వరంగల్‌ జిల్లాలో విషాదం | Three children died after Swimming in Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌ జిల్లాలో విషాదం

Published Wed, Sep 27 2017 3:16 PM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని చెరువులో దుస్తులు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు బాలురు కాగా ఓ బాలిక ఉంది. జిల్లాలోని చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన గుంజేల అజయ్‌(10), సాయి(9), అఖిల(9) అనే ముగ్గురు చిన్నారులు ఉర చెరువులో దుస్తులు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement