ప్రధాన వార్తలు

అంతులేని యోగ సంపద!
‘అంతులేని కథ’ అనే ఒక సినిమా ఉంది. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ’70వ దశకంలో సంచలన చిత్రం. ఓ కుటుంబ యజమాని తన బాధ్యతల్ని వదిలేసి పారిపోతాడు. పెళ్లీడొచ్చిన పెద్ద కూతురు ఆ భారాన్ని తన భుజాలమీదేసుకుని బండి నడిపిస్తుంది. అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత పారిపోయిన పెద్దమనిషి ఇంటికి ఉత్తరం రాస్తాడు. ఇన్నేళ్లూ తాను కష్టపడి సంపాదించిన అంతులేని సంపదతో తిరిగొస్తున్నానని ఆ ఉత్తరంలో చెబుతాడు. ఇల్లంతా పండుగ వాతావరణం. ఆ రోజు రానే వచ్చింది. ఆయన దిగనే దిగాడు. కాకపోతే కాషాయ దుస్తుల్లో, సన్యాసి వేషంలో! షాక్ తిన్న కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి తన ఉత్తరంలో రాసిన సారాంశాన్ని వివరిస్తాడు. తన ఉద్దేశంలో సంపద అంటే భక్తి సంపద, జ్ఞాన సంపద, తపః సంపద, మోక్ష సంపద... ఇవి దండిగా సంపాదించానని చెబుతాడు.ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భాన్ని ఒక గొప్ప ఈవెంట్గా మలుచుకునేందుకు ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ అక్కరకొచ్చింది. ప్రధానిని పిలుచుకున్నారు. 3 లక్షల మందితో విశాఖ తీరంలో ఆసనాలు వేయించి, గిన్నిస్ బుక్ సంస్థ నుంచి ప్రపంచ రికార్డు పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. గతంలో ఎవరూ చేయని ఘనమైన కార్యాన్నే గిన్నిస్ బుక్ వాళ్ళు రికార్డులోకి ఎక్కిస్తారు. ఆ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లోని తాపేశ్వరం స్వీట్ షాప్ వాళ్లు 29,465 కిలోల బరువు ఉన్న లడ్డూను తయారు చేసినందుకు షాపు యజమాని పోలిశెట్టి మల్లిబాబుకు గిన్నిస్ బుక్లో చోటు దొరికింది. రామ్ సింగ్ అనే జైపూర్ వాసి నాలుగున్నర మీటర్ల పొడవైన మీసాలు పెంచి ఈ ఘనత సాధించాడు. ఆంటోనీ విక్టర్ అనే మరో భారతీయుడు చెవుల మీద ఏడు ఇంచుల పొడవైన వెంట్రుకల్ని పెంచాడు. ఇదేమీ చిన్న ఫీట్ కాదు కదా! అందుకే గిన్నిస్ బుక్లోకి ఎక్కింది.అట్లాగే చేతి వేళ్లకు ఉన్న గోళ్ళను ఎనిమిదిన్నర మీటర్లు పెంచి ఒకరు, తలకాయతో 46 టాయిలెట్ సీట్లను పగలగొట్టి మరొకరు, 459 స్ట్రాలను ఒకేసారి నోట్లో కుక్కి ఇంకొకరు ఈ ఘనతను సాధించిన వారిలో ఉన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ఈ విశిష్ట ఘనతలు ఆంధ్రప్రదేశ్కు రెండు లభించాయి. ఒకే ప్రదేశంలో మూడు లక్షల మందికి పైగా యోగా చేసినందుకు ఒకటి, 22,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసినందుకు మరొకటి! గిన్నిస్ రికార్డుల కోసం ఎక్కువ మందితో ఒకే చోట డాన్సులు చేయించడం, డ్రమ్స్ వాయించడం, పాటలు పాడించడం వంటి కార్యక్రమాలను సాధారణంగా పెద్ద పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీల వాళ్ళు చేస్తుంటారు. ఇది మరీ పెద్ద రికార్డు కనుక స్వయంగా ప్రభుత్వమే తన భుజాల మీదకు ఎత్తుకుంది. డ్వాక్రా మహిళలు, పాఠశాల విద్యార్థులు తప్పనిసరిగా వెళ్లాలని తాఖీదులు వెళ్లాయి. స్వచ్ఛంద సంస్థలని బలవంతంగా రంగంలోకి దింపారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ హాజరయ్యే బాధ్యతను ప్రభుత్వ అధికారులకు అప్పగించారు. వేలాది బస్సులను ఏర్పాటు చేశారు. టీ షర్టులను, మ్యాట్లను ఉచితంగా అందజేశారు. ఐదు లక్షలు టార్గెట్గా పెట్టుకుంటే, అటెండెన్స్ మూడు లక్షల మార్కు దాటింది. కార్యక్రమం విజయవంతం కావడం, ఒకేసారి రాష్ట్రానికి విశిష్టమైన రెండు గిన్నిస్ రికార్డులు లభించటం సహజంగానే ముఖ్యమంత్రిని మిక్కిలి సంతోషపరిచింది. కార్యక్రమం ముగిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. విశాఖపట్నం అంటే తనకెంతో ఇష్టం కనుక ఈ ఘనత విశాఖకు లభించేలా చేశానని అర్థం వచ్చేలా మాట్లాడారు. హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు తను విశాఖలోనే బస్సులో కూర్చుని అజమాయిషీ చేసిన సంగతిని గుర్తు చేశారు. ముంబయ్ని మించి, విశాఖలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమం సందర్భంగా ప్రధాని సమక్షంలో ఆయనను చరిత్ర సృష్టించిన వ్యక్తిగా పొగిడిన బాబు – మీడియా సమావేశంలో ఆయనకు మరిన్ని పొగడ్తలు తగిలించారు. ఒక ప్రభుత్వం ఏడాది పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్నప్పుడు సహజంగా ఫోకస్ కావాల్సిన అంశాలు, చర్చనీయాంశాలు కావలసిన సంగతుల స్థానాన్ని ఇటువంటి మెగా ఈవెంట్ ఆక్రమించడం కూడా బాబు ఆనందానికి ఇంకో కారణం కావచ్చు. సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డును తెచ్చిపెట్టిన గిరిజన బాలలు విశాఖలో ఆకలితో అలమటించారని, పడుకునేందుకు, కనీస అవసరాలకు చోటు దొరక్క అగచాట్ల పాలయ్యారని వస్తున్న వార్తలు, తన ఆనందానికి భంగం కలిగించడం ఆయనకు ఇష్టంలేదు. అందుకే ఆ ఘటనపై విచారమూ లేదు... విచారణా లేదు.ప్రభుత్వం ఏడాది పాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా చర్చనీయాంశం కావలసిన అంశాలను ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మొన్న జనం ముందుకు, ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో గణాంకాల సహితంగా నిరూపించారు. ఆయన సొంత గణాంకాలు కావవి! ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల గణాంకాలతోనే జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టారు. ఏడాది కాలంలోనే లక్షా అరవై వేల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించారు. ఏడాదిగా ‘అమ్మ ఒడి’ పథకాన్ని నిలిపివేయడంపై నిలదీశారు. ప్రభుత్వ బడుల్లో అందుతున్న నాణ్యమైన విద్యకు బ్రేకులు వేయడంలోని ఔచిత్యం ఏమిటని అడిగారు. ‘ఫీజు రీయింబర్స్మెంట్’, ‘ఆరోగ్యశ్రీ’ బకాయిల ఎగవేతపై, రైతాంగాన్ని కష్టాల కడలిలో ముంచడంపై తూర్పారబట్టారు. అన్నింటినీ మించి ‘‘ఎన్నికల బాండ్లపై ప్రభుత్వాన్ని నిలదీయండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికలకు ముందు తెలుగుదేశం కూటమి ఇంటింటికీ ప్రమాణ పత్రాలను పంపిణీ చేసింది. ‘‘చంద్రబాబు నాయుడు – పవన్ కల్యాణ్ అను మేము రాష్ట్ర ప్రజలు మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ష్యూరిటీ పత్రంలో పేర్కొన్న హామీలను అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము’’ అని పేర్కొంటూ వారిద్దరూ ఆ పత్రాలపై సంతకాలు చేశారు. ఆ పత్రంలో కుటుంబ యజమాని పేరు, తండ్రి పేరు, వయసుతోపాటు కుటుంబ సభ్యుల సంఖ్యను, తాము హామీ ఇస్తున్న పథకాల్లో ఆ కుటుంబానికి వర్తించే వాటిని పేర్కొన్నారు. ఆ పథకాల కింద వారికి మొదటి ఏడాది జరిగే లబ్ధిని, ఐదేళ్లలో జరిగే లబ్ధిని కూడా పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్న కోటీ నలభై లక్షల కుటుంబాలకు ఈ ప్రమాణ పత్రాలను పంపిణీ చేసినట్టు సమాచారం. జూన్ 2024 నుంచి ఈ హామీలు వర్తింపచేస్తామని కూడా ఈ పత్రంలో స్పష్టంగా రాశారు. ఆ లెక్కన ప్రమాణ పత్రాల సాక్షిగా ఏపీ ప్రజలకు ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం 81 వేల కోట్ల రూపాయలకు పైగా బకాయి పడిందని అంచనా.ప్రతిపక్ష నాయకుడు ఆరోపణలు చేసినప్పుడు బాధ్యత గల ప్రభుత్వాలు దానికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. సమాధానం ఇవ్వకపోగా ప్రతిపక్ష నేత పిలుపునిచ్చినట్టుగా ఎవరైనా నిలదీస్తే తాట తీస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించడం ఒక విడ్డూరం. పైగా అసలు కథను వదిలేసి ‘రప్పా రప్పా’ అనే ఓ పిట్ట కథను పట్టుకొని జగన్ మోహన్ రెడ్డి అనని మాటల్ని ఆయనకు ఆపాదించి మీడియాలో తెలుగుదేశం పార్టీ వీరంగం వేసింది. ఆ మీడియాలోనే చదివిన వాళ్లకు, చూసిన వాళ్లకు ఏం అర్థమవుతుంది? రెండున్నర గంటల మీడియా సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి ‘రప్పా రప్పా’ అనే అంశంపైన మాత్రమే మాట్లాడారని అనుకుంటారు కదా! ఇదే తెలుగుదేశం పార్టీకి కావలసింది. ప్రతిపక్ష నేత లేవనెత్తిన అంశాలు జనంలోకి వెళ్ళకూడదు, చర్చ జరగకూడదు.ఒకవేళ కూటమి పెద్దల ఖర్మ కాలి, ఈ ప్రమాణ పత్రాలను తీసుకుని కోటి కుటుంబాల వారు తమకు బకాయిలు ఇప్పించాలని కోర్టుల మెట్లెక్కితే? కోర్టులు ఎలా స్పందిస్తాయనేది పక్కన పెడదాం. ప్రభుత్వం మోసం చేసిందంటూ కోటి కాదు, పది లక్షల కుటుంబాల వారు ఒకేసారి ఫిర్యాదులు చేసినా అదే పెద్ద రికార్డు! దాని ముందు గిన్నిస్ రికార్డులు, పిన్నిస్ రికార్డులు అన్నీ బద్దలు కావాల్సిందే! ఇదిగో జనం నుంచి ఇటువంటి సామూహిక ఫిర్యాదులు రాకుండా వారి ఆలోచనలను హైజాక్ చేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, గిన్నిస్ బుక్ను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకున్నది. యోగా అనేది సర్వరోగాలకూ, సకల సమస్యలకూ ఏకైక దివ్యౌషధం అన్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడారు.‘రోజు ఒక గంట యోగా చేయండి. అదే పదివేలు’ అని ముఖ్యమంత్రి పిలుపునిస్తున్నారు. యోగాపై విశాఖ డిక్లరేషన్ కూడా త్వరలో విడుదల చేస్తారట! బిల్గేట్స్ ఫౌండేషన్తో కలిసి పని చేస్తున్నామని, యోగా–నేచురోపతి గేమ్ ఛేంజర్లుగా మారబోతున్నాయని ఆయన ప్రకటించారు. ఇక అల్లోపతి అటకెక్కినట్టేనా? యోగాభ్యాసాల్లో చేయించే ఎక్సర్సైజుల్లో చాలా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్లు గతంలో పాఠశాలల్లో ఉన్న డ్రిల్ పీరియడ్లలో నేర్పించినవే. ఇప్పుడు మైదానాలు, స్పోర్ట్స్ టీచర్లు, స్పోర్ట్స్ పీరియడ్లను ఎత్తేశారు కాబట్టి, ఎవరింటి దగ్గర వాళ్లు గంటసేపు యోగా చేయమంటున్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులైన కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ దివంగతులైన రోజు జూన్ 21. అదే రోజును ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా ప్రకటించడం కేవలం కాకతాళీయమే కావచ్చు.కానీ, ఈ ప్రకటన తర్వాత యోగా గురువులు తామరతంపరగా పుట్టుకొస్తున్నారు. యూట్యూబ్ల ద్వారా పాఠాలు చెబుతున్నారు. అందులో రోగాల స్పెషలిస్టులు కూడా బయలుదేరారు. నడుము నొప్పికి సేతుబంధాసనమట! సంతానం కలగాలంటే భుజంగాసనమట! ఇలానే కడుపునొప్పికి, గ్యాస్ మంటకు, దగ్గుకు, ఆయాసానికీ చివరికి ఎయిడ్స్కు, క్యాన్సర్కు కూడా యోగా చిట్కాలు చెప్పే గురువులు తయారయ్యారు. వీటన్నిటినీ వైద్యశాస్త్రం ఆమోదిస్తుందా, వీళ్ళందరికీ శరీర నిర్మాణ శాస్త్రంపై అవగాహన ఉన్నదా అనేవి ప్రశ్నార్థకాలు. ఆమధ్య ‘టెలిగ్రాఫ్ ఇండియా’ ఒక పరిశీలనాత్మక వ్యాసం రాసింది. అందులో ‘అష్టాంగ యోగా’ను ఆచరిస్తున్న వారిలో 62% మంది మోకాలి నొప్పులు, పిక్క కండరాల సమస్యలను ఎదుర్కొంటున్నారట! ఏ వయసు వారు ఎటువంటి ఆసనాలు వేయవచ్చు? ఆసనాలు వేసే సరైన పద్ధతి ఏమిటనే అవగాహన శాస్త్రీయంగా కల్పించకపోతే సమస్యలు ఎదురవుతాయి. యూట్యూబ్ సందేశాలు విని, పునర్ యవ్వనం ప్రాప్తిస్తుందని నమ్మి ముసలాళ్లు కూడా వజ్రాసనం వేసి కూర్చుంటే మోకాలి చిప్పలు దెబ్బతినవా? ఈ వేలం వెర్రిని నియంత్రించుకోకుంటే దుష్ఫలితాలు కూడా ఉంటాయని గ్రహించాలి.పిల్లలు పాఠశాల మైదానాల్లో నేర్చుకునే జిమ్నాస్టిక్స్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ వంటి క్రీడలకు, ఇంటి దగ్గర ఇరుకు గదుల్లో అభ్యసించే యోగా సరైన ప్రత్యామ్నాయమేనా అనేది కూడా ఆలోచించాలి. యోగాభ్యాసం ద్వారా శారీరక చురుకుదనం, మానసిక పరిపక్వత దేదీప్యమానమవుతుందనే అభిప్రాయం నిజమైతే దీన్ని ప్రమోట్ చేసే పద్ధతి గిన్నిస్ బుక్ ప్రదర్శనల ద్వారా కాదు. యోగాభ్యాసం ఫలితంగా ఫలానా అథ్లెట్ ఫలానా కప్పు గెలుచుకొచ్చారని, ఫలానా క్రీడా జట్టు ఫలానా టోర్నమెంట్ గెలిచిందని ఉదాహరించాలి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఫలానా వ్యక్తులు ఫలానా ఆవిష్కరణలు చేశారని, నోబెల్ బహుమతి గెలిచిన వారి మేధ వెనుక యోగాభ్యాసం ఉన్నదనేటటువంటి పాఠాలు ఎక్కువ మోటివేట్ చేస్తాయి. కాకపోతే అటువంటి ఉదాహరణల కోసం కాస్త కష్టపడి శోధించాలి.‘సకల సమస్యలకు యోగానే మందు’ అనే ప్రచారాన్ని ముందుకు తెస్తున్న చంద్రబాబు లాంటి వాళ్లు ‘‘ప్రభుత్వ బడుల్లో టోఫెల్ పాఠాలెందుకు, సీబీఎస్ఈ ఎందుకు, ఐబి ఎందుకు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు? యోగా ఉందిగా! ‘ఆరోగ్యశ్రీ’ ఎందుకు, ‘ఫ్యామిలీ డాక్టర్’ ఎందుకు? యోగా చేయండి చాలు!’’ అనే ప్రచారాన్ని ముమ్మరం చేసే అవకాశం ఉన్నది. ‘అంతులేని కథ’లో సదరు సన్యాసిరావు సంభాషించిన జ్ఞాన సంపద, భక్తి సంపద, తపః సంపద మాదిరిగానే! ఇక ఆంధ్ర దేశంలో యోగ సంపద కూడా దినదిన ప్రవర్ధమానం కావచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

డబ్బుల్లేవు.. కొత్త పథకాలెట్టా?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకే నానా కష్టాలు పడుతూ డబ్బులు సమకూర్చుకుంటున్న నేపథ్యంలో..ఇక కొత్త సంక్షేమ పథకాల అమలు ఇప్పట్లో సాధ్యం కాదనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఆర్థిక కటకట నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలు నిలిపివేయాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతి నెలా ఖజానాకు వస్తున్న ఆదాయంతో అనివార్యంగా చేయాల్సిన ఖర్చుల సర్దుబాటు మాత్రమే జరుగుతోందని, ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు అవసరమైనప్పుడు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆసరా పింఛన్లను పెంచి ఎన్నికలకు వెళ్లాలనుకున్నా సాధ్యం కాలేదని, రైతు భరోసా నిధులు జమ చేసేందుకు మాత్రమే వెసులుబాటు దొరికిందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు ఆదాయం కావాలంటే భూముల అమ్మకమే శరణ్యమని స్పష్టం చేస్తున్నాయి. ఆదాయం అంతంత మాత్రమే.. ఖజానా లెక్కలు పరిశీలిస్తే.. రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతి నెలా ప్రభుత్వ సొంత రాబడులు రూ.12 వేల కోట్లకు మించడం లేదు. గత రెండేళ్ల గణాంకాలు పరిశీలించినా ఇదే విషయం స్పష్టమవుతోంది. తాజాగా కాగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025 ఏప్రిల్ నెలలో రూ.10,916 కోట్లు మాత్రమే పన్ను ఆదాయం వచ్చింది. ఇందులో జీఎస్టీ కింద రూ.4 వేల కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1,126 కోట్లు, అమ్మకపు పన్ను రూపంలో రూ.2,700 కోట్లు, ఎక్సైజ్ ద్వారా రూ.1,300 కోట్లు, కేంద్ర పన్నుల రూపంలో రూ.1,100 కోట్లు వచ్చాయి. వీటితో పాటు అప్పులు, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు కలిపినా మొత్తం రాబడులు రూ.16,473 కోట్లు మాత్రమే. ప్రతి నెలా ఖర్చు ఇలా.. ఖర్చుల విషయానికి వస్తే ప్రతి నెలా సగటున రూ.6 వేల కోట్ల వరకు రెవెన్యూ పద్దు కింద ఖర్చు చేయాల్సి వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో పాటు రూ.2 వేల కోట్ల వరకు అప్పులకు వడ్డీల కింద, దాదాపు రూ.4 వేల కోట్లు (తాజాగా ప్రకటించిన డీఏతో కలిపి) ఉద్యోగులకు వేతనాల కింద, రూ.1,500 కోట్లు పింఛన్ల కింద, రూ.2,500 కోట్ల వరకు సబ్సిడీల కింద, రూ.1000–1500 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇవన్నీ అనివార్యంగా చెల్లించాల్సినవే. ఇవన్నీ కలిపి రూ.17 వేల కోట్లు దాటుతున్నాయి. అయితే ప్రభుత్వ రాబడులు (అప్పులతో కలిపి) ఇంతకంటే తక్కువే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కొంచెం అటుఇటుగా ఈ చేత్తో తీసుకుని ఆ చేత్తో ఇచ్చేటట్టే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉండటం గమనార్హం. కాగా రూపాయి అదనంగా ఖర్చు పెట్టాలన్నా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెప్పినట్టు కడుపు కట్టుకోవాల్సిందేనని, ఎప్పటికప్పుడు సర్దుబాటుకు మాత్రమే నిధులు సరిపోతున్నాయని, ఏదైనా పథకానికి డబ్బులు కావాలంటే రూపాయి రూపాయి పోగేయాల్సి వస్తోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. హెచ్ఎండీఏపై ఆశలు..‘నియోపొలిస్’పై కన్ను ప్రస్తుత పరిస్థితుల్లో భూముల అమ్మకాల ద్వారా మాత్రమే అదనపు ఆదాయం వస్తుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పుడే లోటు రూ.9 వేల కోట్లకు చేరినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కంచ గచ్చిబౌలి భూముల అమ్మకాల ద్వారా రూ.20 వేల కోట్లు సమకూర్చుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలన్న ఆలోచన కార్యరూపం దాల్చకపోవడంతో ఇక, హెచ్ఎండీఏ మీదనే ప్రభుత్వం ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా కోకాపేట్ నియోపొలిస్ భూముల అమ్మకాలను త్వరలోనే తెరపైకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ దాదాపు ఐదు ప్రాంతాల్లో భూముల అమ్మకాలకు అవకాశాలున్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు 18 హెచ్ఎండీఏ లేఅవుట్లలోని 2,414 ప్లాట్లు, ఉప్పల్ భగాయత్, తుర్కయంజాల్, ఇన్ముల్ నర్వలతో పాటు లేమూరు, కుర్మాల్గూడ, బాచుపల్లి, మేడిపల్లి, మోకిల, ప్రతాప సింగారం, బహుదూర్పల్లి, పెద్ద కంజర్ల తదితర ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లు అమ్మడానికి కూడా సర్కారు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద 18 నెలల కాలంలో కనీసం రూ.12 వేల కోట్లను హెచ్ఎండీఏ భూముల అమ్మకాల ద్వారా రాబట్టుకోవాలని, నియోపోలిస్ భూముల అమ్మకాల ద్వారా మరో రూ.3 వేల కోట్ల వరకు సమకూర్చుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వ వర్గాలున్నట్టు సమాచారం. ఎన్నికల సమయంలో అలా... అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉన్నట్లు చెప్పి పలు పథకాలను ప్రకటించిన కాంగ్రెస్ పెద్దలు.. ఇప్పుడు అమలు చేయాల్సి వచ్చేసరికి ఆదాయం పెరిగితే తప్ప అమలు చేయడం సాధ్యం కాదని, అప్పుల కిందే నెలకు రూ.6 వేల కోట్లు చెల్లించాల్సి రావడం వల్ల సంక్షేమ పథకాలకు నిధులు చాలడం లేదని అంటుండంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెన్షన్ల పెంపు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఏడాదిన్నర అయినా అమలు కాకపోగా... రైతుభరోసా కింద ఎకరాకు ఏటా ఇస్తామన్న మొత్తాన్ని రూ.15 వేల నుంచి రూ.12 వేలకు కుదిండాన్ని ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. అది కూడా సక్రమంగా చెల్లించలేదని ఆరోపిస్తున్నాయి. అలాగే ఉద్యోగులకు ఐదు డీఏలు చెల్లించాల్సి ఉండగా, రెండింటికి అమోదం తెలిపి.. ఒక డీఏ ఇప్పుడు చెల్లిస్తామని, మరో డీఏ ఆరునెలల తరవాత చెల్లిస్తామని చెప్పడం కూడా ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ఇక వేతన సవరణ ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదని ఉద్యోగులు వాపోతుండగా.. ఆదాయం పెరిగితే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉందంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పెరుగుతున్న బడ్జెట్ అంతరం ప్రస్తుత (2025–26) ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అంటే సగటున నెలకు రూ.25 వేల కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కానీ మొదటి రెండు నెలల ఆదాయ గణాంకాలను పరిశీలిస్తే అది రూ.16,500 కోట్లు దాటలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు, వాస్తవ రాబడులకు మధ్య దాదాపు రూ.8,500 కోట్ల మేర తేడా వస్తోందన్న మాట. గత అర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది ఎక్కువే. 2024–25లో ప్రతిపాదించిన బడ్జెట్ ప్రకారం ప్రతినెలా సగటున రూ 23,500 కోట్ల వరకు సమకూర్చుకోవాలి. కానీ సగటున రూ.17 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్ల వరకే రాబడులు వచ్చాయి. అంటే ప్రతినెలా సుమారు రూ.6 వేల కోట్లు తక్కువ వచ్చింది. ఇప్పుడు ఆ తేడా ఏకంగా రూ.8,500 కోట్లకు చేరడం గమనార్హం.

బీఆర్ఎస్కు టచ్లో ఉన్న ఇంజనీర్లపై నిఘా..!
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో పలువురు ఇంజనీర్లు గత సర్కారులోని పెద్దలతో ఇంకా టచ్లోనే ఉంటున్నారని ప్రభుత్వం అనుమానిస్తోంది. సర్కారు తీసుకునే ప్రతీ నిర్ణయంపై వారికి వెంటనే సమాచారం చేరవేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అలాంటి ఇంజనీర్లపై నిఘా పెట్టా లని ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఏసీబీ దాడులు కూడా జరిగినట్లు నీటిపారుదల శాఖలో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉన్నారని భావిస్తున్న వారిని కీలక స్థానాల నుంచి తప్పించాలని ఆదేశించినట్లు, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన వారిపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు అధికారవర్గాల సమాచారం. కాళేశ్వరం పరిధిలోని నిర్మాణాల్లో అవకతవకలు జరిగినట్లు భావిస్తున్న వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఆ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా విజిలెన్స్ అధికారులు నీటిపారుదల శాఖలోని ఇంజనీర్లకు ఇటీవల నోటీసులు జారీ చేసిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు ఏసీబీ దాడుల్లో పట్టుపడుతున్న ఇంజనీర్లు వందల కోట్ల మేర అక్రమ ఆస్తులను అందుకు ఉదాహరణగా చూపుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేసింది. దీనితో ఆ పార్టీ ముఖ్యనేతలతో కొందరు ఇంజనీర్లకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అనుమానాలను ధ్రువీకరిస్తూ ఇటీవల ప్రభుత్వానికి నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీని మేరకు కొందరు ఇంజనీర్లపై అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ)తో దాడులు జరిపించడంతోపాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిఫారసుల ఆధారంగా మరికొందరిపై చర్యలకు శ్రీకారం చుట్టారని చర్చ జరుగుతోంది. విజిలెన్స్ సిఫారసుల ఆధారంగా ఏకంగా 38 మంది ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు జారీకావడం శాఖలో ప్రకంపనలు సృష్టించింది. సర్కారుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనీ... ఏసీబీ కాళేశ్వరం ప్రాజెక్టు గజ్వేల్ ఈఎన్సీతోపాటు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్గా రెండు హోదాల్లో కీలకంగా కొనసాగిన బి.హరిరామ్ను తొలుత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత ఏప్రిల్ 26న అరెస్టు చేసింది. అలాగే, వేరే చోటికి బదిలీ చేసినా ఏడాదికాలంగా ఎస్సారెస్పీ డివిజన్–8 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కొనసాగుతున్న నూనె శ్రీధర్ను సైతం ఏసీబీ ఈ నెల 11న అరెస్టు చేసింది. తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడైనప్పటికీ ప్రభుత్వం ఆయన్ను ఏసీబీ కేసులో అరెస్టు చేయడం గమనార్హం. ప్రభుత్వం మారినా బీఆర్ఎస్ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్టు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించడంతోనే వీరిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్టు సమాచారం. సాగునీటి రంగంలో గత ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబడుతుండగా, కొందరు అధికారులు గత ప్రభుత్వ నిర్ణయాలను సమరి్థస్తూ రావడం ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయంలో ఉండాల్సిన ఫైళ్ల కాపీలు ప్రతిపక్ష నేతలకు వెళ్లడంతోనే ప్రభుత్వం సీరియస్ అయినట్టు సమాచారం. నివేదిక రెండు నెలలు కోల్డ్ స్టోరేజీలో.. కాళేశ్వరం బరాజ్ల నిర్మాణంలో అవకతవకతలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావును విచారించింది. వీరిని కమిషన్ ప్రశ్నించనున్నట్లు సమాచారం రాగానే ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొందరు ఇంజనీర్లపై ఏసీబీ దాడులు చేయించినట్టు బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో 38 మంది ఇంజనీర్లు అవకతవకలకు పాల్పడినట్టు విజిలెన్స్ విభాగం గుర్తించిందని, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ గత మార్చి 18న విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది. రెండు నెలల పాటు కోల్డ్ స్టోరేజీలో ఉన్న ఈ సిఫారసుల లేఖను సరిగ్గా కేసీఆర్ విచారణ కమిషన్ ఎదుట హాజరు కావడానికి ముందు ప్రభుత్వం బయటపెట్టినట్టు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కమిషన్ సమన్ల ప్రకారం ఈ నెల 5న కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, 2న విజిలెన్స్ కమిషన్ లేఖను ప్రభుత్వం మీడియాకు లీక్ చేసినట్టు గుర్తు చేస్తున్నారు.

ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. నూతన ఉద్యోగాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,ఉత్తరాయనం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం;తిథి: బ.ద్వాదశి రా.11.14 వరకు,తదుపరి త్రయోదశి;నక్షత్రం: భరణి ప.3.58 వరకు,తదుపరి కృత్తిక;వర్జ్యం: రా.3.09 నుండి 4.39 వరకు దుర్ముహూర్తం: సా.4.46 నుండి 5.38 వరకు అమృత ఘడియలు: ఉ.11.22 నుండి 12.51 వరకుసూర్యోదయం : 5.30సూర్యాస్తమయం : 6.33రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకుయమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు మేషం.... ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. రాబడి పెరుగుతుంది. సోదరులతో సఖ్యత. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.వృషభం.... రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. రుణబాధలు. దూరప్రయాణాలు. ఆస్తి విషయంలో చికాకులు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.మిథునం... నూతన ఉద్యోగాలు లభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.కర్కాటకం.... కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహం.సింహం.... సన్నిహితుల ద్వారా కొన్ని ఇబ్బందులు. ముఖ్య పనులు ముందుకు సాగవు. మీ ఆలోచనలు అంతగా కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.కన్య.... రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలు ఒడిదుడుకులతో సాగుతాయి.తుల..... కొత్త వ్యక్తుల పరిచయం. బాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు అనూహ్యంగా ముందుకు సాగుతాయి.వృశ్చికం... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలు అంచనాలు మేరకు కొనసాగుతాయి.ధనుస్సు.... ఉద్యోగయత్నాలు కొంత మందగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలు ఇబ్బంది కలిగించవచ్చు.మకరం.. పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువుల నుండి ఒత్తిడులు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.కుంభం... మిత్రుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.మీనం.... కుటుంబసభ్యులతో విభేదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. కొన్ని పనులు నిదానిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సాధారణస్థాయిలో ఉంటాయి.

ఇంగ్లండ్ దీటైన జవాబు.. తొలి ఇన్నింగ్స్లో 209/3
జైస్వాల్, గిల్ వేసిన బాటలో... పంత్ చెలరేగిపోయి సెంచరీ బాదడంతో ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరు చేయగా... అదే స్థాయిలో రెచ్చిపోయిన ఇంగ్లండ్ దీటుగా బదులిస్తోంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో విజృంభించినా...అతడికి మరో ఎండ్ నుంచి సరైన సహకారం లేకపోవడంతో ఆతిథ్య ఇంగ్లండ్ బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. ప్రస్తుతానికి ఇరు జట్లు సమాన స్థితిలోనే ఉన్నా... మూడో రోజు తొలి సెషన్లో బుమ్రాను ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే ఈ మ్యాచ్ గమనం ఆధారపడి ఉంది!లీడ్స్: బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ఇరు జట్ల ఆటగాళ్లు భారీ స్కోర్లతో రెచి్చపోవడంతో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. బుమ్రా మినహా భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో... శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఒలీ పోప్ (131 బంతుల్లో 100 బ్యాటింగ్; 13 ఫోర్లు) ‘శత’క్కొట్టగా... బెన్ డకెట్ (94 బంతుల్లో 62; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం చేతిలో 7 వికెట్లు ఉన్న ఇంగ్లండ్... టీమిండియా స్కోరుకు ఇంకా 262 పరుగులు వెనుకబడి ఉంది. పోప్తో పాటు బ్రూక్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 359/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 113 ఓవర్లలో 471 పరుగులు చేసి ఆలౌటైంది. కెపె్టన్ శుబ్మన్ గిల్ (227 బంతుల్లో 147; 19 ఫోర్లు, 1 సిక్స్) టెస్టు కెరీర్లో అత్యధిక స్కోరు నమోదు చేసుకోగా... రిషభ్ పంత్ (178 బంతుల్లో 134; 12 ఫోర్లు, 6 సిక్స్లు) ధనాధన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్, టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బుమ్రా ఒంటరి పోరాటం... సిరీస్ ఆరంభానికి ముందు అంతా ఊహించినట్లు... ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా బుమ్రానే అని నిరూపించుకున్నాడు. పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా అతడు ప్రతి బంతికి వికెట్ తీసేలా అత్యంత ప్రమాదకారిగా కనిపించాడు. వర్షం కారణంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆలస్యంగా ప్రారంభం కాగా... తొలి ఓవర్లోనే ఓపెనర్ జాక్ క్రాలీ (4)ని పంత్ వెనక్కి పంపాడు. అదే తీవ్రత కొనసాగిస్తూ బుమ్రా రెచ్చిపోతుంటే... ఇంగ్లండ్ బ్యాటర్లు ప్రతీ బంతికీ బతుకు జీవుడా అంటూ కాలం వెల్లదీశారు. ఈ క్రమంలో ఎడ్జ్ల ద్వారా కాస్త పరుగులు రాగా... మనవాళ్ల పేలవ ఫీల్డింగ్ ప్రత్యర్థికి కలిసొచ్చింది. ఇంగ్లండ్ వంటి పేస్ పిచ్లపై స్లిప్స్లో దూసుకొచ్చే బంతులను అందుకోవడంలో యువ ఆటగాళ్ల అనుభవ రాహిత్యం కొట్టిచి్చనట్లు కనిపించింది. బుమ్రా బౌలింగ్లోకు ఫీల్డర్ల మద్దతు లభించి ఉంటే ఈ పాటికి మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చి ఉండేదే! కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొన్న బెన్ డకెట్, పోప్ కుదురుకున్నాక చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. బుమ్రా బౌలింగ్ను కాచుకున్న ఈ జంట... సిరాజ్, ప్రసిధ్ కృష్ణ బౌలింగ్లో స్వేచ్ఛగా ఆడింది. దీంతో ఏ దశలోనూ పరుగుల వేగం తగ్గలేదు. టీ విరామం అనంతరం మరోసారి బంతినందుకున్న బుమ్రా... డకెట్ను క్లీన్ బౌల్డ్ చేయగా... చివరి సెషన్లో పోప్ చెలరేగిపోయాడు. ఎడాపెడా షాట్లు ఆడుతూ... 125 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే రూట్ (28)ను బుమ్రా బుట్టలో వేసుకోగా... ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోకుండా రోజును ముగించింది. అదరగొట్టిన పంత్.. తొలి రోజు ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్న భారత బ్యాటర్లు... రెండో రోజు తొలి సెషన్ ఆరంభంలోని దాన్ని కొనసాగించారు. ఓవర్నైట్ బ్యాటర్లు గిల్, పంత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. గిల్ కాస్త సంయమనం పాటించగా... పంత్ మాత్రం భారీ షాట్లతో రెచి్చపోయాడు. ఈ క్రమంలో పంత్ 146 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 99 పరుగుల వద్ద బషీర్ బౌలింగ్లో భారీ సిక్సర్తో మూడంకెల స్కోరు అందుకున్నాడు. అనంతరం తనదైన శైలిలో పల్టీలు కొడుతూ సంబరాలు జరుపుకున్నాడు. గతేడాది బంగ్లాదేశ్పై సెంచరీ అనంతరం పంత్కు ఇదే తొలి మూడంకెల స్కోరు. వన్డే తరహాలో ఆడిన ఈ జోడీ చకచకా పరుగులు రాబట్టింది. నాలుగో వికెట్కు 301 బంతుల్లో 209 పరుగులు జోడించిన అనంతరం గిల్ అవుటయ్యాడు. షోయబ్ బషీర్ బంతికి క్రీజు వదిల బయటకు వచ్చి భారీ షాట్కు యతి్నంచిన గిల్... బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్లో టంగ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 430 పరుగుల వద్ద భారత జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. అదే సమయంలో వాతావరణంలో స్వల్ప మార్పులతో మేఘావృతం కాగా... ఇంగ్లండ్ పేసర్లు రెచి్చపోయారు. ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న కరుణ్ నాయర్ (0) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఎక్స్ట్రా కవర్స్లో పోప్ పట్టిన మెరుపు క్యాచ్కు వెనుదిరిగాడు. ఆ తర్వాత టంగ్ బౌలింగ్లో పంత్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోగా... పేస్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ (1) అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. 454/7తో లంచ్కు వెళ్లిన భారత జట్టు ఆ తర్వాత మరో 17 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. జడేజా (11) ధాటిగా ఆడే ప్రయత్నంలో అవుట్ కావడం దెబ్బకొట్టింది. ఓవరాల్గా టీమిండియా 41 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయింది.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) స్టోక్స్ 101; రాహుల్ (సి) రూట్ (బి) కార్స్ 42; సాయి సుదర్శన్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 0; గిల్ (సి) టంగ్ (బి) బషీర్ 147; పంత్ (ఎల్బీ) (బి) టంగ్ 134; కరుణ్ నాయర్ (సి) పోప్ (బి) స్టోక్స్ 0; జడేజా (బి) టంగ్ 11; శార్దుల్ (సి) జేమీ స్మిత్ (బి) స్టోక్స్ 1; బుమ్రా (సి) బ్రూక్ (బి) టంగ్ 0; సిరాజ్ (నాటౌట్) 3; ప్రసిధ్ కృష్ణ (బి) టంగ్ 1; ఎక్స్ట్రాలు 31; మొత్తం (113 ఓవర్లలో ఆలౌట్) 471. వికెట్ల పతనం: 1–91, 2–92, 3–221, 4–430, 5–447, 6–453, 7–454, 8–458, 9–469, 10–471. బౌలింగ్: వోక్స్ 24–4–103–0; కార్స్ 22–5–96–1; టంగ్ 20–0–86–4; స్టోక్స్ 20–2–66–4; బషీర్ 27–6–100–1. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: జాక్ క్రాలీ (సి) కరుణ్ నాయర్ (బి) బుమ్రా 4; డకెట్ (బి) బుమ్రా 62; పోప్ (బ్యాటింగ్) 100; రూట్ (సి) కరుణ్ నాయర్ (బి) బుమ్రా 28; బ్రూక్ (బ్యాటింగ్) 0; ఎక్స్ట్రాలు 15; మొత్తం (49 ఓవర్లలో 3 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–4, 2–126, 3–206. బౌలింగ్: బుమ్రా 13–2–48–3; సిరాజ్ 14–0–50–0; ప్రసిధ్ కృష్ణ 10–0–56–0; జడేజా 9–2–25–0; శార్దుల్ 3–0–23–0.ఆ మూడు క్యాచ్లు పట్టుంటే... బుమ్రా బౌలింగ్లో డకెట్ రెండు సార్లు బతికిపోయాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ఐదో బంతికి డకెట్ ఇచి్చన క్యాచ్ను గల్లీలో యశస్వి జారవిడవగా... భారత అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడైన జడేజా కూడా డకెట్ క్యాచ్ నేలపాలు చేశాడు. డకెట్ బ్యాక్వర్డ్ పాయింట్లో ఇచి్చన క్యాచ్ను అందుకోవడంలో జడ్డూ విఫలమయ్యాడు. బుమ్రా వేసిన 31వ ఓవర్లో పోప్ ఇచి్చన క్యాచ్ను సైతం జైస్వాల్ నేలపాలు చేశాడు.

అప్పుడు స్టుపిడ్.. స్టుపిడ్! ఇప్పుడు సూపర్బ్.. సూపర్బ్
స్టుపిడ్..స్టుపిడ్.. స్టుపిడ్.. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ కోల్పోవడంతో కామెంటేటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు అదే గవాస్కర్ రిషబ్ పంత్ను ప్రశంసలతో ముంచెత్తాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.రెండో రోజు ఆటలో తన ఏడో టెస్టు సెంచరీ మార్క్ను రిషబ్ అందుకున్నాడు. ఈ ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ 99 పరుగుల వద్ద సిక్సర్ బాది మరి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో కామెంటరీ బాక్స్లో ఉన్న గవాస్కర్ సూపర్బ్.. సూపర్బ్.. సూపర్బ్ అంటూ కొనియాడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. విమర్శించిన నోళ్లతోనే పొగిడించుకోవడం చాలా గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓవరాల్గా 178 బంతులు ఎదుర్కొన్న పంత్.. 12 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 134 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సెంచరీతో టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్గా ధోని రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. పంత్కు ఇది ఏడో టెస్టు సెంచరీ.తొలి ఇన్నింగ్స్లో భారత స్కోరంతంటే?ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 471 పరుగులకు ఆలౌటైంది. 359/3 ఓవర్ నైట్స్కోర్తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్ను ముగించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్తో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), యశస్వి జైస్వాల్ (101, 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు..

గాల్లో ఉండగా మంటలు.. 8 మంది దుర్మరణం
బ్రెజిల్ గగనతలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హాట్ ఎయిర్ బెలూన్లో మంటలు చెలరేగి ఎనిమిది మంది మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. శాంటా కాటరినా రాష్ట్రం ప్రియాగ్రాండే నగరంలో శనివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. బెలూన్ గాల్లో ఉన్న సమయంలోనే మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అది నేలపై కూలిపోయింది. ఆ సమయంలో బెలూన్లో మొత్తం 22 మంది పర్యాటకులు ఉన్నారు. వాళ్లలో 13 మంది ప్రాణాలతో బయటపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.#Brazil: At least eight people have died following an accident involving a hot air balloon in the southern region of Santa Catarina.Governor Jorginho Mello said, rescue teams were searching for other people, as preliminary information indicated there were 22 people on board.… pic.twitter.com/usUJ3Mzfh0— All India Radio News (@airnewsalerts) June 21, 2025వారం కిందట సావో పాలో రాష్ట్రంలో కూడా ఇలాంటి హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. 11 మంది గాయపడ్డారు. వారం వ్యవధిలో వరుస ఘటనల నేపథ్యంలో హాట్ ఎయిర్ బెలూన్ పర్యటనల భద్రతపై పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.🚨🇧🇷 BREAKING: A hot air balloon caught FIRE and CRASHED with 22 people on board in Santa Catarina, Brazil.🎥 Shocking footage shows one person jumping out to escape the flames mid-air.#Brazil #Balloon #SantaCatarina pic.twitter.com/fisGaJHjrd— Breaking News (@PlanetReportHQ) June 21, 2025

ఐఐటీలకు ధీటుగా ఎల్పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ
భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్మార్క్ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)లో ఇటీవలి ఫ్లేస్మెంట్ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్పీయూ ప్లేస్మెంట్ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్మెంట్ డ్రైవ్తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్తో భారీ ఎల్పీయూ ప్లేస్మెంట్ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్వర్క్స్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్పీయూ తాజా ప్లేస్మెంట్ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్మెంట్ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్కు ప్రపంచ ఖ్యాతిఎల్పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్మెంట్ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్పీయూ ఎందుకంటే?ఎల్పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్మెంట్ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్ ప్లేస్మెంట్ ట్రెయినింగ్ పొందుతారు.‘ఎల్పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్మెంట్ ల్యాండ్ స్కేప్లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి.

అవునా.. ఈ శతాబ్దపు వివాహం ఇదేనా?
ప్రపంచంలో ఇప్పటిదాకా అత్యంత ఖరీదైన పెళ్లిగా గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించింది ఏదో తెలుసా?.. రెండు దశాబ్దాల కిందటే.. వందల కోట్లు ఖర్చు చేసిన ఆ వివాహ విశేషాల గురించి చివర్లో చెప్పుకుందాం. ఈలోపు.. ఈ శతాబ్దపు వివాహం(Wedding of the Century) ఇదేనంటూ నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ విషయంలో ఆ ప్రాంత ప్రజలు రెండుగా విడిపోయి వాదులాడుకుంటున్నారు. ఇంతకీ పెళ్లి గోల ఏంటంటే..అమెరికా టెక్ దిగ్గజం జెఫ్ బెజోస్(61)కి ఆయన ప్రేయసి, ప్రముఖ జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్కు జరగబోయే వివాహం గురించే ప్రపంచం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటలీ నగరం వెనిస్లో జూన్ 24 నుంచి 26వ తేదీల మధ్య మూడు రోజులపాటు అంగరంగ వైభంగా ఈ వివాహ వేడుక జరగనుంది. లియోనార్డో డికాప్రియో, కిమ్ కార్డాషియన్, బియాన్స్, మిక్ జాగర్ లాంటి ప్రముఖులు ఈ వివాహానికి అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఇందుకోసం భారీగానే వెచ్చించబోతున్నారట.వెనిస్లోని చారిత్రక భవనాలు, ప్యాలెస్లను వివాహ వేదికల కోసం అద్దెకు తీసుకుందీ జంట. ఒక్క ఫ్లవర్ డెకరేషన్ కోసం రూ.8 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. కేటరింగ్ కోసం రూ.10కోట్ల దాకా కేటాయించారు. కేవలం లారెన్ ధరించబోయే దుస్తులు, ఆభరణాల కోసం ₹12 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట. ఇవేకాకుండా.. అతిథులకు వసతి, రవాణా.. విలాసవంతమైన హోటళ్లు, వాటర్ టాక్సీలు, ప్రైవేట్ బోట్ల ఖర్చు కోసం మిలియన్లు కుమ్మరించబోతున్నాడు ఈ అపర కుబేరుడు. ఈ వివాహ వేడుకకు అంచనా ఖర్చు ₹125 కోట్ల నుంచి ₹166 కోట్ల ($15 మిలియన్ నుంచి $20 మిలియన్ వరకు) మధ్యగా ఉండొచ్చని ఒక అంచనా. వీళ్ల వివాహం మాటేమోగానీ.. ‘‘వెడ్డింగ్ ఆఫ్ ది సెంచరీ’’ అంటూ సోషల్ మీడియా ఊదరగొట్టేస్తోంది. అదే సమయంలో ఈ హైప్రొఫైల్ వెడ్డింగ్ వివాదానికి కూడా దారి తీసింది. కొంతమంది ఈ వేడుకను వెనిస్కు గౌరవంగా భావిస్తున్నారు. నగరానికి పర్యాటక ఆదాయం తీసుకురావచ్చని ఆశిస్తున్నారు. అయితే.. వెనిస్ను ప్రైవేట్ పార్టీగా బెజోస్ భావిస్తున్నారా? అంటూ మరికొందరు మండిపడుతున్నారు. "No Space for Bezos! అనే నినాదాలతో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఈ పాటికే రియాల్టో వంతెనపై భారీ బ్యానర్లు కట్టారు. ఈ వేడుక వల్ల నగరంలో అధిక రద్దీ నెలకొంటుందని, స్థానికులకు అసౌకర్యం కలగడంతో పాటు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. జెఫ్ బెజోస్ గురించి.. జెఫ్ బెజోస్ జనవరి 12, 1964న అల్బుకర్కీ, న్యూ మెక్సికో(అమెరికా) జన్మించారు. 1994లో బెజోస్ సెకండ్హ్యాండ్ పుస్తకాలు అమ్మే ఆన్లైన్ స్టోర్గా అమెజాన్ను ప్రారంభించారు. అది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా మారింది. ఆపై 2000లో బ్లూ ఆరిజిన్ అనే అంతరిక్ష సంస్థను స్థాపించారు. 2013లో వాషింగ్టన్ పోస్ట్ అనే ప్రముఖ వార్తాపత్రికను కొనుగోలు చేశారు. 2017 నుంచి 2021 వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS కూడా బెజోస్ నేతృత్వంలోనే ప్రారంభమైంది. మెకెంజీ స్కాట్ను బెజోస్ 1993లో వివాహం చేసుకున్నారు, 2019లో ఈ జంట విడాకులు తీసుకుంది. ఆపై లారెన్ సాంచెజ్తో ప్రేమలో మునిగిపోయిన ఆయన.. నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు వివాహానికి సిద్ధమయ్యారు. ‘‘నాకు నెంబర్వన్ కిరీటం అవసరం లేదు. ఉపాధి కల్పించే యజమానిగా గుర్తింపు కావాలి’’ అనేది ఆయన philosophy. ఉద్యోగులతో వ్యక్తిగతంగా లేఖలు రాయడం, వారిని ప్రోత్సహించడం వంటి చర్యలు ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. లారెన్ వెండీ సాంచెజ్ (Lauren Wendy Sánchez).. వయసు 55. ఆమె ఒక టీవీ ప్రెజెంటర్, జర్నలిస్ట్, హెలికాప్టర్ పైలట్ కూడా. Extra", "Good Day LA వంటి షోలతో ఆమెకు పేరు దక్కింది. 2024లో ఆమె బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన తొలి మహిళలలో ఒకరిగా నిలిచారు. "Black Ops Aviation" అనే ఎయిర్ ఫిల్మింగ్ కంపెనీ ఉంది — ఇది మహిళల చేత నడపబడే మొదటి సంస్థలలో ఒకటి. ఫ్యాషన్ ఐకాన్గా ఆమె స్టైలిష్ దుస్తులు, డిజైనర్ బ్రాండ్స్ కోసం ప్రసిద్ధి. ఇటీవల కర్దాషియన్ కుటుంబం ఆమెకు విలాసవంతమైన UFO-ప్రేరిత బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు.లారెన్ గతంలో ఎన్ఎఫ్ఎల్ మాజీ ఆటగాడు టోనీ గోంజాలెజ్తో డేటింగ్ చేసి ఓ కొడుకును కన్నారు. ఆపై హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ పాట్రిక్ వైట్సెల్ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. పాట్రిక్ నుంచి విడాకులు తీసుకున్నాక ఆమె జెఫ్ బెజోస్తో డేటింగ్ మొదలు పెట్టి.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లిళ్లు.. టాప్ 10 జాబితా పరిశీలిస్తే.. 1.ఖాదిజా ఉజాఖోవా Weds సైద్ గుట్సెరీవ్ – సుమారు ₹8,300 కోట్లు(1 బిలియన్ డాలర్లు)2016లో మాస్కోలో జరిగిన ఈ పెళ్లిలో జెన్నిఫర్ లోపెజ్, ఎన్రికె ఇగ్లెషియస్ లైవ్ షోలు ఇచ్చారు. అతిథులకు బెంట్లీ కార్లలో స్వాగతం పలకడంతో పాటు బంగారు బాక్స్లను గిఫ్ట్లుగా ఇచ్చారు. 2. అనంత్ అంబానీ Weds రాధికా మర్చంట్ – సుమారు ₹5,000 కోట్లు2024లో జరిగిన ఈ పెళ్లిలో జరిగిన సందడి అంతా ఇంతా కాదు. పాప్ సింగర్ రిహన్నా ప్రత్యేక షోతో అలరించారు. ఖరీదైన క్రూయిజ్ పర్యటనలతో పాటు ప్రపంచ ప్రముఖుల హాజరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 3. ఇషా అంబానీ Weds ఆనంద్ పిరమల్ – సుమారు ₹800 కోట్లు2018లో ఉదయ్పూర్లోని రాజమహల్లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లిలో బియాన్స్ లైవ్ షో ఇచ్చారు. 4. వనీషా మిట్టల్ Weds అమిత్ భాటియా – సుమారు ₹550 కోట్లు2004లో ఫ్రాన్స్లో వెర్సైల్స్ ప్యాలెస్లో వివాహ వేడుక జరిగింది. కైలీ మినోగ్ ప్రదర్శనతోపాటు ఐఫెల్ టవర్ వద్ద బాణా సంచాలు కాల్చి వేడుక నిర్వహించారు. 5.ప్రిన్స్ చార్ల్స్ Weds ప్రిన్సెస్ డయానా – సుమారు ₹400 కోట్లు1981లో ఈ రాయల్ వెడ్డింగ్ను ప్రపంచవ్యాప్తంగా 750 మిలియన్ల మంది వీక్షించారు. 6. ప్రిన్స్ హ్యారీ Weds మేఘన్ మార్కెల్ – సుమారు ₹375 కోట్లు2018లో విండ్సర్ క్యాసిల్లో జరిగిన ఈ వివాహ వేడుక.. ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. 7. కింగ్ ఫెలిప్ Weds క్వీన్ లెటీషియా (స్పెయిన్) – సుమారు ₹290 కోట్లుఆ దేశ రాజధాని మాడ్రిడ్లో రాజ సంప్రదాయాలతో ఘనంగా జరిగిందీ వివాహం. 8. ప్రిన్స్ విలియం Weds కేట్ మిడిల్టన్ – సుమారు ₹275 కోట్లు2011లో వెస్ట్మినిస్టర్ ఏబీ చర్చిలో జరిగిన ఈ వివాహ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి 1,900 మందికిపైగా ప్రత్యేక అతిథులు హాజరయ్యారు 9. అంజెలా బేబి Weds హువాంగ్ షియామింగ్ (చైనీస్ సెలెబ్రిటీలు) – సుమారు ₹260 కోట్లు2015లో హోలోగ్రాఫిక్ క్యాసెల్లో.. ప్రత్యేక డిజైనర్ గౌన్తో వధువు మెరిసిపోగా.. ఈ వివాహం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. 10. మైఖేల్ జార్డన్ Weds ఎవెట్ ప్రియెటో – సుమారు ₹80 కోట్లుబాస్కెట్బాల్ చక్రవర్తి మైఖేల్ జార్డన్ వివాహం క్యూబన్ అమెరికా మోడల్ య్వెట్ ప్రియెటో 2013లో జరిగింది. సుమారు 500 మంది అతిథుల నడుమ.. ఉషర్, రాబిన్ థిక్ లైవ్ షోలతో ఘనంగా జరిగింది ఈ వివాహ వేడుక. పైవాటిల్లో భారత పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ కుమార్తె వనీషా మిట్టల్ వివాహం గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. వ్యాపారవేత్త అమిత్ భాటియాతో వనీషా వివాహం 2004లో సుమారు రూ. 550 కోట్ల వ్యయంతో ఫ్రాన్స్లోని వెర్సైల్స్ ప్యాలెస్ వేడుకగా జరిగింది. ఆరు రోజులపాటు జరిగిన పెళ్లి వేడుకకు హాలీవుడ్, బాలీవుడ్ నుంచి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వివాహ వేడుకకు అయిన ఖర్చు కంటే అధిక ఖర్చుతో జరిపించిన వివాహాలు ఉన్నప్పటికీ.. అప్పటి బడ్జెట్.. పరిస్థితులు.. ఇతర కారణాలతో వనీషా మిట్టల్ వివాహ వేడుక గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడం విశేషం.

ఆపరేషన్ సింధు: ఇరాన్ నుంచి మరో విమానం.. స్వదేశానికి 310 మంది భారతీయులు
ఢిల్లీ: ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. ఇరాన్ నుంచి మరో 310 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు తరలింపు విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఇప్పటివరకు 827 మందిని భారత్కు తరలించినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు భారత్ చర్యలు చేపట్టింది.కాగా, నిన్న (శుక్రవారం) రాత్రి 11.30 గంటలకు ఇరాన్ నుంచి 290 మంది భారతీయులతో కూడిన విమానం ఢిల్లీకి చేరుకుంది. గురువారం.. మొదటి దశలో 110 మంది పౌరులతో తరలింపు విమానం భారత్కు చేరిన విషయం తెలిసిందే. ఓవైపు యుద్ధం కొనసాగుతున్నాసరే ఇరాన్ భారత్కు అనుకూలంగా వ్యవహరించింది. పౌర విమానాల రాకపోకల కోసం గతంలో మూసేసిన గగనతలాన్ని భారత్ కోసం ప్రత్యేకంగా తెరిచింది. దీంతో ఇరాన్ నుంచి భారత్కు విమానాలు చేరుకుంటున్నాయి.యుద్ధం కారణంగా అక్కడి మష్హాద్ సిటీలో ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆపరేషన్ సిందూలో భాగంగా భారతసర్కార్ ఇరాన్లోని కొందరు విద్యార్థులను రోడ్డుమార్గంలో అర్మేనియాకు తరలించి అక్కడి నుంచి విమానమార్గంలో స్వదేశానికి తీసుకొచ్చింది. ఇకపై నేరుగా ఇరాన్ ఎయిర్పోర్ట్ల నుంచే విమానాలు తిరుగు ప్రయాణం కానున్నాయి.
డబ్బుల్లేవు.. కొత్త పథకాలెట్టా?
లంచం తీసుకుంటుంటే ఉద్యోగంలోంచి తీసేశారు. లంచం ఇచ్చి మళ్లీ చేరాను!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. నూతన ఉద్యోగాలు
బహు భాషల బంధువు
రిషికేశ ఈజ్ బ్యాక్
అయతొల్లా ఖమేనీ (ఇరాన్ సుప్రీం) రాయని డైరీ
ఉత్తరాంధ్ర కాదు... కళింగాంధ్ర!
నాన్నకు ప్రేమతో..
అంతులేని యోగ సంపద!
టీమిండియాతో తొలి టెస్టు.. రెండో రోజు ఇంగ్లండ్దే
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
‘డిప్యూటీ సీఎం కనబడుటలేదు’
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
అబ్బే పార్టీ పరిస్థితి అలా ఉందని కాదయ్యా..! యోగా చేస్తున్నారు.
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. స్థిరాస్తివృద్ధి
సాక్షి కార్టూన్ 20-06-2025
Kuberaa: ‘కుబేర’ మూవీ రివ్యూ
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
మీరు ఎవరికీ నోటీసులు ఇవ్వొద్దు.. విచారణ చేయొద్దు
తోడబుట్టిన బలగం
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
శేఖర్ కమ్ముల కుబేర.. అసలు ఈ క్యారెక్టర్ను ఎలా ఒప్పుకున్నాడు?
నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!
సోనమ్ మేఘాలయా హనీమూన్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్..
'కుబేర' ట్విటర్ రివ్యూ.. హైజాక్ చేసిన ధనుష్
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
డబ్బుల్లేవు.. కొత్త పథకాలెట్టా?
లంచం తీసుకుంటుంటే ఉద్యోగంలోంచి తీసేశారు. లంచం ఇచ్చి మళ్లీ చేరాను!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. నూతన ఉద్యోగాలు
బహు భాషల బంధువు
రిషికేశ ఈజ్ బ్యాక్
అయతొల్లా ఖమేనీ (ఇరాన్ సుప్రీం) రాయని డైరీ
ఉత్తరాంధ్ర కాదు... కళింగాంధ్ర!
నాన్నకు ప్రేమతో..
అంతులేని యోగ సంపద!
టీమిండియాతో తొలి టెస్టు.. రెండో రోజు ఇంగ్లండ్దే
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
‘డిప్యూటీ సీఎం కనబడుటలేదు’
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
అబ్బే పార్టీ పరిస్థితి అలా ఉందని కాదయ్యా..! యోగా చేస్తున్నారు.
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. స్థిరాస్తివృద్ధి
సాక్షి కార్టూన్ 20-06-2025
Kuberaa: ‘కుబేర’ మూవీ రివ్యూ
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
మీరు ఎవరికీ నోటీసులు ఇవ్వొద్దు.. విచారణ చేయొద్దు
తోడబుట్టిన బలగం
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
శేఖర్ కమ్ముల కుబేర.. అసలు ఈ క్యారెక్టర్ను ఎలా ఒప్పుకున్నాడు?
నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!
సోనమ్ మేఘాలయా హనీమూన్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్..
'కుబేర' ట్విటర్ రివ్యూ.. హైజాక్ చేసిన ధనుష్
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
సినిమా

మనమధ్య ఎన్నో గొడవలు.. మరణం తర్వాత కూడా..: కాజల్ ఎమోషనల్
ఈ సంవత్సరం తనకెంతో స్పెషల్ అంటోంది నటి ఆర్జే కాజల్ (RJ Kajal). బిగ్బాస్ సీజన్ 5తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన భర్త విజయ్ శీలం శెట్టికి బర్త్డే విషెస్ చెప్తూ తమ జర్నీని రాసుకొచ్చింది. నా విజయ్కు హ్యాపీ బర్త్డే.. నువ్వు లేకుండా ఈ జీవితాన్ని ఊహించుకోలేను. 2025.. ఈ ఏడాదికి నా మనసులో ప్రత్యేక చోటు దక్కింది. ఎందుకంటే మన జీవితంలోనే కీలకమైన మైలురాయి అయిన సొంతింటి కలను నెరవేర్చుకున్నాం.ఎన్నో గొడవలుఇంకా ఆ ఇంట్లోకి మనం షిఫ్ట్ కాలేదనుకో.. కానీ, మనిద్దరం కలిసి ఆ ఇంటిని కొన్నందుకు ఆల్రెడీ అక్కడే ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఒకప్పుడు మనం చీకట్లో గుసగుసలాడుకునేవాళ్లం. ఇప్పుడవే గుసగుసలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుంటే సంతోషంగా అనిపిస్తోంది. అలా అని మనమెప్పుడూ ఇంతే సంతోషంగా ఉండేవాళ్లం కాదు. ఎన్నోసార్లు పోట్లాడుకునేవాళ్లం. ఇంటీరియర్స్ గురించి, దిండుల గురించి, సమయపాలన గురించి.. కొన్నిసార్లయితే మరీ అనవసరమైన విషయాల గురించి కూడా గొడవపడేవాళ్లం. పిచ్చోళ్లలా నవ్వుకునేవాళ్లంఆ రోజులో ఎన్ని గొడవలు పడ్డా కూడా రాత్రయ్యేసరికి దాన్ని పరిష్కరించుకునేవాళ్లం. ప్రశాంతంగా నీ కౌగిలిలో నిద్రపోతుంటే మన ప్రేమ కంటే ఏ గొడవా పెద్దది కాదనిపించేది. మరికొన్నిసార్లు పిచ్చోళ్లలా నవ్వుకునేవాళ్లం. ఒకరి కాలు మరొకరు పట్టుకుని లాగేవాళ్లం. కొట్టుకుని అంతలోనే కలిసిపోయేవాళ్లం. మన బంధాన్ని మరింత ధృడంగా నిర్మించుకున్నాం. నువ్వు లేని జీవితం? అన్న ఆలోచనను కూడా నా దరిదాపుల్లోకి రానివ్వను.మరణం తర్వాత కూడా..కానీ సరదాగా ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు మనమేం అనుకునేవాళ్లం? మనిద్దరి శవాలను పక్కపక్కనే సమాధి చేసి మరణం తర్వాత కూడా కలిసే ఉండాలనుకునేవాళ్లం. అంత గొప్ప ప్రేమను మనం ఒకరికొకరం పంచుకున్నాం. మన లవ్ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చేమో కానీ, అందమైన ప్రేమను ఆస్వాదిస్తున్నాం. ఈ రోజు, నీ పుట్టినరోజున ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వే నా ప్రపంచం.. నువ్వు నాకోసమే పుట్టావు. నాకు భర్తగా దొరికినందుకు థాంక్యూ.. అని కాజల్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్కు భర్తతో కలిసి దిగిన ఫోటోలను జత చేసింది. View this post on Instagram A post shared by RJ Kajal️️️️️️ (@kajalrj) చదవండి: దృశ్యం నటితో విడాకులు.. త్వరలోనే డైరెక్టర్ రెండో పెళ్లి

రెండోసారి ప్రెగ్నెంట్? వీడియోతో క్లారిటీ వచ్చినట్లే!
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt) మరోసారి గర్భం దాల్చిందని కొన్ని వారాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేన్స్ ఫిలిం ఫెస్టివల్కు ఆలియా హాజరైనప్పటి నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. పైగా జిమ్కు వెళ్లినప్పుడు కూడా కెమెరాలు కనిపించగానే ఎవరినీ పలకరించకుండా హడావుడిగా వెళ్లి కారులో కూర్చునేది. దీంతో నిజంగానే ఆలియా ప్రెగ్నెంట్ అయిందేమోనన్న అనుమానాలు వెలువత్తాయి. డ్యాన్స్ రిహార్సల్స్..కానీ, హీరోయిన్ లేటెస్ట్ వీడియోతో ఇవన్నీ వుట్టి పుకార్లేనని తేలిపోయాయి. ఆల్ఫా సినిమా కోసం డ్యాన్స్ రిహార్సల్స్ చేసిన ఆలియా తాపీగా వెళ్లి కారెక్కింది. మధ్యలో అక్కడున్నవారిని కూడా పలకరించింది. పైగా తనకు పొట్ట కూడా లేకపోవడంతో సెకండ్ ప్రెగ్నెన్సీ అంటూ వస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. రాహా మూడో బర్త్డే..ఆలియా భట్ - రణ్బీర్ కపూర్ 2022లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది కూతురు రాహా జన్మించింది. ఈ ఏడాది రాహా మూడో బర్త్డే సెలబ్రేట్ చేసుకోనుంది. సినిమాల విషయానికి వస్తే ఆలియా ప్రస్తుతం 'ఆల్ఫా' మూవీ చేస్తోంది. 'ముంజ్య' హీరోయిన్ శార్వరితో కలిసి నటిస్తున్న ఈ మూవీ క్రిస్మస్కు విడుదల కానుంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) చదవండి: నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్

నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్
నా జోలికొస్తే ఊరుకుంటానేమో కానీ నా కూతురి జోలికొస్తే మాత్రం అంతు చూస్తానంటోంది హీరోయిన్ కాజోల్ (Kajol). ప్రస్తుతం ఆమె మా సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజోల్.. తన కూతురిని ట్రోల్ చేసేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా.. నా కూతుర్ని విమర్శించేవాళ్లెవరూ నా కారు ముందుకు రావొద్దు. నా కారు ముందుకొచ్చారంటే..ఒకవేళ వచ్చారే అనుకోండి.. నా కారుతో మిమ్మల్ని ఢీ కొట్టి మీ శరీరాలపై నుంచే నా కారును పోనిస్తాను. సోషల్ మీడియాలో వెయ్యి మెసేజ్లు వస్తే అందులో 999 తను అందంగా ఉంది, మీరు అమేజింగ్.. ఇటువంటి కామెంట్లే ఉంటాయి. కానీ ఏదో ఒక్కటి మాత్రం బ్యాడ్ కామెంట్ ఉంటుంది. అలా చెత్త వాగుడు వాగేవారు ఎందుకున్నారో అర్థం కాదు. అయినా నేను మంచి గురించే ఎక్కువగా పట్టించుకుంటాను. చెడు గురించి కాదు అని చెప్పుకొచ్చింది.హారర్ సినిమాహారర్ సినిమాలను మ్యూట్లో పెట్టుకునే చూసే కాజోల్.. తొలిసారి ఈ జానర్లో నటిస్తోంది. విశాల్ ఫ్యురియా దర్శకత్వం వహిస్తున్న మా చిత్రంలో రోనిత్ రాయ్, ఇంద్రనీల్ సేన్గుప్తా, కెరిన్ శర్మ, నితిన్, సూర్జ్యశిఖ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాజోల్ చివరగా క్రూ సినిమాలో నటించింది. కాజోల్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్.. 1999లో పెళ్లి చేసుకున్నారు. 2003లో వీరికి కూతురు నైసా జన్మించింది. 2010లో కుమారుడు యుగ్ పుట్టాడు.చదవండి: ఎయిరిండియాకు నటుడి సపోర్ట్.. ఫ్రీ టికెట్ ఇచ్చారా?

కిర్రాక్ సీత బర్త్ డే పిక్స్.. యోగా డేలో హీరోయిన్ల కసరత్తులు!
బిగ్బాస్ బ్యూటీ కిర్రాక్ సీత బర్త్ డే స్పెషల్ పిక్స్..భర్తతో కలిసి యోగా డే వేడుకల్లో రకుల్ ప్రీత్ సింగ్...యోగాసనాల్లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి..శ్రద్దాదాస్ యోగా డే రోజు అదిరిపోయే కసరత్తులు..పూనమ్ బజ్వా యోగా డే స్పెషల్..డిఫరెంట్ డ్రెస్లో అనసూయ స్టన్నింగ్ లుక్స్..నటి లక్ష్మీ రాయ్ యోగా డే స్పెషల్.. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Seetha🦋🇮🇳 (@kirrakseetha)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

ఓర్నీ.. క్రికెట్ గ్రౌండ్లో నీకేమి పని? ఫోటో వైరల్
గాలే వేదికగా శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్టు సందర్భంగా ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. ఐదో రోజు ఆటలో పాములు పట్టే వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. స్నేక్ క్యాచర్ రెండు పాములను తీసుకొచ్చి ప్రశాంతంగా నేలపై కూర్చుని మ్యాచ్ను వీక్షించాడు. అతడి వద్ద పాములతో పాటు ఓ కోతి కూడా ఉంది. ఇది చూసిన మిగితా ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.తొలి టెస్టు డ్రా.. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లా, శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. మొదటి ఇన్నింగ్స్లో పర్యాటక బంగ్లాదేశ్ జట్టు 495 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో(148), ముష్ఫికర్ రహీం(163) అద్బుతమైన సెంచరీలతో చెలరేగగా.. లిట్టన్ దాస్ 90 పరుగులతో రాణించాడు.అనంతరం శ్రీలంక కూడా బంగ్లాకు ధీటుగా బదులిచ్చింది. శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 485 పరుగుల భారీ చేసింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ పాథుమ్ నిస్సాంక(187) భారీ శతకం సాధించగా.. చండీమల్(54), కుమిందు మెండిస్(87) రాణించారు. అనంతరం బంగ్లా జట్టు తమ రెండో ఇన్నింగ్స్ను 285-6 వద్ద డిక్లేర్ చేసింది.దీంతో తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ప్రత్యర్ధి ముందు 296 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా జట్టు ఉంచింది. ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. View this post on Instagram A post shared by Mufaddal Vohra (@mufastweet)

గిల్, జైశ్వాల్, పంత్ సెంచరీలు.. తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు జూలు విదిల్చారు. మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 471 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 359/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన గిల్ సేన. అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్ను ముగించింది.రెండో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు మెరుగ్గా రాణించలేకపోయారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (134, 178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (101 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.సుదర్శన్, కరుణ్ నాయర్ అట్టర్ ప్లాప్.. ఇక ఈ మ్యాచ్లో భారత తరపున అరంగేట్రం చేసిన సాయిసుదర్శన్ తీవ్ర నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో డకౌట్గా వెనుదిరిగాడు. అతడితో పాటు తొమ్మిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ సైతం ఖాతా తెరవకుండా పెవిలియన్కు చేరాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు.చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా..

రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు..
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అద్బుతమైన సెంచరీ సాధించాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన పంత్.. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు.ఈ క్రమంలో పంత్ 146 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. పంత్కు ఇది ఏడో టెస్టు సెంచరీ కావడం విశేషం. రిషబ్ సెంచరీ సాధించగానే సంతోషంతో మరోసారి ఫ్లిప్ జంప్ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.106 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్(113)తో పాటు కెప్టెన్ రవీంద్ర జడేజా(1) ఉన్నాడు. కాగా ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్..👉టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్ బ్యాటర్గా పంత్ చరిత్ర సృష్టించాడు. పంత్ ఇప్పటివరకు టెస్టుల్లో 7 సెంచరీలు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా లెజెండ్ ఎంఎస్ధోని పేరిట ఉండేది. ధోని తన కెరీర్లో 6 టెస్టు సెంచరీలు సాధించాడు. తాజా శతకంతో ధోనిని పంత్ అధిగమించాడు.👉సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక టెస్టు రన్స్ చేసిన పర్యాటక జట్టు వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు. పంత్ ఇప్పటివరకు సేనా దేశాల్లో 49 ఇన్నింగ్స్లలో 1746 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డు కూడా ఎంఎస్ ధోని పేరిటే ఉండేది. ధోని తన కెరీర్లో సేనా దేశాల్లో 60 ఇన్నింగ్స్లు ఆడి 1731 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో ధోని వరల్డ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.👉విదేశీ గడ్డపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన మూడో వికెట్ కీపర్గా ఇంగ్లండ్కు చెందిన లెస్ అమెస్ రికార్డును పంత్ సమం చేశాడు. అమీస్ విదేశాల్లో ఐదు టెస్టు సెంచరీలు చేయగా.. పంత్ కూడా సరిగ్గా ఐదు సెంచరీలు చేశాడు. ఈ పర్యటనలో మరో సెంచరీ చేస్తే అమీస్ను అధిగమిస్తున్నాడు. ఈ జాబితాలో ఆసీస్ లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్క్రిస్ట్(10) అగ్రస్ధానంలో ఉన్నాడు.

'శుబ్మన్ గిల్ ఒక అద్బుతం'.. యూటర్న్ తీసుకున్న భారత మాజీ క్రికెటర్
టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన తొలి మ్యాచ్లోనే సత్తాచాటాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మొదటి టెస్టులో గిల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి 127 పరుగులతో గిల్ అజేయంగా నిలిచాడు.ఇంగ్లండ్ గడ్డపై గిల్కు ఇదే మొదటి టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో కెప్టెన్గా అతడిని ఎంపిక చేయడాన్ని విమర్శించిన నోళ్లే ఇప్పుడు శెభాష్ అంటున్నాయి. తొలుత కెప్టెన్గా గిల్ను వ్యతిరేకించిన భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్లో గిల్ అద్బుతమైన టెక్నిక్తో బ్యాటింగ్ చేశాడని మంజ్రేకర్ కొనియాడాడు."కొన్ని రోజుల కిందట భారత టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ను ఎంపికచేయడాన్ని నేను వ్యతిరేకించాను. గిల్ కంటే జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా బెటర్ అని అభిప్రాయపడ్డాను. ఆ సమయంలో సెలక్టర్లు సరైన నిర్ణయం తీసుకోలేదని నేను చెప్పుకొచ్చాను. కానీ నేను ఎక్కడా కూడా గిల్ కెప్టెన్గా విఫలమవుతాడని మాత్రం చెప్పలేదు.కెప్టెన్సీ భారం తన బ్యాటింగ్కు పడకుండా గిల్ చూసుకుంటాడని నేను ముందే ఊహించాను. కానీ విదేశాల్లో మాత్రం అతడి ప్రదర్శన ఇంకా మెరుగు పడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో మాత్రం గిల్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు.శుబ్మన్ తన బ్యాటింగ్లో టెక్నికల్ లోపాలను సరిదిద్దుకున్నాడు. అందుకే విదేశీ గడ్డపై భారీ సెంచరీసాధించగలిగాడని" జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
బిజినెస్

‘19 ఏళ్ల కిందట భూమి అమ్మారు.. నాకేం తెలియదు’
బెంగళూరులో దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన భూమి అమ్మకం ఇప్పుడు న్యాయ వివాదానికి దారితీసింది. 2006లో భూమిని విక్రయించిన ఓ వ్యక్తి కుమార్తె తన అనుమతి లేకుండా ఆస్తిని అమ్మారని పేర్కొంటూ ప్రస్తుత యజమానులకు లీగల్ నోటీసులు పంపింది. బృహత్ బెంగళూరు మహానగర పాలకే(బీబీఎంపీ) పరిధిలో ఉన్న ఈ ఆస్తిని మహిళ తండ్రి 19 ఏళ్ల కిందట విక్రయించాడని, ఇప్పుడు కొనుగోలుదారు తనకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.రెడ్డిట్లో భూమి కొన్న వ్యక్తి తరఫువారు తమ అనుభవాన్ని పంచుకున్నారు. ‘19 ఏళ్ల కిందట కొంత భూమిని బెంగళూరులో ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేశాం. ఆ సమయంలో తన కూతురు పెళ్లి కోసం తాను ఈ ఆస్తిని అమ్ముతున్నట్లు చెప్పాడు. పవర్ ఆఫ్ అటార్నీ (పీఓఏ) ప్రమేయం లేదు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఆస్తి పన్నులు చెల్లిస్తున్నాం. కొనుగోలు చేసిన వ్యక్తి పేరుమీద సర్టిఫికేట్ కూడా ఉంది. 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు తనను సంప్రదించలేదని ఆస్తి అమ్మిన వ్యక్తి కూతురు ఆరోపిస్తుంది. అమ్మకానికి ముందు తనను అడగలేదని, తనకు సమాచారం తెలియజేయలేదని పేర్కొంటుంది. ఆ సమయంలో తానేం మైనర్ కాదు. పైగా ఆ భూమి అమ్ముతుంది ఆమె పెళ్లి కోసమే. అయినప్పటికీ ప్రస్తుతం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇది కుటుంబ వ్యవహారమని, సామరస్యంగా పరిష్కరిస్తామని అమ్మిన వ్యక్తి కుమారుడు తొలుత చెప్పారు. అయితే కొన్ని నెలల తర్వాత మాట మార్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నాడు. కోర్టు వెలుపల సెటిల్మెంట్ కోసం ఒత్తిడి తెస్తున్నాడు. న్యాయమూర్తి ఆమెకు అనుకూలంగా తీర్పు ఇస్తే ఏమిటి పరిస్థితి?’ అని పోస్ట్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: 61 లక్షల యూజర్లను కాపాడిన ఎయిర్టెల్ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు, అమ్మే సమయంలో అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి లావాదేవీలు జరపాలని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా పొరపాటు జరిగితే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని సూచిస్తున్నారు.

దేశీయ కళలకు జీవం పోసేలా ఎన్ఎంఏసీసీ భారీ ఈవెంట్
భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) ఇండియా వీకెండ్ను న్యూయార్క్ నగరంలోని లింకన్ సెంటర్లో ఏర్పాటు చేయనున్నట్లు నీతా అంబానీ తెలిపారు. ఈ వేడుక 2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనుందని చెప్పారు. ఈమేరకు ‘ఎన్ఎంఏసీసీ.ఇండియావికెండ్’ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వివరాలు వెల్లడించారు. భారతీయ కళల వారసత్వం, సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ఫ్యాషన్, వంటకాలు.. వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో ఉండనున్నాయని తెలిపారు.ఇదీ చదవండి: 61 లక్షల యూజర్లను కాపాడిన ఎయిర్టెల్ View this post on Instagram A post shared by NMACC India Weekend (@nmacc.indiaweekend)ఇన్స్టాగ్రామ్ పోస్ట్లోని వివరాల ప్రకారం.. ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివివైజేషన్ టు నేషన్’ ఈవెంట్లో భాగంగా సాంప్రదాయ నృత్యాలు ఉంటాయని నీతా అంబానీ తెలిపారు. దాంతోపాటు ఈ హైప్రొఫైల్ ఈవెంట్ సెలబ్రిటీల ఫ్యాషన్ షో, దేశ హస్తకళలు, సమకాలీన డిజైన్లకు వేదికగా నిలుస్తుందని చెప్పారు. క్రీస్తుపూర్వం 5000 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు దేశీయ పరిణామాలను తెలియజేసేలా నాటకాలుంటాయని చెప్పారు. ప్రదర్శనలు, దృశ్యాలు, కథల ద్వారా ఈ ఈవెంట్ చరిత్రకు జీవం పోస్తుందని నీతా అంబానీ చెప్పారు.

బంగారం ధరలు మళ్లీ పైకి! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో శనివారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: 61 లక్షల యూజర్లను కాపాడిన ఎయిర్టెల్(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

61 లక్షల యూజర్లను కాపాడిన ఎయిర్టెల్
దేశవ్యాప్తంగా ఏఐ ఆధారిత మోసాలను గుర్తించే వ్యవస్థను ప్రారంభించిన 37 రోజుల్లోనే ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లోని 6.1 మిలియన్ల మంది వినియోగదారులను ఆన్లైన్ మోసగాళ్ల బారిన పడకుండా కాపాడినట్లు ఎయిర్టెల్ తెలిపింది. పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించే చర్యల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు చెప్పింది.వినియోగదారులకు సైబర్ దాడుల నుంచి రక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ను ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని యోచించింది. అందులో భాగంగా ఎయిర్టెల్ ఈ విధానాన్ని ప్రారంభించిన 37 రోజుల్లోనే రెండు రాష్ట్రాల్లో 6.1 మిలియన్లకు పైగా వినియోగదారులను విజయవంతంగా రక్షించిందని ఒక ప్రకటనలో తెలిపింది. అధునాతన వ్యవస్థ ఎస్ఎంఎస్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఈ-మెయిల్స్, ఇతర బ్రౌజర్లలోని లింక్లను స్కాన్ చేసి ఫిల్టర్ చేస్తుందని తెలిపింది.ఇది ప్రతిరోజూ ఒక బిలియన్ యూఆర్ఎల్స్ను (యూనిఫాం రిసోర్స్ లొకేటర్లు) పరిశీలించడానికి రియల్ టైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. హానికరమైన సైట్ల నుంచి జరిగే ప్రమాదాన్ని గుర్తించి 100 మిల్లీ సెకన్లలో రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: నాన్న చెప్పిన ఒక్క మాటతో రూ.1,200 కోట్లు సంపాదనఉదాహరణకు, ఒక వినియోగదారుకు ‘మీ ప్యాకేజీ ఆలస్యం అయింది. ట్రాక్ చేయాలంటే వెంటనే క్లిక్ చేయండి’ అంటూ ఓ మేసేజ్ వచ్చిందనుకుందాం. ఆ లింక్పై యూజర్ క్లిక్ చేస్తే ఎయిర్టెల్ సిస్టమ్ వెంటనే లింక్ను స్కాన్ చేస్తుంది. అనుమానాస్పదంగా ఉంటే యాక్సెస్ను బ్లాక్ చేస్తుంది. దాంతోపాటు యూజర్కు హెచ్చరిక సందేశం పంపుతుంది. ‘బ్లాక్ చేయబడింది! ఎయిర్టెల్ ఈ సైట్ను ప్రమాదకరంగా గుర్తించింది!’ అని పాప్అప్ మెసేజ్ వస్తుంది.
ఫ్యామిలీ

World Music Day నాదమే జీవనం
కోయిల ఊరికే ఉండదు... పాడుతుంది. గాలి కూడా కామ్గా కూర్చోదు... సవ్వడి చేస్తుంది. వినాలే గానీ... కిటికీ పరదా చప్పుడు కూడా సంగీతమే! ఆనందమో, చిరు సంతోషమో కలిగినప్పుడు... ప్రతి గొంతూ కూని రాగం తీస్తుంది. సంగీతం లేకపోతే... ఈ జగతి ఉత్త శూన్యం. సప్త స్వరాలే... ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ‘వరల్డ్ మ్యూజిక్ డే’ సందర్భంగా ఒక పాటకో, ఒక గళానికో, ఒక స్వరానికో కృతజ్ఞత చెప్పుకోకపోతే ఎలా..? నాదమే జీవనంగా బతుకుతున్న నలుగుర్ని కలవకపోతే ఎలా..!ఊపిరి ఉన్నంతవరకూ పాటే నా ప్రపంచం– సంగీతదర్శకురాలు శ్రీలేఖ→ మ్యూజిక్ డైరెక్టర్గా ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజూ సంగీతాన్ని ఆస్వాదిస్తాను... ఆనందిస్తాను. ఊపిరి ఉన్నంతవరకు పాటలతో సెలబ్రేట్ చేసుకుంటాను. పాటే నా ప్రపంచం. సంగీతం తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. సంగీతాన్ని రోజూ ఇష్టపడుతున్నప్పటికీ ‘వరల్డ్ మ్యూజిక్ డే’ సందర్భంగా నాకు నచ్చిన పాటలను మరింత ఎక్కువగా వింటాను. నేను కంపోజ్ చేసిన పాటలను నెమరు వేసుకుంటాను... ఇలా చేసి ఉంటే బాగుండేది, అలా చేసి ఉంటే బాగుండేది... ఇలా రకరకాలుగా నా పాటలను విశ్లేషించుకుంటాను. → అప్పట్లో లైవ్ ఇన్స్ట్రూమెంట్స్ ఎక్కువగా ఉండేవి. ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్కువగా కోరుకునేవారు కూడా. పాటలు కూడా అలాగే ఉండేవి. రికార్డింగ్, సాంగ్ రికార్డింగ్లో నేను కూడా లైవ్ ఇన్స్ట్రూమెంట్స్ ఉపయోగించాను. వివిధ లైవ్ ఇన్స్ట్రూమెంట్లతో హాల్ మొత్తం సందడిగా, పండగ వాతావరణంతో ఉండేది. ప్రతిరోజూ ఒక పండగలా ఉండేది. ఎవరికి వారు బిజీ కావడం, లైవ్ ఇన్స్ట్రూమెంట్ రిక్వైర్డ్ సాంగ్స్ రాకపోవడం, డీజే టైప్ పాటలు, రెట్రో, హిప్ హాప్లాంటివి వచ్చి లైవ్ అవసరం లేకుండా పోయింది. ఒకవేళ అవసరం ఉన్నా ఎక్కడున్న వారు అక్కడ, ఎవరికి టైమ్ ఉన్నప్పుడు వారు పాడి, వాయించి పంపుతున్నారు. వాటిని తరువాత మిక్స్ చేస్తున్నారు. అంతా డిజిటలైజ్డ్ అయిపోయింది. ఇది ఎంతవరకు వెళుతుందో మాత్రం తెలియదు. → ఫుల్ ఆర్కెస్ట్రా ఉన్నప్పుడు సాంగ్ స్ట్రక్చర్ ఇలా రాబోతుందని తెలిసేది. ఎందుకంటే సింగర్స్తో సహా లైవ్ ఉండేది. స్ట్రక్చర్ గురించి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కే తెలియడం లేదు. అక్కడొక ముక్క, ఇక్కడొక ముక్క, పల్లవి ఒకరు చేస్తారు... బీజియమ్ ఒకరు చేస్తారు. ఫైనల్ వచ్చే వరకు కూడా సాంగ్ ఎలా వస్తుంది? అనేది మ్యూజిక్ డైరెక్టర్కి తెలియడం లేదు. మార్పులు, చేర్పులు చేయాలంటే అదొక తతంగం. సో... సాంకేతిక అభివృద్ధి పరంగా మైనస్ ఉంది. కాకపోతే పని గంటలు తగ్గుతాయి. అలాంటి ప్లస్లూ ఉన్నాయి. → సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితోనూ బాగుంటాను. కోటిగారు, వందేమాతరం శ్రీనివాస్గారు, కీరవాణి అన్నయ్య, మణిశర్మగారు... ఇలా ఎంతోమంది చిన్నప్పటి నుంచి నన్ను చూసి ఉన్నారు కాబట్టి, అందరికీ నేను పెట్. అందరూ నన్ను అభిమానిస్తారు. → నా సినిమాల్లో నాకు సంతృప్తినిచ్చినవి చాలా ఉన్నాయి. ఉదాహరణకు ‘ధర్మచక్రం, తాజ్మహల్, ప్రేమించు, ప్రేయసి రావే, శివయ్య’ వంటివి. మొన్న వచ్చిన ‘హిట్–2’లో ‘ఉరికే ఉరికే’ సాంగ్ బ్లాక్ బస్టర్. నా కెరీర్లో ఎక్కువగా మంచి సినిమాలకు పని చేసే చాన్స్ రావడం నా అదృష్టం. → ఏఐ (కృత్రిమ మేధ) గురించి విన్నాను. ఎంత ఏఐ వాడినా, ఎలా చేసినా తెలిసిపోతుంది. హ్యూమన్ ఎమోషన్ ఏఐ ఇవ్వలేదు. మనిషి కంపోజ్ చేసి ఇచ్చినంత ఏఐ ఇవ్వలేదు. → సినిమా రంగంలో రావడానికి నేను వచ్చిన టైమే కష్టం అనుకుంటే ఇప్పుడు మరింత కష్టం అయింది. ఎంతోమంది డైరెక్టర్స్, సింగర్స్, కంపోజర్స్ వస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బాగా కష్టపడాలి. ఇక మనం ఏ స్థాయికి వెళతామనేది అది మన అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. → నేను సినిమా ఒప్పుకోవడానికి మూడు విషయాల గురించి ఆలోచిస్తాను. మొదటిది కథ. జనరల్గా కథే కదా హీరో. కథ ఎలా ఉంది, ఏ జానర్లో ఉంది, డైరెక్టర్ ఫ్యాషనేట్గా తీయగలరా? ప్రాపర్గా రిలీజ్ చేయగలరా? వీటి గురించి ఆలోచిస్తాను. → మహిళలు, పురుషులు అని కాదు... సినిమా ఫీల్డ్లోకి రావాలంటే ఎవరికైనా అది అంత తేలికైన విషయం కాదు. కమర్షియల్ ఫీల్డ్ కాబట్టి ఇంట్లో అందరినీ ఒప్పించాలి, చాలా టాస్క్లు ఉంటాయి. దేవుడి దయ వల్ల ఆ టాస్క్లన్నీ దాటుకొని ఇప్పటికీ సక్సెస్ఫుల్గా ఉన్నాను.– డి.జి. భవానిమనసుని తాకాలంటేమెలోడీ బెస్ట్– సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్→ ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జూన్ 21న వరల్డ్ వైడ్గా జరుపుకుంటారు. మనకు కూడా ఇక్కడ మ్యూజిక్ డే సెలబ్రేషన్స్ని చేస్తుంటారు. కానీ, నాకైతే ప్రతి రోజూ సంగీత దినోత్సవమే. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకూ సంగీతంతోనే ఉంటాను కాబట్టి. → సంగీతంలో అప్పటికీ, ఇప్పటికీ టెక్నాలజీ వైజ్, వర్కింగ్ వైజ్ చాలా మార్పులొచ్చాయి. మ్యూజిక్ ఎప్పుడూ మెలోడీ వైజ్ మెలోడీనే ఉంటుంది... దాన్ని ఏదీ రీ ప్లేస్ చేయలేదు. గతంలో లైవ్లో అందరం ఒకేసారి రికార్డ్ చేసేవాళ్లం. ఇప్పుడు బిట్ బిట్గా, సిస్టమ్ ద్వారా చేస్తున్నాం. ఒక పదం పదం పరంగా కూడా రికార్డింగ్ చేస్తున్నాం. అలాగే ఏఐ ద్వారా వాయిస్ మాడ్యులేషన్స్లో కూడా మార్పులొస్తున్నాయి. → సాంకేతికంగా ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. దానికి తగ్గట్టుగానే పని చేయాల్సి ఉంటుంది. అయితే ముందు రోజుల్లో లైవ్ రికార్డింగ్స్ ఉన్నప్పుడు ఒకటేసారి మొత్తం ఆర్కెస్ట్రా, సింగర్స్ అంతా కలిసి ఒక టేక్లో అయిపోయేది. అది ఒక రకంగా సులభంగా ఉండేది. ఎందుకంటే... గతంలో ఫ్లూట్ బిట్, వీణ బిట్, తబలా బిట్ ఇది... అని ఒక ప్రాపర్గా సెట్ చేసుకుని కంపోజ్ చేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఒక్కొక్క ట్యూన్ సెలక్షన్స్కే చాలా రోజులు పట్టేస్తోంది. అంటే ఎక్కువ ట్యూన్స్ ఎంచుకునే అవకాశం ఉండటంతో ఇంకా ఏదో మంచిది దొరుకుతుంది, ఇంకా కొత్త ట్యూన్ దొరుకుతుంది అని. ఈ ప్రాసెస్ కొంచెం కాంప్లికేటెడ్. అయితే ఈ టెక్నాలజీ పరంగా సౌలభ్యం ఏంటంటే టైమింగ్స్. సింగర్ లేదా మ్యుజిషియన్ టైమ్కి అందుబాటులో లేకున్నా, ఇతర దేశంలో ఉన్నా వారు పాడటం లేదా వాయించి పంపితే మేము ఇక్కడ యాడ్ చేస్తాం. ఒక రకంగా ఇది అడ్వాంటేజ్. → ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్కో శైలి ఉంటుంది. నా పరంగా వచ్చేసరికి నేనెప్పుడూ మెలోడీని ప్రేమిస్తాను. ఏ పాట కంపోజ్ చేసినా కూడా మెలోడీకి తొలి ప్రాధాన్యం ఇస్తాను. ఎందుకంటే మనకు సంగీతం అనగానే మొదట టచ్ అయ్యేది మనసు. మెలోడీయే మనకు ఎక్కువ రోజులు గుర్తుంటుందని బలంగా నమ్ముతాను. నా తొలి ప్రాధాన్యం ఎప్పుడూ మెలోడీయే. కానీ, కథ, సందర్భం, అవసరాన్ని బట్టి అక్కడ మాస్ సాంగ్ లేదా బీట్ సాంగ్ ఇస్తుంటాను. → ఇప్పుడొస్తున్న యువ సంగీత దర్శకులు చాలా బాగా పని చేస్తున్నారు. అయితే ఆరోగ్యకరమైన పోటీ అనేది చాలా అవసరం. ఎందుకంటే.. ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వైవిధ్యమైన స్టైల్స్, ఫీల్స్ వినడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా మనం ఏదో చేయాలి? అనే ఉత్సాహం ఉండాలి. అయితే పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి. → నా కెరీర్లో దాదాపు 90 సినిమాలు చేశాను. అయితే ఓ సంతృప్తి అనేది సినిమా విజయం వల్ల ఉంటుంది... కథ వల్ల ఉంటుంది. ఆ స్టోరీ జనాల్లోకి బాగా వెళ్లడం, మన పాటలు బాగా హిట్ అయితే అదో సంతృప్తి ఉంటుంది. నా సినిమాల్లో అలా సంతృప్తి ఇచ్చినవాటిలో ‘ప్రేమకావాలి, మనం, ఇష్క్, గోపాల గోపాల, టెంపర్’ వంటివి చాలా ఉన్నాయి. → ప్రస్తుతం కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న సంగీత దర్శకులు, సింగర్స్లో చాలా మంచి ప్రతిభ ఉంది. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా పరిధి బాగా పెరిగింది. దాని వల్ల స్టార్ వేల్యూ, పాపులారిటీ అన్నది గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా సులభం అయింది. అయితే కొత్తవాళ్లకు అంకితభావం... ప్రధానంగా ఓపిక అనేది ఉండాలి. అప్పుడే మన లక్ష్యం అనేది చేరుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక్కో టైమ్ ఉంటుంది... మన సమయం వచ్చినప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం. → ప్రస్తుతం ‘వారాహి’ అనే సినిమా చేస్తున్నాను. అలాగే తేజగారి చిత్రంతో పాటు అర్జున్గారి సినిమా చేస్తున్నాను. మరో ఐదారు సినిమాలు కూడా ఒప్పుకున్నాను.→ నేను చిన్నప్పటి నుంచి ఇళయరాజా సార్, ఏఆర్ రెహమాన్ సార్ పాటలు వింటూ పెరిగాను. వాళ్ల వర్కింగ్ స్టైల్, లైఫ్ స్టైల్.. చె΄్పాలంటే వాళ్లే నాకు స్ఫూర్తి. నాకే కాదు ఇప్పుడు కొత్తగా వచ్చే చాలా మంది సంగీత దర్శకులకు, అలాగే ఇప్పుడు ఉన్న వారికి కూడా. నేను మాత్రం ఆర్డీ బర్మన్గారు, ఇళయరాజా సార్, ఏఆర్ రెహమాన్గారు.. వాళ్ల వద్ద నుంచి చాలా నేర్చుకున్నాను.→ సినిమా ఒప్పుకోవాలంటే నా తొలి ప్రాధాన్యత కథే. అయితే కొన్నిసార్లు బ్యానర్, హీరో, డైరెక్టర్ వేల్యూ కూడా ఉంటాయి. అయితే ఎవరైనా కొత్తవాళ్లు, కొత్త ప్రొడక్షన్ హౌస్ వాళ్లు నన్ను కలిస్తే మాత్రం ముందు కథ విని, నచ్చితే ఒప్పుకుంటాను.– డేరంగుల జగన్ మోహన్లైవ్ రికార్డింగ్లోడెప్త్ ఉంటుంది – సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల→ సంగీత దర్శకుడిగా ప్రతిరోజునీ నా ఫస్ట్ డే మ్యూజిక్ డైరెక్షన్లానే భావిస్తాను. ప్రతిరోజూ ఓ స్ట్రగులే. అందుకే అప్గ్రేడ్ అవుతుంటాను. ప్రజలు ఎలాంటి సంగీతాన్ని ఇష్టపడుతున్నారో తెలుసుకుని, కొత్త తరహా సంగీతాన్నందించాలన్నదే నా తపన. → మనం ఆనందంలో ఉన్నప్పుడు పాట వింటాము. దుఃఖంగా ఉన్నప్పుడూ పాట వింటాము. మన భావాలను పంచుకోవాలనుకున్నప్పుడు మ్యూజిక్తో తెలియజేస్తాం. ఇలా పలు రకాలుగా సంగీతం అనేది మన జీవితంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. → దశాబ్ద కాలానికి పైగా సంగీతరంగంలో రాణిస్తున్నాను. ఈ రంగంలో టెక్నాలజీ అప్డేట్ అవుతూ వస్తోంది. టెక్నాలజీని మనం ఎంత వరకు కరెక్ట్గా వాడాం అన్నది జాగ్రత్తగా గమనించుకుంటుంటే అడ్వాంటేజ్గానే ఉంటుంది. కొన్నిసార్లు డిస్అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒరిజినాలిటీ అనేది ఎప్పుడూ మిస్ కాకూడదు. మ్యూజిక్ అనేది హ్యూమన్ టచ్తో సంబంధం ఉన్న అంశం. అలాగే సంగీత దర్శకులకు ఏఐ ఉపయోగపడుతుంది. కానీ మనం దాన్ని ఎంతవరకు వినియోగిస్తున్నాం అన్నది చూసుకోవాలి. → ఇండస్ట్రీలో ఉన్న పోటీతత్వాన్ని గమనిస్తుంటాను. ఫస్ట్ నాకు నేను పోటీగా ఉండాలనుకుంటాను. ఎంతమంది ఉన్నా కూడా మనకు మనం పోటీగా ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్లగలం. ఇండస్ట్రీలో సంగీతదర్శకుల మధ్య ఉండే పోటీని చూసి ఉలిక్కిపడను. నేను ఎదగడానికి ఏం చేయాలి అని చూస్తాను తప్ప పక్కన ఇంకెవరో వచ్చారని కంగారు పడను. → డిజిటల్ సాయంతో మ్యూజిక్ చేయడం కొంతవరకు సౌకర్యంగానే ఉంటుంది. కానీ లైవ్ రికార్డింగ్స్ అనేవి మాత్రం డెప్త్ క్రియేట్ చేస్తాయి. ఎంత చెప్పినా లైవ్ లైవే... దాంట్లో తిరుగులేదు. నేను గిటారిస్ట్ని. లైవ్ అంటే ఏంటో నాకు తెలుసు. ఎంత టెక్నాలజీ వాడినా కూడా లైవ్ అన్నది లైవే. డిజిటలైజ్ వల్ల పని సులభం అవ్వొచ్చు. కానీ లైవ్ రికార్డింగ్ అనేది మ్యూజిక్ను నిలబెడుతుంది. → శ్రోతలకు లిరిక్స్ వినిపించేలా మనం సంగీతం ఇవ్వాలి. ఆ పాటకు లిరిక్స్ చాలా ముఖ్యమని, లిరిక్దే ప్రథమ స్థానమని భావిస్తాను. నా సినిమాల్లోని పాటల్లో లిరిక్స్ ఆడియన్స్కు వినిపించాలనే ప్రయత్నిస్తుంటాను. లిరిక్స్ ఆడియన్స్కు అర్థమైతే, అప్పుడు ఆ లిరిక్కు మ్యూజిక్ డైరెక్టర్ ఈ తరహా మ్యూజిక్ ఇచ్చాడని వారికి అర్థమౌతుంది. అదే లిరిక్ అర్థం కాకుండా మనం మ్యూజిక్ ఇస్తే ఎందుకు లిరిక్ అర్థం కావడం లేదనిపిస్తుంది. లిరిక్ అర్థమైనప్పుడే సినిమాలోని సందర్భం మ్యూజిక్తో ఆడియన్స్కు మరింత చేరువ అవుతుంది. → సినిమాలో సౌండ్ అనేది డిజైన్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే మంచిది. ఒక సినిమాకు ఇద్దరు... ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసే విధానానికి నేను వ్యతిరేకిని. ఇది నా సొంత అభి్రపాయం. అయితే కొన్నిసార్లు ఒక సినిమాకు ఇద్దరు... ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసినప్పుడు అది వర్కౌట్ అయ్యింది. అలాంటప్పుడు ఒక సినిమాకు ఒకే సంగీత దర్శకుడు పని చేయాలని చెప్పడానికి నేనెవర్ని. కానీ... చేస్తే మొత్తం సినిమా చేయాలని నేను కోరుకుంటాను. ఈ విషయంపై నా స్టాండ్ ఏంటంటే... నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. కానీ సంగీత దర్శకుల్లో నేను ఒక భాగమే. ఎవరైనా వచ్చి, ఫలానా సినిమాలో ఒకే ఒక్క సాంగ్ చేయమన్నా చేస్తాను. → మ్యూజిక్ రంగంలో స్థిరపడాలనుకునే కొత్త తరం వారికి నేను చెప్పేది ఒక్కటే. ఒక్కసారి డిసైడ్ అయితే వెనక్కి తిరిగి చూడొద్దు. నిత్యం కష్టపడాలి. ఫోకస్గా ఉండాలి. ప్రతిక్షణం మ్యూజిక్ పైనే ఫోకస్ పెట్టి పని చేయాలని చెబుతాను. → వరల్డ్ మ్యూజిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటాను. ఈ సందర్భంగా నా సహచర మ్యూజిషియన్స్ అందరికీ విషెస్ చెబుతున్నాను. అందరికీ అవకాశాలు రావాలని, అందరూ సక్సెస్ కావాలని, అందరూ ఎదగాలని కోరుకుంటాను. ప్రస్తుతం అడివి శేష్గారి ‘గూఢచారి 2, ఆది సాయికుమార్గారి ‘శంబాల’ సినిమాలు చేస్తున్నాను. మరో ఆరు సినిమాలు లైనప్లో ఉన్నాయి.→ నేను సినిమా ఒప్పుకోవాలంటే కథను మాత్రమే చూస్తాను. అలాగే నేను ఉపయోగించే ఇన్స్ట్రూమెంట్స్ సినిమా టు సినిమా మారిపోతుంటాయి. కథ, ఆ సినిమా హీరో, ఆ హీరో బాడి లాంగ్వేజ్ని బట్టి ఎలాంటి స్టైల్ క్రియేట్ చేయవచ్చు. డైరెక్టర్ ఏ విధమైన మ్యూజిక్ ఆశిస్తున్నారు. ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ట్యూన్స్ చేస్తాను. ∙‘మేజర్, నాంది, గూఢచారి, కృష్ణ అండ్ హిజ్ లీలా, డీజే టిల్లు’ వంటి చిత్రాలు ఓ సంగీతదర్శకుడిగా నా కెరీర్లో ఎక్కువ సంతృప్తినిచ్చాయి. – ముసిమి శివాంజనేయులు

Today tips పండంటి కాపురానికి పక్కా లెక్కలు, చిట్కాలు
ఇటీవలి కాలంలో వివాహ బంధం మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్న సంఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. రెండు మనసులు కలిసి కలకలం సంతోషంగా జీవించాల్సిన జంటలు పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నాయి. చివరికి ఒకర్నొకరు అంతం చేసుకుంటున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అన్నట్టు దంపతులు హాయిగా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉండాలంటే ఏం చేయాలి? టిప్ ఆఫ్ ది డే లో భాగంగా అన్యోన్యమైన పండంటి కాపురానికి పాటించాల్సిన లెక్కలు, టిప్స్ తెలుసుకుందాం.ఏ బంధానికైనా విశ్వాసం, నమ్మకం బలమైన పునాదిగా ఉంటాయి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగం ఉన్నపుడు భార్యభర్తల బంధం కూడా నూరేళ్లు కొనసాగుతుంది. భార్యభర్తలంటే కలహాలు ఉండవని కాదు, బేధాభిప్రాయాలు ఉండవనీ కాదు. కానీ ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోవాలి.ఒకరి పొరబాట్లను, తప్పులను అర్థం చేసుకోవాలి. నాదే పంతం, అన్నట్టుగా కాకుండా, సమయానికి తగు.. అన్నట్టు సర్దుకుపోవాలి. ఒక్కోసారి వెనక్కి తగ్గాలి. అవసరమైత రాజీ పడాలి. అదే అందమైన దాంపత్య జీవితానికున్న అర్థం పరమార్థం.చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండాలంటే కొన్ని చిట్కాలు పెళ్లికి ముందే అన్ని విషయాలు పరస్పరం చర్చించుకోవాలి.ఇద్దరి మధ్య బంధానికి అంగీకారం ఉందా లేదా అనేదాన్ని పరస్పరం గట్టిగా నిర్ధారించుకోవాలి. అందమైన బంధానికి కమిట్మెంట్, కమ్యూనికేషన్ కీలకం.నిజాయితీకి పెద్ద పీట వేయాలి. ఉద్యోగం, ఆస్తులు, సంపాదన ఇలాంటి విషయాలో అబద్ధాలకు తావుండ కూడదు.పెళ్లి తరువాత ఇంటా బయటా పనుల్లో ఒకరికొకరు సహకరించుకోవాలి. బడ్జెట్, ఇంటి ఖర్చులు సహా అన్ని విషయాల్లో పరస్పరం చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. తప్పు ఒప్పులకు సమానంగా బాధ్యత తీసుకోవాలి. ఒకళ్ల గురించి ఒకరు పట్టించుకోవాలి. ఒకరికొకరు అండగా ఉండాలి. ముఖ్యంగా అనారోగ్యం విషయాల్లో ఒకరికొకరు శ్రద్ధపెట్టాలి. ‘నేను ఉన్నాను’ అనే భరోసా ఇచ్చుకోవాలిఎపుడూ సంసార సాగరంలో పడిపోకుండా అడపాదడపా, కనీసం పెళ్లి రోజులు, పుట్టిన రోజుల్లో అయినా ఇద్దరికీ నచ్చేలా కొంత సమయాన్ని గడపండి. ఇది జీవితంలో మరింత రీఛార్జ్ అవ్వడానికి ఉపయోగ పడుతుంది. ఇద్దరి మధ్య బంధం, ప్రేమ బలపడడానికి కూడా దోహదపడుతుంది.చివరికి ఏవైనా చిన్ని చిన్న మనస్పర్థలు వచ్చినా కూర్చుని చర్చించుకుంటే శ్రావణమేఘాల్లా ఇట్టే తొలగిపోతాయి. మనసులో పెట్టుకొంటే మరింత వేధిస్తాయి. నలుగురి ముందూ గొడవపడటం, ముఖ్యంగా పిల్లల ముందు వాగ్వాదానికి దిగడం అస్సలు చేయవద్దు. ఇది మీ జీవితంతోపాటు, పిల్లల జీవితాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చదవండి: Today Tip : బాల్కనీ మొక్కలు.. అదిరిపోయే చిట్కా!

జీ 7 ప్రముఖులకు పీఎం మోదీ అపురూపమైన బహుమతులు
భువనేశ్వర్: కెనడాలో జరిగిన జీ–7 సమ్మిట్లో పాల్గొనేందుకు హాజరైన ప్రముఖులకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అద్భుతమైన రాష్ట్ర కళాకృతుల్ని బహుమానంగా అందజేశారు.జీ–7 సదస్సులో పాల్గొన్న కెనడా గవర్నర్ జనరల్ మేరీ సైమన్కు ప్రధాన మంత్రి వెండి తీగల అల్లిక క్లచ్ పర్స్ను బహుమతిగా ఇచ్చారు. రాష్ట్రంలో కటక్ అందమైన వెండి తీగల సంప్రదాయ అల్లిక చేతి పనులకు (తారొకొసి) ప్రసిద్ధి. ఈ అపురూప కళ 500 సంవత్సరాలు పైబడిన ప్రాచీనమైనది. ఆనాటి మొఘల్ చక్రవర్తుల ఆదరణతో వెలుగొందిన కళ నేటికి నిలకడగా తళుక్కుమంటోంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీ చాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్కు ప్రపంచ ప్రఖ్యాత 13వ శతాబ్దపు కోణార్క్ సూర్య దేవాలయం కాల చక్రం కానుకగా సమరి్పంచారు. ఇసుక రాయితో రూపుదిద్దుకోన్న కోణార్కు చక్రం ప్రతిరూపం రాష్ట్ర శిల్ప కళా నైపుణ్యాన్ని జీ 7 దేశాల్లో ప్రధాన మంత్రి ప్రతిబింబింపజేశారు. సూర్య రశ్మి ఆధారంగా సమయం సూచించే రీతిలో ఈ చక్రంలో ఊచల్ని శిల్పులు చెక్కు చెదరకుండా పొందుపరచడం విశేషం. ఇది అంతులేని కాల చక్రాన్ని చూపుతుంది. పూరీ జిల్లా కళా గ్రామం రఘురాజపూర్ ప్రాంతపు పొట్టా చిత్రాన్ని క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిచ్కు ప్రధాన మంత్రి బహుమతిగా సమర్పించారు. పొట్టా చిత్రం రాష్ట్రానికి చెందిన అందమైన సంప్రదాయ కళారూపం. ఇది వస్త్రంపై వివరణాత్మక, రంగురంగుల చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. దీంతో ఈ చిత్రాలు పొట్టా (వస్త్రం), చిత్ర (చిత్రం)గా పేరొందాయి. సాధారణంగా భారతీయ పౌరాణిక గాథల శీర్షికల ఇతివృత్తంగా అర చేతిలో ఇమిడే అతి చిన్న చిత్రాలు మొదలుకొని సువిశాల పటాలు రూపొందించడంరఘురాజపూర్ కళాకారుల ప్రత్యేకతని జీ 7 ప్రతినిధులకు ప్రధాన మంత్రి ప్రతిబింబింపజేయించడం విశేషం.

రాత్రికి రాత్రే మిలియనీర్గా..జాలరి దశ మార్చిన చేపలు
భువనేశ్వర్: అదృష్టవశాత్తూ, దిఘా నదీముఖద్వారంలోకి అడుగుపెట్టిన ఒక మత్స్యకారుడు రాత్రికి రాత్రే 29 అరుదైన ,అత్యంత విలువైన 'తెలియా భోలా' చేపలను పట్టుకుని మిలియనీర్ అయ్యాడు.వేట కోసం విసిరిన వలలో ఔషధీయ విలువలతో నిండిన చేపలు చిక్కడంతో అతడి దశ తిరిగింది. దిఘా నదీ ముఖద్వారం పరిసరాలలో నానీ గోపాల్ ట్రాలరు నుంచి పన్నిన వలలో తెలియా భోలా చేపలు పడ్డాయి. ఒకేసారి 29 అరుదైన, అత్యంత విలువైన తెలియా భోలా చేపలు చిక్కడంతో అదృష్టం కలిసి వచ్చింది. దెబ్బకి లక్షాధికారి అయిపోయాడు.#WATCH | Balasore: Fisherman catches 29 Telia Bhola fish, sells for Rs 33 lakh and becomes a millionaire overnight.#Odisha pic.twitter.com/vr6TQUncrd— Kalinga TV (@Kalingatv) June 19, 2025 ఒక్కో చేప 20 కిలోలు పైబడి బరువు తూగింది. నదీ ముఖద్వారం సమీపంలోని చేపల వేలం కేంద్రంలో రూ.33 లక్షలకు ఈ చేపలు అమ్ముడయ్యాయి. తెలియా భోలా చేపలను ఔషధీయ విలువల కారణంగా తీవ్రమైన వ్యాధులకు మందులు, సౌందర్య సాధనాల ఉత్పత్తిలో వాడతారు. ఇదీ చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!Yoga సంపూర్ణ ఆరోగ్యం కోసం ఖర్చు లేని మందు, కానీ..!
ఫొటోలు
అంతర్జాతీయం

ఆ 100 మందీ నా సంతానమే..నా ఆస్తిలో వారికీ వాటా
లండన్: మెసేజింగ్ యాప్ టెలిగ్రాం వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్(40) సంచలన ప్రకటన చేశారు. వీర్య దానం ద్వారా తాను తండ్రినయిన 100 మందికిపైగా సంతానానికి తనకున్న 13.9 బిలియన్ డాలర్ల ఆస్తిని పంచుతానని తెలిపారు. ‘వాళ్లంతా నా పిల్లలే. నా ఆస్తిలో వాళ్లకూ సమాన హక్కులుంటాయి. నా మరణం తర్వాత వారికి అన్యాయం జరగాలని కోరుకోవడం లేదు’అని దురోవ్ చెప్పినట్లు ఫ్రాన్స్ పత్రిక ‘లీ పాయింట్’పేర్కొంది. ముగ్గురు భాగస్వాముల ద్వారా ఆరుగురు సంతానికి అధికారికంగా తండ్రినని దురోవ్ చెప్పారు. ‘ఒక ఫ్రెండ్కు సాయం చేసేందుకు గాను 15 ఏళ్ల క్రితం వీర్య దానం మొదలుపెట్టా. అలా 12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలు పుట్టినట్లు నా ఫ్రెండ్ చెప్పారు’అని ఆయన వెల్లడించారు. ‘వీరందరికీ నా ఆస్తిలో వాటా ఇస్తా. అయితే, ఇప్పుడు కాదు, 30 ఏళ్ల తర్వాతే వారికి ఈ అవకాశం దక్కుతుంది. ఈ మేరకు వీలునామా రాశా’అని చెప్పారు. ‘నా ఉద్యోగం ఎన్నో రిస్క్లతో కూడుకున్నది. స్వతంత్య్రాన్ని కాపాడుకునే క్రమంలో ఎందరో శత్రువులు కూడా తయారయ్యారు. కొన్ని దేశాలు కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే ముందుగానే ఏర్పాట్లు చేశా’అని దురోవ్ చెప్పారు. ‘నా ద్వారా కలిగిన పిల్లలంతా సామాన్యుల మాదిరిగానే ఉండాలన్నది నా కోరిక. తమ జీవితాన్ని తామే నిర్మించుకోవాలి. ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. బ్యాంకు అక్కౌంట్పై ఆధారపడకుండా సొంతంగా ఎదగాలి’అని కోరుకున్నారు. రష్యాలో జన్మించిన పావెల్ దురోవ్కు ఫ్రాన్స్, యూఈఏ ద్వంద పౌరసత్వముంది. ఇతడు సీఈవోగా ఉన్న టెలిగ్రాం యాప్ ప్రధాన కార్యాలయం యూఏఈలో ఉంది. ప్రస్తుతం దుబాయ్లో పావెల్ దురోవ్ ఉంటున్నారు. టెలిగ్రాం యాప్ నేరగాళ్లకు అడ్డాగా మారిందని ఆరోపిస్తూ ఫ్రాన్స్ అధికారులు గతేడాది అరెస్ట్ చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ..‘నా యాప్ను నేరగాళ్లు వినియోగించుకున్నారని, నన్నూ నేరగాడంటే ఎలా? అని ప్రశి్నస్తున్నారు.

విధ్వంసకర క్లస్టర్ బాంబు
యుద్ధం మొదలైనప్పటి నుంచి తమపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించి విధ్వంసం సృష్టించిన ఇరాన్ ఇప్పుడు ఏకంగా క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తూ దారుణాలకు ఒడిగడుతోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఎన్నో దేశాలు నిషేధం విధించిన క్లస్టర్ బాంబులను ఇరాన్ ఉద్దేశపూర్వకంగా భారీ పౌరనష్టం జరగాలని తమపై ప్రయోగిస్తోందని ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. గత వారం రోజులుగా కొనసాగుతున్న సమరంలో ఇరాన్ క్లస్టర్ బాంబులను వినియోగించడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. దీంతో డజన్లకొద్దీ దేశాల నుంచి నిషేధాన్ని ఎదు ర్కొంటున్న క్లస్టర్ బాంబులపై చర్చ మొదలైంది. ప్రత్యేకతలేంటి?ఏదైనా బాంబును జారవిడిస్తే అది ఒకేసారి పూర్తిగా పేలిపోతుంది. మొత్తం మందుగుండు అయిపోతుంది. కానీ క్లస్టర్ బాంబు అలా కాదు. అందులో గోళాకృతిలో చిన్న చిన్న బాంబులుంటాయి. వాటిని మోస్తున్న కస్టర్ బాంబు వార్హెడ్ను ప్రయో గించాక లక్ష్యాన్ని ఢీకొట్టడానికి కొంతదూరంలో అంటే గాల్లోనే అది పేలిపోతుంది. దాంతో అందులోని గోళాకార చిన్నపా టి బాంబులన్నీ చెల్లాచెదురు గా నలుదిక్కులా పడి పేలిపో తాయి. దీంతో వినాశనం విస్తృతస్థాయిలో ఉంటుంది. జన సమూహంపై ఈ బాంబు పడితే ఈ చిన్న బాంబులు సృష్టించే విధ్వంసం అంతాఇంతా కాదు. ఇష్టమొచ్చినట్లు అన్ని వైపులకు దూసుకెళ్లడంతో నలుచెరుగులా ఉన్న వారంతా తీవ్రస్థాయిలో లేదా మధ్యస్థాయిలో గాయపడటం ఖాయం. ఇంతటి ప్రమాదకర బాంబు కావడంతోనే చాలా దేశాలు ఈ క్లస్టర్ బాంబు వినియోగానికి దూరంగా ఉండిపోయాయి. ఇంట్లో కొంత ఎత్తు నుంచి ఒక గాజుముక్కను నేలపై పడేస్తే అది ముక్కలుచెక్కలై ఎలాగైతే గది మొత్తం పరుచుకుంటుందో ఈ క్లస్టర్ బాంబులోని పేలని ముక్కలు పరిసరాల్లోకి దూసు కెళ్లి దారుణ నష్టానికి కారణమవుతాయి. శుక్రవారం ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రయోగించిన ఒక క్లస్టర్ బాంబు ఆకాశంలో ఏడు కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయి పెద్దసంఖ్యలో చిన్నబాంబులుగా మారి 8 కిలో మీటర్ల పరిధిలో వేర్వేరుచోట్ల బద్ధలయ్యాయి. బా లిస్టిక్ క్షిపణితో పోలిస్తే ఈ బాంబు తీవ్రత ఎక్కువ గా ఉంటుందని ఇజ్రాయెల్ సైనికాధికారిది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ వార్తాసంస్థతో చెప్పారు.పొంచి ఉన్న మరో ప్రమాదంక్లస్టర్ బాంబు పేలాక అంతటా పడిపోయే చిన్న బాంబులు అన్నీ అదే సమయంలో పేలకపోవచ్చు. పేలని ఆ కొన్నింటిని నిర్వీర్యమైనట్లు భావించకూడదు. అవి కొంతకాలం తర్వాత పేలుతాయి. అంటే యుద్ధక్షేత్రంలో ఈ క్లస్టర్ బాంబును ప్రయోగిస్తే ఆ తర్వాతకూడా అక్కడికి జవాన్లు వెళ్లాలంటే జంకాల్సిందే. ఎక్కడ పడిన బాంబు ఎప్పుడు పేలుతుందో ఎవరూ ఊహించలేరు. 2008లో వందకుపైగా దేశాలు ఐక్యరాజ్యసమితి సారథ్యంలో ఈ బాంబు వినియోగంపై నిషేధాన్ని అమల్లోకి తెచ్చాయి. 111 దేశాలు, 12 ఇతర సంస్థలు ఈ ఒప్పందంపై సంతకాలుచేశాయి. క్లస్టర్ బాంబుల ఉత్పత్తి, నిల్వ, రవాణా, వినియోగంపై నిషేధం విధించారు. అయితే ఆనాడు ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్, అమెరికా ఈ ఒడంబడికకు కట్టుబడతామని ప్రకటించలేదు. ఈ లెక్కన అమెరికా సైతం ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధంలో దిగితే ఈ బాంబులను ఉపయోగించే వీలుంది. లేదంటే పరోక్షంగా ఇజ్రాయెల్కు సరఫరా చేసే అవకాశముంది. చాన్నాళ్ల క్రితం సిరియాను ఏలిన బషర్ అల్ అసద్ ప్రభుత్వం సైతం తాము అంటే గిట్టనివారిపై వీటిని విపరీతంగా వాడిందని ఆరోపణలున్నాయి. అఫ్గాన్లో అమెరికా సైతం ఇదే బాటలో పయనించిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 2006 లెబనాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ ఏకంగా 40 లక్షల క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఐక్యరాజ్యసమితి గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 19 ఏళ్ల క్రితం ప్రయోగించిన క్లస్టర్ బాంబుల్లో కొన్ని ఇప్పటికీ పేలుతూ లెబనాన్ పౌరుల ప్రాణాలు హరిస్తున్నాయని స్థానిక మీడియా గతంలో ఆరోపించింది.రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలోనూ...ఆనాడు ఒప్పందంలో భాగస్వామిగా లేని రష్యా నెలలతరబడి కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో దానిపై విచ్చలవిడిగా వాడుతోందని తెలుస్తోంది. దీంతో రష్యాతో పోరాటంచేస్తున్న ఉక్రెయిన్కు తమ వద్ద పేరుకుపోయిన లక్షలాది క్లస్టర్ బాంబులను సరఫరాచేయాలని అమెరికా భావిస్తోంది. సమరసమయంలో పేలితే అది యుద్ధనీతిగా భావించవచ్చు. కానీ యుద్ధం ముగిశాక కూడా పేలుతూ ఇవి ఒకరకంగా పౌరహక్కులను కాలరాస్తున్నా యని మానవహక్కుల సంఘాలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.

1,600 కోట్ల పాస్వర్డ్లు చోరీ!
వాషింగ్టన్: నేటి ఇంటర్నెట్ యుగంలో డేటా లీకేజీ సర్వసాధారణంగా మారిపోయింది. నెటిజన్ల గోప్య తకు భంగం కలుగుతోంది. వారి వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు సైబర్ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అతిపెద్ద డేటా లీకేజీ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలోనే 1,600 కోట్ల పాస్వర్డ్లు లీౖకైనట్లు సైబర్న్యూస్, ఫోర్బ్స్ సంస్థలు వెల్లడించాయి. ఇది ఇంటర్నెట్ చరిత్రలో అతిపెద్ద డేటా లీకేజీ ఘటన అని తెలియజేశాయి. ఆపిల్, ఫేస్బుక్, గూగుల్, టెలిగ్రామ్తోపాటు ప్రభుత్వ వెబ్సైట్ల యూజర్ల లాగిన్ వివరాలు హ్యాకర్ల చేతికి చేరినట్లు పేర్కొన్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికలు ఉపయోగించేవారి వివరాలు సైతం బయటకు లీౖకైనట్లు వెల్లడించాయి. రహస్యంగా ఉండాల్సిన పాస్వర్డ్లు పరులు చేతికి చేరుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఫిషింగ్ స్కామ్లు, అకౌంట్ హ్యాకింగ్ వంటివి పెరుగుతున్నాయని నిపుణులు చెబుతు న్నారు. సైబర్ నేరగాళ్లు ఇన్ఫోస్టీలర్స్ అని పిలిచే మాల్ వేర్ను కంప్యూటర్లు, ఫోన్లలోకి పంపించి పాస్వర్డ్లు చోరీ చేస్తున్నారని చెప్పారు. డేటా లీకేజీ వెనుక అంతర్జాతీయ ముఠాల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ముఠాలు వ్యవస్థీకృతంగా పనిచేస్తూ వ్యక్తుల రహస్య సమాచారాన్ని కొల్లగొట్టి, వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.

పోటాపోటీగా దాడులు
టెల్ అవీవ్/టెహ్రాన్/జెనీవా: ఏడు రోజులుగా ఎడతెరిపిలేకుండా భీకరంగా బాంబులేసుకుంటూ పశ్చిమాసియాలో రావణకాష్టాన్ని మరింత రాజేసిన ఇజ్రాయెల్, ఇరాన్లు శుక్రవారం సైతం పోరుపంథాలోనే పయనించాయి. పోటాపోటీగా క్షిపణులు జారవిడుస్తూ రెండు దేశాల్లో ఉద్రిక్తతల్ని అమాంతం పెంచేశాయి. ఇజ్రాయెల్ను మరింత దెబ్బకొట్టేందుకు ఇరాన్ తన వద్ద పోగుబడిన క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. ఇరాన్ క్లస్టర్ బాంబుల్ని ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్లోని టెల్అవీవ్, హైఫా, బీర్షెబా, రెహోవోట్ నగరాలు సహా పలు ప్రాంతాలపై క్లస్టర్ బాంబులను వేయడంతో పెద్దసంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. తీరప్రాంత నగరమైన హైఫాలో భవంతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. రక్తమోడుతూ జనం వీధుల్లో పరుగులు పెడుతున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించారు. కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నగర మేయర్ యొనా యాహవ్ చెప్పారు. రెహోవోట్లో దెబ్బతిన్న భవనాలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్వయంగా వచ్చి పరిశీలించారు. కర్మేయిన్ పట్టణంలో షెల్టర్లో దాక్కున్న 51 ఏళ్ల మహిళ భయంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ప్రతిగా ఇజ్రాయెల్ టెహ్రాన్లోని పలు క్షిపణి తయారీ కార్మాగారాలపై దాడులు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా సగం వరకు ఇరాన్ మిస్సైల్ లాంచర్లను నాశనంచేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఇయాల్ జమీర్ చెప్పారు. ఇరాన్ అణుపరిశోధనా ఏజెన్సీసహా పలు నగరాలపై తమ 60 యుద్దవిమానాలు బాంబుల వర్షం కురిపించాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. శుక్రవారం నాటికి ఇరాన్లో 263 మంది పౌరులు, 154 మంది సైనికులు సహా 657 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,000 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్లో 24 మంది చనిపోయారు. మరోవైపు ఇరాన్లో బుషెహర్ అణుకేంద్రంపై దాడితో అత్యంత ప్రమాదకర పరిస్థితి తలెత్తనుందని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ డైరెక్టర్ రఫేల్ గ్రోసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్లాంట్లో వేల కేజీల అణుపదార్థం ఉందని, అది బయటకొస్తే వినాశకర స్థాయిలో రేడియోధార్మికత వందలకిలోమీటర్ల పరిధికి విస్తరిస్తుందని ఆయన చెప్పారు. మరోవైపు అవసరమైన సమయంలో పోరులో భాగస్వాములమవుతామని హెజ్బొల్లా ఉగ్రసంస్థ ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్ ఖాసిమ్ అన్నారు. ఇన్నాళ్లూ ఇరాన్ రహస్యంగా గాజాలో హమాస్, లెబనాన్లో హెబ్బొల్లా, యెమెన్లో హూతీ తిరుగుబాటుదారులను పెంచి పోషించినప్పటికీ ఎవరూ ఇంతవరకు సాయపడేందుకు ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా స్పందించడం గమనార్హం. అయితే హెజ్బొల్లా స్పందించిన వెంటనే లెబనాన్లోని దాని స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది.ఇజ్రాయెల్ వ్యతిరేక ర్యాలీలుతమపై దండెత్తిన ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్, ఇరాక్లో ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత వేలాదిగా రోడ్లమీదకొచ్చి భారీ నిరసనర్యాలీ చేపట్టారు. టెహ్రాన్, బాగ్దాద్, సదర్ సిటీల్లో ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు ఇప్పటికే హమాస్తో పోరాడుతున్న ఇజ్రాయెల్ కొత్తగా ఇరాన్తోనూ కయ్యం పెట్టుకోవడాన్ని ఇజ్రాయెలీలు తీవ్రంగా తప్పుబట్టారు. టెల్ అవీవ్లో వేలాది మంది ఆందోళనకారులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మరోవైపు ఇరాన్లో మౌలికసదుపాయాలు దెబ్బతిని గత 48 గంటలుగా ఇంటర్నెట్ స్తంభించింది. కేవలం 3 శాతం ప్రాంతాల్లో ఇంటర్నెట్ను పునరుద్ధరించారు. ఇరాన్లోని బ్యాంక్ సెఫాపై ఇజ్రాయెలీ హ్యాకర్లు సైబర్ దాడులు చేశారు. దీంతో ఏటీఎంలు పనిచేయక జనం ఇబ్బందులు పడ్డారు.ఇరాన్కు విదేశీ ఆయుధసాయంపై అమెరికా ఆంక్షలుఇరాన్ సైనికరంగంపై అమెరికా శుక్రవారం మరికొన్ని ఆంక్షలు విధించింది. ఇరాన్ సైన్యం ఉపయోగించే పలు రకాల ఆయుధాల్లో విడిభాగాలు, సాఫ్ట్వేర్లను సరఫరాచేసే విదేశీ సంస్థలు, వ్యక్తులపై అమెరికా నిషేధం విధించింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న వారిలో చైనా కంపెనీ, ఒక సరుకు రవాణా నౌక సంస్థ సైతం ఉన్నాయి. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, బాంబులను విక్రయించే సంస్థలనూ అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది.మరోదఫా చర్చలకు సిద్ధమన్న యూరప్ నేతలుస్విట్జర్లాండ్లోని జెనీవాలో శుక్రవారం బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతోపాటు యూరోపియన్ యూనియన్ విదేశీవిధానాల చీఫ్తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చర్చలు జరిపారు. చర్చల్లో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో వెల్లడించలేదు. మరోదఫా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని, చర్చలు ముగిశాక యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు చెప్పారు. మరోవైపు తమ సేనలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాలను మీడియా అత్యుత్సాహంతో ప్రసారం చేయొద్దని స్థానిక మీడియాకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
జాతీయం

ట్రంప్-మునీర్ భేటీపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
శ్రీనగర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- పాక్ సైన్యాధ్యక్షుడు అసిఫ్ మునీర్ల లంచ్ భేటీపై దుమారం చెలరేగుతోంది. ఈ అంశంపై తాజాగా జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా తన ప్రయోజనాలను పొందేవరకు మాత్రమే ఇతర దేశాలతో స్నేహం చేస్తుందని, వాషింగ్టన్ తనను తాను కాపాడుకునేందుకు ఏదైనా చేస్తుందని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కు వైట్ హౌస్లో ఆతిథ్యం ఇవ్వడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు.‘అమెరికా అధ్యక్షుడు తన ఇష్టాలకు అనుగుణంగా నడుచుకుంటారు. ఎవరిని విందుకు ఆహ్వానించాలో, ఎవరిని ఆహ్వానించకూడదో మనం ఆయనకు చెప్పగలమా? అమెరికా అధ్యక్షుడు మనకు ప్రత్యేకమైన స్నేహితుడు అని మనం భావిస్తుంటాం. ఆయన మన స్నేహాన్ని గౌరవిస్తారా లేదా అనేది వేరే విషయం. అమెరికా తన స్వప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుంది. అవసరం లేనప్పుడు మరే ఇతర దేశాన్ని పట్టించుకోదు’ అని శ్రీనగర్ రైల్వే స్టేషన్లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విలేకరులతో అన్నారు. ఆయన తన తండ్రి ఫరూక్ అబ్దుల్లాతో కలిసి వందే భారత్ రైలులో జమ్మూకు వెళ్లారు. ఈ రైలు సేవలను ఆయన కొనియాడారు.ఇది కూడా చదవండి: International Yoga Day: యోగాభ్యాసంపై కింగ్ చార్లెస్ ఏమన్నారంటే..

లోక్సభలో ఎన్నికల్లో 45% ఖర్చు బీజేపీదే
న్యూఢిల్లీ: గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ కలిపి చేసిన మొత్తం వ్యయంలో 45 శాతం వాటా భారతీయ జనతా పార్టీదేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) శుక్రవారం ఒక నివేదికలో వెల్లడించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ రూ.1,494 కోట్లు ఖర్చు చేసినట్లు తెలియజేసింది. విపక్ష కాంగ్రెస్ రూ.620 కోట్లు ఖర్చు పెట్టిందని, మొత్తం వ్యయంలో ఆ పార్టీ వాటా 18.5 శాతమని వివరించింది. మొత్తం 32 జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎన్నికల ఖర్చుల రికార్డులను ఏడీఆర్ విశ్లేషించింది. 2024లో మార్చి 16 నుంచి జూన్ 6 దాకా లోక్సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు సైతం జరిగాయి. ఈ ఎన్నికల కోసం 32 పార్టీలు రూ.3,352.81 కోట్లు ఖర్చు చేసినట్లు ఏడీఆర్ తెలియజేసింది. ఇందులో జాతీయ పార్టీల వాటా రూ.2,204 కోట్లు(65.75 కోట్లు) అని పేర్కొంది. విరాళాలు, నిధుల రూపంలో జాతీయ పార్టీలకు రూ.6,930.24 కోట్లు, ప్రాంతీయ పార్టీలకు రూ.515.32 కోట్లు అందినట్లు వివరించింది. అంటే మొత్తం నిధుల్లో జాతీయ పార్టీలకు 93.08 శాతం, ప్రాంతీయ పార్టీలకు 6.92 శాతం అందినట్లు స్పష్టమవుతోంది. ఏయే పార్టీలు ఎన్ని నిధులు ఖర్చు చేశాయన్నది ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన ‘వ్యయ నివేదికల’ఆధారంగా ఏడీఆర్ గుర్తించింది. లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత 90 రోజుల్లోగా, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత 75 రోజుల్లోగా పార్టీలు వ్యయ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఆలస్యంగా ఈ నివేదికలు ఇచ్చినట్లు ఏడీఆర్ పేర్కొంది. పార్టీలు ఎన్నికల ప్రచారం కోసమే అత్యధిక నిధులు ఖర్చు చేసినట్లు తెలిపింది. అన్ని పార్టీలు ప్రచారం కోసం రూ.2,008 కోట్లు వెచ్చించినట్లు తేల్చింది. అంటే మొత్తం ఖర్చులో ఇది 53 శాతంగా తెలుస్తోంది. ఆ తర్వాత రవాణా కోసం రాజకీయ పార్టీలు ఎక్కువ ఖర్చు పెట్టినట్లు వెల్లడించింది. ఎన్నికల సంఘం గుర్తింపు పొందని 690 పార్టీలు కూడా గత ఏడాది ఎన్నికల్లో పోటీ చేసినట్లు ఏడీఆర్ తెలియజేసింది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేసే ఖర్చుపై నిఘా పెట్టడానికి ప్రత్యేకంగా పరిశీలకులను నియమించాలని ఎన్నికల సంఘానికి సూచించింది.

దమ్ముంటే రాజకీయంగా అంతం చేయండి
ముంబై: మహారాష్ట్రలోని శివసేనలో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ శివసేన (ఉద్ధవ్), శివసేన(షిండే)గా చీలిపోయిన సంగతి తెలిసిందే. శుక్రవారం ముంబైలో శివసేన 59వ వ్యవస్థాపక దినోత్సవంలో శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగించారు. ఠాక్రే బ్రాండ్ను ధ్వంసం చేసేందుకు బీజేపీతోపాటు ఏక్నాథ్ షిండే కుట్రలు సాగిస్తున్నారని ఆరోపించారు. 1991లో విడుదలైన ప్రహార్ చిత్రంలోని నానా పటేకర్ డైలాగ్ను గుర్తుచేస్తూ, ‘‘మీకు దమ్ముంటే నన్ను రాజకీయంగా అంతం చేయండి’’అని ప్రత్యర్థులకు సవాలు విసిరారు. కానీ, వెంటనే హాస్యధోరణిలోకి వెళ్లిపోయారు. ‘‘నన్ను చంపడానికి రండి. కానీ, అంబులెన్స్ కూడా వెంట తెచ్చుకోండి. ఎందుకంటే దాని అవసరం మీకే ఉంటుంది’’అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. మరాఠీ పార్టీల్లో విభేదాలు సృష్టించడానికి బీజేపీ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. ఠాక్రే బ్రాండ్ను ధ్వంసం చేయాలని చూస్తే బీజేపీని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఠాక్రే సవాల్పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన(షిండే) చీఫ్ ఏక్నాథ్ షిండే స్పందించారు. ఉద్ధవ్ ఠాక్రేను ప్రజలు రాజకీయంగా ఎప్పుడో అంతం చేశారని, కొత్తగా చేయడానికి ఏమీ లేదని పేర్కొన్నారు. సింహం చర్మం కప్పుకున్నంత మాత్రాన తోడేలు ఎప్పటికీ సింహం కాలేదని స్పష్టంచేశారు. ఉద్ధవ్ ఠాక్రే చాలెంజ్పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం స్పందించారు. ఉత్తుత్తి కబుర్లు చెప్పేవారి గురించి మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నారు.

విద్యుత్ వైఫల్యమే కారణం!
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అకస్మాత్తుగా విద్యుత్ వైఫల్యం చెందడం వల్లే విమానం కూలిపోయి ఉంటుందని దర్యాప్తు బృందం భావిస్తోంది. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం ఏఐ–171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. అత్యవసర టర్నరౌండ్ను అమలు చేయడానికి లేదా మొత్తం విద్యుత్ నష్టం జరిగినప్పుడు బ్యాక ప్ వ్యవస్థ అయిన రామ్ ఎయిర్ టర్బైన్ (ఆర్ఏటీ)ను ఉపయోగించుకోవడానికి అవసరమైన కనీస ఎత్తుకు విమానం చేరుకోలేదు. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అకస్మాత్తుగా విద్యుత్తు అంతరాయం ఏర్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బ్లాక్ బాక్స్ డేటాను డీకోడ్ చేసిన తర్వాతే అసలు కారణం తెలుస్తుందంటున్నారు. బ్లాక్ బాక్స్లు – ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్), కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) ప్రస్తుతం ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఆ«దీనంలో ఉన్నాయి. అయితే బ్లాక్ బాక్స్లను విదేశాలకు పంపుతున్నట్లు వస్తున్న వార్తల స్పందించిన పౌర విమానయాన శాఖ.. తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.231 డీఎన్ఏల గుర్తింపు.. 210 మృతదేహాలు కుటుంబాలకు అప్పగింత ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 231 డీఎన్ఏ నమూనాలు సరిపోలాయని, 210 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ శుక్రవారం తెలిపింది. మృత దేహాలు అప్పగించిన 210 మందిలో 166 మంది భారతీయులు కాగా, ఏడుగురు పోర్చుగీస్, 36 మంది బ్రిటిషర్స్, ఒక కెనడియన్ ఉన్నారని హాస్పిటల్ సూపరింటెండెంట్ రాకేష్ జోషి తెలిపారు. 183 మంది మృతదేహాలను అంబులెన్స్ల ద్వారా, 15 మంది మృతదేహాలను విమానంలో పంపించినట్లు తెలిపారు. విమాన ప్రమాదంలో 222 మంది బాధితులను గుర్తించగా, వారిలో ఎనిమిది మంది డీఎన్ఏ మ్యాచ్ కాలేదని తెలిపారు. జూన్ 12న గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిపోవడం, విమానంలోని 241 మంది మరణించడం తెలిసిందే.
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

భార్య ఫోన్ మాట్లాడుతుందని.. భర్త దారుణం..
యశవంతపుర(కర్ణాటక): నిత్యం సెల్ఫోన్లో మాట్లాడుతోందని ఓ వ్యక్తి తన భార్యను హత మార్చాడు. ఈ ఘటన ఉడుపి జిల్లా బ్రహ్మావర తాలూకా హిలియాణ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో గణేశ్, రేఖ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇటీవల రేఖకు కొత్త సెల్ఫోన్ కొనిచ్చాడు. దీంతో బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి గంటల కొద్దీ మాట్లాడేది. ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడవద్దని భర్త హెచ్చరిస్తుండటంతో గొడవ జరిగేది. గురువారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన గణేష్ భార్యతో గొడవకు దిగి కత్తితో కడుపు భాగంలో పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఉడుపి జిల్లా బ్రహ్మావర తాలూకా శంకరనారాయణ పోలీసులు గణ్శ్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ హరిరామ్ శంకర్ పరిశీలించారు.

ఎయిరిండియా అంటేనే వణికిపోతోంటే....పేల్చేస్తా అంటూ మహిళ వీరంగం!
ఎయిరిండియా విమానం కూలిన దుర్ఘటన తాలూకు విషాదం మన మనసుల్లోకి తొలగి పోక ముందే ఒక మహిళా ప్రయాణికురాలు అనుచితం ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు ‘విమానం- క్రాష్’ అన్న పదాలు వింటేనే ఉలిక్కి పడుతున్న ప్రస్తుత తరుణంలో స్వల్ప వివాదానికే విమానాన్ని కూలిపోతుంది అంటూ అంటూ నానా గలాటా సృష్టించింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు జరిగిన ఈ సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది.ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) నుండి సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు ఈ సంఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన మహిళా ప్రయాణీకురాలు, వైద్యురాలు వ్యాస్ హిరాల్ మోహన్భాయ్ (36) బ్యాగ్ స్థలం కోసం విమాన సిబ్బందితో గొడవకు దిగింది. విమానంలోని తన సీటు 20Fలో కూర్చునే ముందు మొదటి వరుసలో తన బ్యాగ్ వదిలి వెళ్ళిపోయింది. దీంతో దీన్ని ఆమె సీటు దగ్గర ఉన్న ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్లో ఉంచమని సిబ్బంది కోరారు. అంతే ఆవేశంతో ఊగిపోతూ , "విమానం కూలిపోతుంది" అంటూ గొడవకు దిగింది. క్యాబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించింది. ఇది తప్పు అన్న తోటి ప్రయాణీకులపై కూడా అరిచిందిట. దీంతో పైలట్ , సిబ్బంది భద్రతా సిబ్బంది మరియు CISF సిబ్బందికి సమాచారం అందించారు, వారు ఆమెను విమానం నుండి కిందికి దింపేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానాన్ని కూల్చివేస్తామని బెదిరించిందన్న ఆరోపణలపై ఆ మహిళా వైద్యుడిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాలేజీ నుంచే ప్రేమ, సహ జీవనం.. గోవాకు తీసుకెళ్లి..
బనశంకరి: కన్నడిగ ప్రేమ జంట గోవా టూర్లో విషాదాంతంగా ముగిసింది. ప్రియురాలిని ప్రియుడు హతమార్చాడు. ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణ గోవా పోలీసులు ప్రతాప్నగర వద్ద దార్బందోరా అటవీ ప్రదేశంలో యువతి హత్య కేసులో ఆమె ప్రియున్ని అరెస్ట్ చేశారు. అనుమానం పెనుభూతంగా మారి హత్య చేసినట్లు తెలిసింది.గోవా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజయ్ కెవిన్, రోష్ని గోవాలో పెళ్లి చేసుకుందామనుకున్నారు. సంజయ్ ఏ పనీ చేయకుండా తిరిగేవాడు, రోష్ని అతని ఇంటి దగ్గరే ఓ స్కూల్లో పనిచేసేది. వారికి కాలేజీ రోజుల్లోనే పరిచయమై ప్రేమగా మారింది. చాలా ఏళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు. ఇక పెళ్లాడాలని గోవా ట్రిప్కు వెళ్లారు. శనివారం రాత్రి బస్సులో బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున దక్షిణ గోవా పరిధిలోని దార్బందోరా అనే ప్రాంతంలో దిగిపోయారు. ఇద్దరూ సమీప అడవిలోకి వెళ్లారు, అక్కడ సంజయ్ ఆమెను కిరాతకంగా కత్తితో పొడిచి చంపి, ఆమె ఫోన్ను తీసుకుని వెళ్లిపోయాడు. ట్యాక్సీలో హుబ్లీకి చేరుకున్నాడు.బస్సు టికెట్లే క్లూ..మంగళవారం ఈ హత్య విషయం బయటపడింది. వెంటనే స్థానిక పోలీసులు క్షుణ్ణంగా గాలించారు. రోష్ని శవం వద్ద పర్సులో బస్సు టికెట్లు దొరకడంతో ఓ క్లూ లభించింది. పలు బస్టాండ్లలో సీసీ కెమెరాల చిత్రాలను సేకరించి ఆ జంట చిత్రాలను సంపాదించారు. అలా నిందితుని ఆచూకీ కనిపెట్టి బుధవారం సాయంత్రం కల్లా అరెస్టు చేశారు. ఇక, బాధితురాలు స్వస్థలం హుబ్లీ అని సమాచారం.అనుమానంతో హత్య: ఎస్పీదక్షిణ గోవా ఎస్పీ తికమ్సింగ్ వర్మ మాట్లాడుతూ.. రోష్ని మరొకరితో సన్నిహితంగా ఉంటోందని సంజయ్ అనుమానం పెంచుకున్నాడని, హత్య చేయాలని ముందే నిర్ణయించుకుని కత్తి కూడా తీసుకున్నాడని తెలిపారు. మాయమాటలు చెప్పి ఆమెను గోవాకు తీసుకువచ్చాని చెప్పారు. ఎంతో క్లిష్టమైన కేసును ఛేదించామని తెలిపారు. నిందితున్ని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. రోష్నిని తానే చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు, తరువాత ఆత్మహత్య చేసుకోవాలనుకుని బెంగళూరుకు వెళ్లిపోయానని చెప్పినట్లు తెలిసింది.

సాఫ్ట్వేర్ ఇంజినీరుతో పెళ్లి.. ఆరు నెలలకే టెకీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: అత్తింటివారి అదనపు కట్నం వేధింపుల కారణంగా పెళ్లయిన ఆరు నెలలకే ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్య చేసుకుంది. హైటెక్ సిటీ వద్ద దుర్గం చెరువులో దూకి తనువు చాలించింది. ఈ క్రమంలో మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో భర్తతోపాటు అత్త, మామలు, మరిదిపై పోలీసులు కేసు నమోదు చేశారు.వివరాల ప్రకారం.. ఈస్ట్మారేడ్పల్లిలోని అడ్డగుట్టలో ఉంటున్న అంజయ్య, సుశీల దంపతుల కుమార్తె సుష్మ(27). ఈ ఏడాది జనవరి 31న సుష్మను నేరేడ్మెట్కు చెందిన అమృత్కు ఇచ్చి వివాహం చేశారు. సుష్మ, ఆమె భర్త అమృత్ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా చేస్తున్నారు. పెళ్లి సమయంలో రూ.5లక్షల నగదు, 6 తులాల బంగారం, రాయల్ ఎన్ఫీల్డ్ బైకు కట్నంగా కింద ఇచ్చారు. అయితే, పెళ్లి అయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కావాలంటూ భర్తతోపాటు అత్త, మామ, మరిది కలిసి సుష్మను వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. అనారోగ్యంతో ఉన్న సుష్మను ఈనెల 13న ఆసుపత్రిలో చేర్పించారు. 16న డిశ్చార్జి అయిన ఆమెను తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ల్యాప్టాప్ తెచ్చుకునేందుకు సుష్మ తండ్రితో కలిసి అత్తగారింటికి వెళ్లింది.ఈ సందర్భంగా భర్తతో సహా కుటుంబ సభ్యులు పరుషంగా మాట్లాడారు. మళ్లీ ఎందుకు వచ్చావంటూ సూటిపోటి మాటలు అనడమే కాకుండా అదనపు కట్నం తీసుకురావాలంటూ ఆమె తండ్రి అంజయ్యను కూడా దూషించారు. దీంతో, సుష్మ మనస్తాపానికి గురైంది. బుధవారం మధ్యాహ్నం కంపెనీలో విధులకు వెళ్లింది. రాత్రి ఒంటి గంట వరకు ఇంటికి రాకపోవడంతో తండ్రి అంజయ్య కంపెనీ మేనేజర్కు ఫోన్ చేశాడు. రాత్రి 8.30 గంటల సమయంలోనే ఆమె బయటకు వెళ్లిందని చెప్పాడు.అలా చెప్పడంతో కంగారు పడిన అంజయ్య.. తెలిసిన చోట గాలించి గురువారం తెల్లవారు జామున 4 గంటలకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 7.30 గంటల సమయంలో దుర్గం చెరువులో ఓ మహిళ శవం తేలిందని స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి సుష్మ మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్ట నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. సుష్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.