ప్రధాన వార్తలు

‘చినబాబు సర్వీసు’ కమిషన్!
నారా చంద్రబాబునాయుడు..! వైఎస్ జగన్మోహన్రెడ్డి..! వీరిద్దరిలో విజనరీ నాయకుడు ఎవరంటే ఏం చెబుతారు? రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది..! దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అమరావతే రాజధానిగా ఉండాలని అంతా భావిస్తున్నారు..! దీన్ని ఎలా భావిస్తున్నారు? ఈ ప్రశ్నలు వేసింది ఏ బహిరంగ సభలోనో.. ఏ రాజకీయ నాయకుడో కాదు.. తాజాగా గ్రూప్–1 ఇంటర్వ్యూలో అభ్యర్థులను బోర్డు అడిగిన ప్రశ్నలివీ!! సాక్షి, అమరావతి: గ్రూప్–1 ఇంటర్వ్యూలు దారి తప్పాయి! రాష్ట్రంలోని అత్యుత్తుమ సర్వీసుల్లో.. ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పాటించాల్సిన కనీస నిబంధనలను పక్కనబెట్టిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) రాజకీయ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలా మారిపోయింది! రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సర్వీస్ కమిషన్ ఓ రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడంపై ఇంటర్వ్యూలకు హాజరవుతున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నడూ లేనివిధంగా కమిషన్లో ఇతర సభ్యులను పక్కన పెట్టడం.. చివరి నిమిషంలో ఓ సభ్యుడిని తీసుకురావడం.. ఇంటర్వ్యూల నిర్వహణకు మూడు బోర్డులకు బదులుగా ఒకే ఒక్క బోర్డుకు పరిమితం కావడం.. లాంటివన్నీ గుంభనంగా సాగుతున్న వ్యవహారాలకు నిదర్శనమని మండిపడుతున్నారు. దీనిపై న్యాయ వివాదాలు రేకెత్తితే ప్రక్రియ అంతా మళ్లీ మొదటికొస్తుందని, అడ్డగోలు నిర్ణయాలు లీగల్గా చెల్లుబాటు కావని పేర్కొంటున్నారు. పారదర్శకంగా ఉండాల్సిన కమిషన్ చరిత్రలో తొలిసారి అత్యంత జూనియర్ సభ్యుడిని తాజాగా గ్రూప్–1 ఇంటర్వ్యూ బోర్డులో నియమించడం గమనార్హం. అది కూడా ఆదివారం నియామక ఉత్తర్వులిచ్చి సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేయించి మంగళవారం నుంచి బోర్డులోకి తీసుకున్నారంటే గ్రూప్–1 ఇంటర్వ్యూలు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. బోర్డులో సభ్యులుగా ఉన్నవారు ఆ రోజు మొత్తం జరిగే ప్రక్రియలో పూర్తిగా ఉండాలి. కానీ ఓ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మధ్యాహ్నం తరువాత వెళ్లిపోయారు. ఇంటర్వ్యూ ముంగిట ఇదేం తీరు?2023 గ్రూప్–1 నోటిఫికేషన్కు సంబంధించి ఇంటర్వ్యూల కోసం స్పోర్ట్స్ కేటగిరీలో 42 మందిని, జనరల్ కేటగిరీలో 182 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరికి ఈ నెల 23 నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. ఇంటర్వ్యూ బోర్డులో చైర్మన్తోపాటు సభ్యుల్లో కనీసం ఒక్కరైనా ఉండాలి. ఒక మానసిక నిపుణుడు, సబ్జెక్టు నిపుణుడుగా ఏదైనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పాల్గొనడం తప్పనిసరి. కానీ ఇప్పుడు ఇవేమీ లేకుండా అంతా గుట్టుగా జరిగిపోతున్నాయి. ఇంటర్వ్యూలకు తొలుత మూడు బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఏపీపీఎస్సీ.. చివరికి కూటమి ప్రభుత్వంలో ఓ కీలక మంత్రి ఆదేశాలతో ఒకే ఒక్క బోర్డుకు కుదించినట్లు సమాచారం. ఒక్క బోర్డు ఉంటే ప్రభుత్వ పెద్దల అభీష్టం మేరకు ఎంపిక జరుగుతుందనే ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. తద్వారా ప్రతిభకు తీరని అన్యాయం జరుగుతుందని, సంవత్సరాల తరబడి తదేక దీక్షతో సిద్ధమై ఇంటర్వ్యూ వరకు వచ్చిన అభ్యర్థుల తలరాత మారిపోతుందని ఆక్రోశిస్తున్నారు.మంత్రి సేవలో తరిస్తున్న ఏపీపీఎస్సీ కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు రాష్ట్రాలలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రత్యేక సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని 315 ఆర్టికల్ నిర్దేశిస్తోంది. 316, 317 నిబంధనల్లో కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం, పదవీ కాలాన్ని పొందుపరిచారు. దీని ప్రకారమే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే చైర్మన్.. కమిషన్లో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి. ఇంటర్వ్యూ బోర్డులో చైర్మన్తోపాటు సభ్యుల్లో సీనియర్ను తప్పనిసరిగా నియమించాలి. వీరిద్దరితోపాటు సబ్జెక్టు నిపుణులు, వర్సిటీ వీసీ లేదా ప్రొఫెసర్ ఉంటారు. ఒకటికి మించి ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేసినప్పుడు సీనియారిటీ ప్రకారం ముందున్న సభ్యుడిని ఆ బోర్డుకు చైర్మన్గా నియమిస్తారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీపీఎస్సీ ఓ మంత్రి సేవలో తరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడు బోర్డుల స్థానంలో కేవలం ఒకటే..వారం క్రితం గ్రూప్–1 ఇంటర్వ్యూల కోసం 3 బోర్డులు ఏర్పాటు చేస్తూ కమిషన్లో ఫైల్ పెట్టారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బోర్డు సభ్యులకు శిక్షణ కూడా ఇచ్చారు. అయితే ఈనెల 23న ఇంటర్వ్యూలు అనగా ముందు రోజు సీన్ మొత్తం మారిపోయింది. మూడు బోర్డుల స్థానంలో కేవలం ఒకే ఒక్క బోర్డు ఏర్పాటు చేశారు. ఉన్న సభ్యులను కాదని ఆగమేఘాలపై కొత్త సభ్యుడిని నియమించారు. ఈమేరకు ఆదివారం ఉత్తర్వులిచ్చి సోమవారం సాయంత్రం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంగళవారం ఇంటర్వ్యూ బోర్డులో కూర్చోబెట్టారు. సోమవారం రోజు బోర్డులో ఉన్న సీనియర్ సభ్యుడిని హఠాత్తుగా తొలగించి అత్యంత జూనియర్ను అప్పటికప్పుడు నియమించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో తన ప్రమేయం ఏదీ లేదని, ప్రభుత్వంలో కొందరు పెద్దల నుంచి తనపై తీవ్ర ఒత్తిడి ఉందని దీన్ని ప్రశ్నించిన ఇతర సభ్యుల వద్ద చైర్మన్ వాపోయినట్లు తెలిసింది. దీన్నిబట్టి చినబాబు కనుసన్నల్లో ఎంపిక ప్రక్రియ సాగుతున్నట్లు అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.సీనియర్ సభ్యులను పక్కనపెట్టి..టీడీపీ హయాంలో 2015–19 మధ్య నియమితులైన ఏపీపీఎస్సీ సభ్యులు వైఎస్ జగన్ ప్రభుత్వంలోనూ కొనసాగారు. వీరు బోర్డులో కీలక బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు 2018 గ్రూప్–1 ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్గా ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ 2015 నవంబర్ 27 తేదీన నియమితులై 2021 నవంబర్ 26 వరకు పూర్తికాలం కొనసాగారు. గతంలో టీడీపీ ప్రభుత్వం నియమించిన ఆరుగురు సర్వీస్ కమిషన్ సభ్యుల్లో ప్రొఫెసర్ జి.రంగజనార్ధన నాలుగేళ్ల ఐదు నెలలు కొనసాగిన అనంతరం జేఎన్టీయూ వైస్ చాన్సలర్గా అవకాశం రావడంతో సభ్యుడిగా రాజీనామా చేశారు. మిగిలిన ఐదుగురు సభ్యులు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. గత టీడీపీ సర్కారు నియమించిన సభ్యుల్లో ప్రొఫెసర్ పద్మరాజు, విజయకుమార్, సేవారూప, రామరాజు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనూ కొనసాగారు. వీరిలో ప్రొఫెసర్ పద్మరాజు, విజయకుమార్ 2018 గ్రూప్–1 అభ్యర్థులకు 2022లో ఏపీపీఎస్సీ నిర్వహించిన ఇంటర్వ్యూలకు రెండు బోర్డుల్లో చైర్మన్లుగా వ్యవహరించారు. ప్రొఫెసర్ పద్మరాజు సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఆరేళ్లు కాలాన్ని పూర్తి చేసిన అనంతరం నన్నయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా గత ప్రభుత్వంనియమించింది. అయితే గత ప్రభుత్వంలో నియమితులైన సభ్యులను ఇప్పుడు కూటమి ప్రభుత్వం గ్రూప్–1 ఇంటర్వ్యూలకు పూర్తిగా దూరం పెట్టడంతోపాటు ఓ కొత్త సభ్యుడిని నియమించి ఆయనకు అవకాశం ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తలరాతలు తారుమారు...టీడీపీ హయాంలో సర్వీస్ కమిషన్ తీరు వివాదాల పుట్టగా మారింది. ముఖ్యంగా అప్పట్లో ఉదయ్భాస్కర్ చైర్మన్గా తీసుకున్న నిర్ణయాలు వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలను తల్లకిందులు చేశాయి. ఇంటర్వ్యూ బోర్డులో కమిషన్ సభ్యులతో పాటు ఉన్నతస్థాయి అధికారి ఒకరు, సబ్జెక్టు నిపుణులు ఒకరు ఉండాలి. కానీ ఇవేవీ పాటించకుండా టీడీపీ ప్రభుత్వం ఒక్క బోర్డునే ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్ మాత్రమే ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్గా వ్యవహరించారు. ఇంటర్వ్యూలో తుది మార్కులు వేసేది చైర్మన్ కావడంతో అన్నీ తానై చక్కబెట్టినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. గత టీడీపీ ప్రభుత్వంలో డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల్లో ఆయన ఇదే విధానాన్ని అనుసరించారు. ఈ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. 2018 గ్రూప్–2 పరీక్షల నిర్వహణ కూడా వివాదాస్పదమైంది. ఇదే రీతిలో ఇప్పుడు గ్రూప్–1 ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారనే ఆందోళన రేకెత్తుతోంది. పేలవమైన ప్రశ్నలు.. గత ప్రభుత్వ విధానాలపై స్టేట్మెంట్లు ఇస్తూ బోర్డు సభ్యులు రాజకీయ నేతల మాదిరిగా వ్యవహరించడం ఏమిటని అభ్యర్థులు మండిపడుతున్నారు. టీడీపీ పెద్దల మెప్పు కోసం గ్రూప్–1 ఇంటర్వ్యూ బోర్డును రాజకీయ వేదికలా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మళ్లీ 2019కి ముందున్న పరిస్థితి తప్పదా? వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఇంటర్వ్యూ బోర్డులో ఇద్దరు బోర్డు సభ్యులు, ఇద్దరు సీనియర్ ఐఏఎస్లు, ఒక సబ్జెక్టు నిపుణుడు (యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు మాత్రమే) ఉండేలా చర్యలు తీసుకుని పారదర్శకంగా వ్యవహరించింది. 2022లో గ్రూప్–1 ఇంటర్వ్యూలకు మూడు బోర్డులను ఏర్పాటు చేశారు. సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి పక్కాగా ఉద్యోగాల భర్తీ చేపట్టారు. గతంలో టీడీపీ సర్కారు వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం న్యాయ వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేశారు. 2024లో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్వీస్ కమిషన్ల పనితీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకున్నట్లు గుర్తించగా, గత సర్కారు చొరవతో వివాద రహితంగా ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. అలాంటిది ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వివాదాలకు తెరతీసి మళ్లీ 2019కి ముందున్న పరిస్థితినే తీసుకొస్తోందని నిరుద్యోగుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.విద్యారంగాన్ని భ్రష్టు పట్టించి...ఇప్పటికే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన సీఎం చంద్రబాబు సర్కారు తమను సైతం వదలడం లేదని గ్రూప్–1 ఇంటర్వ్యూ అభ్యర్థులు రగిలిపోతున్నారు. టెన్త్ పరీక్షలు జరుగుతుండగానే ప్రశ్నపత్రాలు వాట్సాప్లో ప్రత్యక్షం కావడం.. ఆపై మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో ఘోర వైఫల్యాలు.. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం విద్యార్థుల నుంచి ఏకంగా 66 వేల దరఖాస్తులు రావడం లాంటివి కూటమి సర్కారు నిర్వాకాలకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు.

లెక్కలేసి మరీ బాండ్లు ఇచ్చారు.. ఇప్పుడేమైంది?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఇవ్వకుండా చేస్తున్న మోసాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా యువతీ యువకులు చేపట్టిన ‘యువత పోరు’ విజయవంతం కావడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై సోమవారం నరసరావుపేటలో పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.ఇంట్లో ఎంత మంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంత మందికి నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు కదా.. ఇప్పుడు ఆ హామీ ఏమైందని సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’లో తన ఖాతాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తమకు చేస్తున్న మోసాలు, ఎగరగొడుతూ నిర్వీర్యం చేస్తున్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు, పలు సమస్యలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతీ యువకులు ‘యువత పోరు’ పేరిట రోడ్డెక్కి ఈ ప్రభుత్వం కళ్లు తెరిచేలా బ్రహ్మాండంగా నిరసన చేపట్టినందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై సోమవారం నరసరావుపేటలో పోలీసుల లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాను.మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికీ వెళ్లి వివిధ రకాలుగా బాండ్లు పంచారు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంత మందికీ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేలు చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ మేరకు జూన్–2024 నుంచి వారి వారి ఖాతాల్లో జమ అవుతుందన్నారు. టీడీపీ అధికార గెజిట్ ఈనాడు పత్రికలో రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు కోటిన్నరపైనే ఉన్నారని రాస్తే, మీ మేనిఫెస్టో, మీరు ఇంటింటికీ పంచిన బాండ్ల ప్రకారం నెలకు రూ.3 వేలు చొప్పున ఈ ఏడాదిలో మీరు ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఒక్కరికీ ఇవ్వకపోగా, ఈ ఏడాది కూడా మళ్లీ ఎగరగొట్టే మోసానికి దిగారు.ఆరు త్రైమాసికాల ఫీజు పెండింగ్మరోవంక 2024 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించి విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ను అదే సంవత్సరం 2024లో చెల్లింపులు చేయాలి. ఎన్నికల కారణంగా అది నిలిచిపోయింది. అప్పటి నుంచి ఈ జూన్–2025 వరకు ఆరు త్రైమాసికాలుగా మొత్తంగా రూ.4,200 కోట్లు పెండింగ్. ఇందులో ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. వసతి దీవెన కింద ఏప్రిల్–2024న చెల్లించాల్సిన ఒక విడత, ఈ ఏడాది ఏప్రిల్–2025లో చెల్లించాల్సిన మరో విడత కలిపి రూ.2,200 కోట్లు పెండింగ్. మొత్తంగా రూ.6,400 కోట్లకు గాను ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మీరు ఇవ్వక పోవడంతో ఇవాళ విద్యార్థులు చదువులు మానుకుని, పనులకు పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.చంద్రబాబూ.. మీరు చేయాల్సింది చేయకుండా, ఎగరగొట్టినందుకు ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లంతా చేసిన తప్పేమిటి? కేవలం కలెక్టర్ను కలిసి డిమాండ్ పత్రం ఇవ్వాలనుకోవడం తప్పా? మీరు ఇస్తామన్న వాటి కోసం డిమాండ్ చేయడం తప్పా? మీ రెడ్బుక్ రాజ్యాంగ పాలనకు నిన్న నరసరావుపేటలో జరిగిన ఘటన నిదర్శనం కాదా? రోజురోజుకూ మీ అబద్ధాలు, మీ మోసాలు, మీ దౌర్జన్యాలు మితిమీరి పోతున్నాయి. మీరు చేస్తున్న పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి.

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. ధార్మిక చింతన
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి: అమావాస్య సా.4.32 వరకు, తదుపరి ఆషాఢ శుక్ల పాడ్యమి, నక్షత్రం: మృగశిర ప.11.32 వరకు,తదుపరి ఆరుద్ర, వర్జ్యం: రా.7.34 నుండి 9.06 వరకు,దుర్ముహూర్తం: ఉ.11.35 నుండి 12.27 వరకు, అమృత ఘడియలు: రా.12.52 నుండి 2.22 వరకు.సూర్యోదయం : 5.31సూర్యాస్తమయం : 6.34రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం.... ఆకస్మిక ధనలబ్ధి. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ధార్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి.వృషభం.... వ్యవహారాలలో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు కొన్ని వాయిదా. శ్రమతో పనులు పూర్తి చేస్తారు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.మిథునం.... స్నేహితులకు సహకరిస్తారు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. వస్తులాభాలు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.కర్కాటకం..... సన్నిహితులతో విభేదాలు రావచ్చు. ప్రతి వ్యవహారంలోనూ తొందరపాటు వద్దు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.సింహం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. పాతమిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.కన్య... రుణబాధలు తొలగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. కోరుకున్న ఉద్యోగాలు దక్కవచ్చు. విదేశీ పర్యటనకు ఏర్పాట్లు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.తుల... ఇంటాబయటా సమస్యలతో ఇబ్బందిపడతారు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరుల ద్వారా ఒత్తిడులు రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.వృశ్చికం.... ఎంత శ్రమపడ్డా ఫలితం శూన్యం. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దూరప్రయాణాలలో కొంత జాగ్త్రత. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.ధనుస్సు... రుణాలు తీరే సమయం. ఆప్తుల ద్వారా ఆహ్వానాలు రావచ్చు. ధనప్రాప్తి. కొన్ని సమస్యలు తీరతాయి. క్లిష్ట సమస్యల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.మకరం.... పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆస్తులు సమకూరతాయి. సంఘంలో గౌరవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.కుంభం.... ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ఆస్తి వివాదాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.మీనం.... ముఖ్యమైన పనులు వాయిదా. శ్రమాధిక్యం. మిత్రుల నుండి ఒత్తిడులు. అనారోగ్య సూచనలు. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలు నిదానిస్తాయి.

టీమిండియా అత్యంత చెత్త రికార్డు.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియాతో ఓటమితో ఆరంభించింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(149) భారీ శతకంతో చెలరేగగా.. జాక్ క్రాలీ(65), జో రూట్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.రెండో ఇన్నింగ్స్లోనూ భారత బౌలర్లు తేలిపోయారు. ప్రసిద్ద్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా ఓ వికెట్ సాధించాడు. అయితే తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో సత్తాచాటిన జస్ప్రీత్ బుమ్రా.. రెండో ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు.అంతకుతోడు చెత్త ఫీల్డింగ్ కూడా టీమిండియా కొంపముంచింది. రెండో ఇన్నింగ్స్లు కలపి ఏడు క్యాచ్లను భారత ఫీల్డర్లు విడిచిపెట్టారు. అందులో నాలుగు క్యాచ్లు జైశ్వాల్ జారవిడిచినవే కావడం గమనార్హం. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.టెస్టు క్రికెట్ హిస్టరీలోనే..ఇక ఈ ఓటమితో భారత్ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఒక టెస్టులో ఐదు సెంచరీలు నమోదు చేసిన తర్వాత కూడా ఓటమి పాలైన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. 141 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఈ చెత్త ఫీట్ను నమోదు చేయలేదు.తాజా ఓటమితో టీమిండియా ఈ ఘోర ఆప్రతిష్టతను మూట కట్టుకుంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జూలై 2 నుంచి ఎడ్జ్ బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్- తొలి టెస్టు సంక్షిప్త సమాచారం🏏షెడ్యూల్: జూన్ 20- 24🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్🏏తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు ఆరు పరుగుల ఆధిక్యం🏏టీమిండియా రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371🏏ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా 373 పరుగులు సాధించి లక్ష్యాన్ని ఛేదించిన స్టోక్స్ బృందం🏏ఫలితం: ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై ఇంగ్లండ్ విజయం

జపనీస్ వీడియో గేమ్లో రాజమౌళి.. ఇదో క్రేజీ రికార్డ్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చేసిన ఈయన.. ఈ చిత్రంతో పాన్ వరల్డ్లోనూ తన పనితనం ఏంటో చూపించబోతున్నాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే ఎవరూ ఊహించని పనిచేసి జక్కన్న వార్తల్లో నిలిచాడు. ఓ జపనీస్ వీడియో గేమ్లో కనిపించి భారతీయ నటీనటులు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించాడు. ఇంతకీ ఏంటా గేమ్? అసలేం జరిగింది?'ఆర్ఆర్ఆర్' సినిమాని గ్లోబల్ వైడ్ ప్రమోట్ చేసిన రాజమౌళి.. ఆస్కార్ కూడా అందుకున్నాడు. ఈ చిత్రాన్ని జపాన్లోనూ రిలీజ్ చేయగా అక్కడ కూడా రెస్పాన్స్ బాగానే వచ్చింది. అయితే జపనీస్ వీడియో గేమ్ సృష్టికర్త హిడియో కోజిమాని అప్పట్లో రాజమౌళి కలవడం చర్చనీయాంశమైంది. మహేశ్ సినిమా కోసం ఈయనతో కలిసి పనిచేయబోతున్నాడా అని అందరూ అనుకున్నారు. కానీ అవన్నీ కాదని ఇప్పుడు తేలిపోయింది.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా)కోజిమా సృష్టించిన 'డెత్ స్టాండింగ్ 2' వీడియో గేమ్లో రాజమౌళితో పాటు ఆయన కొడుకు కార్తికేయ కనిపించారు. ఇది చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్లని పాన్ ఇండియా స్టార్స్ని చేసిన జక్కన్న.. ఇప్పుడు ఇంటర్నేషనల్ వీడియో గేమ్ కనిపించి తానే పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. వీడియో గేమ్లో కనిపించిన భారతీయ తొలి సెలబ్రిటీగా రికార్డ్ సృష్టించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.మహేశ్ ప్రాజెక్ట్ విషయానికొస్తే.. ఇదివరకే హైదరాబాద్, ఒడిశాలో షూటింగ్ జరిగింది. కొన్ని సీన్స్ కోసం త్వరలో కెన్యా వెళ్లి రానున్నారని తెలుస్తోంది. అలానే రూ.50 కోట్లు ఖర్చు పెట్టి.. హైదరాబాద్లోనే వారణాసి సెట్ వేశారని, ఇది సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సెట్ అని మాట్లాడుకుంటున్నారు. అంతా ఓకే గానీ మహేశ్ సినిమా మొదలైన తర్వాత ఇప్పటివరకు రాజమౌళి.. ఒక్కటంటే ఒక్క విషయం కూడా చెప్పట్లేదు. మరి ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు చెబుతాడో ఏంట?(ఇదీ చదవండి: హీరోయిన్ సమంతకు కష్టకాలం!)#DeathStranding2 video game featuring SSR! 👍pic.twitter.com/HsdS4wZh0N— idlebrain jeevi (@idlebrainjeevi) June 24, 2025

ప్రజాస్వామ్యానికి సంకెళ్లు
1975. జూన్ 25. స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత చీకటిమయమైన అధ్యాయానికి తెర లేచిన రోజు. దేశం ఎన్నటికీ మర్చిపోలేని రోజు. అధికారాన్ని కాపాడుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన రోజు. ఆ నిశిరాత్రి వేళ ఆమె తీసుకున్న చీకటి నిర్ణయం ఏకంగా 21 నెలల పాలు దేశ ప్రజల పాలిట నిత్య కాళరాత్రే అయింది. ఎటుచూసినా దమనకాండ. రాజకీయ ప్రత్యర్థులు మొదలుకుని సామాన్యుల దాకా దేశవ్యాప్త నిర్బంధాలు. ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన మౌలిక హక్కులు దేవుడెరుగు, జీవించే హక్కుకే దిక్కు లేని దుస్థితి.పత్రికా స్వేచ్ఛను ఉక్కుపాదంతో తొక్కిపెట్టిన పరిస్థితి! సర్వం సహా అధికారమంతా ఇందిర చిన్న కుమారుడు సంజయ్గాంధీ రూపంలో ఓ రాజ్యాంగేతర శక్తి చేతుల్లో కేంద్రీకృతం! అసలే దుందుడుకుతనానికి మారుపేరు. ఆపై బాధ్యతల్లేని అధికారం. దాని అండతో, సన్నిహిత కోటరీ చెప్పినట్టల్లా ఆడుతూ ఆయన పాల్పడ్డ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అనుమానం వచ్చిన వారల్లా జైలుపాలే. చివరికి జనాభాను తగ్గించే చర్యల పేరిట కంటబడ్డ వారికల్లా బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిపారేయడం సంజయ్ నియంతృత్వ పోకడలకు పరాకాష్టగా నిలిచింది.మొత్తంగా దేశమే ఓ జైలుగా మారి 21 నెలల పాటు అక్షరాలా హాహాకారాలు చేసింది. అయితే అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే అయింది. ఎమర్జెన్సీ ఎత్తివేత అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇందిరను ఓడించి, నియంత పోకడలు పోయేవారికి ప్రజలు మర్చిపోలేని పాఠం నేర్పారు. అలాంటి ఎమర్జెన్సీ చీకటి అధ్యాయానికి తెర లేచి నేటికి సరిగ్గా 50 ఏళ్లు. ఈ సందర్భంగా, అందుకు దారి తీసిన పరిస్థితులు, ఎమర్జెన్సీ అకృత్యాలు, దాని పరిణామాలు తదితరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.....అలా మొదలైందినిజానికి ఎమర్జెన్సీ నాటికి దేశమంతటా నానారకాలుగా అస్థిరత రాజ్యమేలుతోంది. ఇందిరకు వ్యతిరేకంగా లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తదితరుల సారథ్యంలో విపక్షాలు సంఘటితమవుతూ వస్తున్నాయి. అయితే ఎమర్జెన్సీకి పూర్వ రంగాన్ని సిద్ధం చేసింది మాత్రం ఇందిర ఎన్నికను రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్లాల్ సిన్హా వెలువరించిన చరిత్రాత్మక తీర్పే. 1971 లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ఇందిరపై తలపడి ఓడిన సోషలిస్టు పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్ ఆమె ఎన్నికను సవాలు చేస్తూ కోర్టుకెక్కారు. ఇందిర ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందిర ఎన్నికల ఏజెంటు యశ్పాల్ కపూర్ ప్రభుత్వోద్యోగిగా ఉంటూనే ఆమె కోసం పని చేశారని పేర్కొన్నారు.ఈ కేసును కొద్దిరోజులకు అంతా మరచిపోయినా బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తాలూకు ఆర్థిక భారం కారణంగా నాలుగేళ్లుగా జనంలో రగులుతున్న అసంతృప్తి ఇందిర సర్కారుపై ఆగ్రహంగా మారుతున్న సందర్భమది. మూడేళ్ల పాటు ఇందిర సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలు నానాటికీ బలం పుంజుకోసాగాయి. అలాంటి సమయంలో ఎంపీగా ఇందిర ఎన్నికను కొట్టేస్తూ జస్టిస్ సిన్హా 1975 జూన్ 12న అనూహ్యంగా సంచలన తీర్పు వెలువరించారు. అంతేగాక ఆమె ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా వేశారు! దానిపై ఇందిర సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం లేకపోయింది. ఆమెను ప్రధానిగా కొనసాగనిచ్చినా, పార్లమెంటులో ఓటు హక్కులకు మాత్రం కత్తెర వేస్తూ జూన్ 24న సుప్రీం తీర్పునిచ్చింది.ఇది విపక్షాలకు అతి పెద్ద ఆయుధంగా అందివచ్చింది. జేపీ ఇచ్చిన సంపూర్ణ క్రాంతి (సంపూర్ణ విప్లవ) నినాదం అప్పటికే దేశమంతటా కార్చిచ్చులా వ్యాపిస్తోంది. చూస్తుండగానే దేశమంతటా, ముఖ్యంగా ఉత్తరాదిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటసాగాయి. సుప్రీం తీర్పు వచ్చిన మర్నాడు జూన్ 25న విపక్షాలన్నీ ఢిల్లీ రాంలీలా మైదాన్లో భారీ స్థాయిలో నిర్వహించిన సంపూర్ణ విప్లవ ర్యాలీ సర్కారు పునాదులనే కదిలించింది.పౌరులు సహాయ నిరాకరణ చేయాలని, పోలీసులు, సైనిక బలగాలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాకుండా అంతరాత్మ ప్రబోధానుసారం నడచుకోవాలని జేపీ ఇచ్చిన పిలుపు కేంద్రం గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. పరిస్థితులు చేయి దాటుతున్నాయని భావించిన ఇందిర సన్నిహితులతో సంప్రదించి ఓ నిర్ణయానికి వచ్చారు. ‘అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉన్నందున దేశమంతటా ఎమర్జెన్సీ విధించా’లంటూ ఆ అర్ధరాత్రే రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్కు సిఫార్సు చేయడం, క్షణాల మీద ఆయన ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి.ఏం జరిగింది?⇒ ఎమర్జెన్సీ కారణంగా వాక్ స్వాతంత్య్రంతో పాటు ప్రజల రాజ్యాంగపరమైన హక్కులన్నీ రద్దయ్యాయి. ⇒ మీడియాపై కనీవినీ ఎరగని రీతిలో పూర్తిస్థాయి ఆంక్షలు కొనసాగాయి. ⇒ అనుమానం వస్తే చాలు, ఎంతటివారినైనా ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవడం పరిపాటిగా మారింది. ⇒ జేపీతో పాటు అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే ఆడ్వాణీ, మధు దండావతే, నానాజీ దేశ్ముఖ్, ప్రకాశ్సింగ్ బాదల్, కరుణానిధి, జార్జి ఫెర్నాండెజ్, ప్రకాశ్ కారత్ తదితర విపక్ష నేతలందరినీ నిర్బంధించి జైలుపాలు చేశారు.⇒ డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ (మీసా) వంటి చట్టాలతో ఎవరినైనా కటకటాల్లోకి నెట్టారు. ⇒ ఈ నిర్బంధాలకు గుర్తుగా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆ సమయంలో పుట్టిన తన కూతురికి మీసా భారతి అని పేరు పెట్టుకోవడం విశేషం! ⇒ న్యాయవ్యవస్థ హక్కులకు కూడా కోత పడింది. విపక్ష నేతలను అరెస్టు చేయాలంటూ జారీ చేసే కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యాయస్థానాలు సమీక్షించకుండా వాటి అధికారాలకు కత్తెర వేశారు. ⇒ జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకంటూ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. ⇒ సుందరీకరణ పేరుతో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోని మురికివాడలన్నింటినీ అధికారులు నేలమట్టం చేసి లక్షలాది మందికి నిలువ నీడ లేకుండా చేశారు.చివరికేమైంది? ⇒ ఎమర్జెన్సీ ఎత్తేశాక 1977 జనవరి 20న లోక్సభను రద్దు చేశారు. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలిసారి ఓటమి పాలైంది. ⇒ ఇందిరతో పాటు ఆమె తనయుడు సంజయ్ కూడా ఓటమి చవిచూశారు. ⇒ మొరార్జీ దేశాయ్ ప్రధానిగా మార్చి 24న జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ⇒ లుకలుకలతో కొద్దికాలానికే కుప్పకూలినా, కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోయింది. ⇒ ఎమర్జెన్సీ ఆందోళనల్లోంచే ఫెర్నాండెజ్, కారత్ వంటి కొత్త తరం నాయకులు ఎదిగి వచ్చారు.మీడియాకూ చుక్కలే ⇒ ఎమర్జెన్సీ కాలంలో మీడియాపై ఇందిర సర్కారు, ముఖ్యంగా ఆమె తనయుడు సంజయ్ గాంధీ అక్షరాలా ఉక్కుపాదం మోపారు! అందుకోసం ప్రివెన్షన్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అబ్జెక్షనబుల్ మ్యాటర్ పేరుతో చట్టమే తెచ్చారు. ⇒ మాట విననందుకు 200 మందికి పైగా జర్నలిస్టులను అరెస్టు చేశారు. వారిపై పన్నుల ఎగవేత వంటి పలు అభియోగాలు మోపారు. ⇒ జేపీ ఉద్యమానికి కవరేజీ ఇచ్చినందుకు కుల్దీప్ నయ్యర్, కె.ఆర్.మల్కానీ వంటి జర్నలిస్టులను జైలుపాలు చేశారు. ⇒ మాట వినని పత్రికలకు న్యూస్ ప్రింట్ అందకుండా చేశారు. ⇒ చివరికి గాంధీ స్వయంగా స్థాపించిన నవజీవన్ ప్రెస్ తాలూకు ప్రింటింగ్ యంత్రాలన్నింటినీ జప్తు చేశారు. ⇒ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ), యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (యూఎన్ఐ), హిందూస్తాన్ సమాచార్, సమాచార్ భారతి వంటి వార్తా సంస్థలను ‘సమాచార్’ పేరిట బలవంతంగా విలీనం చేసిపారేశారు. ⇒ వార్తా పత్రికలపై నియంత్రణ కోసం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఒక ఐపీఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించారు. ప్రతి వార్తనూ అక్షరాక్షరం క్షుణ్నంగా చదివి సరేనన్న మీదటే ప్రింటుకు వెళ్లేది. ⇒ ఇన్ని చేసినా కలానికి మాత్రం సంకెళ్లు వేయలేకపోయారు. నియంతృత్వాన్ని నిరసిస్తూ మీడియా గళం విప్పింది. ⇒ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఖాళీ ఎడిటోరియల్ ప్రచురించింది.సినిమాలకూ చీకటి రోజులే!⇒ బాలీవుడ్తో పాటు దేశ సినీ పరిశ్రమకు కూడా ఎమర్జెన్సీ చీకటి కాలంగానే మిగిలిపోయింది.⇒ సంజయ్గాందీని ప్రస్తుతించేందుకు నిరాకరించారని బాలీవుడ్ స్టార్ దేవానంద్ సినిమాలను దూరదర్శన్లో నిషేధించారు.⇒ ప్రభుత్వ 20 సూత్రాల పథకాన్ని పొగిడేందుకు ఏర్పాటు చేసిన గాన విభావరిలో పాల్గొనేందుకు ససేమిరా అన్న గాయక దిగ్గజం కిశోర్కుమార్ గొంతు ఆలిండియా రేడియోలో విని్పంచకుండా, ఆయన పాటలు దూరదర్శన్లో కన్పించకుండా చేశారు.⇒ ఇందిరను పోలిన పాత్రలో సుచిత్రసేన్ జీవించిన ‘ఆం«దీ’, నియంతృత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరిన ‘కిస్సా కుర్సీ కా’ వంటి సినిమాలను నిషేధించారు. ఇందిర నియంతృత్వాన్ని సినీ పరిశ్రమ ఎదిరించింది. దేవానంద్ ఏకంగా నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా పేరిట కొత్త పార్టీయే పెట్టారు.⇒ శత్రుఘ్న సిన్హా, ప్రాణ్, డానీ డెంగ్జోంగ్పా వంటి బాలీవుడ్ దిగ్గజాలు పొలిటికల్ స్టార్ బ్రిగేడ్ పేరిట జనతా పార్టీకి మద్దతిచ్చారు. ⇒ విప్లవ ఇతివృత్తంతో పట్టాభిరామారెడ్డి దర్శకత్వం వహించిన కన్నడ సినిమా చండ మారుతను నిషేధించడమే గాక అందులో నటించిన ఆయన భార్య స్నేహలతారెడ్డిని కటకటాల్లోకి నెట్టారు. ఏడాదికి పైగా తీవ్ర నిర్బంధంలో గడిపిన ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పెరోల్పై బయటికొచ్చిన ఐదు రోజులకే కన్నుమూశారు.హోం మంత్రికే తెలియదు! దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం మర్నాటిదాకా సాక్షాత్తూ నాటి కేంద్ర హోం మంత్రి ఓం మెహతాకే తెలియదు! ఉదయం పత్రికల్లో చదివి విస్తుపోవాల్సి వచ్చింది. తర్వాత కాసేపటికే కేంద్ర కేబినెట్ను సమావేశపరిచిన ఇందిర, ఎమర్జెన్సీ విధింపు గురించి సహచర మంత్రులకు తీరిగ్గా వెల్లడించారు. అనంతరం ఆలిండియా రేడియోలో జాతినుద్దేశించి ప్రసంగించారు. తన సర్కారుకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో లోతైన కుట్ర జరుగుతున్నందున తనకు మరో దారి లేకపోయిందని చెప్పుకొచ్చారు.ఇది ప్రజాస్వామ్యానికి ఇందిర పాతర వేసిన రోజు – ఎమర్జెన్సీ నిర్ణయంపై లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ – సాక్షి, నేషనల్ డెస్క్

విరమణ... నిజంగానా?!
ఎప్పటిలాగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బహుపాత్రాభినయంతో అందరినీ మెప్పిస్తున్నారు. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు సాగించిన కొన్ని గంటలకే ఇరాన్–ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాయని, దాన్ని తాము స్వాగతిస్తున్నా మని మంగళవారం మధ్యాహ్నం ట్రంప్ ప్రకటించారు. దీనికి ఇరాన్ సానుకూలంగా స్పందించినా ఇజ్రాయెల్ మౌనం పాటించింది. ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఇరాన్ రాజధాని తెహ్రాన్పై అది బాంబుల వర్షం కురిపించింది. రెండు దేశాలూ పరస్పరం ‘ఎందుకో కూడా తెలియని’ విధంగా కాల్పుల విరమణ ఒడంబడికను ఉల్లంఘిస్తున్నాయని ట్రంప్ నిందించి తన ‘తటస్థతను’ చాటు కున్నారు! ఇంతకూ కాల్పుల విరమణ నిజమేనా? ఒక సమాచారం ప్రకారం ఖతార్లోని అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించాక ట్రంప్ చొరవ తీసుకుని ఇరాన్తో మాట్లాడి కాల్పుల విరమణకు ఒప్పించమని ఖతార్ను కోరారు. ఖతార్ తీసుకొచ్చిన ప్రతిపాదనకు ఇరాన్ అంగీకారం తెలిపింది. ఇరాన్ ఈ సంగతి బాహాటంగానే చెప్పింది. కాల్పుల విరమణ గురించి ట్రంప్ బతిమా లుకున్నారని వెల్లడించింది. అయితే ట్రంప్ ప్రకటన తర్వాత కాసేపటికే దాడులకు దిగడాన్నిబట్టి ఇజ్రాయెల్కు ఈ పరిణామం ససేమిరా ఇష్టం లేదని బోధపడుతోంది. యుద్ధం ఆపటం సులభ మేమీ కాదు. కాల్పుల విరమణ ప్రకటనకూ, దాని ఆచరణకూ మధ్య గంటలు మాత్రమే కాదు... రోజుల వ్యవధి కొనసాగటం రివాజే. మొన్న భారత్–పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పంద మైనా, రష్యా–ఉక్రెయిన్ల కాల్పుల విరమణ అయినా ఈ సంగతే చెబుతాయి.యుద్ధానికి ముందు నెల నుంచి ట్రంప్ ఇరాన్కు రోజువారీ హెచ్చరికలు జారీచేస్తూ వచ్చారు. అణు ఒప్పందంపై మొండి పట్టుదలకు పోతే దేశం సర్వనాశనమవుతుందని బెదిరించారు. ఆఖరికి ఒకపక్క ఇరాన్ అమెరికాతో చర్చలు సాగిస్తుండగానే పన్నెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ ఎలాంటి కవ్వింపూ లేకుండా ఆ దేశంపై దాడులు సాగించి ఇరాన్ సైనిక దళాల చీఫ్లు ఇద్దరినీ, అణు శాస్త్రవేత్తలతోసహా పలువురినీ హత్య చేసింది. ఇది తప్పని చెప్పాల్సిన ట్రంప్... ప్రతీకార దాడులకు దిగితే ఖబడ్దార్ అంటూ తిరిగి ఇరాన్నే హెచ్చరించారు. ఆఖరికి శనివారం అర్ధరాత్రి దాటాక అమెరికా తానే రంగంలోకి దిగి బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్లో మూడు అణు స్థావరాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇంతా అయినాక హఠాత్తుగా ట్రంప్ కొత్త రాగం అందుకున్నారు. ఏకపక్ష యుద్ధం ప్రారంభానికి పూర్వమే ఇరాన్ బలహీనతలు బయటపడ్డాయి. దశాబ్దాల ఆంక్షలతో అన్నివిధాలా దెబ్బతిన్న దేశం మెరుగ్గా ఉండగలదని ఎవరూ భావించలేరు. ఒకపక్క నేరుగా అమెరికా, ఇజ్రాయెల్ కుటిలత్వం తెలుస్తున్నా మిత్రులనుకున్నవారు కూడా ఖండించ టానికి సిద్ధపడకపోవటం... అండగా ఉండగలవని భావించిన రష్యా, చైనాలు ప్రకటనలకే పరిమితం కావటం, గల్ఫ్ దేశాలు నామమాత్రంగా ఖండించి ఊరుకోవటం ఇరాన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి ఉంటాయి. అణు ఒప్పందానికి సిద్ధపడతామని ప్రకటించి ఆ దిశగా అడుగులేస్తున్న దేశం ప్రపంచంలో ఇలా ఏకాకిగా మిగిలిపోవటం వర్తమాన విషాదం. యుద్ధం పర్యవసానంగా ఇరాన్లో పలు దేశాల పెట్టుబడులు దెబ్బతింటాయి. పైగా ప్రపంచానికి పెద్ద పోలీసుగా వ్యవహరిస్తూ తాము చెప్పిందే ఒప్పందమని ఒత్తిడి తెచ్చే ధోరణి రేపన్నరోజు ఎవరికైనా ముప్పే. ఇజ్రాయెల్ దగ్గర... ఆ మాటకొస్తే పశ్చిమాసియాలో అణుబాంబుల జాడలేకపోతే, ఇరాన్ మాత్రమే ఆ పని చేస్తే దాన్ని నియంత్రించటంలో హేతుబద్ధత ఉన్నదని నమ్మినా తప్పుబట్టనవసరం లేదు. కానీ అసలు అమెరికా, రష్యా మొదలుకొని ఏకపక్ష యుద్ధాలతో అందరూ తమ బాధ్యతారాహిత్యాన్ని బయటపెట్టుకుంటుండగా ఒక్క ఇరాన్ మాత్రమే ధూర్త దేశమని ఎందుకు భావించాలి? ఇంతకూ ట్రంప్ హఠాత్తు నిర్ణయం వెనకున్న కారణాలేమిటి? సైనిక స్థావరంపై దాడి చేస్తున్నా మని ఇరాన్ ముందస్తు సమాచారం ఇవ్వటం, అందుకు అనుగుణంగా అమెరికా తన సైనికుల్ని తరలించటంతోపాటు క్షిపణుల్ని కూల్చే ఏర్పాటు చేసుకోవటం సాధ్యమైంది. ఒకే ఒక్కటి పేలినా దానివల్ల నష్టం లేదు. అది ట్రంప్కు నచ్చినట్టుంది. దానికితోడు ఆయన అందలం ఎక్కటంలో కీలకపాత్ర పోషించిన ‘మాగా’ ఈ యుద్ధంపై చీలిపోయింది. గట్టి మద్దతుదారైన స్టీవ్ బెనన్ లాంటివారు సైతం ట్రంప్ను తప్పుబట్టారు. ఆ ఒత్తిళ్ల మాటెలావున్నా యూరప్ నుంచి వస్తున్న వార్తలు అమెరికాను భయపెట్టి ఉండాలి. అమెరికా తర్వాత బంగారం నిల్వల్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న జర్మనీ (3,352 టన్నులు), ఇటలీ (2,452 టన్నులు) ఆ నిల్వల్లో మూడోవంతు భాగాన్ని అమెరికా ఫెడరల్ రిజర్వ్లో ఉంచాయి. దాన్ని వెనక్కుతేవాలని ఆ దేశాల్లో డిమాండ్లు బయల్దేరాయి. నిల్వల విలువ 24,500 కోట్ల డాలర్ల పైమాటే. ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతను దెబ్బతీసేలా ట్రంప్ వ్యవహరించటం, ప్రపంచాన్ని అస్థిరపరిచే నిర్ణయాలు తీసుకోవటం తదితర కారణాల వల్ల అమెరికాలో బంగారం ఉంచటం సురక్షితం కాదని విపక్షాలు వాదిస్తున్నాయి. అది ఆచరణ రూపందాలిస్తే అమెరికా ఆర్థికవ్యవస్థ మరింత కుంగిపోవటం ఖాయం. పైగా లండన్తో పాటు ప్రపంచంలోనే కీలకమైన బంగారం కేంద్రంగా వెలిగిపోతున్న న్యూయార్క్ కళ అడుగంటు తుంది. అందుకే ట్రంప్ పునరాలోచనలో పడ్డారా? లేక ముందస్తు సమాచారం ఇచ్చిన ఇరాన్ ‘మంచితనం’ నచ్చిందా? మొత్తానికి అగ్ని గుండం కాబోతున్న పశ్చిమాసియాలో సామరస్య గాలులు వీచటం ఆహ్వానించదగ్గది. ఇది పూర్తి స్థాయిలో సాకారం కావాలని ఆశించాలి.

‘రప్పా.. రప్పా’పై కేబినెట్లో చర్చ.. జాగ్రత్తగా మాట్లాడండి
సాక్షి, అమరావతి: మంత్రివర్గ సమావేశంలో ‘రప్పా.. రప్పా’ డైలాగ్ రాజకీయంపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో టీడీపీ కార్యకర్త రవితేజ ‘పుష్ప–2’ సినిమాలోని డైలాగ్ ‘రప్పా.. రప్పా’ అంటూ పోస్టర్ ప్రదర్శించిన విషయం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై వివాదం రాజేసిన చంద్రబాబు, టీడీపీ నేతలు చివరకు ఆ పోస్టర్ ప్రదర్శించిన రవితేజ టీడీపీ కార్యకర్త అని తేలడంతో కంగుతున్నారు.దీంతో, ఈ విషయంలో కూటమికి నష్టం జరిగిందా? లాభం జరిగిందా? అనే దానిపై మాట్లాడుకున్నారు. కొందరు మంత్రులు చంద్రబాబు మెప్పు కోసం ఈ విషయంలో వైఎస్ జగన్కే నష్టం జరిగిందని, వారికి బాగా డ్యామేజ్ అయిందనే రీతిలో మాట్లాడినట్టు సమాచారం. భిన్నాభిప్రాయంతో ఉన్న మరికొందరు బయటకు వచ్చాక రియాలిటీగా మాట్లాడితే బాగుంటుందని అన్నట్టు తెలిసింది. అలాగే జగన్ పర్యటనలో ఆయన కారుకింద పడి కార్యకర్త మృతి చెందిన వ్యవహారంపై ఒక మంత్రి ప్రస్తావించగా.. చంద్రబాబు స్పందిస్తూ చట్టప్రకారం ఏం చేయాలో అది చేస్తామని తెలిపారు. పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని చంద్రబాబు సూచించారు. సబ్జెక్టు తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడకూడదని, తెలంగాణకు జవాబిచ్చే రీతిలో ఉండాలని, అదే సమయంలో అక్కడి వారికి వ్యతిరేకంగానూ ఉండకూడదని చెప్పినట్టు సమాచారం. మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నట్టు చెప్పాలని సూచించారు. కాగా, మంత్రివర్గ సమావేశం మొదలుకాగానే డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ వెళ్లిపోయారు. సమావేశానికి వచ్చి కూర్చున్న ఆయన తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని తెలియడంతో సీఎంకు చెప్పి వెళ్లిపోయారు.

వేడెక్కుతున్న ఆసియా.. భారత్లో వారికే ప్రమాదమే..
పర్యావరణంపై ఓ కొత్త నివేదిక ఆసియాను ఆందోళన పరుస్తోంది. తీవ్రమైన వాతావరణ మార్పులు ఆసియాను సంక్షోభానికి గురి చేస్తాయని హెచ్చరిస్తోంది. వాతావరణ మార్పులపై ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవల ‘స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ఆసియా–2024’ను విడుదల చేసింది. ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకంటే ఆసియా రెండు రెట్లు వేగంగా వేడెక్కుతోందని అధ్యయనం పేర్కొంది. ఈ మార్పు అత్యంత తీవ్రమైన పర్యావరణ సమస్యలను కలిగిస్తుందని హెచ్చరించింది. మంచి నీటి వనరులతో పాటు, తీర ప్రాంతాలకు ముప్పు అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.వేగంగా కరుగుతున్న హిమనీనదాలు ఆసియాలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో 2024లో ఒకటిగా నమోదైందని నివేదిక తెలిపింది. 1991–2020 బేస్లైన్ కంటే సగటు ఉష్ణోగ్రతలు 1.04 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉన్నాయని పేర్కొంది. ఖండం ప్రపంచ సగటు కంటే దాదాపు రెండు రెట్లు వేగంగా వేడెక్కుతోందని నివేదిక తెలిపింది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా మధ్య ఆసియాలోని హిమాలయాలు, టియాన్ షాన్ వంటి కీలక పర్వత శ్రేణుల్లో హిమానీనదాలు కరగడం వేగవంతం అయ్యింది. దీనివల్ల కీలకమైన మంచినీటి వనరులు, పర్యావరణ వ్యవస్థలకు ప్రమాదం ఉందని వివరించింది. తీరప్రాంతాలకు ముప్పు.. ఆసియాలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయని ‘స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ఆసియా–2024’నివేదిక తెలిపింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన కారణంగా, ఆసి యా పసిఫిక్, హిందూ మహాసముద్ర తీరప్రాంతా ల్లో సముద్ర మట్టాలు ప్రపంచ సగటు కంటే వేగంగా పెరిగాయి. ఈ ధోరణులు భారత్తో సహా ఖండంలోని తీరప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది ప్రజలకు ప్రమాదమని పేర్కొంది. ఇవి వరదలు, తుఫానుల ప్రమాదాలను పెంచుతాయని వెల్లడించింది. 2024 ఆసియా ఖండం అంతటా తీవ్ర విపత్తులు సంభవించిన విషయం తెలిసిందే. తీవ్రమైన వేడి..ఆసియాలోని కొన్ని ప్రాంతాలను, ముఖ్యంగా భారత్, జపాన్లను సుదీర్ఘమైన వేడి గాలులు తాకాయని తెలిపింది. ఇవి వందలాది మంది మరణాలకు కారణమయ్యాయని నివేదిక పేర్కొంది. సముద్ర ఉష్ణ గాలులు రికార్డు స్థాయిలో 15 మిలియన్ చదరపు కిలోమీటర్లకు చేరుకున్నాయని, ఇది సముద్ర జీవవైవిధ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని హెచ్చరించింది. ఈ సంవత్సరంలో ఉష్ణమండల తుఫాను యాగి ఆగ్నేయాసియా అంతటా విస్తృతమైన నష్టాన్ని కలిగించింది. ఇది గత సెపె్టంబర్లో ఉత్తర వియత్నాంలో డజన్ల కొద్దీ ప్రజల ప్రాణాలను బలిగొంది. అలాగే, మధ్య ఆసియా 70 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత దారుణమైన వరదలను చవి చూసింది. ఎన్నడూ లేనంత వర్షపాతంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మౌలిక సదుపాయాలకు తీవ్ర అంతరాయం కలిగింది. సెపె్టంబర్ 2024లో నేపాల్ కూడా విపరీతమైన వరదలొచ్చాయి. 246 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు సకాలంలో పనిచేయడం, పరిపాలనా వ్యవస్థలు సమన్వయంతో ప్రతిస్పందించడంతో వేలాది మంది ప్రాణాలను కాపాడగలిగారు. తక్షణ లక్ష్యాలు..ఈ విపత్కర పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవడానికి తక్షణ వ్యూహాలు అత్యవసరమని నివేదిక సూచించింది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి దేశాలన్నీ ఉమ్మడి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని పేర్కొంది. పర్యావరణ మార్పుల వల్ల కలిగే మానవ, ఆర్థిక నష్టాన్ని తగ్గించడానికి ముందస్తు చర్యలు చాలా అవసరమని, ప్రజల జీవితాలను, వారి జీవనోపాధిని రక్షించడానికి విపత్తు సంసిద్ధతను మెరుగుపరచాలని సూచించింది. ఇక రాబోయే ముప్పును గుర్తించడంలో జాతీయ వాతావరణ సేవలు కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని గుర్తు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్

ఆ ‘చీకటి’ కోణానికి మరోవైపు...
1975 జూన్ 25న భారతదేశంలో ఎమర్జెన్సీ విధించబడింది. ఈ సంవ త్సరానికి యాభై ఏళ్ళు పూర్తయ్యింది! నిజానికి 1962 నుండి 1968 వరకూ మన దేశంలో ఎమర్జెన్సీ విధించబడిన విషయం మనకెవ్వరికీ తెలీదు. చైనా యుద్ధం వల్ల ఆనాటి ప్రెసిడెంట్ సర్వే పల్లి రాధాకృష్ణన్ దేశంలో ఆత్యయిక పరిస్థితిని విధించారు. అలాగే 1971 నుండి ’77 వరకూ బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో వి.వి. గిరి ఆత్యయిక స్థితి విధించారు. అంటే ఇందిరాగాంధీ మొట్ట మొదటిసారి ప్రమాణస్వీకారం చేసిన 1966లోనూ, రెండవ సారి ప్రధానైన 1971లోనూ మనదేశం అత్యవసర పరిస్థితు ల్లోనే ఉంది. అయితే ప్రజల మీద ఆ పరిస్థితి ప్రభావం లేదు.1975లో మొదటిసారి అంతర్గత ఎమర్జెన్సీ విధించ బడింది. అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఇందిరా గాంధీ మీద ఆ ‘మచ్చ’ ఇప్పటికీ తొలగిపోలేదు. అయితే 1975 నాటి పరిస్థితులు, రాజకీయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామని ఈ చిన్న ప్రయత్నం.పాలనకు అవరోధాలు1966 జనవరి 24న ఇందిరాగాంధీ భారత ప్రధాని అయ్యారు. సోషలిస్టు భావాలున్న ఇందిరకు, కేపిటలిస్ట్ భావ జాలాన్ని బలపరిచే మొరార్జీ దేశాయ్ వంటి నాయకుల నుంచి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే వచ్చాయి.1962లో నెహ్రూ నాయకత్వంలో 361 సీట్లు గెలిచిన కాంగ్రెస్, 1967లో ఇందిర నాయకత్వంలో 243 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏదైనా సంపూర్ణ చికిత్స చేస్తే గానీ కాంగ్రెస్ నిలబడే అవకాశాలు కన్పించటం లేదు. ఆ సమయంలో ప్రధాని ఇందిర తన తండ్రి నెహ్రూ సంకల్పించి, అమలు చేయలేకపోయిన ‘ఆవడి’ కాంగ్రెస్ తీర్మానాలను దులిపి బయటకు తీసింది. ఉప ప్రధాని మొరార్జీ చేతుల్లో ఉన్న ఆర్థిక శాఖను తనే తీసేసుకుంది (ఫలితంగా మొరార్జీ ఉప ప్రధాని పదవికి రాజీనామా చేసేశారు).వెంటనే బ్యాంకుల జాతీయీకరణను ప్రకటించింది ఇందిరాగాంధీ. 1969 జూలై 15 నాటికి రూ. 50 కోట్లు మించి డిపాజిట్లున్న 14 బ్యాంకులను ప్రభుత్వపరం చేస్తూ ఆర్డినెన్స్ జారీ అయింది. ‘దారిద్య్రాన్ని తొలగిద్దాం’ (గరీబీ హఠావో) నినాదంతో సొంత ఎజెండాను అమలుచేయటం ప్రారంభించింది. కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఇందిర తెచ్చిన ‘బ్యాంకుల జాతీయీకరణ’ ఆర్డినెన్సును సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజభరణాలు (ప్రివీ పర్సులు) రద్దు చేస్తూ ఇందిర తీసుకున్న నిర్ణయాన్ని లోక్సభ ఆమోదించినా... రాజ్య సభలో పాస్ కాలేదు. మరోపక్క దేశాన్ని మిలిటరీ స్వాధీనం చేసుకుంటుందన్న పుకార్లు బలంగా వ్యాపించాయి. ఇక, 1974లో గుజరాత్లోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో హాస్టల్ మెస్ ఛార్జీల పెంపుదలను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన విద్యార్థుల ఆందోళన... అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్భాయ్ పటేల్ (కాంగ్రెస్) వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం చెందింది. పైకి ఈ ఉద్యమం చిమన్భాయ్ పటేల్కు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు కనిపించినప్పటికీ, వాస్తవంగా ఇది ఇందిరా గాంధీ వ్యతిరేక ఉద్యమమే!సాక్షాత్తూ జయప్రకాశ్ నారాయణ్ రంగంలోకి దిగడంతో, దాని విలువ విపరీతంగా పెరిగింది. ఏనాడూ ఏ పదవీ ఆశించని ఈ గాంధేయ విప్లవకారుడు... గుజరాత్ ఉద్యమంలోకి రావటంతో ఇందిరకు కష్టాలు ప్రారంభమయ్యాయి.సరిగ్గా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవు తున్న 1975 జూన్ 12 నాడే... ఇందిర శిబిరంలో మరో బాంబు పేలింది. రాయబరేలీ నుంచి లోక్సభకు ఎన్నికైన ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ వంటి అగ్ర నాయకులు ఇందిర వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో జయ ప్రకాశ్ నారాయణ్ మాట్లాడారు. అర్హత కోల్పోయిన ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వులను పాటించవద్దని మిలిటరీ, పోలీసులకు పిలుపునిచ్చారు. విద్యార్థులు కాలేజీలకు వెళ్ళడం మానేసి, మరో స్వాతంత్య్ర పోరాటంలోకి దూకాలన్నారు.రాజ్యాంగానికి లోబడే...1975 జూన్ 25 అర్ధరాత్రి, ఆర్టికల్ 352(1) అనుసరించి భారత రాష్ట్రపతి ‘ఫక్రుద్దీన్ అలీ అహ్మద్’ దేశంలో అత్యవసర పరిస్థితి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతికి ఇందిర అత్యవసర స్థితిని సిఫార్సు చేసిన ఉత్తరంలోనే క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండానే ఈ సిఫార్సు చేస్తున్నాననీ, ఆ విధంగా చేయడం కూడా బిజినెస్ రూల్స్ ప్రకారం రూల్–12కి లోబడే చేస్తున్నాననీ ఆమె పేర్కొన్నారు. రేపు తెల్లవారగానే క్యాబినెట్ మీటింగ్ పెడ్తున్నానని కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. ఆ విధంగా రాజ్యాంగానికి లోబడే అత్యవసర స్థితి ప్రకటించబడింది.ఎమర్జెన్సీ ప్రకటించిన నెల రోజుల్లోపే... అంటే 1975 జూలై 23న లోక్సభ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ఆమోదించింది.రెండు రోజుల చర్చ తర్వాత 336 మంది అనుకూలంగానూ, 59 మంది వ్యతిరేకంగానూ ఓటు చేశారు.ఇప్పటికీ అదొక చీకటి రాజ్యమనీ, ఆమె ఒక నియంత అనీ, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందనీ, ఆమె వ్యతిరేకులు అంటూనే ఉంటారు. రాజ్యాంగంలోంచే ఆర్టికల్ 352 తీయ బడిందనీ, ఆ అధికరణం ప్రకారం ఎమర్జెన్సీ ప్రకటించటం రాజ్యాంగ విరుద్ధమెలా అవుతుందనీ నాలాంటి వాళ్ళకనిపించినా... కాంగ్రెస్ పార్టీయే ‘సారీ’ చెప్పాక అది తప్పే అయి వుంటుంది అనుకుని... ఇక మాట్లాడలేదు!యశపాల్ కపూర్ అనే ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’ తన రాజీనామాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు జనవరి 13న పంపించాడు. 1971 జనవరి 25న ప్రెసిడెంట్ ఆమోద ముద్ర పడింది. ఆ ఉత్తర్వుల్లోనే జనవరి 14 నుంచి అతను ఉద్యోగంలో లేడని స్పష్టంగా ఉంది (విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్). అయినా 25కి ముందే ఆయన ఇందిర తరఫున పార్టీ మీటింగుల్లో పాల్గొన్నాడని ప్రధాని పదవి రద్దయిపోయింది. సుప్రీంకోర్టులో జస్టిస్ కృష్ణయ్యర్ వంటి జడ్జి ‘స్టే’ ఇచ్చినా ‘‘లెక్క చేయం... నువ్వు రాజీనామా చేయాల్సిందే’’ అనటం అంత పెద్ద నాయకుల స్థాయికి తగుతుందా? సరే... ఎమర్జెన్సీ ఎత్తేయటం, ఎన్నికలకు పిలుపు నివ్వటం, ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీ పార్టీ ఓడిపోవటం... నిశ్శబ్దంగా అధికార మార్పిడి జరిగిపోవటం... ఈ చర్యలు కూడా ఆవిడ నియంతృత్వంలో భాగమేనా? దేశమంతా చీకటి పాలనకు వ్యతిరేకంగా ఓటువేస్తే, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న మన రాష్ట్రంలో ఇందిర 42 సీట్లకు 41 సీట్లు ఎలా గెలిచింది! మనకి చీకటంటే అంత ఇష్టమా? అలాగే తమిళనాడు, కేరళ... దక్షిణ భారతంపై ఆ చీకటి ప్రభావం ఎందుకు చూపలేదు?ఎమర్జెన్సీని దేశప్రజలు అధిక శాతం వ్యతిరేకించారు. కానీ ఎమర్జెన్సీ విధించకుండా 1975 జూన్ 26 తర్వాత... కనీసం ఒక్కరోజైనా ఆమె పరిపాలించగలిగేదా? ఇందిరకు ఉన్న ప్రత్యామ్నాయాలు పరిమితం. ఒకటి: రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకోవడం, రెండు: పార్లమెంటును రద్దుచేసి వెంటనే ఎన్నికలకు పోవడం.ఇప్పటివరకూ ప్రధానమంత్రుల్ని దింపేయటం, ప్రధాన మంత్రులను చేయటం పార్లమెంటులో జరిగింది గానీ... రోడ్ల మీద ధర్నాలు, ఊరేగింపుల వల్ల జరిగితే ఇక పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది?1952 నుంచి ఇప్పటి వరకూ ఏ ఎన్నికల్లోనూ ఏ పార్టీ కూడా 50% ఓట్లు సంపాదించి గెలవలేదు. 1984లో ఇందిర హత్యానంతరం 404 లోక్సభ సీట్లు గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్కు పోలైన ఓట్లు 50% లేవు. అలాంటిది, ఒక ‘స్టే’ చెయ్యబడ్డ, పూర్తిగా టెక్నికల్ అయిన కోర్టు తీర్పును అడ్డు పెట్టుకొని ప్రధాని గద్దె దిగాలంటే... ఎలాంటి దృష్టాంతం (ప్రిసిడెంట్) ఏర్పడుతుంది? స్వతంత్ర, జన్సంఘ్ వంటి క్యాపిటలిస్టు పార్టీలు సోషలిస్టు ఇందిరను ఎలాగైనా దింపె య్యాలి అనుకున్నప్పుడు... లొంగిపోవాలా? తిరగబడాలా?ఇందిరా గాంధీ తిరగబడింది. పర్యవసానంగా ఎన్నికల్లో ఓడిపోయింది. పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన వారందరూ కలిసి రెండు ఏళ్ళలో ఏం పరిపాలన చేశారో కూడా దేశం చూసింది. ‘ఇందిరా కో బులావో, దేశ్ కో బచావో’ (ఇందిరను పిలవండి, దేశాన్ని కాపాడండి) అంటూ 1980లో మళ్ళీ ఆమెనే పిలిచి ప్రధాన మంత్రిని చేశారు.(ఇప్పటికీ 352 ఆర్టికల్ చిన్న సవరణతో అలాగే ఉంది. అంతర్గత అలజడులు (ఇంటర్నల్ డిస్టర్బెన్స్)కు బదులుగా సాయుధ తిరుగుబాటు (ఆర్మ్›్డ రెబెలియన్) అని సవరించడం గమనార్హం!)ఉండవల్లి అరుణ కుమార్ వ్యాసకర్త లోక్సభ మాజీ సభ్యుడు(కాంగ్రెస్)
ఓ తండ్రి దారుణం.. మార్కులే జీవితమా?
జపనీస్ వీడియో గేమ్లో రాజమౌళి.. ఇదో క్రేజీ రికార్డ్
వేడెక్కుతున్న ఆసియా.. భారత్లో వారికే ప్రమాదమే..
Jammu: దొంగకు చెప్పుల దండ.. పోలీసుల చర్యపై దర్యాప్తు
‘రప్పా.. రప్పా’పై కేబినెట్లో చర్చ.. జాగ్రత్తగా మాట్లాడండి
‘మీ సేవ’లో ఇసుక బుకింగ్
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్కు మళ్లీ బ్రేక్
అమ్మ ఓడి.. 'పోయింది'
అమరావతికి మరో 45 వేల ఎకరాలు సేకరణ
ఇంటర్ బదిలీల్లో ఎన్నెన్నో వింతలు
తెలుగు సీరియల్ నటి సీమంతం వేడుక
అలాగే లాడెన్ జిందాబాద్ అని కూడా అనమంటున్నార్సార్!
బల ప్రయోగంతోనే శాంతి నిరూపించిన డోనాల్డ్ ట్రంప్ - ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
విశాఖపట్నం : వల నిండింది.. పంట పండింది (ఫొటోలు)
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
బిగ్ ట్విస్ట్.. ముగిసిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం
నాగార్జున ఎవరి కాళ్లకు దండం పెట్టడు.. ఒక్క ఆయనకు మాత్రమే: చిరంజీవి
మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. భూలాభాలు
ఇరుకున పడ్డ ఇరాన్!
యుద్దాలు తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి -ఐక్యరాజ్యసమితి
అల్లు అర్జున్ 'ఐకాన్'.. ఇక లేదు
బ్యాంకు ఉద్యోగితో భార్య వివాహేతర సంబంధం.. చివరికి..!
Khamenei: ఈ రక్తపాతం చాలు.. ఇక తప్పుకో..!
కొంప ముంచిన జైస్వాల్.. కట్టలు తెంచుకున్న సిరాజ్ ఆగ్రహం!
KL Rahul: చూసి ఆడు పంత్.. నేనేమీ నిర్లక్ష్యపు షాట్లు ఆడటం లేదు!.. నువ్వే..
పృథ్వీ షా సంచలన నిర్ణయం.. ఇక గుడ్ బై?
సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ
నటి ఊర్మిళను రెండో పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల సురేష్
‘లక్ష్మణ్ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’
ఓ తండ్రి దారుణం.. మార్కులే జీవితమా?
జపనీస్ వీడియో గేమ్లో రాజమౌళి.. ఇదో క్రేజీ రికార్డ్
వేడెక్కుతున్న ఆసియా.. భారత్లో వారికే ప్రమాదమే..
Jammu: దొంగకు చెప్పుల దండ.. పోలీసుల చర్యపై దర్యాప్తు
‘రప్పా.. రప్పా’పై కేబినెట్లో చర్చ.. జాగ్రత్తగా మాట్లాడండి
‘మీ సేవ’లో ఇసుక బుకింగ్
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్కు మళ్లీ బ్రేక్
అమ్మ ఓడి.. 'పోయింది'
అమరావతికి మరో 45 వేల ఎకరాలు సేకరణ
ఇంటర్ బదిలీల్లో ఎన్నెన్నో వింతలు
తెలుగు సీరియల్ నటి సీమంతం వేడుక
అలాగే లాడెన్ జిందాబాద్ అని కూడా అనమంటున్నార్సార్!
బల ప్రయోగంతోనే శాంతి నిరూపించిన డోనాల్డ్ ట్రంప్ - ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
బిగ్ ట్విస్ట్.. ముగిసిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం
నాగార్జున ఎవరి కాళ్లకు దండం పెట్టడు.. ఒక్క ఆయనకు మాత్రమే: చిరంజీవి
మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. భూలాభాలు
ఇరుకున పడ్డ ఇరాన్!
అల్లు అర్జున్ 'ఐకాన్'.. ఇక లేదు
యుద్దాలు తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి -ఐక్యరాజ్యసమితి
బ్యాంకు ఉద్యోగితో భార్య వివాహేతర సంబంధం.. చివరికి..!
Khamenei: ఈ రక్తపాతం చాలు.. ఇక తప్పుకో..!
కొంప ముంచిన జైస్వాల్.. కట్టలు తెంచుకున్న సిరాజ్ ఆగ్రహం!
KL Rahul: చూసి ఆడు పంత్.. నేనేమీ నిర్లక్ష్యపు షాట్లు ఆడటం లేదు!.. నువ్వే..
పృథ్వీ షా సంచలన నిర్ణయం.. ఇక గుడ్ బై?
సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ
‘లక్ష్మణ్ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు
సినిమా

ఓటీటీకి అజయ్ దేవ్గణ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అజయ్ దేవ్గణ్ , రితేశ్ దేశ్ముఖ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ రైడ్-2. గతంలో విడుదలైన రైడ్ మూవీకి సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రాజ్ కుమార్ గుప్తా డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా గత నెలలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. థియేటర్ల వద్ద దాదాపు రూ. 157.88 కోట్ల నికర వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 26 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో రైడ్-2 ట్రైలర్ను విడుదల చేసింది నెట్ఫ్లిక్స్. ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ అమయ్ పట్నాయక్ పాత్రలో కనిపించారు. రితేష్ దేశ్ముఖ్ ఎప్పుడూ చూడని పవర్ఫుల్ రోల్లో కనిపించారు. అంతేకాకుండా ఈ చిత్రంలో వాణి కపూర్, సౌరభ్ శుక్లా ప్రత్యేక పాత్రల్లో నటించారు.Aaj se ulti ginti shuru 🔥Amay Patnaik is back with a new case and the same old fire 👊 Watch Raid 2, out 26 June, on Netflix.#Raid2OnNetflix pic.twitter.com/f06uJB6feQ— Netflix India (@NetflixIndia) June 24, 2025

కన్నప్ప సెన్సార్.. 12 కట్స్.. రన్ టైమ్ ఎంతంటే?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న కన్నప్ప రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఈ నెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో ప్రభాస్తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.తాజాగా కన్నప్ప మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ రన్టైమ్ దాదాపు 182 నిమిషాలు కాగా.. అంటే మూడు గంటల రెండు నిమిషాలుగా ఉంది. మైథలాజికల్ నేపథ్యంలో వస్తోన్న మూవీ కావడంతో రన్టైమ్ కాస్తా ఎక్కువగానే ఉంది. 195 నిమిషాల నిడివితో ఈ సినిమాను తెరకెక్కించగా.. సెన్సార్ బోర్డ్ 12 కట్స్ చెప్పింది. సీబీఎఫ్సీ నిబంధనల ప్రకారం చిత్రం మార్పులకు అంగీకరించింది. రాబందు ఓ చిన్నారిని పై నుంచి పడేయటం.. తిన్నడుకు సంబంధించిన కొన్ని సీన్స్, మూడు పాటల్లోని విజువల్స్ను తొలగించారు.మరోవైపు కన్నప్ప అడ్వాన్స్ బుకింగ్స్ రేపటి నుంచి మొదలవుతాయని మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఇప్పటికే ఓవర్సీస్లో బుకింగ్స్ ఓపెన్ కాగా.. తెలుగు అభిమానులకు బుధవారం నుంచి అందుబాటులోకి రానున్నాయని విష్ణు వెల్లడించారు. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప సినిమా తర్వాత దాదాపు 50 ఏళ్లకు మరోసారి కన్నప్ప కథ రావడంతో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. #Kannappa Advance bookings open in Telugu tomorrow, 25th June 🙏🔥! #HarHarMahadev— Vishnu Manchu (@iVishnuManchu) June 24, 2025

ప్రభాస్ది పవర్ఫుల్ పాత్ర.. చివరి గంట అద్భుతం: దర్శకుడు ముకేష్
కన్నప్ప అనేది మైథలాజీ కాదు.. ఇది మన హిస్టరీ. ఓ ఘటన జరిగితే.. ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు. కన్నప్ప అనే వాడు ఉండేవాడు. కానీ ఎవ్వరికీ సరిగ్గా తెలీదు. కన్నప్ప తన కంటిని శివుడికి ఇచ్చాడు. ఇదంతా మన చరిత్ర. దాన్నే మా చిత్రంలో చూపించాం’ అన్నాడు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్. ఆయన దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు ముఖేష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..👉 నేను ఇంత వరకు బుల్లితెరపై చేసినవన్నీ హై బడ్జెట్ ప్రాజెక్టులే. ‘మహా భారతం’ సీరియల్ను రూ. 200 కోట్లతో తీశాం. నాకు సినిమాలేమీ కొత్త కాదు. ఇది వరకు అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఇంగ్లీష్ చిత్రాల్ని నిర్మించాను. నేను బుల్లితెరకు పని చేసినా, వెండితెరకు పని చేసినా ఒకే మైండ్ సెట్తో పని చేస్తాను.👉 ‘మహాభారతం’ సీరియల్ అన్ని ఎపిసోడ్స్కి నేను దర్శకత్వం వహించలేదు. మరి కొంత మంది దర్శకులు కూడా ఉన్నారు. విష్ణు టీం నుంచి నాకు ఓ సారి కాల్ వచ్చింది. నాతో పాటు ఇంకా కొంత మంది కూడా ఆ సీరియల్కు డైరెక్ట్ చేశారు అని చెప్పాను. ఆ తరువాత చాలా రోజుల వరకు కాల్స్ ఏమీ రాలేదు. అనూప్ సింగ్ ఠాకూర్ ఆచారి అమెరికా యాత్ర సినిమాను చేశారు. ఆ టైంలో నా గురించి అనూప్,విష్ణుకి చర్చ జరిగింది. అలా నన్ను మళ్లీ అప్రోచ్ అయ్యారు.👉 విష్ణు నన్ను హైదరాబాద్కు రమ్మన్నారు. ఇక్కడకు వచ్చినప్పుడు ఓ మూడు, నాలుగు గంటలు చర్చించుకున్నాం. అప్పటి వరకు నాకు కన్నప్ప గురించి అంత పెద్దగా తెలీదు. విష్ణు ఈ కథ గురించి చెప్పిన తరువాత చాలా రీసెర్చ్ చేశాను. మళ్లీ మోహన్ బాబు గారు మరోసారి పిలిచారు. మహాభారతం సీరియల్ గురించి నాతో గంట మాట్లాడారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి కూడా చర్చించుకున్నాం. అలా నన్ను ఈ చిత్రానికి ఫైనల్ చేశారు.👉 ‘కన్నప్ప’ కోసం ప్రతీ ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. అందరూ ఎంతో అంకిత భావంతో సెట్స్ మీద వర్క్ చేశారు. వారి వల్లే నా పని చాలా ఈజీగా మారిపోయింది. అక్షయ్ , మోహన్లాల్, ప్రభాస్ , మోహన్ బాబు , విష్ణు , బ్రహ్మానందం ఇలా అందరితో పని చేయడం మరిచిపోలేని అనుభూతి. మోహన్ బాబు ఈ వయసులోనూ ఎంతో ప్యాషనేట్గా పని చేశారు. నిర్మాతగా ఒకలా ఉండేవారు.. నటించేటప్పుడు ఇంకోలా అనిపించేవారు.👉 ‘కన్నప్ప’ మీద ఇంత వరకు వచ్చిన చిత్రాలన్నీ చూశాను. కన్నడ, తెలుగు, హిందీలో వచ్చిన చిత్రాలన్నీ చూశాను. అన్నింటినీ గమనించాను. వారిలానే నేను కూడా న్యాయం చేయాలని అనుకున్నాను. విష్ణు కన్నప్ప పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. చివరి గంట అద్భుతంగా ఉంటుంది.👉 మా ఆర్ట్ డైరెక్టర్ చాలా రీసెర్చ్ చేశారు. ఎన్నో మ్యూజియంలను సందర్శించారు. వెపన్స్, క్యాస్టూమ్స్ మీద చాలా పరిశోధనలు చేశాం. రెండో శతాబ్దం వాతావరణం తెరపైకి తీసుకు రావడానికి చాలా ప్రయత్నించాం. అందుకే న్యూజిలాండ్కు వెళ్లి మూవీని షూటింగ్ చేశాం.👉 ప్రభాస్ పాత్ర ఎంతో పవర్ ఫుల్గా ఉంటుంది. ఇందులో ఎవరి క్యారెక్టర్ కూడా అలా వచ్చి ఇలా వెళ్లేలా ఉండదు. అన్ని పాత్రలు ప్రేక్షకులపై కచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఎవ్వరి ఫ్యాన్స్ కూడా ఈ మూవీని చూసి నిరాశచెందరు. ఇప్పటి వరకు చాలా మందికి ఈ మూవీని చూపించాం. అందరూ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు.👉 కన్నప్పపై ఇది వరకు వచ్చిన చిత్రాల్లో కూడా లిబర్టీ తీసుకున్నారు. ఇందులో కూడా కొంత వరకు ఫిక్షనల్ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఇంటర్ లింకింగ్గా చూపించాం. శ్రీకాళహస్తి అర్చకులకు ఈ మూవీని చూపించాం. ఈ చిత్రం పూర్తయిన తరువాత అద్భుతంగా ఉందని అర్చకులు మెచ్చుకున్నారు. సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందని అడిగారు.👉 మహాభారతం సీరియల్ తీశాను. ఇప్పుడు సినిమాగా తీయాలని అనుకుంటున్నాను. మహాభారతం అనేది పబ్లిక్ ప్రాపర్టీ. ఎవరైనా తీసుకోవచ్చు. రాజమౌళి గారు తీసుకోవచ్చు. ఆమిర్ ఖాన్ గారు తీసుకోవచ్చు. అది పబ్లిక్ డొమైన్లో ఉన్న సబ్జెక్ట్.

హీరోయిన్ శృతిహాసన్ సోషల్ మీడియా ఖాతా హ్యాక్!
హీరోయిన్ శ్రుతి హాసన్ ట్విటర్ ఖాతా హ్యాకింగ్కు గురైంది. ఆమె అకౌంట్ నుంచి బిట్కాయిన్, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన సందేశాలు దర్శనమిచ్చాయి. వరుసగా ఆమె ఖాతా నుంచి ఈ సందేశాలు రావడంతో ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. హ్యాకింగ్ గురించి శృతిహాసన్ ఇన్స్టా వేదికగా తెలిపింది. దయచేసి ఎవరూ కూడా ఆ మేసేజ్లకు స్పందించవద్దని విజ్ఞప్తి చేసింది.శృతి హాసన్ ట్విటర్ ఖాతాలో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులు వరుసగా దర్శనమిచ్చాయి. మావెరిక్స్ యజమాని - మార్క్ క్యూబన్ పేరుతో ఈ ట్వీట్స్ పోస్ట్ చేశారు. అయితే శృతి హాసన్ ఖాతా హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2017లోనూ ఆమె ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు. ఆ తర్వాత ఎవరో నా ఖాతాను హ్యాక్ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలర్ట్ చేసింది.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

‘పట్టుదలతో కట్టిపడేశాడు’
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రస్తుత అధ్యక్షుడు, గతంలో బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన జై షాపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. 2019 నుంచి 2022 వరకు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో జై షా బోర్డు కార్యదర్శిగా పనిచేశాడు. వీరిద్దరి మధ్య చక్కటి అనుబంధం ఉంది. రాజకీయ నేపథ్యం ఉన్న జై షా నిజాయితీ, పట్టుదల తనను ఎంతో ఆకట్టుకున్నాయని గంగూలీ పేర్కొన్నాడు. ‘అప్పగించిన పనులు పూర్తి చేయడంలో జై షా చాలా ప్రత్యేకం. అతడు భారత క్రికెట్ అభివృద్ధికి సహకరించాడు. రాజకీయ నేపథ్యం నుంచి రావడంతో అతడి నిర్ణయాల్లో మొండితనం, ఓరకమైన దృఢత్వం ఉంటుందని ఆశించా. కానీ అందుకు భిన్నమైన తీరుతో నిజాయితీ, పట్టుదలతో ఆకట్టుకున్నాడు. ఎప్పుడూ ఆట గురించే ఆలోచిస్తాడు. దీన్ని మరింత మెరుగు పరిచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టొచ్చా అని మార్గాలు వెతుకుతుంటాడు’ అని గంగూలీ అన్నాడు. కోవిడ్–19 వంటి క్లిష్ట సమయంలో బోర్డు అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేసిన గంగూలీ, జై షా ఆటగాళ్ల సంరక్షణ కోసం ఎన్నోచర్యలు చేపట్టారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలు ఆగిపోయిన దశలోనూ ‘బయోబబుల్’ వంటి ప్రత్యేక ఏర్పాట్లతో ద్వైపాక్షిక సిరీస్లు, ఐపీఎల్ వంటి టోర్నీలను నిర్వహించారు. 2022లో పదవీకాలం ముగియడంతో గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగా... గతేడాది వరకు కార్యదర్శిగా కొనసాగిన 36 ఏళ్ల జై షా... 2024 నవంబర్లో ఐసీసీ చైర్మన్గా నియమితుడయ్యాడు. తద్వారా పిన్న వయసులో ఈ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా నిలిచాడు. ‘2019లో తొలిసారి అతడిని కలిశాను. గుజరాత్ క్రికెట్ సంఘంలో పనిచేసి వచ్చాడు. చిన్నపిల్లవాడిలా కనిపించాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అండగా నిలిచేవాడు. ఏ సమయంలో అయినా సంప్రదించగానే స్పందించేవాడు. అతడికి ఆటపై స్పష్టమైన అభిప్రాయాలు, అవగాహన ఉంది. ఆటగాళ్లకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాడు. క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉన్నత లక్ష్యం అతని ఎదుగుదలకు సహకరించింది. అనుభవంతో మరింత రాటుదేలాడు. ఇప్పుడు క్రికెట్లో అత్యున్నత పదవైన ఐసీసీ చైర్మన్ బాధ్యతలు చేపడుతున్నాడు. నిజాయితీగా పనులు పూర్తి చేస్తాడు. ఇప్పటికీ అతడితో మంచి అనుబంధం కొనసాగుతోంది’ అని గంగూలీ వివరించాడు.

నీరజ్ చోప్రాకు స్వర్ణ పతకం
ఒ్రస్టావా (చెక్ రిపబ్లిక్): భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... ఒ్రస్టావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. గతవారం పారిస్ డైమండ్ లీగ్ మీట్లో ‘టాప్’లో నిలిచిన నీరజ్... మంగళవారం జరిగిన పోటీల్లో జావెలిన్ను 85.29 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం దక్కించుకున్నాడు. నాలుగు రోజుల వ్యవధిలో నీరజ్కు ఇది రెండో టైటిల్ కావడం విశేషం. ఈ మీట్లో తొలిసారి బరిలోకి దిగిన నీరజ్ అందరికంటే మెరుగైన ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. డౌ స్మిత్ (84.12 మీటర్లు; దక్షిణాఫ్రికా), అండర్సన్ పీటర్స్ (83.63 మీటర్లు; గ్రెనెడా) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్... రెండో ప్రయత్నంలో ఈటెను 83.45 మీటర్ల దూరం విసిరాడు.మూడో ప్రయత్నంలో అత్యుత్తమంగా 85.29 మీటర్ల దూరాన్ని నమోదు చేసుకున్న భారత అథ్లెట్.. తర్వాతి ప్రయత్నాల్లో ఆకట్టుకోలేకపోయాడు. నీరజ్ కోచ్, చెక్ రిపబ్లిక్ గ్రేట్ అథ్లెట్ జాన్ జెలెజ్నీ గతంలో ఈ మీట్లో తొమ్మిదిసార్లు విజేతగా నిలిచాడు.

'లీడ్స్' వదిలేశారు.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి
తొలి రోజు నుంచే అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన... రెండు ఇన్నింగ్స్లలో కలిపి 835 పరుగులు... గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఐదు సెంచరీలు... బుమ్రా అద్భుత బౌలింగ్ ప్రదర్శన... అన్నీ సానుకూలతలే కనిపించినా... చివరకు ఓటమి మాత్రం తప్పలేదు. తొలి టెస్టుల్లో పలు సందర్భాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ తుది దశకు వచ్చేసరికి చేతులెత్తేసింది. గెలుపు కోసం చివరి రోజు 350 పరుగుల భారీ స్కోరు చేయాల్సిన ఇంగ్లండ్ మొదటి ఓవర్ నుంచే పరుగుల వేటలో పడింది. వ్యూహాత్మకంగా బుమ్రా బౌలింగ్లో సాహసం చేయని బ్యాటర్లు ఇతర బౌలర్లపై చెలరేగి జోరుగా సాగిపోయారు. తాము ఆశించిన రీతిలో ‘బజ్బాల్’ శైలిలో ఎక్కడా తగ్గకుండా 4.54 రన్రేట్తో దూసుకుపోయిన ఇంగ్లండ్ ఘన విజయాన్ని అందుకుంది. డకెట్ మెరుపు సెంచరీకి క్రాలీ అండగా నిలవగా... చివర్లో రూట్ కీలక అర్ధ సెంచరీతో జట్టును నడిపించాడు. తొలి టెస్టులో ఓటమి పక్షాన నిలిచిన కొత్త కెపె్టన్ శుబ్మన్ గిల్ సిరీస్లో మున్ముందు ఎలాంటి ఫలితాలు రాబడతాడనేది చూడాలి. లీడ్స్: ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ను భారత్ పరాజయంతో మొదలు పెట్టింది. హెడింగ్లీ మైదానంలో మంగళవారం ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు 21/0తో ఆటను మొదలు పెట్టిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 82 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగులు చేసింది. బెన్ డకెట్ (170 బంతుల్లో 149; 21 ఫోర్లు, 1 సిక్స్), జాక్ క్రాలీ (126 బంతుల్లో 65; 7 ఫోర్లు) తొలి వికెట్కు 188 పరుగులు జోడించి బలమైన పునాది వేయగా... ఆఖర్లో జో రూట్ (84 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు), జేమీ స్మిత్ (55 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. రూట్, స్మిత్ ఆరో వికెట్కు అభేద్యంగా 71 పరుగులు జత చేశారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ పని పట్టిన స్టార్ పేసర్ బుమ్రా రెండో ఇన్నింగ్స్లో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయగలిగినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇతర బౌలర్ల పేలవ ప్రదర్శన ఇంగ్లండ్కు గెలుపు అవకాశాలు సృష్టించింది. ఈ విజయంతో సిరీస్లో ఇంగ్లండ్ 1–0తో ముందంజ వేసింది. సిరీస్లో రెండో టెస్టు జూలై 2 నుంచి బర్మింగ్హామ్లో జరుగుతుంది. భారీ భాగస్వామ్యం... ఇంగ్లండ్ ఓపెనర్లు క్రాలీ, డకెట్ చివరి రోజు ఆటను జాగ్రత్తగా మొదలు పెట్టారు. అయితే నిలదొక్కుకున్న తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో ధాటిని పెంచారు. ఈ క్రమంలో ముందుగా 66 బంతుల్లో డకెట్ హాఫ్ సెంచరీ పూర్తయింది. 42 పరుగుల వద్ద క్రాలీ ఇచ్చిన కఠినమైన రిటర్న్ క్యాచ్ను అందుకోవడంలో బుమ్రా విఫలమయ్యాడు. లంచ్ వరకు కూడా ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీని విడదీయడంలో భారత్ విఫలమైంది. తొలి సెషన్లో ఇంగ్లండ్ 24 ఓవర్లలో 96 పరుగులు సాధించింది. విరామం తర్వాత 111 బంతుల్లో క్రాలీ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరు మరింత జోరుగా ఆడారు. 97 పరుగుల వద్ద డకెట్ ఇచి్చన క్యాచ్ జైస్వాల్ వదిలేయడం కూడా జట్టుకు కలిసొచ్చింది. తర్వాతి ఓవర్లోనే డకెట్ 121 బంతుల్లో కెరీర్లో ఆరో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత స్వల్ప వర్షం కారణంగా దాదాపు ఇరవై నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగింది. గెలిపించిన రూట్, స్మిత్... వాన ఆగిన తర్వాత భారత్కు సానుకూల ఫలితం వచ్చింది. ఎట్టకేలకు క్రాలీని అవుట్ చేసి భారత్కు తొలి వికెట్ అందించిన ప్రసిద్... తన తర్వాతి ఓవర్లోనే ఒలీ పోప్ (8)ను కూడా పెవిలియన్ పంపించాడు. ఈ దశలో డకెట్, రూట్ మళ్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ మూడో వికెట్కు 47 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ వేగంగా దూసుకుపోతున్న తరుణంలో శార్దుల్కు బంతి అప్పగించడం భారత్కు మేలు చేసింది.దూకుడుగా ఆడుతున్న డకెట్తో పాటు హ్యారీ బ్రూక్ (0)ను వరుస బంతుల్లో అవుట్ చేసి శార్దుల్ ఒక్కసారిగాటీమిండియా శిబిరంలో ఉత్సాహం నింపాడు. అయితే రూట్, బెన్ స్టోక్స్ (51 బంతుల్లో 33; 4 ఫోర్లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు 77 బంతుల్లో 49 పరుగులు జత చేశారు. అయితే జడేజా బౌలింగ్ పదే పదే రివర్స్ స్వీప్కు ప్రయత్నించిన స్టోక్స్ అదే షాట్ ఆడి నిష్క్రమించాడు. ఈ దశలో ఇంగ్లండ్ మరో 69 పరుగులు చేయాల్సి ఉండటంతో భారత బృందంలో కాస్త ఆశలు రేగాయి. అయితే అనుభవజు్ఞడైన రూట్ అండగా యువ కీపర్ స్మిత్ ఒత్తిడిని అధిగమించి చక్కటి షాట్లు ఆడటంతో ఇంగ్లండ్ గెలుపునకు చేరువైంది. భారత్ కొత్త బంతిని తీసుకున్నా అప్పటికే ఆలస్యమైపోయింది. జడేజా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన స్మిత్...అదే ఓవర్ చివరి బంతికి మరో సిక్స్ బాది మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 471; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465; భారత్ రెండో ఇన్నింగ్స్: 364; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) రాహుల్ (బి) ప్రసిధ్ 65; డకెట్ (సి) (సబ్) నితీశ్ రెడ్డి (బి) శార్దుల్ 149; పోప్ (బి) ప్రసిధ్ 8; రూట్ (నాటౌట్) 53; బ్రూక్ (సి) పంత్ (బి) శార్దుల్ 0; స్టోక్స్ (సి) గిల్ (బి) జడేజా 33; స్మిత్ (నాటౌట్) 44; ఎక్స్ట్రాలు 21; మొత్తం (82 ఓవర్లలో 5 వికెట్లకు) 373. వికెట్ల పతనం: 1–188, 2–206, 3–253, 4–253, 5–302. బౌలింగ్: బుమ్రా 19–3–57–0, సిరాజ్ 14–1–51–0, జడేజా 24–1–104–1, ప్రసిధ్ 15–0–92–2, శార్దుల్ 10–0–51–2. 5 ఒక టెస్టులో ఐదు సెంచరీలు నమోదు చేసిన తర్వాత కూడా ఓటమి పాలైన తొలి జట్టుగా భారత్ నిలిచింది.2 టెస్టుల్లో ఇంగ్లండ్కు ఇది రెండో అతి పెద్ద ఛేదన. 2022లో భారత్పైనే బర్మింగ్హామ్లో 378 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.6 హెడింగ్లీ మైదానంలో ఇంగ్లండ్ వరుసగా ఆరో టెస్టు గెలిచింది. ఈ ఆరు సార్లు జట్టు లక్ష్యాలను ఛేదించడం విశేషం.3 టెస్టు మ్యాచ్ నాలుగు ఇన్నింగ్స్లలోనూ 350కు పైగా స్కోర్లు నమోదు కావడం ఇది మూడోసారి మాత్రమే.1673 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఒకే టెస్టులో నమోదైన మొత్తం పరుగులు. ఈ రెండు జట్ల మధ్య ఇదే అత్యధికం.

Ind vs Eng: ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియాకు తప్పని ఓటమి
Ind vs Eng 1st Test: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. లీడ్స్ వేదికగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టు చేతిలో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్కు వెళ్లింది. ఈ క్రమంలో హెడింగ్లీ మైదానంలో శుక్రవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తొలి ఇన్నింగ్స్లో మూడు శతకాలుబ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (42), యశస్వి జైస్వాల్ (101) శుభారంభం అందించారు. జైసూతో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీతో చెలరేగారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకు ఆలౌట్ అయింది.ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ చెరో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ తలా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆతిథ్య జట్టు.. 465 పరుగులు చేసింది.ఆరు పరుగుల ఆధిక్యంఓపెనర్ బెన్ డకెట్ (62) హాఫ్ సెంచరీతో మెరవగా.. వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ సెంచరీ (106)తో ఆకట్టుకున్నాడు. ఇక మరో కీలక బ్యాటర్ హ్యారీ బ్రూక్ 99 పరుగులతో అదరగొట్టగా... మిగతా వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ 40, టెయిలెండర్ క్రిస్ వోక్స్ 38 పరుగులతో రాణించారు.భారత బౌలర్లలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు కూల్చగా.. మిగిలిన పేసర్లలో ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో465 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.ఆదుకున్న రాహుల్, పంత్.. కానీఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గిల్ సేన శుభారంభం అందుకోలేకపోయింది. ఈసారి ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) పూర్తిగా విఫలమయ్యాడు. నాలుగో నంబర్ బ్యాటర్, కెప్టెన్ గిల్ (8) కూడా నిరాశపరిచాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు.ఈ దశలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (137), రిషభ్ పంత్ (118) శతకాలు సాధించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. అయితే, ఆ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ (20) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. శార్దూల్ ఠాకూర్ (4), సిరాజ్ (0), బుమ్రా (0), ప్రసిద్ కృష్ణ (0) చేతులెత్తేశారు. రవీంద్ర జడేజా (25 నాటౌట్) కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో 96 ఓవర్లలో 364 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది.శతక్కొట్టిన డకెట్ఈ స్కోరుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆరు పరుగులు కలుపుకొని.. ఇంగ్లండ్ లక్ష్యాన్ని 371 పరుగులుగా నిర్దేశించింది గిల్ సేన. సోమవారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఈ క్రమంలో మంగళవారం ఓవర్ నైట్ స్కోరు 21/0తో ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆది నుంచే ఆధిపత్యం కనబరిచింది. తొలి సెషన్లో వికెట్ నష్టపోకుండా ఆడిన స్టోక్స్ బృందం.. ఆ తర్వాత వికెట్లు కోల్పోయినా టార్గెట్ను పూర్తి చేసింది.ఓపెనర్లలో జాక్ క్రాలే అర్ద శతకం (65) చేయగా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బెన్ డకెట్ అద్భుత శతకం (149)తో మెరిశాడు. ఓలీ పోప్ (8), హ్యారీ బ్రూక్ (0) విఫలమైనా.. జో రూట్ (53 నాటౌట్), జేమీ స్మిత్ (44 నాటౌట్) పని పూర్తి చేశారు. ఇక కెప్టెన్ స్టోక్స్ 33 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జడేజా ఒక వికెట్ తీయగా.. ప్రసిద్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. కాగా, ఈ ఓటమితో కెప్టెన్గా గిల్కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్- తొలి టెస్టు🏏షెడ్యూల్: జూన్ 20- 24🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్🏏తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు ఆరు పరుగుల ఆధిక్యం🏏టీమిండియా రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371🏏ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా 373 పరుగులు సాధించి లక్ష్యాన్ని ఛేదించిన స్టోక్స్ బృందం🏏ఫలితం: ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై ఇంగ్లండ్ విజయం
బిజినెస్

ఏటా రూ.10.8 లక్షలు జీతం.. రూ.3.2 లక్షలు పొదుపు అయినా..
సొంతంగా ఇల్లు కలిగి ఉండడం అనేది సామాన్యుడి కల. దేశంలోని కొన్ని నగరాల్లో ఇకపై అది కలగానే ఉంటుందని కొన్ని నివేదికల వివరాల ద్వారా తెలుస్తుంది. భారత వాణిజ్య నగరం ముంబయి వంటి నగరాల్లో అయితే సామాన్యుడు ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు పోగుచేసి ఇల్లు కొనడం దాదాపు అసాధ్యం అనే వాదనలున్నాయి. అందుకు పెరుగుతున్న ఆస్తుల విలువే ప్రధాన కారణమని రిపోర్ట్లు తెలుపుతున్నాయి.ఒక విశ్లేషణ ప్రకారం నెలకు రూ.90 వేలు వేతనం అంటే ఏటా రూ.10.8 లక్షలు ఆదాయం పొందే ఓ వ్యక్తి ఉన్నారనుకుందాం. వార్షికంగా 30.2% రేటుతో రూ.3.2 లక్షలు పొదుపు చేస్తున్నాడనుకుందాం. తాను ఒకవేళ ముంబయిలో స్థిరాస్తి కొనుగోలు చేయాలని భావిస్తుంటే అక్కడి సగటు ఆస్తి వ్యయం మార్చి 2025 లెక్కల నాటికి చదరపు అడుగుకు రూ.29,911గా ఉంది. సాధారణ ఇంటి పరిమాణం 1,184 చదరపు అడుగులు లెక్కిస్తే ఇంటికి మొత్తం వ్యయం రూ.3.54 కోట్లు అవుతుంది. దీని ప్రకారం ఏటా తాను పొదుపు చేస్తున్న డబ్బు ఆధారంగా 109 ఏళ్లకు రూ.3.54 కోట్లు సమకూరుస్తాడు. అంటే ఇప్పుడు ప్లాన్ చేస్తే 109 ఏళ్లు తర్వాత ఇల్లు కొంటాడు. అదికూడా ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకోకపోతేనే!ఇదీ చదవండి: ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు!దాదాపు అదే ధర కలిగిన ఆస్తిని దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కొనుగోలు చేయాలంటే కొంత తక్కువ సమయం పడుతుంది. గుర్గావ్లో ఇది 64 ఏళ్లుగా ఉంది. బెంగళూరులో 36 ఏళ్లుఢిల్లీ-35 ఏళ్లుచండీగఢ్లో 15 ఏళ్లు పడుతుంది.సంక్షోభానికి కారణమేమిటి?తీవ్రమైన భూ కొరత ఉండడం.అధిక జనసాంద్రత, పట్టణ వలసలు పెరుగుతుండడం.డిమాండ్ తగ్గినప్పటికీ డెవలపర్లు సిండికేట్గామారి ఇష్టారీతిన ధరలు పెంచడం.విధానపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చౌక గృహాల నిర్మాణంపై డెపలపర్లు మొగ్గు చూపకపోవడం.ఫలితంగా సంపన్నులు సైతం ఒకింత ఆలోచించి కొనుగోలు నిర్ణయం తీసుకునేలా రేట్లు పెరగడం.

ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు!
ఆధార్ కార్డులో అప్డేట్స్ చేయాలంటే ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా యూఐడీఏఐ చర్యలు చేపడుతుంది. ఆధార్ కార్డులో చిరునామా మార్చాలన్నా, మొబైల్ నంబర్ అప్డేట్ చేయాలన్నా, పేరు, పుట్టిన తేదీ.. వంటివాటిలో మార్పులు చేయాలన్నా ఇకపై ఆధార్ సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సర్వీసులు అప్డేట్ చేస్తున్నారు. నేరుగా ఆన్లైన్లోనే నవంబర్ 2025 నుంచి సవరణ సదుపాయాన్ని కల్పించేలా యూఐడీఏఐ చర్యలు చేపడుతుంది.ప్రభుత్వం ప్రకటించిన ఈ విధానం వల్ల భౌతిక పత్రాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఆధార్ అప్డేట్ కోసం ఆయా కేంద్రాలను సందర్శించే అసౌకర్యాన్ని తొలగిస్తుంది. అప్డేషన్ ప్రక్రియ ఆన్లైన్ సేవల ద్వారా వేగవంతం అవుతుంది. ఈ సర్వీసుల ద్వారా సురక్షితంగా, సులభంగా కొత్త ఆధార్ను పొందే వీలుంటుంది. దేశంలోని కొన్ని లక్షల మందికి ఈ సర్వీస్ ఉపయోగకరంగా మారుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: మీపేరుపై ఇంకేమైనా సిమ్కార్డులున్నాయా?దరఖాస్తు సమయంలో పాన్, పాస్పోర్ట్, రేషన్ కార్డు వంటి ఇప్పటికే ప్రభుత్వ డేటాబేస్లో ఉన్న వివరాల ద్వారా యూఐడీఏఐ మీ వివరాలను తనిఖీ చేస్తుంది. పత్రాలను పదేపదే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇది నియంత్రిస్తుంది. విద్యుత్ బిల్లులు వంటి యుటిలిటీ బిల్లులను కూడా మీ చిరునామాను ధ్రువీకరించడానికి ఉపయోగించవచ్చు. నవీకరణ ప్రక్రియను ఈ చర్యలు గణనీయంగా క్రమబద్ధీకరిస్తాయి.కొత్త మొబైల్ అప్లికేషన్..క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ ఆధార్తో కూడిన కొత్త మొబైల్ అప్లికేషన్ను యూఐడీఏఐ త్వరలో విడుదల చేయనుందని చెప్పింది. ఈ అప్డేట్తో ఇకపై మీ ఆధార్ కార్డు ఫిజికల్ ఫొటోకాపీలను సమర్పించాల్సిన అవసరం లేదు. అందుకు బదులుగా వినియోగదారులు అవసరమైనప్పుడల్లా సురక్షితమైన డిజిటల్ లేదా మాస్క్ ఆధార్ను చూపించవచ్చు. మోసాలను అరికట్టడం, నకిలీ ఆధార్ కార్డుల చలామణిని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుంది.

మీపేరుపై ఇంకేమైనా సిమ్కార్డులున్నాయా?
ప్రస్తుతకాలంలో చాలామంది ఒకటికంటే ఎక్కువ ఫోన్లు వాడుతున్నారు. వాటిలో రెండు కంటే ఎక్కువ సిమ్కార్డులు వినియోగిస్తున్నారు. అయితే గతంలో మీపేరుతో ఎప్పుడో ఒకపుడు తాత్కాలికంగా సిమ్కార్డులు తీసుకునే ఉంటారు. కేంద్రం నిబంధనల ప్రకారం ఒకరి పేరుమీద గరిష్ఠంగా 9 సిమ్కార్డులే ఉండాలి. కాబట్టి అనవసరమైన సిమ్కార్డులను నిలిపేయాలంటే మార్గం ఉంది. దాంతోపాటు అసలు మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు రిజిస్ట్రర్ అయ్యాయో తెలుసుకువాలంటే కింది సమాచారం తెలుసుకోవాల్సిందే.ప్రభుత్వ వెబ్సైట్ సంచార్సాతి వెబ్సైట్ ద్వారా మీరు గతంలో తీసుకున్న నంబర్లు, ప్రస్తుతం వాడుతున్న సిమ్కార్డుల వివరాలు తెలుసుకోవచ్చు. దీనిద్వారా గతంలో తీసుకుని వినియోగంలోలేని సిమ్కార్డులను నేరుగా ఆన్లైన్లో ద్వారా నిలిపేసే సౌకర్యం ఉంది. అది ఎలాగో చూద్దాం.ఇదీ చదవండి: యుద్ధంపై అనుమానాలు.. బంగారం ధరల్లో క్షీణతముందుగా ఆన్లైన్లో బ్రౌజర్ ద్వారా https://sancharsaathi.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లాలి.కింద సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కేటగిరీలో ‘Know Your Mobile Connections’పై క్లిక్ చేయాలి. ఈ సర్వీస్ను టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జూమర్ ప్రొటెక్షన్(టీఏఎఫ్సీఓపీ) అందిస్తోంది.‘Know Your Mobile Connections’పై క్లిక్ చేసిన వెంటనే కొత్త విండో ఓపెనె అవుతుంది. అందులో ప్రస్తుతం వాడుతున్న మొబైల్నంబర్ను ఎంటర్ చేయాలి. కింద క్యాప్చా కోడ్ను ఇవ్వాలి. ‘వాలిడేట్ క్యాప్చా’ బటన్ ప్రెస్ చేయాలి.పైన ఇచ్చిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని కింద తెలిపిన బ్లాక్లో ఎంటర్చేసి లాగిన్ అవ్వాలి. మీ పేరుతో ఏ నంబర్లు రిజిస్ట్రర్ అయ్యాయో వాటి వివరాలతో లిస్ట్ వస్తుంది.ఒకవేళ ఏదేని నంబర్ను నిలిపేయాలంటే పక్కనే ఆప్షన్లు ఉంటాయి. వాటిపై క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. చివరగా లాగ్అవుట్ చేయడం మరిచిపోకూడదు.

యుద్ధంపై అనుమానాలు.. బంగారం ధరల్లో క్షీణత
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) సోమవారంతో పోలిస్తే మంగళవారం వినియోగదారులకు ఊరట కల్పించింది.ఇదీ చదవండి: టెస్లా డ్రైవర్ లెస్ రోబోట్యాక్సీ సర్వీస్ ప్రారంభంఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఎంట్రీ ఇచ్చి ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసింది. దీంతో ఇరాన్ యూఎస్కు వ్యతిరేకంగా యుద్ధంలో ముందుకు వెళ్తుందా? అనే అనుమానంతో బంగారం ధరలు క్షీణించాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లు పెరుగుతున్న తరుణంలో బంగారంలోని పెట్టుబడులను ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ

Today tip ఇలాంటి దివ్యౌషధం ఈ భూమ్మీద మరొకటి లేదు!
నిద్రను మించిన సుఖం లేదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆవేదనలనుంచి అలసటనుంచి ఎంతో ఉపశమనాన్నిస్తుంది. అందుకే కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది అంటాడో సినిమా కవి.మరో విధంగా చెప్పాలంటే ఈ భూమి మీద అత్యంత బలమైన ఔషధం నిద్ర. కానీ ఆధునిక కాలంలో నిద్ర అనేది చాలామంది అందని ద్రాక్షలా మిగిలిపోతోంది.మారుతున్న జీవన శైలి, నిద్రలేమి ప్రభావం యువతమీద , ఉద్యోగుల మీద తీవ్రంగా ఉంటోంది. జీవగడియారం సరిగా నడవడానికి నిద్ర ఎంత ముఖ్యమో తెలుసా? పదండి ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా నిద్రప్రయోజనాలు, పరిష్కారాలు తెలుసుకుందాం.నిద్ర అంటే ఏమిటి?నిద్ర అంటే శరీరం , మెదడు విశ్రాంతి తీసుకోవడానికి అనుమతించే ఒక సాధారణ శరీర ప్రక్రియ. రాత్రిపూట నిద్ర వల్ల అనేక ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అఇయతే కళ్లు మూసుకోగానే నిద్రలోకి జారిపోయే అదృష్టవంతులకు ఇది చాలా సులభం అనిపించినా, నిద్రాదేవత అనుగ్రహించని వారి బాధలు అన్నీ ఇన్నీ కావు. వ్యాయామం ,సమతుల్య ఆహారం లాగానే నిద్ర కూడా మన ఆరోగ్యానికి చాలా అవసరం నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. అలాగే అప్పుడే పుట్టిన పిల్లలకు 18 గంటలు , చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలని, టీనేజర్లకు 10 గంటలు నిద్రపోవాలని అంటారు నిపుణులు. మంచి నిద్ర మెదడును ఉత్తేజ పరుస్తుంది. మరుసటి రోజు పనికి ఉత్సాహాన్ని ఇస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. విసెరల్ కొవ్వును కరిగిస్తుంది.DNA నష్టాన్ని సరిచేస్తుంది . కొత్త మెదడు కణాలను ఉత్పత్తి చేస్తుంది.మంచి నిద్రకోసం చిట్కాలుమంచినిద్ర కావాలంటే జీవన శైలి సక్రమంగా ఉండాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది.నిద్రవేళకు 3 గంటలలోపు వ్యాయామం చేయాలనేది గుర్తించుకోండిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు , కంప్యూటర్ల నుండి వెలువడే నీలిరంగు కాంతి నిద్రను ప్రభావితం చేస్తుంది. కనుక పడుకునే ముందు కనీసం ఒక గంట ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను దూరం పెట్టేయాలి.వేడి నీటి స్నానం, పుస్తకం పఠనం, ప్రశాంతమైన సంగీతం వినడంతోపాటు నిద్రకు ముందు కెఫిన్, ఆల్కహాల్కు దూరంగా ఉండాలి.పడకగదిని నిద్రకు అనుకూలంగా అంటేగదిని చీకటిగా, ప్రశాంతంగా, వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవాలి.ధ్యానం , యోగా, శ్వాస వ్యాయామాలు నిద్రకు సహాయపడతాయి.మంచినిద్ర కావాలంటే డి విటమిన్ చాలా అవసరం పగటి నిద్ర రాత్రి నిద్రకు చేటు. రాత్రి పూట హెవీ మీల్ తినవద్దుసాయం చేసే ఆహారంపైన చెప్పిన జాగ్రత్తలతోపాటు పడుకునే ముందు 1 ఔన్స్ టార్ట్ చెర్రీ రసం లేదా రోజుకు రెండుసార్లు టార్ట్ చెర్రీస్ తినవవచ్చు.పుట్టగొడుగులు,సాల్మన్, ట్యూనా చేపలు సహజంగా మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి.ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు కెమిస్ట్రీని ఆప్టిమైజ్ చేస్తాయి.పాలీఫెనాల్ అధికంగా ఉండే బెర్రీలు (బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్) తీసుకోవచ్చు. ఆరోగ్యవంతమైన సెక్స్ తరువాత కూడా మంచి నిద్ర పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు.నోట్ : ఎంత ప్రయత్నించినా నిద్రలేమి లేదా ఇతర నిద్ర సంబంధిత సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. కారణాలను విశ్లేషించుకుని తగిన చికిత్స తీసుకుంటే నిద్రా దేవి ఒడిలో ఒరిగిపోవడం ఖాయం.

52 ఏళ్లుగా కడుపులోనే టూత్ బ్రెష్..!ఐతే సడెన్గా..
అనుకోకుండా ఏదైనా వస్తువుని పొరపాటున మింగితే అప్పటికీ ఎలాంటి సమస్య తలెత్తదు కొందరికి. కానీ ఒక్కోసారి అనారోగ్యం పాలైనప్పుడూ లేదా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడూ..ఆ వస్తువు ప్రాణాంతకంగా మారిపోతుంది అందుకు నిదర్శనమే ఈ ఘటన. అసలేం జరిగిందంటే..ఈ విచిత్రమైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. యంగ్ అనే 64 ఏళ్ల వ్యక్తి కొన్ని రోజుల క్రితం విపరీతమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. అయితే ఇది గ్యాస్ నొప్పా లేక మరేదైనా అని క్షుణ్ణంగా పరిశోధించినా.. సమస్య ఏంటన్నది తేలలేదు. దీంతో అతడి జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్య ఉందా.. ? అని వైద్య పరీక్షలు చేస్తుండగా చిన్న పేగుల్లో ఒక వస్తువుని చూసి అవాక్కయ్యారు వైద్యులు. దాన్ని క్లియర్గా స్కాన్ చేయగా టూత్ బ్రష్ అని తేలింది. ఆ విషయమై సదరు పేషెంట్ యంగ్ని వైద్యులు ప్రశ్నించారు. అతడు తానెప్పుడో చిన్నతనంలో టూత్ బ్రెష్ మింగేసిన విషయం గుర్తు తెచ్చకున్నాడు. సుమారు 12 ఏళ్ల వయసులో టూత్ బ్రష్ని మింగేశానని, అయితే తల్లిదండ్రులు తిడతారని ఆ విషయం వారికి చెప్పలేదని నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నాడు యంగ్. అది విని వైద్యులే కంగుతిన్నారు. ఏంటీ 52 ఏళ్లుగా కడుపులోనే ఈ టూత్ బ్రష్ ఉండిపోయిందా.. ? అని ఆశ్చర్యపోయారు వైద్యులు. నిజానికి టూత్ బ్రష్ పేగుల్లోకి చేరి తిరుగుతూ కణజాలాన్ని పంక్చర్ చేసే ప్రమాదం లేకపోలేదన్నారు. అలా జరిగితే పేగుల్లో చిల్లులు ఏర్పడి ప్రాణాంతకంగా మారుతుందన్నారు. కానీ ఇక్కడ యంగ్ విషయంలో అదృష్టవశాత్తు టూత్ బ్రష్ పేగు వంపులో చిక్కుకుపోయి..దశాబ్దాలుగా అక్కడే ఉండిపోయిందన్నారు వైద్యులు. అయితే ఇది ఇప్పుడు పేగుల్లో కదలడం మొదలవ్వడంతోనే.. యంగ్ విపరీతమైన కడుపునొప్పిని అనుభవించినట్లు తెలిపారు. అయితే వైద్యులు చాలా గంటలు శ్రమించి ఆ టూత్ బ్రష్ని విజయవంతంగా కడుపులోంచి వేరు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఐదు దశాబ్దాలుగా టూత్బ్రష్తోనే జీవించాడా వ్యక్తి.. ? అని ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు అతడికి ఎటువంటి హాని కలిగించకపోవడం అనేది నిజంగా అదృష్టం అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: యవ్వనంగా ఉండాలంటే.. చర్మంపై ఫోకస్ తప్పనిసరి..!)

అది బైకా.. లేక ఇంకేమన్నానా! మారండిరా బాబూ!!
ప్రమాదమని తెలిసినా కొంతమంది కుర్రకారు రెచ్చిపోతూనే ఉన్నారు. పిచ్చి పిచ్చి చేష్టల కారణంగా కళ్ల ముందే నిండుప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా వీరి ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఒక వీడియో నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజనులు తిట్టిపోస్తున్నారు. మరోవైపు అనేక సామాజిక అంశాలపై సోషల్మీడియాలో స్పందించే టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Vishwanath Channappa Sajjanar) కూడా ఈవీడియోపై అగ్రహం వ్యక్తం చేశారు. జరగరానికి జరిగితే, ఆ తల్లిదండ్రులకు, కుటుంబాలకు ఎంతటి క్షోభ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సజ్జనార్ ట్వీట్లో ఎమన్నారంటే..అది బైకా.. లేక ఇంకేమన్నానా!!ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది.. ప్రమాదమని తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే వీళ్లని ఏం అనాలి. జరగరానిది జరిగి ప్రాణాలు పోతే మీ కుటుంబాలు ఎంతటి క్షోభను అనుభవిస్తాయనే కనీస సోయి కూడా వీళ్లకు లేదు.సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు టీనేజర్లు, యూత్ ఇలాంటి వెర్రి వేషాలు వేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు. ఇదేం పిచ్చో వాళ్లకే తెలియాలి!!అది బైకా.. లేక ఇంకేమన్నానా!!ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది.. ప్రమాదమని తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే వీళ్లని ఏం అనాలి.జరగరానిది జరిగి ప్రాణాలు పోతే మీ కుటుంబాలు ఎంతటి క్షోభను అనుభవిస్తాయనే కనీస సోయి కూడా వీళ్లకు లేదు.సోషల్ మీడియాలో ఫేమస్… pic.twitter.com/dmXUQ8BWz4— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 24, 2025అటు ఇకనైనా మారండిరా బాబూ, సోషల్మీడియా పిచ్చి ఇలాంటి వెర్రిమొర్రి వేషాలు వేయకండి.. మీరు బాగానే పోతారు.. మీ వెనక అమ్మనాన్న పరిస్థితి ఏంటి? మీలో ఎవరైనా శాశ్వత వికలాంగులుగా మారిపోతే ఎలా? ఎపుడైనా ఆలోచించారా అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని తగినవిధంగా శక్షించాలి అని కొందరు, తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటిని ఒక కంట గమనిస్తూ తమ బిడ్డలను మందలించాలని మరికొందరు సూచిస్తున్నారు. చదవండి: అంత విషాదంలో డీజే పార్టీ?ఎయిరిండియాపై తీవ్ర ఆగ్రహం, వీడియో వైరల్

సేంద్రియ బియ్యంతో జగన్నాథునికి అమృతాన్న భోగం
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని దైనందిన భోగాల నివేదనలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది రథ యాత్ర మొదలుకొని స్వామి వారికి అమృత అన్న భోగం నివేదన ప్రారంభించనున్నారు. ఈ కార్యాచరణలో భాగంగా రథ యాత్ర నుంచి గుండిచా మందిరం అడపా మండపంలో కొఠొ భోగ సమయంలో మహా ప్రభువుకు అమృత అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. సోమవారం మందిరం ప్రధాన నిర్వాహకుడు (సీఏఓ) డాక్టర్ అరవింద కుమార్ పాడీ అధ్యక్షతన జరిగిన అధికారిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బొడు సువార్, సువార్ మహాసువార్ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. సువార్ మహాసువార్ భోగ మండపంలో అమృత అన్నం ఉపయోగించాలని ప్రతిపాదించారు. మహా ప్రభువు భోగం తయారీలో అమత అన్నాన్ని ఉపయోగించడం గురించి గతంలో చర్చించి ప్రయోగాత్మకంగా ఈ చర్యని అమలు చేశారు. కొరాపుట్ ప్రగతి ఇనిస్టిట్యూట్ అమృత అన్నం బియ్యం సరఫరాకు మద్దతు ప్రకటించిందని సీఏఓ తెలిపారు. ఈ సంస్థ ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సేంద్రియ బియ్యంతో ప్రసాదం తయారీ.. మందిరంలో జగన్నాథుని అన్న ప్రసాదాలు మహా ప్రసాదంగా ప్రతీతి. ఈ ప్రసాదం సేంద్రియ బియ్యాన్ని ఉపయోగించి తయారు చేయాలని పాలక వర్గం నిర్ణయించడం ప్రత్యేకత సంతరించుకుంది. స్వామి నిత్య అన్న ప్రసాదాల తయారీలో సేంద్రియ బియ్యం వినియోగిస్తారు. ఈ బియ్యంతో వండిన ప్రసాదాల్ని అమృత్ అన్నం అనే ప్రత్యేక పేరుతో వ్యవహరిస్తారు. ఎటువంటి రసాయన ఎరువులు ఉపయోగించకుండా సహజమైన ఎరువులను ఉపయోగించి సాగు చేసిన బియ్యం మాత్రమే వినియోగిస్తారు. తొలి దశలో స్వామికి నివేదించే కొఠొ భోగ సేవలో మాత్రమే వినియోగిస్తారు. తదుపరి దశలో ఇతర అన్ని వంటకాల్లో ఈ బియ్యం వినియోగం బలపరుస్తారు. రాష్ట్రంలో రైతులు పండిస్తున్న కొళాజీర, పింపుడిబాసొ, యువరాజ్ మొదలైన సేంద్రియ బియ్యాన్ని అమృత అన్న మహా ప్రసాదంలో ఉపయోగిస్తారు. మందిరంలో రోజుకు 50 నుండి 55 క్వింటాళ్ల బియ్యంతో స్వామి మహా ప్రసాదం వంటకం అవుతుంది. ప్రత్యేక ఉత్సవాలు, పండగపబ్బాల సందర్భంగా రోజుకు 100 నుండి 200 క్వింటాళ్ల బియ్యాన్ని ఉపయోగిస్తారు. అదనంగా కొఠొ భోగం కోసం ప్రతి రోజూ 100 కిలోల బియ్యాన్ని ఉపయోగిస్తారు. అన్న మహా ప్రసాదానికి అధిక నాణ్యత గల బియ్యం వినియోగానికి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. పిండి వంటల ప్రసాదాల తయారీలో మసూరి బియ్యం కొనసాగుతుంది. క్రమంగా వీటి స్థానంలో అమృత్ అన్నం బియ్యం వినియోగించే యోచన ఉన్నట్లు పేర్కొన్నారు. పథకం ప్రకారం మందిరం అన్న ప్రసాదాల తయారీలో కొరత లేకుండా అమృత అన్నం బియ్యం సరఫరా చేసేందుకు కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాల భూమిలో సేంద్రియ వరి సాగు అవసరం అని అనుభవజ్ఞుల వర్గం పేర్కొంది. మందిరం పాలక వర్గం ఈ మేరకు సన్నాహాలు చురుగ్గా కొనసాగిస్తుంది.ఇదీ చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత
ఫొటోలు
అంతర్జాతీయం

నో సీజ్ ఫైర్ ట్రంప్.. అంతా తుస్!!
ఇరాన్- ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అంటూ ముందే క్రెడిట్ తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెద్ద షాకే తగిలింది. ట్రంప్ ప్రకటించిన కాసేపటికే అంతా ఉత్తదేనంటూ ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో ఒప్పందం కోసం ట్రంప్ తమను వేడుకున్నారంటూ సంచలన ప్రకటన చేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్పై మరోసారి క్షిపణులతో దాడులకు తెగబడింది. పశ్చిమాసియాలో యుద్ధం 12వ రోజుకి చేరగా.. ఇజ్రాయెల్పై ఇరాన్ తాజాగా మిస్సైల్స్ ప్రయోగించింది. ఏకంగా 10 మిస్సైల్స్ ప్రయోగించిందని.. ఐదుగురు మరణించారని తెలుస్తోంది. అయితే ఇరాన్ తమపై ఆరు క్షిపణులతో దాడులకు దిగినట్లు ధృవీకరించిన ఇజ్రాయెల్.. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందినట్లు ప్రకటించుకుంది. మరోవైపు.. ఇజ్రాయెల్లో పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ట్రంప్ ప్రకటన ఆయన సొంత అడ్మినిస్ట్రేషన్లోని ఉన్నతాధికారులను ఆశ్చర్యపరిచినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. అదే సమయంలో ట్రంప్ ప్రకటనపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మండిపడిన సంగతి తెలిసిందే. కాసేపటికే శాంతి ఒప్పందం కోసం ట్రంప్ వేడుకొన్నారంటూ మరో సంచలన ప్రకటన చేసింది. ‘‘ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ట్రంప్ మా దేశాన్ని వేడుకున్నారు. ఖతార్లో అమెరికా వాయు స్థావరాలపై తాము దాడులు చేసిన వెంటనే కాళ్ల బేరానికి వచ్చారు’’ అంటూ ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ కథన ప్రసారం చేసింది. అంతకు ముందు.. కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం కుదరలేదన్న ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి, ఇజ్రాయెల్ దాడులను ఆపితే.. తాము ఆపుతామని స్పష్టం చేసింది.ఇరాన్ ప్రకటనతో సంబంధం లేకుండా ట్రంప్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇరుదేశాలు ఒకేసారి కాళ్లబేరానికి వచ్చాయంటూ ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం సాధించామని, అందుకు గర్వకారణంగా ఉందంటూ తన సోషల్ ట్రూత్ అకౌంట్లో వరుస పోస్టులు పెడుతున్నారు.

ట్రంప్ ఖాతాలోకి కాల్పుల విరమణ క్రెడిట్?
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తన కారణంగానే కుదిరిందంటూ.. ఆ క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేశారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ‘ఇజ్రాయెల్ - ఇరాన్ ఒకేసారి తన దగ్గరకు వచ్చి, శాంతి నెలకొల్పాలని కోరాయని పేర్కొన్నారు. ఆ క్షణంలో ఆ దేశాల ఆవశ్యకతను తాను గుర్తించానని, ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైందని గ్రహించానని పేర్కొన్నారు. ఈ విధమైన నిర్ణయం ఆ రెండు దేశాలకే కాకుండా, ప్రాంతీయంగా సాధించిన విజయంగా అభివర్ణించారు.ప్రపంచ వేదికపై తనను తాను డీల్ మేకర్గా చెప్పుకుంటున్న ట్రంప్ ఈ రెండు శత్రుదేశాల మధ్య కొత్త అధ్యాయానికి గల అవకాశాలను వివరించారు. ఈ దేశాలు భవిష్యత్తులో అపారమైన పరస్పర ప్రేమ, శాంతి శ్రేయస్సును చవిచూస్తాయన్నారు. ఇజ్రాయెల్ - ఇరాన్లకు అద్భుతమైన భవిష్యత్ ఉంది. దేవుడు ఆ దేశాలను దీవించాలని కోరుకుంటూ ట్రంప్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఘర్షణలు మరింతగా పెరిగిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో కీలక పాత్ర పోషించారని వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారని, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్లు ఇరానియన్ నేతలతో దౌత్య మంతనాలు నిర్వహించారన్నారు. ఇరు దేశల మధ్య యుద్ధ విరమణ ఒప్పందం ఒక కీలక షరతుపై ఆధారపడి ఉందని సమాచారం. ఇరాన్ ఇకపై దాడులు చేయకుండా ఉంటే ఇజ్రాయెల్ తన సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తుందనేదే ఆ షరతు అని తెలుస్తోంది. ఇరాన్ తన దాడులను నియంత్రించేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలిచ్చిందని, తక్షణ దాడులకు ప్రణాళికలు లేవని అమెరికన్ అధికారి ఒకరు తెలిపారు. రెండు దేశాల మధ్య సమన్వయ సాధనలో ట్రంప్ ప్రత్యక్ష ప్రమేయంతో ఈ పురోగతి సాధ్యమయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘ఇరాన్ ఎప్పటికీ లొంగదు’: ట్రంప్ ప్రకటనపై ఖమేనీ మండిపాటు

రష్యా దాడుల్లో 12 మంది మృతి
కీవ్: రష్యా మరోసారి రెచ్చిపోయింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్తోపాటు పలు ప్రాంతాలపై ఆదివారం రాత్రి డ్రోన్లు, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడింది. దాడుల్లో కీవ్లో ఏడుగురు సహా మొత్తం 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కనీసం 30 మంది క్షతగాత్రులయ్యారు. రష్యా 352 డ్రోన్లు, 11 బాలిస్టిక్ క్షిపణులు, ఐదు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ పేర్కొంది. వీటిలో 339 డ్రోన్లు, 15 క్షిపణులను తమ గగనతల వ్యవస్థలు అడ్డుకున్నాయంది. నివాసప్రాంతాలు, ఆస్పత్రులు, క్రీడా సముదాయాలు లక్ష్యంగా దాడులు జరిగాయని ఆర్మీ తెలిపింది. కీవ్లో ఐదంతస్తుల అపార్టుమెంట్లో కొంతభాగం కుప్పకూలగా ఏడుగురు చనిపోయారని, నలుగురు శిథిలాల్లో చిక్కుకున్నారంది.

‘ఇరాన్ ఎప్పటికీ లొంగదు’: ట్రంప్ ప్రకటనపై ఖమేనీ మండిపాటు
టెహ్రాన్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడంపై ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ తప్పుడు ప్రకటన చేశారంటూ ఖమేనీ ఆరోపించారు. పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య కాల్పుల విరమణ సూచనను తిరస్కరిస్తూ, ఇరాన్ ఎప్పటికీ లొంగిపోయే దేశం కాదని ఖమేనీ స్పష్టం చేశారు.అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ఈ ఇరు దేశాలు ఘర్షణలను ఆపేందుకు అంగీకారం తెలిపాయని ప్రకటించిన కొన్ని గంటలకే ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ దీనిని తిరస్కరిస్తూ, ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళిక అబద్ధమని, అమెరికాకు ఇటీవల జరిగిన అవమానం నుండి దృష్టిని మళ్లించడానికే ట్రంప్ ఈ విధమైన ప్రకటన చేశారని పేర్కొంది. ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ట్రంప్ ప్రకటనపై ఘాటుగా స్పందించారు. ఇరాన్ చరిత్ర, ఇక్కడి ప్రజల గురించి తెలిసిన వారికి ఇరాన్ లొంగిపోయే దేశం కాదని స్పష్టంగా తెలుసన్నారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ట్రంప్.. ఇరాన్- ఇజ్రాయెల్ రెండూ కాల్పుల విరమణకు అంగీకరించాయని, సంఘర్షణతో నిండిన ఈ ప్రాంతంలో ఈ తాజా పరిణామం అభివృద్ధికి దారితీస్తుందని దానిలో పేర్కొన్నారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం శాంతియుతంగా జరుగుతుందని కూడా ట్రంప్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: సంధి దిశగా ఇరాన్? తుది నిర్ణయంపై తర్జనభర్జన
జాతీయం

ప్రియుడితో కయ్యం.. ప్రేమ పిచ్చి దెయ్యం.. జైలు పాలైన వైనం
చెన్నై: నేటి తరం యువత ప్రేమ, వ్యామోహంతో క్షణికావేశంలో నిండు జీవితాల్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. మేఘాలయాలో సోనమ్ రఘువంశీ, అనంతరంపురంలో శిరీష,హైదరాబాద్ జీడిమెట్ల తేజశ్రీ.. తాజాగా చెన్నైకి చెందిన రెనే జోషిల్డా. ఇలాంటివి రోజుకు ఎన్నో కథలు.. వ్యథలు.చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన రెనే జోషిల్డా డెలాయిట్లో సీనియర్ రోబోటిక్స్లో కన్సల్టెంట్గా పనిచేస్తోంది. ఓ ప్రాజెక్ట్ సందర్భంగా బెంగళూరులో డివిజ్ ప్రభాకర్ అనే సహోద్యోగితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. అయితే, ప్రేమ,దోమ ఇష్టం లేని ప్రభాకర్.. రెనే జోషిల్డా ప్రతిపాదనను తిరస్కరించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరొకరిని వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె మనసు ముక్కలైంది. దీంతో డివిజ్ ప్రభాకర్ఫై ప్రతీకారానికి దిగింది. ప్రేమ పిచ్చితో అతగాడికి మనశాంతి లేకుండా చేద్దామని ప్లాన్ చేసింది. బాంబు బెదిరింపులతో దేశవ్యాప్తంగా అలజడిఅ తర్వాత డివిజ్ ప్రభాకర్ పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీలు క్రియేట్ చేసింది. దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ స్కూల్స్,ఆస్పత్రులు, స్టేడియంలకు బాంబు బెదిరింపులు పంపింది. ఒక్క అహ్మదాబాద్లోనే 21 ప్రదేశాలకు బెదిరింపులు పంపింది. మోతేరా నరేంద్ర మోదీ స్టేడియం, సర్కేజ్లోని జెనీవా లిబరల్ స్కూల్, సివిల్ హాస్పిటల్ వంటి ప్రదేశాలు ఇందులో ఉన్నాయి. ఇలా మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, బీహార్, తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ బెదిరింపులు కలకలం రేపాయి.రీసెంట్గా ఎయిరిండియా విమాన ప్రమాదం జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే ఎయిరిండియా విమానం టేకాఫ్ తర్వాత కూలిపోయింది. ఈ ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ భవనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత బీజే మెడికల్ కాలేజీకి ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. అందులో ‘మీకు మా దెబ్బ రుచి చూపించాం. మేమే విమానాన్ని కూల్చాం. ఇప్పుడు మీకు అర్థమైందేమో’ అని పేర్కొంది. ఈ బెదిరింపు మెయిల్ను రెనే జోషిల్డా పంపినట్లు పోలీసులు గుర్తించారు.ఒక చిన్న తప్పిదమే ఆమెను పట్టించేసింది టెక్నాలజీలో నిపుణురాలైన రెనే జోషిల్డా టోర్ బ్రౌజర్, డార్క్ వెబ్, వర్చువల్ నంబర్లను ఉపయోగించి తన డిజిటల్ ట్రేస్ను దాచింది. కానీ ఆరు నెలల క్రితం ఆమె ఓ చిన్న తప్పు చేసింది. అదే ఆమెను పట్టించేసింది. ఒకసారి తన ఒరిజినల్ ఐపీ నెంబర్ నుంచి ఫేక్ ఈమెయిల్స్ను ఓపెన్ చేసింది. బెదిరింపు కాల్స్తో అప్రమత్తమైన సైబర్ పోలీసులు రెనే జోషిల్డా ఐపీ అడ్రస్ను గుర్తించారు. అమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.

Uttarakhand: బహుభార్యత్వ వివాదం.. మాజీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు
హరిద్వార్: ఉత్తరాఖండ్కు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే బహుభార్యత్వం వివాదంలో చిక్కుకున్నారు.. సహరాన్ పూర్కు చెందిన నటి ఊర్మిళ సనావర్ను ఇటీవలే రెండవ వివాహం చేసుకున్నట్లు ప్రకటించిన జ్వాలాపూర్ మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్కు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) షోకాజ్ నోటీసు జారీచేసింది. రాష్ట్రంలో అమలయిన యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) నేపథ్యంలో ఈ బహభార్యత్వ ఉదంతం వివాదాస్పదంగా మారింది.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భట్ సూచనల మేరకు జారీ చేసిన ఈ నోటీసుపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర బిష్ట్ సంతకం చేశారు. రాథోడ్ క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించడం, పార్టీ నేతలతో సమన్వయంతో మెలగకపోవడం లాంటివి పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీనిపై ఏడు రోజుల్లోగా స్పందించాలని రాథోడ్ను కోరారు.జూన్ 15న సురేష్ రాథోఢ్ సహరాన్పూర్లో విలేకరుల సమావేశం నిర్వహించి, తనకు ఊర్మిళా సనావర్తో ఉన్న సంబంధాన్ని బహిరంగంగా అంగీకరిస్తూ, ఆమెను తన భార్యగా వెల్లడించిన దరిమిలా ఈ వివాదం చెలరేగింది. నాడు రాథోడ్ జంట మీడియా ముందు కనిపించింది. ఈ నేపధ్యంలో ప్రతిపక్ష పార్టీలు బీజేపీని దుమ్మెత్తిపోశాయి. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిన యూసీసీ బహుభార్యత్వాన్ని నిషేధిస్తుందని, వివాహాల నమోదును తప్పనిసరి చేస్తుందని వారు గుర్తుచేశారు. ఇది కూడా చదవండి: మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. ఈ దేశాలు సేఫ్!

Heart Attack: ఆందోళనకరంగా గుండెపోటు మరణాలు
హాసన్ జిల్లా అనగానే పశ్చిమ కనుమలకు ప్రవేశ ద్వారంగా, ప్రకృతి అందాలకు, వ్యవసాయానికి చిరునామాగా గుర్తుకొస్తుంది. కానీ ఎప్పుడు ఎవరి గుండె ఆగిపోతుందోననే దిగులు అక్కడ రాజ్యమేలుతోంది. గుండెపోట్ల భయం హాసన్ను పట్టిపీడిస్తోంది.యశవంతపుర: తల్లి గర్భంలో ఊపిరి పోసుకున్న నాటి నుంచి 60, 70 ఏళ్ల వరకు మోటారు పంపులా పనిచేసే గుండె త్వరగా అలసిపోతోంది. కరోనా వైరస్ విపత్తు వచ్చాక గుండె లయ తప్పుతోందనడానికి అనేక ఉదాహరణలున్నాయి. రాష్ట్రంలో హాసన్ జిల్లాలో నెల రోజుల్లో 13 మంది గుండెపోటుతో కన్నుమూయడం ఆందోళనకరంగా మారింది. హాసన్కు చెందిన రాజారాం ఆనే వ్యక్తి సీఎం సిద్ధరామయ్య కు ఈ జాఢ్యంపై లేఖ రాసి విచారణ చేయాలని మనవి చేశారు. 4 నెలల్లో 250 మంది.. ఈ నేపథ్యంలో యువకుల్లో గుండెపోటు గురించి 10 మంది వైద్యుల బృందం విచారణ చేసింది. 18 నుంచి 45 ఏళ్ల లోపువారు ఎందుకు చనిపోయారు అనేది అధ్యయనం చేశారు. దీంతో పాటు జిల్లాలో గత నాలుగు నెలల వ్యవధిలో 250 మంది గుండెపోటు, ఆకస్మికంగా మరణాలకు గురయ్యారు. కరోనా వైరస్ టీకా కారణమని కొందరు ఆరోపించారు. వైద్యుల బృందం విచారణలో టీకా సంబంధం లేదని నిర్ధారించారు. ఇతరత్రా కారణాలు యువతీ యువకులకు వివిధ కారణాలతో గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, వైద్యులతో మాట్లాడి సమాచారం క్రోడీకరించారు. కొందరు అధిక ధూమపానం, మద్యపానం, గుట్కా సేవించడం వల్ల ఇతరత్రా వ్యాధులు సోకి గుండెపోటుతో చనిపోయారని పేర్కొన్నారు. అయితే ఇటువంటి అలవాట్లు లేని యువతులు, మహిళలు కూడా చాలామంది చనిపోయారు. తమ నిర్ధారణలతో వైద్యుల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేయనుంది. ఒకే నెలలో 13 మంది బలి ఇటీవల హాసన్ నగరంలోని సత్యమంగల లేఔట్కు చెందిన చేతన్ (25), బేలూరు పట్టణవాసి నిషాద్ అహ్మద్ (35), మే 28 హొళెనరసిపుర పట్టణంలో సంధ్య (20), అరకలగూడు తాలూకా కోణనూరువాసి అభిõÙక్ (19), అదే రోజు హాసన్ తాలూకా కెలవత్తి గ్రామానికి చెందిన డిగ్రీ ఫైనలియ్ యువతి కవన (20), జూన్ 11న హొళెనరసీపుర పట్టణవాసి నిశాంత్ (20)లు ఆకస్మికంగా మరణించారు. జూన్ 12న ఆలూరు తాలూకా మగ్గె గ్రామం వద్ద బస్సులో ప్రయాణిస్తున్న రవాణా శాఖ ఉద్యోగి బీఆర్ నాగప్ప(55), హాసన్ మాజీ నగరసభ సభ్యుడు నీలకంఠప్ప(58), జూన్ 13న హాసన్ వద్ద రాజఘట్ట లో కారులో వెళ్తూనే దేవరాజ్ (43) చనిపోయారు. అలాగే హాసన్ నగరం తెలుగువారి వీధికి చెందిన సతీశ్ (57), జూన్ 14న హాసన్ తాలూకా దొడ్డపురవాసి కాంతరాజు (51) గుండెపోటుతో మృతి చెందారు.

Jammu & Kashmir: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, తొమ్మిది మందికి తీవ్రగాయాలు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. చట్ట్యారి-చింగస్ సమీపంలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాజౌరి పట్టణం నుండి జమ్ముకు వెళ్తున్న టెంపో ట్రావెలర్ ఒక మినీ గూడ్స్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో టెంపో తునాతునకలైందని పోలీసులు తెలిపారు.మృతులను ఖోత్రా నివాసి ఇన్షా ఫాతిమా (26), ఫతేపూర్కు చెందిన ఫర్జాండ్ బేగం (50)గా గుర్తించారు. వీరిద్దరూ ఘటనాస్థలంలోనే మృతిచెందారు. గాయపడిన వారిలో మృతురాలు ఫర్జాండ్ బేగం భర్త మహ్మద్ ఇక్బాల్, వారి కుమార్తె రఫియా ఇక్బాల్ ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఏడుగురిని రాజౌరిలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించగా, ఇద్దరికి స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇది కూడా చదవండి: మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. ఈ దేశాలు సేఫ్!
ఎన్ఆర్ఐ

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మృతుల కుటుంబాలకు నైటా సంతాపం
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) తీవ్ర సంతాపం ప్రకటించింది. న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గం, సభ్యులు మృతులకు నివాళులు అర్పించి, మౌనం పాటించారు.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్ఆర్ఐలుగా తమను తీవ్రంగా కలిచివేసిందని వారు అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉంటున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగిందని, వారంతా భారతదేశం రాకపోకలకు తరచుగా ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించేందుకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఎన్ఆర్ఐల్లో ఆత్మవిశ్వాసం నింపాలంటే భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నైటా కార్యవర్గం భారత ప్రభుత్వాన్ని కోరింది.

AMA తొలి భారతీయ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ ముక్కామల రికార్డ్, ఎవరీ ‘బాబీ’
భారత సంతతికి చెందిన డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ (Srinivas Mukkamala) అమెరికా వైద్యసంఘం ( AMA-American Medical Association) తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 179 సంవత్సరాల చరిత్రలో తొలిసారి ఎన్నికైన భారతీయ అధ్యక్షుడిగా శ్రీనివాస్ “బాబీ” ముక్కామల రికార్డు సృష్టించారు. ఇటీవలి AMA వార్షిక సమావేశంలో ఆయన180వ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. ఇది అమెరికా వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అందరూ ప్రశంసిస్తున్నారు.ముక్కామల మిచిగాన్లోని ఫ్లింట్లో అనుభవజ్ఞుడైన ENT స్పెషలిస్ట్. రెండు దశాబ్దాలకు పైగా క్లినికల్ అనుభవం ఉన్న నిపుణుడు. ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చిన తల్లిదండ్రులకు 1972లో జన్మించారు. మెక్లారెన్ ఫ్లింట్ , హర్లీ మెడికల్ సెంటర్ వంటి అనేక ప్రముఖ ఆసుపత్రులతో ఆయనకు సంబంధం ఉంది. ఆయన మిచిగాన్ విశ్వవిద్యాలయ మెడిసిన్లో పట్టభద్రుడు. ఓటోలారిన్జాలజీ రంగంలో ఆయనకు మంచి పేరు ఉంది.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!స్వయంగా కేన్సర్ సర్వైవర్గత సంవత్సరం, ముక్కామలకు మెదడులోని టెంపోరల్ లోబ్లో 8-సెంటీమీటర్ల కణితి కనిపించింది. రోగ నిర్ధారణ జరిగిన మూడు వారాల తర్వాత హై-రిస్క్ సర్జరీ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్లో 90 శాతం కణితిని విజయవంతంగా తొలగించారు.ఆరోగ్య సంరక్షణ పట్ల అతని నిబద్ధతను బలోపేతం చేసేలా తాజా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు ప్రపంచ స్థాయి చికిత్స అందినప్పటీ లక్షలాది మందికి ఇలాంటి చికిత్సలో ఆలస్యం జరుగుతోందనీ, ఆర్థిక పరిమితులు, అనిశ్చితులను ఎదుర్కొంటున్నారని ముక్కామలకు హైలైట్ చేశారు. అలాగే చాలా మంది రోగులు తమ బీమా కవరేజీ వస్తుందా, లేదా మందులకు ఎంత ఖర్చవుతుంది, ఔషధానికి ,నిపుణుడిని చూడటానికి ఎంతకాలం వేచి ఉండాలో అనే భయాలు వెంటాడుతున్నాయని అన్నారు. ఈ అనుభవం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని శ్రీనివాస్ వెల్లడించారు. వైద్యుల హక్కులు, వనరుల కోసం పోరాడే వేదికగాఆధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు మార్గం వేయనుందనీ, సమగ్ర ఆరోగ్య సంరక్షణకు, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ AMA ప్రాధాన్యతను పెంచుతుందని హామీ ఇచ్చారు. అలాగే AMA ప్రజారోగ్యంలో విస్తృతమైన సంస్కరణల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ముక్కామల అధ్యక్ష పదవిని చేపట్టడం విశేషం. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల ప్రమాదాలు, సరైన పోషకాహారం ప్రాముఖ్యత గురించిఅవగాహన పెంచడానికి అసోసియేషన్ ఇటీవల ఒక విధానాన్ని స్వీకరించింది.ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్గతంలో ఏఎంఏ ఫౌండేషన్ నుంచి ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ లీడర్షిప్ అవార్డు (Excellence in Medicine Leadership Award )ను ఆయన అందుకున్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్కు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2017 నుంచి 2021 వరకు ఏఎంఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్ బాబీ తల్లిదండ్రులు 1970ల్లో ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు.

డెట్రాయిట్లో 'తెలుగు పల్లెవంట'
అమెరికాలోని డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 350కి పైగా కుటుంబాలు ఫార్మింగ్టన్ హిల్స్లోని శియావాసీ పార్క్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ ఛాప్టర్ ఆధ్వర్యంలో పల్లెవంట కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, గేమ్స్, సామూహిక చర్చలు వంటి ఎన్నో ఆసక్తికర కార్యకలాపాల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకూ పాల్గొని ఉల్లాసంగా గడిపారు. పల్లెవంటలో వడ్డించిన తెలంగాణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బగారా అన్నం, చికెన్, పాలకూర, మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, మటన్, రోకటి పచ్చళ్లు, పెరుగన్నం, బీట్రూట్ రైతా, వెరైటీ స్నాక్స్, మిఠాయిలు భోజన ప్రియులకు రుచికరమైన విందును అందించాయి. రంగురంగుల వేసవి దుస్తుల్లో వచ్చిన మహిళలు, పిల్లలు పార్క్ను పూలతోటలా మార్చారు. యువతులు, మహిళల కోసం అందమైన బ్యూటీ, ఫ్యాషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రవాసుల్లో ఐక్యతా భావనను, ఆనందాన్ని పెంపొందించేలా వేడుక నిర్వహించినట్లు జీటీఏ యూఎస్ఏ అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం ఉత్సవంగా మాత్రమే కాదు, విలువలు, పరస్పర గౌరవం, ఐక్యతను కలిగిస్తాయన్నారు. (చదవండి: పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్..! వీడియో వైరల్)

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.
క్రైమ్

జీడిమెట్ల కేసులో విస్తుపోయే నిజాలు
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘మా అక్కే మా అమ్మను చంపింది’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది. ‘‘ట్యూషన్ నుంచి వస్తుంటే నన్ను మా అక్క గల్లీలోనే ఆపింది. అమ్మ ఒక ఆంటీని తీసుకుని రమ్మంది.. పదా వెళ్దామంటూ నన్ను తీసుకెళ్లింది. 20 నిమిషాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాం. అప్పటికే కిచెన్లో అమ్మ స్పృహ లేకుండా పడి ఉంది. అమ్మను లేపే ప్రయత్నం చేశా....అమ్మను నేను చూసుకుంటా నువ్వు బయటకు వెళ్లు అంటూ అక్క చెప్పింది. చుట్టూ పక్కల ఎవరికీ చెప్పవద్దని చెప్పింది.. కానీ అక్క మాత్రం అమ్మ దగ్గరికి కూడా రాలేదు. అమ్మ చనిపోయింది లేపి వేస్ట్ అని అక్క చెప్పింది. మా అమ్మ ఇంకా చనిపోలేదని తెలుసుకుని.. శివకు ఫోన్ చేసింది. మళ్లీ శివ, యశ్వంత్ వచ్చి సుత్తితో అమ్మ తలపై కొట్టాడు’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది.ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో కన్నతల్లిని పదో తరగతి చదువుతున్న కుమార్తె తేజశ్రీ.. ప్రియుడితో కలిసి హతమార్చిన సంగతి తెలిసిందే. బాలికకు కొన్ని నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఓ యువకుడు పరిచయం కాగా.. అతడితో ప్రేమ వ్యవహారం నడిచింది. దీంతో ఆ బాలిక ఇంటి నుంచి వెళ్లి పోవడంతో తన కుమార్తె కనిపించడం లేదని తల్లి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ బాలిక మూడు రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చింది.ఇదిలా ఉండగా.. తల్లి అడ్డు తొలగించునేందుకు ప్రియడితో కలిసి స్కెచ్ వేసింది. నిన్న(సోమవారం) సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివను రప్పించింది. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్షీట్తో అంజలి ముఖాన్ని శివ కప్పగా.. సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పీక కోశాడు.

నా భర్త భాస్కర్ వికారాబాద్ పోలీస్స్టేషన్లో ఎందుకున్నాడు..!
నారాయణపేట: సినీ ఫక్కీలో చోరీలకు పాల్పడుతూ మోస్ట్ వాంటెడ్ దొంగగా పోలీసు శాఖలో గుర్తింపు పొందిన చాపల భాస్కర్ (35) మృతి అనుమానాస్పదంగా మారింది. బెయిల్పై విడుదలైన వ్యక్తిని వికారాబాద్ పోలీసులు తీసుకెళ్లారని కుటుంబసభ్యులు చెబుతుంటే.. మాకేం సంబంధం లేదంటున్నారు. దీనికి తోడు సొంతూరులో కాకుండా వేరేరాష్ట్రంలో అంత్యక్రియలు చేయడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా ఊట్కూర్కి చెందిన చాపల భాస్కర్ కొన్నేళ్లుగా దొంగతనాలను వృత్తిగా చేసుకున్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసేవాడు. పోలీసుశాఖలో చాపల భాస్కర్ మోస్ట్ వాంటెడ్గా గుర్తింపు పొందారు. ఆరు మాసాలుగా మహబూబ్నగర్ జైలులో ఉన్నాడు. కాగా.. ఈ నెల 20వ తేదీన బెయిల్పై విడుదలయ్యాడు. అయితే వికారాబాద్ జిల్లాలో 14 చోరీల్లో భాస్కర్పై కేసులు నమోదు కావడంతో భాస్కర్ను మహబూబ్నగర్ జైలు నుంచి బయటికి వచ్చినవెంటనే సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.⇒ వికారాబాద్ పోలీస్స్టేషన్ నుంచి చాపలి భాస్కర్ భార్య తారమ్మకు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఫోన్ చేసి.. మీరొచ్చి మీ భర్తను తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తన భర్త వికారాబాద్ పోలీస్స్టేషన్లో ఎందుకున్నారంటూ పోలీసులను అడిగినట్లు సమాచారం. అయితే శనివారం ఉదయం 10 గంటల సమయంలో వికారాబాద్ నుంచి మఫ్టీలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఓ ప్రైవేట్ ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి గుర్మిట్కల్ దగ్గరలోని ఓ గ్రామస్టేజీ వద్ద చాపలి భాస్కర్ను వారి బంధువుకు అప్పజెప్పారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన భాస్కర్ను ఓ ప్రైవేట్ వాహనాన్ని మాట్లాడించి కానిస్టేబుళ్లు.. అందులో నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలా చేస్తూ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు.ఆస్పత్రికి వచ్చేసరికి మృతి..స్పృహలో లేని భాస్కర్ను ఆస్పత్రికి తీసుకువచ్చే సరికి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు భాస్కర్ వెంబడి వచ్చిన బంధువు చేరవేశారు. వెంటనే భార్య తారమ్మతో పాటు కుటుంబసభ్యులు వచ్చి ఆస్పత్రిలో శవమై కనిపించిన చాపలిభాస్కర్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే నారాయణపేట పీఎస్కు వెళ్లగా ఈ కేసు తమ పరిధిలో రాదంటూ సీఐ, ఎస్ఐలు చేతులెత్తేసినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఓ ప్రైవేట్ వాహనంలో శనివారం సాయంత్రం భాస్కర్ మృతదేహాన్ని వికారాబాద్ పోలీస్స్టేషన్ వద్దకు తీసుకెళ్లి.. ఆరా తీశారు. మేము కస్టడీలోకి తీసుకున్నట్లు ఏమైనా ఆధారాలున్నాయా అంటూ బుకాయించినట్లు తెలుస్తోంది. దీంతో దీంతో చేసేదేమి లేక తిరిగి నారాయణపేటకు చేరుకున్నారు. చివరకు ఆదివారం నారాయణపేట రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాముడు తెలిపారు. నారాయణపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో చాపలి భాస్కర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయన స్వగ్రామం ఊట్కూర్ అయినప్పటికీ భాస్కర్ అత్తగారి ఊరు కర్ణాటకలోని సంకలాపూర్కు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

జీడిమెట్ల: తల్లిని కడతేర్చిన కూతురు.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, మేడ్చల్: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లినే కడతేర్చింది ఓ బాలిక.. కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ.. తల్లి ప్రేమను మరిచిది. 18 ఏళ్లు నిండక ముందే ప్రియుడితో కలిసి తల్లి పాలిట యమపాశం గా మారింది. జీడిమెట్ల పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కూతురు హత్య చేసింది. ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో తన ప్రియుడు శివ(19), అతని తమ్ముడు యశ్వంత్(18)తో కలిసి కూతురు తేజశ్రీ(16) కన్నతల్లిపై కిరాతకానికి పాల్పడింది.కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు అంజలి చాకలి ఐలమ్మ ముని మనవరాలు. మహబూబాబాద్ చెందిన అంజలి 20 ఏళ్లుగా జిడీమెట్లలో నివాసం ఉంటున్నారు. ఆమె మహిళా మండలిలో కూడా పనిచేస్తోంది. కాగా, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే బాలికకు ఇన్స్టాలో శివ పరిచయమయ్యాడు. పదో తరగతికే ప్రేమ ఏంటని తల్లి అంజలి మందలించింది. వారం క్రితం శివతో ఆ బాలిక వెళ్లిపోయింది. దీంతో పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం బాలిక ఇంటికి తిరిగి వచ్చింది.తల్లి అడ్డు తొలగించునేందుకు ప్రియడితో కలిసి స్కెచ్ వేసింది. నిన్న(సోమవారం) సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివను రప్పించింది. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్షీట్తో అంజలి ముఖాన్ని శివ కప్పగా.. సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పీక కోశాడు. తల్లి హత్య తర్వాత కుర్చీలో నుంచి పడిపోయిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ బాలిక.. తన పెద్దమ్మకు ఫోన్ చేసి అమ్మ కుర్చీ నుంచి పడిపోయిందని.. గాయాలయ్యాయంటూ చెప్పుకొచ్చింది. తన తల్లి మృతిపై బాలిక తేజశ్రీ చెల్లెలు కన్నీరుమున్నీరైంది. బయటకెళ్లి వచ్చేసరికి అమ్మ రక్తపు మడుగుల్లో ఉందని పేర్కొంది. పోలీసులకు ఫోన్ చేసి.. అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్దామని చెప్పినా కూడా అక్క వినలేదని పేర్కొంది.

కుటుంబం ఆత్మాహుతికి యత్నం
హుస్నాబాద్ రూరల్: తండ్రి పెడుతున్న మానసిక క్షోభతో ఓ కుటుంబం ఆత్మాహుతికి యత్నించింది. ఈ సంఘటన హుస్నాబాద్ మండలం కిషన్నగర్లో సోమవారం చోటు చేసుకుంది. జాగిరి సాయి దంపతులు కిషన్నగర్లో హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అతని తల్లి, సోదరుడు కూడా సాయి దగ్గరే ఉంటున్నారు. అయితే తండ్రి రెండో పెళ్లి చేసుకొని హనుమకొండలో నివాసం ఉంటున్నాడు. అప్పటి నుంచి కుటుంబంలో తగాదాలు ఎక్కువయ్యాయి. తమ తండ్రి తమకు తెలియకుండానే ఇంటి స్థలం మరొకరికి విక్రయించారని, దీంతో తమకు దారి లేకుండా పోయిందని సాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నాడు. తండ్రి మానసిక క్షోభకు గురి చేస్తుండటంతో జీవితంపై విరక్తి చెందారు. హోటల్పై పెట్రోల్ పోసి నలుగురు కుటుంబ సభ్యులు అందులోనే ఉండి నిప్పు పెట్టుకున్నారు. చుట్టుపక్కలవారు మంటలను గమనించి వారిని కాపాడారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. సమాచారం అందుకున్న అగి్నమాపక సిబ్బంది మంటలు ఆర్పి ప్రమాదాన్ని నివారించారు. దీనిపై ఎస్సై మహేశ్ను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.