ప్రశ్నించినందుకే పోలీసుల దాడి | Chandrababu Naidu Responsible For This Farmer's Death,Says YSRCP | Sakshi
Sakshi News home page

ప్రశ్నించినందుకే పోలీసుల దాడి

Feb 21 2019 7:00 AM | Updated on Mar 22 2024 11:14 AM

రైతు కోటయ్య మృతికి గల కారణాలను ఆయన భార్య, కోడలు, పిల్లలను అడిగి తెలుసుకున్నామని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కొండవీడు సంబరాల సందర్భంగా కోటయ్య 0.50 సెంట్ల స్థలాన్ని పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేసుకునేందుకు ఇచ్చాడని చెప్పారు. పోలీసులు కోటయ్య బొప్పాయి తోటలో కాయలు కోసి ధ్వంసం చేయడంతోపాటు కనకాంబరం తోటలో వాహనాలు తిప్పారని తెలిపారు. కోటయ్య అనుమతి లేకుండానే మునగ తోటలో చెట్లను తొలగించి, వాహనాల పార్కింగ్‌ కోసం చదును చేశారని అన్నారు. పోలీసుల ప్రవర్తన  చూసి రెండు రోజులుగా కోటయ్య తీవ్ర ఆవేదన చెందాడని వెల్లడించారు. అదేమిటని గట్టిగా ప్రశ్నించగా పోలీసులు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడని వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement