిగ్గా ఫోర్జరీ చేయొచ్చు. కానీ, ఆధార్, ఓటర్ కార్డులను వాస్తవమైనవిగా భావించొచ్చు. ఈ రెండు ధ్రువీకరణలను అనుమతించండి’అని జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో తుది విచారణను ఈ నెల 29వ తేదీన చేపడతామని తెలిపింది. పిటిషనర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ అనే ఎన్జీవో తరఫున సీనియర్ లాయర్ గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపించారు. ఇప్పటికిప్పుడే మధ్యంతర జాబితాను ఖరారు చేయవద్దని, ఆగస్ట్ ఒకటో తేదీన ఈసీ ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించకుండా మధ్యంతర స్టే ఇవ్వాలని కోరారు. అయితే, దీనివల్ల మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియే నిలిచిపోతుందని పేర్కొన్న ధర్మాసనం ఆయన వాదనను తోసిపుచ్చింది. ‘న్యాయస్థానం అధికారాన్ని తక్కువగా చూడకండి. ఈ ప్రక్రియ చట్ట వ్యతిరేకమని తేలిన పక్షంలో మీ వాదనను అంగీకరిస్తాం. అప్పుడే ఎస్ఐఆర్ ప్రక్రియ ఆసాంతంగా రద్దు చేసేస్తాం’అని ధర్మాసనం కరాఖండిగా చెప్పింది. బిహార్లో చేపట్టిన ఎస్ఐఆర్కు ఆధార్తోపాటు ఓటరు ఐడీని అంగీకరించాలంటూ ఈసీని ఈ నెల 10వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. ఈ మేరకు ప్రాథమికంగా అంగీకరిస్తూ ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్ను సోమవారం ధర్మాసనం పరిశీలించి, పై వ్యాఖ్యలు చేసింది. ఆధార్, ఓటరు కార్డును అంగీకరిస్తూ ఈసీ అఫిడవిట్ వేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఈ సందర్భంగా లాయర్ శంకరనారాయణన్ తెలపగా.. ఎస్ఐఆర్ కోసం అంగీకరిస్తున్న 11 ధ్రువీకరణలతోపాటు ఆధార్, ఓటరు ఐడీ కూడా ఉంటాయని జస్టిస్ సూర్య కాంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈసీ తరఫున సీనియర్ లాయర్ రాకేశ్ ద్వివేది..ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని, అదేవిధంగా, ఓటరు ఐడీని ఓటరు సవరణ ప్రక్రియలో నమ్మకమైందిగా భావించలేమన్నారు. ఓటరు ఐడీని పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం ప్రక్రియతో ఎటువంటి లాభం ఉండదని పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం.. ‘ఈ ప్రపంచంలో ఏ ధ్రువీకరణ పత్రాన్నైనా ఫోర్జరీ చేయొచ్చు. ఫోర్జరీ కేసుల విషయాన్ని ఈసీ చూసుకోవాలి. అన్ని పేర్లను తొలగించడానికి బదులుగా అందరినీ జాబితాలో చేర్చేలా చూడాలి.
ఎన్ఆర్ఐ

బాలీవుడ్ తరహా ఈవెంట్లు, లగ్జరీ లైఫ్ : 100మందికి పైగా ముంచేసిన ఎన్ఆర్ఐ జంట
టెక్సాస్లోని ప్లానోకు చెందిన భారతీయ సంతతికిచెందిన దంపతులు రియల్ ఎస్టేట్ స్కామ్లో 100 మందికి పైగా వ్యక్తులను మోసం చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రియల్ ఎస్టేట్ నకిలీ పత్రాలతో భారీ స్కామ్కు పాల్పడ్డారు. రూ. 33 కోట్ల విలువైన పెట్టుబడి స్కాం ఆరోపణలపై వీరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.ఉత్తర టెక్సాస్లోని ఇండియన్-అమెరికన్ సమాజంలో సిద్ధార్థ సామీముఖర్జీ , అతని భార్య సునీత ప్రముఖ వ్యక్తులుగా చలామణి అయ్యారు. రియల్ ఎస్టేట్ ఒప్పందాలు, ఛారిటీలు ,బాలీవుడ్ తరహా ఈవెంట్లతో పాపులారిటీ సంపాదించారు. అలా రూ.33 కోట్లకు నమ్మినవారిని ముంచేశారు. రియల్ ఎస్టేట్ నకిలీ పత్రాలు , మహమ్మారి సహాయ నిధుల దుర్వినియోగం, ఇలా పలు రకాలు ఏళ్ల తరబడి మోసపూరిత ఆపరేషన్ను నిర్వహిస్తున్నారనే అభియగాలు నమోదైనాయి.ఈ జంట నకిలీ కంపెనీని ఉపయోగించి, ఫేక్ సాలరీ స్లిప్పుల ద్వారా పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (PPP) రుణాన్ని పొందారని ఆరోపించారు.ఈ జంట 2024లో దివాలా కోసం దాఖలు చేశారు. ఈ జంట 2024లో దివాలా కోసం దాఖలు చేశారు.ఇదీ చదవండి: షార్జాలో మరో విషాదం : బర్త్డే రోజే కేరళ మహిళ అనుమానాస్పద మరణంఈ జంట ఇచ్చిన చెక్లు బౌన్స్ కావడంతో వీరి బండారం వెలుగులోకి వచ్చింది. కనీసం 20 మంది బాధితులను గుర్తించారు. తొలుత ఈ కేసును విచారించిన డిటెక్టివ్లు ఆ తరువాత ఈ కేసును FBIకి అప్పగించారు. 100 మందికి పైగా వ్యక్తులను మోసంచేశారంటూ అమెరికా ఫెడరల్ దర్యాప్తు సంస్థలు ఈ జంటను అరెస్ట్చేశాయి. నిజానికి బాధితుల సంఖ్య 100 దాటవచ్చని అధికారులు భావిస్తున్నారు. తన 23 ఏళ్ల సర్వీసులు ఇంతటి మోసగాడిని చూదడలేదని డిటెక్టివ్ బ్రియాన్ బ్రెన్నాన్ వ్యాఖ్యానించారు. అరెస్టు తర్వాత, సామీ , సునీతా ముఖర్జీ ఇద్దరూ 5 లక్షల డాలర్ల చొప్పున బెయిల్ను దాఖలు చేశారు. సామీని తరువాత యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అదుపులోకి తీసుకుంది. డబ్బును క్రిప్టోకరెన్సీ ఖాతాలుగా మార్చారా అనే విషయాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. ముంబైలో ముంబైలో కూడా సామిపై మోసానికి పాల్పడినట్టు ఆరోపలున్నాయట. విషయంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.మరోవైపు ఈ తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, ముఖర్జీ దంపతులు ఈ ఏడాది మేలో అంటే అరెస్టుకు కొన్ని వారాల ముందు, ప్లానోలో ఎన్జీవీ పేరుతో విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ బాలీవుడ్ నటి హేమ మాలిని, ప్లానో మేయర్ సహా ఉన్నత స్థాయి అతిథులు హాజరు కావడం గమనార్హం.చదవండి:

లవ్ ప్రపోజల్ తిరస్కరించిన ఇండియన్ టెకీకి బాస్ చుక్కలు : నెటిజన్లు ఏమన్నారంటే
పనిప్రదేశాల్లో ఉద్యోగాలు చేసే మహిళలపై వేధింపులకు నిదర్శనం ఈ ఘటన. కావాలనే జీతాలు పెంచకపోవడం, ప్రమోషన్లు నిరాకరించడం, జీతం ఆలస్యంగా ఇవ్వడం ఇలాంటివి సాధారణంగా కొంతమంది ఉద్యోగులెదుర్కొనే వేధింపులు. దీనికి అదనంగా మహిళలు లైంగిక వేధింపులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తన వేధింపుల పర్వంపై ఇండియన్ టెకీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.10 మంది ఉద్యోగులతో కూడిన ఒక చిన్న యూరోపియన్ టెక్ కంపెనీ అది. అలాంటి కంపెనీలో భారతీయ టెక్ రిమోట్గా పనిచేస్తోంది. అయితే ఆమెకు వివాహితుడైన మేనేజర్ ఒక అభ్యంతరకర ప్రపోజల్ పెట్టాడు. దీన్ని ఆమె అంగీకరించలేదు. అంతే అతగాడి వేధింపులు మొదలైనాయి. బాస్ ఇన్డైరెక్ట్గా పెట్టిన ప్రేమ ప్రతిపాదన తిరస్కరించిన తర్వాత తనను వృత్తిపరంగా లక్ష్యంగా చేసుకోవడం మొదలు పెట్టాడని రెడ్డిట్లో ఆరోపగించింది. చీటికి మాటికి కోపగించుకోవడం, పురుష సహోద్యోగులతో మాట్లాడుతున్నా కూడా సహించేవాడు కాదు. వృత్తిపరంగా, జీతాల జాప్యం, ఆమె చేయని తప్పులకు బహిరంగంగా మందలింపులు లాంటివి కూడా ఎదుర్కొన్నానని తెలిపింది. తన ప్రతీ పనినీ, ప్రతీ కదలికను ప్రశ్నించడం, అవమానించడం, అతనికి పరిపాటిగా మారిపోయిందని వాపోయింది. ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నాడు. గతంలో, రెండు రోజులు సెలవు అడిగినా ఇచ్చేవాడని, దీనికి తన పనితీరు, టాలెంటే కారణమని భావించాను కానీ, దాని వెనుకున్న అతని దుర్బుద్ధి ఇపుడు అర్థమవుతోందని తెలిపింది. ఇంత జరుగుతున్నా, ఈ ఉద్యోగాన్ని వదల్లేను. ఎందుకంటే..రిమోట్గా వర్క్ చేసుకోడానికి అవకాశం ఉంది.ఈ సమయంలో తన కుటుంబానికితన అవసరం చాలా ఉంది. కానీ ఈ వేధింపులో భరించలేనిదిగా మారుతున్నాయి. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్ గొప్పగా లేదు, కాబట్టి మారడం కష్టం అని ఆమె పేర్కొంది.దీనిపై నెటిజన్లు చాలా మంది ఆమెకు సంఘీభావం తెలుపుతూ, కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం మారితేనే మంచిది. ఎందుకంటే ఎవరికి కంప్లయింట్ చేసినా. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు Prevention of Sexual Harassment (POSH) కేసు పనిచేస్తుందని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే HRలు కంపెనీల కోసం పనిచేస్తాయి తప్ప ఉద్యోగుల కోసం కాదు. కాబట్టి వీలైతే ఉద్యోగం మారిపోండి అని మరికొందరు సలహా ఇచ్చారు.‘‘నీ పని నువ్వు చూస్కో.. అనవసర మెసేజ్లు జోలికి పోకు. మరో ఉద్యోగం దొరికేవరకు జాగ్రత్తగా ఉండు’’ అని ఒకరు, ‘‘మున్ముందు పరిస్థితి మరింత టాక్సిక్గా మారుతుంది. మీ మెంటల్ హెల్త్ను కాపాడుకోండి’’ అని ఒకరు, ఇది చేదు నిజం.ఉద్యోగం మారడం ఒక్కటే ఆప్షన్ మరొకరు సూచించారు. మొత్తానికి ఆమె పోస్ట్ కార్యాలయంలో వేధింపుల గురించి ఆన్లైన్లో చర్చకు దారితీసింది. చాలామంది మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని , సురక్షితమైన ఆఫీసు వాతావరణాన్ని కోరుకోవాలని సూచించారు.

డల్లాస్లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంచ్
అమెరికాలోని డల్లాస్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ గా రీ లాంఛ్ అయింది. న్యూయార్క్, న్యూజెర్సీ నుండి వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, కాలిపోర్నియా, చికాగో, నార్త్ కరోలినా, అట్లాంటా, ఫ్లోరిడా మొదలగు నగరాలతో పాటు నార్త్ అమెరికాకు నలుదిక్కులా విస్తరించి.. పుట్టిన నేల నుంచి పెరిగిన గడ్డ వరకు.. ప్రవాసులకు అండగా.. మరింత చేరువగా.. సరికొత్తగా ఆవిష్కృతం అయింది సాక్షి టీవీ నార్త్ అమెరికా. టెక్సాస్, ఫెయిర్వ్యూ లోని సౌత్విండ్ ఎల్ఎన్ వేదికగా ఈ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. అమెరికా, భారత జాతీయగీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఈవెంట్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా, సాక్షి టీవీ స్టాప్, యాడ్ అమిరిండో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ AAA నుంచి రఘు వీరమల్లు , పవన్ కుమార్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, అసోసియేషన్ హెడ్స్, సబ్జెక్టు మేటర్ ఎక్స్పర్ట్స్, తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్లే చేసిన సాక్షి టీవీ నార్త్ అమెరికా AVని ప్రవాసులు ఎంతో ఆకసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ USA కి ప్రవాసులు తమ శుభాకాంక్షలు తెలిపారు.నార్త్ అమెరికాకు నలుదిక్కుల వ్యాప్తి చెంది.. US లో నెంబర్ 1 నెట్వర్క్ గా రూపాంతరం చెంది.. ప్రవాసుల గొంతుకగా Sakshi TV USA నిలుస్తోందని కె.కె. రెడ్డి పెర్కొన్నారు. డల్లాస్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్ అవటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాక్షి టీవీ ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరించారు. ఇక సాక్షి టీవీ ఎన్నారై ప్రత్యేక కార్యక్రమాల గురించి సింహా వివరించారు. అమెరికాలో ప్రవాసుల గొంతుకగా నిలుస్తోన్న సాక్షి టీవీని పలువురు ప్రముఖులు కొనియాడారు. సాక్షి ఎన్నారై కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రవాసులు సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్ ఈవెంట్ పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కె.కె. రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ నార్త్ అమెరికాను అందరూ ఆదరించాలని కోరారు.

అమెరికా నాసా ఎన్ఎస్ఎస్ ఐఎస్డీసిలో సత్తా చాటిన విద్యార్థులు
బంజారాహిల్స్: అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన ఐఎస్డీఎస్ కాన్ఫరెన్స్లో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని శ్రీ చైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని దసపల్లా హోటల్లో నాసా ఏర్పాటు చేసిన ఐఎస్డీఎస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి 475 మంది విద్యార్థులు హాజరైతే అందులో 67 మంది భారత దేశం నుంచి పాల్గొనగా 45 మంది శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులే ఉండటం తమకు గర్వకారణంగా ఉందని అన్నారు. అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో అంతర్జాతీయ స్థాయిలో 60 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకొని తాము వరల్డ్ నెం1.గా నిలిచామని తెలిపారు. వీటిలో వరల్డ్ ఫస్ట్ ప్రైజ్ 3 ప్రాజెక్టులు, వరల్డ్ సెకండ్ ప్రైజ్ 4 ప్రాజెక్టులు, వరల్డ్లో మూడో ప్రైజ్ కింద 10 ప్రాజెక్టులు గెలుచు కోవడంతో పాటు 43 ప్రాజెక్టులకు హానరబుల్ మెన్షన్స్ సాధించాయని తెలిపారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి మరే ఏ ఇతర పాఠశాల నుంచి విద్యార్థులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనలేదన్నారు.ఈ కాన్ఫరెన్స్లో ఆర్టిస్టిక్ కేటగరిలో 500 డాలర్ల బహుమతి అందుకున్న ఏకైక టీం తమదేనని ఆమె వెల్లడించారు.
క్రైమ్

ఫోన్లో యువకుడితో మాట్లాడుతోందని..
హైదరాబాద్: సెల్ఫోన్లో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆవేశానికి లోనైన ఓ తమ్ముడు అక్క గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాఘవేంద్ర, సునీత దంపతులకు రుచిత (21), రోహిత్ (20) వైష్ణవి (18) సంతానం. పెద్ద కూతురు రుచిత ఇటీవలే డిగ్రీ పూర్తి చేసి, ఎంబీఏలో చేరేందుకు సిద్ధమవుతోంది. రుచిత ఇదే గ్రామానికి చెందిన దినేశ్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయంలో పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగ్గా, ఒకరితో ఒకరు మాట్లాడకూడదని తీర్మానించుకున్నారు. తల్లిదండ్రులు పని నిమిత్తం ఉదయాన్నే బయటకు వెళ్లగా.. ఉదయం 11 గంటలకు తమ్ముడు రోహిత్ ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో రుచిత ఫోన్లో దినేశ్తో మాట్లాడటాన్ని గమనించి అక్కతో వాగ్వాదానికి దిగాడు.ఇరువురి మధ్య మాటామాటా పెరిగి, ఆగ్రహానికి గురైన రోహిత్ గొంతు నులిమి సోదరిని హత్య చేశాడు. అనంతరం కొడిచర్లలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి, అక్కకు శ్వాస ఆడటం లేదని, కిందపడిపోయిందని చెప్పాడు. వారు వచ్చి పరిశీలించగా అప్పటికే రుచిత చనిపోయింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు దినేశ్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని షాద్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దినేశ్ కారణంగానే తన కూతురు చనిపోయిందని, మృతురాలి తండ్రి రాఘవేంద్ర ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నర్సింహారావు తెలిపారు.

ఆగని టీడీపీ నేత అకృత్యాలు
చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అధికారం అండతో రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలు, అకృత్యాలపై ఫిర్యాదు చేసిన బాధితులను మరింతగా వేధిస్తున్నారు. టీడీపీ హిందూపురం నాయకుడు యుగంధర్ అలియాస్ చింటు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పారిశుద్ధ్య కారి్మకురాలిని వేధించిన ఆడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో టీడీపీ నేతల తీరుపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం తీవ్రంగా స్పందించి బాధిత మహిళకు అండగా నిలిచింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.ఈ నేపథ్యంలో టీడీపీ మొక్కుబడి చర్యగా ఆడియోలో మాట్లాడిన కగ్గల్లప్ప, అతడి సోదరుడు నగేష్ కు పార్టినుంచి సస్పెండ్ చేసి, ప్రధాన నిందితుడైన చింటును మాత్రం వదిలేసింది. ఇప్పుడు చింటు బాధిత మహిళపై ప్రతీకార చర్యకు దిగారు. ఆమెను ఊరి నుంచి ఖాళీ చేసేయాలని ఒత్తిడి తీసుకురావడంతో పాటు చంపేస్తానని బెదిరించారు. దీంతో ఆమె పోలీసు స్టేషన్ను ఆశ్రయించింది. అక్కడా సీఐ స్పందించకపోవడంతో ఓ వీడియో ద్వారా తన ఆవేదనను బయటపెట్టింది. తనను చింటు వేధిస్తున్నాడని, ఇల్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నాడని, పోలీసులు పట్టించుకోవడంలేదని వాపోయింది. చింటు తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారా? మహిళలను వేధించే నాయకులకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారా అని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టి.ఎన్.దీపిక ప్రశ్నించారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ అధికార మదంతో మహిళను ఉద్యోగం నుంచి తొలగించి, లైంగిక వేధింపులకు పాల్పడిన టీడీపీ నేతలను జైలుకు పంపించాల్సింది పోయి.. నిందితుడైన వ్యక్తిని వెనకేసుకురావడం ఏమిటని నిలదీశారు. ఈ ఘటన జరిగిన తర్వాతే ఎమ్మెల్యే సతీమణి వసుంధరాదేవి హిందూపురంలో పర్యటించారని, నిందితుడి నుంచి బొకే తీసుకున్నారని గుర్తుచేశారు. అతడు మహిళను వేధించాడని తెలిసి కూడా చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. టీడీపీ కార్యకర్తలు మహిళల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బాధిత మహిళకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆమె తెలిపారు.బాధితురాలి ఆత్మగౌరవం దెబ్బతీసేలా సీఐ ప్రవర్తనటీడీపీ నేత నుంచి లైంగిక వేధింపులకు గురైన మహిళ పేరు, ఆమె భర్త పేరు, నివాస ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ హిందూపురం వన్టౌన్ సీఐ రాజగోపాల్నాయుడు వీడియో చేసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీలను కూడా జతచేసి పోస్ట్ చేయడం ద్వారా బాధితురాలి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సీఐ వ్యవహరించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఐ రాజగోపాల్నాయుడు ఆది నుంచి టీడీపీకి అనుకూలంగా ఉంటూ ఆ పార్టీ లీడర్లా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధితురాలి భద్రత, ఆత్మగౌరవాన్ని పట్టించుకోకుండా.. ఆమె గోప్యతకు భంగం కలిగిస్తూ టీడీపీ నేతల స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒంటరిగా వస్తేనే అంగీకరిస్తా..!
తమిళనాడు: వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి జీవించాలని ఆశ పడి బిడ్డను హత్య చేశానని మహిళ వాంగ్మూలం ఇచ్చింది. కోయంబత్తూర్, ఇరుకూరుకు చెందిన తమిళరసి (30). ఈమె భర్త రఘుపతి. వారికి అపర్ణశ్రీ(4) కుమార్తె ఉంది. రఘుపతి కొన్ని నెలల క్రితం భార్య నుంచి విడిపోయాడు. దీని తరువాత, తమిళరసి తన బిడ్డ అపర్ణశ్రీతో ఒంటరిగా నివసిస్తోంది. ఈమె కట్టడ నిర్మాణ పనులకు వెళుతుంటుంది .ఆ సమయంలో కట్టడ కారి్మకుడు ధర్మపురి జిల్లాకు చెందిన వసంత్ అనే వ్యక్తితో తమిళఅరసికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని బిడ్డను గొంతు నులిమి హత్య చేసింది. పోలీసులు తమిళరసిని అరెస్టు చేసి విచారణ జరిపారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ‘నా భర్త విడిపోయిన తర్వాత, వసంత్తో సంబంధం ఏర్పడింది. వసంత్ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఇందుకు బిడ్డ ఉంటే తాను అంగీకరించనని, ఒంటరిగా వస్తే తాను అంగీకరిస్తానని చెప్పాడు. పిల్లవాడిని హత్య చేయడం తప్ప తనకు వేరే మార్గం లేదని నిందితురాలు తెలిపింది. బిడ్డ హత్యకు ప్రేరేపించినందుకు వసంత్ను ఆదివారం అరెస్టు చేశారు.

సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, విజయవాడ: స్పష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే డాక్టర్ అట్లూరి నమ్రతతో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేసుల నేపథ్యంలో.. నగరంలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ను రాత్రికి రాత్రే ఎత్తేసినట్లు తెలుస్తోంది. సెంటర్కి ఉన్న బోర్డులను తొలగించడంతో పాటు సెల్లార్లో ఉన్న రెండు కార్లు మాయం అయ్యాయి. అదే సమయంలో..విజయవాడ సెంటర్కు అనుమతులు లేవని, అక్రమంగా నిర్వహిస్తున్నారని జిల్లా వైధ్యాధికారులు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సోమవారం ఉదయం సెంటర్కు ఉన్న బోర్డులు మాయం కావడం గమనార్హం. ఉదయం 11గం. అయినా సిబ్బంది సెంటర్కు రాలేదు. మరోవైపు ల్యాబ్ ఇంఛార్జి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై వచ్చిన ఆరోపణలపై అధికారులు చర్యలు సిద్ధం అవుతుండగా.. డాక్టర్ కరుణ, డాక్టర్ వైశాలి, మిగతా సిబ్బంది సైతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సెంటర్ వద్దకు చేరుకుని పరిశీలనలు జరుపుతున్నారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరొకరి వీర్యకణాలతో సంతానం కలిగించడం లాంటి గలీజు దందా ఓ కేసు ద్వారా బయటపడింది. సికింద్రాబాద్లో ఇది చోటు చేసుకోగా.. అటుపై విజయవాడ, విశాఖపట్నంలోసెంటర్లలోనూ ఇంతకు మించే వ్యవహారాలు జరిగాయని తేలింది. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి.. సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించే ప్రయత్నాలు జరిగాయని వెల్లడైంది. గతంలోనూ ఈ సెంటర్లపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి పిల్లలు లేని వారి నుంచి లక్షలు రూపాయలు వసూలు చేసింది డాక్టర్ నమ్రతా. ఢిల్లీకి చెందిన గర్భిణిని ఫ్లైట్లో విశాఖకు తీసుకొచ్చి .. కోల్కతాలోని ఓ దంపతులకు సరోగసి బిడ్డగా అప్పగించింది. ఇందుకుగానూ రూ.30 లక్షలు వసూలు చేసి.. ఇదే విధంగా కోట్ల రూపాయల దందా చేసినట్లు తేలింది. దీంతో ఆమెపై కేసు నమోదు కావడంతో పాటు సెంటర్లకు సీజ్ పడడం, ఆమె లైసెన్స్లు రద్దు కావడం జరిగిది. అయితే.. తీగలాగితే.. సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం ఘటనతో.. శనివారం ఉత్తర మండలం డీసీపీ సాధనరష్మి పెరుమాళ్, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వీర్య సేకరణ, ఐవీఎఫ్, సరోగసీ విధానం తదితర అంశాలను అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో విశాఖపట్నం, విజయవాడల్లోనూ సోదాలు చేపట్టారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కోల్కతాలలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీవారు బ్రాంచీలు నిర్వహిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఆసుపత్రి నిర్వాహకులపై గతంలో హైదరాబాద్ కేపీహెచ్బీ, గోపాలపురం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నమ్రత వైద్యురాలి లైసెన్స్ రద్దు చేసినా(గతంలో) మరొక వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసీ దందా కొనసాగిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ తరుణంలో.. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసుల ఆరాలు తీయగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. వ్యాపార అభివృద్ధి కోసం బీహార్ నుంచి పూజారులను రప్పించి మరీ 9 రోజులపాటు నమ్రత హోమాలు చేయించింది. బెజవాడ సృష్టిలో.. డాక్టర్ కరుణ, డాక్టర్ సోనాలి, డాక్టర్ వైశాలి ఆధ్వర్యంలో సెంటర్ను నమ్రత నడిపిస్తోంది. ఇటు విశాఖలోనూ మహారాణిపేట పీఎస్ పరిధిలోని సెంటర్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2023లోనే వీటి లైసెన్లు ముగిశాయి. అయినా కూడా రెండు ఫ్లోర్లలో అనధికార సెంటర్లు నడుపుతున్నట్లు గుర్తించారు. అక్కడి మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకుని.. కీలక రికార్డులు స్వాధీనపర్చుకున్నారు. ఇక్కడా ఇతర డాక్టర్ల లైసెన్స్ల మీద నమ్రత నడిపిస్తున్న దందా బయటపడింది. నమ్రతకు నమ్మిన బంటుగా కల్యాణి..విశాఖ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో మేనేజర్గా పని చేసిన కల్యాణి అరాచకాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపడంలో కల్యాణి నెట్ వర్క్ కీలకమని, వాళ్లకు బ్రెయిన్వాష్ చేయడంలో కల్యాణి సిద్ధహస్తురాలిగా మారిందని పోలీసులు గుర్తించారు. 2020 నుంచి నమ్రతతో కలిసి పని చేస్తున్న కల్యాణి.. గతంలో ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. అయితే ఈ ఐదేళ్లలో నర్సు నుంచి ఏకంగా ఓ యూనిట్ మేనేజర్గా ఆమె ఎదిగడం కొసమెరుపు.