Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Sakshi Editorial On International Yoga Day Chandrababu Govt By Vardhelli Murali1
అంతులేని యోగ సంపద!

‘అంతులేని కథ’ అనే ఒక సినిమా ఉంది. బాలచందర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ’70వ దశకంలో సంచలన చిత్రం. ఓ కుటుంబ యజమాని తన బాధ్యతల్ని వదిలేసి పారిపోతాడు. పెళ్లీడొచ్చిన పెద్ద కూతురు ఆ భారాన్ని తన భుజాలమీదేసుకుని బండి నడిపిస్తుంది. అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత పారిపోయిన పెద్దమనిషి ఇంటికి ఉత్తరం రాస్తాడు. ఇన్నేళ్లూ తాను కష్టపడి సంపాదించిన అంతులేని సంపదతో తిరిగొస్తున్నానని ఆ ఉత్తరంలో చెబుతాడు. ఇల్లంతా పండుగ వాతావరణం. ఆ రోజు రానే వచ్చింది. ఆయన దిగనే దిగాడు. కాకపోతే కాషాయ దుస్తుల్లో, సన్యాసి వేషంలో! షాక్‌ తిన్న కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి తన ఉత్తరంలో రాసిన సారాంశాన్ని వివరిస్తాడు. తన ఉద్దేశంలో సంపద అంటే భక్తి సంపద, జ్ఞాన సంపద, తపః సంపద, మోక్ష సంపద... ఇవి దండిగా సంపాదించానని చెబుతాడు.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భాన్ని ఒక గొప్ప ఈవెంట్‌గా మలుచుకునేందుకు ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ అక్కరకొచ్చింది. ప్రధానిని పిలుచుకున్నారు. 3 లక్షల మందితో విశాఖ తీరంలో ఆసనాలు వేయించి, గిన్నిస్‌ బుక్‌ సంస్థ నుంచి ప్రపంచ రికార్డు పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. గతంలో ఎవరూ చేయని ఘనమైన కార్యాన్నే గిన్నిస్‌ బుక్‌ వాళ్ళు రికార్డులోకి ఎక్కిస్తారు. ఆ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని తాపేశ్వరం స్వీట్‌ షాప్‌ వాళ్లు 29,465 కిలోల బరువు ఉన్న లడ్డూను తయారు చేసినందుకు షాపు యజమాని పోలిశెట్టి మల్లిబాబుకు గిన్నిస్‌ బుక్‌లో చోటు దొరికింది. రామ్‌ సింగ్‌ అనే జైపూర్‌ వాసి నాలుగున్నర మీటర్ల పొడవైన మీసాలు పెంచి ఈ ఘనత సాధించాడు. ఆంటోనీ విక్టర్‌ అనే మరో భారతీయుడు చెవుల మీద ఏడు ఇంచుల పొడవైన వెంట్రుకల్ని పెంచాడు. ఇదేమీ చిన్న ఫీట్‌ కాదు కదా! అందుకే గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది.అట్లాగే చేతి వేళ్లకు ఉన్న గోళ్ళను ఎనిమిదిన్నర మీటర్లు పెంచి ఒకరు, తలకాయతో 46 టాయిలెట్‌ సీట్లను పగలగొట్టి మరొకరు, 459 స్ట్రాలను ఒకేసారి నోట్లో కుక్కి ఇంకొకరు ఈ ఘనతను సాధించిన వారిలో ఉన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ఈ విశిష్ట ఘనతలు ఆంధ్రప్రదేశ్‌కు రెండు లభించాయి. ఒకే ప్రదేశంలో మూడు లక్షల మందికి పైగా యోగా చేసినందుకు ఒకటి, 22,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసినందుకు మరొకటి! గిన్నిస్‌ రికార్డుల కోసం ఎక్కువ మందితో ఒకే చోట డాన్సులు చేయించడం, డ్రమ్స్‌ వాయించడం, పాటలు పాడించడం వంటి కార్యక్రమాలను సాధారణంగా పెద్ద పెద్ద ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల వాళ్ళు చేస్తుంటారు. ఇది మరీ పెద్ద రికార్డు కనుక స్వయంగా ప్రభుత్వమే తన భుజాల మీదకు ఎత్తుకుంది. డ్వాక్రా మహిళలు, పాఠశాల విద్యార్థులు తప్పనిసరిగా వెళ్లాలని తాఖీదులు వెళ్లాయి. స్వచ్ఛంద సంస్థలని బలవంతంగా రంగంలోకి దింపారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ హాజరయ్యే బాధ్యతను ప్రభుత్వ అధికారులకు అప్పగించారు. వేలాది బస్సులను ఏర్పాటు చేశారు. టీ షర్టులను, మ్యాట్లను ఉచితంగా అందజేశారు. ఐదు లక్షలు టార్గెట్‌గా పెట్టుకుంటే, అటెండెన్స్‌ మూడు లక్షల మార్కు దాటింది. కార్యక్రమం విజయవంతం కావడం, ఒకేసారి రాష్ట్రానికి విశిష్టమైన రెండు గిన్నిస్‌ రికార్డులు లభించటం సహజంగానే ముఖ్యమంత్రిని మిక్కిలి సంతోషపరిచింది. కార్యక్రమం ముగిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. విశాఖపట్నం అంటే తనకెంతో ఇష్టం కనుక ఈ ఘనత విశాఖకు లభించేలా చేశానని అర్థం వచ్చేలా మాట్లాడారు. హుద్‌హుద్‌ తుఫాను వచ్చినప్పుడు తను విశాఖలోనే బస్సులో కూర్చుని అజమాయిషీ చేసిన సంగతిని గుర్తు చేశారు. ముంబయ్‌ని మించి, విశాఖలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమం సందర్భంగా ప్రధాని సమక్షంలో ఆయనను చరిత్ర సృష్టించిన వ్యక్తిగా పొగిడిన బాబు – మీడియా సమావేశంలో ఆయనకు మరిన్ని పొగడ్తలు తగిలించారు. ఒక ప్రభుత్వం ఏడాది పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్నప్పుడు సహజంగా ఫోకస్‌ కావాల్సిన అంశాలు, చర్చనీయాంశాలు కావలసిన సంగతుల స్థానాన్ని ఇటువంటి మెగా ఈవెంట్‌ ఆక్రమించడం కూడా బాబు ఆనందానికి ఇంకో కారణం కావచ్చు. సూర్య నమస్కారాలతో గిన్నిస్‌ రికార్డును తెచ్చిపెట్టిన గిరిజన బాలలు విశాఖలో ఆకలితో అలమటించారని, పడుకునేందుకు, కనీస అవసరాలకు చోటు దొరక్క అగచాట్ల పాలయ్యారని వస్తున్న వార్తలు, తన ఆనందానికి భంగం కలిగించడం ఆయనకు ఇష్టంలేదు. అందుకే ఆ ఘటనపై విచారమూ లేదు... విచారణా లేదు.ప్రభుత్వం ఏడాది పాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా చర్చనీయాంశం కావలసిన అంశాలను ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌ రెడ్డి మొన్న జనం ముందుకు, ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో గణాంకాల సహితంగా నిరూపించారు. ఆయన సొంత గణాంకాలు కావవి! ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల గణాంకాలతోనే జగన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టారు. ఏడాది కాలంలోనే లక్షా అరవై వేల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించారు. ఏడాదిగా ‘అమ్మ ఒడి’ పథకాన్ని నిలిపివేయడంపై నిలదీశారు. ప్రభుత్వ బడుల్లో అందుతున్న నాణ్యమైన విద్యకు బ్రేకులు వేయడంలోని ఔచిత్యం ఏమిటని అడిగారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’, ‘ఆరోగ్యశ్రీ’ బకాయిల ఎగవేతపై, రైతాంగాన్ని కష్టాల కడలిలో ముంచడంపై తూర్పారబట్టారు. అన్నింటినీ మించి ‘‘ఎన్నికల బాండ్లపై ప్రభుత్వాన్ని నిలదీయండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికలకు ముందు తెలుగుదేశం కూటమి ఇంటింటికీ ప్రమాణ పత్రాలను పంపిణీ చేసింది. ‘‘చంద్రబాబు నాయుడు – పవన్‌ కల్యాణ్‌ అను మేము రాష్ట్ర ప్రజలు మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ష్యూరిటీ పత్రంలో పేర్కొన్న హామీలను అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము’’ అని పేర్కొంటూ వారిద్దరూ ఆ పత్రాలపై సంతకాలు చేశారు. ఆ పత్రంలో కుటుంబ యజమాని పేరు, తండ్రి పేరు, వయసుతోపాటు కుటుంబ సభ్యుల సంఖ్యను, తాము హామీ ఇస్తున్న పథకాల్లో ఆ కుటుంబానికి వర్తించే వాటిని పేర్కొన్నారు. ఆ పథకాల కింద వారికి మొదటి ఏడాది జరిగే లబ్ధిని, ఐదేళ్లలో జరిగే లబ్ధిని కూడా పేర్కొన్నారు. తెల్ల రేషన్‌ కార్డులు ఉన్న కోటీ నలభై లక్షల కుటుంబాలకు ఈ ప్రమాణ పత్రాలను పంపిణీ చేసినట్టు సమాచారం. జూన్‌ 2024 నుంచి ఈ హామీలు వర్తింపచేస్తామని కూడా ఈ పత్రంలో స్పష్టంగా రాశారు. ఆ లెక్కన ప్రమాణ పత్రాల సాక్షిగా ఏపీ ప్రజలకు ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం 81 వేల కోట్ల రూపాయలకు పైగా బకాయి పడిందని అంచనా.ప్రతిపక్ష నాయకుడు ఆరోపణలు చేసినప్పుడు బాధ్యత గల ప్రభుత్వాలు దానికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. సమాధానం ఇవ్వకపోగా ప్రతిపక్ష నేత పిలుపునిచ్చినట్టుగా ఎవరైనా నిలదీస్తే తాట తీస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించడం ఒక విడ్డూరం. పైగా అసలు కథను వదిలేసి ‘రప్పా రప్పా’ అనే ఓ పిట్ట కథను పట్టుకొని జగన్‌ మోహన్‌ రెడ్డి అనని మాటల్ని ఆయనకు ఆపాదించి మీడియాలో తెలుగుదేశం పార్టీ వీరంగం వేసింది. ఆ మీడియాలోనే చదివిన వాళ్లకు, చూసిన వాళ్లకు ఏం అర్థమవుతుంది? రెండున్నర గంటల మీడియా సమావేశంలో జగన్‌ మోహన్‌ రెడ్డి ‘రప్పా రప్పా’ అనే అంశంపైన మాత్రమే మాట్లాడారని అనుకుంటారు కదా! ఇదే తెలుగుదేశం పార్టీకి కావలసింది. ప్రతిపక్ష నేత లేవనెత్తిన అంశాలు జనంలోకి వెళ్ళకూడదు, చర్చ జరగకూడదు.ఒకవేళ కూటమి పెద్దల ఖర్మ కాలి, ఈ ప్రమాణ పత్రాలను తీసుకుని కోటి కుటుంబాల వారు తమకు బకాయిలు ఇప్పించాలని కోర్టుల మెట్లెక్కితే? కోర్టులు ఎలా స్పందిస్తాయనేది పక్కన పెడదాం. ప్రభుత్వం మోసం చేసిందంటూ కోటి కాదు, పది లక్షల కుటుంబాల వారు ఒకేసారి ఫిర్యాదులు చేసినా అదే పెద్ద రికార్డు! దాని ముందు గిన్నిస్‌ రికార్డులు, పిన్నిస్‌ రికార్డులు అన్నీ బద్దలు కావాల్సిందే! ఇదిగో జనం నుంచి ఇటువంటి సామూహిక ఫిర్యాదులు రాకుండా వారి ఆలోచనలను హైజాక్‌ చేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, గిన్నిస్‌ బుక్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకున్నది. యోగా అనేది సర్వరోగాలకూ, సకల సమస్యలకూ ఏకైక దివ్యౌషధం అన్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడారు.‘రోజు ఒక గంట యోగా చేయండి. అదే పదివేలు’ అని ముఖ్యమంత్రి పిలుపునిస్తున్నారు. యోగాపై విశాఖ డిక్లరేషన్‌ కూడా త్వరలో విడుదల చేస్తారట! బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌తో కలిసి పని చేస్తున్నామని, యోగా–నేచురోపతి గేమ్‌ ఛేంజర్లుగా మారబోతున్నాయని ఆయన ప్రకటించారు. ఇక అల్లోపతి అటకెక్కినట్టేనా? యోగాభ్యాసాల్లో చేయించే ఎక్సర్‌సైజుల్లో చాలా స్ట్రెచింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు గతంలో పాఠశాలల్లో ఉన్న డ్రిల్‌ పీరియడ్లలో నేర్పించినవే. ఇప్పుడు మైదానాలు, స్పోర్ట్స్‌ టీచర్లు, స్పోర్ట్స్‌ పీరియడ్లను ఎత్తేశారు కాబట్టి, ఎవరింటి దగ్గర వాళ్లు గంటసేపు యోగా చేయమంటున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకులైన కేశవ్‌ బలిరామ్‌ హెడ్గేవార్‌ దివంగతులైన రోజు జూన్‌ 21. అదే రోజును ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా ప్రకటించడం కేవలం కాకతాళీయమే కావచ్చు.కానీ, ఈ ప్రకటన తర్వాత యోగా గురువులు తామరతంపరగా పుట్టుకొస్తున్నారు. యూట్యూబ్‌ల ద్వారా పాఠాలు చెబుతున్నారు. అందులో రోగాల స్పెషలిస్టులు కూడా బయలుదేరారు. నడుము నొప్పికి సేతుబంధాసనమట! సంతానం కలగాలంటే భుజంగాసనమట! ఇలానే కడుపునొప్పికి, గ్యాస్‌ మంటకు, దగ్గుకు, ఆయాసానికీ చివరికి ఎయిడ్స్‌కు, క్యాన్సర్‌కు కూడా యోగా చిట్కాలు చెప్పే గురువులు తయారయ్యారు. వీటన్నిటినీ వైద్యశాస్త్రం ఆమోదిస్తుందా, వీళ్ళందరికీ శరీర నిర్మాణ శాస్త్రంపై అవగాహన ఉన్నదా అనేవి ప్రశ్నార్థకాలు. ఆమధ్య ‘టెలిగ్రాఫ్‌ ఇండియా’ ఒక పరిశీలనాత్మక వ్యాసం రాసింది. అందులో ‘అష్టాంగ యోగా’ను ఆచరిస్తున్న వారిలో 62% మంది మోకాలి నొప్పులు, పిక్క కండరాల సమస్యలను ఎదుర్కొంటున్నారట! ఏ వయసు వారు ఎటువంటి ఆసనాలు వేయవచ్చు? ఆసనాలు వేసే సరైన పద్ధతి ఏమిటనే అవగాహన శాస్త్రీయంగా కల్పించకపోతే సమస్యలు ఎదురవుతాయి. యూట్యూబ్‌ సందేశాలు విని, పునర్‌ యవ్వనం ప్రాప్తిస్తుందని నమ్మి ముసలాళ్లు కూడా వజ్రాసనం వేసి కూర్చుంటే మోకాలి చిప్పలు దెబ్బతినవా? ఈ వేలం వెర్రిని నియంత్రించుకోకుంటే దుష్ఫలితాలు కూడా ఉంటాయని గ్రహించాలి.పిల్లలు పాఠశాల మైదానాల్లో నేర్చుకునే జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్‌ వంటి క్రీడలకు, ఇంటి దగ్గర ఇరుకు గదుల్లో అభ్యసించే యోగా సరైన ప్రత్యామ్నాయమేనా అనేది కూడా ఆలోచించాలి. యోగాభ్యాసం ద్వారా శారీరక చురుకుదనం, మానసిక పరిపక్వత దేదీప్యమానమవుతుందనే అభిప్రాయం నిజమైతే దీన్ని ప్రమోట్‌ చేసే పద్ధతి గిన్నిస్‌ బుక్‌ ప్రదర్శనల ద్వారా కాదు. యోగాభ్యాసం ఫలితంగా ఫలానా అథ్లెట్‌ ఫలానా కప్పు గెలుచుకొచ్చారని, ఫలానా క్రీడా జట్టు ఫలానా టోర్నమెంట్‌ గెలిచిందని ఉదాహరించాలి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఫలానా వ్యక్తులు ఫలానా ఆవిష్కరణలు చేశారని, నోబెల్‌ బహుమతి గెలిచిన వారి మేధ వెనుక యోగాభ్యాసం ఉన్నదనేటటువంటి పాఠాలు ఎక్కువ మోటివేట్‌ చేస్తాయి. కాకపోతే అటువంటి ఉదాహరణల కోసం కాస్త కష్టపడి శోధించాలి.‘సకల సమస్యలకు యోగానే మందు’ అనే ప్రచారాన్ని ముందుకు తెస్తున్న చంద్రబాబు లాంటి వాళ్లు ‘‘ప్రభుత్వ బడుల్లో టోఫెల్‌ పాఠాలెందుకు, సీబీఎస్‌ఈ ఎందుకు, ఐబి ఎందుకు, ఇంగ్లీష్‌ మీడియం ఎందుకు? యోగా ఉందిగా! ‘ఆరోగ్యశ్రీ’ ఎందుకు, ‘ఫ్యామిలీ డాక్టర్‌’ ఎందుకు? యోగా చేయండి చాలు!’’ అనే ప్రచారాన్ని ముమ్మరం చేసే అవకాశం ఉన్నది. ‘అంతులేని కథ’లో సదరు సన్యాసిరావు సంభాషించిన జ్ఞాన సంపద, భక్తి సంపద, తపః సంపద మాదిరిగానే! ఇక ఆంధ్ర దేశంలో యోగ సంపద కూడా దినదిన ప్రవర్ధమానం కావచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Discussion within government circles on Telangana financial situation2
డబ్బుల్లేవు.. కొత్త పథకాలెట్టా?

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకే నానా కష్టాలు పడుతూ డబ్బులు సమకూర్చుకుంటున్న నేపథ్యంలో..ఇక కొత్త సంక్షేమ పథకాల అమలు ఇప్పట్లో సాధ్యం కాదనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఆర్థిక కటకట నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకం అమలు నిలిపివేయాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతి నెలా ఖజానాకు వస్తున్న ఆదాయంతో అనివార్యంగా చేయాల్సిన ఖర్చుల సర్దుబాటు మాత్రమే జరుగుతోందని, ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు అవసరమైనప్పుడు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆసరా పింఛన్లను పెంచి ఎన్నికలకు వెళ్లాలనుకున్నా సాధ్యం కాలేదని, రైతు భరోసా నిధులు జమ చేసేందుకు మాత్రమే వెసులుబాటు దొరికిందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు ఆదాయం కావాలంటే భూముల అమ్మకమే శరణ్యమని స్పష్టం చేస్తున్నాయి. ఆదాయం అంతంత మాత్రమే.. ఖజానా లెక్కలు పరిశీలిస్తే.. రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతి నెలా ప్రభుత్వ సొంత రాబడులు రూ.12 వేల కోట్లకు మించడం లేదు. గత రెండేళ్ల గణాంకాలు పరిశీలించినా ఇదే విషయం స్పష్టమవుతోంది. తాజాగా కాగ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025 ఏప్రిల్‌ నెలలో రూ.10,916 కోట్లు మాత్రమే పన్ను ఆదాయం వచ్చింది. ఇందులో జీఎస్టీ కింద రూ.4 వేల కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1,126 కోట్లు, అమ్మకపు పన్ను రూపంలో రూ.2,700 కోట్లు, ఎక్సైజ్‌ ద్వారా రూ.1,300 కోట్లు, కేంద్ర పన్నుల రూపంలో రూ.1,100 కోట్లు వచ్చాయి. వీటితో పాటు అప్పులు, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు కలిపినా మొత్తం రాబడులు రూ.16,473 కోట్లు మాత్రమే. ప్రతి నెలా ఖర్చు ఇలా.. ఖర్చుల విషయానికి వస్తే ప్రతి నెలా సగటున రూ.6 వేల కోట్ల వరకు రెవెన్యూ పద్దు కింద ఖర్చు చేయాల్సి వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో పాటు రూ.2 వేల కోట్ల వరకు అప్పులకు వడ్డీల కింద, దాదాపు రూ.4 వేల కోట్లు (తాజాగా ప్రకటించిన డీఏతో కలిపి) ఉద్యోగులకు వేతనాల కింద, రూ.1,500 కోట్లు పింఛన్ల కింద, రూ.2,500 కోట్ల వరకు సబ్సిడీల కింద, రూ.1000–1500 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇవన్నీ అనివార్యంగా చెల్లించాల్సినవే. ఇవన్నీ కలిపి రూ.17 వేల కోట్లు దాటుతున్నాయి. అయితే ప్రభుత్వ రాబడులు (అప్పులతో కలిపి) ఇంతకంటే తక్కువే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కొంచెం అటుఇటుగా ఈ చేత్తో తీసుకుని ఆ చేత్తో ఇచ్చేటట్టే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉండటం గమనార్హం. కాగా రూపాయి అదనంగా ఖర్చు పెట్టాలన్నా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెప్పినట్టు కడుపు కట్టుకోవాల్సిందేనని, ఎప్పటికప్పుడు సర్దుబాటుకు మాత్రమే నిధులు సరిపోతున్నాయని, ఏదైనా పథకానికి డబ్బులు కావాలంటే రూపాయి రూపాయి పోగేయాల్సి వస్తోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. హెచ్‌ఎండీఏపై ఆశలు..‘నియోపొలిస్‌’పై కన్ను ప్రస్తుత పరిస్థితుల్లో భూముల అమ్మకాల ద్వారా మాత్రమే అదనపు ఆదాయం వస్తుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పుడే లోటు రూ.9 వేల కోట్లకు చేరినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కంచ గచ్చిబౌలి భూముల అమ్మకాల ద్వారా రూ.20 వేల కోట్లు సమకూర్చుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలన్న ఆలోచన కార్యరూపం దాల్చకపోవడంతో ఇక, హెచ్‌ఎండీఏ మీదనే ప్రభుత్వం ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా కోకాపేట్‌ నియోపొలిస్‌ భూముల అమ్మకాలను త్వరలోనే తెరపైకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ దాదాపు ఐదు ప్రాంతాల్లో భూముల అమ్మకాలకు అవకాశాలున్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు 18 హెచ్‌ఎండీఏ లేఅవుట్లలోని 2,414 ప్లాట్లు, ఉప్పల్‌ భగాయత్, తుర్కయంజాల్, ఇన్ముల్‌ నర్వలతో పాటు లేమూరు, కుర్మాల్‌గూడ, బాచుపల్లి, మేడిపల్లి, మోకిల, ప్రతాప సింగారం, బహుదూర్‌పల్లి, పెద్ద కంజర్ల తదితర ప్రాంతాల్లోని ఓపెన్‌ ప్లాట్లు అమ్మడానికి కూడా సర్కారు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద 18 నెలల కాలంలో కనీసం రూ.12 వేల కోట్లను హెచ్‌ఎండీఏ భూముల అమ్మకాల ద్వారా రాబట్టుకోవాలని, నియోపోలిస్‌ భూముల అమ్మకాల ద్వారా మరో రూ.3 వేల కోట్ల వరకు సమకూర్చుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వ వర్గాలున్నట్టు సమాచారం. ఎన్నికల సమయంలో అలా... అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉన్నట్లు చెప్పి పలు పథకాలను ప్రకటించిన కాంగ్రెస్‌ పెద్దలు.. ఇప్పుడు అమలు చేయాల్సి వచ్చేసరికి ఆదాయం పెరిగితే తప్ప అమలు చేయడం సాధ్యం కాదని, అప్పుల కిందే నెలకు రూ.6 వేల కోట్లు చెల్లించాల్సి రావడం వల్ల సంక్షేమ పథకాలకు నిధులు చాలడం లేదని అంటుండంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెన్షన్ల పెంపు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఏడాదిన్నర అయినా అమలు కాకపోగా... రైతుభరోసా కింద ఎకరాకు ఏటా ఇస్తామన్న మొత్తాన్ని రూ.15 వేల నుంచి రూ.12 వేలకు కుదిండాన్ని ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. అది కూడా సక్రమంగా చెల్లించలేదని ఆరోపిస్తున్నాయి. అలాగే ఉద్యోగులకు ఐదు డీఏలు చెల్లించాల్సి ఉండగా, రెండింటికి అమోదం తెలిపి.. ఒక డీఏ ఇప్పుడు చెల్లిస్తామని, మరో డీఏ ఆరునెలల తరవాత చెల్లిస్తామని చెప్పడం కూడా ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ఇక వేతన సవరణ ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదని ఉద్యోగులు వాపోతుండగా.. ఆదాయం పెరిగితే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉందంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పెరుగుతున్న బడ్జెట్‌ అంతరం ప్రస్తుత (2025–26) ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అంటే సగటున నెలకు రూ.25 వేల కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కానీ మొదటి రెండు నెలల ఆదాయ గణాంకాలను పరిశీలిస్తే అది రూ.16,500 కోట్లు దాటలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు, వాస్తవ రాబడులకు మధ్య దాదాపు రూ.8,500 కోట్ల మేర తేడా వస్తోందన్న మాట. గత అర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది ఎక్కువే. 2024–25లో ప్రతిపాదించిన బడ్జెట్‌ ప్రకారం ప్రతినెలా సగటున రూ 23,500 కోట్ల వరకు సమకూర్చుకోవాలి. కానీ సగటున రూ.17 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్ల వరకే రాబడులు వచ్చాయి. అంటే ప్రతినెలా సుమారు రూ.6 వేల కోట్లు తక్కువ వచ్చింది. ఇప్పుడు ఆ తేడా ఏకంగా రూ.8,500 కోట్లకు చేరడం గమనార్హం.

Surveillance of engineers who are in touch with BRS3
బీఆర్‌ఎస్‌కు టచ్‌లో ఉన్న ఇంజనీర్లపై నిఘా..!

సాక్షి, హైదరాబాద్‌: నీటిపారుదల శాఖలో పలువురు ఇంజనీర్లు గత సర్కారులోని పెద్దలతో ఇంకా టచ్‌లోనే ఉంటున్నారని ప్రభుత్వం అనుమానిస్తోంది. సర్కారు తీసుకునే ప్రతీ నిర్ణయంపై వారికి వెంటనే సమాచారం చేరవేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అలాంటి ఇంజనీర్లపై నిఘా పెట్టా లని ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఏసీబీ దాడులు కూడా జరిగినట్లు నీటిపారుదల శాఖలో ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ నేతలతో సన్నిహితంగా ఉన్నారని భావిస్తున్న వారిని కీలక స్థానాల నుంచి తప్పించాలని ఆదేశించినట్లు, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన వారిపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు అధికారవర్గాల సమాచారం. కాళేశ్వరం పరిధిలోని నిర్మాణాల్లో అవకతవకలు జరిగినట్లు భావిస్తున్న వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఆ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా విజిలెన్స్‌ అధికారులు నీటిపారుదల శాఖలోని ఇంజనీర్లకు ఇటీవల నోటీసులు జారీ చేసిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని పెద్దలు ఏసీబీ దాడుల్లో పట్టుపడుతున్న ఇంజనీర్లు వందల కోట్ల మేర అక్రమ ఆస్తులను అందుకు ఉదాహరణగా చూపుతున్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేసింది. దీనితో ఆ పార్టీ ముఖ్యనేతలతో కొందరు ఇంజనీర్లకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అనుమానాలను ధ్రువీకరిస్తూ ఇటీవల ప్రభుత్వానికి నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీని మేరకు కొందరు ఇంజనీర్లపై అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ)తో దాడులు జరిపించడంతోపాటు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం సిఫారసుల ఆధారంగా మరికొందరిపై చర్యలకు శ్రీకారం చుట్టారని చర్చ జరుగుతోంది. విజిలెన్స్‌ సిఫారసుల ఆధారంగా ఏకంగా 38 మంది ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లకు షోకాజ్‌ నోటీసులు జారీకావడం శాఖలో ప్రకంపనలు సృష్టించింది. సర్కారుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనీ... ఏసీబీ కాళేశ్వరం ప్రాజెక్టు గజ్వేల్‌ ఈఎన్‌సీతోపాటు కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేఐపీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రెండు హోదాల్లో కీలకంగా కొనసాగిన బి.హరిరామ్‌ను తొలుత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత ఏప్రిల్‌ 26న అరెస్టు చేసింది. అలాగే, వేరే చోటికి బదిలీ చేసినా ఏడాదికాలంగా ఎస్సారెస్పీ డివిజన్‌–8 ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా కొనసాగుతున్న నూనె శ్రీధర్‌ను సైతం ఏసీబీ ఈ నెల 11న అరెస్టు చేసింది. తెలంగాణ ఇరిగేషన్‌ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడైనప్పటికీ ప్రభుత్వం ఆయన్ను ఏసీబీ కేసులో అరెస్టు చేయడం గమనార్హం. ప్రభుత్వం మారినా బీఆర్‌ఎస్‌ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్టు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించడంతోనే వీరిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్టు సమాచారం. సాగునీటి రంగంలో గత ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబడుతుండగా, కొందరు అధికారులు గత ప్రభుత్వ నిర్ణయాలను సమరి్థస్తూ రావడం ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయంలో ఉండాల్సిన ఫైళ్ల కాపీలు ప్రతిపక్ష నేతలకు వెళ్లడంతోనే ప్రభుత్వం సీరియస్‌ అయినట్టు సమాచారం. నివేదిక రెండు నెలలు కోల్డ్‌ స్టోరేజీలో.. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకతలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌ రావును విచారించింది. వీరిని కమిషన్‌ ప్రశ్నించనున్నట్లు సమాచారం రాగానే ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొందరు ఇంజనీర్లపై ఏసీబీ దాడులు చేయించినట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మేడిగడ్డ బరాజ్‌ నిర్మాణంలో 38 మంది ఇంజనీర్లు అవకతవకలకు పాల్పడినట్టు విజిలెన్స్‌ విభాగం గుర్తించిందని, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ గత మార్చి 18న విజిలెన్స్‌ కమిషన్‌ సిఫారసు చేసింది. రెండు నెలల పాటు కోల్డ్‌ స్టోరేజీలో ఉన్న ఈ సిఫారసుల లేఖను సరిగ్గా కేసీఆర్‌ విచారణ కమిషన్‌ ఎదుట హాజరు కావడానికి ముందు ప్రభుత్వం బయటపెట్టినట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కమిషన్‌ సమన్ల ప్రకారం ఈ నెల 5న కేసీఆర్‌ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, 2న విజిలెన్స్‌ కమిషన్‌ లేఖను ప్రభుత్వం మీడియాకు లీక్‌ చేసినట్టు గుర్తు చేస్తున్నారు.

Rasi Phalalu: Daily Horoscope On 22-06-2025 In Telugu4
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. నూతన ఉద్యోగాలు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,ఉత్తరాయనం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం;తిథి: బ.ద్వాదశి రా.11.14 వరకు,తదుపరి త్రయోదశి;నక్షత్రం: భరణి ప.3.58 వరకు,తదుపరి కృత్తిక;వర్జ్యం: రా.3.09 నుండి 4.39 వరకు దుర్ముహూర్తం: సా.4.46 నుండి 5.38 వరకు అమృత ఘడియలు: ఉ.11.22 నుండి 12.51 వరకుసూర్యోదయం : 5.30సూర్యాస్తమయం : 6.33రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకుయమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు మేషం.... ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. రాబడి పెరుగుతుంది. సోదరులతో సఖ్యత. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.వృషభం.... రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. రుణబాధలు. దూరప్రయాణాలు. ఆస్తి విషయంలో చికాకులు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.మిథునం... నూతన ఉద్యోగాలు లభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.కర్కాటకం.... కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహం.సింహం.... సన్నిహితుల ద్వారా కొన్ని ఇబ్బందులు. ముఖ్య పనులు ముందుకు సాగవు. మీ ఆలోచనలు అంతగా కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.కన్య.... రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలు ఒడిదుడుకులతో సాగుతాయి.తుల..... కొత్త వ్యక్తుల పరిచయం. బాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు అనూహ్యంగా ముందుకు సాగుతాయి.వృశ్చికం... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలు అంచనాలు మేరకు కొనసాగుతాయి.ధనుస్సు.... ఉద్యోగయత్నాలు కొంత మందగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలు ఇబ్బంది కలిగించవచ్చు.మకరం.. పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువుల నుండి ఒత్తిడులు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.కుంభం... మిత్రుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.మీనం.... కుటుంబసభ్యులతో విభేదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. కొన్ని పనులు నిదానిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సాధారణస్థాయిలో ఉంటాయి.

India got all out for 471 in the first innings on Day 25
ఇంగ్లండ్‌ దీటైన జవాబు.. తొలి ఇన్నింగ్స్‌లో 209/3

జైస్వాల్, గిల్‌ వేసిన బాటలో... పంత్‌ చెలరేగిపోయి సెంచరీ బాదడంతో ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరు చేయగా... అదే స్థాయిలో రెచ్చిపోయిన ఇంగ్లండ్‌ దీటుగా బదులిస్తోంది. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో విజృంభించినా...అతడికి మరో ఎండ్‌ నుంచి సరైన సహకారం లేకపోవడంతో ఆతిథ్య ఇంగ్లండ్‌ బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. ప్రస్తుతానికి ఇరు జట్లు సమాన స్థితిలోనే ఉన్నా... మూడో రోజు తొలి సెషన్‌లో బుమ్రాను ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే ఈ మ్యాచ్‌ గమనం ఆధారపడి ఉంది!లీడ్స్‌: బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇరు జట్ల ఆటగాళ్లు భారీ స్కోర్లతో రెచి్చపోవడంతో భారత్, ఇంగ్లండ్‌ తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. బుమ్రా మినహా భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో... శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఒలీ పోప్‌ (131 బంతుల్లో 100 బ్యాటింగ్‌; 13 ఫోర్లు) ‘శత’క్కొట్టగా... బెన్‌ డకెట్‌ (94 బంతుల్లో 62; 9 ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం చేతిలో 7 వికెట్లు ఉన్న ఇంగ్లండ్‌... టీమిండియా స్కోరుకు ఇంకా 262 పరుగులు వెనుకబడి ఉంది. పోప్‌తో పాటు బ్రూక్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 359/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ 113 ఓవర్లలో 471 పరుగులు చేసి ఆలౌటైంది. కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (227 బంతుల్లో 147; 19 ఫోర్లు, 1 సిక్స్‌) టెస్టు కెరీర్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసుకోగా... రిషభ్‌ పంత్‌ (178 బంతుల్లో 134; 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) ధనాధన్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టోక్స్, టంగ్‌ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బుమ్రా ఒంటరి పోరాటం... సిరీస్‌ ఆరంభానికి ముందు అంతా ఊహించినట్లు... ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా బుమ్రానే అని నిరూపించుకున్నాడు. పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా అతడు ప్రతి బంతికి వికెట్‌ తీసేలా అత్యంత ప్రమాదకారిగా కనిపించాడు. వర్షం కారణంగా ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ఆలస్యంగా ప్రారంభం కాగా... తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ జాక్‌ క్రాలీ (4)ని పంత్‌ వెనక్కి పంపాడు. అదే తీవ్రత కొనసాగిస్తూ బుమ్రా రెచ్చిపోతుంటే... ఇంగ్లండ్‌ బ్యాటర్లు ప్రతీ బంతికీ బతుకు జీవుడా అంటూ కాలం వెల్లదీశారు. ఈ క్రమంలో ఎడ్జ్‌ల ద్వారా కాస్త పరుగులు రాగా... మనవాళ్ల పేలవ ఫీల్డింగ్‌ ప్రత్యర్థికి కలిసొచ్చింది. ఇంగ్లండ్‌ వంటి పేస్‌ పిచ్‌లపై స్లిప్స్‌లో దూసుకొచ్చే బంతులను అందుకోవడంలో యువ ఆటగాళ్ల అనుభవ రాహిత్యం కొట్టిచి్చనట్లు కనిపించింది. బుమ్రా బౌలింగ్‌లోకు ఫీల్డర్ల మద్దతు లభించి ఉంటే ఈ పాటికి మ్యాచ్‌ మన చేతుల్లోకి వచ్చి ఉండేదే! కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొన్న బెన్‌ డకెట్, పోప్‌ కుదురుకున్నాక చక్కటి షాట్‌లతో పరుగులు రాబట్టారు. బుమ్రా బౌలింగ్‌ను కాచుకున్న ఈ జంట... సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో స్వేచ్ఛగా ఆడింది. దీంతో ఏ దశలోనూ పరుగుల వేగం తగ్గలేదు. టీ విరామం అనంతరం మరోసారి బంతినందుకున్న బుమ్రా... డకెట్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేయగా... చివరి సెషన్‌లో పోప్‌ చెలరేగిపోయాడు. ఎడాపెడా షాట్లు ఆడుతూ... 125 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే రూట్‌ (28)ను బుమ్రా బుట్టలో వేసుకోగా... ఇంగ్లండ్‌ మరో వికెట్‌ కోల్పోకుండా రోజును ముగించింది. అదరగొట్టిన పంత్‌.. తొలి రోజు ఇంగ్లండ్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్న భారత బ్యాటర్లు... రెండో రోజు తొలి సెషన్‌ ఆరంభంలోని దాన్ని కొనసాగించారు. ఓవర్‌నైట్‌ బ్యాటర్లు గిల్, పంత్‌ స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. గిల్‌ కాస్త సంయమనం పాటించగా... పంత్‌ మాత్రం భారీ షాట్లతో రెచి్చపోయాడు. ఈ క్రమంలో పంత్‌ 146 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 99 పరుగుల వద్ద బషీర్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో మూడంకెల స్కోరు అందుకున్నాడు. అనంతరం తనదైన శైలిలో పల్టీలు కొడుతూ సంబరాలు జరుపుకున్నాడు. గతేడాది బంగ్లాదేశ్‌పై సెంచరీ అనంతరం పంత్‌కు ఇదే తొలి మూడంకెల స్కోరు. వన్డే తరహాలో ఆడిన ఈ జోడీ చకచకా పరుగులు రాబట్టింది. నాలుగో వికెట్‌కు 301 బంతుల్లో 209 పరుగులు జోడించిన అనంతరం గిల్‌ అవుటయ్యాడు. షోయబ్‌ బషీర్‌ బంతికి క్రీజు వదిల బయటకు వచ్చి భారీ షాట్‌కు యతి్నంచిన గిల్‌... బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌లో టంగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 430 పరుగుల వద్ద భారత జట్టు నాలుగో వికెట్‌ కోల్పోయింది. అదే సమయంలో వాతావరణంలో స్వల్ప మార్పులతో మేఘావృతం కాగా... ఇంగ్లండ్‌ పేసర్లు రెచి్చపోయారు. ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న కరుణ్‌ నాయర్‌ (0) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఎక్స్‌ట్రా కవర్స్‌లో పోప్‌ పట్టిన మెరుపు క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత టంగ్‌ బౌలింగ్‌లో పంత్‌ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోగా... పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ (1) అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. 454/7తో లంచ్‌కు వెళ్లిన భారత జట్టు ఆ తర్వాత మరో 17 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. జడేజా (11) ధాటిగా ఆడే ప్రయత్నంలో అవుట్‌ కావడం దెబ్బకొట్టింది. ఓవరాల్‌గా టీమిండియా 41 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయింది.స్కోరు వివరాలు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి) స్టోక్స్‌ 101; రాహుల్‌ (సి) రూట్‌ (బి) కార్స్‌ 42; సాయి సుదర్శన్‌ (సి) స్మిత్‌ (బి) స్టోక్స్‌ 0; గిల్‌ (సి) టంగ్‌ (బి) బషీర్‌ 147; పంత్‌ (ఎల్బీ) (బి) టంగ్‌ 134; కరుణ్‌ నాయర్‌ (సి) పోప్‌ (బి) స్టోక్స్‌ 0; జడేజా (బి) టంగ్‌ 11; శార్దుల్‌ (సి) జేమీ స్మిత్‌ (బి) స్టోక్స్‌ 1; బుమ్రా (సి) బ్రూక్‌ (బి) టంగ్‌ 0; సిరాజ్‌ (నాటౌట్‌) 3; ప్రసిధ్‌ కృష్ణ (బి) టంగ్‌ 1; ఎక్స్‌ట్రాలు 31; మొత్తం (113 ఓవర్లలో ఆలౌట్‌) 471. వికెట్ల పతనం: 1–91, 2–92, 3–221, 4–430, 5–447, 6–453, 7–454, 8–458, 9–469, 10–471. బౌలింగ్‌: వోక్స్‌ 24–4–103–0; కార్స్‌ 22–5–96–1; టంగ్‌ 20–0–86–4; స్టోక్స్‌ 20–2–66–4; బషీర్‌ 27–6–100–1. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: జాక్‌ క్రాలీ (సి) కరుణ్‌ నాయర్‌ (బి) బుమ్రా 4; డకెట్‌ (బి) బుమ్రా 62; పోప్‌ (బ్యాటింగ్‌) 100; రూట్‌ (సి) కరుణ్‌ నాయర్‌ (బి) బుమ్రా 28; బ్రూక్‌ (బ్యాటింగ్‌) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (49 ఓవర్లలో 3 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–4, 2–126, 3–206. బౌలింగ్‌: బుమ్రా 13–2–48–3; సిరాజ్‌ 14–0–50–0; ప్రసిధ్‌ కృష్ణ 10–0–56–0; జడేజా 9–2–25–0; శార్దుల్‌ 3–0–23–0.ఆ మూడు క్యాచ్‌లు పట్టుంటే... బుమ్రా బౌలింగ్‌లో డకెట్‌ రెండు సార్లు బతికిపోయాడు. ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ ఐదో బంతికి డకెట్‌ ఇచి్చన క్యాచ్‌ను గల్లీలో యశస్వి జారవిడవగా... భారత అత్యుత్తమ ఫీల్డర్‌లలో ఒకడైన జడేజా కూడా డకెట్‌ క్యాచ్‌ నేలపాలు చేశాడు. డకెట్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఇచి్చన క్యాచ్‌ను అందుకోవడంలో జడ్డూ విఫలమయ్యాడు. బుమ్రా వేసిన 31వ ఓవర్‌లో పోప్‌ ఇచి్చన క్యాచ్‌ను సైతం జైస్వాల్‌ నేలపాలు చేశాడు.

 Sunil Gavaskar changes tone for Rishabh Pant after record-breaking century6
అప్పుడు స్టుపిడ్.. స్టుపిడ్! ఇప్పుడు సూపర్బ్.. సూపర్బ్

స్టుపిడ్‌..స్టుపిడ్‌.. స్టుపిడ్‌.. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ కోల్పోవ‌డంతో కామెంటేట‌ర్‌ సునీల్ గ‌వాస్క‌ర్ చేసిన వ్యాఖ్య‌లు ఇవి. ఇప్పుడు అదే గ‌వాస్క‌ర్ రిష‌బ్ పంత్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు. లీడ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో పంత్ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు.రెండో రోజు ఆట‌లో త‌న ఏడో టెస్టు సెంచ‌రీ మార్క్‌ను రిష‌బ్ అందుకున్నాడు. ఈ ఢిల్లీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ 99 పరుగుల వద్ద సిక్సర్ బాది మరి త‌న సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో కామెంట‌రీ బాక్స్‌లో ఉన్న గ‌వాస్క‌ర్ సూపర్బ్.. సూపర్బ్.. సూపర్బ్ అంటూ కొనియాడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. విమ‌ర్శించిన నోళ్ల‌తోనే పొగిడించుకోవ‌డం చాలా గ్రేట్ అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఓవ‌రాల్‌గా 178 బంతులు ఎదుర్కొన్న పంత్‌.. 12 ఫోర్లు, 6 భారీ సిక్స‌ర్ల‌తో 134 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఈ సెంచరీతో టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్‌ కీపర్‌గా ధోని రికార్డును పంత్‌ బ్రేక్‌ చేశాడు. పంత్‌కు ఇది ఏడో టెస్టు సెంచరీ.తొలి ఇన్నింగ్స్‌లో భార‌త స్కోరంతంటే?ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 471 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 359/3 ఓవ‌ర్ నైట్‌స్కోర్‌తో రెండో రోజు ఆట‌ను ఆరంభించిన టీమిండియా అద‌నంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రిష‌బ్ పంత్‌తో పాటు కెప్టెన్‌ శుబ్‌మ‌న్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్‌), య‌శ‌స్వి జైస్వాల్ (101, 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచ‌రీల‌తో చెల‌రేగారు.ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ బెన్‌స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయ‌క్ బ‌షీర్ చెరో వికెట్ సాధించారు. అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవ‌ర్లు ముగిసే స‌రికి వికెట్ న‌ష్టానికి 72 ప‌రుగులు చేసింది.చదవండి: IND vs ENG: రిష‌బ్ పంత్ వ‌ర‌ల్డ్ రికార్డు..

Brazil Hot Air Balloon Incident Complete Details7
గాల్లో ఉండగా మంటలు.. 8 మంది దుర్మరణం

బ్రెజిల్‌ గగనతలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో మంటలు చెలరేగి ఎనిమిది మంది మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. శాంటా కాటరినా రాష్ట్రం ప్రియాగ్రాండే నగరంలో శనివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. బెలూన్ గాల్లో ఉన్న సమయంలోనే మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అది నేలపై కూలిపోయింది. ఆ సమయంలో బెలూన్‌లో మొత్తం 22 మంది పర్యాటకులు ఉన్నారు. వాళ్లలో 13 మంది ప్రాణాలతో బయటపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.#Brazil: At least eight people have died following an accident involving a hot air balloon in the southern region of Santa Catarina.Governor Jorginho Mello said, rescue teams were searching for other people, as preliminary information indicated there were 22 people on board.… pic.twitter.com/usUJ3Mzfh0— All India Radio News (@airnewsalerts) June 21, 2025వారం కిందట సావో పాలో రాష్ట్రంలో కూడా ఇలాంటి హాట్‌ ఎయిర్‌ బెలూన్ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. 11 మంది గాయపడ్డారు. వారం వ్యవధిలో వరుస ఘటనల నేపథ్యంలో హాట్ ఎయిర్ బెలూన్ పర్యటనల భద్రతపై పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.🚨🇧🇷 BREAKING: A hot air balloon caught FIRE and CRASHED with 22 people on board in Santa Catarina, Brazil.🎥 Shocking footage shows one person jumping out to escape the flames mid-air.#Brazil #Balloon #SantaCatarina pic.twitter.com/fisGaJHjrd— Breaking News (@PlanetReportHQ) June 21, 2025

LPU Student Secures Record Breaking Rs 2 5 Crore Placement Offer8
ఐఐటీలకు ధీటుగా ఎల్‌పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్‌మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)లో ఇటీవలి ఫ్లేస్‌మెంట్‌ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్‌పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్‌పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్‌పీయూ ప్లేస్‌మెంట్‌ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్‌పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్‌పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్‌పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్‌తో భారీ ఎల్‌పీయూ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్‌పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్‌ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్‌గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్‌పీయూ తాజా ప్లేస్‌మెంట్‌ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్‌పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్‌గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్‌పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్‌పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్‌కు ప్రపంచ ఖ్యాతిఎల్‌పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్‌మెంట్‌ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్‌పీయూ ఎందుకంటే?ఎల్‌పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్‌మెంట్‌ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్‌ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్‌ ప్లేస్‌మెంట్‌ ట్రెయినింగ్‌ పొందుతారు.‘ఎల్‌పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్‌పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్‌మెంట్‌ ల్యాండ్ స్కేప్‌లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్‌పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి.

Wedding of the Century: Why Italy City Divided ahead of billionaire Event9
అవునా.. ఈ శతాబ్దపు వివాహం ఇదేనా?

ప్రపంచంలో ఇప్పటిదాకా అత్యంత ఖరీదైన పెళ్లిగా గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించింది ఏదో తెలుసా?.. రెండు దశాబ్దాల కిందటే.. వందల కోట్లు ఖర్చు చేసిన ఆ వివాహ విశేషాల గురించి చివర్లో చెప్పుకుందాం. ఈలోపు.. ఈ శతాబ్దపు వివాహం(Wedding of the Century) ఇదేనంటూ నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఈ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ విషయంలో ఆ ప్రాంత ప్రజలు రెండుగా విడిపోయి వాదులాడుకుంటున్నారు. ఇంతకీ పెళ్లి గోల ఏంటంటే..అమెరికా టెక్‌ దిగ్గజం జెఫ్‌ బెజోస్‌(61)కి ఆయన ప్రేయసి, ప్రముఖ జర్నలిస్ట్‌ లారెన్ సాంచెజ్కు జరగబోయే వివాహం గురించే ప్రపంచం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటలీ నగరం వెనిస్‌లో జూన్‌ 24 నుంచి 26వ తేదీల మధ్య మూడు రోజులపాటు అంగరంగ వైభంగా ఈ వివాహ వేడుక జరగనుంది. లియోనార్డో డికాప్రియో, కిమ్ కార్డాషియన్, బియాన్స్, మిక్ జాగర్ లాంటి ప్రముఖులు ఈ వివాహానికి అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఇందుకోసం భారీగానే వెచ్చించబోతున్నారట.వెనిస్‌లోని చారిత్రక భవనాలు, ప్యాలెస్‌లను వివాహ వేదికల కోసం అద్దెకు తీసుకుందీ జంట. ఒక్క ఫ్లవర్ డెకరేషన్ కోసం రూ.8 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. కేటరింగ్ కోసం రూ.10కోట్ల దాకా కేటాయించారు. కేవలం లారెన్‌ ధరించబోయే దుస్తులు, ఆభరణాల కోసం ₹12 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట. ఇవేకాకుండా.. అతిథులకు వసతి, రవాణా.. విలాసవంతమైన హోటళ్లు, వాటర్ టాక్సీలు, ప్రైవేట్ బోట్ల ఖర్చు కోసం మిలియన్లు కుమ్మరించబోతున్నాడు ఈ అపర కుబేరుడు. ఈ వివాహ వేడుకకు అంచనా ఖర్చు ₹125 కోట్ల నుంచి ₹166 కోట్ల ($15 మిలియన్ నుంచి $20 మిలియన్ వరకు) మధ్యగా ఉండొచ్చని ఒక అంచనా. వీళ్ల వివాహం మాటేమోగానీ.. ‘‘వెడ్డింగ్‌ ఆఫ్‌ ది సెంచరీ’’ అంటూ సోషల్‌ మీడియా ఊదరగొట్టేస్తోంది. అదే సమయంలో ఈ హైప్రొఫైల్‌ వెడ్డింగ్‌ వివాదానికి కూడా దారి తీసింది. కొంతమంది ఈ వేడుకను వెనిస్‌కు గౌరవంగా భావిస్తున్నారు. నగరానికి పర్యాటక ఆదాయం తీసుకురావచ్చని ఆశిస్తున్నారు. అయితే.. వెనిస్‌ను ప్రైవేట్‌ పార్టీగా బెజోస్‌ భావిస్తున్నారా? అంటూ మరికొందరు మండిపడుతున్నారు. "No Space for Bezos! అనే నినాదాలతో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఈ పాటికే రియాల్టో వంతెనపై భారీ బ్యానర్లు కట్టారు. ఈ వేడుక వల్ల నగరంలో అధిక రద్దీ నెలకొంటుందని, స్థానికులకు అసౌకర్యం కలగడంతో పాటు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. జెఫ్‌ బెజోస్‌ గురించి.. జెఫ్ బెజోస్ జనవరి 12, 1964న అల్బుకర్కీ, న్యూ మెక్సికో(అమెరికా) జన్మించారు. 1994లో బెజోస్ సెకండ్‌హ్యాండ్ పుస్తకాలు అమ్మే ఆన్‌లైన్ స్టోర్‌గా అమెజాన్‌ను ప్రారంభించారు. అది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా మారింది. ఆపై 2000లో బ్లూ ఆరిజిన్ అనే అంతరిక్ష సంస్థను స్థాపించారు. 2013లో వాషింగ్టన్ పోస్ట్ అనే ప్రముఖ వార్తాపత్రికను కొనుగోలు చేశారు. 2017 నుంచి 2021 వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS కూడా బెజోస్ నేతృత్వంలోనే ప్రారంభమైంది. మెకెంజీ స్కాట్‌ను బెజోస్‌ 1993లో వివాహం చేసుకున్నారు, 2019లో ఈ జంట విడాకులు తీసుకుంది. ఆపై లారెన్ సాంచెజ్‌తో ప్రేమలో మునిగిపోయిన ఆయన.. నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు వివాహానికి సిద్ధమయ్యారు. ‘‘నాకు నెంబర్‌వన్ కిరీటం అవసరం లేదు. ఉపాధి కల్పించే యజమానిగా గుర్తింపు కావాలి’’ అనేది ఆయన philosophy. ఉద్యోగులతో వ్యక్తిగతంగా లేఖలు రాయడం, వారిని ప్రోత్సహించడం వంటి చర్యలు ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. లారెన్ వెండీ సాంచెజ్ (Lauren Wendy Sánchez).. వయసు 55. ఆమె ఒక టీవీ ప్రెజెంటర్, జర్నలిస్ట్, హెలికాప్టర్ పైలట్ కూడా. Extra", "Good Day LA వంటి షోలతో ఆమెకు పేరు దక్కింది. 2024లో ఆమె బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన తొలి మహిళలలో ఒకరిగా నిలిచారు. "Black Ops Aviation" అనే ఎయిర్ ఫిల్మింగ్ కంపెనీ ఉంది — ఇది మహిళల చేత నడపబడే మొదటి సంస్థలలో ఒకటి. ఫ్యాషన్ ఐకాన్‌గా ఆమె స్టైలిష్ దుస్తులు, డిజైనర్ బ్రాండ్స్ కోసం ప్రసిద్ధి. ఇటీవల కర్దాషియన్ కుటుంబం ఆమెకు విలాసవంతమైన UFO-ప్రేరిత బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు.లారెన్‌ గతంలో ఎన్‌ఎఫ్ఎల్ మాజీ ఆటగాడు టోనీ గోంజాలెజ్‌తో డేటింగ్‌ చేసి ఓ కొడుకును కన్నారు. ఆపై హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ పాట్రిక్‌ వైట్‌సెల్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. పాట్రిక్‌ నుంచి విడాకులు తీసుకున్నాక ఆమె జెఫ్‌ బెజోస్‌తో డేటింగ్‌ మొదలు పెట్టి.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లిళ్లు.. టాప్ 10 జాబితా పరిశీలిస్తే.. 1.ఖాదిజా ఉజాఖోవా Weds సైద్ గుట్సెరీవ్ – సుమారు ₹8,300 కోట్లు(1 బిలియన్‌ డాలర్లు)2016లో మాస్కోలో జరిగిన ఈ పెళ్లిలో జెన్నిఫర్ లోపెజ్, ఎన్‌రికె ఇగ్లెషియస్ లైవ్ షోలు ఇచ్చారు. అతిథులకు బెంట్లీ కార్లలో స్వాగతం పలకడంతో పాటు బంగారు బాక్స్‌లను గిఫ్ట్‌లుగా ఇచ్చారు. 2. అనంత్ అంబానీ Weds రాధికా మర్చంట్ – సుమారు ₹5,000 కోట్లు2024లో జరిగిన ఈ పెళ్లిలో జరిగిన సందడి అంతా ఇంతా కాదు. పాప్‌ సింగర్‌ రిహన్నా ప్రత్యేక షోతో అలరించారు. ఖరీదైన క్రూయిజ్ పర్యటనలతో పాటు ప్రపంచ ప్రముఖుల హాజరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 3. ఇషా అంబానీ Weds ఆనంద్ పిరమల్ – సుమారు ₹800 కోట్లు2018లో ఉదయ్‌పూర్‌లోని రాజమహల్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లిలో బియాన్స్ లైవ్ షో ఇచ్చారు. 4. వనీషా మిట్టల్ Weds అమిత్ భాటియా – సుమారు ₹550 కోట్లు2004లో ఫ్రాన్స్‌లో వెర్సైల్స్ ప్యాలెస్‌లో వివాహ వేడుక జరిగింది. కైలీ మినోగ్ ప్రదర్శనతోపాటు ఐఫెల్ టవర్ వద్ద బాణా సంచాలు కాల్చి వేడుక నిర్వహించారు. 5.ప్రిన్స్ చార్ల్స్ Weds ప్రిన్సెస్ డయానా – సుమారు ₹400 కోట్లు1981లో ఈ రాయల్ వెడ్డింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా 750 మిలియన్ల మంది వీక్షించారు. 6. ప్రిన్స్ హ్యారీ Weds మేఘన్ మార్కెల్ – సుమారు ₹375 కోట్లు2018లో విండ్సర్ క్యాసిల్‌లో జరిగిన ఈ వివాహ వేడుక.. ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. 7. కింగ్ ఫెలిప్ Weds క్వీన్ లెటీషియా (స్పెయిన్) – సుమారు ₹290 కోట్లుఆ దేశ రాజధాని మాడ్రిడ్‌లో రాజ సంప్రదాయాలతో ఘనంగా జరిగిందీ వివాహం. 8. ప్రిన్స్ విలియం Weds కేట్ మిడిల్టన్ – సుమారు ₹275 కోట్లు2011లో వెస్ట్‌మినిస్టర్ ఏబీ చర్చిలో జరిగిన ఈ వివాహ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి 1,900 మందికిపైగా ప్రత్యేక అతిథులు హాజరయ్యారు 9. అంజెలా బేబి Weds హువాంగ్ షియామింగ్ (చైనీస్ సెలెబ్రిటీలు) – సుమారు ₹260 కోట్లు2015లో హోలోగ్రాఫిక్ క్యాసెల్‌లో.. ప్రత్యేక డిజైనర్ గౌన్‌తో వధువు మెరిసిపోగా.. ఈ వివాహం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. 10. మైఖేల్ జార్డన్ Weds ఎవెట్ ప్రియెటో – సుమారు ₹80 కోట్లుబాస్కెట్‌బాల్ చక్రవర్తి మైఖేల్‌ జార్డన్‌ వివాహం క్యూబన్‌ అమెరికా మోడల్‌ య్వెట్ ప్రియెటో 2013లో జరిగింది. సుమారు 500 మంది అతిథుల నడుమ.. ఉషర్, రాబిన్ థిక్ లైవ్ షోలతో ఘనంగా జరిగింది ఈ వివాహ వేడుక. పైవాటిల్లో భారత పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ కుమార్తె వనీషా మిట్టల్ వివాహం గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది. వ్యాపారవేత్త అమిత్‌ భాటియాతో వనీషా వివాహం 2004లో సుమారు రూ. 550 కోట్ల వ్యయంతో ఫ్రాన్స్‌లోని వెర్సైల్స్‌ ప్యాలెస్‌ వేడుకగా జరిగింది. ఆరు రోజులపాటు జరిగిన పెళ్లి వేడుకకు హాలీవుడ్‌, బాలీవుడ్‌ నుంచి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వివాహ వేడుకకు అయిన ఖర్చు కంటే అధిక ఖర్చుతో జరిపించిన వివాహాలు ఉన్నప్పటికీ.. అప్పటి బడ్జెట్‌.. పరిస్థితులు.. ఇతర కారణాలతో వనీషా మిట్టల్‌ వివాహ వేడుక గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కడం విశేషం.

Another Flight From Iran Brings 310 Indians Home10
ఆపరేషన్‌ సింధు: ఇరాన్‌ నుంచి మరో విమానం.. స్వదేశానికి 310 మంది భారతీయులు

ఢిల్లీ: ఆపరేషన్‌ సింధు కొనసాగుతోంది. ఇరాన్‌ నుంచి మరో 310 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు తరలింపు విమానం ఢిల్లీలో ల్యాండ్‌ అయ్యింది. ఇప్పటివరకు 827 మందిని భారత్‌కు తరలించినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ క్రమంలో ఇరాన్‌లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు భారత్‌ చర్యలు చేపట్టింది.కాగా, నిన్న (శుక్రవారం) రాత్రి 11.30 గంటలకు ఇరాన్‌ నుంచి 290 మంది భారతీయులతో కూడిన విమానం ఢిల్లీకి చేరుకుంది. గురువారం.. మొదటి దశలో 110 మంది పౌరులతో తరలింపు విమానం భారత్‌కు చేరిన విషయం తెలిసిందే. ఓవైపు యుద్ధం కొనసాగుతున్నాసరే ఇరాన్‌ భారత్‌కు అనుకూలంగా వ్యవహరించింది. పౌర విమానాల రాకపోకల కోసం గతంలో మూసేసిన గగనతలాన్ని భారత్‌ కోసం ప్రత్యేకంగా తెరిచింది. దీంతో ఇరాన్‌ నుంచి భారత్‌కు విమానాలు చేరుకుంటున్నాయి.యుద్ధం కారణంగా అక్కడి మష్హాద్‌ సిటీలో ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆపరేషన్‌ సిందూలో భాగంగా భారతసర్కార్‌ ఇరాన్‌లోని కొందరు విద్యార్థులను రోడ్డుమార్గంలో అర్మేనియాకు తరలించి అక్కడి నుంచి విమానమార్గంలో స్వదేశానికి తీసుకొచ్చింది. ఇకపై నేరుగా ఇరాన్‌ ఎయిర్‌పోర్ట్‌ల నుంచే విమానాలు తిరుగు ప్రయాణం కానున్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement