రజాసమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమయ్యేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 13వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ఆయన బనగానపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. బాతులూరుపాడు, ఎన్నకొండల మీదుగా ఉదయం 10.30 గంటలకు హుస్సైనపురం చేరుకుంటారు. హుస్సైనపురం చేరుకొనే ముందు మహిళ సదస్సులో పాల్గొంటారు.