warangal
-
వరంగల్ లో వెలుగులోకి కీచక లెక్చరర్ బాగోతం
-
వరంగల్ ఏకశిలా కాలేజీలో కీచక లెక్చరర్!
సాక్షి, వరంగల్: నగరంలో మరో కీచక లెక్చరర్ నిర్వాకం బయటపడింది. కొత్తవాడలోని ఏకశిలా జూనియర్ కళాశాలలో విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడు. బైపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని పట్ల లెక్చరర్ రమేష్ అసభ్యంగా ప్రవర్తించాడని బంధువులు ఆరోపిస్తున్నారు.యాజమాన్యానికి సమాచారం అందించిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం.. రమేష్ను కావాలనే తప్పిస్తున్నారని బంధువులు మండిపడుతున్నారు. కీచక టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
వరంగల్ పేరు ఎలా వచ్చిందంటే..?
ఖిలా వరంగల్: రాజులు పోయారు.. రాజ్యాలు అంతరించాయి. రాచరికపు వైభోగాలు కనుమరుగయ్యాయి. కానీ నాటి కట్టడాలు, జ్ఞాపకాలు నేటికీ చెక్కు చెదరలేదు. శతాబ్దాల చరిత్ర.. శత్రు దుర్బేధ్య నగరం.. శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది ఏకశిల కొండ. నాడు ఏకశిల నగరం, ఓరుగల్లుగా పలు పేర్లతో ప్రఖ్యాతిగాంచింది. కాలక్రమేణా దీనికి వరంగల్ (Warangal) పేరు స్థిరపడింది. వారసత్వ నగరంగా.. భారతదేశంలోని ఉత్తమ వారతస్వ నగరాల్లో ఒకటిగా ఓరుగల్లు (Orugallu) గుర్తింపు పొందింది. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరం. ఓరు.. అంటే ఒకటి, గల్లు.. అనే పదానికి రాయి అని అర్థాలున్నాయి. 11వ శతాబ్ధంలో ఈ అందమైన నగరాన్ని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని 300 ఏళ్లు కాకతీయులు పాలించారు. ఈ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. రాజధానిగా చెప్పుకుంటున్న ఖిలా వరంగల్ కోట అద్భుతమైన పురాతన కట్టడాలు, అనేక స్మారక చిహ్నాలు, వాస్తు శిల్ప కళా సంపదకు నిలయం. వరంగల్ పేరు ఎలా వచ్చిందంటే.. కాకతీయుల రాజధానిగా చెప్పుకునే ఖిలా వరంగల్ కోటలో ఏకశిల గుట్ట (ఎత్తయిన రాతి కొండ)గా ఉంది. ఏక (ఒక) శిల (రాయి) ఏకశిలా నగరం.. దీన్నే ఓరు (ఒకటి) గల్లు (రాయి) అని.. ఈ ఎత్తయిన కొండ పేరుతోనే ఓరుగల్లు నగరంగా పిలుస్తుంటారు. శతాబ్దాల కాలం నుంచి ఏకశిల, ఓరుగల్లు నగరం కనుమరుగై.. ప్రస్తుతం వరంగల్గా పేరొందింది. అందాల కొండ ఏకశిల గుట్టను ఎక్కి చూస్తే.. నగరంతోపాటు చుట్టు పక్క గ్రామాలు, కొండలు, గుట్టలు, కనువిందు చేస్తాయి. ఈకొండపై ఆలయం, బురుజు, సైనిక స్థావరం, విశ్రాంతి గదులు, ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి. ఈ కొండపై ఉన్న ఎత్తయిన బురుజుపై ఫిరంగి, భారీ తోపులు ఏర్పాటు చేశారు. శత్రు సైన్యం రాకను పసిగట్టినప్పుడు ఫిరంగులు, తోపుల్ని పేల్చడం వల్ల.. కోట చుట్టూ ఉన్న సైన్యం అప్రమత్తమయ్యేదని చరిత్రకారులు చెబుతున్నారు. కొండపై సైనిక స్థావరం హనుమకొండ పద్మాక్షి దేవాలయం కేంద్రంగా మూడు కొండలను ఏకం చేసి కాకతీయుల తొలి రాజధానిని ఏర్పాటు చేశారు. కాకతీమాత అనుగ్రహంతో గణపతి దేవ చక్రవర్తి 1199 నుంచి 1262 మధ్యకాలంలో రాజధానిని ఓరుగల్లుకు మార్చేసి 300 ఏళ్ల పాటు సుస్థిర పాలన అందించారు. తొలుత 3వేల ఆడుగుల ఎత్తయిన ఏకశిల కొండపై సైనిక స్థావరం ఏర్పాటు చేశారు. ఇందుకు కొండపై ఎత్తయిన బురుజే సాక్ష్యం. బురుజు ఎక్కేందుకు అంతర్భాగంలోనే వేర్వేరుగా మెట్ల మార్గాలు ఏర్పాటు చేశారు. మెట్ల మార్గం ఎక్కి చూస్తే నగరంతోపాటు చుట్టూ ఉన్న కొండలు గుట్టలు, అందమైన నగరం కనువిందు చేస్తాయి. బురుజుపై తోపులు పెట్టి పేల్చిన ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి. సైనికులు గాయపడకుండా.. నిలువెత్తు పటిష్టమైన నాలుగు రాళ్లు నాలుగు వైపులా నిలబెట్టి ఉంటాయి. దీనిపైకి పర్యాటకులు ఎక్కి.. రాతి కట్టడాలు.. ఆహ్లాదకర వాతావరణాన్ని తిలకించి ఆస్వాదిస్తున్నారు. సైనికులకు విశ్రాంతి గదులు ఆనాడు కొండపై సైనికులకు విశ్రాంతి గదులు నిర్మించారు. ఫిరంగుల్లో మందు నింపేందుకు ప్రత్యేక గదులు వేర్వేరుగా ఉండేవని చెబుతారు. ఈ నిర్మాణాలన్నీ 20 ఏళ్ల క్రితం వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆదరణ లేక శిథిలమై కూలిపోయాయి. ఈగుట్టపైకి రహస్య సొరంగ మార్గాలు ఉండేవని.. వాటి ద్వారా చేరుకుని సైనికులకు మార్గనిర్ధేశం చేసేవారని చరిత్రకారులు చెబుతున్నారు. చదవండి: ఇజ్రాయెల్లో తెలుగువారి ఇక్కట్లు అభివృద్ధికి దూరంగా.. ఏకశిల గుట్ట నేటికీ అభివృద్ధికి దూరంగా ఉంది. గుట్టపై విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. కనీసం ఐదువేల మంది ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. గుట్టపై పర్యాటకులు చల్లని వాతావరణం, ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ.. నగర అందాలను వీక్షిస్తూ సేదదీరుతుంటారు. కానీ గుట్టపై దాహార్తి తీరేందుకు మంచినీటి సౌకర్యం లేదు. మెట్ల మార్గం ద్వారా పర్యాటకులు ఎంతో కష్టపడి ఎక్కినా.. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు లేక అవస్థలు పడుతుంటారు. ఒకే రాయితో ఏర్పడిన సుందరమైన చారిత్రక గుట్టను ఆధునికీకరిస్తే.. పర్యాటకుల రాక మరింత పెరుగుతుందని, తద్వారా స్థానిక యువతకు స్వయం ఉపాధి మెరుగుపడుతుందని స్థానికులు భావిస్తున్నారు.కొండపై ఆలయంఏకశిల కొండపై అద్భుతమైన శిల్ప కళా సౌందర్యంతో కూడిన ఓ ఆలయం ఉంది. ఆలయంలో 28 స్తంభాలతో గర్భగుడి, విశాలమైన కల్యాణ మండపం ఉంది. శిల్ప కళా సౌందర్యంతో కనిపించే ఈ ఆలయ గర్భగుడి దేవతా విగ్రహాలు లేక బోసిపోయి కనిపిస్తోంది. ఆనాడు సైనికులు సైతం ఇక్కడ శివారాధన చేసిన తర్వాతే విధుల్లో చేరేవారని చారిత్రక నిపుణులు చెబుతున్నారు. -
రెడీ అవుతున్న వరంగల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్
సాక్షి, వరంగల్: శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. పెద్దపెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయి. ఇదే సిద్ధాంతంతో హైదరాబాద్, సైబరాబాద్ పోలీ సు కమిషనరేట్ల భవన నిర్మాణాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దడమే కాకుండా ఆధునిక సాంకేతికతతో కూడిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ (సీసీటీవీ కెమెరాల అనుసంధానం) సెంటర్లు ఏర్పా టు చేసి నేర నియంత్రణపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం.. వరంగల్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనుల విషయంలో అనుకున్నంత శ్రద్ధ కనబరచలేదు. ఫలితంగా మరో మూడు నెలలైతే నిర్మాణ పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతుంది. ప్రస్తుతమున్న వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎప్పటికప్పు డు పర్యవేక్షిస్తుండడంతో కొద్ది నెలల నుంచి పనుల్లో వేగిరం పెరిగింది. మరో రెండు నెలల్లో జీప్లస్ 5 అంతస్తులతో కూడిన భవనంలోని తొలి రెండు అంతస్తులను పూర్తిస్థాయి మౌలిక వసతులతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నారు. పూర్తిస్థాయి భవనం అందుబాటులోకి రావాలంటే ఈ ఏడాది ఆఖరు వరకు సమయం తీసుకునే అవకాశముందని కిందిస్థాయి పోలీసులు చెబుతున్నారు. ఇందులోనే కమిషనర్ కార్యాలయం, డీసీపీలు, అడిషనల్ డీసీపీ, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, కాన్ఫరెన్స్హాల్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, సిటీ స్పెషల్ డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇక్కడి నుంచే ‘కమాండ్’.. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు కా వాల్సిన డేటా సెంటర్ పరికరాలను జర్మ నీ, బెల్జియం నుంచి తెప్పించనున్నారు. ఇక్కడి నుంచే అన్ని సీసీ కెమెరాలను పో లీస్ అధికారులు పర్యవేక్షిస్తారు. ఇందుకు ఓ ఫ్లోర్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. మూడు విభాగాలుగా సీసీ టీవీ కెమెరాలను బిగించనున్నారు. సిటీవైడ్ సర్వేలైన్స్తోపాటు కమ్యూనిటీ సీసీ టీవీ కెమెరాలను అనుసంధానించనున్నారు.వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని ప్రధాన కూడళ్లతోపాటు పోలీస్స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలు అనుసంధానించడం ద్వారా ఎక్కడేం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ఈ సెంటర్ ద్వారా ఏదైనా నేరం జరిగిన సందర్భంలో నిందితులను పట్టుకునేందుకు సమన్వయం చేసే వీలుంటుంది. శాంతిభద్రతలు అదుపులో ఉంటాయి. 2017 మే 29న రూ.50 కోట్ల వ్యయంతో వరంగల్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత పనులు నింపాదిగా సాగడం, కరోనా రావడంతో కొన్ని నెలలపాటు పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత పోలీస్ కమిషనర్లు తరుణ్జోషి, ఏవీ రంగనాథ్తోపాటు ప్రస్తు త పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కాస్త దృష్టి సారించడంతో నిర్మా ణ పనులు పూర్తయ్యేందుకు వచ్చా యి. సాధ్యమైనంత తొందరలోనే తొలి రెండు అంతస్తుల్లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి’అని ఓ పోలీసు అధికారి తెలిపారు. -
తెలంగాణ వ్యాప్తంగా ఆగిన పత్తి కొనుగోళ్లు.. రైతులు ఆగ్రహం
వరంగల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. గత రెండ ోరోజులుగా సీసీఐ(కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) సర్వర్ పని చేయడం లేదని పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు తెలంగాణ రాష్ట్రంలో. దాంతో మార్కెట్ యార్డులలో వేల ట్రాక్టర్లు నిలిచిపోయాయి. దీనిపై పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ ఔన్ అంటూ సాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు. ప్రైవేట/ వ్యాపారులకు లాభం చేకూర్చేందుకు సర్వర్ డౌన్ పేరుతో పత్తి కొనుగోలు ఆపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబందంధి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
సడన్ టూర్.. నేడు వరంగల్కు రాహుల్ గాంధీ
సాక్షి, వరంగల్: నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్ చేరుకోనున్న రాహుల్.. చాపర్లో వరంగల్ చేరుకోనున్న రాహుల్.. వరంగల్ సుప్రభా హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లనున్నారు.కాగా, బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకొనున్నారు. రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. -
వరంగల్-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, వరంగల్: వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అధిక వేగంతో ఉన్న లారీ అదుపు తప్పి ఆటోలపై పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.వివరాల ప్రకారం.. ఖిల్లా వరంగల్ మామునూరు నాలుగో బెటాలియన్ సమీపంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఈ సందర్భంగా రెండు ఆటోలపై లారీ పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. మృతిచెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. అయితే, లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. -
National Voters Day: ‘ఓటు’.. ఎందుకీ తడబాటు?
ప్రతీ పౌరుడు ఓటు హక్కును ప్రాథమిక బాధ్యతగా స్వీకరించాలి. మొత్తం ఓటర్లలో కనీసం 90 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకోవాలి. 90 శాతం ఓటింగ్ జరిగితే దేశం ఎప్పుడూ అభివృద్ధి పథంలో పురోగమిస్తుంది. – అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి సాక్షి ప్రతినిధి, వరంగల్: భారత రాజ్యాంగంలోని 326 ఆర్టికల్ ప్రకారం 18 ఏళ్లు నిండిన జాతీయ పౌరులకు వయోజన ఓటుహక్కు(National Voters Day) కల్పించారు. కుల, మత, లింగ, ప్రాంత, ధనిక, పేద, వివక్ష లేకుండా అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించి.. ప్రపంచ రాజకీయ చరిత్రలో గొప్ప విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందే మనదేశంలో వయోజన ఓటింగ్ హక్కు కల్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసింది. అయితే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ.. అవినీతిని పారదోలే వజ్రాయుధం.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కు.. ఇలా ఎన్ని విశ్లేషణలు జోడించినా.. ఓటు వేస్తున్న వారి సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు వీలుగా.. వరసలో నిలబడి ఓటు వేయడానికి ఇంకా చాలామంది ఆసక్తి చూపడం లేదు. ఓటు వేసే విషయంలో గ్రామీణ ఓటర్లు మొగ్గు చూపుతున్నా.. పట్టణ, నగర ఓటర్లే తడబడుతున్నారు. ఓటర్ల నమోదు పెరుగుతున్నా.. ఓటింగ్ శాతం మాత్రం పెరగడం లేదు. తెలంగాణలో మూడు ఎన్నికలు.. 80 శాతం చేరని వైనం..1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో 45 శాతం ఓటర్లు మాత్రమే ఓటు(Vote) హక్కును వినియోగించారు. 2019 నాటికి 17వ లోకసభ ఎన్నికల్లో 66.4 శాతం మంది ఓటు వేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు పర్యాయాలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఏటా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల ఓటు నమోదు కోసం జిల్లాల అధికార యంత్రాంగం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎన్నికల సమయంలోనూ ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు చేపడుతోంది. కానీ.. ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు.. పోలైన ఓట్లు.. ఓటింగ్ శాతాలు పరిశీలిస్తే 80 శాతం చేరుకున్న దాఖలాలు లేవు. కేంద్ర ఎన్నికల సంఘం నివేదికల ప్రకారం.. తెలంగాణ ఏర్పడిన తొలి శాసనసభ (2014) ఎన్నికల్లో 2,81,65,885 మంది ఓటర్లకు 1,94,43,411 మంది (69.0 శాతం) ఓటు వేశారు. 2018లో 79.67 శాతం ఓట్లు పోల్ కాగా, 2023లో 71.37 శాతంగా నమోదైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు భారీ వ్యత్యాసం..తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో భారీ వ్యత్యాసం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసినంతమంది కూడా పార్లమెంట్ ఎన్నికలకు ముందుకు రాలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 2,81,65,885 మంది ఓటర్లకు 1,94,43,411 మంది (69.0శాతం) ఓటు వేయగా.. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2,81,75,651 ఓట్లకు 1,94,31,99 (68.97 శాతం) ఓట్లు పోలయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2,56,94,443 ఓట్లకు, 2,04,70,749 (79.67 శాతం) ఓట్లు పోలవగా, ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2,80,65,876 ఓట్లకు 1,86,42,895 (66.4 శాతం) ఓట్లు పోలయ్యాయి. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 3,26,02,799 ఓటర్లకు 2,32,67,914 మంది ఓటర్లు (71.37 శాతం) తమ ఓటుహక్కును వినియోగించుకోగా, 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల నాటికి ఓటు న మోదు పెరిగినా 5.11 శాతం తగ్గింది. మొత్తం 3,32,16,348 మంది ఓటర్లకు 2,20,08,373 మంది (66.26 శాతం) ఓట్లేశారు.ఓటు హక్కుపై అవగాహన ఓటు హక్కు వినియోగంపై ప్రభుత్వం, ఎన్నికల కమిషన్కు తోడు పౌరసమాజం, యువత మహిళా సంఘాలు, స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థలు చైతన్యం కలిగించాలి. అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం ఓటుహక్కు చాలా కీలకం. ఓటు హక్కు వినియోగం మీద అందరినీ మరింత చైతన్య పరచాల్సిన బాధ్యత పౌరసమాజంపై ఉంది. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా సమర్ధులైన అభ్యర్థులకు ఓటువేసేలా చూడాలి. – డాక్టర్ కేశవులు, చైర్మన్, తెలంగాణ యాంటీ కరప్షన్ ఫోరం -
ఆరోగ్య.. సంతాన ప్రదాత : మల్లూరు నరసింహస్వామి
హిరణ్యకశిపుడి ఆగడాలను అంతమొందించడానికి భక్త ప్రహ్లాదుడికి ముక్తిని ప్రసాదించడానికి శ్రీహరి ఎత్తిన అవతారమే నరసింహావతారం. ఆ నృసింహ దేవుడు తన ఉనికిని చాటుకోవడానికి అనేక క్షేత్రాలలో అవతరించాడు. అలాంటి పుణ్య క్షేత్రాలు తెలుగు రాష్ట్రాలలో తొమ్మిది ఉన్నాయి. వాటినే మనం నవ నరసింహ క్షేత్రాలని పిలుస్తున్నాం.. ఆ నవ నరసింహ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా మల్లూరు హేమాచల లక్ష్మి నరసింహ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. వరంగల్ జిల్లా మంగ పేట మండలంలో ఉన్న ఈ క్షేత్రంలో స్వామి హేమాచల లక్ష్మి నరసింహస్వామిగా పూజాదికాలు అందుకుంటున్నాడు. సంతాన, ఆరోగ్య ప్రదాతగా విశేష ఖ్యాతిగడించాడు స్వామి. వరంగల్ పట్టణానికి 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అటవీ వనాలు కొండలు మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోంది. మల్లూరు గ్రామానికి ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ ఆలయం హేమాచలం అనే కొండ మీద అలరారుతోంది. హేమాచల నరసింహ స్వామిని దర్శించుకోవడం వల్ల సమస్త శత్రు బాధలు తీరుతాయంటారు.ఇక్కడి స్వామి వారి మూర్తి అయిదు వేల సంవత్సరాల నాటిదని ఇక్కడి ఆధారాల ద్వార తెలుస్తోంది. సాక్షాత్తు దేవతలే ఇక్కడ స్వామివారిని ప్రతిష్టించినట్లు చెబుతారు. గర్భాలయంలో స్వామి వారి మూర్తి మానవ శరీరంలా మెత్తగా దర్శనమిస్తుంది . స్వామి వారి ఛాతీ మీద రోమాలు దర్శనమిస్తాయి. అలాగే స్వామి వారి శరీరాన్ని ఎక్కడ తాకినా మెత్తగా ఉంటుంది. ఉదర భాగం కూడా మానవ శరీరంలా మెత్తగా ఉండి.. మనుషులకు వచ్చినట్టే చెమట కూడా వస్తుంది. స్వామి వారి నాభి భాగంలో ఓ రంధ్రం దర్శనమిస్తుంది. దీనినుంచి నిరంతరం ఓ ద్రవం కారుతుంటుంది. దీనిని అదుపు చేయడానికి ఆ భాగంలో గంధాన్ని పూస్తారు. పూర్వకాలంలో స్వామి వారి విగ్రహాన్ని తరలించినపుడు, బొడ్డు దగ్గర ఇలా రంధ్రం పడిందంటారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆ బొడ్డు భాగంలో ఉంచిన గంధాన్నే ప్రసాదంగా ఇస్తారు.ఆరోగ్యామృతం ఆ నీరుఇక స్వామివారి పాదాల చెంత నుంచి నిత్యం ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది. దానినే చింతామణి జలధారగా పిలుస్తారు. ఈ నీరు కొద్ది కొద్దిగా కొన్ని రోజుల ΄ాటు తాగితే అన్ని రోగాలూ తగ్గిపోతాయనీ ఆ జలం సర్వ రోగ నివారిణి అనీ, భక్తులు విశ్వసిస్తారు స్వామి పాదాల నుంచి వచ్చే ఆ నీరు చింతామణి జల పాతాన్ని సమీపించే లోపు అనేక ఔషధ విలువలు గల చెట్ల క్రింది నుండి రావడం వల్ల ఆ నీటికి అంతటి శక్తి పెంపొందిందని అంటారు. రాణి రుద్రమదేవి అనారోగ్యానికి గురైన సమయంలో ఈ జలపాతంలోని నీటిని తాగడంతో ఆమె అనారోగ్యం నుంచి కోలుకుందని, ఆ తర్వాత అక్కడి నీటి విశిష్ఠత తెలుసుకున్న రుద్రమదేవి ఆ జలపాతానికి చింతామణి అనే పేరు పెట్టింది. చింతామణి జలధార నీటిని ఇప్పుడు కూడా విదేశాలలో ఉన్న తమ వారికి కూడా పంపిస్తూ ఉంటారు స్థానికులు, క్షేత్రాన్ని సందర్శించిన వారు. ఈ జలపాతానికి సమీపంలో మహా లక్ష్మి అమ్మవారి పురాతన మందిరం ఉంది. చింతామణి జల పాతానికి సమీపంలో మరో చిన్ని జల పాతం ఉంది.ఎలా చేరుకోవాలి?ములుగు జిల్లాలోని మల్లూరు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో హేమాచల నరసింహస్వామి ఆలయం ఉంది. మల్లూరు క్షేత్రానికి వరంగల్ నుంచి నేరుగా చేరుకోవచ్చు. అలాగే ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణానికి కూడా ఇది సమీపంలో ఉండడం వల్ల మణుగూరు నుంచి కూడా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.– భాస్కర్ -
నిర్లక్ష్యంలో చాలా ‘స్మార్ట్’
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్మార్ట్సిటీ మిషన్ (ఎస్సీఎం) కింద చేపట్టిన పనులు పలు నగరాల్లో నత్తనడకన సాగుతున్నాయి. దేశంలోని 100 నగరాలను ఎస్సీఎం ద్వారా ‘సుందర నగరాలు’గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. పనులు పూర్తి చేసేందుకు లక్ష్యాలు నిర్దేశించుకున్నా.. వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. వాస్తవానికి 2023 జూన్లోనే.. దేశంలోని వంద నగరాల్లో చేపట్టిన స్మార్ట్సిటీ ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఇప్పటికి రెండు పర్యాయాలు స్మార్ట్సిటీ మిషన్ గడువు పొడిగించినా ఫలితం లేదు. పనుల తీరు చూస్తే 2025 మార్చి 31 నాటికైనా పూర్తవుతాయా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. తొమ్మిదేళ్లుగా సా..గుతున్న పనులు దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నగరాలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం.. 2015 ఆగస్టు 27న స్మార్ట్సిటీ మిషన్కు శ్రీకారం చుట్టింది. దేశంలోని 100 నగరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని పెంచడం దీని లక్ష్యం. మొదటి విడత 98 నగరాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఆ తర్వాత వరంగల్, కరీంనగర్ను కూడా స్మార్ట్సిటీ జాబితాలో చేర్చింది. సుమారు తొమ్మిదేళ్ల వ్యవధిలో వంద నగరాల కోసం 8,066 ప్రాజెక్టుల వర్క్ ఆర్డర్లను జారీ చేసి రూ.1,64,669 కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేసింది. ఈ మేరకు 2024 నవంబర్ 28 వరకు 7,352 ప్రాజెక్టుల వర్క్ ఆర్డర్లపై రూ.1,47,366 కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయాన్ని భువనగరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి తోఖన్ సాహు వెల్లడించారు.ఇన్ని నిధులు ఖర్చయినా.. అన్ని ప్రాజెక్టులను 13 నగరాలు మాత్రమే పూర్తి చేశాయి. ఆ తర్వాత 48 నగరాల్లో 90 శాతం, 23 నగరాల్లో 75 శాతం పూర్తయ్యాయి. 16 నగరాల్లో స్మార్ట్సిటీ మిషన్ ప్రాజెక్టులు అసంపూర్తిగానే ఉండగా.. రూ.17,303 కోట్ల విలువైన 714 ప్రాజెక్టులు ఇంకా అమలు దశలోనే ఉన్నాయి. ఆ 13 నగరాలు భేష్.. నూరు శాతం స్మార్ట్సిటీ మిషన్లో చేపట్టి ప్రాజెక్టులు పూర్తి చేసిన నగరాల్లో గుజరాత్ రాష్ట్రంలో సూరత్, జార్ఘండ్లో రాంచీ, కర్ణాటకలో తుమకూరు, లక్ష్యదీప్లో కవరాట్టి, మధ్యప్రదేశ్లో జబల్పూర్, మహారాష్ట్రలో పుణె, రాజస్థాన్లో ఉదయ్పూర్, తమిళనాడులో కోయంబత్తూర్, మధురై, సాలెం, ఉత్తరప్రదేశ్లో ఆగ్రా, బరేలీ ఉన్నాయి. 60 శాతంలోనే వరంగల్, కరీంనగర్.. గ్రేటర్ వరంగల్, కరీంనగర్ స్మార్ట్సిటీల్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆ రెండు నగరాలకు కేటాయించిన నిధులు, ఖర్చయిన నిధులు, పూర్తయిన ప్రాజెక్టులను పరిశీలిస్తే.. ఇంకా 58 శాతంలోనే ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాకపోగా.. తుది గడువైన 2025 మార్చి 31 నాటికి పూర్తవడం ప్రశ్నార్థకంగా ఉంది. 2017–18లో కరీంనగర్, గ్రేటర్ వరంగల్ను కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలుగా ప్రకటించిన తర్వాత.. ఆ రెండు నగరాల్లో రూ.1,879 కోట్లతో రహదారులు, నాలాలు, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు తదితర అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలను రూపొందించింది. క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి పురపాలకశాఖ అధికారులు ప్రతిపాదించగా.. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆమోద ముద్ర వేసింది. స్మార్ట్సిటీలుగా ప్రకటించి ఆరేళ్లు దాటినా ఆ రెండు నగరాల్లో పనులు 60 శాతం దాటలేదు. నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు.. గ్రేటర్ వరంగల్లో రూ.179 కోట్లు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రూ.102 కోట్లు అందుబాటులో ఉన్నా పనులు చేయించడంలో అధికారులు అలసత్వం చేశారనే ఫిర్యాదులున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.. అందుకే గడువు పొడిగింపు.. ఉత్తరప్రదేశ్లోని 10 నగరాల్లో రూ.21,115.53 కోట్లతో 889 ప్రాజెక్టులు చేపట్టగా.. రూ.864.4 కోట్ల విలువైన 39 ప్రాజెక్టులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని ఏడు నగరాల్లో 788 ప్రాజెక్టుల కోసం రూ.15,078.54 కోట్లు అంచనా కాగా.. 748 ప్రాజెక్టులను రూ.14,192.23 కోట్లతో పూర్తి చేయగా, 40 ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. తెలంగాణలోని రెండు నగరాల్లో రూ.2,817.65 కోట్ల విలువైన 169 ప్రాజెక్టుల్లో 97 పూర్తి కాగా, రూ.794.74 కోట్ల విలువైన 72 ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. తమిళనాడులోని 11 నగరాల్లో రూ.17,983.63 కోట్ల విలువైన 733 ప్రాజెక్టుల్లో రూ.513.54 కోట్లతో చేపట్టిన 25 పూర్తి కావలసి ఉంది. రాజస్తాన్లోని అజ్మీర్, జైపూర్, కోట, ఉదయ్పూర్ నగరాల్లో రూ.8639.95 కోట్ల ఖర్చు కాగల 579 ప్రాజెక్టుల్లో 561 పూర్తి కాగా, రూ.324.73 కోట్లతో నడుస్తున్న 18 పెండింగ్లో ఉన్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్లో 47, ఛత్తీస్గఢ్లో 41, హిమాచల్ప్రదేశ్లో 32, బిహార్లో 30, జమ్ముకశీ్మర్లో 30, మహారాష్ట్రలో 29, కేరళలో 27, కర్ణాటకలో 26, హరియాణాలో 26 ప్రాజెక్టులు.. మొత్తం 714 పెండింగ్లో ఉన్నాయి.స్మార్సిటీ మిషన్ వివరాలు.. స్మార్ట్సిటీ మిషన్ (ఎస్సీఎం)కు శ్రీకారం: 2015 ఆగస్టు 27 దేశంలో ఎంపిక చేసిన నగరాల సంఖ్య: 100 (మొదట 98 నగరాలు.. ఆ తర్వాత కరీంనగర్, వరంగల్) ఎస్సీఎం కింద విడుదలైన నిధులు: రూ.1,64,669 కోట్లు ప్రతిపాదన చేసిన ప్రాజెక్టులవర్క్ఆర్డర్లు: 8,066 నూరు శాతం ప్రాజెక్టులు పూర్తి చేసిన నగరాలు: 13 90 శాతంలో ఆగిన నగరాలు : 48 75 శాతం వరకు పూర్తి చేసినవి : 23 నత్తనడకన రూ.17,303 కోట్ల విలువైన 714 ప్రాజెక్టులుస్మార్ట్సిటీలతో ప్రయోజనాలు..» సమర్థవంతమైన పబ్లిక్ రవాణా వ్యవస్థ » వ్యర్థ నీటి రీసైక్లింగ్ » నీటి వృధాను అరికట్టే సెన్సార్స్, యాజమాన్యం, గ్రీన్ స్పేసెస్ » భౌతిక, సాంఘిక అవస్థాపనా సౌకర్యాల కల్పన » ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుతో ఉపాధి వస్తు, సేవల లభ్యత » ప్రజల జీవన ప్రమాణాల్లో పెరుగుదల » సహజ వనరుల సమర్థ వినియోగం » గవర్నెన్స్లో పౌరుల భాగస్వామ్యం » పర్యావరణ పరిరక్షణ–యాజమాన్యం » ‘స్మార్ట్’ పట్టణాభివృద్ధి సాధన..సుస్థిర వృద్ధి » గ్లోబల్ నెట్ వర్కింగ్ » సృజనాత్మక పరిశ్రమ » ఆధునిక సమాచార వ్యవస్థఅందుబాటులోకి » ఈ–అర్బన్ గవర్నెన్స్.. » పారిశ్రామికీకరణ » భద్రతా వ్యవస్థ ఆధునికీకరణ.. ఇలా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
హసన్పర్తి: హనుమకొండ పరిధిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థిని మంగళవారం ఆ కాలేజీ హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాంధన్ తండాకు చెందిన గుగులోతు శ్రీదేవి(16) నగరంలోని డబ్బాల్ జంక్షన్ వద్ద గల ఏకశిలా గర్ల్స్ క్యాంపస్లో ఇంటర్ (ఎంపీసీ) ఫస్టియర్ చదువుతోంది. మంగళవారం రాత్రి 9 గంటలకు కాలేజీ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థులు కాలేజీ నిర్వాహకులకు చెప్పగా వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సదరు విద్యార్థి శ్రీదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కారణంగానే హాస్టల్ గదిలో ఉరివేసుకుందని చెప్పారు.విద్యార్థి సంఘాల ఆందోళన..శ్రీదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, బంధువులు రాత్రి కాలేజీ వద్దకు భారీగా చేరుకున్నారు. మృతదేహంతో కాలేజీ ఎదుట బైఠాయించారు. శ్రీదేవి మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది.గుండెపోటుతో ఎంబీబీఎస్ స్టూడెంట్ మృతిఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000 / 040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కాంగ్రెస్ నేతలను తొక్కుకుంటూ సీఎంగా రేవంత్: హరీష్ రావు
సాక్షి, వరంగల్: తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటూ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ముఖ్యమంత్రి అయ్యారని సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడమే కాంగ్రెస్(Congress) ప్రభుత్వం పనిగా పెట్టుకుందని తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ హయాంలో తలపెట్టిన ఆసుపత్రుల నిర్మాణాలపై సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) వరంగల్లో మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. అన్నీ డిపార్ట్మెంట్సలో పేదలకు అందుబాటులో ఉండాలని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాం. గతంలో నేను వచ్చినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలాగే ఉంది. భవన నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు. ఒక కార్పొరేట్ ఆసుపత్రి వైద్యం పేదలకు అందాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. ఉత్తర తెలంగాణ పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా 2000 పడకల ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు.ఈ ఆసుపత్రి నిర్మాణం.. 2024 జూన్ వరకు రెడీ కావాలని ప్రతిపాదనలు చేశాం. ఇప్పుడూ ఎలా ఉందో చూస్తున్నాం. పేదలకు సరైన వైద్యం అందడం లేదు. వరంగల్ జిల్లాలో హైటెక్ టవర్లో వైద్య సేవలకు ఆస్పత్రి నిర్మాణం చేపట్టాం. 14వ ఫ్లోర్లో హాస్పిటల్, 10 ఫ్లోర్లో అడ్మినిస్ట్రేషన్ ఉండేలా ప్లాన్ చేశాం. మన ఆసుపత్రి ఎత్తు 91 మీటర్లు. ఇక్కడ గుండె, కిడ్నీ, లివర్, క్యాన్సర్కు అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించాలనుకున్నాం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది కాలం ఓపిక పట్టాం. ఎలాంటి అభివృద్ధి లేదు. వెంటనే ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి.తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న పథకాలను నిలిపేశారు. కొత్త పథకాలు ఇవ్వడం లేదు. ఆరు గ్యారెంటీలకు గ్యారెంటీ లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది అంటూ ఆరోపించారు. -
వరంగల్ చపాట మిర్చికి జీఐ ట్యాగ్
సాక్షి, వరంగల్/సిద్దిపేట: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా పండిస్తున్న చపాట మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ (జీఐ ట్యాగ్) లభించింది. ఇప్పటికే తెలంగాణ నుంచి పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ బొమ్మలు, హైదరాబాద్ హలీమ్తోపాటు మరికొన్ని ప్రత్యేక ఉత్పత్తులు జీఐ గుర్తింపు దక్కించుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో దేశంలోని తీపి మిర్చి రకాల్లో ఒకటైన చపాట మిరప చేరింది.చపాట మిరపకు జీఐ ట్యాగ్ కోసం తిమ్మంపేట మిర్చి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ రెండేళ్ల క్రితం దరఖాస్తు చేయగా.. ఇండియన్ పేటెంట్ ఆఫీస్ (ఐపీవో) తాజాగా ఆమోదించింది. ‘జియోగ్రాఫిక్ ఇండికేషన్స్ జర్నల్’ లోనూ చపాట రకం మిర్చికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. రెండేళ్ల క్రితం చపాట మిర్చికి వరంగల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్కు రూ.లక్ష వరకు ధర పలికింది. తక్కువ ఘాటుతో ఎర్రని టమాటా పండులాంటి రంగు కలిగి ఉండటం ఈ మిర్చి ప్రత్యేకత. అందుకే దీనిని టమాటా మిర్చి అని కూడా పిలుస్తారు. -
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు
సాక్షి, ఖమ్మం: తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, జగ్గయ్యపేట.. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలతో సహా హైదరాబాద్లో కూడా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి ప్రజలు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 7:27 గంటలకు రెండు నిమిషాల పాటు భూమి కంపించింది. దీంతో, ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. కాగా, ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా భూమి కంపించినట్టు అధికారులు చెబుతున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలుగు స్టేట్స్లో ఇలా భూమి కంపించడం గమనార్హం. ఈ మేరకు సీఎస్ఐఆర్ ఓ ఫొటోను విడుదల చేసింది. Got a whatsapp forward video from Bhadrachalam, Telangana. A strong one 😮Credits to respective owner pic.twitter.com/i3OR9wFfM4— Telangana Weatherman (@balaji25_t) December 4, 2024 వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, రాజేంద్రనగర్, రాజేంద్రనగర్ సహా రంగారెడ్డి జిల్లాలో దాదాపు ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. తెలంగాణలోని చాలా జిలాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అటు, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కూడా భూమి కంపించింది. ఖమ్మంలోకి నేలకొండపల్లి, భద్రాద్రి కొత్తగూడెంలోని చుండడ్రుగొండలో బుధవారం తెల్లవారుజామున కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు ప్రజలు తెలిపారు. భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.For the first time in last 20years, one of the strongest earthquake occured in Telangana with 5.3 magnitude earthquake at Mulugu as epicentre.Entire Telangana including Hyderabad too felt the tremors. Once again earthquake at Godavari river bed, but a pretty strong one 😮 pic.twitter.com/RHyG3pkQyJ— Telangana Weatherman (@balaji25_t) December 4, 2024అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భూమి కంపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో 10 సెకన్ల పాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గవ్యాప్తంగా స్వల్పంగా భూమి కంపించింది. దీంతో, ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అలాగే, కేససముద్రం, మహబూబాబాద్, బయ్యారంలో కూడా కొన్ని సెకండ్ల పాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.హన్మకొండ జిల్లా పరకాల డివిజన్లో భూ ప్రకంపనలు వచ్చాయి. అలాగే, వరంగల్లోని పలు ప్రాంతాల్లో 5 నుండి 15 సెకండ్ల వరకు స్వల్పంగా కంపించిన భూమి. దీంతో, భయాందోళనలో స్థానికులు ఉన్నాయి. భూమి కంపించడంపై ఉదయాన్నే సిటి మొత్తం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, తిరువూరు, నందిగామ, గుడివాడ, మంగళగిరి, జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీసినట్టు చెబుతున్నారు. బుధవారం ఉదయం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. -
కాకతీయ జూపార్క్కు కరీనా ,శంకర్ ఆగయా..!
న్యూశాయంపేట : వరంగల్ నగరంలోని కాకతీయ జూపార్క్కు ఆడపులి కరీనా (15), మగ పులి శంకర్ (10) వచ్చేశాయి. పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న పెద్దపులుల దర్శన భాగ్యం త్వరలో కలగనుంది. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా రెండు పెద్ద పులులతోపాటు అడవిదున్నల ఎన్క్లోజర్లు, రెండు జింకల ఎన్క్లోజర్లను ప్రారంభించనున్నట్లు అటవీశాఖాధికారులు తెలిపారు.ఐదేళ్ల కిందటే రావాల్సి ఉండే..కాకతీయ జూపార్క్లో పెద్ద పులులు, అడవిదున్నల కోసం ఐదేళ్ల క్రితమే ఎన్క్లోజర్ పనులు ప్రారంభించారు. ఆ తరువాత ఎవరూ పట్టించుకోకపోవడం.. బడ్జెట్ లేదనే నెపంతో పనులను మధ్యలోనే వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అటవీశాఖ మంత్రి కావడంతో జూపార్క్పై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్క్లోజర్ల పనులు పూర్తి చేసి రెండు పెద్ద పులులు, ఇతర జంతువులు వచ్చేలా చర్యలు తీసుకున్నారు.హగ్ డీర్.. బార్కిన్ డీర్ వైజాగ్ నుంచి రాక..కాకతీయ జూపార్క్కు రెండు జింక (హగ్ డీర్, బార్కిన్ డీర్)లను ఆంధ్రప్రదేశ్నుంచి తీసుకొచ్చినట్లు అటవీశాఖాధికారులు తెలిపారు. రెండు అడవిదున్నలు త్వరలో రానున్నట్లు చెప్పారు. సెంట్రల్ జూపార్క్ అథారిటీ అనుమతితో ఈ జంతువులను జూపార్క్కు తీసుకొస్తున్నట్లు వివరించారు. వాటి కోసం ప్రత్యేకమైన ఎన్క్లోజర్ల ఏర్పాటు చేశామన్నారు.సిద్ధసముద్రంలో పూడిక తీస్తే మేలు..జూపార్క్.. సిద్ధ సముద్రం చెరువు ప్రాంతంలో చుట్టూ ఎత్తయిన కొండల మధ్య 47.64 ఎకరాల్లో విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో వివిధ జంతువుల ఎన్క్లోజర్లకు పోను సిద్దసముద్రం చెరువు కొంతమేర ఉంటుంది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చెరువులో పూడిక తీసి బోటింగ్ సౌకర్యం కల్పిస్తామని పార్క్ను సందిర్శించిన సందర్భంగా తెలిపారు. ఆ తరువాత పట్టించుకోలేదు. కొండా సురేఖ అటవీశాఖ మంత్రి కావడం, జూపార్క్కు ప్రతేక నిధులు కేటాయించి సిద్ధసముద్రంలో పూడిక తీసి బోటింగ్ సదుపాయం కల్పించాలని పర్యాటకులు, నగరవాసులు కోరుతున్నారు.ఇక్కడి వాతావరణానికి అలవాటు పడాలి..కాకతీయ జూపార్క్కు రెండు పెద్ద పులులు వచ్చాయి. రెండు జింకలు వైజాగ్ నుంచి ఇటీవల తీసుకొచ్చాం. రెండు అడవిదున్నలు త్వరలో రానున్నాయి. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేదాక సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ఆ తరువాత సందర్శకులకు అనుమతిస్తాం.– భీమానాయక్, అటవీ ముఖ్య సంరక్షణాధికారి, భద్రాద్రి సర్కిల్ -
అనుమానం.. పెనుభూతమైంది
కేసముద్రం: అనుమానం.. పెనుభూతమైంది. ఓ ప్రబుద్ధుడు భార్యను ఉరివేసి హత్యచేశాడు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య కథనం ప్రకారం.. కేసముద్రంస్టేషన్కు చెందిన బత్తుల వీరన్నకు ఇదే మండలం బోడమంచ్యాతండాజీపీకి చెందిన అనూష(30)తో 2011లో వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు రాజేశ్(6వ తరగతి) ఉన్నాడు. మొదట్లో వారి దాంపత్య జీవితం సవ్యంగానే సాగింది. కొంతకాలంగా వీరన్న తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. నాలుగు రోజుల క్రితం అనూష కుమారుడు రాజేశ్ బోడమంచ్యాతండాలో తన తాత ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి వీరన్న తన భార్య అనూషను ఉరివేసి హత్య చేశాడు. అనంతరం ఇంటి వెనక ఉన్న బావి దూలానికి భార్యను వేలాడ దీసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. ఆపై అక్కడి నుంచి పరారయ్యాడు. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు ఘటనా స్థలికి చేరుకుని అనూష మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అనూషను భర్తే హత్యచేశాడంటూ ఆరోపించారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్రాజు సిబ్బందితో చేరుకుని ఘటనా స్థలిని పరీశీలించారు. మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోట జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరన్న.. అనుమానంతోనే భార్య మెడకు ఉరేసి చంపిన అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించినట్లు రూరల్ సీఐ సర్వయ్య తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.తల్లికి తలకొరివి పెట్టిన చిట్టి చేతులు..ఒకవైపు తల్లి హత్యకు గురికాగా, మరోవైపు తండ్రి లేకపోవడంతో ధీనంగా కూర్చున్న చిన్నారి రాజేశ్ను చూసిన వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. తన చిట్టి చేతులతో తల్లికి తలకొరివిపెట్టి అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఈ హృదయ విదారకర ఘటనను చూసిన ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టుకున్నారు. -
మహిళల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు
సాక్షి ప్రతినిధి, వరంగల్: మహిళల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. మంగళవారం వరంగల్లో నిర్వహించిన ‘ప్రజా పాలన–ప్రజా విజయోత్సవ సభ’లో ఆయన మాట్లాడారు. మహిళల అభివృద్ధితోనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. రూ.6వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఇది మహిళలు ఏది కావాలంటే అది అమలు చేసే ప్రభుత్వమని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరతాం: పొంగులేటి ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం నూటికి నూరు శాతం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన తెలంగాణకో వరం: కోమటిరెడ్డి మూసీ ప్రక్షాళన తెలంగాణకు గొప్ప వరమని, ప్రధానంగా ఫ్లోరైడ్తో బాధపడుతున్న నల్లగొండతో పాటు పలు ప్రాంతాలకు చెందిన లక్షలాది మందికి మేలు జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిన గత పాలకు లు మూసీ కోసం రూ.7 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. వైఎస్ స్ఫూర్తితో ముందుకు: సీతక్క, కొండా సురేఖ నాడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మహిళా సమాఖ్యలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చి ఆర్థిక పరిపుష్టిని కల్పిస్తే, నేడు వడ్డీలేని రుణాతోపాటు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి తర్వాత అంత గొప్ప దయగల నేత, సీఎం రేవంత్రెడ్డి అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి సీఎం కృషి: టీపీసీసీ చీఫ్ వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.6,000 కోట్లు కేటాయించడం చరిత్రలో రికార్డని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. సభలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కె.కేశవరావు, సలహాదారు శ్రీనివాసరాజు, ఎంపీలు బలరాం నాయక్, డాక్టర్ కావ్య, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, మధుసూదనాచారి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు రావు: సీఎం రేవంత్
సాక్షి,వరంగల్: బీఆర్ఎస్పై సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఫైరయ్యారు. అభివృద్ధిని అడ్డుకుంటే ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్నారు. మంగళవారం(నవంబర్ 19)వరంగల్లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్రెడ్డి పాల్గొని మాట్లాడారు.‘ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం. 2014-19 వరకు కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలు మంత్రులుగా ఉన్నారు. పాలకుర్తిలో ఒక రాక్షసుడు రాజ్యమేలుతుంటే కొండను బద్దలు కొట్టినట్లు కొట్టింది ఒక ఆడబిడ్డనే. తెలివిగల తెలంగాణ ప్రజలు అప్రమత్తమై కాంగ్రెస్ను గెలిపించారు. కాలోజీ కళాక్షేత్రం కట్టడానికి కేసీఆర్కు పదేళ్లు చేతులు రాలేదు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్కు పోటీ నగరంగా తీర్చి దిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం’అని రేవంత్రెడ్డి తెలిపారు. -
విజయోత్సవాలు కాదు.. అపజయోత్సవాలు చేయండి: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను విజయవంతంగా మోసం చేసిందని.. విజయోత్సవాలను కాకుండా అపజయోత్సవాలు నిర్వహించాలంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పది నెలల్లో రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి తీసుకువెళ్లారని.. ‘ఎవరనుకున్నరు ఇట్లవునని.. ఎవరనుకున్నరు ఇట్లవునని’ ప్రజాకవి కాళోజీ నినదించినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగాపడ్డారన్నారు. రైతులు దారుణంగా మోసపోయారని రోరపించారు. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు.ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి? అంటూ హరీష్రావు ప్రశ్నించారు. ఇదే వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్ కు ఏడాది అయినా అతీగతీ లేదని విమర్శించారు. డిక్లరేషన్లో చెప్పిన మొట్టమొదటి హామీ రూ.2లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదన్నారు. రైతులు, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15వేల భరోసా దిక్కులేదని.. ఉపాధిహామీ రైతు కూలీలకు ఏడాదికి ఇస్తామన్న 12వేలు ఇవ్వనేలేదన్నారు. పది రకాల పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్ చేశారని విమర్శించారు. ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ఇందుకేనా మీ వరంగల్ విజయోత్సవ సభ రేవంత్ రెడ్డి? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పది నెలల పాలనలో రాష్ట్రాభివృద్ధి పదేండ్ల వెనక్కి వెళ్లిందని.. కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, నేడు తిరోగమనం బాట పట్టిందని విమర్శలు గుప్పించారు. -
పోరుగడ్డ నుంచి విజయోత్సవాలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవు తున్న సందర్భంగా ఈ నెల 19 నుంచి ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది. మంగళవారం వరంగల్లో ప్రారంభమయ్యే ఈ వేడుకలు ఏడాది పాటు సాగ నున్నాయి. ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం సాగించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల అధికార యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తమ పరి ధిలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలిచ్చారు. తొలిరోజు వరంగల్లో జరిగే ప్రజా విజయోత్సవాల్లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొనను న్నారు. బుధవారం సిరిసిల్ల జిల్లా వేములవాడ, గురువారం మహబూబ్నగర్లో జరిగే కార్యక్రమా ల్లో కూడా సీఎం పాల్గొననున్నారు. బహిరంగ సభలు జరిగే ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.వరంగల్లో లక్షమందితో సభప్రజా పాలన విజయోత్సవాలకు ఓరుగల్లు ముస్తా బైంది. లక్ష మంది మహిళలతో మంగళవారం బహి రంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యా యి. వేడుకలు నిర్వహించే హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానానికి ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం’గా నామకరణం చేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, డి.శ్రీధర్బాబు, ధనసరి సీతక్క, కొండ సురేఖ సహా మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొననున్నారు.సీఎం షెడ్యూల్ ఇదీ..సీఎం రేవంత్ మధ్యాహ్నం 2:30 గంటలకు హెలికాప్టర్లో హనుమకొండ కుడా గ్రౌండ్స్కు చేరుకుంటారు. ముందుగా కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు. 3 గంటలకు ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేదికకు చేరుకుంటారు. 3:20కి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించి.. మహిళా స్వయం సహాయక సంఘాలు, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్యల సభ్యులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు అక్కడి నుంచే వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బ్యాంక్ లింకేజ్ చెక్కులు, బీమా చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 సమయంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
కళామ తల్లికి దివ్య మణిహారం
హనుమకొండ అర్బన్: కళామతల్లి శిఖలో మరో మణిహారం కొలువుదీరనుంది. కళల కాణాచి వరంగల్లో కాళోజీ కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత ప్రజా కవి కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించను న్నారు. అధునాతన హంగులు, రాజసం ఉట్టిపడేలా రూ.95 కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణం ఆకట్టుకుంటోంది. తెలంగాణ కళా, సాంస్కృతిక రంగానికి ఈ క్షేత్రం ఓ మణిహారంగా మారనుంది. ప్రధాన ఆకర్షణలివీ..» హనుమకొండ బాలసముద్రంలోని సర్వే నంబర్ 1066 ‘కుడా’ (హయగ్రీవాచారి కాంపౌండ్) భూమిలో 4.20 ఎకరాల్లో నిర్మించారు. » 1.77 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. » 1,127 మందితో ప్రధాన ఆడిటోరియం సీటింగ్ సామర్థ్యం » సెంట్రలైజ్డ్ ఏసీతో అత్యాధునిక ఆడియో, విజువల్ సిస్టమ్తో ప్రదర్శనలు » చిన్న చిన్న సాంస్కృతిక సమావేశాల కోసం ప్రత్యేకంగా నాలుగు మినీ హాళ్లు » గ్రౌండ్ఫ్లోర్లో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో కాళోజీ నారాయణరావు ఫొటోలు, జ్ఞాపకాలు, పురస్కారాలను ప్రదర్శిస్తారు. -
ఈ సినిమా గిట్ట ఆడకపోతే.. ఇలాంటి మాటలు వద్దు ఇక: విశ్వక్ సేన్ కామెంట్స్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి మాస్ యాక్షన్తో వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో హిట్ కొట్టిన యంగ్ హీరో మళ్లీ అలరించేదుకు రెడీ అయ్యాడు. యంగ్ మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం మెకానిక్ రాకీ. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో గుంటూరు కారం భామ మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మేకర్స్ మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను వరంగల్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈవెంట్కు హాజరైన హీరో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా హిట్ కొట్టినా.. ఫ్లాఫ్ అయినా నేను సినిమాలు తీయడం ఆపేది లేదని ఛాలెంజ్ విసిరారు.విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'మీకు ఎప్పటిలాగే ఛాలెంజ్ విసరాలా? ప్రతి సినిమాకు ఛాలెంజ్ కావాలా? మొన్ననే మెకానిక్ రాకీ సినిమా చూసుకున్నా. ఈ సినిమా గిట్ట ఆడకపోతే షర్ట్ లేకుండా చెక్పోస్ట్లో తిరుగుతా.. ఫిల్మ్ నగర్లో ఇల్లు ఖాళీ చేస్తా.. ఇకపై ఇలాంటివీ నేను మాట్లాడదలచుకోవట్లేదు. సినిమా హిట్ అయినా.. ఫ్లాఫ్ అయినా నా చొక్కా నా ఒంటిమీదనే ఉంటది.. నా ఇల్లు జూబ్లీహిల్స్లోనే ఉంటది.. నేను ఇంకో సినిమా చూస్తా. అది ఉన్నా.. దొబ్బినా మళ్లీ మళ్లీ సినిమా తీస్తా. పూరి జగన్నాధ్ రాసినట్టు, రవితేజ అన్న చెప్పినట్లు మాకు తెలిసిందల్లా ఒక్కటే.. సినిమా సినిమా. అంతే ప్రాణం పెట్టిన ఈ మూవీ తీసినం' అంటూ మాట్లాడారు. కాగా.. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. -
‘మామునూరు’లో మరో ముందడుగు
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రన్వే విస్తరణకు కావాల్సిన 205 ఎకరాల భూమిని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు స్వాదీనం చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్కు సూచించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దశల వారీగా సమీక్షించి, మామునూరు విమానాశ్రయ స్థల సేకరణలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించడం, రోజుల వ్యవధిలోనే స్థల సేకరణకు అవసరమైన నిధులు మంజూరు చేయించడంతో విమానాశ్రయ పనుల్లో ముందడుగు పడినట్టయ్యింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లతో కూడిన డీపీఆర్ వేగంగా సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి ఆర్అండ్బీ శాఖ లేఖ కూడా రాసింది. వరంగల్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం రానున్న నేపథ్యంలో విమానాశ్రయానికి సంబంధించి ముందడుగు పడడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నెల రోజుల్లోనే పురోగతి ఇలా.. » ఈ ఏడాది అక్టోబర్ 23న రాజీవ్గాంధీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లో బోర్డు మీటింగ్ నిర్వహించారు. మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల పరిధి ఒప్పందాన్ని జీఎమ్మాఆర్ సంస్థ విరమించుకుంది. » ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి అధ్యక్షతన మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూసేకరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. » మంత్రి కొండా సురేఖతోపాటు ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్.నాగరాజు, ఎంపీ కడియం కావ్య తదితరులు భూనిర్వాసితులతో సమావేశమై వారి డిమాండ్లను కలెక్టర్కు విన్నవించాలని కోరారు. » ఆ తర్వాత కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆధ్వర్యాన రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. భూసేకరణకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమరి్పంచడంతో అందుకు కావాల్సిన రూ.205 కోట్ల నిధులను మంజూరు చేసింది. సాధ్యమైనంత తొందరగా భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అందరి దృష్టి పరిహారంపైనే.. ఎయిర్పోర్ట్కు సేకరించే భూములకు సంబంధించి ఎకరాకు గవర్నమెంట్ వ్యాల్యూ రూ.6లక్షలు ఉంది. భూనిర్వాసితులకు పరిహారం మూడింతలు చెల్లించాలనుకున్నా ఎకరాకు రూ.18 లక్షలు ఇచ్చే అవకాశముంది. రెవెన్యూ అధికారులు రూ.25 లక్షల వరకు చెల్లించే దిశగా ఆలోచన చేస్తున్నారు. రైతుల నుంచి ఒత్తిడి ఎక్కువైతే తమ విచక్షణాధికారాలు ఉపయోగించి ఇంకాస్త పెంచాలని యోచిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఎకరాకు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతుండడంతో రైతుల నుంచి ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని అధికారులు హైరానా పడుతున్నారు. మరోవైపు ఎన్ని వ్యవసాయ బావులు, బోర్లు పోతున్నాయనే వివరాలను సోమవారం నుంచి రెవెన్యూ అధికారులు సేకరించనున్నారు. సీఎం రేవంత్రెడ్డి పర్యటన తర్వాత ఆయా గ్రామాల్లో సభలు నిర్వహించి పరిహారంపై స్పష్టతనిచ్చే అవకాశముంది. -
కిషన్ రెడ్డి అసలు తెలంగాణ బిడ్డనేనా?: మంత్రి పొన్నం
సాక్షి, వరంగల్: కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనతోనే కిషన్ రెడ్డి మూసీ నిద్రకు సిద్ధమయ్యారని విమర్శించారు. నిధులు తేలేని బీజేపీ నేతలు మూసీ వద్దకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. మూసీ కాలువ వాసన చూసిన తర్వాతైనా దైవ సాక్షిగా వాస్తవాలు చెప్పాలని కోరారు. కేంద్రం నుంచి రూపాయి తీసుకొచ్చే శక్తి లేని ఆయన.. తన మొద్దు నిద్ర వీడాలని సూచించారు.కిషన్ రెడ్డి డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని, ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు ఎలా పాస్ అయిందో మీకు తెలియదా? అని నిలదీశారు. కలెక్టర్ను కొట్టిన వారిని సమర్థిస్తున్న మీరు కేంద్రమంత్రి పదవికి అర్హులేనా? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఐఏఎస్పైన దాడి జరిగితే ఖండించకపోగా సమర్థించడం బాధాకరమని పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారులను కొట్టిన వాళ్లు, కొట్టించిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ దాడి ఘటనపై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఎంపీగా, కేంద్రమంత్రిగా ఏం చేశారో చెప్పాలన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. -
19న వరంగల్కు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 19న వరంగల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. స్వయం సహాయ బృందాల (ఎస్హెచ్జీ) మహిళలతో సమావేశమై ఆ గ్రూపులకు సంబంధించిన ఆస్తుల పంపిణీ చేస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు సచివాలయంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి వరంగల్ పర్యటన రూట్ మ్యాప్, వేదిక ఏర్పాట్లు, పార్కింగ్ తదితర అంశాలపై చర్చించారు. సభకు వచ్చే మహిళలు ఎక్కువ దూరం నడవకుండా పక్కాగా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను కోరారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి మాట్లాడుతూ మహిళలు, పిల్లల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల చిత్రాలను సభ వద్ద ప్రదర్శించాలని సూచించారు. సీఎం సభ, ఇతర కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కలి్పంచేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలని కోరారు. నేడు, రేపు మహారాష్ట్రలో సీఎం ఎన్నికల ప్రచారం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శని, ఆదివారాల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ చేరుకుంటారు. అక్కడ నుంచి చంద్రాపూర్లో స్థానిక నేతలతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం వరుసగా రాజురా, డిగ్రాస్, వార్దానియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొని రాత్రికి తిరిగి నాగ్పూర్చేరుకుంటారు. రెండోరోజు ఆదివారం ఉదయం నాగ్పూర్ నుంచి నాందేడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి నయగావ్, భోకర్, షోలాపూర్నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అదే రోజు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. -
ప్రభాస్ హెయిర్ స్టైల్ కావాలి.. ఫ్లాట్ హెయిర్ కట్ నచ్చడం లేదు!
‘మాకు హీరో ప్రభాస్లాగా హెయిర్ స్టైల్ కావాలి.. జుట్టు పొడుగ్గా పెంచుకొనేందుకు అనుమతి ఇవ్వాలి.. గాజులు వేసుకొనేందుకు పర్మిషన్ ఇవ్వాలి. టీచర్ల మాదిరిగా చీరలు కట్టుకోవాలని ఉంది’.. వరంగల్ జిల్లా రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూళ్లలో సమస్యలు తెలుసుకొనేందుకు అధికారులు ఏర్పాటుచేసిన ఫిర్యాదుల బాక్సుల్లో విద్యార్థులు వేసిన వినతులు ఇవి. ఆహారం బాగా లేదనో, హోం వర్క్ ఎక్కువ ఇస్తున్నారో, పుస్తకాలు లేవనో ఫిర్యాదులు వస్తాయని అధికారులు ఆశించారు. కానీ, ఫిర్యాదు బాక్సుల్లో మాత్రం ఇలాంటి వినతులు కనిపించాయి.దీనిపై ఓ విద్యార్థిని ఒక సీనియర్ అధికారి ప్రశ్నించగా.. ‘స్థానిక బార్బర్ అబ్బాయిలందరికీ ఒకే రకమైన ఫ్లాట్ హెయిర్ కట్ ‘తాపేలి కట్’చేస్తున్నాడు. అది నచ్చడం లేదు. అందుకే హీరోల వంటి హెయిర్ కట్ కావాలని కోరాం’ అని తెలిపాడు. ఈ విషయంలో వారు సీరియస్గానే ఉన్నారని ఆ అధికారి చెప్పారు. ‘ఈ పిల్లలకు ఫోన్లు అందుబాటులో లేవు. తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా మాట్లాడలేరు. అందుకే ఫిర్యాదు పెట్టెలను పెట్టించాం. వీళ్ల ఫిర్యాదులు ఆసక్తికరంగా ఉన్నాయి. తమ భావాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తున్నారు’అని జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా కొంతమంది విద్యార్థులు పాఠశాలలో పూజలు ఏర్పాటు చేయాలని కోరారు. కొంతమంది విద్యార్థినులు సీనియర్లు తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ప్రభావమే... ఇదంతా సోషల్ మీడియా ప్రభావమేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు. ‘క్యాంపస్లలో ఫోన్లను అనుమతించనప్పటికీ, చాలా పాఠశాలల్లో కంప్యూటర్ సైన్స్ ల్యాబ్లు ఉన్నాయి. వాటి ద్వారా పిల్లలు సోషల్ మీడియాలో లేటెస్ట్ ట్రెండ్లను తెలుసుకుంటున్నారు. వాళ్లు తమ మనసులోని మాటలను చెప్పడం మంచిదే. వాళ్లపై ఏవి ప్రభావం చూపుతున్నాయో తెలియాలి’ అని పాఠశాల పిల్లలతో కలిసి పనిచేసే డెవలప్మెంట్ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ ఒకరు చెప్పారు. కోవిడ్ –19కి ముందు ఎక్కువ ఫిర్యాదులు ఆహారం నాణ్యత, ఉపాధ్యాయుల శిక్షణ గురించి ఉండేవని.. ఇప్పుడు ఇలా ఉంటున్నాయని చెప్పారు.చదవండి: ముద్ద అన్నం.. తింటే కడుపు నొస్తోంది -
12 వేల మంది రైతులేరీ?
సాక్షి, వరంగల్: అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అందాలన్న ఉద్దేశంతో చేపట్టిన కుటుంబ నిర్ధారణ ప్రక్రియ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తిస్థాయిలో సఫలం కాలేదు. ఇందుకు అనేకమంది రైతులు స్థానికంగా లేకపోవడం ఒక కారణం. మరణించిన రైతు పేరుపై రుణమాఫీ ఉండడంతో సదరు మరణ ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డుతో సరిపోకపోవడం, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు ముందుకు రాకపోవడం మరో కారణంగా తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా 12 వేల మంది రైతుల కుటుంబ నిర్ధారణ కాలేదని సమాచారం. కాగా మొత్తం 48,297 కుటుంబాలకు.. ఇప్పటి వరకు 36,279 కుటుంబాల నిర్ధారణ జరిగింది. ఈ వివరాలను ఆయా రైతుల కుటుంబాలతో సెల్ఫీ ఫొటోలను కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరడంతో.. నిర్ధారణ కాని 12 వేల మంది రైతులకు రుణమాఫీ వర్తించదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అయితే వ్యవసాయ అధికారులు సరైన సమాచారం ఇవ్వకుండా చేసిన ఈ సర్వేతో.. చాలామంది సమయానికి రాలేక రుణమాఫీకి దూరమవుతున్నారని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు దశల్లో 2.63 లక్షల మందికి రూ.2,312 కోట్ల రుణమాఫీ చేయడం తెలిసిందే. ఏ జిల్లాలో ఎంత మంది రైతులు..వరంగల్ జిల్లాలో 8,252 మంది రైతులకు 6,263 మంది, హనుమకొండలో 8,359 మంది రైతులకు 6,934 మంది, జనగామలో 9,947 మంది రైతులకు 7,762 మంది, మహబూబాబాద్లో 10,937 మంది రైతులకు 6,652 మంది, భూపాలపల్లిలో 5,815 మంది రైతులకు 4,713 మంది, ములుగు జిల్లాలో 4,987 మంది రైతులకు 3,955 రైతు కుటుంబ సభ్యుల నిర్ధారణను వ్యవసాయ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. మొత్తంగా దాదాపు 12 వేల మంది రైతుల వివరాలు నమోదు కాలేదు. రుణమాఫీకి అర్హులైనా రేషన్ కార్డు లేకపోవడంతో అనేకమందికి రుణమాఫీ వర్తించలేదనే ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులైన కుటుంబాల నిర్ధారణ చేపట్టినట్టు వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తెలిపారు. రైతులకు ముందస్తు సమాచారం అందించి పంచాయతీ, రైతు వేదికల్లో రేషన్ కార్డు లేని కుటుంబ సభ్యుల నిర్ధారణ చేపట్టామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరితో సెల్ఫీ తీసుకొని ఆన్లైన్లో వివరాలు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ సమయంలోనే స్థానికంగా ఉండకపోవడం, ఆధార్ కార్డు సమస్యలు, కొందరు విదేశాల్లో ఉండడం తదితర కారణాలతో కొన్ని కుటుంబాలు నిర్ధారణకు దూరంగా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే కుటుంబ నిర్ధారణ జరిగిన రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము ఎప్పుడు వేస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు. -
ఉపాధ్యాయులూ మేల్కొనండి!
వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. గడువు దగ్గర పడుతున్నా.. ఓటు నమోదుపై ఉపాధ్యాయులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20,888 మంది ఓటర్లుండగా.. ప్రస్తుతం మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 10,089 మంది మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.నవంబర్ 6 వరకు గడువు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సెప్టెంబర్ 30న ఓటరు నమోదు షెడ్యూల్ను విడుదల చేసింది. నవంబర్ 6వ తేదీ ఆఖరు తేదీగా ప్రకటించింది. గత ఎన్నికల ఓటరు జాబితా రద్దు చేశామని.. గతంలో ఓటు ఉన్న వారు కూడా తిరిగి నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు చెప్పారు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ఓటర్ నమోదుకు అవకాశం కల్పించారు. ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు దాటింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 12 కొత్త జిల్లాలున్నాయి. అందులో ఇప్పటి వరకు 10,089 మంది మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. పెరిగిన ఉపాధ్యాయుల సంఖ్యఓటరు నమోదుకు ఆఖరి తేదీ నవంబరు 6. ఇంకా 10 రోజులు మాత్రమే గడువుంది. గత ఎన్నికల్లో 20,880 మంది ఓటర్లు ఉన్నందువల్ల ఈసారి ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరిగింది. ఓటర్ల సంఖ్య కూడా పెరగాల్సి ఉంది. ప్రధానంగా హైస్కూల్ ఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, బీఈడీ కళాశాలల అధ్యాపకులతోపా టు ప్రభుత్వ రికగ్నైజ్డ్ హైస్కూళ్లు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఓటర్ నమోదుపై స్పందించాల్సి ఉంది. నివాసమే ప్రామాణికం..ఓటర్లుగా ఉపాధ్యాయులు, అధ్యాపకుల నమోదు గడువు నవంబర్ 1 అని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ తేదీ కంటే ముందు కనీసం 3 ఏళ్లు కచ్చితంగా బోధించి ఉండాలి. ఎన్నిచోట్ల పని చేసినప్పటికీ 3 ఏళ్లు బోధించినట్లు సర్వీస్ సర్టిఫికెట్తో పాటు సంబంధిత విద్యాశాఖాధికారి సంతకం తప్పనిసరిగా ఉంటేనే ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. నివాస ప్రాంతాన్నే ఎన్నికల సంఘం ఓటర్ నమోదుకు ప్రామాణికంగా నిర్ణయించింది. ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ చిరునామా ఆధారంగా ఓటు నమోదు చేసుకోవాలి. బోధన ఎక్కడ చేసినప్పటికీ అది ప్రామాణికం కాదు. ఉదాహరణకు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నల్లగొండలో నివసిస్తున్న వ్యక్తి వరంగల్ జిల్లాలో పనిచేస్తే.. ఆ వ్యక్తి నల్లగొండ చిరునామాతోనే ఓటు నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ మూడు జిల్లాల్లో ఎక్కడైనా ఉపాధ్యాయుడు పని చేస్తూ.. కరీంనగర్ జిల్లాలో నివసిస్తుంటే ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉండదు. ఓటు నమోదుకు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా వారి చిరునామాకు వెళ్లి.. దరఖాస్తుదారు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడా? లేడా? అనేది సిబ్బంది పరిశీలించాలి. ఒకవేళ అక్కడ నివాసం లేకుంటే ఆ దరఖాస్తును తిరస్కరిస్తారు. ఉపాధ్యాయులు ఎక్కడ నివాసం ఉంటే.. అక్కడ ఓటు నమోదు చేసుకుంటేనే ఆ దరఖాస్తు చెల్లుబాటవుతుంది. నివాసం ప్రామాణికంగానే దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారి కోరుతున్నారు. -
మేడారం మినీ జాతర తేదీలు ఖరారు
సాక్షి, వరంగల్: తెలంగాణ కుంభమేళాగా పేరుగావించిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి నాలుగు రోజులపాటు మేడారం జాతర జరగనుంది. ఈ మేరకు శనివారం సమావేశమైన మేడారం పూజారులు.. మినీ జాతర తేదీలను ప్రకటించారు. జాతరకు సంబంధించిన ఏర్పాటు ప్రారంభించాలని రాష్ట్ర దేవాదాయ శాఖను మేడారం పూజారుల సంఘం కోరింది.కాగా ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతర సమయంలోనే వచ్చే భక్తులు ప్రస్తుతం ఏడాది పొడవునా తమకు అనుకూలమైన సమయంలో నిత్యం అమ్మవార్ల దర్శనానికి వేల సంఖ్యలో తరలివస్తున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనంలో కొలువైన వనదేవతలు జనం మధ్యకు రావడంతో అడవి అంతా జనసంద్రమవుతుంది. మహా జాతర జరిగిన మరుసటి సంవత్సరం చిన్న జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. -
పిక్నిక్ ప్లాన్ చేస్తున్నారా.. సరికొత్త హంగులతో లక్నవరం తప్పక చూడాల్సిందే (ఫొటోలు)
-
హైదరాబాద్–వరంగల్ మధ్య ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా విస్తరిస్తున్న వరంగల్కు భారీగా ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. త్వరలో ఇవి రాకపోకలు సాగించనుండగా, దశలవారీగా మొత్తం 82 ఎలక్ట్రిక్ బస్సులను వరంగల్–హైదరాబాద్ మధ్య నడపనున్నారు. ఇందులో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ (18), డీలక్స్ (14), సెమీ డీలక్స్ (21), ఎక్స్ప్రెస్ (29) కేటగిరీ బస్సులున్నాయి. ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో ఈ బస్సులను నిర్వహిస్తుంది. తెలంగాణలో తొలిసారి ఒలెక్ట్రా కంపెనీ బ్యాటరీ బస్సులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ రెండు పర్యాయాలు బస్సులను సరఫరా చేసి నిర్వహిస్తోంది. మూడో ప్రయత్నంలో ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ టెండర్ దక్కించుకుంది. ఇటీవలే కొన్ని బస్సులను కరీంనగర్, నిజామాబాద్ నుంచి ప్రారంభించింది. కానీ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత జనాభా, విస్తీర్ణం పరంగా పెద్ద పట్టణమైన వరంగల్కు ఎక్కువ బస్సులు కేటాయించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు 82 బస్సులు కేటాయించారు. వీటిని వరంగల్–2 డిపో ఆధ్వర్యంలో నడుపుతారు. సింహభాగం బస్సులు హైదరాబాద్కే.. హైదరాబాద్–వరంగల్ మధ్య బస్సులు ఎక్కువగా ఉంటాయి. నిత్యం రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంటుండటంతో ఎక్కువ సర్వీసులు తిప్పుతారు. ఈ నేపథ్యంలోనే రెండు ప్రాంతాల మధ్య అదనంగా కొత్త బస్సులను తిప్పాలని సంస్థ నిర్ణయించింది. జేబీఎం సరఫరా చేసేవరకు కేవలం హైదరాబాద్లో మాత్రమే ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతున్నారు. కాగా తొలిసారి హైదరాబాద్ వెలుపల (హైదరాబాద్–విజయవాడ కాకుండా) ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఇక వరంగల్కు సరఫరా చేసే ఎలక్ట్రిక్ బస్సుల్లో మూడొంతులు హైదరాబాద్ రూట్లోనే తిప్పనున్నారు. వరంగల్–2 డిపోలో సిద్ధం చేసిన సెంటర్లో బ్యాటరీ చార్జ్ చేసి పంపిన తర్వాత, తిరుగు ప్రయాణం కోసం మళ్లీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్లో చార్జింగ్ పాయింట్లు ఉన్నందున హైదరాబాద్కే ఎక్కువ బస్సులు తిప్పనున్నారు. కరీంనగర్, నిజామాబాద్ల్లో ఇప్పటికే చార్జింగ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. దీంతో కొన్ని బస్సులను వరంగల్ నుంచి ఆ రెండు నగరాలకు కూడా నడపాలని నిర్ణయించారు. హైదరాబాద్కు ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు తిప్పనున్నందున.. ప్రస్తుతం హైదరాబాద్–వరంగల్ మధ్య నడుస్తున్న డీజిల్ బస్సుల్లో కొన్నింటిని తప్పించి వరంగల్ నుంచి ఇతర ప్రాంతాల మధ్య నడపనున్నారు. -
కాంగ్రెస్లో ‘కొండా’ వర్గం కలకలం.. హస్తినకు హస్తం నేతలు
వరంగల్, సాక్షి: వరంగల్లో కాంగ్రెస్ రాజకీయాలు హీటెక్కాయి. రేపు (గురువారం) ఢిల్లీ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పయనం కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ను ఎమ్మెల్యేలు కోరినట్ల సమాచారం. మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ వర్గం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోండా సురేఖపై ఏడుగురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.చదవండి: TG: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా -
బతుకమ్మ పుట్టినిల్లు!
సాక్షి, వరంగల్: బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ పూల వేడుక. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామం. ఈ మేరకు పలు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ గుర్తింపునకు చిహ్నంగానే ఆ ప్రాంతంలో పదెకరాల విస్తీర్ణంలో బతుకమ్మ ఆలయం నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. శ్రీశాంతికృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వ కళావిరాట్ డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య.. ఈ గ్రామం బతుకమ్మకు పుట్టినిల్లని పలు చారిత్రక పరిశోధనల్లో తేల్చారు. అటు రాష్ట్ర దేవాదాయ శాఖ, ఇటు కేంద్ర పర్యాటక శాఖను సమన్వయం చేసుకుంటూ, ఎన్ఆర్ఐలు, ప్రజల నుంచి విరాళాలు సేకరించే బృహత్తర కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అంతా అనుకూలిస్తే మరో నాలుగు నెలల్లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించే దిశగా అడుగులు పడతాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణమైతే ఓవైపు ఆధ్యాతి్మకంగా, మరోవైపు పర్యాటకంగా చౌటపల్లి విరాజిల్లనుంది. ఇప్పటికే చారిత్రక నగరంగా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో మరో చారిత్రక ప్రాంతం చేరనుంది. రూ.100 కోట్లతో ఆలయ నిర్మాణం గ్రామంలోని పదెకరాల్లో నిర్మించే బతుకమ్మ గుడికి రూ.100 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రూ.70 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనుండగా.. రూ.30 కోట్ల మేరకు భక్తుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే చౌటపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి రూ.కోటి నిధులు మంజూరు చేసిన బెంగళూరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ దాఖోజు రవిశంకర్ దాదాపు రూ.15 కోట్లు బతుకమ్మ గుడి నిర్మాణానికి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. బతుకునిచ్చిన అమ్మ!17వ శతాబ్దంలో తెలంగాణను నిజాం నవాబులు పరిపాలిస్తున్నారు. ఆ సమయంలో ఓరుగల్లు పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వంగాల రామయ్య 16వ ఏటనే నిజాం ప్రభువులకు చెందిన వెండి నాణేల ముద్రణ కర్మాగారంలో పనిచేస్తూ అనతికాలంలోనే పాలకులను ఆకట్టుకొని కొంత మాన్యం పొందారు. ఆ ప్రాంతమే ఇప్పటి పర్వతగిరి మండలంలోని చౌటపల్లి. రామయ్య ఆ స్థలంలో ప్రజల సౌకర్యార్థం చెరువు తవ్వించి వసతులు కల్పించారు. సౌటమట్టి కలిగిన ప్రాంతం కనుక సౌటపల్లిగా, కాలక్రమంలో చౌటపల్లిగా మారింది. కొంత కాలానికి చౌటపల్లి గ్రామ శివారు గ్రామాల ప్రజలు కలరా సోకి చనిపోతున్నారని తెలిసి గ్రామ ప్రజలు రామయ్యను సంప్రదించారు. సమస్య పరిష్కారానికి ఆయన గాయత్రిదేవిని ఉపాసించాడు. ఆ తల్లి నామస్మరణలో మూడు రోజులు గడిపాడు. దీంతో గాయత్రీమాత ఆయనకు స్వప్నంలో కనిపించింది. అశరీర వాణిగా గ్రామ సౌభాగ్యానికి తన సంతానాన్ని ఆర్పించాలని, ప్రత్యేక పూజా విధానం, పాత్ర కాని పాత్రలో ఎంగిలిపడని పూలను పేర్చి గౌరీమాత స్వయంగా వెలుగొందిన గుమ్మడి పూలను పేర్చాలి. పేర్చిన పూలపై పెట్టి గౌరీమాతను నవదినాలు గ్రామంలో అందరూ కలిసి పూజించాలని ప్రబోధించినట్లు ప్రచారంలో ఉంది. బతుకునీయమ్మా.. బతికించమ్మా అనే పదాల నుంచే బతుకమ్మ అవిర్భవించిందని చెబుతున్నారు. దీనిపై చారిత్రక పరిశోధన చేసిన డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య.. ఈ వివరాలన్నీ పుస్తక రూపంలోకి తెచ్చారు. యాదాద్రి తరహాలోనే బతుకమ్మ గుడి.. 40 ఏళ్ల పాటు నేను చేసిన చారిత్రక పరిశోధనలతో చౌటపల్లి బతుకమ్మ పుట్టినిల్లుగా తేలింది. అందుకే ఇక్కడా యాదాద్రి తరహాలోనే బతుకమ్మ గుడిని నిర్మించాలనుకుంటున్నాం. ఈ గుడి నిర్మాణ నమూనాకు యాదాద్రి టెంపుల్ డిజైనర్ ఆనంద్సాయి, స్థపతిగా పద్మశ్రీ వేణు ఆనందాచార్య వ్యవహరిస్తారు. తెలంగాణ తల్లి రూపశిల్పి బైరోజు వెంకటరమణాచార్యులు (బీవీఆర్ చార్యులు) ఇప్పటికే బతుకమ్మ చిత్రపటాన్ని విడుదల చేశారు. 2019లోనే బతుకమ్మపై బృంద నృత్యం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించాం. బతుకమ్మ గుడి నిర్మాణం పూర్తయ్యే వరకు అకుంఠిత దీక్షతో పనిచేస్తా. – డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య, శ్రీ శాంతికృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు -
వరంగల్ కేఎంసీలో డ్యాన్స్.. జోష్ (ఫొటోలు)
-
బీఆర్ఎస్ కుట్రలో భాగమే వరంగల్ ఆరు ముక్కలు: కడియం శ్రీహరి
సాక్షి, జనగామ: తెలంగాణలో అవినీతి, అక్రమాలకు మారుపేరు బీఆర్ఎస్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అలాగే, వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకే జిల్లాను ఆరు ముక్కలు చేశారని చెప్పుకొచ్చారు. జిల్లాను ముక్కలు చేయవద్దు అన్నందుకే తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్గా మారాయి.స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్య వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వమే కాలరాసింది. అవినీతి, అక్రమాలకు బీఆర్ఎస్ మారుపేరు. వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకు కేసీఆర్ కుట్ర పన్నారు. అందులో భాగంగానే జిల్లాను ఆరు ముక్కలు చేశారు. దీనిపై ప్రశ్నించినందుకే రెండో సారి నాకు మంత్రి పదవి ఇవ్వలేదు.కేసీఆర్ కుటుంబ చేతిలో తెలంగాణ బంధీ అయ్యింది. బీఆర్ఎస్ నేతలు సిగ్గులేకుండా ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఏకంగా శాసనసభ పక్షాలను కలుపుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇప్పట్లో తెలంగాణలో ఉప ఎన్నికలు రావు. ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. స్టేషన్ ఘనపూర్లో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదు. కోర్టులు, ప్రజాస్వామ్యంపై మాకు గౌరవం ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: మూసీ పరివాహక ప్రాంతాల్లో టెన్షన్.. అక్కడ భవనం కూల్చివేత -
Deepthi Jeevanji: గేలిచేస్తే గెలిచేసి...
పారిస్లో జరుగుతున్న పారా ఒలింపిక్స్లో మన వరంగల్ బిడ్డ దీప్తి జీవాన్జీ కాంస్యం సాధించింది. 400 మీటర్ల టి20 విభాగంలో ఆమె ఈ ఘనతను లిఖించింది. పారా ఒలింపిక్స్లో ఏ విభాగంలో అయినా పతకం సాధించిన అతి చిన్న వయస్కురాలు దీప్తే. ఊర్లో అందరూ వెక్కిరించినా హేళనతో బాధించినా వారందరికీ తన విజయాలతో సమాధానం చెబుతోంది దీప్తి. ఒకనాడు హేళన చేసిన వారు నేడు ఆమె పేరును గర్వంగా తలుస్తున్నారు.మొన్నటి మంగళవారం (సెప్టంబర్ 3) పారిస్ పారా ఒలింపిక్స్లో దీప్తి పరుగు తెలుగు వారికీ దేశానికి గొప్ప సంతోషాన్ని గర్వాన్ని ఇచ్చింది. 400 మీటర్ల టి20 (బుద్ధిమాంద్యం) విభాగంలో దీప్తి 55.52 సెకండ్లలో మూడోస్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ ΄ోటీలో మొదటి స్థానంలో ఉక్రెయిన్కి చెందిన యూలియా (55.16 సెకండ్లు), రెండవ స్థానంలో టర్కీకి చెందిన ఐసెల్ (55.23) సెకన్లు నిలిచారు. ఇంకొన్ని సెకన్లలో ఆమెకు స్వర్ణమే వచ్చేదైనా ఈ విజయం కూడా అసామాన్యమైనదే ఆమె నేపథ్యానికి.షూస్ లేని పాదాలుదీప్తి స్వగ్రామం వరంగల్ జిల్లాలోని కల్లెడ. తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి. పుట్టుకతో దీప్తి బుద్ధిమాంద్యంతో ఉంది. ఆమె రూపం కూడా పూర్తిగా ఆకారం దాల్చలేదు. దాంతో స్కూల్లో చుట్టుపక్కల అన్నీ హేళనలే. మాటల్లో వ్యక్తపరచడం రాని దీప్తి అన్నింటినీ మౌనంగా సహించేది. కొందరు ‘కోతి’ అని వెక్కిరించేవారు. స్కూల్లో ఆమె ఆటల్లో చరుకుదనం చూపించేసరికి తల్లిదండ్రులు కనీసం ఈ రంగంలో అయినా ఆమెను ్ర΄ోత్సహిస్తే కొంత బాధ తగ్గుతుందని భావించారు. పిఇటీ టీచర్ బియాని వెంకటేశ్వర్లు ఆమెను ్ర΄ోత్సహించారు. హనుమకొండలో స్కూల్ లెవల్లో ఆమె పరుగు చూసి ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ ్ర΄ోత్సహించాడు. రాష్ట్రస్థాయి ΄ోటీలకు హైదరాబాద్ రమ్మంటే షూస్ లేకుండా ఖాళీ పాదాలతో వచ్చిన దీప్తికి సహాయం అందించేందుకు నాగపురి రమేశ్ పూర్తి దృష్టి పెట్టాడు. దాంతో అంచలంచెలుగా ఎదిగిన దీప్తి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. పుల్లెల గోపిచంద్ కూడా ఆమె శిక్షణకు ఆర్థిక సహాయం అందించారు.బంగారు పరుగు2022లో మొరాకో వేదికగా జరిగిన ప్రపంచ పారా గ్రాండ్ప్రిలో 400 మీటర్ల పరుగులో పసిడితో మెరిసింది. అదే సంవత్సరం బ్రిస్బే¯Œ ఆసియానియా ΄ోటీల్లో 200 మీటర్లలో 26.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడిపతకం గెలిచింది. 400 మీటర్లను 57.58 సెకన్ల వ్యవధిలోనే పూర్తి చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మే 2024లో జపాన్లో జరిగిన పారా అథ్లెటిక్స్లో ఏకంగా స్వర్ణం సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు పారిస్లో కాంస్యం సాధించడంతో ఆమె దేశ పతాకాన్ని తల ఎత్తుకునేలా చేసింది. ఒకప్పుడు గేలి చేసిన ఊరికి ఆమె పేరు ఇప్పుడు చిరునామాగా మారింది. -
లక్ష్య సాధకులు.. యూపీఎస్సీ ఫలితాల్లో మెరిసిన అన్నదమ్ములు!
వరంగల్: ఆ అన్నదమ్ములు.. ఉన్నత ఉద్యోగం సాధించాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నారు. దీనికి ఓ లక్ష్యం విధించుకున్నారు. ఈ మార్గంలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా తట్టుకుని ప్రణాళిక ప్రకారం చదివి గమ్యం చేరుకున్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షకు అనుగుణంగా యూపీఎస్సీ ఉద్యోగాలు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారు ఈ గిరిపుత్రులు. వారే నర్సంపేట పట్టణానికి చెందిన ఆంగోత్ భద్రయ్య–అరుణ దంపతుల కుమారులు సంతోశ్, ఆనంద్. ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన ఫలితాల్లో సంతోశ్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్లో మైనింగ్ ఇంజనీర్, ఆనంద్ కేంద్ర కార్మిక శాఖలో లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఉద్యోగం సాధించారు. ఒక ఉద్యోగం సాధించడమే కష్టంగా మారిన ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం చేసూ్తనే మరో ఉద్యోగానికి అదీ జాతీయ స్థాయి ఉద్యోగాలకు సన్నద్ధమై సాధించడం గొప్ప విశేషం.విద్యాభ్యాసం..సంతోశ్, ఆనంద్ ఇద్దరూ ప్రాథమిక విద్యను నర్సంపేటలో పూర్తి చేశారు. సంతోశ్ పదో తరగతి హనుమకొండ, ఇంటర్ హైదరాబాద్, కర్ణాటక ఎన్ఐటీలో ఇంజనీరింగ్, జైపూర్లో ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం అల్ట్రాటెక్ సిమెట్స్ (ఆదిత్య బిర్లా)లో ఇంజనీర్గా, కొంత కాలం పేటీఎం సంస్థలో, జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థలో రెండు సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. సివిల్స్ లక్ష్యంగా ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నారు. ఒక పక్క ఉద్యోగం చేసూ్తనే.. మరోపక్క ఖాళీ సమయంలో పోటీ పరీక్షకు సన్నద్ధమై ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్లో ఇంజనీర్ కొలువు సాధించారు. ఆనంద్ పదో తరగతి బిట్స్ స్కూల్, ఇంటర్, ఇంజనీరింగ్ హైదరాబాద్, వరంగల్ ఎన్ఐటీలో ఎంబీఏ పూర్తి చేశారు. టీసీఎస్లో స్టాఫ్వేర్, ఆ తర్వాత చెన్నై పెట్రోలియం సంస్థలో హెచ్ఆర్ అధికారిగా పని చేసూ్తనే యూపీఎస్సీ ద్వారా కార్మిక శాఖలో ఉద్యోగం సాధించాడు.తల్లిదండ్రులు భద్రయ్య–అరుణతో ఆనంద్, సంతోశ్ (ఫైల్)ప్రణాళిక ప్రకారం చదివి.. లక్ష్యం చేరుకుని..ఉన్నత చదువులతో జీవితంలో స్థిరపడిన తమ బాబాయ్లు, తల్లిదండ్రులను సంతోశ్, ఆనంద్ ఆదర్శంగా తీసుకున్నారు. యూపీఎస్సీలో ఉన్నత ఉద్యోగం సాధించాలని లక్ష్యం విధించుకున్నారు. ఈ నేపథ్యంలో సంతోశ్ రెండు దఫాలు( గ్రూప్–ఏ) ప్రిలిమ్స్, మెయిన్స్ వరకు వెళ్లారు. అయితే ఆ ఫలితాలు నిరాశకు గురిచేశాయి. అయినా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా మూడో ప్రయత్నంలో (గ్రూప్–బీ) గమ్యం చేరుకున్నాడు. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్లో మైనింగ్ ఇంజనీర్ కొలువు సాధించాడు. ఇక ఆనంద్ మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. కేంద్ర కార్మిక శాఖలో లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఉద్యోగం సాధించారు. ఈ అన్నదమ్ములు సుమారు సంవత్సరం కాలం పుస్తకాలతో దోస్తీ పట్టారు. ఎప్పుడూ చదువు ధ్యాసే. విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యం చేరుకున్నారు. ఎందరో యువకులకు ఆదర్శంగా నిలిచారు.కుటుంబ నేపథ్యం..సంతోశ్, ఆనంద్ తల్లిదండ్రులు ఆంగోత్ భద్రయ్య–అరుణ దంపతులది వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం భోజెర్వు గ్రామం జగ్గుతండా. భద్రయ్య తల్లిదండ్రులు ఆంగోత్ చీమా–మల్కమ్మ. ఈ దంపతులకు నలుగురు కుమారులు భద్రయ్య, తారాసింగ్, మోహన్, విజేందర్ ఉన్నారు. భద్రయ్య టీచర్గా, తారాసింగ్ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుడిగా, మోహన్ పిల్లల వైద్య నిపుణుడిగా, విజేందర్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో తమ తండ్రి తప్ప అందరూ డాక్టరేట్లుగా ఉన్న తమ బాబాయ్లను స్ఫూర్తిగా తీసుకున్న సంతోశ్, ఆనంద్.. చిన్నప్పటి నుంచే చదువులో రాణిస్తూ వచ్చారు. ఉద్యోగ రీత్యా వీరి కుటుంబం నర్సంపేటలో స్థిరపడింది. సంతోశ్, ఆనంద్ తల్లి అరుణ వైద్య ఆరోగ్యశాఖలో ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్–1 అధికారి, తండ్రి భద్రయ్య చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్గా పని చేస్తున్నారు. -
కక్షలెందుకు తమ్ముడూ.. కలిసి ఉందాం ఎప్పుడూ..
ఖిలా వరంగల్: ఇంటిస్థలం విషయమై అక్కాతమ్ముడి మధ్య తలెత్తిన వివాదానికి పోలీసులు ప్రేమపూర్వక పరిష్కారం చూపించారు. తమ్ముడికి అక్కతో రాఖీ కట్టించి ఇద్దరినీ ఏకం చేశారు. ఉర్సు కరీమాబాద్ కోయవాడకు చెందిన పస్తం కోటమ్మ, ఆమె తమ్ముడు కొత్తూరు ఏడుకొండలు మధ్య వారసత్వ ఇంటిస్థలంకోసం గొడవ జరుగుతోంది. చివరికి కోటమ్మ.. తమ్ము డిపై మిల్స్కాలనీ పీఎస్లో శనివారం ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్ఐ సురేశ్ అక్కాతమ్ముడిని స్టేషన్కు పిలిపించారు. వారసత్వ ఇంటిస్థలం, తోబుట్టువుల అనుబంధంపై అవగాహన కల్పించి.. స్థల వివాదాన్ని పరిష్కరించారు. అనంతరం అక్కతో తమ్ముడికి రాఖీ కట్టించారు. సుహృద్భావ పరిష్కారానికి కృషి చేసిన ఎస్ఐ సురేశ్ను ఇన్స్పెక్టర్ మల్లయ్య అభినందించారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థి రాజేష్ మృతి
సాక్షి, హన్మకొండ: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతిచెందాడు. హన్మకొండ జిల్లాకు చెందిన రాజేష్.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి పేరెంట్స్.. కుమారుడి మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు.వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఆత్మకూరులో విషాదం నెలకొంది. ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేష్ ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. 2015లో ఎమ్మెస్ ట్రైనింగ్ చేసేందుకు వెళ్లిన రాజేష్.. మూడు రోజుల క్రితం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు అతని స్నేహితులు సమాచారం ఇచ్చారు. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.అయితే, రాజేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కన్నీరు పెట్టుకుంటూ కుమారుడి మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక, తొమ్మిది నెలల క్రితమే రాజేష్ తండ్రి మరణించారు. -
తెలంగాణలో డెంగ్యూ డేంజర్ బెల్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు జ్వర పీడితులు క్యూ కడుతున్నారు. సాధారణం కంటే 20 శాతం ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముందస్తు చర్యలు లేకే డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో జ్వరాల బాధితుల సంఖ్య. పెరుగుతోంది. ఎంజిఎంలో రోజుకు 30 జ్వరం కేసులు నమోదు అవుతుండగా.. రెండు డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. దీంతో 20 పడకల ప్రత్యేక ఫీవర్ వార్డ్ ఏర్పాటు చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో ప్రస్తుత రోజులకు సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయని.. డెంగ్యూ ఇమేజింగ్ ఫీవర్, డెంగ్యూ షాట్ సిండ్రోమ్ వస్తే వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ కావాలని సూపరిండెంట్ మురళి తెలిపారు.భాగ్యనగరవాసులకు అలర్ట్.. విషజ్వరాల కారణంగా రోగులతో దవాఖానాలు బిజీ (ఫొటోలు) -
పెళ్లయిన వ్యక్తితో ప్రేమాయణం..
రాయపర్తి: అతనికి పెళ్లయ్యింది. కానీ వరుసకు చెల్లె అయ్యే యువతితో చాలాఏళ్ల ప్రేమ.. పెద్దలు పలుమార్లు మందలించారు. చివరికి ఆ జంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలోని రామచంద్రుని చెరువు వద్ధ సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా పైడిపల్లి పరిధిలోని మధ్యగూడానికి చెందిన తిక్క అంజలి(25), అదే గ్రామానికి చెందిన సంగాల దిలీప్(30) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ దగ్గరి బంధువులు కావడం, అందులోనూ వరుసకు అన్నాచెల్లెళ్లు కావడంతో పెద్దలు ఒప్పుకోరనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం దిలీప్కు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం జంజరపల్లికి చెందిన ఓ యువతితో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. అయినా వీరి ప్రేమను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దిలీప్ వరంగల్ హంటర్రోడ్డులో ఓ మార్బుల్ దుకాణంలో సూపర్వైజర్గా పనిచేస్తుండగా, అంజలి ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా చేస్తుంది. వీరి ప్రేమ విషయం భార్యకు తెలియడంతో చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల భార్య తన పుట్టింటికి వెళ్లింది. దీంతో దిలీప్.. అంజలితో తిరగడం ప్రారంభించారు. విషయ పెద్దలకు తెలియగా నాలుగురోజులక్రితం మందలించారు. ఇప్పటినుంచి అలా తిరగమని చెప్పి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో దిలీప్ ఆదివారం ఉదయం 9:30 గంటల సమయంలో డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రి అయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎక్కడికో వెళ్లి ఉంటాడనుకున్నారు. సోమవారం ఉదయం రాయపర్తిలోని రామచంద్రుని చెరువులో రెండు మృతదేహాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ సూర్యప్రకాష్, వర్ధన్నపేట ఎస్సై ప్రవీణ్లతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పరిశీలించగా దిలీప్, అంజలిదిగా గుర్తించారు. క్లూస్టీంతో పరిశీలించి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ సూర్యప్రకాష్ తెలిపారు. -
ఎట్టకేలకు స్పందించారు
‘ఎన్నాళ్లీ నరకం’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. వరంగల్ జాతీయ రహదారిపై అసంపూర్తి దశలో నిలిచిపోయిన ఉప్పల్– నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, అధికారులతో కలిసి ఫ్లై ఓవర్ నిర్మాణంపై అక్కడికక్కడే సమీక్షించారు. ఈ సందర్భంగా వరంగల్ రహదారిపై భారీగా ట్రాఫిక్జాం ఏర్పడింది. Uppal - Narapally Flyover: ఎన్నాళ్లీ నరకం? -
Uppal - Narapally Flyover: ఎన్నాళ్లీ నరకం?
ప్రత్యక్ష నరకం మీరెప్పుడైనా చవిచూశారా? అయితే.. ఉప్పల్– నారపల్లి రహదారిలో ప్రయాణించండి నరకం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆరేళ్లుగా వాహనదారులు, ప్రయాణికులు, స్థానికులు, వ్యాపారులు తిప్పలు పడుతూనే ఉన్నారు. వరంగల్ జాతీయ రహదారిలో ఉప్పల్– నారపల్లి మధ్య 6.2 కిలో మీటర్ల మేర చేపట్టిన కారిడార్ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో నిత్యం నరకాన్ని అనుభవించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దుమ్మూ ధూళి.. బురద.. కంకర తేలి గుంతలు ఏర్పడి.. వానొస్తే రోడ్డుపై కుంటలను తలపిస్తున్నాయి. ఎక్కడ గొయ్యి ఉందో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుర్గతి పట్టింది. ఆరేళ్లుగా ఈ దురావస్థతోనే ప్రజలు కాలం వెళ్లబుచ్చుతుండటం శాపంలా పరిణమించింది. ఎంతటి దయనీయ పరిస్థితి దాపురించిందో ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణ బాధితులు. ఇప్పటికైనా ఏళ్లుగా పడుతున్న నరకం నుంచి తమను గట్టెక్కించాలని వేడుకొంటున్నారు. ఉప్పల్: వరంగల్ జాతీయ రహదారిలో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 6.2 కిలో మీటర్ల మేర 148 పిల్లర్లతో ఫ్లై ఓవర్ పనులకు అప్పటి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.625 కోట్లు. 2018 జులైలో ప్రారంభమైన పనులు 2020 జూన్లో పూర్తి కావాలి. కానీ.. పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో 6.2 కి.మీ మేర రోడ్డంతా గుంతలమయంగా మారింది. దీంతో ప్రజలు, వాహనదారులు నిత్యం ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ రహదారిలో నిమిషానికి దాదాపు 960 నుంచి 1000 వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉప్పల్ కూడా ఒకటి. దీంతో రోడ్డు సరిగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనేక మంది అమాయకులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలున్నాయి. అభివృద్ధి శరవేగం.. ఇటు అధ్వానం..ఉప్పల్ నుంచి నల్ల చెరువు వరకు రోడ్డుకు ఇరు వైపులా ఉన్న వర్తక, వాణిజ్య దుకాణాలు రోడ్డు వెడల్పు పనులతో తీవ్రంగా నష్టపోయాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నల్ల చెరువు వరకు రోడ్డుకు ఇరువైపులా 450 షాపులు ఉన్నాయి. ఫ్లై ఓవర్ నిర్మాణంతో రోడ్డు సరిగా లేని కారణంగా వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల జాబితాల్లో ఉప్పల్ మొదటి స్థానంలో ఉంది. ఒకవైపు మెట్రో రైలు.. మినీ శిల్పారామం, స్కైవాక్ వంతెన, ఉప్పల్ టు నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. ఇలా ఎటు చూసినా అన్నివిధాలా ఉప్పల్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో జాప్యంతో ఇక్కడి ప్రజలు, వాహనదారులు, వ్యాపారులు ఆరేళ్లుగా నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కేవలం రెండేళ్లలో పూర్తి కావాల్సిన నిర్మాణానికి అనేక అడ్డంకులు రావడంతో పనులు నిలిచి పోయాయి. దీంతో ఇక్కడి ప్రజలకు ఎదురు చూపులే మిగిలాయి. కాంట్రాక్టు రద్దు చేశారా? ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కాంట్రాక్టును గాయత్రీ కన్స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకున్న విషయం విదితమే. కానీ.. పనుల్లో తీవ్ర జాప్యం కారణంగా సదరు సంస్థ గడువులోగా పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో సదరు కాంట్రాక్టును ప్రభుత్వం రద్దు చేసినట్లు ప్రకటించింది. మరో సంస్థకు మిగిలిన పనులను అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.బిజినెస్ నిల్.. వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్ మార్గంలో స్టేషనరీ, వస్త్ర, వాణిజ్య షాపులు, పూజా సామగ్రి, కిరాణా, ఆటోమొబైల్, ఫర్నిచర్, స్వీట్ దుకాణాలు, హోటళ్లు తదితర అనేక వ్యాపారాలు మనుగడ పొందుతున్నాయి. కాగా.. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా దుమ్మూ ధూళితో వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. రోడ్లు వేయక పోవడం, విద్యుత్ స్తంభాలను మార్చకపోవడం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచక పోవడంతో వందలాది మంది వ్యాపారులు అవస్థలు పడుతున్నట్లు వర్తక సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆరేళ్లుగా వ్యాపారాలు నిల్.. కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభించినప్పటి నుంచి రోడ్లు లేక దుమ్ము కొట్టుకుపోవడంతో గిరాకీ లేక అవస్థలు పడుతున్నాం. 90 శాతం గిరాకులు దెబ్బతిన్నాయి. వ్యాపారులమంతా తీవ్రంగా నష్టపోయాం. – శేఖర్ సింగ్, ఉప్పల్ వర్తక సంఘం ప్రతినిధి రోడ్డుపైకి రావాలంటే సాహసం చేయాల్సిందే.. ఉప్పల్ రోడ్డు మీదకు రావాలంటే సాహసం చేయాల్సి వస్తోంది. ఏళ్లుగా పాడైపోయిన రోడ్ల మీద వాహనం నడిపి ఆరోగ్యం పోగొట్టుకోవాల్సి వస్తోంది. ఎవరికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. మా బాధలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. స్కూల్ పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. – శ్రీనివాస్ గౌడ్, స్కూల్ కరస్పాండెంట్గత ప్రభుత్వ అశ్రద్ధతోనే.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ వల్లనే రోడ్డు ఎటూ కాకుండా పోయింది. ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయాలి. కాని పారీ్టలను దృష్టిలో పెట్టుకుని కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన ముందుకు వచ్చి నిర్ణయం తీసుకోవాలి. – మేకల శివారెడ్డి, ఉప్పల్ పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ -
వరంగల్కు రాహుల్ గాంధీ!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఓరు గల్లులో పర్యటించనున్నారు. హను మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఈ నెలాఖరున నిర్వహించ తలపెట్టిన రైతు రుణ మాఫీ కృతజ్ఞత సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరు కాను న్నారు. 2022, మే 6న ఇదే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రాహుల్గాంధీ ముఖ్య అతిథిగా రైతు సంఘర్షణ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలోనే ఆయన రైతు డిక్లరేషన్ను ప్రకటించారు. రూ.2 లక్షల మేరకు రైతుల రుణా లను మాఫీ చేయనున్నట్లు ప్రకటించడంతోపాటు 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ చేర్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీకి కూడా శ్రీకారం చుట్టింది. మొదటి విడతగా రూ.లక్ష వరకు రాష్ట్రవ్యాప్తంగా 10,83,004 రైతు కుటుంబాలకు రూ.6,093.93 కోట్ల రుణాలను మాఫీ చేసింది. మూడు విడతల్లో రూ.2 లక్షల మేర ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో హామీని అమలు చేసేందుకు కృషి చేసిన నేతలకు కృతజ్ఞతలు తెలిపేందుకు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీపీసీసీ యోచి స్తోంది. రాహుల్గాంధీని ముఖ్యఅతిథిగా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్రెడ్డితోపాటు ముఖ్యులు శనివారం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఆయనతో చర్చించిన తర్వాత కృతజ్ఞత సభ నిర్వహణ తేదీని ప్రకటిస్తారని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. -
ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
మామునూరు: అనారోగ్య కారణాలతో మనస్తాపం చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బుధవారం ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజ నీరింగ్ కళాశాల ప్రాంగణంలోని వాచ్మెన్ నివాస గదిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకా రం.. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మా ల గ్రామం మంగ్లీ తండాకు చెందిన కేలోత్ కిషన్, కవిత దంపతులు వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలోని ఓ గదిలో కుమార్తె నందు(17)తో కలిసి నివా సం ఉంటున్నారు. ఈ దంపతులు కళాశాలలో వంట మనుషులుగా పనిచేస్తున్నారు. నందు(నందిని)ఐనవోలు కస్తుర్బాగాంధీ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈనెల 9న తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో తరచూ అనారోగ్యానికి గురవడంతో మనస్తాపం చెంది బుధవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులు మధ్యాహ్నం గదికి వచ్చి చూడగా ఉరేసుకుని కనిపించింది. ఈ విషయాన్ని వెంటనే కళాశాల యాజమాన్యం, పోలీసులకు తెలుపగా హుటాహుటిన పోలీసులు చేరుకుని విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు సేకరించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కిషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణవేణి తెలిపారు. జీవితంపై విరక్తి చెంది రఘునాథపల్లిలో యువతి.. రఘునాథపల్లి: జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రఘునాథపల్లికి చెందిన కురాకుల లక్ష్మయ్య, రేణుక దంపతుల కూతురు కావ్య (23)కు మూడేళ్ల క్రితం స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండకు చెందిన అడిగం మహేందర్తో వివాహమైంది. వివాహమైన మూడు నెలలకే దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో కావ్య పుట్టింటికి వచ్చింది. పలు మార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించినా.. కాపురానికి తీసుకెళ్లకపోవడంతో భర్తపై హనుమకొండలోని మహిళ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి రఘునాథపల్లిలో తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఈ క్రమంలో జీవి తంపై విరక్తి చెందిన కావ్య బుధవారం పురుగుల మందు తాగింది. తల్లిదండ్రులు చూసి అపస్మారక స్థితిలో ఉన్న కూతురును జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
ఇంజక్షన్ వికటించి బాలుడి మృతి?
నెక్కొండ/ఎంజీఎం, వరంగల్: కొందరి ఆర్ఎంపీల వైద్యానికి నిత్యం ఏదో ఒక చోట అయాయకులు బలవుతున్నారు. తాజాగా మండలంలోని ముదిగొండకు చెందిన కావటి మణిదీప్ (10) కూడా ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో సోమవారం వైరలైంది.వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కావటి కోటేశ్వర్, సరిత దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు మణిదీప్ ఇటీవల కుక్క కాటుకు గురయ్యాడు. దీంతో గ్రామానికి చెందిన ఆర్ఎంపీ అశోక్.. ఈ నెల 11వ తేదీన యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేశాడు. దీంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. దీనిపై సదరు ఆర్ఎంపీ.. గుట్టుచప్పడు కాకుండా మృతుడి కుటుంబ సభ్యులతో రహస్య ఒప్పంద కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ విషయం వైరల్ కావడంతో తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) వెంటనే స్పందించి సుమోటోగా స్వీకరించింది. దీంతో వరంగల్ జిల్లా యాంటీ క్వాకరీ బృందానికి జరిగిన ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాలని చైర్మన్ మహేశ్కుమార్, రిజిస్ట్రార్ లాలయ్య సోమవారం ఆదేశించారు.కాగా, వరంగల్ టీజీఎంసీ సభ్యుడు శేషుమాధవ్, టీజీఎంసీ రిలేషన్ కమిటీ చైర్మన్ నరేశ్కుమార్, రాష్ట్ర ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ అశోక్రెడ్డి, వరంగల్ ఐఎంఏ ప్రెసిడెంట్ అన్వర్మియా, వరంగల్ హెచ్ఆర్డీఏ అధ్యక్షుడు కొలిపాక వెంకటస్వామి, తానా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాకేశ్ నేతృత్వంలోని వైద్య బృందం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి విచారణ చేయనుందని ఆదేశాల్లో పేర్కొంది. -
ప్రియురాలి కుటుంబంపై కత్తితో దాడి
-
మరో హైదరాబాద్గా వరంగల్
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి పెద్దదైన వరంగల్ మహానగరాన్ని.. హైదరాబాద్తో పోటీపడేలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. వరంగల్ సమగ్రాభివృద్ధిపై తాను ప్రత్యేక ఫోకస్ పెడతానన్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా శనివారం మధ్యాహ్నం వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు చేరుకున్న ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. ముందుగా వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం టెక్స్టైల్ పార్కును పరిశీలించాక రోడ్డు మార్గంలో నగరానికి చేరుకుని నిర్మాణంలో ఉన్న సూపర్స్పెషాలిటీ అస్పత్రి పనులను పరిశీలించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్కు చేరుకున్నారు. కలెక్టరేట్లో వరంగల్ మహానగర పాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి రేవంత్ సుదీర్ఘంగా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా రింగ్ రోడ్డు నిర్మాణం, స్మార్ట్సిటీ పనులు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, విమానాశ్రయం పరిస్థితి, కాళోజీ కళాక్షేత్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి తదితర వరంగల్ నగరాభివృద్ధికి సంబంధించి 8 అంశాలపై సుమారు మూడు గంటలపాటు చర్చించారు. తక్షణమే రింగ్రోడ్డుకు భూసేకరణ హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మొదట రింగ్ రోడ్డు నిర్మాణంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రెండు దశల్లో 13 కిలోమీటర్ల వరకు చేపట్టనున్న రింగ్ రోడ్డు నిర్మాణానికి సత్వరమే భూ సేకరణ చేపట్టాలని ఆదేశించారు. ఆ తర్వాతే నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు. వరంగల్ నుంచి ఇతర జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగుపడేలా జాతీయ రహదారుల కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని, నాలాల ఆక్రమణపై దృష్టి సారించాలని, నాలాల్లో సిల్ట్ను ఎప్పటికప్పుడు తొలగించాలని నిర్దేశించారు. హైదరాబాద్లో చేపడుతున్న కొత్త పద్ధతులను వరంగల్లోనూ చేపట్టాలని, అక్కడ వరదలు వచి్చనప్పుడు ఏ చర్యలు తీసుకుంటున్నారో ఇక్కడ కూడా అమలు చేయాలని అధికారులకు సూచించారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంపై సమగ్ర నివేదిక (డీపీఆర్) తయారు చేయాలన్నారు. మహిళా సంఘాలు మరింత బలోపేతం వరంగల్ నగరాభివృద్ధికి రూ.6115 కోట్ల నిధులు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందో లేదో తెలుసుకోవాలన్నారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, సెపె్టంబర్ 9 నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అత్యవసర సమయంలో ఆపరేషన్లు ఇతర వైద్య సేవలకు నిమ్స్లో అందిస్తున్నట్లుగా ఎంజీఎం ఆస్పత్రిలో ఎన్ఓసీ ఇచ్చే అంశంపై పరిశీలన జరుపుతామని చెప్పారు. రాష్ట్రంలో స్వశక్తి మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్కూల్ విద్యార్థుల యూనిఫాంలకు సంబంధించిన పెండింగ్ బిల్స్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ శాఖల యూనిఫామ్లు కుట్టించే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించే విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. ఇందిరా మహాశక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలో వరంగల్ అభివృద్ధిపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి సమావేశం నిర్వహిస్తారన్నారు. అనంతరం స్వశక్తి మహిళలకు రూ.518.71 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. తర్వాత హంటర్రోడ్డులో మెడికవర్ ప్రైవేట్ ఆస్పత్రిని ప్రారంభించి హైదరాబాద్కు బయలుదేరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ మొదటిసారిగా వరంగల్లో పర్యటించారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ప్రభుత్వ కార్యదర్శులు రోనాల్డ్రోస్, క్రిస్టియానా, జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారదదేవి, సీపీ అంబర్ కిషోర్ ఝాతోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ‘సూపర్ స్పెషాలిటీ’పై సీఎం సీరియస్ వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల అంచనా వ్యయం ఎందుకు పెరిగింది? అని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ‘ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిన పనులు చేపడుతున్నందున అలా పెంచే వీలులేదు. రూ.1,100 కోట్లను ఎలాంటి అనుమతులు లేకుండా రూ.1,726 కోట్లకు పెంచారు. రూ.626 కోట్లు ఎలా పెంచుతారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల విలువ అంచనాల పెంపుపై ప్రత్యేక రిపోర్టు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి సమగ్రమైన మాస్టర్ ప్లాన్ను 2050 సంవత్సరం వరకు డిజైన్ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రి లాగా వరంగల్లోనూ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వినతిపత్రాలు తీసుకోకుండానే.. హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో సమీక్షకు వచి్చన సీఎంను కలిసి వినతిపత్రాలు ఇచ్చేందుకు ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సుమారు మూడు గంటలపాటు సమీక్ష సాగటంతో జనం వేచి ఉన్నారు. ఈ క్రమంలో జోరువాన రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భద్రతా కారణాలతో సిబ్బంది లోనికి కూడా అనుమతించలేదు. సమావేశం ముగిశాక బయటికి వచ్చిన రేవంత్ నేరుగా బస్సు ఎక్కారు. సీఎంకు వినతిపత్రాలు చూపిస్తూ బస్సు వెంట జనం పరుగులు తీశారు. అయినా రేవంత్ అలానే వెళ్లిపోయారు. దీంతో వారు అక్కడే ఉన్న అధికారులు, నాయకులకు వినతులు అందజేశారు. -
వరంగల్ అభివృద్ధిపై సమీక్ష.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి, వరంగల్: హైదరాబాద్తో సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయన వరంగల్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు సూచించిన సీఎం.. భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలన్నారు.ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్టైల్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డుమార్గం ఉండేలా చూడాలన్న సీఎం. స్మార్ట్ సిటీ మిషన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.వరంగల్ నగర అభివృద్ధిపై ఇకనుంచి ప్రతీ 20 రోజులకోసారి ఇంచార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని ఆదేశించిన సీఎం.. నగర అభివృద్ధికి సంబంధించి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వరంగల్లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్న సీఎం.. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
నేడు వరంగల్కు ముఖ్యమంత్రి రేవంత్
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం వరంగల్లో పర్యటించనున్నారు. వాస్తవానికి శుక్రవారం సీఎం పర్యటన ఖరారు అయినప్పటికీ ఢిల్లీ కార్యక్రమాలలో బిజీగా ఉన్నందున శనివారానికి వాయిదా పడింది. గ్రేటర్ వరంగల్ సమగ్ర అభివృద్ధితో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్షించేందుకు ఆయన శనివా రం గ్రేటర్ వరంగల్లో పర్యటించనున్నారు. ఈ మే రకు సీఎంవో వర్గాలు శుక్రవారం సాయంత్రం ము ఖ్యమంత్రి పర్యటన వివరాల్ని విడుదల చేశాయి. ఇదీ షెడ్యూల్...ఢిల్లీ నుంచి శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకోనున్న ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1.30 గంటలకు కాకతీయ టెక్స్టైల్ పార్క్కు చేరుకుంటారు. 1.30 నుంచి 1.50 గంటల వరకు టెక్స్టైల్ పార్క్ సందర్శిస్తారు. అక్కడి నుంచి రంగంపేట వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ని సందర్శిస్తారు. 2.10 నుంచి 2.30 గంటల వరకు ఆస్పత్రి సందర్శన అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంటారు.2.45 నుంచి 3.00 గంటల మధ్య మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభిస్తారు. తర్వాత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కార్యకలాపాలు, సమస్యలపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 5.40 నుంచి 6.10 వరకు హంటర్ రోడ్డులోని మెడికోవర్ ఆస్పత్రిని ప్రారంభించి 6.10 గంటలకు బయల్దేరి 6.30 గంటలకు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్కు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్లో 7.20 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. -
సైనిక్ స్కూల్పై రేవంత్ అబద్ధాలు: వినోద్
సాక్షి, హైదరాబాద్: వరంగల్లో సైనిక్ స్కూల్ ఏర్పా టుపై సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలు మాట్లా డుతున్నా రని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్ విమర్శించారు. ఇకపై ఆయన చెప్పే అబద్ధాలకు దీటుగా సమాధానం ఇస్తామ న్నారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్తో కలిసి వినోద్ కుమార్ మంగళవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మా ట్లాడారు. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో భేటీ త ర్వాత రేవంత్ గోబెల్స్ తరహాలో మాట్లాడార న్నారు.వరంగల్లో సైనిక్ స్కూలు గతంలోనే మంజూరైందని, కానీ రక్షణశాఖ ఆధ్వర్యంలో నడపలే మని చెప్పినందునే సమస్య తలెత్తిందన్నారు. సైనిక్ స్కూల్ ఏర్పాటుపై గతంలో నాటి రక్షణ మంత్రులు మనోహర్ పారిక్కర్, అరుణ్ జైట్లీని అనేక మార్లు కలిశామని పేర్కొన్నారు. వరంగల్ సైనిక్ స్కూలు ఏర్పాటుపై గత ప్రభుత్వం కేంద్రంతో చేసిన ఉత్తర ప్రత్యుత్తరాలను రేవంత్ చదువుకోవాలని సూచించారు. రక్షణ శాఖ భూముల కేటాయింపునకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు రికార్డుల్లో ఉన్నాయని గుర్తు చేశారు. -
ఏడురోజులకు బాలిక మృతదేహం లభ్యం..
మహబూబాబాద్: బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లిన దంపతుల కుమార్తె మియాపూర్లో ఈ నెల 7న అదృశ్యమైంది. అనంతరం అదే మియాపూర్ జంగల్లో 7రోజుల తర్వాత బాలిక మృతదేహం శుక్రవారం లభ్యమైంది. వివరాలిలా ఉన్నాయి.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లక్ష్మాతండా గ్రామ పంచాయతీకి చెందిన బానోతు నరేశ్, శారద దంపతులు బతుకుదెరువు నిమిత్తం ఇద్దరి పిల్లలతో గత 20రోజుల క్రితం హైదరాబాద్కు వెళ్లారు. అక్కడ మియాపూర్ ఏరియా పరిధిలోని నడిగడ్డతండాలో ఉంటూ కూలీ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన వారి కుమార్తె బానోతు వసంత (12) సమీపంలోని కిరాణా షాపు వద్దకు వెళ్లింది.ఎంతకూ ఇంటికి రాకపోవడంతో బాలిక తండ్రి నరేశ్ చుట్టు పక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా మియాపూర్ జంగల్లో కుళ్లిపోయిన స్థితిలో బాలిక మృతదేహం లభ్యమైంది. బాలిక అనుమానాస్పదంగా మృతి చెందినట్లు భావించిన పోలీసులు వసంత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు సదరు మృతదేహం తమ బిడ్డదేనని గుర్తించి బోరున విలపించారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్.. అప్డేట్స్హోరాహోరీగా సాగిన తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మూడో రోజు.. కొనసాగుతున్న పట్టభద్రుల ఉప ఎన్నిక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఇప్పటివరకు 44 మంది అభ్యర్థులను ఎలిమినేట్తీన్మార్ మల్లన్న ( కాంగ్రెస్) : 1,23,873రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్): 1,04,990గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి: 43,797గెలుపు కోటాకు −31,222 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నగెలుపు కోటాకు 50105 ఓట్ల దూరంలో బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తిఅశోక్ ఫలితాలను వెల్లడించని అధికారులుఅశోక్ ఎలిమినేషన్ ప్రాసెస్ తర్వాత మొదలుకానున్న బీజేపీ అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో శుక్రవారం మధ్యాహ్నానికి 37 మంది ఎలిమినేట్కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,23,410 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,676 ఓట్లు, బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి 43,571 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్కు 29,862 ఓట్లు గెలుపు కోటాకు 31,685 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉండగా, 50,419 ఓట్ల దూరంలో బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్ రెడ్డి ఉన్నారు.మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడా ఓట్లు ఎవరికీ రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు (1,22,813) వచ్చినా, 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నా.. గెలుపునకు సరిపడా ఓట్లు మాత్రం సాధించలేకపోయారు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు సాధించాల్సి ఉంది. గురువారం రాత్రి 10 గంటలకు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్.. ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న
సాక్షి, నల్గొండ: వరంగల్ -ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రెండో రౌండ్ పూర్తయింది. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ సాగుతోంది. మొదటి రౌండ్లో 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న.. రెండో రౌండ్లోనూ లీడ్లో కొనసాగారు. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్లో ఆయనకు 34,575 ఓట్లు పోల్ అయ్యాయి.రెండో రౌండ్ ఫలితాలుకాంగ్రెస్ అభ్యర్థి నవీన్(తీన్మార్ మల్లన్న)కు వచ్చిన ఓట్లు: 34,575బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 27,573బీజేపీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 12,841స్వతంత్ర అభ్యర్థి అశోక్ కు వచ్చిన ఓట్లు: 11,018నల్గొండలోని దుప్పలపల్లిలో నిన్న(బుధవారం) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. -
పట్టభద్రుల MLC ఎన్నిక కౌంటింగ్ పూర్తి అప్డేట్..
-
వరంగల్- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
-
వాహనాలతో కిక్కిరిసిన రహదారి
బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ప్లాజాతో పాటు హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారి ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వాహనాలతో కిక్కిరిసిపోయింది.యాదాద్రితో పాటు స్వర్ణగిరికి భక్తులు భారీగా తరలిరాగా, శుభకార్యాలు కూడా ఎక్కువగా ఉండడంతో 40వేల వరకు వాహనాలు గూడూరు టోల్ప్లాజా గుండా రాకపోకలు సాగించాయి. టోల్ప్లాజా వద్ద గూడూరు నుంచి పగిడిపల్లి వరకు వాహనాలు బారులుదీరాయి. -
ప్రాణం తీసిన ఒక్క రూపాయి
ఖిలా వరంగల్: వరంగల్లో దారుణం జరిగింది. ‘ఆ్రఫ్టాల్ నువ్వు ఒక ఆటోడ్రైవర్వు. ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివా’..? అంటూ ఇద్దరి మధ్య జరిగిన చిన్న ఘర్షణ చివరికి ఒకరి ప్రాణం తీసింది. శనివారం వరంగల్ క్రిస్టియన్ కాలనీ గాం«దీనగర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ మిల్స్కాలనీ గరీబ్నగర్ గొర్రెకుంటకు చెందిన ఇసంపెల్లి ప్రేమ్సాగర్ (38) ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు.శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రేమ్సాగర్ గాందీనగర్లోని ‘నబీ రూ.59కే చికెన్ బిర్యానీ’సెంటర్కు వెళ్లాడు. ఆదే సమయంలో గాందీనగర్కు చెందిన జన్ను అరవింద్ అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు స్నేహితులే. ఈ క్రమంలో ప్రేమ్సాగర్ బిర్యానీ తీసుకుని రూ.59కి బదులు రూ.60 ఫోన్పే ద్వారా చెల్లించాడు. పక్కనే ఉన్న అరవింద్ దీనిపై స్పందించి.. ‘ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివి అయ్యావా’అంటూ ప్రేమ్సాగర్ను హేళన చేస్తూ మాట్లాడాడు. దీంతో ప్రేమ్సాగర్ ఒక్కసారిగా ఆవేశానికిలోనై ‘నేను ఏమైనా అడుక్కు తింటున్నానా.. ఏం మాట్లాడుతున్నావు’అంటూ అరవింద్ను నిలదీశాడు. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. తోపులాటలో అరవింద్, బలంగా ప్రేమ్సాగర్ను నెట్టివేయగా రోడ్డుపై పడిపోయాడు. దీంతో అతని తలకు బలమైన గాయమై చిన్నమెదడు చిట్లి ముక్కు, చెవుల్లోనుంచి రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ప్రేమ్సాగర్ తమ్ముడు విద్యాసాగర్తోపాటు అరవింద్ కలసి ఆటోలో ప్రేమ్సాగర్ను ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 1 గంట సమయంలో ప్రేమ్సాగర్ మృతిచెందాడు. వెంటనే అరవింద్ ఎంజీఎం నుంచి నేరుగా మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలీసులకు లొంగిపోయాడు. మృతుడి సోదరుడు విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు శనివారం అరవింద్పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మల్లయ్య తెలిపారు. -
ముగిసిన పోలింగ్ తీన్మార్ మల్లన్న అత్యుత్సాహం
-
ముగిసిన ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్
Updatesముగిసిన ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్క్యూ లైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశంమహబూబాబాద్ 2 గంటల వరకు పోలింగ్ శాతంపురుషులు: 10745మహిళలు: 6462మొత్తం: 17207శాతం: 49.26% సూర్యాపేట జిల్లా :ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ 2 గంటల వరకు 52.8 శాతంMale: 17968Female: 9220Total: 27188యాదాద్రి భువనగిరి జిల్లాజిల్లాలో 2 గంటల వరకు 47.92 శాతం నమోదుపురుషులు:9673మహిళలు: 6659మొత్తం: 16332శాతం: 47.92 జనగామ జిల్లా:జనగామ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మధ్యాహ్నం 2:00 గంటల వరకు 49.66% పోలింగ్ నమోదు వరంగల్ జిల్లా వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికలలో ఉదయం 12:00 గంటల వరకు పోలింగ్ శాతం 30.18 %జనగామ జిల్లా:జనగామ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 12:00 గంటల వరకు 28.38% పోలింగ్ నమోదుమహబూబాబాద్ జిల్లా:వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలలో ఉదయం 12:00 గంటల వరకు 28.49 పోలింగ్ శాతం నమోదుహనుమకొండ: ప్రశాంతంగా కొనసాగుతున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్మధ్యాహ్నం 12గంటల వరకు హనుమకొండ జిల్లాలో పోలింగ్ శాతం 32.90యాదాద్రి భువనగిరి జిల్లాజిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 27.71 శాతం నమోదు పురుషులు: 5902మహిళలు: 3543 మొత్తం: 9445 నల్లగొండ జిల్లా:జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30 పోలింగ్ శాతం నమోదునల్గొండ:సూర్యాపేట జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ శాతం 31.27%పురుషులు: 10813మహిళలు: 5290మొత్తం: 16103 నల్గొండ:మిర్యాలగూడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని పరిశీలించిన బీఆర్ఎస్ మాజీ మంత్రి గుంతకంట్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు.నల్గొండ:తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్నల్లగొండ:నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి అశోక్కు గన్ మెన్ కేటాయింపునార్కెట్పల్లి గొడవ నేపథ్యంలో అధికారుల నిర్ణయంవరంగల్:మహబూబాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం సమీపంలో ఘర్షణపోలీసులకు ఓటు వేయాలని ప్రసన్నం చేసుకుంటున్న పార్టీ నాయకుల మధ్య స్వల్ప ఘర్షణ200 మీటర్ దూరం లో ఉన్నాం మీ కు ఇబ్బంది ఇంటి అని పోలీసుల తో వాగ్వివాదంనల్లగొండ ఎన్జీ కాలేజ్ లో అధికారుల నిర్లక్ష్యంవికలాంగులు ఓటేసేందుకు కనీస సౌకర్యాలు లేని వైనంమేమేం చేయాలి చైర్లు లేకపోతే అంటూ సిబ్బంది సమాధానంఇబ్బందులు పడుతోన్న వికలాంగులు నల్లగొండ నార్కెట్పల్లి లో ఓ షెడ్డులో డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు నార్కట్పల్లి పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించిన స్వతంత్ర అభ్యర్థి అశోక్తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట స్వతంత్ర అభ్యర్థి అశోక్ నిరసనస్టేషన్ ఎదుట బైఠాయించిన అశోక్ సూర్యాపేటలో 11 శాతం పోలింగ్..సూర్యాపేట జిల్లా:ఎమ్మెల్సీ ఎన్నికలో పది వరకు గంటల పోలింగ్ శాతం:Male: 4258Female: 1570Total: 5828Percentage: 11.32% నల్లగొండ:నార్కెట్పల్లిలో స్వల్ప ఉద్రిక్తతఓపార్టీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన స్వతంత్ర అభ్యర్థి అశోక్ఇరు వర్గాల మధ్య వాగ్వాదంపోలీసులకు ఫిర్యాదు చేసిన అశోక్ నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న) ఓటు హక్కును వినియోగించుకున్నారు నల్గొండ: సూర్యాపేట: గ్రాడ్యూయెట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 459 బూత్లో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్:మహబూబాబాద్ లోని 178వ పోలింగ్ బూత్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్: జనగామ ప్రెస్టన్ కళాశాలలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఖమ్మంఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా చర్ల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో మందకొడిగా ఓటింగ్ జరుగుతోంది.చర్ల మండలం లో మొత్తం 1122 ఓటర్లు ఉన్నారు.వీరికోసం చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.గ్రాడ్యుయేట్ లు కూడా అర్ధ రాత్రి వరకు రాజకీయ పార్టీల నేతల రాక కోసం ఎదురు చూశారు.కొంతమంది నాయకులు గ్రాడ్యుయేట్ లను కలిసి అన్ని చూసుకుంటామని చెప్పారని తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోందిమూడు ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు వరంగల్:హన్మకొండ పింగిలి కళాశాల పోలింగ్ బూతులో ఓట్లు వేయడానికి క్యూలో ఉన్న పట్టభద్రులు నల్లగొండ:మిర్యాలగూడ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్లో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు వరంగల్:పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోందిహనుమకొండ పింగళి కాలేజీ పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేట పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోందిసూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైందిఓటు వేయడానికి పట్టభద్రులు తరలి వసున్నారు ఓటు వేయడానికి క్యూలైన్లో నిల్చున్నారు నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రారంభం అయిన పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ వరంగల్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభంవరంగల్- నల్గొండ - ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులువరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,73,413 మంది ఓటర్లు ఉన్నారువీరి కోసం 227 పోలింగ్ కేంద్రాలు 296 బ్యాలెట్ బాక్స్ లు అధికారులు ఏర్పాటు చేశారు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. జూన్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్నేడు వరంగల్–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది.పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులతో తరలి వెళ్ళిన సిబ్బంది, అధికారులుసోమవారం పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బరిలో 52 మంది ఉన్నా... ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పోటీలో ఉన్నారు.605 పోలింగ్ బూత్లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు.వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34 అసెంబ్లీ నియోజక వర్గాలలో విస్తరించి ఉంది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం.వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,23,985 మంది ఓటర్లునల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుపట్టభద్రులను ఆకట్టుకునే పనిలో మూడు ప్రధానపార్టీల అభ్యర్థుల ప్రచారంఉదయం 6 నుండి సాయంత్రం 8 గంటల వరకు 144 సెక్షన్ అమలుఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున ప్రచారం చేశారు.ఈరోజు తేదిన ప్రత్యేక సెలవువరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లు -
పట్టభద్రుల పట్టమెవరికి ?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో 52 మంది ఉన్నా, ప్రధానపోటీ మాత్రం ముగ్గురి మధ్యే నెలకొంది. ఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పారీ్టలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున ప్రచారం చేశారు.సోమవారం పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పోటీలో ఉన్నారు. వారి తరఫున ఆయా పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించాయి. తమకు మద్దతు ఇవ్వాలని వాయిస్ కాల్స్ ద్వారా ఆయా పారీ్టల అధినేతలతోపాటు అభ్యర్థులు పట్టభద్రులను కోరారు. మిగతా గుర్తింపు పొందిన పారీ్టలతోపాటు స్వతంత్రులు పోటీలో ఉన్నా, ప్రధాన పారీ్టలకు పోటీగా ప్రచారం చేయలేకపోయారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో బీఆర్ఎస్ అధికారంలోకి వచి్చనా, నియామకాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని, ఉద్యోగులది అదే పరిస్థితి అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేయడంతోపాటు ఎన్నికల తర్వాత పాలనలో పారదర్శకత, ఉద్యోగ కల్పన, జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతోంది. ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, తమ పార్టీ అభ్యరి్థని గెలిపించడం ద్వారా ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతూ ప్రజల్లోకి వెళ్లింది. కాంగ్రెస్ మోసం చేసిందంటున్న బీఆర్ఎస్ ఆరు గ్యారంటీలతోపాటు ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులతోపాటు ఉద్యోగులను కూడా మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. జాబ్ క్యాలెండర్ లేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చేయలేదని, తమ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలను తాము భర్తీ చేశామని కాంగ్రెస్ చెబుతూ మోసం చేస్తోందని ఆరోపిస్తోంది.ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిందో ఎప్పుడు పరీక్షలు పెట్టిందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలన్న ప్రధాన డిమాండ్తో ఈ ఎన్నికలో పట్టుభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ అభ్యరి్థని గెలిపిస్తే పెద్దలసభలో ప్రభుత్వంపై పోరాడి ఉద్యోగాల కల్పనకు జాబ్క్యాలెండర్ ప్రకటించేలా ఒత్తిడి తెస్తామని, పోరాడే పారీ్టకి పట్టం కట్టాలంటూ పట్టభద్రులకు బీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తోంది.రెండూ మోసకారి పార్టీలే అంటున్న బీజేపీకాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ మోసకారి పారీ్టలేనని, వాటి వల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ వాటిని విస్మరించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని, ఆరు గ్యారంటీలతోపాటు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే అధికంగా అబద్ధాలు చెబుతూ మోసం చేస్తోందని బీజేపీ అంటోంది.నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల నియామకంలో బీఆర్ఎస్ విఫలం కాగా, కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ ఇవ్వకుండా, పరీక్షలు నిర్వహించకుండా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధపు మాటలతో ప్రజలు, పట్టభద్రులను మోసం చేస్తోందని ప్రచారంలో ఆరోపణలు గుప్పిచింది. ఇలాంటి పారీ్టలకు బుద్ధిచెప్పి బీజేపీకి మద్దతు ఇస్తే నిరుద్యోగుల తరఫున పోరాడుతామని పట్టభద్రులకు బీజేపీ విజ్ఞప్తి చేసింది. మొత్తానికి త్రిముఖ పోటీలో పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో మరికొద్ది రోజుల్లో తేలనుంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధం
-
World Para Athletics Championships 2024: దీప్తితో మాటామంతి
కలకు సాధన తోడైతే చాలు మిగతావన్నీ వాటికవే వచ్చి చేరతాయి. ఈ మాట నా విషయంలో అక్షర సత్యం అంటోంది దీప్తి జివాంజీ. తెలంగాణలోని వరంగల్ వాసి అయిన దీప్తి జివాంజీ దినసరి కూలీ కుమార్తె. జపాన్లో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో సోమవారం 400 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా 21 ఏళ్ల దీప్తిని పలకరిస్తే ఇలా సమాధానమిచ్చింది.⇢ క్రీడలే ప్రధానంగా!నా చిన్నప్పుడు స్కూల్లో పీఈటీ సర్ చెప్పిన విధంగాప్రాక్టీస్ చేసేదాన్ని. అప్పుడే జిల్లా స్థాయి ΄ోటీల్లో పాల్గొనేదాన్ని. నాకు చిన్నతనంలో తరచూ ఫిట్స్ వస్తుండేవి. రన్నింగ్ చేసేటప్పుడు బాడీ షేక్ అయ్యేది. దీంతో మా పీఈటీ సర్‡పారా అథ్లెట్స్తో మాట్లాడి, టెస్టులు చేయించారు. వారితో మాట్లాడి ‘ఇక పారా అథ్లెట్స్ గ్రూప్లో పాల్గొనమ’ని చె΄్పారు. మా అమ్మనాన్నలది మేనరికం కావడం వల్ల జన్యుపరమైన సమస్యలు వచ్చాయని తెలిసింది. అక్కణ్ణుంచి పారా అథ్లెటిక్ కాంపిటిషన్లో పాల్గొంటూ వచ్చాను. ఖమ్మంలో స్టేట్ మీట్ జరిగినప్పుడు అందులో పాల్గొన్నాను. మెడల్ రావడంతో అక్కణ్ణుంచి నా జీవితంలో క్రీడలు ప్రధాన భాగంగా మారి΄ోయాయి. డిగ్రీలో చేరాను కానీ, అప్పటికి ఇంకా పరీక్షలు రాయడం పూర్తి చేయలేదు.⇢ బలహీనతలను అధిగమించేలా..స్పోర్ట్స్లో పాల్గొనడం వల్ల ఒక ఆరోగ్యపరమైన సమస్యను ఆ విధంగా అధిగమించాను అనుకుంటాను. చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఈ ఆటలు నీకు అవసరమా అన్నట్టు మాట్లాడేవారు. కానీ, కానీ, మా అమ్మ మాత్రం ‘అవన్నీ పట్టించుకోవద్దు. నీవనుకున్నదానిపైనే దృష్టి పెట్టు. ఈ రోజు నిన్ను అన్నవాళ్లే రేపు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు’ అని చెప్పేది. ఆ విధంగా మానసిక ధైర్యం కూడా పెరిగింది. స్పోర్ట్స్ అన్ని బలహీనతలను దూరం చేస్తుందని.. గెలిచినా, ఓడినా.. ఎప్పడూ పాఠాలు నేర్చుకుంటూనే ఉంటామని నమ్ముతాను. ఇప్పటివరకు నాలుగు వరల్డ్ చాంపియన్షిప్ ΄ోటీల్లో పాల్గొన్నాను. నాకు సాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ⇢ ధైర్యమే బలంమా ఇంటి పరిస్థితులు ఎప్పుడూ కష్టంగానే ఉండేవి. మా అమ్మ ధనలక్ష్మి కూలి పనులకు వెళుతుంది. నాన్న పైపుల కంపెనీలో పనిచేస్తాడు. చెల్లెలు స్కూల్కు వెళుతుంది. ఉండటానికి మాకు కనీసం అద్దె ఇల్లు కూడా ఉండేది కాదు. మొన్న మొన్నటి వరకు మా అమ్మమ్మ వాళ్లింటోనే ఉన్నాం. ఎన్నో అవమానాలూ ఎదుర్కొన్నాం. ఈ మధ్య ఆ ఇంటినే కొనుగోలు చేశాం. ఇక బలమైన ఆహారం అంటే స్పోర్ట్స్ అకాడమీలోకి వచ్చిన తర్వాతే అని చెప్పుకోవాలి. అమ్మ ఎప్పుడూ చెప్పే విషయాల్లో బాగా గుర్తుపెట్టుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ‘కష్టపడితే ఏదీ వృథా ΄ోదు. నీకు నువ్వు ధైర్యంగా నిలబడాలి. అప్పుడే నిన్ను కాదని వెళ్లి΄ోయినవి కూడా నీ ముందుకు వస్తాయి’ అంటుంది. మొన్న జపాన్లో జరిగిన పారా ఒలింపిక్లో బంగారు పతకం సాధించిన విషయం చెప్పినప్పుడు అమ్మ చాలా సంతోషించింది. నా బలం మా అమ్మే. ఆమె ఏమీ చదువుకోలేదు. కానీ, ధైర్యంగా ఎలా ఉండాలో చెబుతుంది. ఆడపిల్లలమైనా మేం బాగా ఎదగాలని కోరుకుంటుంది.⇢ ప్రాక్టీస్ మీదనే దృష్టిటీవీ కూడా చూడను. ΄÷లిటికల్ లీడర్స్కు సంబంధించి వచ్చే సాంగ్స్ వింటుంటాను. ఆ పాటల్లో స్ఫూర్తిమంతమైన పదాలు ఉంటాయి. హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఉంటున్నాను. మరో మూడు నెలల్లో ఒలపింక్స్ లో పాల్గొనబోతున్నాను. దేశం తరపున పాల్గొనబోతున్నాను కాబట్టి నా దృష్టి అంతాప్రాక్టీస్ మీదనే ఉంది. సాధారణంగా ఉదయం రెండు గంటలు; సాయంత్రం రెండు గంటలుప్రాక్టీస్ ఉంటుంది. మధ్యలో మా రోజువారీ పనులు, విశ్రాంతికి సమయం కేటాయిస్తాం. నాతో పాటు ఉన్న స్నేహితులతో చిట్ చాట్ ఉంటుంది.⇢ బాధ్యతగా ఉండాలిచిన్నప్పటి నుంచి అమ్మనాన్నల కష్టం చూస్తూ పెరగడం వల్ల సొంతంగా ఇష్టాలు, అభిరుచులు అనే ధ్యాస ఏమీ లేదు. కానీ, చిన్నప్పటి నుంచి ΄ోలీసు కావాలనేది నా కల. ఇప్పటికీ అదే ఆలోచన. నా కృషి నేను చేస్తున్నాను. నేను కోరుకున్నది వస్తుందనేది నా నమ్మకం. అమ్మనాన్నలు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ΄ోలీసుని అయి మా అమ్మ నాన్నలను, చెల్లెలిని బాగా చూసుకోవాలి, అది నా బాధ్యత అనుకుంటున్నాను’’అంటూ ముగించింది దీప్తి. ఆమె ఆశలు, ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
తీన్మార్మల్లన్నపై కేటీఆర్ సంచలన కామెంట్స్
సాక్షి,వరంగల్: మహిళల మెడలో తాళిబొట్టు కొట్టేసే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని కేటీఆర్ విమర్శించారు. వరంగల్లో బుధవారం(మే22) జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులు ఉప ఎన్నిక ప్రచార సభలో కేటీఆర్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలైనవి.మంగళవారం ఎంజీఎం ఆసుపత్రిలో 5గంటల విద్యుత్ నిలిపోయింది. రూ.2లక్షల రుణమాఫీ కాలేదు. రైతులకు రైతుబంధు రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. వరికి రూ. 500 బోనస్ దక్కలేదు. రాష్ట్రంలో మోసాల పరంపర సాగుతోంది. కాంగ్రెస్ నాయకులు పచ్చి మోసగాళ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలంటే... పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాకేష్రెడ్డిని గెలిపించాలి.420 హామీలతో అధికారంలోకి వచ్చారు. కొత్త పరిశ్రమలను తీసుకువచ్చే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు. ఉన్న కంపెనీలను కాపాడుకునే సత్తా లేని నాయకులు కాంగ్రెస్ నాయకులు. తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు గెలిస్తే చట్టసభలు బూతు మాటలకు వేదిక అవుతుంది’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. -
వరంగల్లో విషాదం.. వ్యక్తి సజీవ దహనం
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. పాపయ్యపేటలో మొక్కజొన్న కొయ్యాలు కాల్చుతూ ప్రమాదావశాత్తు మంటల్లో చిక్కుకొని ఓ రైతు సజీవ దహనమయ్యారు.గ్రామానికి చెందిన అల్లంనేని పాపారావు(65)తన వ్యవసాయ బావి వద్ద మొక్కజొన్న చొప్పకు నిప్పు పెట్టాడు. అనుకోకుండా మంటలు వ్యాపించి పక్కనే మరో రైతుకు చెందిన ఆయిల్ పామ్ తోటకు వ్యాపించాయి.దీంతో మంటలను ఆర్పేందుకు వెళ్లిన పాపారావు ప్రమాదవశాత్తు అదే మంటల్లో చిక్కుకొని ఊపిరాడక సజీవ దహనమయ్యాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆత్రికి తరలించినట్లు ఎస్ఐ అరుణ్కుమార్ తెలిపారు. పాపారావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఇండియా కూటమిపై విరుచుకుపడ్డ ప్రధాని
-
వరంగల్.. ట్రయాంగిల్
సాక్షిప్రతినిధి, వరంగల్: తొలి నుంచి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డ. విప్లవ రాజకీయాలు, సామాజిక ఉద్యమాలకు నెలవు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ కేంద్రంగా ఉన్న ప్రాంతం. రాజకీయ చైతన్యానికి మారుపేరైన వరంగల్ సెగ్మెంట్ను బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్..ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న వరంగల్ (హనుమకొండ) పార్లమెంట్ నియోజకవర్గంపై టీఆర్ఎస్ పట్టు బిగించింది. 2009 పునర్విభజనలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంగా ఏర్పడింది. 1952 నుంచి 2019 వరకు మూడు ఉపఎన్నికలు కలుపుకొని మొత్తం 20 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఏడుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు కాంగ్రెస్(ఐ) అభ్యర్థులు విజయం సాధించగా, టీడీపీ ఐదు, టీఆర్ఎస్ నాలుగు, టీపీఎస్, పీడీఎఫ్ పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి. జనరల్ స్థానంగా ఉన్నప్పుడు సైతం మూడుసార్లు ఇక్కడ ఎస్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కడియం కావ్య (కాంగ్రెస్)నాన్న తోడు.. పార్టీ బలమే గెలిపిస్తుందన్న ధీమా లోక్సభ ఎన్నికల ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన కడియం కావ్య.. తండ్రి కడియం శ్రీహరి, కాంగ్రెస్ పార్టీకున్న బలాన్ని నమ్ముకున్నారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు ఘన విజయం ఇచ్చారు. ఈ పార్లమెంట్ పరిధిలోని వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. స్టేషన్ఘన్పూర్ నుంచి గెలుపొందిన కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్లో చేరడం, ఆయన కూతురు కావ్యనే అభ్యర్థి కావడం అనుకూలంగా మారింది. డాక్టర్గా, స్వచ్ఛంద సంస్థల ఏర్పాటు ద్వారా చేసిన ప్రజాసేవకుతోడు కాంగ్రెస్ పార్టీ బలం, యువ నాయకురాలిగా ప్రజలు ఆదరిస్తారనే ధీమాలో కడియం కావ్య ఉన్నారు. అయితే కడియం కావ్య స్థానికేతరురాలని, ఆంధ్రా ప్రాంతానికి చెందిన ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుందన్న ప్రత్యర్థుల ఆరోపణలు ఇబ్బందికరంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ సమయాన బీఆర్ఎస్లో ఉన్న కావ్య.. ఆ తర్వాత తండ్రితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరి అభ్యర్థి అయ్యారు. పార్టీ ఫిరాయింపులతో పాటు వీటన్నింటిపై ప్రతిపక్షాలు విమర్శనా్రస్తాలు సంధిస్తున్నాయి.అరూరి రమేశ్ (బీజేపీ)మోదీ చరిష్మా.. పాలకుల వైఫల్యాలే కలిసి వస్తాయంటూ.. 2014, 2018 ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ సాధించిన అరూరి రమేష్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరిన ఆయనకు ప్రధాని నరేంద్రమోదీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతికితోడు జాతీయస్థాయిలో మోదీ అనుకూల పవనాలు తనకు కలిసివస్తాయని భావిస్తున్నారు. గతంలో వరంగల్(హనుమకొండ)లో ఒకసారి బీజేపీ అభ్యర్థి ఎంపీగా గెలిచారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందన్న ప్రచారం కూడా అనుకూలమే. మామునూరు ఎయిర్పోర్టు, టెక్స్టైల్ పార్కు, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, మెట్రోరైలు సహా అనేక పథకాలకు మోక్షం కలుగుతుందని చెబుతున్నారు. బీజేపీ శ్రేణులు అరూరి రమేష్ గెలుపులో ఏమేరకు పాలు పంచుకుంటారన్న చర్చ ఓ వైపు జరుగుతుండగా.. ప్రధాని మోదీ వరంగల్ పర్యటన విజయవంతం, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ప్రచారంతో పాటు ప్రజలతో తనకున్న సంబంధాలతో గెలుస్తానని చెబుతున్నారు.సుదీర్కుమార్ (బీఆర్ఎస్)కేసీఆర్ చేసిన అభివృద్ధే గెలిపిస్తుందన్న ఆశ తెలంగాణరాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్న డాక్టర్ మారెపెల్లి సు«దీర్కుమార్ మొదటిసారి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఆవిర్భావం నుంచి ఎంపీటీసీగా, ఎంపీపీగా, జెడ్పీ వైస్ చైర్మన్, హనుమకొండ జెడ్పీ చైర్మన్ వరకు అనేక పదవులు చేపట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఓరుగల్లుకు చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్యనేతలు పార్టీ మారారు. ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్లో చేరగా, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థి కాగా, మేయర్ గుండు సు«ధారాణి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవిందర్రావు తదితరులు సైతం బీఆర్ఎస్ను వీడారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ విప్ దాస్యం వినయ్భాస్కర్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, డా.టి.రాజయ్యలతో పాటు పలువురు పనిచేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు, తొలి సీఎంగా కేసీఆర్ ఈ రాష్ట్రానికి చేసిన మేలును చూసి ప్రజలు గెలిపిస్తారన్న ధీమాలో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ ఉన్నారు. ముగ్గురిదీ బీఆర్ఎస్ బ్యాక్గ్రౌండే.. అందరూ మొదటిసారే వరంగల్ నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీలకన్నా ముందు బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కావ్యను ప్రకటించింది. తర్వాత ఆమె హస్తం గూటికి చేరడంతో జరిగిన పరిణామాలతో బీఆర్ఎస్కు అభ్యరి ఎంపిక కత్తిమీద సాములా మారింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ తొలుత తాను బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపి.. ఆ తర్వాత బీజేపీలో చేరి బరిలో నిలిచారు. కాంగ్రెస్లో చేరిన కావ్యకు పోటీచేసే అవకాశం దక్కడంతో ఇక బీఆర్ఎస్ నుంచి హనుమకొండ జెడ్పీ చైర్మన్ డాక్టర్ ఎం.సు«దీర్కుమార్ను పోటీలోకి దింపారు. కాగా డాక్టర్ మారేపల్లి సు«దీర్కుమార్ ఆయుర్వేద వైద్యుడు కాగా, కడియం కావ్య సైతం వైద్యురాలే. బీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ ముగ్గురు కూడా ఎంపీ ఎన్నికల బరిలో నిలవడం మొదటిసారి. ప్రభావితం చూపే అంశాలు » ఎంపీ సెగ్మెంట్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. వారి మొగ్గు ఎటువైపు ఉంటుందో.. » దళితుల ఓట్లూ కీలకమే» నగర ఓటర్లు, విద్యావంతులూ ఎక్కువే» బలమైన తెలంగాణవాదం2019 లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇలా..» పసునూరి దయాకర్ (టీఆర్ఎస్) 6,12,498 » దొమ్మాటి సాంబయ్య (కాంగ్రెస్) 2,62,200 » చింతా సాంబమూర్తి (బీజేపీ) 83,777 -
వరంగల్ను BRS, కాంగ్రెస్ బారి నుంచి కాపాడాలి: ప్రధాని మోదీ
వరంగల్, సాక్షి: మూడో విడత పోలింగ్లో రెండు విషయాలు స్పష్టం అయ్యాయి. బీజేపీ వీజయం వైపు దూసుకెళ్తోంది. కాంగ్రెస్ తాము ఎక్కడ గెలుస్తామా? అని భూతద్దంతో చూస్తోంది. కానీ, నాలుగో విడతలో కాంగ్రెస్ గెలిచే సీట్లను చూడాలంటే భూతద్దం సరిపోదు.. మైక్రోస్కోప్ కావాల్సిందే అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. బుధవారం మధ్యాహ్నాం బీజేపీ నిర్వహించిన ఓరుగల్లు జన గర్జన సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.ప్రపంచమంతా అస్థిరత, సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో అబ్కీ బార్ మోదీ సర్కార్ అంటోంది. గతంలో కాంగ్రెస్ వచ్చిందంటే సమస్యలు వచ్చేవి. ఇండియా కూటమిలో ఒక్కో ఏడాది ఒక్కో ప్రధాని అనే ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఏడాది ఒక్కో ప్రధాని ఉంటే దేశం బాగుపడుతుందా?... ఇండియా కూటమి ఎక్కడ అధికారంలో ఉంటే.. ఆ రాష్ట్రంలో సంపదను ఏటీఎంలాగా దోచుకుంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తొలగించి ముస్లింలకు ఇవ్వాలని ఇండియా కూటమి చూస్తోంది. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దన్న రాజ్యాంగ సూత్రాన్ని కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు. ద్రౌపది ముర్మును కాంగ్రెస్ ఎందుకు ఓడించాలనుకుందో అర్థం కావడం లేదు. బహుశా రంగుచూసి ఓడించాలని నిర్ణయించినట్లు ఉంది. యువరాజుకు అమెరికాలో ఒక ఫ్రెండ్, గైడ్ (శ్యామ్ పిట్రోడాను ఉద్దేశిస్తూ..) ఉన్నారు. నల్లగా ఉన్నవారంతా ఆఫ్రికన్లే అని ఆ యువరాజుకి ఆ అంకుల్ చెప్పారు. అయినా చర్మం రంగు ఆధారంగా మన దేశంలో యోగ్యత నిర్ణయిస్తారా?’’ అని ప్రధాని మోదీ కాంగ్రెస్పై ధ్వజమెత్తారు... కాంగ్రెస్ అబద్ధాలు ఎలా ఉంటాయో.. ప్రజలకు బాగా తెలుసు. తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్నవాళ్లకు పెన్షన్ ఇచ్చిందా?. మహిళలకు రూ.2,500 ఇస్తామన్న కాంగ్రెస్ హామీ నెరవేరిందా?. రుణ మాఫీ ఆగష్టు 15వ తేదీకి మార్చారు. అది మోసం చేయడం కాదా?. తెలంగాణలో పవర్కట్స్ పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతోంది. ఆ ఆర్ఆర్ ట్యాక్స్లో ఒక వాటా ఇక్కడి హైదరాబాద్ ఆర్కు, మరో వాటా ఢిల్లీలోని ఆర్కు వెళ్తోంది.. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది.2014లో దళితులను సీఎం చేస్తానని బీఆర్ఎస్ మాట తప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలను బీఆర్ఎస్ కూడా మోసం చేసింది. దళిత బంధు పేరుతోనూ బీఆర్ఎస్ మోసం చేసింది. తమ హక్కుల కోసం పోరాడుతున్న మాదిగలకు రిజర్వేషన్లు నేను ఇప్పిస్తాను.తెలంగాణలో కొందరు వేములవాడ రాజన్నపై ఒట్టు పెడుతున్నారు.. మరోవైపు సనాతన ధర్మాన్ని తిడుతున్నారు. సనాతన ధర్మాన్ని తిడుతున్న వాళ్ల మాటలు ఎవరైనా నమ్ముతారా?. కాకతీయ సామ్రాజ్యపు ప్రతీక వరంగల్. అహ్మదాబాద్ నా కర్మభూమి.. ఆ నగర దేవత కూడా భద్రకాళినే. గతంలో బీజేపీకి రెండు సీట్లు ఉన్నప్పుడు అందులో ఒకరు వరంగల్ నుంచే ఉన్నారు. వరంగల్ను కాంగ్రెస్, బీఆర్ఎస్ బారి నుంచి కాపాడాలి. అందుకోసం వరంగల్, మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలి అని ప్రధాని మోదీ ఉమ్మడి వరంగల్ ఓటర్లను కోరారు. -
తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్: సీఎం రేవంత్
సాక్షి,వరంగల్: తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్కు అన్ని అర్హతలున్నాయని రేవంత్రెడ్డి అన్నారు. వరంగల్లో బుధవారం(ఏప్రిల్24) జరిగిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రచార సభలో రేవంత్ మాట్లాడారు. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగలేనని, కేసీఆర్ రాష్ట్రాన్ని ఢిల్లీలో మోదీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. ‘మామా, అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగురుతున్నారు. అసెంబ్లీలో మా కళ్లలో చూసే ధైర్యం లేక కేసీఆర్ పారిపోయాడు. కేసీఆర్ అసెంబ్లీకి రాడు. మాతో చర్చకు రమ్మంటే పారిపోతాడు. కేసీఆర్ చచ్చిన పాము. కాళేశ్వరం అద్భుతంగా కట్టి ఉంటే కేసీఆర్ నాతో చర్చకు రావాలి. ప్రాజెక్టు వద్దే చర్చకు రావాలి.బీఆర్ఎస్, బీజేపీ నాణానికి బొమ్మ బొరుసు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని ఓడించాలి. బీజేపీ నేతలకు మతపిచ్చి పట్టుకుంది. మోదీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో బీజేపీ నేతలు చెప్పాలి. వరంగల్లో ఆరూరి రమేష్కు ఓటేస్తే అనకొండై మీ భూములు మింగేస్తాడు. చేయి గుర్తుకు ఓటేసి కడియం కావ్యను గెలిపించాలి’అని రేవంత్ కోరారు. ఇదీ చదవండి.. బస్సు యాత్ర.. కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం -
కడియంను వదిలే ప్రసక్తే లేదు.. మీసం మెలేసి తొడగొట్టిన రాజయ్య
సాక్షి, వరంగల్: ఓరుగల్లులో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అవి పక్కదేశం పాకిస్థాన్ వైపు దూసుకెళ్తున్నాయి. స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మరోసారి శివమెత్తారు. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరి పై నిప్పులు చెరిగారు. మీసం మెలేసి తొడగొట్టిన రాజయ్య కడియం శ్రీహరిని భూస్థాపితం చేసే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి తనతో పోటీకి దిగాలని సవాల్ విసిరారు.. ఒకవైపు మాటల తూటాలు మరోవైపు తనదైన శైలిలో స్టెప్పులేసి గులాబీ శ్రేణుల్లో జోష్ నింపారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈల కొట్టి స్టెప్పులేసిన రాజయ్య.. కేసీఆర్ పాటకు తనదైన శైలిలో డ్యాన్స్ చేసి, బిఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. రాజయ్యతో పాటు, అక్కడే ఉన్న నేతలు సైతం స్టెప్పులు వేశారు. బీఆర్ఎస్ పార్టీలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ జోష్లో ఉన్న తాటికొండ రాజయ్య ఇప్పుడు ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెనర్గా మారారు. తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి కడియం శ్రీహరిపై రాజయ్య రంకెలేస్తున్నారు. ఈ మేరకు తొడగొట్టి సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే.. నమ్మకద్రోహం చేసిన కడియం అంతుచూస్తా.. నిన్ను భూ స్థాపితం చేయడమే నా లక్ష్యం అని అన్నారు. కడియంకు నిజాయితీ ఉంటే రాజీనామా చేసి రా చూసు కుందాం అని మీసం మెలేసి సవాల్ విసిరారు. చదవండి: కేసీఆర్ కథలకు కాలం చెల్లింది: రేవంత్ కౌంటర్ ‘తెలుగు రాష్ట్రాల్లో అంతా మన ఇద్దరి కోసమే ఎదురు చూస్తున్నారు. దమ్ముంటే రా అని సవాల్ విసిరారు. నాకు నేనుగా.. రాజకీయ ఆత్మహత్య చేసుకునేలా చేసిన దుర్మార్గుడు కడియం నిన్ను వదిలే ప్రసక్తే లేదు. రేవంత్ రెడ్డి అభయహస్తం అంటున్నాడు.. కానీ కడియం శ్రీహరి లాంటి భస్మాసురుడు పక్కన చేరాడు జాగ్రత్త. నాకున్న పని కేవలం నున్ని తొక్కుడే. దళిత ద్రోహి.. కల్నాయక్, నమ్మకద్రోహి.. డిక్టేటర్.. గుంటనక్క.. కడియం శ్రీహరి’ అంటూ నిప్పులు చెరిగారు. రాజయ్య మాటల తూటాలు పక్క దేశం పాకిస్థాన్ వరకు వెళ్తున్నాయి. కడియం శ్రీహరిని ఇక్కడ తొక్కితే పాకిస్తాన్లో తేలాలని ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాలు మన గురించి చూస్తున్నాయని, ఇద్దరం పోటిచేసి చేసి తేల్చుకుందాం రా అని సవాల్ విసిరారు. -
అన్నదాతల నుంచి ఆటో డ్రైవర్ల దాకా సర్కార్పై ఆగ్రహం: కేటీఆర్
సాక్షి, వరంగల్/ పెద్దపల్లి: వచ్చే లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లిలో భారీ మెజారిటీతో గెలుస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరంగల్లో వంద శాతం విజయం బీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్తో పాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో కేటీఆర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటు కాంగ్రెస్కు.. అటు బీజేపీకి రాష్ట్రంలో ఒకేసారి ఎదురుదెబ్బ తగలబోతోందని అన్నారు. అధికార కాంగ్రెస్పై ప్రజాగ్రహం పెరుగుతోందని తెలిపారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదని విమర్శించారు. వరంగల్లో చివరి క్షణంలో కడియం శ్రీహరి కుటుంబం పార్టీకి మోసం చేసిన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని అన్నారు కొందరు నాయకులు వలస వెళ్లినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. వరంగల్ నుంచి బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ అభ్యర్థిత్వంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. అందరి ఏకాభిప్రాయంతో అభ్యర్థి ఎంపిక జరిగిందని తెలిపారు. 2001 నుంచి కేసీఆర్తో కలిసి నడిచిన సుధీర్ కుమార్ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చైతన్యానికి ప్రతీకైన వరంగల్ ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మచ్చలేని నాయకుడు కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లిలో కూడా గులాబీ గెలుపు ఖాయమై పోయిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మచ్చలేని నాయకుడిగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొప్పుల ఈశ్వర్ లాంటి ఉద్యమ గొంతుకను ఎన్నుకుంటేనే పార్లమెంట్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించగలుగుతారని పేర్కొన్నారు. అన్నదాతల నుంచి మొదలుకొని ఆటో డ్రైవర్ల దాకా ప్రజలంతా కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని వెల్లడించారు. ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో చెప్పుకోవడానికి బీజేపీకి ఎజెండానే లేదని, అందుకే మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి గట్టెక్కాలని చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా అసలైన సమస్యలు చర్చకు రాకుండా ప్రజల దృష్టిని మరల్చే ఇలాంటి కుట్రలను క్షేత్రస్థాయిలో తిప్పి కొట్టాలని సూచించారు. -
వరంగల్ లో ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు
-
బీఆర్ఎస్ వరంగల్ బరిలో సుధీర్కుమార్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి గా డాక్టర్ మారేపల్లి సు«దీర్కుమార్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ప్రస్తుతం హనుమకొండ జెడ్పీ చైర్మన్గా ఉన్న సుధీర్ కుమార్.. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీ విధేయుడిగా ఉన్నారు. దీనికితోడు మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలన్న నిర్ణయం మేరకు సు«దీర్కుమార్ అభ్యర్థి త్వాన్ని ఖరారు చేశారు. ఈ మేరకు కేసీఆర్ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్టు వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు శుక్రవారం ప్రకటించారు. అభ్యర్థి ని ఖరారు చేసిన నేపథ్యంలో పారీ్టలో సమన్వయం, ప్రచారంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కీలక నేతలతో మంతనాలు: వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలతోపాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితో కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం సుదీర్ఘంగా భేటీ అయ్యారు. బీఆర్ఎస్ తరఫున బరిలోకి దింపాలని నిర్ణయించిన కడియం కావ్య.. పార్టీని వీడటంతో ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం కొనసాగిన వేటపై ఈ సమావేశంలో చర్చించారు. ఇటీవల జిల్లాకు చెందిన నేతలు సిఫార్సు చేసిన నలుగురి పేర్లపై చర్చించి.. చివరికి సు«దీర్కుమార్ పేరును ఖరారు చేశారు. తొలుత స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరును కూడా పరిశీలించినా.. ఆయనకు స్టేషన్ ఘన్పూర్ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చేందుకే కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో రాజయ్య తిరిగి బీఆర్ఎస్లో చేరేదీ, లేనిదీ స్పష్టత రావాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సానుకూల సంకేతాలు పంపేందుకే! అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, తర్వాత పార్టీని వీడినవారికి కాకుండా.. ఇకపై పార్టీని అంటిపెట్టుకుని ఉండే వారికే అవకాశాలు వస్తాయన్న సంకేతాలు ఇచ్చేందుకే సు«దీర్కుమార్ను అభ్యర్థి గా ఎంపిక చేసినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. వరంగల్ ఎంపీ టికెట్ ఆశించిన వంగపల్లి శ్రీనివాస్, సుందర్ రాజు, డాక్టర్ నిరంజన్, స్వప్న తదితరులకు భవిష్యత్తులో గుర్తింపు దక్కుతుందని హామీ ఇచి్చనట్టు వివరిస్తున్నాయి. కేసీఆర్తో శుక్రవారం జరిగిన భేటీలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, వినయ్ భాస్కర్, నరేందర్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, బండ ప్రకాశ్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బసవరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు. -
BRS: వరంగల్ ఎంపీ అభ్యర్థి.. ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా హన్మకొండ జెడ్పీ చైర్మన్ మారేపల్లి సుధీర్కుమార్ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ శుక్రవారం( ఏప్రిల్ 12)అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. వరంగల్ అభ్యర్థిని నిర్ణయించేందుకు జిల్లా నేతలతో కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్లో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీకి ఇటీవలే పార్టీని వీడిన స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కూడా పిలుపు అందడంతో వరంగల్ నుంచి ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం ఒక దశలో ఊపందుకుంది. చివరకు సుధీర్కుమార్ను బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ నుంచి ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియ్యం కావ్య కాంగ్రెస్లోకి వెళ్లడంతో బీఆర్ఎస్ తాజాగా మళ్లీ అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్కు ప్రత్యర్థులుగా ఉన్న రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులిద్దరూ బీఆర్ఎస్ను ఇటీవల వీడి టికెట్ తీసుకున్న వారే కావడం గమనార్హం. దీంతో బీఆర్ఎస్కు తమ పార్టీ నుంచి వెళ్లిన వారిపైనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బీజేపీ నుంచి వర్థన్నపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కాంగ్రెస్ నుంచి స్టేషన్ ఘన్పూర్ కడియం కావ్య బరిలో ఉన్నారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్లో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. కడియం -
వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య !
సాక్షి,హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. ఈ మేరకు రాజయ్య పేరును కేసీఆర్ కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. వరంగల్ అభ్యర్థిని నిర్ణయించేందుకు జిల్లా నేతలతో కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్లో శుక్రవారం(ఏప్రిల్ 12) భేటీ అయ్యారు. ఈ భేటీకి రాజయ్యకు కూడా పిలుపు అందడంతో వరంగల్ నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. వరంగల్ నుంచి ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియ్యం కావ్య కాంగ్రెస్లోకి వెళ్లడంతో బీఆర్ఎస్ తాజాగా మళ్లీ అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సిట్టింగ్ సీటు స్టేషన్ఘన్పూర్ టికెట్ను కడియం శ్రీహరికి ఇచ్చారని అలకబూనిన రాజయ్య ఎన్నిలు పూర్తయి ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. తాజాగా కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్కు వెళ్లడంతో రాజయ్య తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చేందుకు ఓకే అన్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం వరంగల్ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్కు ప్రత్యర్థులుగా ఉన్న రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులిద్దరూ బీఆర్ఎస్ను ఇటీవల వీడి టికెట్ తీసుకున్న వారే కావడం గమనార్హం. దీంతో బీఆర్ఎస్కు తమ పార్టీ నుంచి వెళ్లిన వారిపైనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బీజేపీ నుంచి వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య బరిలో ఉన్నారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ నుంచి డబ్బు తీసుకుంది నిరూపిస్తే దేనికైనా రెడీ.. కడియం -
బీఆర్ఎస్ నుంచి డబ్బు తీసుకుంది నిరూపిస్తే దేనికైనా రెడీ: కడియం
సాక్షి, జనగామ: ఎవరు ఎన్ని కుట్రలు, కుయుక్తులు చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కావ్య విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. తమకు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చినట్టు నిరూపిస్తే తాము ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. కాగా, కడియం స్టేషన్ ఘన్పూర్లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము రూ.10కోట్లు తీసుకున్నామని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమని ఎలాంటి ఆధారాలు చూపించినా, నిరూపించినా మేము ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటాము. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కావ్య గెలుపు ఖాయమైంది. సీఎం రేవంత్ ఆశీర్వాదంతో నేను వరంగల్ను అభివృద్ధి చేస్తాను. బీజేపీ వాళ్ళు రాజ్యాంగం మీద అవగాహన లేక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. చేసిన పని చెప్పడానికి ఏమీ లేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నా కూతురు కావ్య ఇక్కడే పుట్టింది, ఇక్కడే కడియం ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమలు చేసింది. 2017లో ఐదుగురు జడ్జిల ధర్మసానం భారతదేశంలో మతం మారినంత మాత్రాన కులం మారదు అని తెలిపింది. పిల్లలకు తండ్రి కులం వర్తిస్తుంది. కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాను. నా 30ఏళ్ల రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. నా నిజాయితే నాకు పెట్టుబడి. నేను ఏ పార్టీకి వెన్ను పోటు పొడవలేదు. కానీ నా ద్వారా ఎదిగిన ఆరూరి రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు. నేను ఛాలెంజ్ చేస్తున్న నీదగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నానా చెప్పాలి. 2014, 2018లో నీ గెలుపు కోసం నేను ప్రచారం చేసాను. నువ్వు చేసిన భూకబ్జాల కారణంగా ఓడిపోయావు. ఓటమి భయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మందకృష్ణ నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఒక్క నాపై మాత్రమే ఎందుకు విమర్శలు చేస్తున్నావు. నాది మాదిగ ఉప కులం. మాదిగలకు ద్రోహం చేస్తున్నది మందకృష్ణ. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్నా పార్టీకి ఓటు వేయమని ఎలా చెపుతున్నావు. దీనికి సమాధానం చెప్పాలి. నీ నాయకత్వం సరిగా లేకపోవడం వల్లనే ఎంఆర్పీఎస్లో చీలికలు వచ్చాయి అంటూ విమర్శలు చేశారు. -
ఆ రెండు పార్టీల ప్రయత్నాలు ఫలించవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పనై పోయిందని, తాము చేసింది చెప్పి ఓట్లడిగేందుకు బీజేపీ దగ్గర ఏమీ లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు ఆ రెండు పార్టీలు చేసే ప్రయత్నాలు ఫలించ బోవని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సాను కూల రాజకీయ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధించేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఆదివారం జూబ్లీ హిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో సికింద్రా బాద్, వరంగల్ లోక్సభ నియోజకవర్గాలకు చెందిన నాయకులతో ఆయన విడివిడిగా సమీక్ష నిర్వహించారు. పార్టీ అభ్యర్థులు దానం నాగేందర్, కడియం కావ్యలతో పాటు వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, యశస్వినిరెడ్డి, కె.ఆర్. నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని కాంగ్రెస్ నేతలు అజారుద్దీన్, విజయారెడ్డి, ఫిరోజ్ఖాన్, రోహిణ్రెడ్డి, ఆదం సంతోష్ తదితరులు హాజరయ్యారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలి సికింద్రాబాద్ సమీక్షలో భాగంగా రేవంత్రెడ్డి మా ట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇక్కడ గెలిచిందని, ఇప్పుడు కూడా గెలవడం ద్వారా హైదరాబాద్ నగరంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని కో రారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఇప్పటికి పరిస్థితిలో మార్పు వచ్చిందని, జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ బలం పెరిగినందున ఈ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలందరితో కలిసి సమన్వ యంతో ముందుకెళితే గెలుపు కష్టమేమీ కాదని చెప్పారు. హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉందని చెప్పేందుకు సికింద్రాబాద్ గెలుపు అవసరమని స్పష్టం చేశారు. వరంగల్ సమీక్ష సందర్భంగా.. సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కావ్యను ఇక్కడి నుంచి బరి లో దింపుతున్నందున అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నాయకులు కష్టపడి పనిచేయాలని, కావ్య గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని సీఎం సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని, బూత్ స్థాయి నుంచి కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేయాలని చెప్పారు. నేడు కొడంగల్కు సీఎం సీఎం రేవంత్రెడ్డి సోమవారం తన సొంత నియో జకవర్గమైన కొడంగల్కు వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని మండలాల వారీగా ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశం తర్వాత సా యంత్రానికి ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకుంటారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. -
వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తరఫున వరంగల్ ఎంపీ స్థానానికి బలమైన అభ్యర్థిని బరిలో దించేదిశగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. బీఆర్ ఎస్ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొని తన తండ్రి కడియం శ్రీహ రితో కలిసి కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తి చెంది, బీఆర్ ఎస్ అధికారం కోల్పోగానే పార్టీకి దూరమైన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో బీఆర్ఎస్ వర్గా లు సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలిసింది. అయితే తన అనుచరులతో భేటీ అయిన తర్వాత తిరిగి పార్టీలోకి రావడంపై స్పష్టత ఇస్తానని రాజ య్య చెప్పినట్టు సమాచారం. ఓ వైపు రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకొని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపడంపై కసరత్తు చేస్తూనే, మరోవైపు ఇతర ప్రత్యామ్నాయాలను కేసీఆర్ అన్వేషిస్తున్నట్టు సమా చారం. పార్టీ తరపున టికెట్ ఆశించిన బోడ డిన్న, నిరంజన్, జింక రమేశ్ తదితరులు తమవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు హనుమ కొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి భార్య, జెడ్పీటీసీ సభ్యురాలు పెద్ది స్వప్న తదితరుల పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఇదిలాఉంటే తన అను చరులతో కడియం శ్రీహరి శనివారం హైదరాబా ద్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా స్టేషన్ఘనపూర్ నేతలతో నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసింది. -
ఆ రెండూ ఎవరికో?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు గాను 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చే యగా..పెండింగ్లో ఉన్న వరంగల్, ఖమ్మం అభ్యర్థుల విషయంలో ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. వరంగల్ ఎంపీ సీటు బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్కు ఖరారైనట్టు సమాచారం. మరోవైపు ఖమ్మం సీటు కోసం పలువురు ప్రయత్నాలు చేస్తుండగా, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు పేరును నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీతో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు బీఆర్ఎస్కు చెందిన ఓ ఎంపీ ఖమ్మం టికెట్ కోసం ఢిల్లీస్థాయిలో పెద్దెత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో తాను టీడీపీలో ఉన్నందున, ఇప్పుడు ఏపీలో టీడీపీ–బీజేపీల మధ్య పొత్తు దృష్ట్యా, ఖమ్మంలో తనకు టీడీపీ శ్రేణులు సహకరిస్తాయని, తప్పకుండా గెలుస్తానంటూ బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నాల్లో ఆయన నిమగ్నమైనట్టు చెబుతున్నారు. దీంతో ఖమ్మం విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. శానంపూడికి ఖాయమేనా? నల్లగొండ సీటును బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి ఇప్పటికే ప్రకటించారు. కానీ తనకు టికెట్ ఇస్తే అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థి ని మార్చడం కుదరదని కొందరు అంటుంటే, గెలుపు ఖాయమనుకుంటే అభ్యర్థి ని మార్చేందుకు నాయకత్వం వెనుకాడదని కొందరు అంటున్నారు. 22వ తేదీన జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించవచ్చునని పార్టీ నేతలు చెబుతున్నారు. 23న అభ్యర్థులతో కిషన్రెడ్డి సమావేశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఈ నెల 23న పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. శనివారం నాటి కల్లా 17 స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయ్యే అవకాశాలు ఉండడంతో వారితో ఈ భేటీ జరపనున్నట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. -
వరంగల్లో ఏసీబీ ప్రత్యేక కోర్టు
వరంగల్ లీగల్: వరంగల్లో ఏసీబీ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టును శనివారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో సంతోషపడటమే కాకుండా సమగ్రంగా సద్వినియోగం చేసుకునే విధంగా న్యాయవాదులు తర్ఫీదు పొందాలని అన్నారు. ఏసీబీ కోర్టుతోపాటు హనుమకొండ జిల్లాకు సబ్ కోర్టు, ఉభయ జిల్లాలకు ఈ– సేవా కేంద్రం, రాష్ట్రంలోనే తొలిసారి పాత రికార్డులను భద్రపర్చడం కోసం డిజిటైజేషన్ కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఇక్కడ ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టి.వినోద్కుమార్, ఉభయ జిల్లాల పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ ఎన్.రాజేశ్వర్రావు, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కె.రాధాదేవి, ఎం.కృష్ణమూర్తి, బార్ అసోసియేషన్ల అధ్యక్షులు ఆనంద్మోహన్, శ్యాంసుందర్రెడ్డి, సభ్యులు జయాకర్, జనార్ధన్, డాక్టర్ యాకస్వామి, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.