ప్రధాన వార్తలు

విచ్చలవిడిగా పులివెందుల గ్రామాల్లోకి టీడీపీ మూకలు
పులివెందుల రూరల్, ఒంటిమిట్ట మండలాల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. రేపు(ఆగస్టు 12న) ఈ రెండు జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ రెండు స్థానాలకు 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే అధికార పార్టీ టీడీపీ అరాచకాలు, వైఎస్సార్సీపీ ప్రతిఘటనలతో పులివెందుల ఉప ఎన్నిక రణరంగాన్ని తలపిస్తోంది. వైఎస్సార్ జిల్లావిచ్చలవిడిగా పులివెందుల గ్రామాల్లోకి దూరుతున్న టీడీపీ మూకలుకొత్తపల్లిలో ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది మోహరింపుటీడీపీ జమ్మలమడుగు ఇంఛార్జి భూపేష్ రెడ్డి ఆద్వర్యంలో మరో వంద మంది నల్లపురెడ్డిపల్లిలోకి చొరబాటుతుమ్మలపల్లిలో ముసలిరెడ్డిపల్లి రఘు ఆధ్వర్యంలో మరో వందమందిరేపు దొంగ ఓట్లు, కొట్లాటలకు వీరిని వినియోగించనున్న టీడీపీఅయినా ఏమాత్రం స్పందించని పోలీసులు ఈసీ కార్యాలయం వద్ద మీడియాతో మాజీమంత్రి జోగిరమేష్చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కైమా కైమా చేసేస్తున్నాడుదీన్ని ఎన్నిక అంటారా? చంద్రబాబుచంద్రబాబు నీకసలు సిగ్గుశరం ఉందాఓటరు స్లిప్పులు తీసుకుని డబ్బులు పంచుతున్నారుగతంలో నంద్యాలలో కూడా ఇలాగే చంద్రబాబు వ్యవహరించాడుపులివెందులలో అసలు ప్రజాస్వామ్యమే లేదుఏడాదిలోనే చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందిపులివెందులలో గెలిచానని సంకలు గుద్దుకోవాలని చూస్తున్నాడుప్రతీ పోలింగ్ కేంద్రం... లోపలా... బయట... సీసీ కెమెరాలు పెట్టాలని కోరాంపులివెందుల, ఒంటిమిట్టలో మొత్తం తన ప్రభుత్వాన్ని చంద్రబాబు మోహరించాడుఎన్ని కుట్రలు చేసినా పులివెందులలో గెలిచేది వైసీపీనేరాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఎన్నిక జరిగినా ఎగిరేది వైసీపీ జెండానేచంద్రబాబూ.. ఇంత దిగజారాలా?: పేర్ని నానిఈసీ కార్యాలయం వద్ద మీడియాతో మాజీమంత్రి పేర్ని నానిపులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయి వ్యవహరిస్తోందిప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారుకొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె,ఎర్రిపల్లి, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారుఓటుకి పదివేలు ఆశచూపిస్తున్నారుఓటరు స్లిప్పులు ఇవ్వకపోతే బెదిరిస్తున్నారుగన్ మెన్ ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కే రక్షణ లేదుఅవినాష్ రెడ్డితో పాటు 150 మంది పై కేసులు పెట్టారుదాడులు చేస్తాం.. కేసులు పెడతామని బెదిరిస్తున్నారుపోలీసులు.. షాడో పార్టీలున్నా కళ్లకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారురికార్డుల ప్రకారమే పోలీసులున్నారు.. కానీ ఎవరినీ పట్టుకోరుచంద్రబాబు 10 వేలు ఇచ్చి పంపిస్తే అందులో టీడీపీ వాళ్లే 5 వేలు నొక్కేస్తున్నారురేపు ఉదయం లోపు మళ్లీ ఓటరు స్లిప్పులు పంచాలికాల్ సెంటర్ పెట్టాలి.. స్లిప్పులు ఇవ్వమని బెదిరించినా చర్యలు తీసుకోవాలిఎన్నికల కమిషన్ రేపు ఒక్కరోజైనా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలిపులివెందులలో టీడీపీ దౌర్జన్యాలపై ఫిర్యాదురాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలుపులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలు,దౌర్జన్యాల పై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వైసిపి నేతలుఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్న టీడీపీ నేతలుఓటరు స్లిప్పులు తీసుకుని డబ్బులిస్తున్న టీడీపీ నేతలుఓటరు స్లిప్పులు ఇవ్వకపోతే బెదిరిస్తున్న టీడీపీ నేతలుటీడీపీ ప్రలోభాల పై ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి వినతిపత్రం అందించిన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి,మొండితోక అరుణ్ కుమార్, కల్పలతా రెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్,జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, హఫీజ్ ఖాన్,, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్లుపులివెందులలోనే కూటమి నేతల తిష్టపులివెందుల మండలంలోనే కూటమి నేతలుఎన్నికల ప్రచార గడువు ముగిసినా పల్లెల్లో తిష్ట వేసిన టీడీపీ నేతలుఎర్రబెల్లి, నల్లపురెడ్డిపల్లె గ్రామాల్లో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, పుత్తా చైతన్య రెడ్డిఅయినా పట్టించుకొని పోలీసులుఎస్ఈసీ వద్దకు వైసీపీ నేతలుమరికొద్ది సేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న వైసీపీ నేతలుపులివెందుల జడ్పీటిసి ఎన్నికల్లో టిడిపి ప్రలోభాలు, దౌర్జన్యాల పై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు వైసీపీ నేతల రాక నేపధ్యంలో ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద బారికేడ్లతో పోలీసులు బందోబస్తుటీడీపీ నేతల కుట్రలపై ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్ఓటరు స్లిప్పులను టీడీపీ నేతలు తీసుకోవటంఫై వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ ఆగ్రహంకొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారుఇవ్వకపోతే బెదిరిస్తున్నారుమూడురోజులుగా ఎన్నికల కమిషన్ దృష్టికి పదేపదే తీసుకెళ్లాంఅయినా ఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర వీడటం లేదుటీడీపీ వారు ఇంటింటికీ వెళ్ళి డబ్బులు పంచుకున్నారుడబ్బులిచ్చి ఓటర్ల స్లిప్పులను వెనక్కు తీసుకుంటున్నారుదీని వలన ఎవరి ఓటు ఎక్కడ ఉందో ఓటరికి అర్థం కాదుతాను ఏ బూతులో ఓటు వేయాలో కూడా ఓటరుకి అర్థం కాని పరిస్థితి వచ్చిందిఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర పోతోందిఓటరుకి తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం కల్పించాలిప్రతి ఒక్క ఓటరికీ మళ్లీ స్లిప్లను అందించాలిఈ రాత్రికి మొత్తం 10,601 ఓటర్లకు స్లిప్పులను ఇవ్వాలిఎర్రిపల్లిలో రాత్రే టీడీపీ నేతలు స్లిప్పులను తీసుకున్నారుఈరోజు మరికొన్ని గ్రామాలలో తీసుకోబోతున్నారుమా పార్టీ మండల నాయకుల ఇళ్లకు కూడా వెళ్లి స్లిప్పులు అడుగుతున్నారునల్లపరెడ్డిపల్లి గ్రామానికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారుఆ వచ్చినవారికి ఈ స్లిప్పులను ఇచ్చి దొంగ ఓటు వేయించబోతున్నారురిగ్గింగ్ చేసినట్టు కెమెరాలో కనపడకుండా ఇలాగ ప్లాన్ చేశారునిరంతరాయంగా ఇలా దొంగ ఓట్లు వేయటానికి మనుషులను దించారుదీనిపై ఎన్నికల కమిషన్ స్పందించాలిపోలింగ్ బూత్ల మార్పు.. హైకోర్టులో విచారణఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ లంచ్ మోషన్ పిటిషన్పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూతులు మార్పులు సవాలు చేస్తూ పిటిషన్మధ్యాహ్నం విచారణ చేయనున్న ఏపీ హైకోర్టుఎన్నికల సంఘానికి పోలింగ్ బూత్ల మార్పుపై ఆదేశాలు ఇవ్వాలని కోరిన పిటిషన్పులివెందులలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది: కారుమూరితణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుస్వతంత్రం వచ్చిన తరువాత ఇటువంటి మెజార్టీలు ఎక్కడా చూడలేదు.ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి కూటమి ప్రభుత్వం అక్రమ మార్గంలో గెలిచింది.తణుకు నియోజకవర్గంలో ఆరిమిల్లి రాధాకృష్ణకు 72 వేల ఓట్లు ఈవీఎం ట్యాపరింగే.ఎలక్షన్ జరిగిన తర్వాత ఈవీఎం ట్యాపరింగ్లు జరిగిందని చెప్పిన మొదటి వ్యక్తి నేనే.ప్రజా సంక్షేమాన్ని అమలు చేసిన జగన్ మోహన్ రెడ్డి ఏమి చేయలేదని ప్రజలు ఓట్లు వేయలేదని నాయకులు చెబుతున్నారు .కేవలం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి మాత్రమే గెలిచారు.పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది.పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురుపులివెందులలో వైఎస్సార్సీపీ నేతలపై దాడి సందర్భంలో నిర్వహించిన ర్యాలీపై పోలీసుల కేసువైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి సహా 150 మందిపై కేసు పెట్టిన పోలీసులుహైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీఎవ్వరినీ అరెస్ట్ చేయవద్దని పోలీసులను సోమవారం ఆదేశించిన హైకోర్టుపులివెందుల ఆగని పోలీసుల దాష్టీకంపులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల దాష్టీకంవైఎస్సార్సీపీ నేతల అక్రమ నిర్బంధంఆరుగురిని ఆదివారం ఉదయం నుంచి పీఎస్లోనే ఉంచిన ఖాకీలుపులివెందుల అప్గ్రేస్ పీఎస్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న బాధితులుపోలీసుల అదుపులో అర్జున్ (మొట్నుతలపల్లి), మస్తాన్ వలి (చంద్రగిరి), హరి (మల్లికార్జునపురం), మైసూరారెడ్డి (లక్షుంవారిపల్లి), రవి ప్రకాష్ రెడ్డి, నాయక్ (కనంపల్లి)ఎన్నికల నేపధ్యంలో కీలకంగా ఉన్న నాయకులను వేధిస్తున్నారంటున్న వైఎస్సార్సీపీపోలింగ్ టీడీపీకి అనుకూలంగా మార్చడానికే అక్రమ నిర్బంధం అంటున్న వైఎస్సార్సీపీఒంటిమిట్టలో..ఒంటిమిట్టలో పోలింగ్ ఏర్పాట్లపై అధికారుల స్పందనమీడియాతో మాట్లాడిన రిటైనింగ్ అధికారి రామలింగయ్య రేపు 7 గంటల నుండి 5గంటల వరకు పోలింగ్ప్రతి పోలింగ్ స్టేషన్కి నలుగురు అధికారులుబ్యాలెట్ బాక్స్ లు, ఎలక్షన్ మెటీరియల్ అందిస్తున్నాం..సెక్యూరిటీతో పాటు పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలిస్తున్నాం..రేపు పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం మౌలానా అబ్దుల కలాం ఆజాద్ యూనివర్సిటీ లో భద్రపరుస్తాం14వ తేదీ కౌంటింగ్ ఉంటుందిపులివెందుల మండలంలో నేడు..స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ సిబ్బందికి పులివెందుల ఉప ఎన్నిక బ్యాలెట్ బాక్స్ ల పంపిణి ప్రారంభంజెడ్పీటీసీ ఉపఎన్నిక కు కావాల్సిన బ్యాలెట్ బాక్స్ ల పంపిణి చేస్తున్న ఎన్నికల అధికారులుపోలింగ్ సిబ్బంది కి బూత్లవారీగా ఎలక్షన్ సామగ్రి, బ్యాలెట్ బాక్సుల పంపిణిపులివెందుల జడ్పీటీసీ స్థానానికి 15 పోలింగ్ బూత్లు ఏర్పాటుపోలింగ్ బూత్ల సిబ్బందికి ఎలక్షన్ సామగ్రి పంపిణిరోజుకో కుట్ర.. కూటమి కుయుక్తిజెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కూటమి ప్రభుత్వ అడ్డదారులువైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టులు, నిర్బంధాలుఅదే సమయంలో ఓటర్లకూ వేధింపులుపోలింగ్ బూత్ల మార్పు తో ఓటర్లకు ఇబ్బందిఒక గ్రామంలోని ఓటర్లకు మరో గ్రామంలో పోలింగ్ కేంద్రంపోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, ఓటర్లు నిలువరించే ప్రయత్నాలు చేస్తారని వైఎస్సార్సీపీ పిర్యాదుప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీ, గవర్నర్లకు వినతిటార్గెట్ వైసీపీ కేడర్పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సాక్షిగా టీడీపీ అరాచకాలు ఇప్పటికే దాడులు, హత్యయత్నాలతో అట్టుడుకుతున్న పులివెందులగ్రామాల్లో కీలక వైఎస్సార్సీపీ నాయకులను తప్పుడు కేసుల్లో అరెస్ట్వందల మందిపై బైండోవర్ కేసులుపోలింగ్ రోజు వైఎస్సార్సీపీ నాయకులు కనపడకుండా కుట్రలుకూటమి కుట్రలతో రణరంగంగా మారిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికపులివెందుల, ఒంటిమిట్ట మొత్తం 750 మందిపై బైండోవర్ కేసుఒక్క పులివెందుల మండలంలోనే 500 మందిపై బైండోవర్ కేసులు52 మందిపై ఎస్సీ ఎస్టీ కేసులు, 9 మంది వైఎస్సార్సీపీ నాయకులను రిమాండ్ కు పంపిన పోలీసులుకోడ్ ఉల్లంఘించి మరీ.. ప్రచార సమయం ముగిసిన కొనసాగుతున్న టీడీపీ పాలిటిక్స్ ఒంటిమిట్టలో ఏదేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కూటమి కీలక నేతలుఆదివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసిన ప్రచారంఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతర్ చేసిన కూటమి ప్రభుత్వ నేతలు ఆరు గంటల టైంలోనూ హరిత హోటల్ లో మకాం వేసిన టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ...ముఖ్య నేతలకు వత్తాసు పలుకుతున్న పోలీసులుపులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలు.. రేపే పోలింగ్పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు ముగిసిన ప్రచారంరేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలుపులివెందులలో 10,601 ఓట్లు, ఒంటిమిట్టలో 24,600 ఓట్లుపులివెందులలో భారీ బందోబస్తుసెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న పోలీసులుపులివెందులలో ఐదు, ఒంటిమిట్టలో నాలుగు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపుప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద డ్రోన్లతో నిఘారెండు మండలాలు, జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటుపోలింగ్ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదని పోలీసుల హెచ్చరిక

నన్నెవ్వరూ ఆపలేరు.. ఎన్టీఆర్ కౌంటర్ లోకేష్కేనా?
పబ్లిక్ ఫంక్షన్లలో సాధారణంగా ఆచితూచి మాట్లాడతాడు తారక్. తన ఫ్యాన్స్కోసం మహా అయితే కాలర్ ఎగరేస్తాడు అంతే. ఏ మాత్రం వివాదాస్పద వ్యాక్యల జోలికి పోడు. కానీ ఈ సారి ఓ గట్టి స్టేట్మెంట్నే వదిలాడు తారక్. అదేంటంటే "స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దీవెనలు ఉన్నంత కాలం నన్ను ఎవరూ ఆపలేరు" అనేది జూ. ఎన్టీఆర్ కామెంట్. మామూలుగా అయితే ఈ మాటను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు పనిగనిగట్టుకుని 'నన్ను ఎవరూ ఆపలేరు' అని తారక్ అనడానికి ఓ కారణం ఉంది.సరిగ్గా 2 రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ ఓ ట్వీట్ చేశాడు. అందులో తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ని పొగిడాడు. కూలీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించాడు. కానీ ఎన్టీఆర్ను, వార్ 2 సినిమా గురించి మాత్రం లోకేష్ ఎక్కడా ప్రస్తావించలేదు.రజినీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా లోకేష్ ఈ ట్వీట్ చేశాడు. కానీ అదే టైమ్లో జూ. ఎన్టీఆర్ కూడా తన 25 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ ప్రస్తావన మాత్రం లోకేష్ ఎక్కడా తీసుకురాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే తారక్ ఇలా తన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు.ఇక చాలా కాలంగా అటు నారా కుటుంబానికి, ఇటు నందమూరి బాలకృష్ణ కుటుంబానికి జూ. ఎన్టీఆర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

అపర్ణకు జనం సెల్యూట్!
తిరువనంతపురం: ఈ రోజుల్లో పోలీస్ డ్యూటీ అంటే కేవలం చట్టాన్ని అమలు చేయడం మాత్రమే కాదు.. మానవత్వానికి ప్రతిరూపంగా నిలవడం కూడా. తాజాగా కేరళకు చెందిన ఓ మహిళా పోలీస్ అధికారిణి అందుకు నిదర్శనంగా నిలిచారు. ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్స్కు దారి ఇచ్చేందుకు ప్రయత్నం చేయడమే కాదు.. రోడ్డు మధ్యలో పరుగెత్తుతూ వాహనాలను పక్కకు జరుపుతూ సంకేతాలు ఇచ్చారు. ఆమె చేసిన ఈ చర్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో ఆగస్టు 9న కేరళలోని త్రిసూర్ జిల్లాలో జరిగింది. త్రిసూర్ జిల్లాకు చెందిన ఓ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ అంబులెన్స్ జూబ్లీ మిషన్ ఆస్పత్రి వైపు వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో పోలీసు వాహనంలో వెళ్తున్న స్టేషనల్ హౌస్ ఆఫీసర్ అపర్ణా లవకుమార్ ఆ అంబులెన్స్ను గమనించారు. వెంటనే పోలీసు వాహనం నుంచి మెరుపు వేగంతో బయటకు వచ్చారు. అంబులెన్స్ ముందు పరుగెత్తుతూ ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీంతో అంబులెన్స్ సకాలంలో ఆస్పత్రికి చేరడం,రోగికి చికిత్స అందడంపై అపర్ణా లవకుమార్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.అపర్ణా మానవత్వం చూపించిన ఘటనలో కోకొల్లలు. 2019లో త్రిసూర్ రూరల్ మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తుండగా ఐదోతరగతి చదువుతున్న చిన్నారి బాధడను చూడలేక ఆమె తన జుట్టును పూర్తిగా తీసేసి కేన్సర్ పేషెంట్ల కోసం దానం చేశారు. పోలీస్ శాఖ నియమాల ప్రకారం జుట్టు పూర్తిగా తీసేసుకోవడానికి అనుమతి అవసరం. ఆమె నిర్ణయాన్ని త్రిసూర్ రూరల్ డిస్ట్రిక్ట్ పోలీస్ చీఫ్ విజయ్ కుమార్ స్వాగతించారు.2008లో ఓ మృతదేహాన్ని విడుదల చేయించేందుకు ఆసుపత్రి బిల్లులు చెల్లించేందుకు తన బంగారు గాజులను ఇచ్చారు. ఇలా విధులు నిర్వహిస్తున్న అపర్ణా లవకుమార్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. Big Salute to #Kerala police woman ASI Aparna Lavakumar. In Thrissur, she ran ahead of a stalled ambulance in heavy traffic, personally urging vehicles aside so that the emergency vehicle with the patient could proceed safely. Aparna was previously praised for pawning her gold… https://t.co/RoUqXSzwAv pic.twitter.com/mip2MMLO7k— Ashish (@KP_Aashish) August 11, 2025

ఈసీ మొద్దు నిద్ర.. పులివెందులలో టీడీపీ ఓట్ల చోరీ: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం అధికార టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను వైఎస్సార్సీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎండగట్టారు. టీడీపీ నేతలు ఓటర్ల స్లిప్పులను సేకరిస్తున్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన ఆయన.. ఈసీ తీరుపైనా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ.... పోలింగ్ బూత్లను మార్చడంపై స్టేట్ ఎలక్షన్ కమిషనర్కు ఫిర్యాదు చేశాం. దీని వలన ఎవరి ఓటు ఎక్కడ ఉందో ఓటరికి అర్థం కాదు. తాను ఏ బూతులో ఓటు వేయాలో కూడా ఓటరుకి అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఓటరుకి తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం కల్పించాలి... కొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారు. టీడీపీ వారు ఇంటింటికీ వెళ్ళి డబ్బులు పంచుకున్నారు. డబ్బులిచ్చి ఓటర్ల స్లిప్పులను వెనక్కు తీసుకుంటున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు. ఎర్రిపల్లిలో రాత్రే టీడీపీ నేతలు స్లిప్పులను తీసుకున్నారు. ఈరోజు మరికొన్ని గ్రామాలలో తీసుకోబోతున్నారు. .. మా పార్టీ మండల నాయకుల ఇళ్లకు కూడా వెళ్లి స్లిప్పులు అడుగుతున్నారు. మూడురోజులుగా ఎన్నికల కమిషన్ దృష్టికి పదేపదే తీసుకెళ్లాం. అయినా ఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర వీడటం లేదు. ప్రతి ఒక్క ఓటరికీ మళ్లీ స్లిప్లను అందించాలి. ఈ రాత్రికి మొత్తం 10,601 ఓటర్లకు స్లిప్పులను ఇవ్వాలి. నల్లపరెడ్డిపల్లి గ్రామానికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారు. ఆ వచ్చినవారికి ఈ స్లిప్పులను ఇచ్చి దొంగ ఓటు వేయించబోతున్నారు. ిగ్గింగ్ చేసినట్టు కెమెరాలో కనపడకుండా ఇలాగ ప్లాన్ చేశారు. నిరంతరాయంగా ఇలా దొంగ ఓట్లు వేయటానికి మనుషులను దించారు. దీనిపై మొద్దు నిద్ర వీడి.. ఎన్నికల కమిషన్ స్పందించాలి అని డిమాండ్ చేశారాయన. ఇదిలా ఉంటే.. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం నుంచి జరగనుంది.

Nimisha Priya Case: ‘నిమిషకు వెంటనే శిక్ష అమలుపరచండి’
కేరళ నర్సు నిమిష ప్రియ కేసు.. వారానికో మలుపు తిరుగుతోంది. మరణ శిక్ష అమలుకు ఒక్కరోజు ముందు.. అంటే జులై 15న వాయిదా పడ్డట్లు యెమెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిమిష తల్లి విజ్ఞప్తి, మతపెద్దల జోక్యంతో శిక్ష అమలును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఉత్తర్వులు వెలువరించారు. అయితే..అప్పటి నుంచి బాధిత కుటుంబంతో నిమిష తల్లి, మధ్యవర్తులు జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. బ్లడ్ మనీ ప్రైవేట్ వ్యవహారం కావడంతో భారత విదేశాంగ శాఖ దూరంగా ఉంటోంది. దీంతో నిమిష ప్రియ కేసులో చర్చలు ఎలా కొనసాగుతున్నాయో అనే గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహ్దీ హతమార్చిన కేసులో నిమిష ప్రియకు మరణశిక్ష పడింది. అయితే నిమిషకు వెంటనే మరణశిక్ష అమలు చేయాలని అతని సోదరుడు అబ్దుల్ ఫతాహ్ మెహ్దీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు యెమెన్ డిప్యూటీ జనరల్ను కలిసి మరణశిక్ష తేదీ అమలుకు తేదీని ఖరారు చేయాలని కోరారు. అదే సమయంలో ఆ దేశ అటార్నీ జనరల్కు శిక్షను త్వరగతిన అమలు చేయాలంటూ శుక్రవారం ఓ లేఖ రాశాడు.‘‘మా కుటుంబం అంతా కోరుకునేది ఒక్కటే. ఆమె చేసింది క్రూరమైన నేరానికి పాల్పడింది. ఆ నేరానికి క్షమాపణ ఉండదు.. ఉండబోదు. ఆమెకు తక్షణమే శిక్ష అమలు కావాలి. ఇంక ఆలస్యం చేయకుండా న్యాయం అందించాలి’’ అని ఫేస్బుక్లోనూ ఫతాహ్ ఓ పోస్ట్ చేశాడు. అయితే ఫతాహ్ ఇలా డిమాండ్ చేయడం ఇదే తొలిసారేం కాదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. వాస్తవానికి నిమిషకు మరణశిక్ష జూన్ 7వ తేదీనే అమలు కావాల్సి ఉందని, అయితే దానిని జులై 16వ తేదీకి ాయిదా వేశారు. అప్పట ఇనుంచి అమలు చేయకుండా పెండింగ్లో ఉంచారని ఫతాహ్ ఆరోపిస్తున్నాడు. నిమిషకు మరణశిక్షలో జాప్యం చేయొద్దని జులై 25న, ఆగస్టు 4వ తేదీల్లో అక్కడి అదికారులకు లేఖ రాశాడు. మరోవైపు.. కేరళ మతపెద్ద, భారత గ్రాండ్ ముఫ్తా కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ చేస్తున్న వరుస ప్రకటనలనూ అబ్దుల్ ఫతాహ్ ఖండించాడు. మధ్యవర్తిత్వం, సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతోన్న ప్రయత్నాలు కొత్తవేమీ కావు. మాకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. అలాగే మేం ఎదుర్కొన్న ఒత్తిళ్లు మా అభిప్రాయాన్ని మార్చవు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేం. ఇది ఆ మత పెద్దలు అర్థం చేసుకుంటే మంచిది. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోండి. నిమిషకు శిక్ష పడితేనే మా కుటుంబానికి న్యాయం దక్కేది’’ అని అంటున్నాడు. ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ మరణశిక్ష తన దౌత్యం వల్లే వాయిదా పడిందని కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ తాజాగా ప్రకటించారు. అలాగే.. ఈ వ్యవహారంలో కొందరు ఆ ఘనతేనని ప్రకటించుకున్నారని, అవసరమైతే ఆ క్రెడిట్ వాళ్లకే కట్టబెట్టడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ప్రకటించారు. మరోవైపు.. నిమిష ప్రియ వ్యవహారంలో భారత ప్రభుత్వం తాము చేయగలిగినదంతా చేశామంటూ ఇదివరకే ప్రకటించింది. అయితే శిక్ష వాయిదా ప్రకటనను అధికారికంగా ధృవీకరించిన విదేశాంగ శాఖ.. ఏదైనా పురోగతి కనిపిస్తే అధికారికంగా తామే ప్రకటిస్తామని, అప్పటిదాకా వదంతులను నమ్మొద్దంటూ స్పష్టం చేస్తూ వస్తోంది.

విద్యార్థులకు 'భవిష్యత్' పాఠం
అవి మా ముత్తాత పోయిన కొత్తలు. ఆయన ఒక సన్నకారు రైతు. ఆయన పోవడంతో మా ముత్తవ్వ యువ వితంతువుగా మారింది. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమారులు. ఆదాయ వనరు సున్నా. ఇద్దరు పిల్లలను చదివించి, వారికి మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో దగ్గరలోని ఓ పట్టణానికి మకాం మార్చారు. ఓ ఇంట్లో పని మనిషిగా చేరారు. చాలీచాలని ఆదాయం ఇద్దరు పిల్లల్లో ఒకరిని చదివించేందుకే సరిపోతుంది. ఇద్దరు పిల్లల మధ్య వయసులో పెద్ద తేడా లేదు. ఆ ఇద్దరిలో ఒక పిల్లాడు బాధ్యతతో మెలిగేవాడుగా కనిపించాడు. రెండవవాడు కాస్త పేచీకోరు. పరిస్థితులకు అనుగుణంగా మసలుకునే పిల్లాడిని, ఆమె పనిలోకి దింపారు. అతను భవన నిర్మాణ పనుల్లో దినసరి కూలీగా మారాడు. కొత్త నైపుణ్యాలను గడించుకుని, ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని అందుకొనే అవకాశం ఎన్నడూ లభించలేదు. మరో పిల్లాడిని స్థానికంగా ఉన్న పాఠశాలకి పంపించగలిగారు. ఆ పిల్లాడే మా తాతయ్య. తక్కువ బాధ్యతతో వ్యవహరించే పిల్లాడిగా ముద్రపడినా, స్కూలు చదువును కొనసాగించగలిగాడు. పోలీసు అధికారి అయ్యాడు. అతని సోదరుడు నాలుగు రాళ్ళు సంపాదించడం ప్రారంభించిన పదేళ్ళ తర్వాత ఉద్యోగంలో చేరినా, ప్రారంభంలోనే ఎక్కువ జీతభత్యాలు తీసుకోగలిగాడు. మా తాత చదువుకోవడం, ఉద్యోగ జీవితం వల్ల, మా నాన్నకు చదువుకొనే అవకాశం లభించింది. ఫలితంగా, నేను నాకు ఇష్టమైన బాటలో అడుగులు వేసేందుకు అవకాశం చిక్కింది. మా తాతకు లభించిన అవకాశం వల్ల, ఆ తరువాత తరాలు కూడా బాగుపడే వీలు చిక్కింది. ప్రతిభావంతులు ప్రతిచోటా ఉన్నారు. కానీ, వారు వెలుగులోకి వచ్చే అవకాశమే ఉండటం లేదు అనే దానికి ఈ వ్యక్తిగత జీవిత వివరాలే ఉదాహరణ. టెక్నాలజీ ఉపకరణం మాత్రమే!ఈ రోజు కార్యక్రమం విద్య, టెక్నాలజీ గురించి! సూటిగా చెప్పాలంటే, రేపటి ప్రపంచాన్ని సృష్టించేవారిగా నేటి విద్యార్థులను తీర్చిదిద్దడానికి సంబంధించినది. సాంకేతికంగా అబ్బురపరచే ప్రగతిని సాధిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. మన జీవితాలలో ప్రతి పార్శ్వాన్ని, ఆర్థిక వ్యవస్థలను, సమాజాలను డిజిటల్ టెక్నాలజీలు రూపుదిద్దుతున్నాయి. అయితే, టెక్నాలజీ అంతరాయా లను కూడా సృష్టిస్తోంది. టెక్నాలజీ ఏ కొద్ది మందికోకాక, అందరికీ అవకాశాలను అందివ్వగలదా? అన్నదే అసలైన ప్రశ్న. ఇతరులు సాధించే విజయంపైనే మన విజయం గణనకు వస్తుంది. చదువుకునే అవకాశాన్ని అందరికీ కల్పించడం మన ధ్యేయం కావాలి. నేటి సమాజం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్ళలో అది ఒకటి. ‘మైక్రోసాఫ్ట్’ మాజీ పరిశోధకుడు, ‘గీక్ హేర్సే’ పుస్తక రచయిత కెంటరో టొయోమ ఆ అంశాన్ని బాగా పట్టుకున్నారు. టెక్నాలజీలో కన్నా ముందుగా సమాజంలో మార్పు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. టెక్నోక్రాట్లు సాధారణంగా టెక్నాలజీ గుణగణాల గురించి గొప్పగా చెప్పేందుకు మొగ్గు చూపుతూంటారు. వ్యవస్థలోని అన్ని రుగ్మతలకూ దానినే విరుగుడుగా భావిస్తూంటారు. దానితో విభేదం ఉన్నవాడిగానే నేనిక్కడికి వచ్చాను. విద్యను రూపాంతరీకరించడానికి టెక్నాలజీ ఒక్కటే సమాధానమనే భ్రమల్లో మనం లేము. విద్యా రంగంలో మార్పు తీసుకొచ్చేందుకు అంకిత భావం కలిగిన పాలకులు, గొప్ప ఉపాధ్యాయులు, ప్రేరణ పొందిన విద్యార్థులు, పాలుపంచుకునే తల్లితండ్రులు, సమాజాలు అవసరం. టెక్నాలజీ వారి సృజనాత్మకతకు, చాతుర్యానికి సాధికారత కల్పించగల ఒక ఉపకరణం మాత్రమే. ప్రపంచం నలుమూలల ఉన్న విద్యార్థులను చూడగలగడం, వారి నుంచి నేర్చుకోగలగడం నా ఉద్యోగ బాధ్యతల్లో నేను ఇష్టపడే అంశాల్లో ఒకటి. గత రెండేళ్ళుగా, నేను 20కి పైగా దేశాలలో విద్యార్థులను కలుసుకునే అవకాశం లభించింది. సియాటిల్లో నా కూతుళ్ళు ఏ ఆఫీసు టూల్స్ని ఉపయోగిస్తున్నారో అవే టూల్స్ని జకార్తా, టెల్ అవీవ్లలోని విద్యార్థులు కూడా ఉపయోగిస్తున్నారు. ఆ యా తరగతి గదుల్లో కొంత సమయాన్ని వెచ్చించినప్పుడల్లా, ప్రతిసారీ నాలో కొన్ని అంశాలు ముసురుకుంటూ వచ్చాయి. పిల్లలను ఎలా తీర్చిదిద్దాలి?ఒకటి– తరగతి గదిలో టీచర్ పనికి టెక్నాలజీ సాయపడాలే గానీ, అవరోధం కాకూడదు. సమయాన్ని వెచ్చించడంలో టీచర్లపై చాలా డిమాండ్లు ఉంటాయి. వారు పాఠ్యాంశాలను ఎంపిక చేయాలి. పరీక్షలు పెట్టాలి. పేపర్లు దిద్దాలి. తరగతుల్లో విద్యార్థు లను అదుపాజ్ఞలలో ఉంచాలి. క్రమశిక్షణ నేర్పాలి. టెక్నాలజీ టీచర్ల జీవితాలను సులభతరం చేసి, విద్యార్థులలో సృజనాత్మకతను రేకెత్తించేదిగా ఉండాలిగానీ, వాటి నుంచి దృష్టి మళ్ళించేదిగా ఉండకూడదు. రెండు– పని స్వరూప స్వభావాలలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక సమస్యను పరిష్కరించేందుకు సమష్టిగా పనిచేస్తున్నారు. సమస్యను విభజించి చూడటంకన్నా ఏక మొత్తంగా చూస్తున్న ధోరణి కనిపిస్తోంది. ఈ రకమైన భవిష్యత్తుకి మనం విద్యార్థులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. తరగతి గదిలో కూడా టీమ్ల వారీగా పనిచేయడాన్ని ప్రోత్సహించాలి. సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా నేర్చుకో వడం తరగతి గదిలోనే మొదలవ్వాలి. టీమ్ వర్క్కి అవి కేంద్రాలు కావాలి. అప్పుడే దేన్నైనా కలసి సృష్టించగల సామర్థ్యం సొంత మవుతుంది. విద్యార్థులను కలసిమెలసి నేర్చుకునేటట్లుగా చేస్తే, వారి విద్యావకాశాలు కూడా మెరుగుపడతాయి. మూడు– రేపటికి తగినట్లుగా మన విద్యార్థులను తయారు చేసి తీరాలి. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ నివేదికను, అది రూపొందించిన ఉద్యోగాల నివేదికను పరిశీలించండి. నేడు పాఠశాలల్లో అడుగు పెడుతున్న విద్యార్థుల్లో 65 శాతం మందికి లభించబోయే ఉద్యో గాలు, ఇపుడు ఉనికిలో ఉన్నవి కావట! ‘కాంపుటేషనల్ థింకింగ్’, సమస్యను పరిష్కరించగల నైపుణ్యాలు భవిష్యత్తుకు కీలకమని టీచర్లకు తెలుసు. ‘స్టెమ్’ పాఠ్య ప్రణాళికను విస్తృతంగా వీక్షించవలసిన అవసరం ఉందని కూడా వారికి తెలుసు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితాన్ని కలిపి పొందికతో కూడిన అధ్యయన నమూనాగా చేయడాన్ని ‘స్టెమ్’గా పిలుస్తున్నారు. చదవడం, రాయడం, డిజైన్, కళలకు తోడు, ‘స్టెమ్’ పాఠ్య ప్రణాళికను కూడా తీసుకువస్తే, భవిష్యత్తులో ఈ విద్యార్థులు విజయం సాధించడానికి రంగం సిద్ధం చేసినవాళ్ళం అవుతాం. చివరగా– మా తాతకు లభించిన అవకాశం, మా కుటుంబ గతిని మార్చివేసింది. ఇపుడు నాకు స్ఫూర్తినిస్తున్న అంశం ఈ తరంలోనూ, రాబోయే తరాలలోనూ ప్రతి విద్యార్థికి విద్యావకాశాన్ని ప్రజాస్వామ్యీకరణ చేసేందుకు మనందరం కలసి మెలసి ఎలా ఒకటవాలన్నదే! అందరికీ కృతజ్ఞతలు.

చట్టసభలే సరైన వేదికలు
మన చట్టసభల వల్ల ప్రజలకూ, ప్రజాస్వామ్యానికీ ఏ మేరకు ప్రయోజనం కలుగుతోందన్న అంశంలో ఎవరి అభిప్రాయాలు వారికున్నా... అక్కడి చర్చల సరళి ఇంకా మెరుగుపడాలని, ప్రభుత్వ జవాబుదారీతనం మరింత పెరగాలన్న విషయంలో అందరూ ఏకీభవిస్తారు. గత నెలాఖరున మూడు రోజులపాటు ‘ఆపరేషన్ సిందూర్’పై విస్తృత చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలోనూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలోనూ సమాధానమిచ్చారు. కానీ భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ శనివారం చేసిన ప్రసంగంలోనూ, అంతక్రితం ఈ నెల 4న సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది మద్రాస్ ఐఐటీలో చేసిన ఉపన్యాసంలోనూ కనబడిన స్పష్టత, వివరాలు చర్చ సందర్భంగా ప్రధాని, కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటనల్లో లేవు. ఇరు దేశాల మధ్యా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం వెనక ఏ ప్రపంచ నాయకుల ఒత్తిళ్లూ లేవని ఇద్దరూ నిర్ద్వంద్వంగా చెప్పటం హర్షించదగ్గదే అయినా, ఆ ఆపరేషన్లో మనం సాధించిన విజయాలనూ, ఆ క్రమంలో ఎదురైన సవాళ్లనూ వివరించకపోవటం, అసలు పెహల్గాం భద్రతా లోపాలూ, వాటిపై చర్యలూ వెల్లడించకపోవటం లోటే అనిపిస్తుంది. అనర్గళంగా మాట్లాడగలిగే శక్తివున్నవారెవరో, అవతలి పక్షాన్ని వ్యంగ్యంతో, వెటకారంతో గేలిచేసి చిన్నబుచ్చగలవారెవరో తెలుసుకోవటానికి ప్రజలు చట్టసభల ప్రత్యక్ష ప్రసారాలు చూడరు. వాస్తవాలు తెలుసుకోవా లనుకుంటారు. విపక్షాల సందేహాలకు ప్రభుత్వం సూటిగా, స్పష్టంగా జవాబిచ్చిందా లేదా అనేది గమనిస్తారు. కానీ పార్లమెంటులో జరిగింది వేరు. ఎప్పటిలా పరస్పరం నిందారోపణలు చేసుకోవటంతోనే చాలా సమయం గడిచింది. ‘సిందూర్’లో జరిగిందేమిటో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ చెప్పారు. పాకిస్తాన్కు చెందిన అయిదు యుద్ధ విమానాలను కూల్చటంతోపాటు మరో భారీ విమానాన్ని సైతం పడగొట్టామని, దాదాపు 90 గంటల వ్యవధిలో అనుకున్న లక్ష్యాలను సాధించామని ఆయన వివరించారు. మన గగనతల రక్షణ వ్యవస్థ, డ్రోన్ వ్యవస్థ సక్రమంగా పనిచేయటంతో పాక్ సైన్యం పాచికలేమీ పారలేదని, వారి ఎఫ్–16లూ, డ్రోన్లూ, క్షిపణులనూ కూల్చేయటంతోపాటు రెండు కమాండ్ కంట్రోల్ కేంద్రాలనూ, ఒక వైమానిక స్థావరాన్నీ ధ్వంసం చేశామని ప్రకటించారు. జనరల్ ద్వివేది అయితే ప్రభుత్వం రాజకీయ స్పష్టతతో దిశానిర్దేశం చేయటం, విశ్వాసాన్నీయటం, నిర్ణయాన్ని తమకే వదిలేయటం తొలిసారి చూశామని చెప్పారు. ఇటువంటి ప్రకటనలు పార్లమెంటు వేదికపై ప్రభుత్వం వైపుగా వస్తే, వాటిపై విపక్షం ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు వెల్లడయ్యేవి. ముఖ్యంగా జనరల్ ద్వివేది ప్రసంగం వాస్తవ స్థితేమిటో చెప్పింది. శత్రువుతో ఇప్పుడు నాలుగు రోజుల్లోనే ఘర్షణలు సమసినా... త్వరలోనే మరో యుద్ధం జరిగినా ఆశ్చర్యం లేదని, ఈసారి ఒంటరిగా వస్తారా, వేరే దేశాలతో కలిసి వస్తారా అన్నది కూడా చెప్పలేమని ఆయన అనటం గమనించదగ్గది. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్జీత్, జనరల్ ఉపేంద్ర ద్వివేది కూడా ‘ఆపరేషన్ సిందూర్’ దేశాన్ని ఏకం చేయటం గురించి ప్రస్తావించారు. దేశ ప్రజానీకమంతా ఒక్కటై నిలబడటం సాధారణ విషయం కాదు. ఇందులో విపక్షాల పాత్రను కొట్టిపారేయలేం. పెహల్గాంలో భద్రతా లోపాలపై తీసుకున్న చర్యలేమిటో చెప్పకపోవటం, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్–పాక్ ఘర్షణలు ఆగటం తన ఘనతేనని ప్రకటించటం విపక్షాలకు అభ్యంతరకరం అయింది. ట్రంప్ మధ్యలో స్వరం మార్చినా తిరిగి దాన్నే పదే పదే చెబుతున్నారు. అందువల్ల పార్లమెంటు వేదికగా దేశానికి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి జరిగిందేమిటో చెప్పాల్సిన బాధ్యత పాలకులపై పడింది. ప్రశ్నిస్తున్న విపక్షాలు పాకిస్తాన్తో కుమ్మక్కయ్యాయని ప్రత్యారోపణ చేయటం ఇందుకు ప్రత్యామ్నాయం కాదు. యుద్ధ రంగంలో వ్యూహాలూ, ఎత్తుగడలూ ఎలావుండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికి వదిలిపెట్టినా, ఆ క్రమంలో ఏర్పడ్డ సమస్యలను తెలుసుకుని అవసరమైన సూచనలీయటం, జరిగిందేమిటో ప్రజలకు తేటతెల్లం చేయటం దేశ రాజకీయ నాయకత్వం బాధ్యత. మన రక్షణ దళాల చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్లో జూన్ నెలాఖరున మాట్లాడుతూ మన దళాలు చేసిన కొన్ని ‘వ్యూహాత్మక తప్పిదాల’ కారణంగా జెట్ విమానాలు కోల్పోయామని చెప్పటం వివాదాస్పదమైంది. పార్లమెంటులో దానిపై ప్రభుత్వం వైపునుంచి ఎలాంటి వివరణా లేదు. ఇప్పుడు దళాధిపతుల ప్రసంగాల్లోనూ ఆ వివరాల్లేవు. ఈ విషయమై సందేహాలు పోగొట్టడానికి పార్లమెంటే సరైన వేదిక. దాన్నుంచి వెలువడే సందేశం దేశ ప్రజానీకాన్ని ఒక్కటి చేస్తుంది. ఆ సంగతిని అధికార పక్షంతోపాటు విపక్షం కూడా మరువరాదు.

క్రికెట్లో పెను సంచలనం.. 5 బంతుల్లో మ్యాచ్ ఫినిష్
అండర్ -19 వరల్డ్ కప్ అమెరికా క్వాలిఫయర్స్లో పెను సంచలనంం నమోదైంది. క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓ జట్టు 5 బంతుల్లోనే మ్యాచ్ను ముగించింది. ఈ అరుదైన రికార్డును కెనడా అండర్-19 జట్టు తమ పేరిట లిఖించుకుంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి పరమ్ వీర్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా అర్జెంటీనా అండర్-19, కెనడా అండర్-19 జట్లు తలపడ్డాయి.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అర్జెంటీనా కెప్టెన్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే కెప్టెన్ నిర్ణయానికి అర్జెంటీనా జట్టు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయింది. తొలుత బ్యాటింగ్కు దిగిన అర్జెంటీనా.. కెనడా బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో కేవలం 23 పరుగులకే కుప్పకూలింది. కెనడా పేసర్ జగ్మన్దీప్ పాల్ 6 వికెట్ల పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. అతడితో పాటు డొమినిక్ డైన్స్టర్, క్రిష్ మిశ్రా తలా రెండు వికెట్లు సాధించారు. అర్జెంటీనా బ్యాటర్లలో ఒక్కరంటే ఒక్కరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. టొమోస్ రస్సీ(6) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 23 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కెనడా కేవలం 5 బంతుల్లోనే చేధించింది. ఓపెనర్ ధర్మ్ పటేల్ (1 నాటౌట్) తొలి బంతికి సింగిల్ తీయగా.. మరో ఓపెనర్ యువరాజ్ సమ్రా(22 నాటౌట్) నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో మ్యాచ్ను ముగించాడు.కాగా యూత్ వన్డే క్రికెట్లో అత్యల్ప స్కోర్ రికార్డు మాత్రం స్కాట్లాండ్ పేరిట ఉంది. 2004 అండర్-19 వరల్డ్కప్లో ఆస్ట్రేలియాపై స్కాట్లాండ్ 22 పరుగులకే కుప్పకూలింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 3.5 ఓవర్లలో ఛేదించింది.చదవండి: Jos Buttler: తండ్రి మరణం.. స్టార్ క్రికెటర్ భావోద్వేగం

రోజుకు ఐదు ఎన్కౌంటర్లు.. క్రిమినల్స్ గుండెల్లో రైళ్లు
యూపీ పోలీసుల పేరు చెబితే అక్కడి నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ తమకు ఎదురే లేదన్నట్టుగా ఇన్నాళ్లూ చెలరేగిపోయిన క్రిమినల్స్ ఆట కటిస్తున్నారు ఉత్తరప్రదేశ్ రక్షక భటులు. తామున్నది శాంతి భద్రతలు కాపాడటానికేనని, నేరాలు చేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని తేల్చి చెబుతున్నారు. తమదైన శైలిలో కిరాతకుల పీచమణుస్తున్నారు. ఇందుకు అధికారిక లెక్కలే ప్రత్యక్ష సాక్ష్యం.ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సీఎంగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు సగటున రోజుకు దాదాపు ఐదు ఎన్కౌంటర్లు జరిగినట్టు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. యూపీ పోలీసుల డేటా ప్రకారం.. 2017, మార్చి 20 నుంచి ఈ ఏడాది ఆగస్టు 6 వరకు రాష్ట్రంలో 15,140 ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఫలితంగా 243 మంది క్రిమినల్స్ హతమయ్యారు. 9,668 మందికి గాయాలయ్యాయి. 31 వేల మందిపైగా నిందితులు అరెస్టయ్యారు. విధి నిర్వహణలో 18 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా, 1720 మంది గాయపడిన్నట్టు యూపీ పోలీసుల అధికారిక డేటా వెల్లడించింది.నో కాంప్రమైజ్రాష్ట్రంలో శాంతిభద్రతల పరిక్షణలో రాజీపడబోమని, నేరాలు చేసే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని యూపీ డీజీపీ రాజీవ్ కృష్ణ (Rajeev Krishna) స్పష్టం చేశారు. తాము చేపట్టిన ప్రతి చర్య కూడా నిష్పక్షపాతంతో పారదర్శకంగా ఉంటుందన్నారు. మానవ హక్కులను గౌరవిస్తూనే చట్టానికి లోబడి వ్యవహరించామని ఆయన చెప్పారు. ఎదురు కాల్పుల సమయంలో జాతీయ మానవ హక్కుల మార్గదర్శకాలను యూపీ పోలీసులు పాటించారు. గ్యాంగ్స్టర్, మాఫియా డాన్లను ఉక్కుపాదంతో అణిచివేస్తాం. ఇదిలాగే కొనసాగుతుందని అన్నారు. నేరస్థులను పట్టుకునే క్రమంలో తమ పోలీసులు ఎంతో దైర్యసాహసాలు ప్రదర్శించారని, విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేశారని, కొంతమంది గాయపడ్డారని తెలిపారు.వెస్ట్లోనే హయ్యస్ట్యూపీ పోలీసుల అధికారిక లెక్కల ప్రకారం.. మొత్తం ఎన్కౌంటర్లలో సగానికి పైగా పశ్చిమ యూపీలోని పోలీసు కమిషనరేట్లు, జోన్స్ పరిధిలోనే చోటు చేసుకోవడం గమనార్హం. మీరట్ జోన్లో అత్యధిక ఎన్కౌంటర్లు (4,282) చోటుచేసుకున్నాయి. అగ్రా జోన్ (2,326), బరేలీ (2,004) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒక్క మీరట్ జోన్లోనే 81 మంది ఎన్కౌంటర్లలో హతమయ్యాయి. 2,951 మంది గాయపడగా, 4,568 మంది అరెస్టయ్యారు. ఇదే సమయంలో లక్నో జోన్లో 806 ఎన్కౌంటర్లలో 17 మంది నేరస్థులను పోలీసులు మట్టుబెట్టి 1,781 మందిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా 166 మంది పోలీసులు గాయపడ్డారు. గౌతమ్ బుద్ధ నగర్ కమిషనరేట్ పరిధిలో 1,084, కాన్పూర్ జోన్లో 671 ఎన్కౌంటర్లు జరిగాయి.పబ్లిక్ సేఫ్టీ ఫస్ట్పోలీసు కమిషనరేట్ల వారీగా చూస్తే.. గౌతమ్ బుద్ధ నగర్ కమిషనరేట్ పరిధిలో అత్యధిక ఎన్కౌంటర్లు జరిగాయి. తర్వాతి స్థానిల్లో ఘజియాబాద్ (696), ఆగ్రా (430), వారణాసి(124), లక్నో (132) నిలిచాయి. నేరస్థులను పట్టుకోవడానికి వెళ్లినప్పుడు తమపైకి కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్లు జరిగినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలను కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని చెప్పారు.చదవండి: కోట్లు కుమ్మరిస్తున్నారు... ఎక్కడా తగ్గట్లేదు! క్రిమినల్స్ ఫినిష్యూపీ ఎన్కౌంటర్లలో కరుడు గట్టిన పలువురు నేరస్థులు హతమయ్యారు. డీఎస్పీతో సహా 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న వికాస్ దూబేను ఎన్కౌంటర్లో మట్టుబెట్టారు. 60 క్రిమినల్ కేసులున్న అతడి తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. మరో క్రిమినల్ షకీల్ అహ్మద్పై 25 కేసులుండగా, అతడి తలపై రూ. 2.5 లక్షల రివార్డు ఉంది. 10 క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న కమల్ బహదూర్పై కూడా రూ. 2.5 లక్షల రివార్డు ఉంది. లక్ష్మణ్ యాదవ్ రూ. 1.5 లక్షల రివార్డు ఉంది. వీరిని ఎన్కౌంటర్లలో పోలీసులు హతమార్చడంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు ఆమోదం: అమల్లోకి ఎప్పుడంటే?
ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ.. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025కు తాజాగా ఆమోదం లభించింది. బైజయంత్ పాండా నేతృత్వంలోని 31 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ చేసిన అనేక సిఫార్సుల ఆధారంగా ఇందులో మార్పులు చేశారు.సుమారు నాలుగు నెలల పాటు తీవ్రంగా సమీక్షించిన తర్వాత, కమిటీ 285 కంటే ఎక్కువ సిఫార్సులతో 4,500 పేజీలకు పైగా నివేదికను రూపొందించింది. ఈ సూచనల ఉద్దేశ్యం చట్టం భాషను సరళీకృతం చేయడం, నిబంధనలలో స్పష్టత తీసుకురావడం & పన్ను చెల్లింపుదారులకు సమ్మతిని సులభతరం చేయడం. ఇప్పుడు ప్రభుత్వం ఈ మార్పులను కలుపుకొని కొత్త ముసాయిదాను సమర్పించింది.ప్రస్తుతమున్న 1961 చట్టాన్ని భర్తీ చేయడానికి ఉద్దేశించిన కొత్త ఆదాయపు పన్ను బిల్లు, రాష్ట్రపతి ఆమోదం కోరే ముందు రాజ్యసభకు వెళుతుంది. ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత, కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది.పాత vs కొత్త బిల్లు మధ్య తేడాలుపాత ఆదాయపు పన్ను చట్టం, 1961.. దశాబ్దాలుగా అమలులో ఉంది. అయితే అందులోని భాష, నిర్మాణం వంటివన్నీ సామాన్యులకు కొంత గందరగోళంగా ఉన్నాయి. దీనిని పూర్తిగా మార్చాలనే ఉద్దేశ్యంతో కొత్త బిల్లును తీసుకువచ్చారు.ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లో మొత్తం 47 అధ్యాయాలు ఉన్నాయి. కొత్త బిల్లులో.. అధ్యాయాల సంఖ్యను కేవలం 23కి తగ్గించారు. దీనివల్ల చదవడం, అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఈ మార్పు ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, నిపుణులకు ఉపశమనం కలిగిస్తుంది.ఇకపై మునుపటి సంవత్సరం & అసెస్మెంట్ సంవత్సరం వంటి పదాలకు బదులు "పన్ను సంవత్సరం" అనే పదం వాడుకలోకి వస్తుంది.2025 కొత్త పన్ను బిల్లులో ఇంతకు ముందు ఉన్న శ్లాబులు, రేట్లు అలాగే ఉంటాయి. ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలు, ఆదాయపన్ను శ్లాబులలో కూడా ఎలాంటి మార్పు లేదు.కొత్త బిల్లులో, సంక్లిష్టమైన చట్టపరమైన భాషకు బదులుగా, పన్నును సులభంగా లెక్కించగల సూత్రాలు, పట్టికలను ఇవ్వడం జరిగింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు ఎంత పన్ను చెల్లించాలో.. ఎలా చెల్లించాలో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.ఇదీ చదవండి: ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50వేలు: స్పందించిన ఆర్బీఐ గవర్నర్
ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా
చట్టసభలే సరైన వేదికలు
దివ్యాంగుడని చూడకుండా.. గోడు వినకుండా
విద్యార్థులకు 'భవిష్యత్' పాఠం
మహిళా మార్ట్.. బిజినెస్ భేష్!
నన్నెవ్వరూ ఆపలేరు.. ఎన్టీఆర్ కౌంటర్ లోకేష్కేనా?
ఆర్మీ కుటుంబాల నేపథ్యంలో...
పల్లెటూరి ప్రేమకథ
కాపాడు... కాపాడు
ఊ అంటారా?
ఈ ఇల్లు ఎవరిదో తెలుసా?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే?
ఇంకొన్ని ఫిర్యాదులొచ్చే వరకూ ఆగుదాం సార్!!
అనకాపల్లి: మత్స్యకారులకు చిక్కిన 500 కిలోల చేప.. ధర ఎంతంటే?
నకిలీ నోట్ల ముఠానట! ఇక్కడికొచ్చి లొంగిపోతున్నాడు!
అరుణాచలంలో సురేఖవాణి కూతురు సుప్రీత ప్రత్యేక పూజలు (ఫొటోలు)
ఈ రాశి వారు వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు
కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. అప్రయత్న కార్యసిద్ధి
మరోసారి చెలరేగిపోయిన టీమిండియా యువ సంచలనం.. 119 పరుగులు, 10 వికెట్లు
పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురు
ఎట్టకేలకు వీడిన సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ.. అసలు కథ ఇదే..
పనిలోపని ఆ పార్టీని కూడా తీసేస్తే పోలా!
అక్కడ సక్సెస్ లేక తెలుగులో సినిమాలు చేశా.. ఆ ఒక్క మూవీ వల్లే..
పసుపుతో మధుమేహానికి చెక్
పెరుగుతున్న బంగారం ధరలు: ప్రధాన కారణాలు
ముక్కలుగా నరికి..10 చోట్ల పడేశారు..!
సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా.. చరిత్రలో తొలిసారి ఇలా..!
'అలాంటి ఒక్క వాహనం చూపించండి': గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్
ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా
చట్టసభలే సరైన వేదికలు
దివ్యాంగుడని చూడకుండా.. గోడు వినకుండా
విద్యార్థులకు 'భవిష్యత్' పాఠం
మహిళా మార్ట్.. బిజినెస్ భేష్!
నన్నెవ్వరూ ఆపలేరు.. ఎన్టీఆర్ కౌంటర్ లోకేష్కేనా?
ఆర్మీ కుటుంబాల నేపథ్యంలో...
పల్లెటూరి ప్రేమకథ
కాపాడు... కాపాడు
ఊ అంటారా?
ఈ ఇల్లు ఎవరిదో తెలుసా?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే?
ఇంకొన్ని ఫిర్యాదులొచ్చే వరకూ ఆగుదాం సార్!!
అనకాపల్లి: మత్స్యకారులకు చిక్కిన 500 కిలోల చేప.. ధర ఎంతంటే?
నకిలీ నోట్ల ముఠానట! ఇక్కడికొచ్చి లొంగిపోతున్నాడు!
ఈ రాశి వారు వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు
కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. అప్రయత్న కార్యసిద్ధి
మరోసారి చెలరేగిపోయిన టీమిండియా యువ సంచలనం.. 119 పరుగులు, 10 వికెట్లు
పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురు
ఎట్టకేలకు వీడిన సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ.. అసలు కథ ఇదే..
పనిలోపని ఆ పార్టీని కూడా తీసేస్తే పోలా!
అక్కడ సక్సెస్ లేక తెలుగులో సినిమాలు చేశా.. ఆ ఒక్క మూవీ వల్లే..
పసుపుతో మధుమేహానికి చెక్
పెరుగుతున్న బంగారం ధరలు: ప్రధాన కారణాలు
ముక్కలుగా నరికి..10 చోట్ల పడేశారు..!
సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా.. చరిత్రలో తొలిసారి ఇలా..!
'అలాంటి ఒక్క వాహనం చూపించండి': గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్
శాకాహారుల్లో బీ12 లోపం అంటే..?
సినిమా

బిగ్ బాస్ సోనియా సీమంతం ఫోటోలు.. పసిడిలా మెరిసిపోతున్న జాన్వీ కపూర్!
సీమంతం ఫోటోలు షేర్ చేసిన బిగ్బాస్ సోనియా..రెస్టారెంట్లో చిల్ అవుతోన్న ఇనయా సుల్తానా..శారీలో మరింత బ్యూటీఫుల్గా సింగర్ చిన్మయి..అరుణాచల్ ప్రదేశ్ వేకేషన్లో ఎంజాయ్ చేస్తోన్న వితికా శేరు..శారీలో మెరిసిపోతున్న టాలీవుడ్ నటి రోహిణి.. బంగారంలా ధగధగ మెరిసిపోతున్న జాన్వీ కపూర్ View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) View this post on Instagram A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) View this post on Instagram A post shared by Meghana S Shankarappa ✨ (@meghanasshankarappa_) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Rohini (@actressrohini)

'జడలు ముట్టుకుంటే వాడు సర్రుమంటాడు'.. ది ప్యారడైజ్ యాక్షన్ సీక్వెన్స్ వీడియో!
నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్'. దసరాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే నాని ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ పోస్టర్లో ఇంతకు ముందెన్నడు కనిపించని విధంగా రెండు జడలతో కనిపించారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. డిఫరెంట్ లుక్లో నాని కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ వీడియోను పంచుకున్నారు మేకర్స్. ఈ సీక్వెన్స్ను జైల్లో తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ఫైట్ సీక్వెన్స్లో నాని డిప్స్ కొడుతూ కనిపించారు. 'వాడి జడల్ని ముట్టుకుంటే వాడు సర్రుమంటాడు' అనే డైలాగ్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ది స్పార్క్ ఆఫ్ ప్యారడైత్ పేరుతో ఈ సీక్వెన్స్ రాప్ వీడియోను రిలీజ్ చేశారు.అయితే ఈ చిత్రంలో నాని సరసన డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్గా కనిపించనుందని టాక్. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయెల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎనిమిది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.

ఆ విషయంలో గెలుపు నాగార్జునదే.. టాలీవుడ్ చరిత్రలో తొలిసారి!
అక్కినేని నాగార్జున(Nagarjuna Akkineni ) అకస్మాత్తుగా అన్ని సోషల్ మీడియా వేదికలపైనా వైరల్గా మారారు. దీనికి కారణం ఆయన తాజాగా నటించిన కూలీ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్ లాంచ్ అయి సూపర్ డూపర్ హిట్ అంచనాలను అందుకుంది. మరీ ముఖ్యంగా ఈ టీజర్లో నాగార్జున లుక్ బాగా క్లిక్ అయింది. నాగార్జున తన సినీ జీవితంలో తొలిసారిగా విలన్ గా నటిస్తుండడం దక్షిణాది ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అందుకు తగ్గట్టే నాగార్జున రోల్ అత్యంత స్టైలిష్గా తీర్చిదిద్దినట్టు తెలుస్తుండడం కూడా నాగ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేసింది. నిజానికి ఈ సినిమా లో విలన్ పాత్ర ను ఎంచుకోవడం పట్ల మొదట్లో నాగ్ ఫ్యాన్స్ కొంత ఇబ్బంది పడ్డారనేది నిర్వివాదం. అయితే తాజా అప్ డేట్స్తో వారిలో కూడా ఫుల్ జోష్ కనిపిస్తోంది.ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున తన వయసులో సగం తగ్గిపోయినట్టు కనపడ్డారు. అంతేకాకుండా లోకేష్ కనగరాజ్ తన పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని నాగ్ స్వయంగా చెప్పడం, తాను నాగార్జున అభిమానినని లోకేష్ అనడం... కూడా అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ప్రీ రిలీజ్లో నాగ్ లుక్, ఆయన మాటలు ఆయన గురించి తలైవా రజనీ కాంత్ పొగడ్తలు... సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా టీజర్లో నాగార్జున తన హెయిర్ని కుడి చేత్తో వెనక్కి తోస్తున్న బిట్ను ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఏతావాతా కూలీ సినిమా విడుదలకు ముందే ఒక విషయం మాత్రం రూఢీ అయిపోతోంది. ఈ సినిమాలో నాగార్జున పాత్ర అనూహ్యంగా ఉండబోతోందని. రజనీకాంత్ లాంటి వీర మాస్ హీరోకి సమ ఉజ్జీగా ఆయన తెరపై విలన్ రోల్లో దుమ్మురేపనున్నారని.ఈ నేపధ్యంలో మరోసారి సీనియర్ హీరోల పాత్రల ఎంపిక ప్రస్తావనకు వస్తోంది. ప్రస్తుతం నాగార్జునతో పాటు ఆయన సమకాలీకులు ఒకనాటి అగ్ర హీరోలు ముగ్గురు ఇంకా ఫుల్ యాక్టివ్గా ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరెవరూ సాహసించని రీతిలో నాగార్జున తన పాత్రల ఎంపికను అమాంతం మార్చుకుని ఈ విషయంలో అందర్నీ దాటేశారు. సీనియర్ హీరోల్లో నాగార్జున గ్లామర్తో పోటీపడే వారు ఎవరూ లేరనేది నిజం. అయినప్పటికీ వయసుకు తగ్గట్టుగా మార్పు చేర్పులు చేసుకుంటున్నారు. కుబేర సినిమాలో డీ గ్లామర్ రోల్ పోషించి, కూలీ లో ఏకంగా విలన్ పాత్రకు కూడా సై అనడం ద్వారా ఒక నటుడికి సినిమా కలెక్షన్లు, ఇమేజ్లు మాత్రమే కాదు వైవిధ్య భరిత పాత్రల్లో నటించానన్న తృప్తి కూడా చాలా అవసరమని చెప్పకనే చెప్పారు. నిన్నే పెళ్లాడుతా తో గ్రీకు వీరుడి ఇమేజ్ తెచ్చుకుని వెంటనే అన్నమయ్య లాంటి పాత్ర చేసిన నాటి దమ్మూ ధైర్యం, తెగువనే ఇప్పటికీ చూపిస్తున్నారు నాగార్జున. అందుకే.. టాలీవుడ్ చరిత్ర లో తొలిసారిగా... సినిమా విడుదల కాకముందే జనం మనసులు గెలిచిన విలన్ అనిపించుకుంటున్నారు.

30 కాదు... 50 శాతం పెంచుదాం.. ఆ బాధ్యత ఎవరిది?: నిర్మాత ఎస్కేఎన్
టాలీవుడ్లో నెలకొన్న సినీ కార్మికుల వేతనాల సమస్యపై చిన్న సినిమాల నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్ పట్ల తమ అభిప్రాయాలను వెల్లడించారు. నిర్మాతలకు సైతం పేమేంట్స్ సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన ఈ సమావేశంలో నిర్మాతలు ఎస్కేఎన్, రాజేశ్ దండా, మధుర శ్రీధర్, చైతన్య రెడ్డి, శరత్ చంద్ర, ధీరజ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ..' అందరూ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. మేము నిర్మాతల బాధ్యతల గురించి మాట్లాడతాం. నిర్మాతల సమస్యల గురించి చెప్పటం లేదు. నిర్మాతలకు ఎవరితో ఎప్పుడు ఎలా పని చేయాలనే ఆప్షన్ ఉండాలి. వేతనాలు యాభై శాతం పెంచుదాం.. కానీ మా సినిమాల పెట్టుబడికి తగిన బిజినెస్ ఎవరు చేస్తారు. థియేటర్లకు ప్రేక్షకులను ఎవరు రప్పిస్తారు? మా సినిమా బడ్జెట్లకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? చిన్న సినిమాలకు సరైన బిజినెస్ అవటం లేదు.. అయినా రెండు వేల లోపు వేతనాలు తీసుకునే కార్మికులకు పెంచుతామన్నాం. టికెట్ రేట్ల పెంపు అనేది కేవలం పెద్ద సినిమాలకే.. అవీ ఏడాదికి పది మాత్రమే వస్తాయి. మిగిలిన 200 చిన్న సినిమాలకు టికెట్ రేట్లు వర్తించవు.. ఇండస్ట్రీ బాగుంటేనే అందరు బాగుంటారు. కానీ ఇండస్ట్రీలో నలిగిపోతున్న నిర్మాత పక్కన ఎవరు నిలబడరు. హక్కుల గురించి మాట్లాడేవారు.. బాధ్యతల గురించి కూడా చర్చించాలి' అని అన్నారు.నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ..' నిర్మాతలకు కూడా రావాల్సిన పేమేంట్స్ ఉంటాయి.. కానీ కార్మికుల వేతనాలు ఏరోజు వేతనాలు ఆ రోజే ఇవ్వాలని , 30 శాతం పెంచాలంటున్నారు. ఓటీటీలు సైతం డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాయి. నా గత సినిమాకు 250 వర్కర్స్ రావాల్సినా అంత మంది రాలేదు.. అప్పుడు ఫెడరేషన్ రెస్పాండ్ అవ్వలేదు..' అని అన్నారు.నిర్మాత చైతన్య రెడ్డి మాట్లాడుతూ..'మాకు నచ్చిన వారిని ఎందుకు మేము పెట్టుకోకూడదు.. సినీ ఎంప్లాయిస్కు నిర్మాతలు పని కల్పిస్తున్నాం. ఇప్పుడున్న పరిస్దితుల్లో వేతనపెంపు భారమే. ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యాపారం సరిగ్గా నడవటం లేదు. పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకోవాల్సిన అవసరం ఉంది. ఏ నిర్మాతకు సినిమాల వల్ల డబ్బులు సంపాదించటం లేదు. ఎవరు హ్యాపీగా లాభాల్లో లేరు.. కేవలం సినిమా మీద ప్యాషన్తోనే పని చేస్తున్నాం. బాహుబలి , పుష్ప , హనుమాను లాంటి గొప్ప సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్నాయి. కానీ నిర్మాతల పరిస్థితి కూడా కార్మికులకు తెలుసు. మా పరిస్థితిని అందరూ అర్దం చేసుకుంటారని ఆశిస్తున్నాం.' అని అన్నారు.
క్రీడలు

‘సెలక్టర్లు అతడిని తప్పించలేదు.. తనే తప్పుకొన్నాడు’
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) టెస్టు మ్యాచ్ ఆడి రెండేళ్లు దాటిపోయింది. చివరగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (WTC)-2023 ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఈ బెంగాల్ పేసర్ బరిలోకి దిగాడు. నాటి ఈ మెగా పోరులో షమీ ఓవరాల్గా నాలుగు వికెట్లు తీయగలిగాడు.అనంతరం స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్కప్-2023లో అద్భుత ప్రదర్శన కనబరిచిన షమీ.. ఈ ఐసీసీ ఈవెంట్ ముగిసిన తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.వరుస సిరీస్లకు దూరంఈ క్రమంలో సుదీర్ఘ విరామం అనంతరం పరిమిత ఓవర్ల క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్ పేసర్.. ఆఖరిగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)ఫైనల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, టెస్టుల్లో మాత్రం వరుస సిరీస్లకు అతడు దూరమయ్యాడు.స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్- అనంతరం ఆస్ట్రేలియా పర్యటన, ఇంగ్లండ్ టూర్లకు ఎంపిక చేసిన జట్లలో షమీకి చోటు దక్కలేదు. అయితే, ఆసీస్ టూర్కు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పినా సెలక్టర్లు పట్టించుకోలేదనే వార్తలు వచ్చాయి.ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు తాజాగా స్పందిస్తూ.. ‘‘ఫామ్లేమి కారణంగా అతడిని జట్టు నుంచి తప్పించలేదు. ఫిట్నెస్ సమస్యల కారణంగా తనకు తానే తప్పుకొన్నాడు. అందుకే ఇంగ్లండ్కు ప్రయాణం చేయలేకపోయాడు.సెలక్టర్లు తప్పించలేదు.. తనే తప్పుకొన్నాడుఆస్ట్రేలియా టూర్ మిస్సైన తర్వాత.. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయాలని సెలక్టర్లు భావించారు. అతడి అవసరం జట్టుకు ఉందని భావించారు. జట్టును ఖరారు చేసే సమయంలో షమీతో మాట్లాడారు కూడా!అయితే, తను మాత్రం ఆత్మవిశ్వాసంతో లేడు. ఫిట్నెస్ సమస్యలు లేవని కచ్చితంగా చెప్పలేకపోయాడు. షమీ ఫిట్నెస్ సాధిస్తే సంప్రదాయ ఫార్మాట్లోనూ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వగలడు. రంజీ మ్యాచ్లలో మూడు- నాలుగు ఓవర్లు బౌల్ చేసి అతడు విశ్రాంతి తీసుకున్నాడు. అయితే, ఐదు రోజుల మ్యాచ్కు అతడి శరీరం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నపుడే రీఎంట్రీపై స్పష్టత వస్తుంది.దులిప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున అతడి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి’’ అని పేర్కొన్నాయి. అదే విధంగా.. 34 ఏళ్ల షమీకి వయస్సు పెద్ద సమస్య కాదని.. ఇంకో ఏడు- ఎనిమిదేళ్ల పాటు క్రికెట్ ఆడగల సత్తా అతడిలో ఉందంటూ సదరు వర్గాలు ప్రశంసలు కురిపించాయి.చదవండి: క్రికెట్లో కలకాలం నిలిచిపోయే రికార్డులు.. ఎవ్వరూ బ్రేక్ చేయలేరు!

సర్ఫరాజ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచరీ..
సర్ఫరాజ్ ఖాన్.. భారత దేశవాళీ క్రికెట్లో అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాటర్లలో ఒకడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించి భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్.. తన తొలి మ్యాచ్లోనే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్పై అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.అయితే ఆ సిరీస్లో ఆఖరి రెండు మ్యాచ్ల్లో ముంబైకర్ విఫలమయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్కు ఎంపికైనప్పటికి ఒక్క మ్యాచ్లో కూడా అతడికి ఆడే అవకాశం లభించలేదు. అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు సర్ఫరాజ్ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అంతకంటే ముందు ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన సిరీస్లో భారత-ఎ జట్టు తరపున సత్తాచాటాడు. మళ్లీ ఇప్పుడు స్వదేశంలో వెస్టిండీస్తో జరగనున్న టెస్టు సిరీస్కు భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలని సర్ఫరాజ్ ఉవ్విళ్లూరుతున్నాడు.ఈ క్రమంలో ముంబైలో జరుగుతున్న కంగా క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ సూపర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. మిడ్డే రిపోర్ట్ ప్రకారం.. ఈ లీగ్లో పార్కోఫియర్ క్రికెటర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.తాజాగా ఇస్లాం జింఖానాతో జరిగిన డివిజన్ -ఎ మ్యాచ్లో సర్ఫరాజ్తన బ్యాట్ను ఝూళిపించాడు. ఈ భారత క్రికెటర్ 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 43 బంతుల్లో 61 పరుగులు చేశాడు. కాగా డాక్టర్ హెచ్.డి. కాంగ్రా క్రికెట్ లీగ్ ముంబైలో ప్రతీ ఏడాది ఆగస్టులో జరుగుతోంది. ఈ లీగ్లో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సైతం ఆడారు.చదవండి: 'అతడొక టాలెంటెడ్ ప్లేయర్.. చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్నాడు'

BCCI: వైభవ్ సూర్యవంశీపై స్పెషల్ ఫోకస్.. బెంగళూరులో శిక్షణ
భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) నెట్స్లో చెమటోడుస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టాడు. దేశీ క్రికెట్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ తరఫున అదరగొట్టి క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాడు.రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్.. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేవలం 35 బంతుల్లోనే శతక్కొట్టి.. అత్యంత పిన్న వయసులో టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. పద్నాలుగేళ్ల వయసులోనే ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఈ ఘనత సాధించాడు.ఇంగ్లండ్లో ఇరగదీసిన వైభవ్అనంతరం భారత్ అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్ పర్యటన (IND vs ENG)లో యూత్ వన్డేల్లోనూ వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపాడు. యాభై రెండు బంతుల్లో శతకం సాధించి యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడిగా అవతరించాడు. అయితే, యూత్ టెస్టుల్లో మాత్రం ఒక హాఫ్ సెంచరీ మినహా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.అయితే, సెప్టెంబరులో ఆస్ట్రేలియా టూర్కు వెళ్లనున్న భారత అండర్-19 జట్టుకు వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యాడు. వచ్చే నెల 21న ఆసీస్తో మ్యాచ్లు మొదలుకానుండగా.. ఆదివారం (ఆగష్టు 10) బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి ఈ హర్యానా కుర్రాడు చేరుకున్నాడు.సీనియర్లు రిటైర్.. వైభవ్పై ఫోకస్తన కోచ్ మనీశ్ ఓజాతో కలిసి వైభవ్ సూర్యవంశీ ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. ఈ విషయం గురించి మనీశ్ ఓజా మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ దీర్ఘదృష్టితో ముందుకు సాగుతోంది. సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరిగా రిటైర్ అయిపోతున్నారు.ఈ క్రమంలో ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు బోర్డు సిద్ధమైంది. ఇందులో భాగంగానే కుర్రాళ్లను అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది’’ అని పేర్కొన్నాడు.రెడ్బాల్ క్రికెట్లోనూ ఫామ్లోకి రావాలికాగా వారం రోజుల పాటు వైభవ్ సూర్యవంశీ ఒంటరిగానే ఎన్సీఏలో ప్రాక్టీస్ చేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం అతడు జట్టుతో చేరతాడు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్లో సూపర్ ఫామ్లో ఉన్న ఈ పద్నాలుగేళ్ల చిచ్చరపిడుగు రెడ్బాల్ క్రికెట్లోనూ ఫామ్లోకి వచ్చేందుకు కసరత్తులు చేస్తున్నాడు.‘‘మొదటి బంతి నుంచే అటాకింగ్ చేయడం వైభవ్ శైలి. టీ20, వన్డేలకు ఈ స్టైల్ చక్కగా సరిపోతుంది. ఐపీఎల్లో, అండర్-19 విజయ్ హజారే ట్రోఫీల్లో అతడి ప్రతిభను అందరూ గమనించే ఉంటారు. అయితే, వైట్బాల్ క్రికెట్తో పోలిస్తే.. సంప్రదాయ ఫార్మాట్లో మాత్రం అతడి ప్రదర్శన డ్రాప్ అయింది.రెడ్బాల్ క్రికెట్లోనూ వైభవ్ నిలకడగా రాణించేలా తీర్చిదిద్దడమే లక్ష్యం. అతడు 10 ఇన్నింగ్స్ ఆడితే కనీసం 7-8 ఇన్నింగ్స్లో ప్రభావం చూపగలగాలి. అదే మా గోల్’’ అని మనీశ్ ఓజా చెప్పుకొచ్చాడు. కాగా ఆసీస్తో భారత అండర్-19 జట్టు మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడనుంది.చదవండి: క్రికెట్లో కలకాలం నిలిచిపోయే రికార్డులు.. ఎవ్వరూ బ్రేక్ చేయలేరు!

శ్రేయస్ అయ్యర్ పాస్.. ఫిట్నెస్ టెస్టుకు హార్దిక్ పాండ్యా
ఆసియాకప్-2025 ముందు భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫిట్నెస్ను పరీక్షించుకోనున్నాడు. తాజాగా పాండ్యా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో చేరాడు. ఈ మెగా టోర్నీ ముంగిట చాలా మంది భారత ఆటగాళ్లు సీవోఎకు క్యూ కట్టారు. టీమిండియా వైట్బాల్ సెటాప్లో భాగమైన పాండ్యా.. ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. గత నెల రోజుల నుంచి తన శిక్షణ ప్రారంభించాడు. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. పాండ్యా ఆగస్టు 11, 12 తేదీల్లో తన ఫిట్నెస్ టెస్టు చేసుకోనున్నాడు. ఈ బరోడా ఆల్రౌండర్ ఆదివారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎన్సీఎకి ఒక చిన్న ట్రిప్ అనే క్యాప్షన్తో స్టోరీని షేర్ చేశాడు.అయ్యర్ పాస్..మరోవైపు ఎన్సీఎలో ఉన్న భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన ఫిట్నెస్ పరీక్షను జూలై 27-29 పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అతడు ఆసియాకప్-2025తో తిరిగి టీ20 జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మిడిల్ ఆర్డర్లో అనుభవం ఉన్న బ్యాటర్ జట్టుకు అవసరమని సెలకర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్-2025లో అయ్యర్ అద్బుతంగా రాణించిడంతో అతడికి తిరిగి పిలుపునిచ్చేందుకు సెలక్టర్లు సిద్దమైనట్లు వినికిడి. ఇక టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోవారంలో తన పూర్తి ఫిట్నెస్ను పొందనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఇక ఈ ఖండాంతర టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా హాంకాంగ్తో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది.చదవండి: 'అతడొక టాలెంటెడ్ ప్లేయర్.. చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్నాడు
బిజినెస్

ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50వేలు: స్పందించిన ఆర్బీఐ గవర్నర్
సేవింగ్స్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50వేలు ఉండాలని, ఐసీఐసీఐ బ్యాంక్ సంచలన ప్రకటన చేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. బ్యాంకుల మినిమమ్ బ్యాలెన్స్ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ 'సంజయ్ మల్హోత్రా' (Sanjay Malhotra) స్పందించారు.ఒక ఖాతాదారుడు తన ఖాతాలో ఎంత మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాలనేది పూర్తిగా ఆ బ్యాంకుల పరిధిలోకే వస్తుంది. కొన్ని బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ను రూ. 50వేలు, మరికొన్ని రూ. 10వేలు, ఇంకొన్ని రూ. 2వేలుగా నిర్ణయించుకున్నాయి. కొన్ని బ్యాంకులైతే మినిమమ్ బ్యాలెన్స్ విషయంలో ఎలాంటి నియమాలను సూచించదు. ఇదంతా సదరు బ్యాంక్ తీసుకునే నిర్ణయమే అని, ఈ అంశం ఆర్బీఐ పరిధిలోకి రాదని సంజయ్ మల్హోత్రా గుజరాత్లో జరిగిన ఆర్థిక చేరిక సమావేశంలో స్పష్టం చేశారు.ఐసీఐసీఐ బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్మెట్రో, పట్టణ శాఖలలోని వినియోగదారులు తమ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50,000 ఉండేలా చూడాలి.సెమీ అర్బన్ ప్రాంతాలలో వినియోగదారులు తమ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 25,000 ఉండేలా చూడాలిగ్రామీణ ఖాతాదారులు తమ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 10,000 ఉంచాలి.ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయని పక్షంలో.. మినిమమ్ బ్యాలెన్సుకు ఎంత తక్కువ డబ్బు ఖాతాలో ఉంటే.. దానిపై 6 శాతం లేదా రూ. 500 ఏది తక్కువైతే ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. అయితే ఇది ఖాతాదారులపై ప్రభావం చూపిస్తుందని, ఇదే పద్దతిని ఇతర బ్యాంకులు కూడా అనుసరిస్తే పరిస్థితి ఏంటని.. పలువురు విమర్శిస్తున్నారు.ఇదీ చదవండి: నీతా అంబానీ రూ.100 కోట్ల కారు: దీని స్పెషాలిటీ ఏంటంటే?

స్టాక్ మార్కెట్ క్రాష్: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఇప్పటికే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ స్థితిని గురించి హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా స్టాక్ మార్కెట్ క్రాష్ సూచికలు స్టాక్లలో భారీ పతనాన్ని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను చూసిస్తున్నాయి. స్టాక్లలో భారీ పతనం గురించి హెచ్చరిస్తున్నాయి. అయితే బంగారం, వెండి, బిట్కాయిన్ యజమానులకు శుభవార్త'' అని రాబర్ట్ కియోసాకి ట్వీట్ చేశారు.అమెరికా అధ్యక్షుడి ప్రతీకార సుంకాలు పెట్టుబడిదారుల్లో కొంత భయాన్ని రేకెత్తించాయి. ఈ కారణంగానే స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ సమయంలో స్థిరమైన రాబడి కోరుకునేవారు మాత్రం బంగారం, వెండి వంటివాటిలో మాత్రమే కాకుండా బిట్కాయిన్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది మంచి రాబడని తీసుకొస్తుందని. రాబోయే ఆర్ధిక మాంద్యం సమయంలో ఇవే కాపాడతాయని కియోసాకి పేర్కొన్నారు.Stock market crash indicators warning of massive crash in stocks.Good news for gold, silver, and Bitcoin owners.Bad news for Baby Boomers with 401 k.Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) August 11, 2025 డొనాల్డ్ ట్రంప్ గ్రేట్!అమెరికన్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన 401(కె) రిటైర్మెంట్ ప్లాన్ల బ్యాలెన్స్లలో ఉన్న నిధులను డిజిటల్ ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. దీనిని రాబర్ట్ కియోసాకి ప్రశంసించారు. బిట్కాయిన్ కొనుగోలుకు ప్రజలు తమ రిటైర్మెంట్ పొదుపును ఖర్చు చేయడానికి ట్రంప్ అనుమతించడం గొప్ప వార్త. ఆయన గొప్ప అధ్యక్షుడు, గొప్ప నాయకుడు. మీరు బిట్కాయిన్ సేవ్ చేస్తున్నారా?’ అని ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే?

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 746.29 పాయింట్లు లేదా 0.93 శాతం లాభంతో 80,604.08 వద్ద, నిఫ్టీ 198.85 పాయింట్లు లేదా 0.82 శాతం లాభంతో 24,562.15 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో సీఎల్ ఎడ్యుకేట్, యాత్ర ఆన్లైన్, మైక్రో ఎలక్ట్రానిక్స్, ఎన్డీఎల్ వెంచర్స్, ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ వంటి కంపెనీలు చేరాగా.. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఫేజ్ త్రీ, ఆరోన్ ఇండస్ట్రీస్, గార్వేర్ హై-టెక్ ఫిల్మ్స్, బెస్ట్ ఆగ్రోలైఫ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

హాస్టల్ ఫీజు చెల్లిస్తున్నారా?
యూపీఐ చెల్లింపులు ఆన్లైన్ లావాదేవీలు చేసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటే.. డబ్బు స్వీకరించేవారికి మాత్రం ఇబ్బందులు తెచ్చి పెడుతుందనే వాదనలున్నాయి. ఇటీవల బెంగళూరులోని వీధివ్యాపారులకు వారి యూపీఐ లావాదేవీల ఆధారంగా జీఎస్టీ నోటీసులు అందడంతో చాలామంది జాగ్రత్త పడుతున్నారు. బెంగళూరులోని ఓ పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహం రెంట్ నగదు రూపంలోనే చెల్లించాలని, ఆన్లైన్ లావాదేవీలపై 12% జీఎస్టీ ఉంటుందని పోస్టర్లు వెలిశాయి. ఇదికాస్తా వైరల్గా మారింది.రెడ్డిట్లో వెలసిన ఈ పోస్ట్లోని వివరాల ప్రకారం.. ‘అద్దె నగదు రూపంలోనే చెల్లించాలి. ఆన్లైన్ పేమెంట్పై 12 శాతం జీఎస్టీ ఉంది’ అని పీజీ ముందు పోస్టర్ వేసినట్లు ఫోటో తీసి పోస్ట్లో అప్లోడ్ చేశారు. ఎస్కేడీజీక్ అనే హ్యాండిల్ నుంచి షేర్ చేసిన ఈ పోస్ట్కు 31,000 వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.ఇదీ చదవండి: పెట్రోల్ పంపుల ఏర్పాటు మరింత సులువు?చాలా మంది నెటిజన్లు ఈ పద్ధతి చట్టవిరుద్ధమని, దర్యాప్తు చేసి కఠినమైన శిక్షలను అమలు చేయాలని అధికారులను కోరారు. రెసిడెన్షియల్ రెంట్ పై జీఎస్టీ లేదని, ప్రాపర్టీని వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే తప్ప జీఎస్టీ విధించరని కొందరు తెలిపారు. ‘మీరు జీఎస్టీ బిల్లు అడగండి’ అని ఒకరు కామెంట్ చేశారు. రెసిడెన్షియల్ పీజీలకు సాధారణంగా జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుందని కొందరు చెప్పారు. రిజిస్ట్రేషన్, సరైన ఇన్వాయిసింగ్ లేకుండా ఏకపక్షంగా జీఎస్టీని విధించలేరని కొన్ని కామెంట్లు వచ్చాయి.
ఫ్యామిలీ

200 కేజీల ఆవును భుజాలపై మోసుకెళ్లారు.. నెటిజన్లు ఫిదా
రోజులు మారాయి.. మనిషన్నవాడు మాయమైపోతున్నాడు.. కన్న తల్లిదండ్రులనే ఆశ్రమాల్లో వదిలేస్తున్న వైనం.. ఆస్తికోసం.. డబ్బుకోసం కట్టుకున్నవాళ్లనే చంపుతున్న తీరు.. ఇక పెంచుకున్న మూగజీవాలకు కష్టం వస్తే ఊరవతల వదిలేస్తున్న తీరు.. కోట్ల ఆస్తులు తీసుకుని కన్నవాళ్లను రోడ్లమీదకు నెట్టేస్తున్న సంఘటనలు నిత్యం కళ్ళముందు తారాడుతూనే ఉన్నాయి. ఇలాంటి కఠినమైన రోజుల్లో హృదయాలను ద్రవింపజేసే ఒక గొప్ప మానవీయ సంఘటన సోషల్ మీడియాను కదిలిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ అంటేనే కొండలు గుట్టలు.. వాగులు వంకలతో ప్రకృతి రమణీయతను నింపుకుని సౌభాగ్యలక్ష్మి లా కనువిందు చేస్తుంది.. ఎప్పుడు మంచుకురుస్తుందో.. ఎప్పుడు వరదలు ముంచెత్తుతాయో తెలియదు. ఆ కొండలు గుట్టలు మనం పర్యాటకులమాదిరి చూడడానికి చాలా బావుంటుంది కానీ అక్కడే నివసించేవాళ్లకు అదొక దుర్భేద్యమైన ప్రదేశం. ఆ కొండల మాటున.. వాగుల చాటున పల్లెలు.. అందులోనే జీవనం. రోడ్డు సౌకర్యాలు సైతం అంతంతమాత్రం.. ఎవరికన్నా ఏదైనా అనారోగ్యం వస్తే ఇక దేవుణ్ణి ప్రార్థించడమే... అక్కడికి డాక్టర్ వెళ్లడం కూడా అసాధ్యం.. అలాంటిది వాళ్ళింట్లోని మూగ జీవాలను కానీ ఏదైనా కష్టం వస్తే అలా ఆకాశంకేసి చూడడం తప్ప దాన్ని కాపాడుకోవడం కష్టమే.. దాన్ని ఆస్పత్రికి తీసుకుపోలేం.. డాక్టర్లు దొరకరు.. ఇలాంటి గడ్డు పరిస్థితుల మధ్య ఓ ఇద్దరు అన్నదమ్ములు.. తమ ఇంట్లోని గోవును కాపాడుకునేందుకు పడిన కష్టం ఇప్పుడు అందర్నీ కదిలిస్తోంది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు తమ జబ్బుపడిన 200 కిలోల ఆవును భుజాలపై మోస్తూ 3 కిలోమీటర్లు నిటారైన, ప్రమాదకరమైన పర్వత మార్గం గుండా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిర్మౌర్ జిల్లాలోని క్యాటిరి గ్రామానికి చెందిన ఆ అన్నదమ్ములు తమ ఆవును ఎలాగైనా బతికించుకోవడానికి తమ భుజాలను కావిడిగా మార్చి అవును ఆస్పత్రికి మోసుకెళ్లారు. ఈ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇదీ చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు “ఇది నిజమైన మానవత్వం” అంటూ ‘streetdogsofbombay’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ఈ వీడియోను షేర్ చేయగా దానికి వందలాదిగా ప్రశంసలు.. అభినందనలు దక్కాయి. View this post on Instagram A post shared by StreetdogsofBombay (@streetdogsofbombay) అడుగుతీస్తే అడుగువేయలేని రాళ్ళ మార్గం.. బురద.. ఏమైనా తేడా వస్తే అలా లోయలోకి పడిపోయే ప్రమాదం.. అయినా వారు ఈ సవాళ్ళను లెక్కచేయకుండా గుట్టలు.. కొండలను దాటుకుంటూ అవును భుజాలు మార్చుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్ళరు. తనపట్ల వారు చూపిన ప్రేమకు గోమాత కళ్ళనిండా ఆర్తిని నింపుకుని వారిని చూస్తూ కృతజ్ఞత చాటుకున్నాది. -సిమ్మాదిరప్పన్న

'వైకింగ్స్ డైట్' అంటే..! ఆరోగ్యానికి మంచిదేనా?
చాలా రకాల డైట్లు గురించి విన్నాం. ఇదేంటి 'వైకింగ్స్ డైట్(Viking Diet)'. పేరే ఇలా ఉంది. ఇక డైట్ ఎలా ఉంటుందో అనిపిస్తోంది కదూ..!. అదేం లేదండి అసలు అలా పిలవడానికి పెద్ద కథే ఉంది. ఆలస్యం చేయకుండా అదేంటో చకచక చదివేయండి మరి..'వైకింగ్స్' అంటే ఎనిమిదో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం వరకు స్కాండినేవియా నుంచి వచ్చిన సముద్రయాన ప్రజల(Scandinavian people)ను వైకింగ్స్ అని పిలుస్తారు. వీళ్లు దాడిదారులు లేదా సముద్రదొంగలు అని కూడా అంటారు. వలసదారులుగా ఐరోపా వచ్చి అక్కడ స్థానిక వ్యాపారాలపై దాడుల చేసి స్థిరపడ్డ ప్రజలను ఇలా వైకింగ్స్ అని పిలుస్తారు. వీళ్లంతా డెన్మార్క్, నార్వే, స్వీడన్ నుంచి వలస వచ్చిన వారు. అలా వలస వచ్చేటప్పుడూ స్థానికంగా దొరికే వాటినే తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. అలా పుట్టుకొచ్చిందే ఈ 'వైకింగ్స్ డైట్'. అయితే ఇది ఆరోగ్యకరమైనది, పైగా అన్ని విధాల మంచిదని నిపుణులు చెబుతుండటం విశేషం. అలాగే ఈ డైట్లో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నట్లు తెలిపారు. మరి ఆ డైట్లో ప్రజలు ఏం తినేవారో చూద్దామా..!.'వైకింగ్స్ డైట్' అంటే?దీన్ని 'నార్డక్ డైట్' అని కూడా పిలుస్తారు. ఇది బౌగోళిక స్థానం, సామాజిక స్థితి, సీజన్ ఆధారంగా తీసుకునే ఆహారపదార్థాలను కలిగి ఉంటుంది. తీర ప్రాంతాల్లో నివశించేవారికి చేపలు ప్రదాన ఆహారం. కాబట్టి వాళ్లంతా వైకింగ్స్ కాడ్, హెర్రింగ్, ఈల్ వంటి చేపలను తింటుంటారు. వీటి తోపాటు మస్సెల్స్, ఓస్టర్స్ వంటి సముద్ర ఆహారాన్ని తీసుకునేవారు. అలాగే బెర్రీలు, ఆపిల్స్, ఫ్లమ్స్ వంటి పండ్లుఉ, కాబ్యేజీ, క్యారెట్లు, ఉల్లిపాయలు వంటి కూరగాయలను కూడా తమ డైట్లో భాగం చేసుకునేవారు. ఆవులు, మేక, గొర్రెల నుంచి పాలు, జున్ను వంటివి తీసుకునేవారు. పైగా ఆహారాన్ని నిల్వ చేసుకునేందుకు ఉప్పు వేయడం లేదా కిణ్వన ప్రక్రియ వంటి పద్ధతులను వినియోగించేవారు. మంచిదేనా..?ఈ డైట్లో అందుబాటులో ఉన్న ఆహారానికే పరిమితం అవ్వుతూ..ఆరోగ్యకరమైన పోషక పదార్థాలనే తీసుకోవడంతో ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలకు పేరుగాంచిందని చెబుతున్నారు నిపుణులు. ఇందులో పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, గింజలు, తృణధాన్యాలు, ఫైబర్ అధికంగా ఉండే కార్బోహైడ్రేట్లు, పేగు ఆరోగ్యానికి మద్దుతిస్తాయి. పైగా మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్లతో సహా వివిధ జీవనశైలి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. దుష్ప్రభావాలు..అయితే ఈ డైట్లో కొన్ని పోషకపరమైన నష్టాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. మెడిటేరియన్ డైట్తో గణనీయమైన మొత్తంలో మాంసం, జంతువుల కొవ్వు ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అధిక కొవ్వు పదార్థం ఆ ప్రజలకు శీతకాలన్ని తట్టుకునేందుకు సహాయపడుతుంది గానీ ఆ సంతృప్త కొవ్వు హృదయ సంబంధ ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ డైట్ని అనుసరించేవాళ్లు ఆరోగ్యకరమైన అలవాట్లకు కట్టుబడి ఉండి, అధిక కొవ్వు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలని సూచించారు నిపుణులు.(చదవండి: మండే ఎఫెక్ట్ ఇంతలా ఉంటుందా..? ఏంటి ‘మండే బ్లూస్?)

రాముడు భూమిపై అవతరించినప్పుడు వైకుంఠంలో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా?
విష్ణువు రాముడిగా... కృష్ణుడిగా... ఇంకా అనేక రూపాలలో భూమిపై అవతరించాడని అంటారు కదా... మరి ఆ రూపాలలో ఆయన భూమిపై ఉన్నప్పుడు వైకుంఠంలో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా? ‘రామునిగా.. కృష్ణునిగా.. నారసింహుడిగా విష్ణువు భూమిపై అవతరించినప్పుడు ఆయా అవతారాలు పరిసమాప్తి అయ్యేంత వరకు వైకుంఠంలో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా?’ అనే విషయం తెలుసుకొనే ముందు ఒక ఉదాహరణ పరిశీలిద్దాం...ఒకేలా ఉండే పది ప్రమిదలలో ఒకేవిధమైన వత్తులు వేసి, నూనె పోసి ముందు ఒక ప్రమిదను వెలిగించి, ఆ ప్రమిదతో మిగిలిన ప్రమిదలు వెలిగించి ఆ ప్రమిదల వరుసలలో పెట్టి; వేరే ఎవరినైనా ఈ ప్రమిదల వరుసలోని ఏ ప్రమిదతో నేను దీపం వెలిగించానో చెప్పగలవా అంటే ఆ వ్యక్తే కాదు ఎవరూ చెప్పలేరు; కారణంం మిగిలిన ప్రమిదలను వెలిగించిన తొలి ప్రమిద వెలుగు తగ్గదు. మిగిలిన ప్రమిదల్లాగే ప్రకాశిస్తుంది... అలాగే భగవంతుడు ఎన్ని అవతారాలు ఒకేసారి ఎత్తినా; విడివిడిగా ఎత్తినా తన అస్తిత్వాన్ని కోల్పోకుండా తన అసలు రూపంతో దర్శనమిస్తూనే ఉంటాడు... విష్ణువు నుంచి ఉద్భవించిన ఈ అవతారాలు తమ అవతార పరిసమాప్తి చెందిన తరువాత తమ మూల అవతారమైన శ్రీమన్నారాయణుడిలో ఐక్యమొందుతాయి... ఒకసారి ఐక్యమొందినా కూడా భక్తుల కోరిక మేరకు మరల, మరల అవే రూపాలతో అవసరమైనప్పుడు దర్శనమిస్తూనే ఉంటాయి.ఈ విధంగా అమ్మవారు అంటే లక్ష్మిదేవి కూడా భూలోకంపై అవతరించారు; అవతరిస్తారు. అలాగే శివ పార్వతులు, మిగిలిన దేవతలు సందర్భాన్ని బట్టి భూలోకంపై అవతరిస్తూ ఉంటారు.– డి.వి.ఆర్.

మండే ఎఫెక్ట్ ఇంతలా ఉంటుందా..? ఏంటి ‘మండే బ్లూస్' ?
ఉదయాన్నే నిద్రలేవడం, ఉత్సాహంగా రొటీన్ వర్క్లోకి దూకేయడం... ప్రతిరోజూ ఏమోగానీ, సోమవారం మాత్రం అంత వీజీ కాదు. విద్యార్థుల నుంచి కార్పొరేట్ ఉద్యోగుల దాకా... సోమవారం ముంచుకొచ్చే బద్ధకం.. మండే అంటే ఒళ్లు మండేలా చేస్తోంది. ఇదే మండే బ్లూస్కి కారణమవుతోంది. ‘మండే బ్లూస్ అనే పదం సాధారణంగా సోమవారం రోజు పని లేదా చదువులను మొదలు పెట్టాల్సిన తప్పనిసరి అవసరం వల్ల కలిగే అలసట, నిరుత్సాహం వంటి భావాలకు అద్దం పడుతోంది. కొంతకాలంగా లెక్కలేనన్ని మీమ్స్, ట్వీట్లు కాఫీ మగ్ నినాదాలకు ‘మండే బ్లూస్‘అనేది ఒక పంచ్లైన్. ఆ పాపం వీకెండ్ దే... వారాంతంలో 2 రోజులపాటు సెలవులు అనే కార్పొరేట్ కల్చర్ విస్తృతంగా వ్యాపించడం ఈ మండే బ్లూస్కి ప్రధాన కారణమవుతోంది. వారంలో ఐదురోజుల పని ముగుస్తుండగానే శుక్రవారం సాయంత్రానికే వీకెండ్ ఉత్సాహం పుంజుకుంటుండగా, శనివారం, ఆదివారం సెలవులు పూర్తయ్యాక సోమవారం మళ్లీ రొటీన్ వర్క్ లేదా స్కూల్/కాలేజ్కు వెళ్లాల్సిన పరిస్థితి మండే బ్లూస్ని సృష్టిస్తోంది. సాధారణంగా సోమవారం ఆలస్యంగా లేచే అలవాటు చాలామందిలో ఉంటుంది. దీనికి కారణం వీకెండ్ రోజుల్లో ఆలస్యంగా నిద్రలేవడమే. పని మొదలు పెట్టే రోజు కాబట్టి సోమవారం పట్ల మానసిక విరక్తి, పని పట్ల ప్రతికూల భావన ఏర్పడుతోంది. ఒత్తిడి స్థాయిలు పెరుగుతున్నాయ్... వారంలో తొలి నిరుత్సాహకర ప్రారంభం అనేది కేవలం మన ఆలోచనలపై మాత్రమే ప్రభావం చూపడం లేదని, అది మన శారీరక ధర్మాలను కూడా ప్రభావితం చేస్తోందని వైస్ (వీఐసీఇ) రిపోర్ట్ పేరిట జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్లో ప్రచురించిన తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. దీని ప్రకారం.. ఒత్తిడిని అనుభవిస్తున్న వ్యక్తుల్లో కార్టిసాల్ స్థాయిలు ఇతర ఏ రోజు ఒత్తిడిని నివేదించిన వారి కంటే సోమవారాల్లో 23 శాతం వరకు ఎక్కువగా ఉన్నాయి. డాక్టర్ తరణి చందోలా నేతృత్వంలో 3,500 మందిపై నిర్వహించిన ఈ అధ్యయనం ప్రాథమిక ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ‘సోమవారం వ్యక్తుల’లో గణనీయంగా పెరిగినట్టు కనిపెట్టింది. మానసికమే కాదు, అంతకు మించి... కార్టిసాల్ దీర్ఘకాలిక ఒత్తిడికి గురి కావడానికి కీలకమైన బయోమార్కర్ అని పరిశోధకులు వెల్లడించారు. మెదడుకు ముప్పు లేదా ప్రమాదాన్ని గ్రహించినప్పుడు కలిగే ప్రతిస్పందన ఈ హార్మోన్. అంతేకాదు కార్టిసాల్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం, బలహీనమైన రోగనిరోధక శక్తి, రక్తపోటు, మధుమేహం వంటి వాటికి కూడా దారితీస్తున్నాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే సోమవారం భయం మానసిక స్థితిని దెబ్బతీయడం కంటే మరింత ఎక్కువ హాని కలిగిస్తుంది. అది వ్యక్తుల ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది. పరిష్కారం..సైకాలజిస్ట్ల కొన్ని సూచనలు.. ప్రణాళికాబద్ధంగా పనిని విభజించుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. వారాంతపు రోజుల్లో ఆహారపు అలవాట్లలో అతి మార్పు చేర్పులు చేయవద్దు. శుక్రవారం రోజే సోమవారం నాటి పనులను పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడం వర్క్ ప్రెషర్ను దూరం చేస్తుంది. ప్రతీ సోమవారం ఏదైనా కొత్త రకం వ్యాయామం, కొత్త రూట్లో వాకింగ్ వంటివి ప్లాన్ చేయడం ద్వారా కొత్త ఉత్సాహం వస్తుంది. మరోవైపు.. సోమవారాల్లో గుండె సంబంధిత సంఘటనలు పెరగడాన్ని వైద్యులు చాలాకాలంగా గమనిస్తున్నారు. దీన్ని ‘‘మండే ఎఫెక్ట్’’అని పిలుస్తారు. వారంలోని మొదటి రోజున గుండెపోటు, ఆకస్మిక గుండె సంబంధిత మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని గణాంకాల పరంగా గుర్తించారు. ఈ ధోరణికి తరచూ వారాంతపు విశ్రాంతి నుంచి ఆకస్మిక పని వైపు మళ్లిన ఆలోచనలే కారణమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వైద్యుల సలహాలను అనుసరించి ఈ సమస్య నుంచి వీలైనంత త్వరగా బయటపడటం అవసరం.
ఫొటోలు
అంతర్జాతీయం

అపోలో వ్యోమగామి జిమ్ లవెల్ కన్నుమూత
వాషింగ్టన్: అపోలో 13 మిషన్కు నాయకత్వం వహించిన అమెరికా వ్యోమగామి జిమ్ లవెల్ 97 ఏళ్ల వయస్సులో శుక్రవారం కన్నుమూ శారు. ‘జిమ్ వ్యక్తిత్వం, దృఢ సంకల్పం మన దేశం చంద్రుడిని చేరుకోవడానికి, విషాదాన్ని విజయంగా మార్చడానికి సహాయపడ్డాయి, అప్పటి ఘటన నుంచి మేం ఎంతో నేర్చుకు న్నాం. జిమ్ మరణానికి సంతాపం తెలియజే స్తున్నాం’అని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. నాసా కార్యకలాపాలు చేపట్టిన మొదటి దశాబ్ద కాలంలో అత్యధికంగా ప్రయాణించిన వ్యోమగాములలో ఒకరు లవెల్. జెమిని 7, జెమిని 12, అపోలో 8, అపోలో 13 మిషన్లలో నాలుగుసార్లు ప్రయాణించారు.1928లో క్లీవ్ల్యాండ్లో జన్మించారు లవెల్. 1952లో అమెరికా నేవల్ అకాడెమీలో డిగ్రీ సాధించారు. 1952లో టెస్ట్ పైలట్, 1962లో నాసాలో వ్యోమగామిగా ఎంపికయ్యారు. జెమిని 7, అపొలో 8 వంటి మిషన్లలో ఆయన భాగస్వామిగా ఉన్నప్పటికీ, 1970 నాటి అపొలో 13 మిషన్ మాత్రం లెజెండ్గా ఆయన్ను మార్చివేసింది. మూడో యాత్ర సందర్భంగా చంద్రుడిపైకి దిగాక ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది. దీంతో, అందులోని సిబ్బంది భూమికి సుమారు 2 లక్షల మైళ్ల దూరంలో చిక్కుబడిపోయారు. అయినప్పటికీ ధైర్యాన్ని కోల్పోక ప్రత్యామ్నా యాలను అనుసరించి, అపాయం నుంచి బయటపడ్డారు. ‘వాస్తవానికి ఆ మిషన్ విఫల మైంది. దాంతో సాధించింది కూడా ఏమీ లేదు. కానీ, దాని ద్వారా వచ్చిన ఫలితం మాత్రం అద్భుతం. అలాంటి విపత్తును సైతం ధైర్యంగా స్వీకరించి విజయవంతంగా మార్చ గల సత్తా ఉందని నిరూపించడమే మేం సాధించిన విజయం’అని లవెల్ రాయిటర్స్కు 2010లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తనతోపాటు సహచరులు జాక్ స్విగెర్ట్, ఫ్రెడ్ హయిజ్లు.. గడ్డకట్టించే చలి, ఆకలి, మరో వైపు కేవలం నాలుగు రోజులకు మాత్రమే సరిపడే ఆక్సిజన్ ఉన్నా ఎంతో ధైర్యతో వ్యవ హరించామన్నారు. ఆ సమయంలో స్విగెర్ట్.. ‘హౌస్టన్, మాకో సమస్య వచ్చి పడింది’అంటూ నాసాకు చాలా తేలికైన సందేశమిచ్చారు. దీనినే టామ్ హాంక్స్ 1995 నాటి అపొలో 13 సినిమాలో వాడుకున్నారు. ఆ సినిమాలో లవెల్ పాత్రను టామ్ హాంక్స్ పోషించడం విశేషం. అపొలో 13 మిషన్ పసిఫిక్ సముద్రంలో సురక్షితంగా ల్యాండైంది. అప్పటికే లవెల్ పేరు ప్రపంచమంతటా మారుమోగిపోయింది. ఎన్నో తీవ్ర ఒత్తిళ్ల మధ్య నిబ్బరంగా పనిచేసిన లవెల్ మారుపేరుగా నిలిచారు. 1973లో నాసా నుంచి రిటైరయ్యారు.

పుతిన్, ట్రంప్ భేటీ 15న
వాషింగ్టన్: ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ భేటీకి వేదిక, తేదీ ఖరారయ్యాయి. ఈ నెల 15వ తేదీన అలస్కాలో ఇరువురు నేతలు సమావేశం కాబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఈ విషయం స్వయంగా వెల్లడించారు. పుతిన్తో తన భేటీ గురించి శనివారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వచ్చే శుక్రవారం రష్యా అధ్యక్షుడిని కలుసుకోబోతున్నట్లు తెలిపారు. ఇద్దరు నేతలు ముఖాముఖి సమావేశం అవుతుండడం నాలుగేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించే దిశగా పుతిన్ను ట్రంప్ ఒప్పిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై ట్రంప్ టారిఫ్ల మోత మోగించారు. భారత ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. అంతేకాకుండా రష్యా ప్రత్యర్థి దేశమైన ఉక్రెయిన్పై సైనిక సాయం భారీగా పెంచబోతున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో ట్రంప్, పుతిన్ భేటీ విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అతిపెద్ద యుద్ధం ఉక్రెయిన్–రష్యా సమరమే. దీనికి సాధ్యమైనంత త్వరగా తెరదించాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. పుతిన్ను కలుసుకోబోతున్నట్లు ఇటీవల హఠాత్తుగా ప్రకటించి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఒకప్పటి రష్యా భూభాగమే అలస్కా పుతిన్, ట్రంప్ సమావేశానికి అలస్కా వేదిక అవుతుండడం మరో విశేష పరిణామం. అలస్కా 1867 దాకా రష్యా సామ్రాజ్యంలో అంతర్భాగమే. అప్పటి జార్ చక్రవర్తి అలెగ్జాండర్–2 ఈ ప్రాంతాన్ని అమెరికాకు విక్రయించారు. బ్రిటిష్ సైన్యం దీన్ని ఆక్రమిస్తుందన్న భయంతో అప్పటికప్పుడు అమ్మకానికి పెట్టారు. ఎకరాకు ఒక డాలర్ చొప్పున అమ్మేసినట్లు చెబుతుంటారు. 19వ శతాబ్దంలో ప్రపంచంలో ఇది అతిపెద్ద రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అలస్కా భూభాగం విలువ 10 బిలియన్ డాలర్లు(రూ.8.75 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. బంగారం సహా సహజ వనరులకు లోటులేని ప్రాంతం అలస్కా. అమెరికా విస్తీర్ణంలో ఐదింట ఒక వంతు అలాస్కా ఉంటుంది. అలస్కాతో రష్యాకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆగస్టు 15న సమావేశం ఎందుకు? ఇక ఇద్దరు కీలక నాయకుల భేటీ కోసం నిర్ణయించిన తేదీకి కూడా చెప్పుకోదగ్గ ప్రాధాన్యం ఉంది. ఆగస్టు 15వ తేదీ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తేదీ అని మనకు తెలుసు. కానీ, ఎక్కువ మందికి తెలియని సంగతి ఏమిటంటే.. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తేదీ ఆగస్టు 15. జపాన్ చక్రవర్తి హిరోహితో లొంగుబాటు ప్రకటనతో ఈ యుద్ధం ముగిసింది. ఈ ఏడాది ఆగస్టు 15న రెండో ప్రపంచ యుద్ధానికి 80 ఏళ్లు పూర్తికాబోతున్నాయి. 1945 ఆగస్టు 15న రెండో ప్రపంచ యుద్ధానికి తెరపడగా సరిగ్గా రెండేళ్లకు ఇండియాకు స్వాతంత్య్రం లభించింది. జపాన్లో మిత్రదేశాల సైన్యాన్ని లార్డ్ లూయిస్ మౌంట్బాటెన్ ముందుండి నడిపించారు. విజయం చేకూర్చి పెట్టారు. అదే మౌంట్బాటెన్ ఇండియా గవర్నర్ జనరల్ హోదాలో 1947లో స్వాతంత్య్ర దినాన్ని ఆగస్టు 15గా నిర్ణయించారు. అది ఆయనకు ఇష్టమైన తేదీ కావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆగస్టు 15వ తేదీన పుతిన్, ట్రంప్ కలుసుకోబోతున్నారు.

‘మా ట్రంప్ అతి పెద్ద తప్పిదం చేశారు’
వాషింగ్టన్: భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాల నిర్ణయం ఎంతమాత్రం సరైన నిర్ణయం కాదని అంటున్నారు ఆ దేశ జాతీయ సెక్యూరిటీ మాజీ సలహాదారు జాన్ బాటమ్. భారత్ వస్తువులపై ట్రంప్ విధించిన సుంకాల తీరును తీవ్రంగా తప్పబట్టారాయన. కచ్చితంగా ఇది ట్రంప్ చేసిన అతి పెద్ద తప్పిదంగా అభివర్ణించారు. ఎన్నో దశాబ్దాల నంచి భారత్తో ఉన్న మిత్రత్వం ట్రంప్ సుంకాల దెబ్బతో అది కాస్తా బెడిసి కొట్టే ప్రమాదం అధికంగా ఉందన్నారు. చైనా కంటే అత్యధిక సుంకాలు విధించడం భారత్ పట్ల వివక్ష ధోరణికి నిదర్శమన్నారు. చైనాకు సుంకాలు పెంచి ఉపశమన కల్పించిన ట్రంప్.. భారత్పై 50 శాతం సుంకాలంటూ బెదిరింపు చర్యలకు దిగడం అమెరికా-భారత్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. చైనాపై ఉదాసీనత కనబరిచిన ట్రంప్.. భారత్ను రష్యా, చైనాలను దూరం చేయడానికి దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ప్రమాదంలో పడేస్తాయన్నారు. భారత్ను రష్యా, చైనాల నుంచి వేరు చేయడానికి చేసిన ట్రంప్ వ్యూహం కచ్చితంగా అతి పెద్ద తప్పిదమేనని నొక్కి మరీ చెప్పారు. సీఎన్ఎన్తో మాట్లాడిన ఆయన ట్రంప్ విధించే సుంకాలపై గురించి, ప్రత్యేకంగా భారత్పై విధించిన సుంకాలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మరొకవైపు అమెరికా విదేశాంగ విధాన నిపుణుడు, ఆ దేశ మాజీ వాణిజ్య అధికారి క్రిస్టోఫర్ పాడిల్లా కూడా భారత్పై ట్రంప్ విధించిన సుంకాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సుంకాలు ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలకు దీర్ఖకాలిక నష్టం కల్గించే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. ఇక్కడ అమెరికా నమ్మకమైన భాగస్వామి కాదు అనేది తలెత్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

వీడియో వైరల్: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో కాల్పుల కలకలం
న్యూయార్క్లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్లో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. కాల్పులతో ఒక్కసారిగా అలజడి రేగడంతో జనం భయంతో పరుగులు తీశారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 17 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు గాయపడగా.. వారిలో ఒక యువతి ఉన్నారు. వారిని బెల్లెవ్యూ ఆసుపత్రికి తరలించారు.నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.అతడి వద్ద నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఘటనలో ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నగరంలో గన్ క్రైమ్ తగ్గుతోందన్న పోలీస్ కమిషనర్ ప్రకటించిన కొద్దిరోజుల్లోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.ఈ ఘటనలు అమెరికాలో గన్ కల్చర్కు అమాయకులు బలైపోతున్నారు. గత నెల జులై 29న న్యూయార్క్లోని మాన్హట్టన్ ఆఫీస్ భవనంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ఎన్వైపీడీ అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వెగాస్కు చెందిన 27 ఏళ్ల షేన్ తమురాగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కూడా గాయాలతో మృతిచెందాడని పోలీసులు తెలిపారు.@bufocalvinA teenager opens fire in the middle of Times Square (New York City) and injures three people... pic.twitter.com/w7zD4DX3vD— patomareao (@patomareao81945) August 9, 2025మరో ఘటనలో మే 27న ఫిలడెల్ఫియాలోని ఫెయిర్మౌంట్ పార్క్ కాల్పులు కారణంగా ఇద్దరు మైనర్లు మృతి చెందారుజ ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. మెమోరియల్ డే సందర్భంగా జనసంచారం ఎక్కువగా ఉండగా.. రాత్రి 10:30 సమయంలో కాల్పులు జరిగాయి.
జాతీయం

భార్య మృతదేహాన్ని బైక్కు కట్టి... మానవత్వమా నీవెక్కడ?
నాగ్పూర్: రక్షాబంధన్ వేళ ఆ భార్యాభర్తలు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ, జాతీయ రహదారిపై బైక్పై వెళుతున్నారు. ఇంతలో ఊహించని విధంగా ఒక ట్రక్కు వారి బైక్ను బలంగా ఢీకొంది. సంఘటనా స్థలంలోనే భార్య కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లేందుకు సాయం చేయాలంటూ ఆ మార్గంలో వెళుతున్నవారినందరినీ ఆమె భర్త సాయం కోసం అభ్యర్థించాడు. అయితే మృతదేహాన్ని తరలించేందుకు, అతనికి సాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అంతటి నిస్సహాయ స్థితిలో ఆ భర్త ఏం చేశాడు?ఈ దుర్ఘటన ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మోర్ఫాటా ప్రాంతం సమీపంలోని నాగ్పూర్-జబల్పూర్ జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాదంలో గ్యార్సి అమిత్ యాదవ్ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆమె భర్త అమిత్ యాదవ్ నిశ్చేష్టుడైపోయాడు. సహాయం కోసం కనిపించిన అందరినీ ప్రాధేయపడ్డాడు. సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అమిత్ తన భార్య మృతదేహాన్ని తన ద్విచక్ర వాహనం వెనుక భాగానికి తాళ్లతో కట్టి, మధ్యప్రదేశ్లోని తమ స్వగ్రామానికి బయలుదేరాడు. అమిత్ జాతీయ రహదారిలో బైక్పై భార్య మృతదేహాన్ని తీసుకెళుతున్న దృశ్యాన్ని ఎవరో కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ దృశ్యాన్ని చూసినవారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. A video showing Amit transporting his wife's body tied to his motorcycle has gone viral on social media.#Wife #Accident https://t.co/wNwuj33TJk— News18 (@CNNnews18) August 11, 2025మొదట్లో అమిత్కు సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే అతను భార్య మృతదేహాన్ని మోటార్సైకిల్పై తీసుకెళ్తున్న దృశ్యాన్ని చూసిన చాలా మంది అతని బైక్ను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే అమిత్ అందుకు నిరాకరిస్తూ, బైక్ను ముందుకు పోనిచ్చాడు. హైవే పోలీసులు అమిత్ వాహనాన్ని గమనించి, ఆపమని కోరారు. అయినా అమిత్ వారి మాటను లేక్కచేయలేదు. కొంతదూరం వరకూ పోలీసులు అతని బైక్ను వెంబడిస్తూ ఎట్టకేలకు బైక్ను ఆపించారు. అనంతరం పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టం కోసం నాగ్పూర్లోని మాయో ఆసుపత్రికి తరలించారు. అలాగే అమిత్కు తగిన సాయం అందిస్తామని హామీనిచ్చారు. ఈ ఘటన ప్రస్తుత కాలంలో అడుగంటుతున్న మానవత్వాన్ని ప్రశ్నించేదిగా ఉందని పలువురు అంటున్నారు.

‘నాడు సేవ.. నేడు లాభం’.. విద్య, వైద్యంపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశంలో ఆరోగ్య సంరక్షణ, విద్య విషయంలో పెరుగుతున్న ఖర్చులు సామాన్యులు భరించలేనివిగా మారాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మాధవ్ సృష్టి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం భగవత్ మాట్లాడుతూ ఒకప్పుడు సేవా కార్యక్రమాలకు ప్రతీకగా నిలిచిన విద్య,వైద్య రంగాలు నేడు లాభాలతో నడిచే సంస్థలుగా మారాయని అన్నారు.క్యాన్సర్ చికిత్స విషయానికొస్తే దేశంలోని ఎనిమిది నుండి పది నగరాల్లో మాత్రమే అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని భగవత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగులు చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయవలసి వస్తున్నదని, చాలా దూరం ప్రయాణించవలసి వస్తున్నదని అన్నారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ ఆందోళనకు కారణం కాకూడదని భగవత్ పేర్కొన్నారు. తన ప్రసంగంలో మోహన్ భగవత్ తన చిన్ననాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ ‘నేను మలేరియాతో బాధపడుతూ మూడు రోజుల పాటు పాఠశాలకు వెళ్లలేనసప్పుడు.. మా ఉపాధ్యాయుడు నా చికిత్స కోసం అడవి మూలికలు తీసుకుని ఇంటికి వచ్చారు. ఆయన తన విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఆ రకమైన వ్యక్తిగత సంరక్షణ సమాజానికి ఇప్పుడు అవసరం’ అని ఆయన పేర్కొన్నారు. VIDEO | Indore: Speaking after inaugurating Madhav Srishti Arogya Kendra set up by philanthropic organisation 'Guruji Seva Nyas' for affordable treatment of cancer, Rashtriya Swayamsevak Sangh chief Mohan Bhagwat stressed on "Dharma", which unites and uplifts society, rather than… pic.twitter.com/xdd3kdT8EN— Press Trust of India (@PTI_News) August 10, 2025ప్రకృతి వైద్యం, హోమియోపతి లేదా అల్లోపతి మొదలైనవి ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడతాయిని పేర్కొంటూ, పాశ్చాత్య వైద్య పరిశోధనను భారతీయ పరిస్థితులకు గుడ్డిగా అన్వయించకూడదని భగవత్ హెచ్చరించారు. భారతీయ వైద్య విధానాలు వ్యక్తిగత అవసరాల ఆధారంగా చికిత్సను అందిస్తాయని ఆయన అన్నారు. కాగా దేశంలోని విద్యార్థులు నాణ్యమైన విద్య కోసం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని భగవత్ పేర్కొన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత లాంటి సాంకేతిక పదాలను ఆయన తిరస్కరించారు. సేవ చేసే సందర్భంలో ధర్మం అనేది మనకు ఆధారంగా నిలవాలన్నారు.

‘అదో భయంకర ప్రయాణం.. లక్కీగా బతికాం’: ఎంపీ వేణుగోపాల్
న్యూఢిల్లీ: మరో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ సహా పలువురు పార్లమెంటు సభ్యులు ఉన్నారు. త్రివేండ్రం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఈ ఎయిర్ ఇండియా విమానాన్ని సాంకేతిక సమస్యల కారణంగా చెన్నైకి అత్యవసరంగా మళ్లించారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ ఆ విమానంలో తనకు ఎదురైన అనుభవాన్ని ‘ఎక్స్’ పోస్టులో తెలియజేశారు. అదొక భయంకర ప్రయాణమని, విషాదానికి దగ్గరగా వచ్చామని దానిలో పేర్కొన్నారు.వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం, అప్పటికే బయలుదేరడానికి ఆలస్యం అయిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపానికి గురయ్యింది. దీంతో దానిని చెన్నైకి మళ్లించారు. ‘త్రివేండ్రం నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI 2455లో నేను, పలువురు ఎంపీలు, వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. మేమంతా విషాదానికి దగ్గరగా వచ్చాం. ఆలస్యంగా బయలుదేరిన విమానం తరువాత భయంకరమైన ప్రయాణానికి దారి తీసింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేమంతా కుదుపులకు గురయ్యాం. దాదాపు గంట తర్వాత కెప్టెన్ విమానంలో సిగ్నల్ లోపం ఉందని ప్రకటించి, దానిని చెన్నైకి దారి మళ్లించారు. అయితే విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయ్యేందుకు అనుమతి కోసం రెండు గంటల పాటు ఎదురు చూశాం. మొదటి ప్రయత్నంలో అదే రన్వేపై ఒక విమానం ఉండటంతో మా విమానం ల్యాండ్ కావడం సాధ్యం కాలేదన్నారు. రెండవ ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. పైలట్ నైపుణ్యం, అదృష్టం కారణంగానే మేమంతా ప్రాణాలతో బయటపడ్డామని’ వేణుగోపాల్ పేర్కొన్నారు. Air India flight AI 2455 from Trivandrum to Delhi - carrying myself, several MPs, and hundreds of passengers - came frighteningly close to tragedy today.What began as a delayed departure turned into a harrowing journey. Shortly after take-off, we were hit by unprecedented…— K C Venugopal (@kcvenugopalmp) August 10, 2025ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని, అలాంటి లోపాలు మళ్లీ తలెత్తకుండా చూసుకోవాలని ఎయిర్ ఇండియాను ఆయన కోరారు. కాగా ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా.. రన్వేపై మరో విమానం ఉండటం వల్ల ఈ విమానం ల్యాండ్ కాలేదని, చెన్నై ఏటీసీ సూచనల మేరకు తరువాత ఆ విమానం ల్యాండ్ అయ్యిందని తెలిపింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులకు ఎదురైన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా పేర్కొంది. గత జూన్ 12న అహ్మదాబాద్లో చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, మరో 19 మంది ఇతరులు మృతి చెందారు. నాటి నుంచి ఎయిర్ ఇండియా విమానయాన సంస్జ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. Air India flight AI 2455 from Trivandrum to Delhi - carrying myself, several MPs, and hundreds of passengers - came frighteningly close to tragedy today.What began as a delayed departure turned into a harrowing journey. Shortly after take-off, we were hit by unprecedented…— K C Venugopal (@kcvenugopalmp) August 10, 2025

బీహార్ ఉప ముఖ్యమంత్రికి పోల్ బాడీ నోటీసులు.. కారణం ఇదే..
పట్నా: బీహార్లో ఓటర్ల జాబితా సవరణతో మొదలైన వివాదం ఇప్పుడు డబుల్ ఓటరు ఐడీ నోటీసుల వరకూ దారి తీసింది. తాజాగా రెండు ఓటరు ఐడీ కార్డులు కలిగి, రెండు చోట్ల ఓటరుగా నమోదు చేసుకున్నందుకు బీహార్ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాకు పోల్ బాడీ నోటీసు జారీ చేసింది. నకిలీ ఓటర్లపై కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పలు విమర్శలు చేస్తున్న తరుణంలో విజయ్ కుమార్ సిన్హా ఎన్నికల కమిషన్ నుండి నోటీసు రావడం గమనార్హం.తాజాగా బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ కుమార్ సోషల్ మీడియా ప్లాట్ఫారం‘ఎక్స్’లోచేసిన ఒక పోస్ట్లో తన అసెంబ్లీ సీటు అయిన లఖిసరైలో ఓటరుగా సిన్హా పేరు ఉందంటూ, దానికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా స్క్రీన్షాట్ను పంచుకున్నారు. అలాగే పట్నాలోని బంకిపూర్లో కూడా ఓటరుగా సిన్హా పేరు ఉందంటూ ఆధారం చూపించారు. ఈ నేపధ్యంలో రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో పేరు ఉండటంపై వివరణ కోరుతూ, బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు నోటీసు పంపారు. ఆగస్టు 14 సాయంత్రం ఐదు గంటలలోపు దీనికి సమాధానం ఇవ్వాలని కోరారు.రాష్ట్రీయ జనతాదళ్కు చెందిన తేజస్వి యాదవ్ తాజాగా ఉప ముఖ్యమంత్రికి రెండు ఓటరు ఐడీ కార్డులు ఉన్నాయని ఆరోపిస్తూ, సిన్హాపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని ఎలక్షన్ కమిషన్ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సిన్హా మాట్లాడుతూ తాను ఒకేచోట నుండి ఓటు వేశానని, తేజశ్వి యాదవ్ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తన పేరు ఒటరు జాబితాలో రెండు చోట్ల ఉండటానికిగల కారణాలను వివరిస్తూ.. తొలుత తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లు బంకిపూర్ అసెంబ్లీ స్థానంలో ఉన్నాయన్నారు. అయితే 2024 ఏప్రిల్ లో, తాను లఖిసరైలో తన పేరును జతచేర్చుకునేందుకు దరఖాస్తు చేశానన్నారు. అదే సమయంలో తనతోపాటు తన కుటుంబ సభ్యుల పేర్లను బంకిపూర్ నుండి తొలగించేందుకు ఫారమ్ను కూడా నింపి సమర్పించానన్నారు. అయితే ఏవో కారణాలతో బంకిపూర్ నుండి తన పేరు తొలగించలేదని విజయ్ కుమార్ సిన్హా వివరణ ఇచ్చారు.
ఎన్ఆర్ఐ

తానా: నవ్వులు కురిపించిన ‘సాహిత్యంలో హాస్యం’
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన “సాహిత్యంలో హాస్యం” నవ్వుల జల్లులు కురిపించింది. తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత 5 సంవత్సరాలకు పైగా, ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్య సదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 82వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “సాహిత్యంలో హాస్యం” (2 వ భాగం) “ప్రముఖ రచయితల హాస్యరచనా వైభవం” చాలా ఉల్లాస భరితంగా, ఆద్యంతం నవ్వులతో నిండింది.తానా నూతన అధ్యక్షులు డా. నరేన్ కొడాలి మాట్లాడుతూ – “తానా ఎన్నో దశాబ్దాలగా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళా వికాసాలకోసం అవిరళకృషి చేస్తోందని, తన పదవీకాలంలో తానా సంస్థ స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకునే దిశగా పయనించడం సంతోషంగాఉందని, అందరి సహకారంతో సంస్థ ఆశయాలను సాకారం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. తెలుగు భాష, సాహిత్యాల పరిరక్షణ, పర్యాప్తిలో తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు అయిన డా. ప్రసాద్ తోటకూర నేతృత్వంలో గత 5 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ సాహిత్య కృషి ఎంతైనా కొనియాడదగ్గదని, ఈ నాటి కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకూ స్వాగతం అంటూ సభను ప్రారంభించారు.”తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “డా. నరేన్ కొడాలి తానా అధ్యక్ష పదవీకాలం ఫలవంతం కావాలని, తానా సంస్థను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికి ఆయనకు అందరూ సహకరించాలని కోరారు. ప్రస్తుత సాహిత్య చర్చాంశం గురించి ప్రస్తావిస్తూ - తెలుగు సాహిత్యంలో కథ, కవిత, నవల, నాటకం, వ్యాసం మొదలైన అన్ని ప్రక్రియలలోనూ హాస్యం పుష్కలంగా పండిందని అన్నారు.కాళ్ళకూరి నారాయణగారి “చింతామణి”, “వరవిక్రయం” నాటకాలు, పానుగంటి లక్ష్మీనరసింహారావుగారి “సాక్షి” వ్యాసాలు, చిలకమర్తి లక్ష్మీ నరసింహారావుగారి “గణపతి” నవల, మునిమాణిక్యం నరసింహారావుగారి “కాంతం కథలు”, సురవరం ప్రతాపరెడ్డిగారి “మొగలాయి కథలు”, గురజాడ అప్పారావుగారి కలం నుండి జాలువారిన “కన్యాశుల్కం” నాటకంలోని అనేక హాస్య సన్నివేశాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. జీవితంలో వత్తిడిని తగ్గించేందుకు హాస్యం మిక్కిలి దోహదపడుతుందని, సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో ఉన్న హాస్యాన్ని అందరూ ఆస్వాదించవచ్చును అన్నారు.”గౌరవఅతిథిగా విచ్చేసిన తెలుగువేద కవి, ప్రముఖ సినీగీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు-సాహిత్యంలో వివిధ హాస్య ఘట్టాలను వివరించి నవ్వించారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రముఖ చలనచిత్ర కథా, సంభాషణా రచయిత్రి, సినీ విమర్శకురాలు బలభద్రపాత్రుని రమణి - సుప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి, విమర్శకురాలు రంగనాయకమ్మ పండించిన హాస్యాన్ని; ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్, నృత్య రూపకాల రచయిత, కథా, సంభాషణా రచయిత బ్నిం – నరసింహారావు పేరుతో ఉన్న వివిధ ప్రముఖ రచయితలు సృష్టించిన హాస్యాన్ని ‘గాండ్రింపులు మానిన హాస్యాలుగా’; ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు సుధామ - ప్రముఖ హాస్యకథా రచయిత్రి, నవలా రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి రచనలలోని హాస్యాన్ని;ప్రముఖ కథా, నవలా రచయిత్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనుమరాలు అయిన లలిత రామ్ - తెనాలి రామకృష్ణుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రిల సాహిత్యంలోని హాస్యాన్ని; కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షురాలు డా. వి. వింధ్యవాసినీ దేవి – సుప్రసిద్ధ హాస్య రచయిత మునిమాణిక్యం నరసింహారావు రచనలలోని హాస్యాన్ని; ప్రముఖ హాస్యనటుడు, రచయిత, ఉపన్యాసకుడు అయిన డా. గుండు సుదర్శన్ – ప్రముఖ హాస్య రచయిత శ్రీరమణతో తనకున్న సాంగత్యం, శ్రీరమణ సాహిత్యంలో హాస్యం; ప్రముఖ రచయిత, సినీనటుడు, దర్శకుడు కాశీ విశ్వనాధ్ – ప్రముఖ రచయితలు వేటూరి సుందర రామమూర్తి, పైడిపల్లి సత్యానంద్, కొడకండ్ల అప్పలాచార్యలు సృష్టించిన హాస్యరీతుల్ని ఇలా పాల్గొన్న అతిథులందరూ వేర్వేరు రచయితలు పండించిన హాస్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించి అందరిని కడుపుబ్బ నవ్వించారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు చిగురుమళ్ళ శ్రీనివాస్ తన వందన సమర్పణలో కార్యక్రమం యావత్తూ హాస్యరస ప్రధానంగా సాగిందని, పాల్గొన్న అతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు, తానా కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదేం పాడుబుద్ధయ్యా.. పైలటూ!
న్యూయార్క్: విమానం ల్యాండయిన 10 నిమిషాలకే ఎన్నారై పైలట్ను అరెస్ట్ చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన పైలట్ను శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco) అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 9.35 గంటల సమయంలో డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానం ల్యాండవగా అధికారులు అందులోకి ఎక్కి పైలట్గా ఉన్న రుస్తొమ్ భగ్వాగర్(34)ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్కు తరలించారు.పదేళ్లలోపు చిన్నారిపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఈ ఏడాది ఏప్రిల్లో కేసు నమోదైంది. తన తల్లితో డేటింగ్ చేసిన రుస్తొమ్ భగ్వాగర్ (Rustom Bhagwagar) తనను లైంగికంగా వేధించినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆరేళ్లప్పుడు మొదలైన వేధింపులు తనకు 11 ఏళ్లు వచ్చేవరకు సాగించాడని, ఈ విషయం తన తల్లికీ తెలుసునని ఆమె పేర్కొంది. ఆమె సమక్షంలోనూ ఇవి సాగాయని ఫిర్యాదు చేసిందని అధికారులు వెల్లడించారు.కెనడా విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి ఒట్టావా: కెనడాలోని న్యూఫౌండ్ల్యాండ్ ప్రాంతంలో చిన్న విమానం కూలిన ఘటనలో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. డీర్ లేక్ సమీపంలో ఈ నెల 26న ఈ ఘటన చోటుచేసుకుంది. డీర్ లేక్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానం కూలింది.చదవండి: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తిపై అమానుషంఈ ఘటనలో విమానంలో ఉన్న ఏకైక వ్యక్తి గౌతమ్ సంతోష్(27) ప్రాణాలు కోల్పోయారని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనలో విమానం పైలట్ సైతం అక్కడికక్కడే చనిపోయారని పేర్కొంది. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉందని తెలిపింది.

ఘనంగా ముగిసిన కార్గిల్ విజయ్ దివస్-సురభి ఏక ఎహసాన్
తన చిన్ననాటి కల 'దేశం కోసం ఏమైనా చెయ్యాలి' అనే తపన పూర్తీ కాలేదు ఎందుకంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ లో సీటు దక్కలేదు. ఒక రేడియో వ్యాఖ్యాతగా, ఆ కాలనీ సాకారం చేసే అవకాశం లభిస్తుందని ఊహించలేదు టోరీ రేడియో వ్యాఖ్యాత జయ. తన రేడియో షో పేరు జై హింద్, ఈ పేరు ఎంచుకున్నందుకు రెండు కారణాలు - ఒకటి భారత్ దేశం కోసం కాబట్టి, రెండవ ది హిందీ వివిధభారతి లో 'జయ్ మాల' అని సైనికుల కార్యక్రమం తనకు అత్యంత ప్రియమైన ప్రోగ్రాం కాబట్టి దానికి తగినట్టుగా ఉండాలనే యత్నంలో 'జై హింద్' నిలిచిపోయింది.అయితే షో పేరుకి కార్గిల్ విజయ్ దివస్ కి ఏమిటి సంబంధం? జై హింద్ లో అనేక హోదాల్లో వున్న విశ్రాంత సైనికులు, వారిలో ఎక్కువగా 'గాలంటరీ అవార్డ్స్ 'అందుకున్న వారు, వీర నారీలతో పరిచయాలు మరియు త్రిదళాల కుటుంబాలకు సేవలు అందచేసే స్వచ్చంద సంస్థలతో పరిచయాలు చెయ్యడం జరిగింది. వీరిలో కొందరు కార్గిల్ యుద్ధం లో సేవలు అందించిన వారున్నారు కనుక కార్గిల్ విజయ్ దివస్ వెనుక వున్న త్యాగం, భావోద్వేగాలు మరియు ఆనందాల విలువలు నెమ్మదిగా అర్ధం చేసుకొన్న జయ, కార్గిల్ విజయ దివస్ ని తన కర్మ భూమి హాంగ్ కాంగ్ లో చేయడం ప్రారంభించి 'సురభి ఏక ఎహసాన్ ' గా తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొంది.జయ మాట్లాడుతూ తన రేడియో షో ముఖ్య ఉద్దేశాన్ని పునరుద్ధరిస్తూ సైనికుల జీవితాలను వారి కుటుంబ త్యాగాలను సామాన్య పౌరులకు తెలియజేసే ప్రయత్నమని అందుకు టోరీ రేడియో యాజమాన్యం మరియు శ్రోతలు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారని, ఆ స్ఫూర్తి తో ఒక పుష్కర కాలంగా 'జై హింద్' షో చేస్తున్నాని తెలిపారు. హాంగ్ కాంగ్ ప్రవాస భారతీయులందరు , ప్రతి సంవత్సరం "సురభి ఏ ఎహసాన్ " కార్యక్రమాన్నికి ఎంతో ఆదరణ అభిమానంతో వారందరూ దీనిని వారి వార్షిక క్యాలెండర్ ఈవెంట్లలో ఒకటిగా ఎదురు చూస్తారు. వారి హృదయాలలో ఈ స్థానం సంపాయించగలిగాను అంటే వారు మన రక్షణ దళాల గురించి ముఖ్యం గా మన సానికుల గురించి ఆలోచిస్త్రున్నారు అన్న తృప్తి నాకు ఒక వరం గా భావిస్తాను అంటారు టోరీ వ్యాఖ్యాత జయ పీసపాటి.ఈ సంవత్సరం 'సురభి ఏక ఎహసాన్' కార్యక్రమం లో భాగంగా పిల్లలకు చిత్రలేఖనం పోటీలు మరియు మన జాతీయ భాష హిందీ లో కవితలు / గీత రచనల పోటీలు కూడా నిర్వహించడం ఒక విశేషం. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారత తాత్కాలిక కాన్సుల్ జనరల్ మిస్ సురభి గోయల్ గారు మరియు భారతీయ గోర్ఖా రెజిమెంట్ విశ్రాంత జవాన్లు విచ్చేసారు. స్థానిక ప్రముఖులు, తమ అనేక కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించే స్వచ్చంద సంస్థ - టచ్ సెంటర్ రీజినల్ డైరెక్టర్ మిస్ కోనీ వాంగ్ కూడ కార్యక్రమానికి సంతోషంగా హాజరయ్యారు.గౌరవ సత్కారాలనంతరం గౌరవనీయ మిస్ సురభి గోయల్ గారు తమ సందేశంలో, ఇటువంటి కార్యక్రమం ద్వారా భారతీయ పౌరులని ఒక తాటి పై తేవడం మరియు దేశ రక్షకుల గురించి అవగాహన కల్పించడాన్ని ఎంతగానో ప్రశంసించారు. ఈ తరం వారికి చక్కటి సందేశాన్ని అందించే కార్యక్రమ స్ఫూర్తిని అభినందించారు. ప్రతి యేటా తన టాక్ షో అతిదులైన సైనికుల సందేశాన్ని హాంగ్ కాంగ్ ప్రేక్షకులకి చూపిస్తారు, అలా ఈ సంవత్సరం 'సురభి ఏక ఎహసాన్ లో కార్గిల్ వెటరన్ కెప్టెన్ అఖిలేష్ సక్సేనా గారి కార్గిల్ యుద్ధంలో వారి స్వీయ అనుభవాలని తెలియజేస్తూ సందేశాన్ని అందించారు .అనంతరం పిల్లలు,పెద్దలు మరియు విశేషంగా జాలీ గుడ్ మైత్రివన్ క్లబ్ యొక్క సీనియర్ సిటిజన్లు దేశభక్తి గీతాలు మరియు నృత్యాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చిత్రలేఖనం పోటీలో పాల్గొన్నవారందరికీ కషునుట్జ్ ఆర్ట్ స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ మిస్ కశ్మీరా మెహతా దోషి బహుమతులు అందజేశారు. హిందీ కవిత / గీత రచన పోటీ విజేతలకు మరియు జడ్జెస్ కి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి, పోటీల విజేతలకు సర్టిఫికెట్లు మరియు బహుమతులను గౌరవనీయ మిస్ సురభి గారు అందజేశారు.వందన సమర్పణలో రేడియో వ్యాఖ్యాత జయ గౌరవప్రదమైన హాజరుతో మరియు వారి వివేకవంతమైన మాటలతో అందరికి స్ఫూర్తినిచ్చినందుకు యాక్టింగ్ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీమతి సుర్భి గోయల్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గూర్ఖా రెజిమెంట్ నుండి వచ్చిన ధైర్యవంతులైన విశ్రాంత సైనిక అనుభవజ్ఞులకు ప్రత్యేక వందనాలందించారు. లీజుర్ అండ్ కల్చరల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ట, టచ్ సెంటర్ కి , జడ్జెస్ కి, కార్యక్రమ స్వచ్చంద సేవకులకు, నిర్వాహకులు శ్రీ పరేష్ న్యాతికి, పాల్గొన్న వారికి మరియు విచ్చేసిన వారికి కృతజ్ఞత వ్యక్తం చేశారు. అనంతరం అందరు జాతీయ గీతాన్ని ఆలపించి మళ్ళి వచ్చే సంవత్సరం 'సురభి ఏక ఎహసాన్' పదవ వార్షికోత్సవం ఇంతకన్నా ఘనంగా చేద్దామంటూ వీడ్కోలు చెప్పారు. టోరీ 'జై హింద్' కార్యక్రమ వివరాలకు ఈ లింక్ ను అనుసరించగలరు : https://whatsapp.com/channel/0029VaBqh4rCxoAmoITb0w0V

నిమిష ప్రియ మరణశిక్ష రద్దు కాలేదు: కేంద్రం
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్లో మరణశిక్ష రద్దు అయ్యిందన్న కథనాలను కేంద్ర విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఆమె మరణశిక్ష రద్దు వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. తన సహచర భాగస్వామిని హత్య చేసిన అభియోగాల మీద ఆమెకు ఈ శిక్ష పడిన సంగతి తెలిసిందే.కేరళకు చెందిన ప్రముఖ మత గురువు, సున్నీ నేత కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ కార్యాయలం నుంచి ఆమెకు మరణశిక్ష తప్పిందనే ప్రకటన వెలువడింది. యెమెన్ రాజధాని సనాలోని ఓ జైలులో ఖైదీకి ఉన్న నిమిషకు.. హౌతీ మిలిటరీ ప్రభుత్వం నుంచి ఊరట లభించిందని తెలిపింది. అయితే ఆ ప్రకటనపై ఎలాంటి అధికారిక సమాచారం లేదంటూ కేంద్రం కాసేపటి కిందట స్పష్టత ఇచ్చింది. నిమిష ప్రియ కేసులో వ్యక్తిగతంగా చేసే ప్రకటనలతో సంబంధం లేదని.. అక్కడి అధికారులు ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని కేంద్ర విదేశాంగ శాఖ తాజాగా తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలతో ప్రముఖ వెబ్సైట్ హిందూ ఓ కథనం ఇచ్చింది.#Government denies claim of #NimishaPriya's #deathpenalty being revoked: Sources https://t.co/sNMZ3AhC9S #WeRIndia pic.twitter.com/PszX95Kbz1— Werindia (@werindia) July 29, 2025సనాలో అత్యున్నత సమావేశం తర్వాత.. సోమవారం అర్ధరాత్రి అబూబకర్ ముస్లియార్ కార్యాలయం మరణశిక్ష రద్దు అంటూ ప్రకటన చేసింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకోసం భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. మరోవైపు అబుబాకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు.అబుబాకర్ ప్రకటనను యెమెన్లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీస్ జస్టిస్ ప్రతినిధి సర్హాన్ షంశాన్ అల్ విశ్వాబి ధ్రువీకరించారు. మత పండితుల బలమైన చొరవతోనే నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లు పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు ట్విస్ట్ ఇస్తూ కేంద్రం ఇప్పుడు ఆ ప్రకటనను తోసిపుచ్చడం గమనార్హం. మరణించిన యెమెన్ పౌరుడు తలాల్ మహదీ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరమే స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భారత్ పలుమార్లు కోరడంతో జులై 16న అమలు కావాల్సిన మరణశిక్షను వాయిదా పడింది. అప్పటి నుంచి యెమెన్ అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. అయితే తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీని హత్య చేసిన నేరంలో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలను ఫలించి.. మరణశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది.
క్రైమ్

సై'డర్'..!
మన ఇంట్లో బంగారం పోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మన కుటుంబంపై ఎవరైనా దాడికి పాల్పడినా.. ఆడపిల్లలను ఏడిపించినా.. ఎవరైనా మోసగించినా వెంటనే స్పందిస్తాం. అంతేవేగంగా పోలీసులు సైతం విచారణ చేపడతారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే రూ.కోట్లలో మోసాలకు పాల్పడే కంటికి కనిపించని, పరిచయం లేని సైబర్ మోసగాళ్లపై పరువు అనే సమస్యకు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మాత్రం అంతా వెనకడుగు వేస్తారు.ఎందుకంటే టెక్నాలజీ పరంగా, సామాజిక మాధ్యమాల పరంగా కొన్ని బలహీనతలకు లోబడి చేసే తప్పులు బయటపడితే ఇబ్బందులు వస్తాయని ఆగిపోతున్నారు. కుటుంబంలో తెలిస్తే బాధపడతారని రూ.లక్షల్లో మోసపోతున్నారు. కొంతమంది ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. – శ్రీకాకుళం క్రైమ్గత కొన్ని నెలలుగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు సైబర్ చక్రబంధంలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ ఇతర సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన సైబరాసురులు హనీట్రాప్, డిజిటల్ అరెస్టు, ట్రేడింగ్, పార్ట్టైం జాబ్ల పేరిట రెచ్చిపోతున్నారు. రూ.లక్షల్లో పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదులతో సుమారు ఏడెనిమిది కేసులు నమోదయ్యాయని, స్టేషన్ మెట్లెక్కని బాధితులు మరింతమంది ఉండొచ్చని పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మోసపోయినవారిలో ఉన్నత ఉద్యోగ వర్గాలే ఉండడం విశేషం. హనీ ట్రాప్లో పడి.. జిల్లాకేంద్రం సమీపంలోని సంపన్న వర్గానికి చెందిన ఒక వ్యక్తికి ఇటీవల ఒక అమ్మాయి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టింది. ప్రొఫైల్ పిక్లో అమ్మాయి ఫొటో ఉండడంతో ఆకర్షితమైన సదరు వ్యక్తి వెంటనే హాయ్ అని రిప్లయ్ ఇచ్చాడు. ఆ తర్వాత నిత్యం చాటింగ్ చేయడం రివాజైంది. కొన్నాళ్లకు వాట్సాప్ కాల్లో మాట్లాడడం.. వీడియో కాల్స్ చేయడం ఆరంభించింది. అలా ఆ వ్యక్తిని ముగ్గులోకి దింపిన యువతి వీడియో కాల్స్లో న్యూడ్ కాల్స్ చేయడం ప్రారంభించింది. కొద్దిరోజులు తానే న్యూడ్గా కనిపించి ఆ తర్వాత సదరు వ్యక్తిని సైతం న్యూడ్గా కనిపించాలని కోరిక కోరడంతో, అతడు కూడా నగ్నంగా మాట్లాడడం ఆరంభించాడు. దీంతో ఆ వ్యక్తి నగ్నంగా మాట్లాడిన వీడియో కాల్ను రికార్డింగ్ చేసిన ఆ యువతి అక్కడి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ఆరంభించింది.ఆమె తరపున మరికొంతమంది సైతం వీడియోలు బయటపెడతామంటూ బెదిరించడంతో ఇంట్లో తెలిస్తే పరువు పోతుందేమోనని భయపడి, చేసేదేమీలేక వారు చెప్పిన బ్యాంకు ఖాతాలకు దఫదఫాలుగా రూ.28 లక్షల వరకు పంపించేశాడు. అయినప్పటికీ డబ్బుల కోసం పీడిస్తుండడంతో చేసేదేమీలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిజిటల్ అరెస్టు పేరిట.. విశాఖపట్నంలోని ఒక అకౌంటింగ్ సెక్షన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న శ్రీకాకుళం నగరవాసి డిజిటల్ అరెస్టు పేరిట రూ.11 లక్షలను సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయారు. మీ పేరిట కొరియర్లో డ్రగ్స్ ప్యాకెట్ వచ్చిందని.. మీ ఆధార్ లింక్ నంబర్తో కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయని సీబీఐ, కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసే వీలుందని ఒక వ్యక్తి బెదిరించడంతో నిజమేనని నమ్మాడు. దీనినుంచి బయటపడాలంటే ముందుగా రూ.30 వేలు తాము చెప్పిన ఖాతాలో వేయాలని చెప్పడంతో ఎందుకొచ్చిన గొడవలే అనుకుని ఉద్యోగి వేశాడు. మళ్లీ ఆ వ్యక్తి ఫోన్ చేసి పై అధికారులను మేనేజ్ చేయడం కుదరడం లేదని.. వారే మీకు లైన్లోకి రావొచ్చని మెల్లగా జారుకున్నాడు. కొన్ని గంటల్లోనే పోలీసు సెటప్తో ఉన్న ఓ రూంలో యూనిఫాంతో ఓ వ్యక్తి వీడియో కాల్లో ప్రత్యక్షమై తాను ఢిల్లీ సీబీఐ అసిస్టెంట్ డైరెక్టర్నని పరిచయం చేసుకున్నాడు. మేం నిన్ను నమ్మాలంటే మీ బ్యాంకు అకౌంట్లు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్లు వెరిఫికేషన్ చేయాలన్నాడు. వాటి ఆధారంగా ఇటీవల జరిగిన ఆన్లైన్ లావాదేవీలు పరిశీలించాలని.. కొంత అమౌంట్ను కూడా వెరిఫికేషన్లో భాగంగా తీయాల్సి వస్తుందని చెప్పాడు. అందులో జెన్యూనిటీ ఉంటే తిరిగి మీ ఖాతాలో అమౌంట్ వేయడం జరుగుతుందని చెప్పడంతో సదరు ఉద్యోగి ఓకే చేశాడు. అడిగిన వివరాలు అన్నీ ఇచ్చేయడంతో పాటు ఓటీపీలు చెప్పడంతో రూ.11 లక్షలను కొట్టేశారు. దీంతో తాను మోసానికి గురయ్యానని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇదే తరహాలో జిల్లా కేంద్రానికి సమీపంలో ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న జేఈ రూ.3 లక్షలు, నగరానికి చెందిన ఓ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ రూ.3 లక్షలు పోగొట్టుకున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారంటూ వీరిని సైబరాసురులు అధికారుల పేరిట బెదిరించడం విశేషం.పార్ట్టైం జాబ్ ఫ్రాడ్స్.. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ల్లో పరిచయమైన కొంతమంది వ్యక్తులు ఇంట్లోనే ఉంటూ పార్ట్టైం జాబ్ చేసే వీలుందని చెప్పడంతో నగరంలో నలుగురు చిరుద్యోగులు ఈ ఉచ్చులో పడ్డారు. ముందుగా వారు క్రియేట్ చేసిన గ్రూపుల్లో మెంబర్లుగా చేరారు. మొదటి టాస్్కలో రూ.5 వేలుకు రూ.1000లు అదనంగా రూ.6 వేలు, రెండో టాస్్కలో రూ.10 వేలకు రూ.2 వేలు అదనంగా రూ.12 వేలు వేయడంతో విత్డ్రా చేసుకున్నారు. అనంతరం అత్యాశకు పోయి తర్వాత టాస్క్ల్లో రూ.30 వేలు, రూ.50 వేలు, రూ.1 లక్ష, రూ.2 లక్షలకు అదనపు సొమ్ము ఖాతాల్లో ఉన్న ఆప్షన్లో చూపించినా విత్డ్రా చేయడానికి వీలుకాకపోవడం.. ఆ తర్వాత అవతలివాళ్లు వీరి నంబర్లు బ్లాక్ చేయడంతో మోసపోయామని గ్రహించారు. పోలీసులకు ఆసక్తి ఉన్నా.. పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తున్నా మోసం చేసే సైబర్ కేటుగాళ్లు రాష్ట్రాలు, దేశాలు దాటి విదేశాల్లో సైతం ఉండడం.. తెలియని ప్రాంతాల్లో రిస్క్ చేసి పట్టుకోవడానికి వెళ్లే ఆసక్తి ఉన్నా.. రాను పోను ఖర్చులు, వసతి ఖర్చులకు చేతి చమురు తగులుతుండటం.. ఆపై ఎక్కువ రోజుల సమయం వెచ్చించాల్సి రావడంతో వెనకడుగు వేస్తున్నారు. అలా కేసుల్లో అధికశాతం పెండింగ్ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందువలన ప్రభుత్వాలు కాస్తా చొరవ తీసుకుని ఆర్థికంగా చేయూతనిస్తే కేసుల ఛేదన సులభమేనంటూ పోలీసులు చెబుతున్నారు. ఉపాధ్యాయుడికి టోకరా నగర పరిసరాల్లో ఉండే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఉన్నత చదువుల నిమిత్తం విదేశాల్లో ఉన్న తన కుమారుడు ఓ నేరం చేశాడని.. సీబీఐ, ఈడీ విభాగాల అధికారులు అరెస్టు చేసే వీలుందని సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. దానికి తగ్గ ఆధారాలు తమ వద్దనున్నాయని చెబుతూనే ఫేక్ వివరాలు వాట్సాప్లో పంపడంతో ఉపా«ధ్యాయుడు ఖంగుతిన్నాడు. మీ అబ్బాయి నేరం నుంచి బయటపడి, విదేశాల నుంచి రావాలనుకుంటే అధికారులకు అమౌంట్ కట్టాల్సి ఉంటుందన్నారు.పత్రికలు, మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయం బయటకు తెలిస్తే మీ పరువు పోతుందని అనడంతో చేసేదేమీలేక రూ.35 లక్షలు వారు చెప్పిన వివిధ ఖాతాల్లోకి పంపించాడు. ఎక్కడ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తాడోనని గంట గంటకు ఉపాధ్యాయునికి వాట్సాప్ వీడియో కాల్ నేరస్తులు చేసేవారు. తర్వాత వాళ్ల నంబర్లకు ఫోన్ కాకపోవడంతో బాధిత ఉపాధ్యాయుడు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. క్షణాల్లో మోసాన్ని గ్రహించాలి సహజంగా జరిగే చోరీలు.. ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న సైబర్ మోసాలను పరిశీలిస్తే 1:10 నిష్పత్తిలో నగదు మోసానికి గురవుతోంది. సైబర్ నేరగాడు బాధితుడి ఆర్థిక స్థితిని చూడడు. అత్యాశనే చూస్తాడు. వారు చేసే మోసాన్ని క్షణాల్లో మనం గ్రహించి స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే నష్టాన్ని పూడ్చవచ్చు. ఈవిధంగానే ఇటీవల డిజిటల్ అరెస్టు వలలో పడి రూ.13.5 లక్షల పోగొట్టుకున్న జెమ్స్ వైద్యురాలి కేసు ఛేదించాం. కోచిగూడ్, మైసూర్ వెళ్లి నిందితులను పట్టుకున్నాం. రాష్ట్రంలో రోజుకి రూ.కోటి నుంచి రూ.1.50 కోట్లు బాధితులు నష్టపోతున్నారు. – సీహెచ్ పైడపునాయుడు, సీఐ, శ్రీకాకుళం రూరల్

ఆరుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్
కడప అర్బన్: వైఎస్సార్ కడప, చిత్తూరు, నంద్యాల, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని అడవుల్లో ఎర్ర చందనం చెట్లను నరికి.. ఆ దుంగల్ని స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్ల నుంచి 52 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నారు. వైఎస్సార్ కడప ఎస్పీ ఈజీ అశోక్కుమార్ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం జిల్లాలోని చాపాడు మండలం ప్రొద్దుటూరు–అన్నవరం మధ్య చిన్నవరదాయపల్లె గ్రామానికి వెళ్లే రహదారిపై పోలీసు అధికారులు, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఎర్ర చందనం దుంగల్ని రవాణా చేస్తున్న వాహనాలు అటుగా వచ్చాయి. పోలీసుల్ని చూసి నిందితులు పారిపోతుండగా.. ఆరుగురిని పట్టుకున్నారు. నిందితులు అడవిలో ఎరచ్రందనం చెట్లను నరికి, దుంగలుగా మార్చి వాటిని ఇన్నోవా, స్విఫ్ట్ డిజైర్ కార్లలో రవాణా చేస్తుండగా పోలీస్ సిబ్బంది గమనించి అరెస్టు చేశారని ఎస్పీ తెలిపారు. ఈ ముఠా వెనుక బడా స్మగ్లర్లు ఉన్నట్టు గుర్తించి వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పట్టుబడిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్ అయిన వారిలో చాపాడుకు చెందిన ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన ముదిరెడ్డి రామమోహన్రెడ్డి, ఉమ్మనబోయిన క్రిష్ణయ్య, పెండ్లిమర్రి మండలానికి చెందిన కాయలి శ్రీనివాసులు, చక్రాయపేట మండలానికి చెందిన బండ్రెడ్డి ఓబులరెడ్డి, పెండ్లిమర్రి మండలానికి చెందిన శనివారపు బాలగంగిరెడ్డి ఉన్నారని ఎస్పీ వివరించారు. వీరిలో ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డి మోస్ట్ వాంటెడ్ ఎర్ర చందనం స్మగ్లర్. కడప జిల్లాలో ఇతనిపై 86 ఎర్రచందనం కేసులు, 34 దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయన్నారు. గతంలో 3 సార్లు పీడీ యాక్ట్ నమోదైంది. ఇతడి భార్య లాలూబీపైనా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె అరెస్ట్ అయి జైలులో ఉందని ఎస్పీ చెప్పారు. ఇతని కుటుంబ సభ్యులైన లాలుబాషా, పక్రుద్దీన్, జాకీర్ కూడా పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్లు. నాగదస్తగిరిరెడ్డి తన అనుచరులైన ముదిరెడ్డి రామమోహన్రెడ్డి, ఉమ్మనబోయిన క్రిష్ణయ్య, కాయలి శ్రీనివాసులు, ఓబులరెడ్డి, శనివారపు బాలగంగిరెడ్డితో కలిసి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. ఢిల్లీలో ఉండే సలీం అనే ప్రధాన స్మగ్లర్, ఇతర స్మగ్లర్లు ఢిల్లీలో ఉండే ఒక హవాలా వ్యాపారి ద్వారా హైదరాబాద్లో ఉండే విక్రంసింగ్ సోలంకి డబ్బులను హవాలా రూపంలో నాగదస్తగిరిరెడ్డికి అందజేస్తున్నాడన్నారు. విక్రంసింగ్ సోలంకిని కూడా వారం క్రితం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఉమ్మనబోయిన క్రిష్ణయ్యపై కర్నూలు జిల్లాలో 2 ఎర్రచందనం కేసులు, 3 చోరీ కేసులు నమోదయ్యాయన్నారు. నిందితుల్ని పట్టుకోవడంలో విశేష కృషి చేసిన ఆర్ఎస్టిఎఫ్ సీఐ సి.శంకర్రెడ్డి, ఆర్ఎస్ టాస్్కఫోర్స్ సిబ్బంది, మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్, చాపాడు ఎస్ఐ చిన్న పెద్దయ్యను ఎస్పీ అభినందించారు.ఆ ఎర్ర స్మగ్లర్.. పచ్చనేతే!» ఎర్ర చందనం కేసులో అరెస్టయిన రామమోహన్ » ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ నేత ప్రవీణ్కు ప్రధాన అనుచరుడు » రాష్ట్ర మంత్రి లోకేశ్, ప్రవీణ్తో చెట్టాపట్టాలుకడప అర్బన్: మోస్ట్వాంటెడ్ స్మగ్లర్ ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డితో పాటు మరో ఐదుగురు స్మగ్లర్లలో ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ ముదిరెడ్డి రామమోహన్రెడ్డి కూడా ఉండటం వైఎస్సార్ కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎర్ర చందనం చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు ముఠాలో రామమోహన్రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నాడు. రామమోహన్రెడ్డి ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడిగా చాలాకాలంగా చెలామణి అవుతున్నాడు. ఇతను ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి అలియాస్ ఉక్కు ప్రవీణ్కు ప్రధాన అనుచరుడు. కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులోని అరవింద ఆశ్రమం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతడిని వాటర్ప్లాంట్ రాము అని కూడా పిలుస్తుంటారు. ఎన్నికల ముందు ప్రొద్దుటూరులోని గాం«దీబజార్ సర్కిల్లో బెనర్జీ అనే వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో రామమోహన్రెడ్డి నిందితుడు. ఉక్కు ప్రవీణ్కు ప్రధాన అనుచరుడిగా ఉంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. రామమోహన్రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నేపథ్యంలో అతడు నారా లోకేశ్ను కలిసినప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అతడి వ్యవహారాలపై జిల్లాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

కన్నతల్లిని కత్తితో నరికి హత్యాయత్నం
కొయ్యలగూడెం: కన్నతల్లిపై కొడుకు నడిరోడ్డుపై కత్తితో విచక్షణారహితంగా నరికి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని అశోక్నగర్ ప్రాంతంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొయ్యలగూడెంలో జక్కు లక్ష్మీనరసమ్మ (50) రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటూ నివసిస్తోంది. ఆమె భర్త గతంలోనే మృతి చెందాడు. వీరికి కొడుకు, కూతురు ఉండగా, కుమార్తెకు వివాహమైంది. కుమారుడు శివాజీ (32)కి వివాహం కాగా, అతను భార్య, ఇద్దరు పిల్లలతో దేవరపల్లి మండలం బుచ్చియ్యపాలెంలో తాపీమే్రస్తిగా పనిచేస్తూ నివసిస్తున్నాడు. లక్ష్మీ నరసమ్మ తన సొంత ఇంటిలోనే నివాసముంటోంది. ఇటీవల ఆస్తి విషయంలో తల్లితో శివాజీ తరచూ కొయ్యలగూడెం వచ్చి ఘర్షణ పడుతున్నట్టు స్థానికులు తెలిపారు. తల్లి అంగీకరించకపోవడంతో గతంలోనూ రెండుసార్లు ఆమెపై దాడికి యత్నించాడు. ఆదివారం వారి ఇంటికి సమీపంలో తల్లిని కుమారుడు అకస్మాత్తుగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే ఈ ఘాతుకానికి ఒడిగట్టి పరారయ్యాడు. లక్ష్మీనరసమ్మకు ఈ దాడిలో తలపై నాలుగు, మెడపై నాలుగు, శరీరంపై మరో రెండు తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు 108 కోసం పలుమార్లు ప్రయత్నించినా స్పందన కనిపించలేదు. దీంతో సురక్ష ఆస్పత్రి అంబులెన్సులో లక్ష్మీనరసమ్మను కొయ్యలగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలించారు. ఆమె పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.యువకుల నిరసన అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఆస్పత్రికి తరలించేందుకు అందుబాటులో ఉండాల్సిన 108 అంబులెన్సు నిరుపయోగంగా పడి ఉండటంపై యువకులు కొయ్యలగూడెంలో నిరసన తెలిపారు. లక్ష్మీ నరసమ్మపై హత్యాయత్నం జరిగిన తరువాత స్థానికులు 108కి ఫోన్ చేసినా కనీస స్పందన రాలేదు. దీంతో స్థానిక యువకులు ఆగ్రహానికి గురై నిరుపయోగంగా ఉన్న 108 అంబులెన్సు వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈక్వెడార్ నైట్ క్లబ్లో కాల్పులు..8 మంది మృతి
శాంటా లుకా: దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్లోని ఓ నైట్ క్లబ్లో ఆదివారం చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీరప్రాంత గుయాస్ ప్రావిన్స్లోని శాంటా లుకాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులంతా 20–40 ఏళ్ల వారేనని పోలీసులు తెలిపారు. దేశంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఒకటిగా దీనికి పేరుంది. రెండు మోటారు సైకిళ్లపై వచ్చిన సాయుధులైన దుండగులు కాల్పులకు తెగబడ్డారని పోలీసులు వెల్లడించారు. కారణాలు తెలియాల్సి ఉందన్నారు.