Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

Operation Sindoor Pakistan Deputy PM Says India hit our airbases1
భారత్‌ దాడులతో వణికిపోయాం.. పాక్‌ డిప్యూటీ పీఎం షాకింగ్‌ వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌ ఎట్టకేలకు భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందిస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌ కారణంగా గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు పాక్‌ నేతలు ఒక్కొక్కరుగా ఒప్పుకుంటున్నారు. తాజాగా ఆ లిస్టులోకి పాకిస్తాన్‌ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ చేరిపోయారు. తాజాగా ఆపరేషన్‌ సిందూర్‌పై ఇషాక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ వైమానిక దాడులు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు.పాకిస్తాన్‌ డిప్యూటీ పీఎం ఇషాక్‌ దార్‌ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌ మాపై మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్‌లోని రెండు ముఖ్యమైన వైమానిక స్థావరాలు రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, షోర్‌కోట్ ఎయిర్‌బేస్‌లపై భారత్‌ విరుచుకుపడింది. దీంతో, రెండు ఎయిర్‌బేస్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారత్‌పై పాకిస్తాన్ తిరిగి దాడి చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడులు జరిగాయి. అందుకే ప్రతి దాడి చేయలేకపోయాం. దాడుల విషయంలో భారత్‌ వేగంగా స్పందించింది. భారత్‌తో యుద్ధం అంత తేలిక కాదు.భారత దాడులు జరిగిన 45 నిమిషాల్లోనే సౌదీ యువరాజు ఫైసల్ బిన్ సల్మాన్ వ్యక్తిగతంగా నాతో మాట్లాడారు. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడాలని యువరాజు సూచించారు. రెండు దేశాల మధ్య సమస్యలను తగ్గించేందుకు రియాద్‌ ముఖ్యమైన పాత్ర పోషించింది. అమెరికా సైతం భారత్‌ను నిలువరించే ప్రయత్నం చేసిందని చెప్పుకొచ్చారు.Pakistan Deputy PM Ishaq Dar' openly admits 2 things in this interview 📍India struck the Nir Khan Air base and Shorkot Air base 📍 Ishaq Dar' says Saudi Prince Faisal called him asking "Am I authorised to talk to Jaishankar also and CONVEY ..and you are READY TO TALK"… pic.twitter.com/45TJqnlWKu— OsintTV 📺 (@OsintTV) June 19, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు ఆపరేషన్‌ సిందూర్‌పై పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ చేసిన దాడులను పాక్‌ ప్రధాని అంగీకరించారు. బాలిస్టిక్‌ క్షిపణులతో భారత్‌ విరుచుకుపడిందని ఆర్మీ చీఫ్‌ మునీర్‌ తనతో చెప్పారని ప్రధాని షరీఫ్‌ వెల్లడించారు. మే 10వ తేదీన తెల్లవారుజాము 2.30కి పాక్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్‌ నుంచి తనకు ఫోన్‌ కాల్‌ వచ్చిందని పాక్ ప్రధాని చెప్పారు. నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో భారత్‌ దాడులు చేసిందని మునీర్‌ తనతో చెప్పారన్నారు. ఇక, షరీఫ్ ప్రసంగానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Kuberaa Movie Twitter Review2
'కుబేర' ట్విటర్‌ రివ్యూ.. హైజాక్‌ చేసిన ధనుష్‌

అక్కినేని నాగార్జున, ధనుష్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘కుబేర’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్‌ 20న విడుదలైంది. ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో సినిమాను చూశారు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కూడా తెల్లవారుజామున మొదటి ఆట వేశారు. దీంతో సినిమా టాక్‌ ఏంటి అనేది సోషల్‌మీడియా ద్వారా టాక్‌ బయటకు వచ్చేసింది. కుబేరలో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్‌ నటుడు జిమ్‌ సర్భ్‌ కీలక పాత్ర పోషించారు. శేఖర్‌ కమ్ముల అమిగోస్‌ క్రియేషన్స్‌తో కలిసి ఎస్‌వీసీఎల్‌ఎల్‌పీపై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ అయింది. భాషతో సంబంధం లేకుండా విడుదలైన ప్రతిచోట కుబేర హిట్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సోషల్‌మీడియాలో ఈ చిత్రానికి ఎలాంటి టాక్ రన్‌ అవుతుంది..? నాగార్జున, ధనుష్ పాత్రలు మెప్పించాయా..? అనేది చూద్దాంశేఖర్ కమ్ముల అండ్ టీం బ్లాక్ బస్టర్‌ని అందించారని ఎక్కువ మంది నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఫస్టాప్‌ అదిరిపోయింది అంటూనే సినిమా ప్రాణం, ఆత్మ అంతా సెకండ్ హాఫ్‌లోనే ఉందని చెబుతున్నారు. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయని తెలుపుతున్నారు. ముఖ్యంగా ధనుష్‌ ఎంట్రీ సీన్‌ పట్ల ఎక్కువ మంది మెచ్చుకుంటున్నారు. ధనుష్‌ మాత్రమే చేయగలిగే పాత్ర అంటూ అభినందిస్తున్నారు. కుబేరలో ధనుష్ ఒక చిరస్మరణీయమైన నటనను కనబరిచాడని, అతను బిచ్చగాడి పాత్రలో జీవించాడంటూ ట్వీట్లు చేస్తున్నారు. కథలో అత్యంత బలంగా ఉన్న పాత్ర నాగార్జునకు దక్కిందని మరికొందరు తెలుపుతున్నారు. ఇందులో రష్మిక కూడా మరో చిరస్మరణీయమైన పాత్రను పోషించిందని కాంప్లీమెంట్స్‌ దక్కుతున్నాయి.దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందట. చాలా సీన్లకు ఆయన ప్రాణం పోశారని చెబుతున్నారు. శేఖర్ కమ్ముల రచన, దర్శకత్వం చాలా బాగా వర్కౌట్ అయ్యాయని ప్రేక్షకులు తెలుపుతున్నారు. మొత్తం మీద, కుబేరుడు సినిమా అంతటా బ్లాక్ బస్టర్‌ అంటూ పోస్ట్‌లు షేర్‌ చేస్తున్నారు. సినిమా నిడివి మాత్రమే మైనస్‌ అంటూనే ఎక్కడా కూడా బోర్‌ కొట్టదు అంటున్నారు. సినిమా మొత్తం ధనుష్‌ హైజాక్‌ చేశాడని, ఇంత అద్భుతంగా ఎలా నటించావ్‌ బాస్‌ అంటూ ఆయన్ను అభినందిస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు ఏకంగా 9 రేటింగ్‌ ఇస్తున్నారు. కొందరైతే 10 ఇవ్వొచ్చు అంటున్నారు. అంతలా ధనుష్‌ మెప్పించాడని తెలుపుతున్నారు. సినిమా చూసిన ధనుష్‌ అభిమానులైతే చాలా ఎమోషనల్‌ అవుతున్నారు. కన్నీళ్లు తెప్పించే సీన్లు చాలా ఉన్నాయంటూ కుబేరకు నేషనల్‌ అవార్డ్‌ తప్పకుండా వస్తుందని అభిప్రాయపడుతున్నారు.#Kuberaa [4.5/5] : Sekhar Kammula and team delivered a blockbuster. The first half of the film is good but the life and soul of the film is the second half. The emotional scenes in the second half worked out big time. Dhanush delivered a memorable performance. He just lived in…— Ramesh Bala (@rameshlaus) June 20, 2025#Dhanush – What a Phenomenal Actor!🥹Every Expression, Every Emotion… He Lives the Role! Words Fall Short to Describe His Brilliance🙏🔥Truly a Gifted Gem to Indian Cinema🤞❤️#Kuberaa | #Kubera pic.twitter.com/tQSLRZhVhj— Movies4u Official (@Movies4u_Officl) June 20, 2025#Kuberaa #KuberaaReview #Dhanush #Nagarjuna #ShekharKammula pic.twitter.com/2XX4q8bHia— TollywoodBoxoffice.IN (@TBO_Updates) June 20, 2025#Kuberaa wins your heart, powered by Dhanush’s phenomenal, arguably, career-best performance. Despite minor flaws with length, the film delivers plenty of memorable moments, making it a thoroughly enjoyable watch! ❤️❤️❤️❤️ pic.twitter.com/zqDVjS6owv— LetsCinema (@letscinema) June 20, 2025Mentaloda adhem acting ra babu 🥵 🔥🔥💥💥😭😭 @dhanushkrajaBlock buster #Kuberaa 🔥 🔥 A Must Watch Film Worth Watching 💥💥🔥🔥 #Dhanush pic.twitter.com/cB2oSHgfE2— 𝐃𝐞𝐯𝐚 🛐🛐 (@SudheerJalluri1) June 20, 2025#Kuberaa is the BEST movie in recent times🛐A shekhar kammula Film, A Dhanush’s Masterpiece A Nagarjuna’s ViswaroopamA @ThisIsDSP’s ThandavamWorth every penny, okka scene kuda bore kottaledhu🙏❤️‍🔥pic.twitter.com/zT2cD04oFU— Legend Prabhas 🇮🇳 (@CanadaPrabhasFN) June 20, 2025After the blockbuster #LoveStory, director @sekharkammula delivers yet another banger for @SVCLLP with #Kuberaa. 💥🔥This winning combo strikes gold once again with powerful storytelling and impactful cinema. A sure-shot BLOCKBUSTER! 🤘👑#SekharKammulasKuberaa pic.twitter.com/vLYFFiBSLA— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 20, 2025#Kuberaa - A WinnerA good first half followed by an emotionally charged second half made the film a good watch. The film started on a slow note but right from Dhanush’s entry sequence, the pace of the film did not drop until the climax. Dhanush delivered one of the his…— Gulte (@GulteOfficial) June 20, 2025#Kuberaa Full Positive response from Telugu shows 🔥#Dhanush's back to back hits in Telugu 🔥🔥 ( #Sir/#Vaathi & Now Kuberaa) @dhanushkraja pic.twitter.com/PyULPDjDMI— Prakash Mahadevan (@PrakashMahadev) June 20, 2025

Shubhanshu Shukla Space Mission Postponed3
శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై సస్పెన్స్‌.. ఆరోసారి వాయిదా

ఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఆరోసారి కూడా వాయిదా పడింది. ఈ నెల 22న శుభాంశు రోదసి యాత్ర చేయాల్సి ఉండగా.. యాక్సియం-4 ప్రయోగం వాయిదా పడిందని నాసా తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, అంతరిక్ష ప్రయోగంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇక, ఈ ప్రయోగానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నాసా వెల్లడించింది.ఇదిలా ఉండగా.. శుభాంశు శుక్లా అమెరికాకు చెందిన యాక్సియం-4 మిషన్‌లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఇందులో ఈ మిషన్‌ చేపట్టాయి. ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్‌-9 రాకెట్‌ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్‌ పైలట్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే ఆరు సార్లు వాయిదా పడింది.ఇక, భూమి నుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత ఈ వ్యోమనౌక.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)తో అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం అక్కడే 14 రోజుల పాటు ఉంటుంది. భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ముచ్చటిస్తారు.NASA's Axiom-4 mission with Indian astronaut Shubhanshu Shukla delayed for sixth time pic.twitter.com/TAaXUZpCnv— UPSC Post 📫 (@upscpost) June 20, 2025

Kadapa Corporation Council Meeting Updates4
కడప కార్పొరేషన్‌లో హైడ్రామా.. తెరుచుకోని తలుపులు

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: దాదాపు ఆరు మాసాల తర్వాత ఇవాళ జరుగుతున్న నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత రెండు నెలలుగా మీటింగ్ హాలుకు అధికారులు తాళం వేశారు. చివరికి ఇవాళ ఉదయం 11గంటలకు పాలకవర్గ సమావేశం ఉన్నా కానీ తాళం తీయలేదు. కుర్చీ కోసం.. కడప ఎమ్మెల్యే దొడ్డి దారిన కుర్చీ వేయించుకుని, దానికి బోల్టులు కూడా బిగించారనే ఆరోపణలు ఉన్నాయి.మీటింగ్ హాల్ తలుపులు తీస్తేనే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నేడు మీటింగ్ ఉన్నా ఇంతవరకూ తాళం తీయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఎమ్మెల్యేకు అనుకూలంగా నిబంధనలను కాలరాస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కౌన్సిల్‌ హాలులో మేయర్‌తో సమానంగా తనకు వేదికపై కుర్చీ వేయలేదన్న కారణంతో.. గత రెండు సర్వసభ్య సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆర్‌.మాధవిరెడ్డి తన అనుచరులతో ప్రవేశించి నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే.తనకు లేని కుర్చీ.. మేయర్‌కు కూడా ఉండకూడదని భీష్మించుకుని.. మేయర్‌ సురేష్‌ బాబుపై అనర్హత వేటు వేయించాలని ఆమె చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పురపాలక శాఖ కార్యదర్శి ఏకపక్షంగా జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టేటస్‌ కో విధించింది. మళ్లీ విచారణ చేసి మేయర్‌ వాదన వినాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను పురపాలక అధికారులు పెడచెవిన పెట్టి పాత పద్ధతిలోనే విచారణ చేసి.. ఈనెల 20వ తేదీన సర్వసభ్య సమావేశం కంటే ముందే మళ్లీ అనర్హత వేటు వేయాలని పన్నిన కుయుక్తులు న్యాయస్థానం ముందు ఫలించలేదు.19వ తేదీ వరకూ మేయర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని యథాతథ స్థితి కొనసాగించాలని కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. ఈనెల 20వ తేదీన మేయర్‌ సురేష్‌బాబు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరగడం తథ్యమని తేలిపోయింది. మేయర్‌ కోరినా కౌన్సిల్‌ హాలు తలుపులు ఎందుకు తెరవలేదో.. మేయర్‌ ఆదేశాల మేరకు నడుచుకోవాల్సిన కమిషనర్‌.. అందుకు విరుద్ధంగా వ్యవహరించి ఎక్స్‌ అఫిషియో సభ్యులైన కడప, కమలాపురం ఎమ్మెల్యేలకు మేయర్‌తో సమానంగా వేదికపై కుర్చీలు వేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అందుకే కౌన్సిల్‌ హాలు తాళం చెవులను తన వద్ద ఉంచుకొని.. మేయర్‌ స్వయంగా కోరినా తలుపులు తెరవలేదని సమాచారం. దీంతో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు కౌన్సిల్‌ హాలు తెరిచేలా ఆదేశాలివ్వాలని జాయింట్‌ కలెక్టర్‌ను కోరడంతోపాటు సమావేశంలోకి ఇతరులను ఎవ్వరినీ అనుమతించవద్దని, పటిష్ట భద్రత కల్పిపంచాలని జిల్లా ఎస్పీని కోరారు.అంతేగాక 39 మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించి తమకు భద్రత కల్పించాలని విన్నవించారు. కార్పొరేటర్ల పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నగరపాలక సర్వసభ్య సమావేశానికి పటిష్ట భద్రత కల్పించాలని, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే సర్వసభ్య సమావేశపు హాలులో ఎమ్మెల్యేలకు వేదికపై కుర్చీలు వేసి ఉంటే.. మేయర్, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఎలా స్పందిస్తారు.. కమిషనర్‌ ఎవరి ఆదేశాలతో.. ఎవరి మెప్పు కోసం ఈ పని చేశారు.. కమిషనర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు పట్టుబడతారు.. అనే ప్రశ్నలకు నేడు సమాధానం లభించబోతోంది. ఒకవేళ కుర్చీ వేయకపోతే ప్రభుత్వ విప్‌ ఆర్‌.మాధవిరెడ్డి వ్యవహార శైలి ఎలా ఉంటుందనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏం చేయాలన్నా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిందే వైఎస్సార్‌సీపీ మేయర్, కార్పొరేటర్ల గోడు విని న్యాయస్థానం ఆదేశాలిచ్చినా.. వాటిని అమలు చేయాల్సింది మళ్లీ అధికారులే కావడంతో సమస్య మళ్లీ మొదటికొస్తోంది. సభ నిర్వహణకు, సభలో చేసిన తీర్మానాలను మినిట్స్‌ బుక్‌లో రాయించేందుకు, వాటిని అమలు చేసేందుకు, అభివృద్ధి పనులు చేసేందుకు ఇలా ప్రతి దానికి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, మేయర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. గతంలో ఎన్నడూ ప్రతిపక్షంపై అధికార పక్షం ఇంతటి ఘర్షణ పూరిత వాతావరణం తీసుకురాలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Karun Nair, Jitesh Sharma Set To Leave Vidarbha5
పునర్జన్మనిచ్చిన జట్టుకు షాకిచ్చిన కరుణ్‌ నాయర్‌

ప్రస్తుతం భారత క్రికెట్‌లో వినిపిస్తున్న పేర్లలో కరుణ్‌ నాయర్‌ పేరు ముందువరుసలో ఉంది. దేశవాలీ క్రికెట్‌లో విశేషంగా రాణించి, 8 ఏళ్ల తర్వాత టీమిండియా తలుపులు తట్టిన 33 ఏళ్ల ఈ కర్ణాటక మిడిలార్డర్‌ బ్యాటర్‌.. ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు రెడీగా ఉన్నాడు. భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య లీడ్స్‌ వేదికగా ఇవాల్టి నుంచి (జూన్‌ 20) తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కరుణ్‌ ఆడటం దాదాపుగా ఖరారైపోయింది. దేశవాలీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన కారణంగా కరుణ్‌కు భారత జట్టులో చోటు దక్కింది. ఇదే సమయంలో స్టార్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి రిటైర్‌ కావడం కూడా కరుణ్‌కు కలిసొచ్చింది. ఇంగ్లండ్‌తో నేటి నుంచి ప్రారంభం కాబోయే మ్యాచ్‌లో కరుణ్‌ ఆరో స్థానం లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. కరుణ్‌ ఇటీవలే ఇంగ్లండ్‌ లయన్స్‌పై డబుల్‌ సెంచరీ బాది మాంచి జోష్‌లో ఉన్నాడు. భారత క్రికెట్‌ అభిమానులు సైతం కరుణ్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా కరుణ్‌ మరో అంశానికి సంబంధించి వార్తల్లోకెక్కాడు. కరుణ్‌ తనకు పునర్జన్మనిచ్చిన దేశవాలీ జట్టు విదర్భను వీడాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ కూడా పరోక్షంగా ధృవీకరించింది. అధికారిక లాంఛనాలు పూర్తి కావడమే తరువాయిగా తెలుస్తుంది. కరుణ్‌ తన సొంత రాష్ట్రమైన కర్ణాటకకు తిరిగి వెళ్తున్నాడని సమాచారం. కరుణ్‌ 2023-24 సీజన్‌కు ముందే కర్ణాటకను వదిలి విదర్భకు వలస వచ్చాడు. విదర్భకు మారడమే కరుణ్‌ కెరీర్‌ను మలుపు తప్పింది. ఎనిమిదేళ్లు స్వప్నించిన టీమిండియా రీఎంట్రీ కల సాకారమైంది. విదర్భకు ఆడిన రెండు సీజన్లలో కరుణ్‌ ఎన్నో అద్భుత ప్రదర్శనలు చేశాడు. ఇంకా చెప్పాలంటే కరుణ్‌ ప్రదర్శనల కారణంగా విదర్భ తమ చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాలను అందుకుంది. గత దేశవాలీ సీజన్‌లో (2024-25) కరుణ్‌ పరుగుల వరద పారించి (863 పరుగులు) విదర్భను రంజీ ఛాంపియన్‌గా నిలిపాడు. అదే భీకర ఫామ్‌ను విజయ్‌ హజారే ట్రోఫీలో (779 పరుగులు) కూడా కొనసాగించి విదర్భను రన్నరప్‌గా నిలబెట్టాడు. ఈ టోర్నీలో కరుణ్‌ విదర్భకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలోనూ కరుణ్‌ క్రియాశీలకంగా వ్యవహరించి విదర్భను క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేర్చాడు. కరుణ్‌ రెండు సీజన్లలోనే తన తలరాతను మార్చుకోవడంతో పాటు విదర్భ క్రికెట్‌ జట్టు స్థాయిని కూడా పెంచాడు. అయితే వ్యక్తిగత, కుటుంబ కారణాల చేత కరుణ్‌ తనకు పునర్జన్మనిచ్చిన విదర్భను వదిలి సొంత రాష్ట్రం కర్ణాటకకు తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ కూడా కరుణ్‌ను తిరిగి తమ దేశవాలీ జట్టులో చేర్చుకునేందుకు ఆసక్తి ప్రదర్శిస్తుంది.విదర్భకు మరో షాక్‌విదర్భకు మరో షాక్‌ కూడా తగలనున్నట్లు తెలుస్తుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న జితేశ్‌ శర్మ (ఆర్సీబీ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌) కూడా ఆ జట్టును వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. 31 ఏళ్ల జితేశ్‌ బరోడాకు మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం​. ఈ విషయాన్ని బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌ దాదాపుగా ధృవీకరించినట్లు తెలుస్తుంది. జితేశ్‌ మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉంటాడని బరోడా క్రికెట్‌ బోర్డుకు చెందిన కీలక వ్యక్తి ఒకరు చెప్పారు. జితేశ్‌ విదర్భకు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో కరుణ్‌ కెప్టెన్సీలో ఆడాడు. అయితే జితేశ్‌కు రంజీల్లో ఆడే అవకాశం రాలేదు.

Rasi Phalalu: Daily Horoscope On 20-06-2025 In Telugu6
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.నవమి ఉ.6.32 వరకు, తదుపరి దశమి తె.4.13 వరకు (తెల్లవారితే శనివారం), నక్షత్రం: రేవతి రా.7.16 వరకు, తదుపరి అశ్విని, వర్జ్యం: ఉ.8.00 నుండి 9.30 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.07 నుండి 8.59 వరకు, తదుపరి ప.12.26 నుండి 1.18 వరకు, అమృత ఘడియలు: సా.4.57 నుండి 6.28 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.32. మేషం....రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.వృషభం...ఆకస్మిక ధనప్రాప్తి. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి ఒప్పందాలు. సోదరులతో సఖ్యత. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.మిథునం....శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.కర్కాటకం...వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.సింహం......శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.కన్య.....బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విచిత్ర సంఘటనలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.తుల..శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.వృశ్చికం.పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం. దేవాలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ధనుస్సు...మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగవు.మకరం...దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.కుంభం...వ్యయప్రయాసలు. బంధువర్గంతో వైరం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.మీనం...ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

Palnadu: Yellow Media Conspiracy Exposed Over Pushpa Dialogue Poster7
ఇదేంది‘రప్పా’..! అడ్డంగా దొరికిపోయిన టీడీపీ

సాక్షి, నరసరావుపేట: అధికారపార్టీ అడ్డంగా బుక్కయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెంటపాళ్ల పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీ అభిమానులు ప్రదర్శించిన ఫ్లెక్సీలపై కూటమి నేతలు, వారి అనుకూల మీడియా రెండు రోజులుగా నానాయాగీ చేశారు. ‘‘సైకోలు వీరంగం చేశారు, నరకుడు భాష ఏంటి’’ అటూ పచ్చ పత్రికల్లో వార్తలు రాయడంతోపాటు టీవీ చానళ్లలో డిబేట్లు నిర్వహించారు.వైఎస్సార్‌సీపీ అభిమానులకు వ్యతిరేకంగా విష ప్రచారం చేశారు. కూటమి మంత్రులు, ప్రజాప్రతినిధులు గగ్గోలు పెట్టారు. పుష్ప సినిమాలోని రప్పా.. రప్పా.. పోస్టర్‌ ప్రదర్శించిన బొల్లెద్దు రవితేజపై టీడీపీ మైనార్టీ సెల్‌ సత్తెనపల్లి టౌన్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌ వలి చేత పోలీసులకు ఫిర్యాదు చేయించారు. పోలీసులూ తక్షణం కేసు నమోదు చేశారు. తీరా చూస్తే రవితేజ టీడీపీ వాడేనని తేలిపోయింది. దీంతో అధికారపార్టీ అడ్డంగా దొరికిపోయింది. బయటపడిన అసలు నిజాలు పోలీసులు పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం 88 తాళ్లూరు గ్రామానికి చెందిన బొల్లెద్దు రవితేజను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. రవితేజ కుటుంబ సభ్యులు తాము టీడీపీ అభిమానులమని తమకు వైఎస్సార్‌సీపీతో సంబంధం లేదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ చేతుల మీదుగా పచ్చ కండువా కప్పుకుని టీడీపీలో చేరామని ఫొటోలు చూపారు. బొల్లెద్దు రవితేజపై ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డు రవితేజ పేరు మీద ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డునూ వారే బయటపెట్టారు. దీంతో టీడీపీ నేతలు, సోషల్‌మీడియా కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. టీడీపీ సభ్యత్వం ఉండి వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నాడని, ఏ ఉద్దేశంతో హాజరయ్యాడు? రవితేజ వెనుక ఎవరున్నారంటూ సోషల్‌మీడియాలో వైఎస్సార్‌సీపీ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. రవితేజ టీడీపీ కోవర్టేనని, వైఎస్‌ జగన్‌ పర్యటనలో ఆలజడులు సృష్టించడానికే టీడీపీ నేతలు అతనిని పంపి కుట్రలు పన్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. టీడీపీ నేతల కొత్త రాగం వైఎస్సార్‌సీపీ అభిమానులపై టీడీపీ చేసిన దు్రష్పచారం బూమరాంగ్‌ కావడంతో ఆ పార్టీ నేతలు కొత్త రాగం మొదలుపెట్టారు. రవితేజ తల్లిదండ్రులు టీడీపీ వారేనని, కానీ రవితేజ మాత్రం వైఎస్సార్‌సీపీ అభిమాని అంటూ బుకాయిస్తున్నారు. బీమా ఉందని టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడంటూ పెదకూరపాడు నేతలతో వీడియోలు విడుదల చేయించారు. దీనికి సోషల్‌ మీడియా యాక్టివిస్టులు గట్టి సమాధానాలు ఇచ్చారు. కోట్ల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారంటూ మహానాడులో చేసే ప్రసంగాలన్నీ వట్టివేనా అంటూ ప్రశి్నంచారు. జీవిత బీమా ఉంటుందని ఆశచూపి ఇతర పార్టీల నేతలకూ సభ్యత్వాలు అంటగడుతూ గొప్పలు చెప్పుకుంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు.

YSRCP President YS Jagan Fires On Chandrababu Govt in Media Meet8
బాండ్లు చూపి బాబును నిలదీయండి: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘ఎన్నికల్లో సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ అంటూ చంద్ర­బాబు చేసిన వాగ్దానాలను కనీసం రిబ్బన్‌ కూడా కత్తిరించకుండానే.. మొత్తం హామీలు అమలు చేసేశానని చెబుతున్నాడు. అబ్రకదబ్ర.. ఛూమంతర్‌ అంటూ.. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ సహా 143 హామీలు అమలు చేసేశానని ఊదరగొడుతున్నాడు’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌పై ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందం అంటూ ముందే బెదిరిస్తున్నాడంటూ ఎత్తి చూపారు. ఎల్లో మీడియా, సోషల్‌ మీడియా కూడా చంద్రబాబు చెబుతున్న పచ్చి అబద్ధాలను.. నిజాలుగా నమ్మించేలా ప్రచారం చేస్తున్నా­యని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇన్ని అబద్ధాలు చెప్పి, మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏడాదిగా తాను ఏం చేశానన్నది చెప్పేందుకు ఇంటింటికీ తన ఎమ్మెల్యేలు, నాయకులను పంపుతానంటున్నాడని దుయ్యబ­ట్టారు. ‘ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను, బాబు ష్యూరిటీ–­భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ నాయకులు ఎన్నికలకు ముందు మీకు ఇచ్చిన బాండ్లను దగ్గర పెట్టుకోండి. వాటిని చూపి ప్రభు­త్వం మీకు ఎంత బాకీ ఉందో వడ్డీతో సహా చెల్లించాలని నిలదీయండి’ అని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యా­లయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రీకాలింగ్‌ ఆఫ్‌ చంద్రబాబు మేనిఫెస్టో..’ అంటే చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చు­కుందాం’ అంటూ వైఎస్సార్‌సీపీ దాన్ని మీకు అందుబాటులోకి తెస్తుందని.. దాని కోసం మీరు క్యూఆర్‌ కోడ్‌ వినియోగిస్తే చాలు డౌన్‌లోడ్‌ అవుతుందని ప్రజలకు సూచించారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ సహా అన్ని హామీలు 2024 జూన్‌ నుంచి అమలు అవుతాయని.. మీ ఖాతాలో డబ్బులు జమ అవుతుందని చంద్రబాబు త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి చెబుతూ మీకు ఇచ్చిన బాండ్లను.. మీ ఇంటికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాగానే చూపి.. అవి తమకు ఎప్పుడిస్తారని నిలదీయాలని ప్రజలకు పిలుపు­నిచ్చారు. అప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని హామీలను అమలు చేస్తుందేమో చూద్దామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే.. మీ తరఫున మీతో కలిసి పోరాడటానికి వైఎస్సార్‌సీపీ, తాను సిద్ధమని స్పష్టం చేశారు. హామీలు అమలు చేయాలంటూ కలెక్టరేట్‌లను ముట్టడించే కార్యక్రమానికి ప్రణాళిక రచిద్దామని ప్రజలను చైతన్య పరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..జగన్‌ కంటే ఎక్కువ ఇస్తానని మోసం చేస్తావా?⇒ చంద్రబాబు ఎన్నికలకు ముందు జగన్‌ చేస్తున్నవే కాకుండా అంత కంటే ఎక్కువ చేస్తామన్నారు. ‘మీకు ఒక్కటే హామీ ఇస్తున్నా. జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏవీ ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నాను’ అంటూ 2024 ఏప్రిల్‌ 11న చంద్రబాబు హామీ ఇచ్చారు (చంద్రబాబు మాట్లాడిన వీడియోను ప్రదర్శించి చూపారు). ఇప్పుడు వాటన్నింటినీ అమలు చేసేశానని చెబుతున్నాడు. ⇒ నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు నిరుద్యోగ భృతిగా ఇస్తామన్నారు. ఎంత మందికి ఇచ్చారు? రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1.56 కోట్ల మంది ఉన్నారని టీడీపీ అఫీషియల్‌ గెజిట్‌ ‘ఈనాడు’లో 2025 ఏప్రిల్‌ 17న కథనాన్ని ప్రచురించారు. కోటిన్నరకు పైగా ఉపాధి లేని యువత ఉంటే.. వారికి ఒక్కపైసా కూడా ఇవ్వకుండా అన్నీ చేసేశానని చెప్పడం మోసం కాదా? ⇒ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18వేలు ఇస్తామని ఎగ్గొట్టలేదా? దీపం, ఉచిత బస్సు అనేవి చిన్న పనులు. కేంద్ర గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1.59 లక్షల మందికి గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీళ్లందరికీ ఉచిత గ్యాస్‌ ఇవ్వాలి అంటే సిలిండర్‌కు రూ.877 చొప్పున మూడు సిలిండర్లకు రూ.4,109 కోట్లు ఖర్చు అవుతుంది. తొలి ఏడాది బడ్జెట్‌ కేటాయింపు రూ.865 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.3,244 కోట్లు ఇవ్వకుండా మోసం చేయలేదా? అక్కడా మళ్లీ మోసమే.. కనీసం ఒక్క సిలిండర్‌కైనా పూర్తిగా ఇవ్వాలంటే రూ.1,370 కోట్లు అవుతుంది. అలాంటిది రూ.865 కోట్లే ఇచ్చారు. ఒక్క సిలిండర్‌ను కూడా సరిగా ఇవ్వలేదు. దీపం పథకం బోగస్‌! ⇒ మహిళలకు ఉచిత బస్సు అన్నింటికంటే చాలా సులభం. నెలకు రూ.275 కోట్లు ఆర్టీసీ వాళ్లకు ఇస్తే ఏడాదికి రూ.3 వేల కోట్లతో పథకం అమలవుతుంది. మా కడపలో మహిళలు విశాఖపట్నం వెళ్లి చూసి రావొచ్చని ఉచిత బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. పండుగ పేర్లు మారిపోతున్నాయి తప్ప బస్సు రావట్లేదు. గతేడాది ఉగాది నుంచి ఈ ఏడాది ఉగాది వరకు పండుగలు వెళ్లిపోతే.. ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడు. ఉచిత బస్సు అమలుకు అధ్యయనంతో పనేముంది? ఆర్టీసీకి డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా? అప్పుడు కడప వాళ్లు విశాఖ వెళ్తారు.. అనంతపురం వాళ్లు అమరావతి చూసుకోవడానికి విజయవాడకు వస్తారు. దుర్గమ్మ దర్శనం చేసు­కుని వెళ్తారు. ఇంకేమైనా పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ఇటు రాయల­సీమ వాళ్లు, అటు ఉత్తరాంధ్ర వాళ్లు కొంచెం సేద తీరుతారు. ⇒ 50 ఏళ్లకే పెన్షన్‌ అన్నారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు 20 లక్షల మంది ఉన్నారు. నెలకు రూ.4 వేలు చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు అవుతుంది. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది కూడా ఎగరగొడుతున్నారు. కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్నవి పీకేశారు. చంద్రబాబు ఎన్నికలకు వెళ్లే నాటికి మార్చిలో 66,34,742 పింఛన్లు ఉంటే.. ఈ నెలలో ఇచ్చింది 61.48 లక్షల మందికి మాత్రమే. సంవత్సరం తిరిగే లోగా 5 లక్షల పింఛన్లు తగ్గించేశారు. వీటికి అదనంగా 50 ఏళ్లు నిండిన వాళ్లకు పింఛన్లు ఇస్తామని ఎన్నికల్లో చెప్పి మహిళలను మోసం చేశారు.⇒ ప్రధాన మంత్రి పీఎం కిసాన్‌ పథకంతో సంబంధం లేకుండా ఒక్కో రైతుకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. మడమ తిప్పను.. మాట తప్పను అన్నావు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు ఇస్తుంది కాబట్టి నేను రూ.6,500 ఇస్తానని చెప్పావు. ఇది ఆ రోజు ఎందుకు చెప్పలేదు? మేము సంవత్సరానికి ఇప్పుడిచ్చేది కాకుండా రూ.20 వేలు ఇచ్చేలా తెలుగుదేశం పార్టీలో నిర్ణయం చేశామని చంద్రబాబు చెప్పాడు. (చంద్ర­బాబు మాట్లాడిన ప్రసంగం వీడియోను ప్రదర్శించారు). కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.20 వేలు ఇస్తానని ఊదరగొట్టి ఏడాదిలో ఒక్కపైసా ఇవ్వలేదు. రాష్ట్రంలో 53,58,666 మంది రైతులకు రూ.20 వేలు చొప్పున ఇస్తే రూ.10,716 కోట్లు మేలు జరిగేది. ⇒ తల్లికి వందనం పేరిట తల్లులను వంచన చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామన్నాడు. ఈ పథకానికి ఎలాంటి షరతులు పెట్టబోమని ఎన్నికల్లో పదేపదే చెప్పారు. ‘ఎంత మంది పిల్లలున్నా ఒక్కొక్కరికీ రూ.15 వేలు.. ఆంక్షలు లేవు.. కటింగ్‌ లేదు.. పూర్తిగా ఇచ్చే బాధ్యత మాది అన్నారు (చంద్రబాబు ఈ మేరకు మాట్లాడిన వీడియో ప్రదర్శించారు). కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌ యూడైస్‌ డేటా ప్రకారం రాష్ట్రంలో 2023–24లో 87,41,885 మంది విద్యార్థులు ఉన్నారు. మరి 87.41 లక్షల మంది పిల్లలకు రూ.15 వేల చొప్పున రూ.13,111 కోట్లు ఇవ్వాలి. ఇస్తామంటోంది కేవలం రూ.8,700 కోట్లు. అది కూడా చివరికి వచ్చే సరికి ఏ మేరకు ఇస్తారో చూడాలి. అందరికీ ఇచ్చిన తర్వాత గాని తెలియదు ఎంత మందికి ఇచ్చారో.. ఎంత మందికి ఎగనామం పెట్టారో. ఈ లెక్కలు చూసినా 30 లక్షల మందికి కోత పెట్టారు. మేము గట్టిగా నిలదీస్తే రూ.15 వేలు కాదు రూ.13 వేలే ఇచ్చేది.. అందులో 67 లక్షల మందికి ఇస్తున్నామని ప్లేటు ఫిరాయించారు. మళ్లీ 67 లక్షల్లో ప్రస్తుతానికి 54 లక్షల మందికే ఇస్తున్నామంటున్నాడు. ఎన్నికలప్పుడు చెప్పిన నీకు రూ.15 వేలు..నీకు రూ.15 వేలు..నీకు రూ.15 వేలు పోయింది. ఇప్పుడు కొందరికి మాత్రమే రూ.13 వేలు అని తేలింది. ఇది మోసం కాదా చంద్రబాబూ? ప్రశ్నిస్తే నాలుక మందమంటావా?రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం 18 ఏళ్లు నిండిన 2,10,58,615 మంది మహిళలు ఉన్నారు. వీళ్ల అడ్రస్‌లతో సహా వివరాలు ఎన్నికల సంఘం దగ్గర ఉన్నాయి. ఇందులో 60 ఏళ్లు నిండిన వాళ్లను తీసేస్తే.. 1.80 కోట్ల మంది మహిళలు ఉంటారు. వీళ్లందరిలో ఎంత మందికి ఏడాదికి రూ.18 వేలు చొప్పున ఇచ్చారు? తొలి ఏడాది ఎగ్గొట్టాక.. ఇప్పుడు పీృ4 జపం చేస్తున్నాడు. నువ్వు ఇవ్వాల్సింది పోయి ఎవరో శ్రీమంతులతో ఒకరికో ఇద్దరికో ఇప్పిస్తానని డ్రామాలు చేయడానికి సిగ్గులేదా?ఇన్నిన్ని అబద్ధాలు, మోసాలు చేస్తున్న ఈ పెద్దమనిషి ఇప్పుడు ప్రతి ఇంటికీ తన ఎమ్మెల్యేలను, తన పార్టీకి సంబంధించిన నాయకులను పంపిస్తాడట. అప్పుడు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను, చంద్రబాబు ఇచ్చిన బాండ్లను అందరూ దగ్గర పెట్టుకుని చూపించండి. ఆ మేనిఫెస్టో ప్రకారం ఏడాదిగా మీకు రావాల్సిన సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని గట్టిగా డిమాండ్‌ చేస్తూ నిలదీయండి. మీ వద్ద ఆ మేనిఫెస్టో లేకపోతే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకునేలా వైఎస్సార్‌సీపీ త్వరలో రిలీజ్‌ చేస్తుంది. దాన్ని దగ్గర పెట్టుకుని మీకు ఏమేం రావాలో చెబుతూ ప్రశ్నించండి. కనీసం వారికి అప్పుడైనా సిగ్గు వచ్చి అమలు చేస్తారేమో చూద్దాం. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను చూపించి ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం గురించి వివరిస్తున్న వైఎస్‌ జగన్‌ ఉన్న పథకాలను భ్రష్టు పట్టించారు⇒ ఒకవైపున ఉన్న పథకాన్ని భ్రష్టు పట్టించారు. అప్పట్లో ప్రతి తల్లికి అమ్మ ఒడి పేరుతో సాయం అందించి, పిల్లలను బడులకు పంపించేలా ప్రోత్స­హించాం. 43 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి ఇచ్చి 83–84 లక్షల మంది పిల్లలను బడుల బాట పట్టించాం. ఇప్పుడు నిబద్ధత లేకుండా మోటివేషన్‌ కార్యక్రమాలను భ్రష్టు పట్టిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ విద్యా రంగాన్ని దెబ్బ తీసి, మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంస్కరణలు నాశనం చేశాడు. ⇒ మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఇంగ్లిష్‌ మీడియం బడులు, 3వ తరగతి నుంచి టోఫెల్‌ చెప్పే పీరి­యడ్లు పోయాయి. సబ్జెక్టు టీచర్‌ విధానం, రోజు­కొక రుచికరమైన మెనూ, చిక్కీతో సహా ఇచ్చే గోరు­ముద్ద పోయింది. నాడు–నేడు పనులు ఆగి­పోయాయి. ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్సీ, అక్కడి నుంచి ఐబీ వరకు ప్రయాణం నిలిచిపోయింది. పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించేవి. ఇప్పడు అవీ లేవు. తొలిసారిగా మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బడులు ప్రైవేటు బడుల కంటే మెరు­గైన­విగా నిలిచాయి. స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు కని­పించేవి. ఇప్పడు విద్యా రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించా­రు. చివరికి పదో తరగతి పరీక్షల పేపర్లు సక్ర­మంగా దిద్దలేని అధ్వాన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. ⇒ మా ప్రభుత్వ హయాంలో పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చే వాళ్లం. ప్రతి ఏప్రిల్‌లో వసతి దీవెన అందించేవాళ్లం. ఇదంతా క్రమం తప్పకుండా జరిగేది. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ఈ జూన్‌ దాటితే ఆరు త్రైమాసికాలు బకాయిలు పెట్టారు. ఎన్నికల కోడ్‌తో పెండింగ్‌ పడినప్పటి నుంచి ఆరు త్రైమాసికాలు రూ.4,200 కోట్లు, ఏప్రిల్‌ (2024)లో ఇవ్వాల్సిన వసతి దీవెన రూ.1100 కోట్లు, ఈ ఏడాదికి మరో రూ.1,100 కోట్లు మొత్తం రూ.2,200 కోట్లు వెరసి రూ.6,400 కోట్లు చెల్లించాల్సి ఉంటే.. ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు మాత్రమే. ⇒ ఆరోగ్యశ్రీలో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాం. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్‌ను వెయ్యి నుంచి 3,300కు పెంచి పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని, మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని దరి చేర్చాం. మధ్య తరగతి ప్రజలు అప్పుల పాలవ్వాల్సిన పరిస్థితి లేకుండా వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేశాం. నెలకు ఆరోగ్యశ్రీ కింద రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే, చంద్రబాబు వచ్చిన ఏడాదిలో రూ.3,600 కోట్లు పెండింగ్‌ పెట్టేశారు. ఆరోగ్య ఆసరా కింద పేషెంట్‌ ఆపరేషన్‌ అనంతరం విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు ఇచ్చే వాళ్లం. దీనికి మరో రూ.400 కోట్లు అవుతుంది. ఇలా.. చంద్రబాబు ఏడాదిలో రూ.4 వేల కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వైద్యం చేయలేక చేతులు ఎత్తేశాయి. ఇప్పుడు పేదలు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి లేదు. ఇవన్నీ ఇవ్వకుండానే చంద్రబాబు.. అబ్రక దబ్రా అంటూ మాయ చేస్తున్నాడు. గట్టిగా అడిగితే నాలుక మందం అంటూ బెదిరిస్తున్నాడు. ⇒ రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా, సీజన్‌ ముగిసే­లోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఆర్బీకేల ద్వారా పంటల కొను­గోలు, గిట్టుబాటు ధర.. ఇలా అన్నీ రద్ద­య్యాయి. వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయి­పోయిన పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.బాబు బాదుడే బాదుడుచంద్రబాబు నిజంగా కొన్ని చేశారు. ఏడాదిలో రూ.15 వేల కోట్లు కరెంటు చార్జీలు బాదాడు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను చంపేసి తద్వారా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు పెంచి పేదలను బాదేశాడు. అన్ని పన్నులు పెంచడంతో ఇంటి అద్దెల బాదుడు.. హెరిటేజ్‌ కోసం అమూల్‌ను చంపేసి పాలరేట్ల బాదుడు.. ఇంటింటికీ రేషన్‌ అందించే వాహనాలు తీసేసి.. సబ్సిడీకే కందిపప్పు ఇచ్చే కార్యక్రమం మానేశాడు. ఫలితంగా పప్పుల ధరలు పెరగడంతో.. రకరకాలుగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మొదలెట్టాడు. చంద్రబాబు దెబ్బకు పంటలకు ధరలు లేక రైతులు అల్లాడిపోతుంటే.. నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం పెరిగి ప్రజలు కిందాపైనా పడుతున్నారు. ఏడాదిలో కొత్త ఉద్యోగాలు ఇవ్వడం దేవుడెరుగు.. ఏకంగా 3 లక్షలకుపైగా ఉద్యోగాలు తీసేశాడు. 2.60 లక్షల మంది వలంటీర్లు, 20 వేల మంది రేషన్‌ వాహనాల ఆపరేటర్లు, హెల్పర్ల ఉద్యోగాలు హుష్‌ కాకి! బెవరేజస్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్న 15 వేల మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఉద్యోగాలు పోయాయి.ఉద్యోగులకు రూ.20 వేల కోట్ల బకాయిప్రభుత్వ ఉద్యోగ­స్తు­లకు మేలు జరిగిందా అంటే అదీ లేదు. వస్తూనే ఐఆర్‌ ఇస్తాన­న్నాడు. అదీ పాయే. ఉన్న పీఆర్సీ­ని రద్దు చేశాడు. కొత్త పీఆర్సీ వేయలేదు. కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెంచాల్సి వస్తుందని సాగదీస్తూ వస్తున్నాడు. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్‌ పెట్టాడు. జూలై 1వ తేదీ వస్తే నాల్గో డీఏ పెండింగ్‌. వైఎస్సార్‌సీపీ హయాంలో తీసుకొచ్చిన గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను తీసేసి ఓపీఎస్‌ తీసుకొస్తా అన్నాడు. ఆ విషయంలోనూ వెన్నుపోటు పొడిచాడు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలే రూ.20 వేల కోట్లకు పైగా ఉన్నాయి. ఎవరైనా అడిగితే తోకలు కత్తిరిస్తా.. భూ స్థాపితం చేస్తా అంటున్నాడు. ప్రజలకు తానిచ్చిన వాగ్దానాలను ఎగవేయడానికి మాత్రం ఆయన, ఆయన ఎల్లో మీడియా రకరకాల స్కెచ్‌లు వేస్తున్నారు.ఇలా ఇంటింటా మోసం..మెహరాజ్‌ బేగం షేక్‌ అని ముస్లిం మహిళ. ఈమెకు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ అని యూనిక్‌ ఐడీ కోడ్‌ ఇచ్చారు. మీ సంక్షేమ వివరాల కోసం అంటూ ఓ వెబ్‌ సైట్‌ లింక్‌ ఇచ్చి ధన్యవాదములతో టీడీపీ అని రాశారు. ఆమె ఐడీ కోడ్, వయసు, కులం, వృత్తి, మొత్తం కుటుంబ సభ్యులు 5, 18 సంవత్సరాల లోపు వయసు పిల్లలు ఇద్దరు, 18 సంవత్సరాల కంటే పైబడి వయసున్న మహిళలు ఇద్దరు, నిరుద్యోగ యువతీ యువకులు సున్నా, నియోజకవర్గం రాజంపేట, కింది స్కీములు వర్తిస్తాయని రాశారు. ఆడబిడ్డ నిధి రూ.1500 చొప్పున ఇద్దరికి ఏడాదికి అందే సాయం రూ.36 వేలు, తల్లికి వందనం కింద ఇద్దరికి రూ.30 వేలు,.. మొత్తంగా ఏడాదిలో మీకు రూ.66 వేలు, ఐదేళ్లలో అందే మొత్తం రూ.3.3 లక్షలు అని స్పష్టంగా చూపించారు. ఇంకా మహాశక్తి దీపం పథకం కింద 3 ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం జూన్‌ 2024 నుంచి ప్రారంభం అని రాశారు. మీ మద్దతు తెలపడానికి మిస్డ్‌ కాల్‌ ఇవ్వండి అని రాశారు. మిస్డ్‌ కాల్‌ ఇప్పించి ఓటీపీ పంపించారు. ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ.. బెనిఫిట్‌ డీటెయిల్స్‌.. అభినందనలు... రూ.3 లక్షల 30 వేలు పొందేందుకు.. మీ కుటుంబం అర్హత పొందింది’ అని మెసేజ్‌ పెట్టారు. 2024 జూన్‌ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అవుతుంది అని కూడా రాశారు. చంద్రబాబు నాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానని ఏకంగా బాండ్‌ ఇచ్చాడు. ఇలా రాష్ట్రంలో ఇంటింటా చేశారు. అందుకే ఏడాది కాలంగా మీకు ఎంత బాకీ ఉన్నారో వడ్డీతో కలిపి ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు మీ ఇంటికి వచ్చినప్పుడు.. ఇదిగో బాండు.. ఇదిగో ఎస్‌ఎంఎస్‌ అని చూపి డిమాండ్‌ చేయండి. ఏడాది అయింది.. మా అవసరాలు చాలా ఉన్నాయి.. ఇబ్బందులు పడుతున్నాము.. మా బాకీ ఎప్పుడిస్తావని గట్టిగా నిలదీయండి. అప్పుడైనా ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చి మనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తారని ఆశిద్దాం. ఒకవేళ ఇవ్వకపోతే మీ తరఫున పోరాటం చేసేదానికి నేను రెడీగా ఉన్నాను. అందరం కలిసి మళ్లీ ధర్నా చేద్దాం.. మళ్లీ కలెక్టరేట్లను ముట్టడించే కార్యక్రమం చేద్దాం. సంపద సృష్టి కాదు.. ఆవిరిసాక్ష్యాధారాలతో కడిగిపారేసిన వైఎస్‌ జగన్‌ఆవిరయ్యే సంపదంతా చంద్రబాబు అండ్‌ కో జేబుల్లోకిమా హయాంలో జీఎస్‌డీపీలో అప్పుల శాతం 4.08% చంద్రబాబు పాలనలో ఏడాదిలోనే అది ఏకంగా 5.12% వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో రూ.3,32,671 కోట్ల అప్పుబాబు ఏడాది పాలనలోనే రూ.1,61,301 కోట్ల అప్పుఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎగవేయడానికి చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా రకరకాల స్కెచ్‌లు వేస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు సంపద సృష్టిస్తానన్నాడు. ఆయన కళ్లెదుటే సంపద ఆవిరి అవుతోంది. ఆ సంపద చంద్రబాబు జేబులోకి, ఆయనకు సంబంధించిన వారి జేబుల్లోకి పోతోంది’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సంపద పెరగకపోగా.. ఆదాయంతోసహా అన్నీ తగ్గుతు­న్నా­యంటూ కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) నివేదికలను ఎత్తిచూపుతూ చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర జీఎస్‌డీపీలో మా హయాంలో అప్పుల శాతం 4.08% అయితే.. చంద్రబాబు ఏడాది పాలన కాలంలో అది ఏకంగా 5.12 శాతానికి చేరుకుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు చూస్తే, మా హయాంలో అది 2.65 శాతం అయితే (అప్పుడు రెండేళ్లు కోవిడ్‌ ఉంది), ఇప్పుడు ఏకంగా 3.61 శాతా­నికి పెరిగింది’ అని చెప్పారు. ‘రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా ఏడాది కాలంలోనే దారుణంగా అప్పులు చేశారు. మా హయాంలో ఐదేళ్లలో అన్నీ కలిపి రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే.. చంద్రబాబు ఈ ఒక్క ఏడాదిలోనే చేసిన మొత్తం అప్పులు రూ.1,61,301 కోట్లు. అంటే మా ఐదేళ్ల హయాంతో పోలిస్తే ఏకంగా 48.5% అప్పు చేశాడు’ అని వివరించారు. జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే..చంద్రబాబు గజదొంగల ముఠా దోచుకుంటోందిరాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఖజానాకు రాకుండా చంద్రబాబు, ఆయనకు చెందిన గజ దొంగల ముఠా పంచుకుంటోంది. 2024 ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర సొంత ఆదాయం(ట్యాక్స్, నాన్‌ ట్యాక్స్‌) రూ.14,644 కోట్లు ఉంటే.. 2025 ఏప్రిల్, మే నెలల్లో అది రూ.14,580 కోట్లుగా ఉంది. నిజానికి ఈ ఏడాది 10–12 శాతం పెరగాల్సిందిపోయి.. 0.44 శాతం తగ్గింది. 2024–25లో కూటమి ప్రభుత్వ సొంత ఆదాయం రూ.96,227 కోట్లు కాగా, 2023–24లో రూ.93,354 కోట్లు. అంటే ఆదాయాల వృద్ధి కేవలం 3.08 శాతం మాత్రమే. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఆ పెరుగుదల ఏకంగా 12.04 శాతం ఉంది. దీంతో పోలిస్తే.. సంపద సృష్టించడం తనకు తెలుసని చెప్పే చంద్రబాబు సాధించింది అత్యల్పం. ఇదీ చంద్రబాబు గారి పనితీరు. దీని అర్థం ఏంటయ్యా చంద్రబాబూ?ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు చెప్పే అబద్ధాలు. తానెప్పుడూ ఏ ప్రభుత్వ ఆస్తినీ తాకట్టు పెట్టలేదని ఈ మధ్య చాలా గట్టిగా, గంభీరంగా చెప్పాడు (వీడియో ప్రదర్శించారు). ఏపీఎండీసీ జీవో నంబర్‌ 69 ద్వారా ఏపీఎండీసీకి సంబంధించిన 436 మైన్స్‌ ప్రాజెక్టులను తాకట్టు పెడుతూ, వాటి విలువ రూ.1.91 లక్షల కోట్లుగా చూపిస్తూ ఏప్రిల్‌ 24న పర్మిషన్‌ ఇచ్చాడు. దీని అర్థం ఏంటయ్యా చంద్రబాబూ? ఏపీఎండీసీ ఇష్యూ చేసిన బాండ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ మీద అజమాయిషీని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నాడు. ఎస్డీఎల్‌ (స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్లు. సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఎఫ్‌ఆర్బీఎం లిమిట్స్‌ కింద ఆర్బీఐ ఇస్తుంది) కోసం ప్రతి వారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వద్దకు పోతుంది. ఆ లిమిట్స్‌ మీద అజమాయిషీని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన దాని కన్నా ఇంకా ఎక్కువ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అమ్మేస్తున్నాడు.

Sakshi Guest Column On Indira Gandhi National Emergency9
యాభై ఏళ్ల చీకటి గాయం

ఏదైనా చారిత్రక పరిణామం మీద సరైన అంచనాకు రావడానికి యాభై ఏళ్ల కాలం విశేషంగా దోహదం చేయగలదు. చరిత్రను పునర్లిలిఖించుకునే బాధ్యత ప్రతి తరం మీద ఉందన్న వాస్తవాన్ని గుర్తిస్తే, 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలాన్నీ, దాని ఫలితాలనూ అర్థం చేసుకోవడానికి ఇది సరైన సమయమే. ఎమర్జెన్సీ విధించిన వారు దేశానికి స్వాతంత్య్రం తెచ్చామని చెప్పే పార్టీ వారు కావచ్చు. అయినా చరిత్ర తీర్పు ముందు అంతా సమానమే. ఎమర్జెన్సీ దేశంలో ‘క్రమశిక్షణ’ తెచ్చిందా? లేక చీకటి యుగంలోకి నెట్టిందా? ప్రేరేపించిన కారణాలేమిటి?1975 జూన్‌ 25 అర్ధరాత్రి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, కేంద్ర మంత్రిమండలి సిఫారసుతో రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహమ్మద్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 352లోని 1వ నిబంధన ఆ అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చింది. ఆంతరంగిక భద్రతకు తీవ్ర విఘాతం వాటిల్లితే రాష్ట్రపతి ఈ అసాధారణ చర్య తీసుకుంటారు.ఎమర్జెన్సీ విధించిన సమయానికి దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అవి రాజ్యాంగం నిర్దేశించినట్టు ఉన్నాయా? 1974 జన వరి నుంచి చూసినా ఆ పరిస్థితులు కానరావు. కొంచెం గట్టిగా కనిపించే పరిణామం లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌(జేపీ) సంపూర్ణ విప్లవం మాత్రమే. మెస్‌చార్జీలు తగ్గించాలన్న డిమాండ్‌తో మొదలై, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న స్థాయికి వెళ్లిన గుజరాత్‌ విద్యార్థి ఆందోళన ఉంది. 1975 జనవరిలో సమస్తిపూర్‌(బిహార్‌)లో రైల్వే మంత్రి ఎల్‌ఎన్‌ మిశ్రా సభలో బాంబు పేలి, ఆయన చని పోయారు. దీనిని జేపీ ఉద్యమంతో ముడిపెట్టలేక పోయారు.సంపూర్ణ విప్లవానికి మద్దతుగా పార్లమెంటుకు జనతా మార్చ్‌ నిర్వ హించాలని విపక్షాలన్నీ (సీపీఐ మినహా) నిర్ణయించాయి. ఈ మధ్యలో జరిగిన మరొక అనూహ్య పరిణామం, రాయ్‌బరేలీ ఎన్నిక పిటిషన్‌పై మార్చి 18న అలహాబాద్‌ హైకోర్టు బోనులో ఇందిర నిలబడటం. గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని మొరార్జీ దేశాయ్‌ ప్రారంభించిన నిరాహార దీక్షను ఏప్రిల్‌ 13న విరమించారు. ఎన్నికలు జరిపించడానికి ఇందిర సుముఖత వ్యక్తం చేశారు.అయినా స్వతంత్ర భారత చరిత్రను మలుపు తిప్పిన అత్యవసర పరిస్థితి వంటి తీవ్ర నిర్ణయం ఇందిర ఎందుకు తీసుకున్నారు? రెండు తక్షణ కారణాలు. 1971 నాటి సాధారణ ఎన్నికలలో రాయ్‌బరేలీ నియోజక వర్గం నుంచి ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జగ్‌మోహన్‌ లాల్‌సిన్హా 1975 జూన్‌ 12న తీర్పు ఇవ్వడం. ఇందిరపై పోటీ చేసి ఓడిన సోషలిస్ట్‌ నాయకుడు రాజ్‌ నారాయణ్‌ ఈ కేసు వేశారు. అదే రోజు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్ని కలలో ప్రజా తీర్పు వచ్చింది. కాంగ్రెస్‌ ఓడి, జన మోర్చా గెలిచింది. రెండోది: అలహాబాద్‌ హైకోర్టు తీర్పు మీద శాశ్వత స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళితే జస్టిస్‌ వీఆర్‌ కృష్ణయ్యర్‌ 1975 జూన్‌ 25న షరతులతో కూడిన స్టే మాత్రమే ఇచ్చి, ఇందిరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సభలో ఓటు హక్కు లేకుండా చేయడం. న్యాయ వ్యవస్థ చేసిన ఈ రెండు నిర్ణయాలు, గుజరాత్‌ ప్రజాతీర్పు ఆమెను ఇరకాటంలోకి నెట్టాయి. కాంగ్రెసేతర పక్షాలు ఇందిర పదవిలో కొనసాగడానికి అనర్హులని ప్రకటిస్తూ ఆ సాయంత్రం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సభ నిర్వహించి కొత్త ఉద్యమం కోసం లోక్‌సంఘర్ష సమితిని ప్రకటించాయి. ఆ అర్ధరాత్రి రాష్ట్ర పతి ఎమర్జెన్సీ ప్రకటనపై సంతకం చేశారు. మరునాడు ఉదయం ఆరు గంటలకు ఇందిర నివాసంలో జరిగిన సమావేశంలో మంత్రి మండలి ఎమర్జెన్సీ ప్రతిపాదనను లాంఛనంగా ఆమోదించింది. ఎమర్జెన్సీ విధించిన సంగతి అప్పటి కేంద్ర హోంమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి రాష్ట్రపతి సంతకం పడిన తరువాత తెలిసింది.ప్రతిపక్షం అవసరం లేదా?ఇందిర భారత పాలనా వ్యవస్థకు కొత్త రూపం ఇవ్వాలను కున్నారు. దేశాభివృద్ధి అధ్యక్ష తరహా పాలనలోనే సాధ్యమన్న ఒక వాదాన్ని అప్పటికే ప్రచారంలో పెట్టారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవ్‌కాంత్‌ బారువా ‘ఇందిరే ఇండియా, ఇండియా అంటే ఇందిర’ అన్నారు. మరొక నినాదం కూడా ఇచ్చారు. ‘వర్తమాన పరిస్థితులలో భారత దేశానికి అసలు ప్రతిపక్షమే అవసరం లేదు’ అని! నాటి హరి యాణా ముఖ్యమంత్రి ఇందిరను జీవితకాలపు అధ్యక్షురాలిగా (పార్టీకి), తద్వారా యావజ్జీవితం దేశ ప్రధానిగా చూడాలని కోరుకున్నారు.ప్రచ్ఛన్న యుద్ధ నేపథ్యం కూడా ఇందిర చర్యకు ప్రాతిపదిక ఇచ్చాయి. ‘సోవియెట్‌ నాయకుల సలహాతో దేశంలో అత్యవసర పరి స్థితి విధించినట్లు అర్థమైంది. సోవియెట్‌లో అసంతృప్తి వ్యక్తం చేసిన వారిని సైబీరియాకు పంపిస్తారు. ఇక్కడా ప్రతిపక్షాల వారిని అదే విధంగా జైళ్ల పాలు చేశారు.’ మాజీ గవర్నర్, పంజాబ్‌ మాజీ ముఖ్య మంత్రి సుర్జీత్‌ సింగ్‌ బర్నాలా రాసిన ‘క్వెస్ట్‌ ఫర్‌ ఫ్రీడమ్‌: స్టోరీ ఆఫ్‌ ఏన్‌ ఎస్కేప్‌’ గ్రంథంలోని వాక్యాలివి. బర్నాలా ఎమర్జెన్సీ బాధితుడే. ‘చిలీ పాలకుడు సాల్వెడార్‌ అలెండి తరువాత నిన్నే అమెరికా లక్ష్యంగా చేసుకుంది’ అంటూ క్యూబా అధ్యక్షుడు ఫిడెల్‌ క్యాస్ట్రో చేసిన హెచ్చరికతోనే ఇందిరాగాంధీ ఆగమేఘాల మీద అత్యవసర పరిస్థి తిని విధించారన్న వాదన గురించి సంజయ బారు ప్రస్తావించారు. 1975 జూన్‌ 25 అర్ధరాత్రి రెండు, మూడు గంటల మధ్య జయ ప్రకాశ్‌ నారాయణ్‌ను, మొరార్జీ దేశాయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. మరునాడు ఉదయం జనసంఘ్‌ నాయకులు వాజ్‌పేయి, అడ్వాణీ, మధు దండావతె, మరికొందరిని బెంగళూరులో అరెస్టు చేశారు.ఆంధ్రలో పెద్దలు గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం, జూపూడి యజ్ఞనారాయణ, యలమంచిలి శివాజీ వంటి వారిని అరెస్టు చేశారు. దేశం మొత్తం మీద ఎమర్జెన్సీ పేరుతో ఆ 21 మాసాలలో దాదాపు లక్ష మందిని అరెస్టు చేశారు. 7 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.ఎదురు దెబ్బ తప్పదు!ఎమర్జెన్సీ విధించిన వెంటనే తీసుకున్న చర్య సెన్సార్‌ షిప్‌. దీనితో దాదాపు భారతీయ పత్రికలన్నీ మూగబోయాయి. ఇది జూన్‌ 26 నుంచి అమలులోకి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్, ఆనందమార్గ్, జమాతే ఇస్లాం, సీపీఐ (ఎం.ఎల్‌.)లతో సహా 26 సంస్థలపై నిషేధం విధించారు. న్యాయమూర్తులను బదిలీ చేశారు. క్రమశిక్షణ పేరుతో వందలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఆనాడు లోక్‌సభలో ప్రతిపక్షాలన్నింటి బలం అరవై లోపే! కానీ, లోక్‌ సంఘర్ష సమితి ఆధ్వర్యంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చరిత్రా త్మక ఉద్యమమే జరిగింది. దాంతో లోక్‌సభకు తాజాగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఇందిర 1977 జనవరి 18న ఆకాశవాణి ప్రసంగంలో వెల్లడించారు. 1977 జనవరి 20న జనతా పార్టీ ఆవిర్భవించింది. ఆ ఎన్నికలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇందిరాగాంధీ,సంజయ్‌గాంధీ కూడా ఓడిపోయారు. 1977 మార్చి 21న తాత్కాలిక రాష్ట్రపతి బి.డి. జెట్టి ఎమర్జెన్సీని రద్దు చేశారు.ఎమర్జెన్సీ అంటే కొందరు విపక్షాల నాయకుల అర్ధరాత్రి అరెస్టులు మాత్రమే కాదు. కోటీ పదకొండు లక్షల మందికి జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు; మీసా, డిఫెన్స్‌ ఇండియా రూల్స్‌ పేరుతో లక్షా పద మూడు వేల మంది అమాయకుల అక్రమ అరెస్టులు; స్వాతంత్య్ర పోరాటం స్ఫూర్తితో ఏర్పడిన రాజ్యాంగానికి జరిగిన తీరని అవమానం. అన్నింటికి మించి భార తీయ ఆత్మకు అది పెద్ద గాయం. న్యాయ వ్యవస్థ, పత్రికా రంగం భంగపడి ప్రజాస్వామ్యం బలహీనమైంది.ఇక అత్యవసర పరిస్థితి, తదితర పరిణామాల ద్వారా కాంగ్రెస్‌ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థిని తానే సిద్ధం చేసుకుంది. బీజేపీ అనే ఒక రాజకీయ పక్షం అలా దేశ రాజకీయ రంగం మీదకు వచ్చింది.డా‘‘ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త ‘జాగృతి’ సంపాదకుడు ‘ 98493 25634

Sakshi Editorial On Donald Trump Diplomacy10
ఇదెక్కడి దౌత్యనీతి?!

దేన్నయినా ఒకటికి పదిసార్లు చెబితే అది నిజమై కూర్చుంటుందని, ప్రపంచం దాన్ని మాత్రమే విశ్వసిస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గట్టిగా నమ్ముతున్నట్టున్నారు. పాకిస్తాన్‌ ఉగ్ర ఎత్తుగడను తిప్పికొట్టడానికి మన దేశం ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో అక్కడి ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. దానికి ప్రతిగా భారత్‌పై పాక్‌ సైన్యం చేసిన దాడుల్ని తిప్పి కొట్టడంతోపాటు పాకిస్తాన్‌ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. గత నెల 6న మొదలై 9వరకూ సాగిన ఈ ఘర్షణలు... ఇరుపక్షాలూ 11న కాల్పుల విరమణ ప్రకటించటంతో ముగిశాయి. కానీ ట్రంప్‌ వేరే పనిలేనట్టు ఆనాటి నుంచీ ‘కాల్పుల విరమణ’ తన ఘనతేనంటూ చెప్పుకు తిరుగు తున్నారు. అక్కడితో ఆగలేదు. సంధి కుదుర్చుకోనట్టయితే వాణిజ్య ఒప్పందం ఉండబోదని భారత్‌ను హెచ్చరించాకే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. మన దేశం దాన్ని ఖండించినప్పుడు ‘అవును... నిజమే. వారిద్దరూ మాట్లాడుకొని సంధి కుదుర్చుకున్నారు. ఇందులో మాపాత్ర లేద’ని నాలుక మడతేస్తుంటారు. మళ్లీ నాలుగు రోజులు గడిచేసరికల్లా పాత పాటే అందుకుంటారు. భారత్, పాకిస్తాన్‌లు కాల్పుల విరమణ ప్రకటించటానికి కొన్ని గంటల ముందు ట్రంప్‌ ఆ సంగతి వెల్లడించటమైతే వాస్తవం. ప్రకటించటంలో రెండు దేశాలూ కొంత వ్యవధి తీసుకోవటాన్ని ఆసరా చేసుకున్న ట్రంప్‌ దాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా బుధవారం మరోసారి ఆ పనే చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం 35 నిమిషాలసేపు ఆయనతో ఫోన్‌లో సంభాషించారు. ‘కాల్పుల విరమణ ప్రతిపాదన ఏ దశలోనూ మీ నుంచి రాలేదు. అలాగే వాణిజ్య ఒప్పందం గురించి ఇంతవరకూ మీ దేశంతో చర్చించలేదు’ అని వివరణనిచ్చారు. అక్కడితో అయిందనుకుంటే... మరికొన్ని గంటలు గడిచాక మరోసారి ట్రంప్‌ పాత పాటే వినిపించారు.రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నించి ఆయన అభాసుపాలయ్యారు. అక్కడ యథావిధిగా పోరు సాగుతోంది. గాజాలో ఇప్పటికి 56,000 మంది పౌరుల్ని ఊచకోత కోసిన ఇజ్రాయెల్‌పై చర్యకు అడ్డుపడటమే కాదు... వారంరోజుల క్రితం దాన్ని ఉసిగొల్పి ఇరాన్‌పై దాడులు చేయించారు. ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్‌ను బెదిరిస్తున్నారు. పైగా ఆ దేశంపై సైనిక దాడికి పథక రచన చేస్తున్నారు. పశ్చిమాసియా ఊబిలోకి దేశాన్ని దించవద్దంటూ స్వదేశంలో, స్వపక్షంలో అనేకులు హెచ్చరిస్తున్నా ట్రంప్‌కు పట్టడం లేదు. ఇలాంటి వ్యక్తి భారత్, పాకిస్తాన్‌ల మధ్య సంధి కుదిర్చానని ఎలా చెప్పుకుంటారో అనూహ్యం. కశ్మీర్‌ సమస్యపై గానీ, భారత్‌–పాక్‌ల మధ్య ఉన్న ఇతరేతర సమస్యలపై గానీ మూడో పక్షం జోక్యాన్ని అంగీకరించ బోమని దశాబ్దాలుగా భారత్‌ చెబుతూనే ఉంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ వైఖరే కొనసాగుతోంది. తాజాగా మోదీ ప్రభుత్వం దీన్ని మరికాస్త సవరించింది. మూడో పక్షం జోక్యాన్ని ఒప్పుకోబోమని చెబుతూనే మున్ముందు పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే) పైనా, ఉగ్రవాదుల అప్పగింత పైనా మాత్రమేనని స్పష్టం చేసింది. ట్రంప్‌తో సంభాషించినప్పుడు పెహల్‌గామ్‌ ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ మొదలుకొని అన్ని విషయాలూ మోదీ పూసగుచ్చినట్టు చెప్పారని, ఇక నుంచి ఉగ్రదాడిని పరోక్ష యుద్ధంగా పరిగణించదల్చుకోలే దని, దాన్ని యుద్ధంగానే చూస్తామన్నారని మన విదేశాంగ కార్యదర్శి మిస్రీ తెలియజేశారు. జిత్తులమారితనం దౌత్యం అనిపించుకోదు. స్పష్టంగా, పారదర్శకంగా, అరమరికలు లేకుండా వ్యవహరించినప్పుడే ఎంతటి సంక్లిష్ట సమస్యయినా దారికొస్తుంది. దౌత్యం విజయవంతమవుతుంది. బెదిరింపులకు దిగటం, బెదిరించానని గొప్పలుపోవటం దౌత్యమెలా అవుతుంది? తన వ్యాపారాన్ని విస్తరించుకోవటానికీ, ప్రత్యర్థులపై పైచేయి సాధించటానికీ పూర్వాశ్రమంలో నేర్చు కున్న కళలన్నీ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో ప్రదర్శిస్తున్నట్టు కనబడుతోంది. దీన్ని వదిలించుకోనట్టయితే నవ్వులపాలవుతానన్న ఆలోచన ఆయనకు స్ఫురిస్తున్నట్టు లేదు. ఉగ్రవాదులకు పాక్‌ సైన్యం ఊత మిస్తున్న వైనం స్పష్టంగా కనబడుతున్నా ఆ దేశ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌కు బుధవారం విందుకు ఆహ్వానించారు. అది ఆయన ఇష్టం. కానీ అదే రోజు మోదీ అక్కడుండాలని కోరుకోవటం, వేరే దేశాల పర్యటన రద్దుచేసుకుని వాషింగ్టన్‌ రమ్మనటం హుందాతనం అనిపించుకుంటుందా? పర స్పరం కత్తులు దూసుకుంటున్న వైరిపక్షాలను ఒకేసారి పిలవటం తెలివితక్కువతనం అను కోవాలా? అతి తెలివి అనుకోవాలా? ఒకపక్క కశ్మీర్‌ సమస్యను అంతర్జాతీయం చేయటం సమ్మతం కాదని మన దేశం పదే పదే చెబుతున్నా ఈ మూర్ఖత్వం దేనికి? రేపో మాపో ఇరాన్‌పై తాము దండెత్తితే రీఫ్యూయలింగ్‌ కోసం పాకిస్తాన్‌ అవసరపడుతుంది. అందుకోసం ఆ దేశాన్ని దువ్వుతూ మనల్ని ఉద్ధరించటానికి కంకణం కట్టుకున్నట్టు ఈ కపటనాటకం ఎందుకు?జీ7 శిఖరాగ్ర సదస్సు నుంచి హడావిడిగా నిష్క్రమించనట్టయితే, అక్కడ మోదీ ప్రసంగాన్ని నేరుగా విన్నట్టయితే ట్రంప్‌కు విషయం కాస్తయినా అర్థమయ్యేది. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమా ణాలు పాటిస్తున్న పాశ్చాత్య దేశాలను మోదీ నిశితంగా విమర్శించారు. సొంత కారణాలతో కొన్ని దేశాలపై ఆంక్షలు పెడుతూ, ఉగ్రవాదుల్ని ఉసిగొల్పే దేశాలను మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారని మోదీ చెప్పారు. అయినా ట్రంప్‌ ధోరణి మారలేదు. ఈ పరిస్థితుల్లో ఇరాన్‌తో సహా అన్ని అంతర్జాతీయ అంశాల్లోనూ స్వతంత్ర విధానం పాటించటమే మనకు శ్రేయస్కరం. ద్వంద్వ నీతిని అనుసరించేవారికి తమ స్థానం ఏమిటో చెప్పనట్టయితే మనమే నష్టపోతాం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement