ప్రధాన వార్తలు

పులివెందుల, ఒంటిమిట్ట పోలింగ్ సమాచారం ఇవ్వండి: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తూ, అత్యంత దారుణంగా, ఏకపక్షంగా నిర్వహించిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తోంది. ఆ దిశలోనే ఆ రెండు ఎన్నికల పోలింగ్కు సంబంధించి.. ‘‘పోలింగ్ స్టేషన్లు, ఆయా ప్రాంగణాల సీసీ కెమెరా ఫుటేజ్, పలు ఘటనలకు సంబంధించిన వీడియో కవరేజ్, పోలింగ్కు సంబంధించిన వెబ్కాస్టింగ్, ఆ రోజు పోలింగ్ బూత్ల్లో కూర్చున్న ఏజెంట్ల పేర్లు జాబితా....పోలింగ్ ఆఫీసర్ (పీఓ) డైరీ, ఫామ్–12. ఫామ్–32 ఈ ఏడు అంశాల పూర్తి వివరాలు, సమాచారం ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్ఈసీ)కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వేర్వేరుగా రెండు (పులివెందుల, ఒంటిమిట్ట) వినతిపత్రాలు పంపించారు. వీలైనంత త్వరగా ఆ వివరాలు, పూర్తి సమాచారం ఇవ్వాలి’’ అని లేఖల్లో లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు.పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి అధికార పక్షం చేసిన అరాచకాలు, వారికి వత్తాసు పలుకుతూ పోలీసులు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్సీపీ ప్రత్యక్షంగానూ, లేఖల ద్వారానూ మొత్తం 35 పర్యాయాలు ఎస్ఈసీకి వినతిపత్రాలు అందజేసింది. ఫిర్యాదు చేసింది. ఎన్నికలకు వారం రోజుల ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్యాదవ్, పార్టీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. దానిపై ఆధారాలతో సహా ఎస్ఈసీకి వైయస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. అయినా ఎస్ఈసీ పట్టించుకోలేదు.ఇక ఎన్నికల రోజున ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, తెల్లవారుజాము నుంచే అన్ని పోలింగ్ బూత్లు స్వాధీనం చేసుకున్న అధికార పక్షం నాయకులు, కార్యకర్తలు.. చివరకు ఏ పోలింగ్ బూత్లోకి వైఎస్సార్పీపీ ఏజెంట్లను అడుగు కూడా పెట్టనీయలేదు. వారి నుంచి ఏజెంట్ అధీకృత ఫామ్స్ లాగేసుకున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులెవ్వరూ ఓటు వేయకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చివరకు పులివెందులలో వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంతరెడ్డిని కూడా ఓటు వేయనీయలేదు.ఆయన్ను ఇంట్లో నుంచి బయటకు కదలనీయలేదు. ప్రతిచోటా పోలీసు బలగాలను ఉపయోగించారు. యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారు. దీనిపై అప్పటికప్పుడు ఆధారాలతో సహా, ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసినా, ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ రెండు ఉప ఎన్నికల పూర్తి వివరాలు, సమాచారం, వీడియోలు ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ రెండు లేఖల ద్వారా ఎస్ఈసీకి విజ్ఞప్తి చేసింది.

శివుడిపైనే పరీక్షించి.. అలా విష్ణువు చేతికి చేరిన దివ్యాయుధం
వచ్చే పదేళ్లనాటికి దేశంలోని అన్ని ప్రధాన వ్యవస్థలకు రక్షణ కల్పించే సాంకేతిక ఆధారిత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పంద్రాగస్టు ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ మిషన్కు శ్రీకృష్ణుడి స్ఫూర్తితో సుదర్శన చక్రగా పేరు పెడుతున్నట్లు చెప్పారు. హిందూ పురాణాల్లో అత్యంత శక్తివంతంగా భావించబడే.. పరమ పవిత్రమైనదిగా పూజలు అందుకునే సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతికి ఎలా చేరిందో తెలుసా?.. వామన, లింగ పురాణాల్లో సుదర్శన చక్రం కథ భాగాన్ని చూడొచ్చు. శ్రీదాముడు అనే రాక్షసుడు అహంకారంతో విర్రవీగుతూ దైవ శక్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో.. ధర్మ విరుద్ధంగా లక్ష్మీదేవిని వశపరచుకోవాలనుకుంటాడు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు.. శ్రీమహావిష్ణువు పరమశివుడి శరణు వేడుతాడు. అయితే అప్పటికే కైలాసగిరిలో శివుడు యోగ తపస్సులో ఉంటాడు. దీంతో కార్తీక శుక్ల చతుర్దశి నాడు శివుడిని పూజించేందుకు విష్ణువు కాశీకి వెళ్తాడు. వెయ్యి బంగారు పద్మాలతో శివుడిని పూజించాలనుకుంటాడు విష్ణువు. అయితే విష్ణువుకు భక్తి పరీక్ష పెట్టాలని.. అందులో ఓ పద్మాన్ని శివుడు మాయం చేస్తాడు. దీంతో.. కమల నయనుడిగా పేరున్న నారాయణుడు తన కంటినే తామర పువ్వుగా శివుడికి సమర్పించేందుకు సిద్ధమవుతాడు.విష్ణువు భక్తిని చూసి శివుడు ఆనందించి.. శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రాన్ని విష్ణువుకు బహుమతిగా ఇస్తాడు. ఆ సమయంలో.. ‘‘ధర్మ రక్షణ కోసం ఈ చక్రం రాక్షసులను నాశనం చేస్తుంది. మూడు లోకాల్లో దీనికి సాటి ఆయుధం లేదు’’ అని శివుడు చెబుతాడు. అయితే ఆ చక్రం శక్తిని పరీక్షించదలిచి.. తొలుత శివుడిపైనే ప్రయోగించే వరం కోరతాడు విష్ణువు. అందుకు శివుడు సంతోషంగా అంగీకరిస్తాడు. మహా విష్ణువు సంధించిన సుదర్శన చక్రం శివుని మూడు భాగాలుగా ఖండిస్తుంది. వెంటనే శివుడు ప్రత్యక్షమై.. ఈ చక్రం తన రూపాలను ఖండించగలిగింది గానీ తత్వాన్ని కాదని చెబుతాడు. సుదర్శన చక్రాన్ని శ్రీదాముడిని సంహరించేందుకు ఉపయోగించమని సూచిస్తాడు. మహావిష్ణువు అలాగే చేసి ధర్మాన్ని పరిరక్షిస్తాడు. మహావిష్ణువు అవతారం కాబట్టే ద్వాపర యుగంలో దుష్ట శిక్షణ కోసం సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతికి చేరింది.ఒక్కసారి సంధిస్తే..సూర్య భగవానుడి తేజస్సు కలిగిన సుదర్శన చక్రం హిందూ పురాణాలలో మహావిష్ణువు చేతిలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానకాంతిని ప్రసరింపజేస్తుంది. అందుకే దీనిని సుదర్శనం అంటారు. రెండు వరుసల్లో పదునైన పళ్లతో గుండ్రటి ఆకారంలో ఉంటుంది. భక్తుల కంటిని ఇది ఆభరణమే. కానీ, ధర్మాన్ని రక్షించేందుకు దుష్టసంహారంలో శిక్షాయుధంగా ఇది ప్రయోగించబడింది. ఒక్కసారి సంధిస్తే.. లక్ష్యాన్ని పూర్తి చేసుకునేంత వరకు వెనక్కి రాదు. చక్రానికి ఉన్న ఆ ముళ్లు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కదలడం వల్ల వేగంగా తిరుగుతూ వెళ్తుంది. ప్రపంచంలోని ఏవైనా పదార్థాలను అతి పదునైన అంచులతో తేలికగా కత్తిరించగలదని ప్రశస్తి. అయితే.. ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు.. భక్తి, ధర్మం, జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. సుదర్శన చక్రాన్ని ధ్యానించడం వల్ల శాంతి, సౌఖ్యాలు చేకూరతాయని పురాణోక్తి.సుదర్శనోపనిషత్తు ప్రకారం.. సుదర్శన చక్రాన్ని దేవశిల్పి అయిన విశ్వకర్మ తయారుచేశాడు. విశ్వకర్మ తన కూతురు సంజనాను సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే సూర్యుని తేజస్సు మూలంగా ఆమె ఆయన్ని చేరలేకపోతుంది. ఇది గమనించిన విశ్వకర్మ.. సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపడతాడు. అప్పుడు రాలిన పొడితో.. పుష్పక విమానం, త్రిశూలం, సుదర్శన చక్రం తయారు చేశాడు.సుదర్శన చక్రం సంహారాలుశ్రీదాముడితో పాటు హిరణ్యాక్షుడు, సువర్ణాక్షుడు, విరూపాక్షుడు(శివుని మూడు ఖండాలు) అనే రాక్షసులను సుదర్శన చక్రం ద్వారా మహావిష్ణువు సంహరించినట్లు వామన పురాణంలో పేర్కొనబడింది. మహాభారత ఇతిహాసంలో.. శ్రీకృష్ణుడు నూరు పాపాలు చేసిన శిశుపాలుడిని సుదర్శన చక్రంతోనే సంహరించాడు. జరాసంధుడు, కంసుడు, నరకాసురుడు కూడా సుదర్శన చక్రంతోనే మరణించారు. ఇవేకాదు.. పురాణా ఇతిహాసాల్లో సుదర్శన చక్రం చుట్టూ అల్లుకున్న సందర్భాలు ఇంకెన్నో. అయితే.. సుదర్శన చక్రం భౌతికంగా ఇప్పుడు ఎక్కడ ఉంది?.. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించిన తర్వాత సుదర్శన చక్రం తిరిగి విష్ణువుకు చేరిందని విశ్వాసం. ఇది భౌతికంగా కనిపించదుగానీ కాదు.. ఆధ్యాత్మికంగా విశ్వంలో ధర్మాన్ని కాపాడే శక్తిగా భావించబడుతోంది.అన్నమయ్య నోట.. తిరుమల బ్రహ్మోత్సవాల్లో చివరిరోజున సుదర్శన చక్రానికి చక్రస్నానంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య సుదర్శన చక్రంపై ప్రత్యేకంగా కీర్తనలు రచించారు. అందులో “చక్రమా హరిచక్రమా” అనే పద్యం ప్రసిద్ధి పొందింది. విశాఖపట్నం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సుదర్శన చక్రానికి అంకితంగా “సుదర్శన హోమం” నిర్వహించబడుతుంటుంది. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో కూడా సుదర్శన చక్రానికి ప్రత్యేకంగా ఆలయం ఉంది.

ఈపీఎఫ్ఓ కొత్త అప్డేట్.. ఇకపై ఆలస్యానికి చెక్
లక్షలాది మంది చందాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పనిచేస్తోంది. ఇందులో భాగంగానే ఆధార్ను యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో అనుసంధానించడంలో ఉన్న ఇబ్బందులను సరళీకృతం చేస్తూ.. ప్రాసెస్ను మరింత సులభతరం చేసింది.ఆగస్టు 13, 2025 నాటి EPFO సర్క్యులర్ ప్రకారం.. UANలో సభ్యుని పేరు, లింగం, పుట్టిన తేదీ ఆధార్తో సరిగ్గా సరిపోలితే, యజమాని పోర్టల్లోని కేవైసీ ఫంక్షనాలిటీ ద్వారా నేరుగా ఆధార్ను సీడ్ చేయవచ్చు. దీనికి ఈపీఎఫ్ఓ నుంచి ప్రత్యేకంగా ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. అన్నీ సరిగ్గా ఉంటే ఆలస్యానికి ఆస్కారం లేదు.UAN & ఆధార్ సీడింగ్యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ప్రతి సభ్యునికి ఈపీఎఫ్ఓ కేటాయించిన 12 అంకెల ఐడెంటిఫైయర్. వ్యక్తి ఉద్యోగాలు మారినప్పటికీ నెంబర్ మాత్రం అలాగే ఉంటుంది. ఆధార్ను UANకి లింక్ చేయడం వలన సభ్యులు నేరుగా సేవలను పొందగలుగుతారు. కానీ ఆధార్ డేటా.. యూఐడీఏఐ ద్వారా ధృవీకరణ పొందాల్సిన అవసరం ఉందని తప్పకుండా గమనించాలి.ఇదీ చదవండి: ఐదు ఏఐ కోర్సులు.. పూర్తిగా ఉచితంఆధార్ లింక్ ఎలా?ఉమాంగ్ యాప్ ఉపయోగించి ఆధార్ లింక్ చేయాలనుకునే వారు ఈ కింద దశలను అనుసరించి.. ఆధార్ లింక్ చేసుకోవచ్చు.➤యాప్ ఓపెన్ చేసిన తరువాత మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయలి.➤తరువాత యూఏఎన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ వెరిఫై చేయాలి. ➤ఆధార్ వివరాలను ఎంటర్ చేయాలి. ➤ఆధార్ వివరాలను ఎంటర్ చేసిన తరువాత.. ఆధార్ నెంబరుకు లింక్ అయిన మొబైల్ & ఈమెయిల్కు వచ్చిన ఓటీపీ ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ➤ఇవన్నీ పూర్తిగా తరువాత ఆధార్ UANతో లింక్ అవుతుంది.

ట్రంప్-పుతిన్ల భేటీపై భారత్ స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ల మధ్య అలస్కాలో జరిగిన సమ్మిట్ను భారత్ స్వాగతించింది. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సుదీర్ఘంగా సాగిన సమావేశాన్ని భారత్ అభినందించింది. రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న దీర్ఘ కాలిక యుద్ధానికి ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎక్కడైనా శాంతికి తొలి అడుగు పడాలంటే అది చర్చల ద్వారానే సాధ్యమవుతుందన్నారు భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.‘అమెరికా-రష్యా అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశం పురోగతిని భారత్ అభినందిస్తుంది. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే ముందుకు వెళ్లడం మంచి పరిణామం. ఉక్రెయిన్ దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న యుద్ధానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.కాగా, అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) అర్థరాత్రి గం. 12.30 ని.లు దాటాకా ఇరువురి అధ్యక్షుల మధ్య దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసిపోయింది వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్ చివరలో ట్విస్ట్ ఇచ్చారు.కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. తాను మళ్లీ పుతిన్ను కలుస్తానని చెప్పుకొచ్చారు.మరొకవైపు ఒప్పందం చేసుకోవాలని జెలెన్స్కీకి సూచిస్తానని ట్రంప్ తెలిపారు. కానీ ఏం జరుగుతుందో తెలియదన్నారు. ‘రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్-జెలెన్స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు ట్రంప్.

రూ.14 వేల కోట్లను విరాళమిచ్చేసిన బిలియనీర్, కారణం ఏంటో తెలుసా?
యాడ్-టెక్ కంపెనీ అయిన యాప్ నెక్సస్ (AppNexus) కో ఫౌండర్, మాజీ సీఈఓ బ్రియాన్ ఓ కెల్లీ (Brian O'Kelley) భారీ విరాళాన్ని ప్రకటించారు. 2018లో తన కంపెనీ విక్రయం ద్వారా వచ్చిన 1.6 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని (రూ. 14,036.64 కోట్లు)ఎక్కువ భాగాన్ని విరాళంగా ఇచ్చేశాననివెల్లడించారు. ప్రపంచమంతా కోట్లకు పడలెత్తాలని, రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్లుగా, బిలియనీర్లుగా ఎదగాలని కలలుకంటోంటే.. ఈయన మాత్రం తనకు బిలియనీర్ల మీద పెద్దగా మోజులేదని చెప్పుకురావడం విశేషం.ఫార్చ్యూన్ మ్యాగజైన్ వివరాల ప్రకారం.. 2018లో తన కంపెనీని అమ్మడం ద్వారా 1.6 బిలియన్ డాలర్ల సంపాదన వచ్చింది. అందులో ఎక్కువ భాగాన్నిఛారిటీకి ఇచ్చేశారు. కంపెనీలో 10 శాతం వాటా ఉన్న బ్రియాన్ ఓ కెల్లీ తన కుటుంబం కోసంకేవలం 100 మిలియన్ డాలర్ల సంపాదన ఉంచుకున్నట్లు తెలిపారు. తన భార్యతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని, కుటుంబ అవసరాలకు ఎంత డబ్బు కావాలో తన సలహా మేరకే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చదవండి: గ్రాండ్మా, మోటీ.. పట్టించుకోలే : కానీ ఏడాదిలో 23 కిలోలు తగ్గాఅంతేకాదు తాను బిలియనీర్లను నమ్మననీ, ఇది రెడిక్యులస్గా అనిపిస్తుందనీ అందుకే తన పిల్లలు కూడా పరిమితులు తెలుసుకుని, విలువలతో కూడిన జీవితాన్ని గడపాలనేదే తనఉద్దేశమని చెప్పుకొచ్చారు. వారికి విలాసవంతమైన జీవితం ఇవ్వాలను తాను అస్సలు భావించలేదన్నారు.న్న నిజమైన సంపద జవాబుదారీతనంతో రావాలని,ఆర్థిక సరిహద్దులతో జీవించడం ప్రజలను నిజాయితీగా, బాధ్యతాయుతంగా ఉంచుతుందంటా రాయాన.ఇదీ చదవండి: నిన్నగాక మొన్న నోటీసులు, యూట్యూబర్ రెండో భార్య రెండో ప్రెగ్నెన్సీ ప్రస్తుతం సప్లయ్ ఉద్గారాలను ట్రాక్ చేయడంపై దృష్టి సారించిన కొత్త స్టార్టప్, స్కోప్3కి నాయకత్వం వహిస్తున్న ఓ'కెల్లీ, తన తదుపరి వెంచర్ విజయవంతమైనా, తనకు బిలియనీర్ అయ్యే ప్రణాళికలు లేవనిప్రకటించడం గమనార్హం.

పక్కా ఏవిడెన్స్.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బాగోతం బట్టబయలు
హర్యానాకు చెందిన ప్రముఖ మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినట్లు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. యూట్యూబర్పై 2,500 పేజీల ఛార్జ్షీట్ను హిసార్ కోర్టులో దాఖలైంది. ఆమె గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు నిర్థారించేందుకు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయంటూ సిట్ చార్జ్షీట్లో పేర్కొంది.జ్యోతి మల్హోత్రాపై అఫిషియల్ సీక్రెట్స్ చట్టంలోని సెక్షన్లు 3, 5తో పాటు బీఎన్ఎస్లోని సెక్షన్ 152 కింద కేసు నమోదైంది. ఈ చార్జ్షీట్ను పరిశీలించిన అనంతరం న్యాయపరంగా స్పందిస్తామంటూ ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణ ఆగస్టు 18న జరగనుంది. హర్యానాలోని హిసార్ ప్రాంతానికి చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ‘ట్రావెల్ విత్ జో’ పేరిట ట్రావెల్ వ్లాగ్ నడిపేంది. ఆమెపై పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో.. మూడు నెలల పాటు సిట్ అధికారులు విచారణ చేశారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ హైకమిషన్లోని అధికారులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు.పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేశారన్న తీవ్ర ఆరోపణలతో అరెస్టయిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో హర్యానా పోలీసులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి సుమారు 2,500 పేజీలతో కూడిన చార్జ్షీట్ను హిసార్ కోర్టులో సిట్ శనివారం దాఖలు చేసింది. ఆమె గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు నిర్ధారించేందుకు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని సిట్ చార్జ్షీట్లో పేర్కొంది.ఆమె ఐఎస్ఐ ఏజెంట్లు షాకిర్, హసన్ అలీ, నాసిర్ ధిల్లన్లతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. 2024లో పాకిస్తాన్, చైనా, నేపాల్ దేశాలకు ఆమె ప్రయాణించిన వివరాలను పోలీసులు చార్జ్షీట్లో నమోదు చేశారు. పాకిస్తాన్లో ఆమె మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మేరియం షరీఫ్ను కలిసినట్లు సమాచారం. ఆమె మొబైల్ ఫోన్, డిజిటల్ డేటా ద్వారా గూఢచర్యానికి సంబంధించిన పలు ఆధారాలను పోలీసులు సేకరించారు.కాగా, జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు అనుకూలంగా గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే పాకిస్తాన్ సైనిక నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కు భారతదేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని చేరవేశారని జ్యోతిపై పోలీసులు అధికార రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లోని ఒక ఉద్యోగితో జ్యోతి రహస్య సమాచారాన్ని పంచుకోగా.. ఈ పాకిస్తానీ అధికారిని మే 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం తక్షణం భారత్ను వీడాలని ఆదేశించడం తెల్సిందే. పంజాబ్ పోలీసుల దర్యాప్తులో జ్యోతి విషయం వెలుగులోకి వచ్చింది.హిస్సార్కు చెందిన జ్యోతి ‘ట్రావెల్ విత్ జో’పేరిట ఒక యూట్యూబ్ ఛానెల్ను నడిపేది. ఈ ఛానెల్కు 3.77 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ట్రావెల్ బ్లాగర్గా ఉంటూ దేశంలోని పలు ప్రాంతాలను పర్యటిస్తూ ఎన్నో వీడియోలు తీసి పోస్ట్చేశారు. ఈమె ట్రావెల్విత్జో1 ఇన్స్టా గ్రామ్ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. మే 16న జ్యోతిపై సివిల్ లైన్స్ పోలీస్స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం జ్యోతి రెండేళ్ల క్రితం పాకిస్తాన్ వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు వెళ్లింది.అక్కడ ఎహ్సాన్ ఉర్ రహీమ్ అలియాస్ డ్యానిష్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత వీసా లభించాక మూడు సార్లు పాకిస్తాన్కు వెళ్లి వచ్చింది. ఆ సమయంలో డ్యానిష్ ఆదేశానుసారం అలీ అహా్వన్ అనే వ్యక్తి ఈమెకు పాక్లో బస, రవాణా ఏర్పాట్లుచేశాడు. పాకిస్తాన్లో పర్యటించిన కాలంలో జ్యోతి అక్కడి ఐఎస్ఐ అధికారులను కలిసింది. షకీర్, రాణా షహ్బాజ్లతో పరిచయం పెంచుకుంది. షహ్బాజ్ ఫోన్నంబర్ను ఎవరూ గుర్తుపట్టకుండా తన స్మార్ట్ఫోన్లో జాట్ రంధావా అనే వేరే పేరుతో సేవ్చేసింది.వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాప్ యాప్లలో మాత్రమే వివరాలు పంపించేది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు తరచూ వెళ్తూ అక్కడ డ్యానిష్ను ఎక్కువగా కలిసేది. అతని ద్వారా పాకిస్తానీ నిఘా బృందాలతో సంప్రతింపులు జరిపి భారత్కు చెందిన సున్నిత సమాచారాన్ని చేరవేసేది. డ్యానిష్ తో ఈమెకు శారీరక సంబంధం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి ఇండోనేసియాలోని బాలీ ద్వీపానికీ వెళ్లొచ్చారు. ఇటీవల పాకిస్తాన్ అనుకూల వీడియోలు తీసి పోస్ట్చేసింది. పాక్లో కతాస్ రాజ్ టెంపుల్ సహా పలు హిందూ ఆలయాల్లో వీడియోలు తీసి పాకిస్తాన్ పట్ల ఇండియన్లలో మంచి అభిప్రాయం పెరిగేందుకు ప్రయత్నించింది.

విరాట్, రోహిత్ రిటైర్మెంట్ వెనుక కుట్ర..? మాజీ ప్లేయర్ సంచలన కామెంట్స్
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. భారత క్రికెట్కు డాదాపు 16 ఏళ్ల పాటు తమ సేవలను అందించిన ఈ ఇద్దరి లెజెండరీ క్రికెటర్లకు సరైన వీడ్కోలు మాత్రం లభించింది.ఈ కోవకు చెందిన వారే టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు. వారిద్దరూ కూడి ఎటువంటి వీడ్కోలు లేకుండా తమ టెస్టు కెరీర్లను ముగించారు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్, కోహ్లిలు వారం రోజుల వ్యవధిలో టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అందిరికి షాకిచ్చారు.ఈ సీనియర్ ద్వయం లేకుండానే ఇంగ్లండ్కు వెళ్లిన భారత జట్టు ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో సమంగా ముగించింది. అయితే తాజాగా రోహిత్, కోహ్లి రిటైర్మెంట్లపై భారత మాజీ ఆల్ రౌండర్ కర్సన్ ఘావ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐలో రాజకీయాల వల్లే వారిద్దరూ త్వరగా రిటైరయ్యారని ఆయన ఆరోపించాడు."వరల్డ్ క్రికెట్లో ప్రస్తుతం అత్యంత ఫిట్గా ఉండే క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఒకడు. మరో మూడేళ్ల పాటు భారత జట్టు తరపున ఆడే సత్తా కోహ్లికి ఉంది. అటువంటిది ఆకస్మికంగా కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడం వెనక కొన్ని శక్తులు ఉన్నాయని నేను అనుకుంటున్నాను.అంతేకాకుండా సుమారు 14 ఏళ్ల పాటు భారత జట్టుకు తన సేవలను అందించిన విరాట్కు బీసీసీఐ కనీసం ఫేర్వెల్ కూడా ఏర్పాటు చేయలేదు. కోహ్లి, రోహిత్ వంటి ఆటగాళ్లు ఘనమైన వీడ్కోలుకు ఆర్హులు. ఇది బీసీసీఐలోని అంతర్గత రాజకీయాల కారణంగా జరిగింది.దీనిని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ కారాణాలతోనే కోహ్లి త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ కూడా కావాలనుకుంటే మరి కొన్నాళ్ల పాటు ఆడేవాడు. కానీ కొంత మంది బీసీసీఐ పెద్దలు అతడిని జట్టు నుంచి బయటకు పంపాలని చూశారు. వారు కోరుకున్న విధంగానే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడని" విక్కీ లాల్వానీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘావ్రీ పేర్కొన్నాడు.

రష్యా చమురుకి భారత్ దూరమైంది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చమురు కొనుగోళ్ల విషయంలో రష్యాకు భారత్ దూరమైందని ప్రకటించారు. అదే సమయంలో.. భవిష్యత్తులో భారత్పై అదనపు సుంకాలు విధించే ఆలోచన కూడా తనకేం పెద్దగా లేదని స్పష్టం చేశారు.అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ట్రంప్ ఉక్రెయిన్ శాంతి చర్చలపై భేటీ జరిపిన సంగతి తెలిసిందే. అయితే భేటీకి ముందు విమాన ప్రయాణంలో ది ఫాక్స్న్యూస్కు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అతను(రష్యా అధినేత పుతిన్ను ఉద్దేశించి) ఇప్పటికే ఓ క్లయింట్ను కోల్పోయారు. అది 40 శాతం కొనుగోళ్లు జరిపే భారత దేశం. చైనా గురించి కూడా తెలిసిందే. ఆ దేశం కూడా రష్యాతో బాగానే వాణిజ్యం జరుపుతోంది. ఒకవేళ.. పరోక్ష ఆంక్షలు, అదనపు సుంకాలు గనుక విధించాల్సి వస్తే.. అది ఆ దేశాల దృష్టిలో చాలా విధ్వంసకరంగా ఉంటుంది. అందుకే అవసరం అయితే చేస్తాను. అవసరం లేకపోతే ఉండదు’’ అని అన్నారాయన.Trump says he may not impose 25% tariffs on India (to kick in from 27 August) for buying Russian oil..Trump: "They lost oil client India which was doing about 40% of the oil & China's doing a lot, if I did a secondary tariff it would be devastating, if I have to I will, may be… pic.twitter.com/dhyC7RpHNh— Dhairya Maheshwari (@dhairyam14) August 16, 2025అదే సమయంలో.. అలస్కా భేటీ తర్వాత కూడా ట్రంప్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు కొంటున్న దేశాలపై సుంకాలు గురించి మళ్లీ ఆలోచిస్తానని, రెండు-మూడు వారాల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ట్రంప్ తాజా ప్రకటనపై ఢిల్లీ వర్గాలు స్పందించాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. రష్యాతో చమురు కొనుగోళ్ల నేపథ్యంతో భారత్పై ట్రంప్ జులై 30వ తేదీన 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్ మిత్రదేశమైనప్పటికీ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు సజావుగా లేవని.. పైగా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా చమురు, ఆయుధాల కొనుగోళ్ల ద్వారా పరోక్ష ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో.. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆ 25 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. అయితే తాను చెప్పినా కూడా భారత్ రష్యా ఆయిల్ కొనుగోళ్లు ఆపలేదంటూ ఆగస్టు 6వ తేదీన మరో 25 శాతం పెనాల్టీ సుంకం విధించారు. దీంతో భారత్పై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరింది. పెరిగిన ఈ 25 శాతం ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ట్రంప్ 50 శాతం సుంకాలను భారత్ అన్యాయమని పేర్కొంది. సుంకాలను తాము పట్టించుకోబోమని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా.. ఎనర్జీ భద్రత, ధరల లాభం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే.. రష్యాతో చమురు వాణిజ్యం విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటిదాకా వెనక్కి తగ్గలేదు. ఆయిల్ కొనుగోళ్లు ఆపేసినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ఏం ప్రకటించలేదు. అమెరికా టారిఫ్లతో బెదిరిస్తున్నప్పటికీ రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయలేదని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ ఏఎస్ సాహ్ని తెలిపారు. ‘‘‘మాకు రష్యా నుంచి చమురు కొనమని కానీ కొనొద్దనీ కానీ ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. అలాగే రష్యా చమురు దిగుమతులను పెంచుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు మేం ప్రయత్నాలు కూడా చేయడం లేదు’’ అని అన్నారాయన. రష్యా చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు యథాతథంగానే కొనసాగిస్తున్నాయని, జులైలో ఇది రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లుగా ఉంటే.. ఆగస్టులో రోజుకు 2 మిలియన్ బ్యారెళ్లకు పెరిగిందని ఓ నివేదిక వెలువడింది. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా కనిపిస్తోంది. ట్రంప్ 50 శాతం టారిఫ్ల ప్రభావంతో తాత్కాలికంగా కొంత తగ్గినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం.. తదితర సంస్థలు రష్యన్ ఆయిల్ను స్పాట్ మార్కెట్ నుంచి కొనడం ఆపేశాయని, రిలయన్స్, నారాయణ ఎనర్జీ లాంటి కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రం దీర్ఘకాలిక ఒప్పందాలకు అనుగుణంగా కొనుగోళ్లను యధాతథంగా జరుపుతున్నాయన్నది ఆ కథనాల సారాంశం.

కోహ్లీ కొత్త క్యాంపెయిన్.. ఎందుకంటే..
ఇంట్లో గోడలకు సాధారణంగా మరకలు పడుతుంటాయి. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వాటిని శుభ్రం చేసేందుకు ఎక్కవ కష్టపడాల్సి ఉంటుంది. దీనికి పరిష్కారంగా ఏషియన్ పెయింట్స్ కొత్త టెక్నాలజీ ఉపయోగించి నూతన రంగులను తయారు చేస్తున్నట్లు తెలిపింది. తన రంగుల్లో లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీతో పని చేసే ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్ అనే సరికొత్త ఆవిష్కరణను పరిచయం చేస్తున్నట్లు ఏషియన్ పెయింట్స్ చెప్పింది.ఈ అత్యాధునిక ప్రీమియం ఇంటీరియర్ పెయింట్స్ మెరుగైన స్టెయిన్ రిపెల్లెన్సీ, ఫ్లేమ్ రెసిస్టెన్స్, మెరుగైన సౌందర్యాన్ని అందిస్తాయని ఏషియన్ పెయింట్స్ తెలిపింది. దీన్ని వినియోగదారుల ఆధునిక జీవనం కోసం రూపొందించిన్నట్లు పేర్కొంది. గతంలో ఏషియన్ పెయింట్స్ అల్టిమా ప్రోటెక్ట్ ద్వారా గోడల లామినేషన్ ప్రొటెక్షన్ కోసం గ్రాఫీన్ను ఉపయోగించింది. రాయల్ వేరియంట్లో టెఫ్లాన్ ఆధారిత స్టెయిన్ రెసిస్టెన్స్ను ప్రవేశపెట్టింది. తాజాగా ఏషియన్ పెయింట్స్ ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్లో అధునాతన లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీని ఆవిష్కరించినట్లు తెలిపింది.సహజంగా శుభ్రపరుచుకునే సామర్థ్యాలు కలిగిన తామర ఆకు నుంచి ప్రేరణ పొంది లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీని రూపొందించినట్లు ఏషియన్ పెయింట్స్ తెలిపింది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది ఇంటి గోడలకు రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. రోజువారీ మరకలు కనిపించకుండా లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీ పని చేస్తుంది. కాఫీ, సాస్, క్రేయాన్లు.. వంటి మరకలు గోడపై ఉన్నప్పుడు చాలా తక్కువ శ్రమతోనే వాటిని శుభ్రం చేసేందుకు ఎంతో తోడ్పడుతుంది. ఇది సమకాలీన భారతీయ గృహాలకు అనువైన పరిష్కారంగా ఉంది. ఈ పెయింట్ ఫ్లేమ్ రెసిస్టెన్స్ లక్షణాలను కూడా కలిగి ఉంది. ఇది ఇంట్లో సువాసనలను సైతం వ్యాపింపజేస్తుంది. మాట్, షైన్ ఫినిషింగ్ రెండింటిలోనూ ఈ రంగులు లభిస్తాయి. ఆరు సంవత్సరాల వారంటీతోపాటు మన్నిక, సంరక్షణ అత్యున్నత ప్రమాణాలను అందిస్తుంది.ఈ సందర్భంగా ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ అమిత్ సింగ్లే మాట్లాడుతూ..‘ఏషియన్ పెయింట్స్లో గృహాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో అర్థం చేసుకోవడానికి మేము చాలా సమయం వెచ్చిస్తాం. నేటి వినియోగదారులకు నిజంగా అవసరమైన వాటి చుట్టే మా ఆవిష్కరణలు ఉంటాయి. వేడుకలు, పిల్లలు, పెంపుడు జంతువులు, దైనందిన కార్యక్రమాలతో నేడు ఇళ్లు కళకళలాడుతున్నాయి. ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్ దాని లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీతో మేము ఈ వాస్తవికతకు సరిపోయే పరిష్కారాన్ని సృష్టించాం. ఇది గోడలను శుభ్రంగా ఉంచి ఒత్తిడిని తొలగిస్తుంది. దాని ఉత్తమ స్టెయిన్ రిపెల్లెన్సీకి ధన్యవాదాలు. ఇది తెలివైన, మరింత అప్రయత్నమైన జీవనం వైపు సాగే అడుగు. ఇక్కడ గృహాలు సొగసైనవి. రోజువారీ దుస్తులను సులభంగా హ్యాండిల్ చేస్తాయి’ అని చెప్పారు.ఏషియన్ పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీ నటించిన కొత్త యాడ్ ఫిల్మ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతోంది. బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీ నటించిన కొత్త యాడ్ ఫిల్మ్ దీనికి మద్దతు ఇస్తుంది. ఈ యాడ్లో అతను ఉత్పత్తుల ఆకర్షణ, శక్తితో జీవం పోస్తాడు. ఈ యాడ్ ఉల్లాసకరమైన, సాపేక్షమైన సెట్టింగ్ను చూపిస్తుంది. ఇక్కడ కోహ్లీ అందంగా డిజైన్ చేసిన ఇంటిని జ్యూస్, మిల్క్ షేక్స్ మరెన్నో పదార్థాలతో ఒక పిల్లవాడిలా పరీక్షిస్తాడు. ప్రతి పరీక్షలో ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్ థీమ్స్ను సులభంగా నిర్వహిస్తుంది. ఆ పదార్థాల మరకలు స్థిరపడకముందే నిలుపుదల చేస్తుంది. ఈ లాంచ్తో ఏషియన్ పెయింట్స్ సూపర్ ప్రీమియం ఇంటీరియర్ పెయింట్ విభాగంలో మరోసారి కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. పెయింట్స్, అలంకరణ విషయానికి వస్తే బ్రాండ్ పరిశ్రమలో పాల్గొనడమే కాకుండా దాని భవిష్యత్తును రూపొందిస్తోందని చూపిస్తుంది.

మీకో, మీ మంత్రికో, మీ ఎమ్మెల్యేకో జరిగితే ఇలాగే చేస్తారా?
జమ్ము కశ్మీర్ కిష్తవాడ్ జిల్లా చోసితీ గ్రామంలో ఫ్లాష్ఫ్లడ్ సహాయక చర్యలు మూడో రోజుకి చేరాయి. ఇప్పటిదాకా 60 మంది మరణించగా.. గల్లంతైన 80 మంది కోసం(ఆ సంఖ్యే ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది) గాలింపు కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు. అదే సమయంలో స్థానికుల ఆగ్రహమూ తారాస్థాయికి చేరింది. అందుకు అక్కడి ప్రజాప్రతినిధులు తీరే కారణంగా తెలుస్తోంది.గురువారం మధ్యాహ్నాం క్లౌడ్బరస్ట్ కారణంగా మెరుపు వరదలు చోసితీని ముంచెత్తాయి. బురద నుంచి శకలాలను తొలగిస్తున్న కొద్దీ.. మృతదేహాలు బయటపడుతూ వస్తున్నాయి. దీంతో గల్లంతైన వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. జమ్ము కశ్మీర్ ఒమర్ అబ్దుల్లా శనివారం ఆ ప్రాంతంలో పర్యటించగా.. స్థానికుడి నుంచి ఆయనకు నిలదీత ఎదురైంది.‘‘పోలీసులు, సైన్యం మా వాళ్ల జాడ కోసం అహర్నిశలు ఇక్కడ కష్టపడుతున్నారు. మేమూ మాకు చేతనైన ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడ 20 జేసీబీలు ఉన్నాయి.కానీ, ఇందులో రెండే పని చేస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు పదే పదే ఇక్కడికి వస్తున్నారు. ఫొటోలకు ఫోజులిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గత మూడురోజుల్లో ఇక్కడ రెండే రెండు పెద్ద బండరాళ్లను తొలగించారంటే పరిస్థతి అర్థం చేసుకోండి. మాకు కుటుంబాలు లేవా?. కనీసం మా వాళ్ల శవాలనైనా మాకు అప్పగించండి’’ అని ఎన్డీటీవీతో బాధితుడొకరు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సరిగ్గా అదే సమయంలో సీఎం ఒమర్ అబ్దుల్లా అటుగా వచ్చారు. ఏం జరిగిందో చెప్పమంటూ ఆ వ్యక్తిని ఆరా తీశారు.జరిగిందంతా చెప్పి.. కనీసం తమవాళ్ల మృతదేహాలనైనా అప్పగించాలని కోరాడా వ్యక్తి. జరుగుతోంది అదేనని.. ఘటన జరిగిన నాటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆ వ్యక్తికి సీఎం బదులిచ్చారు. ఈ క్రమంలో.. అతను మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ‘‘సర్.. నేను చెప్పేది ఓసారి వినండి. నా కుటుంబం నుంచి 13 మంది జాడ లేకుండా పోయారు(తమ పిల్లల ఆచూకీ లేదంటూ పలువురు ఆ సమయంలో గట్టిగా రోదించారు). ఎమ్మెల్యేలు, మంత్రులు పది పదిసార్లు ఇక్కడికి వస్తున్నారు. జేసీబీలను ఆపేయించి ఫొటోలు దిగుతున్నారు. మేం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నాం’’ అని వివరించాడు. విషాదంతో చాలా కుటుంబాలు బాధపడుతున్నాయని, అది తాను అర్థం చేసుకోగలనని సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దీంతో ఆ యువకుడు.. మీకో, మీ ఎమ్మెల్యేకో, మీ మంత్రికో జరిగితే ఇలాగే చేస్తారా?.. త్వరగతిన చర్యలు తీసుకుంటారు కదా అని నిలదీశాడా వ్యక్తి. దీంతో అధికారులను పిలిపించిన సీఎం ఫరూక్ అబ్దుల్లా.. సహాయక చర్యలు త్వరగతిన జరిగేలా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థిని ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం
మ్యాక్స్వెల్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ఆసీస్
Mumbai Airport: రన్వేను తాకిన విమానం తోక భాగం
చీరలో జాన్వీ అలా.. జపాన్లో మీనాక్షి ఇలా
సర్కారు డాక్టర్లూ.. ఇదేం పద్ధతండీ
నగరం నలువైపులా భారీ లేఅవుట్లు.. కొత్త వెంచర్లు..
మంచిరోజు చూసి గుడ్ న్యూస్ చెప్పిన నితిన్
‘అమరావతిని లేపడానికి పొన్నూరును ముంచేశారు’
రిషబ్ పంత్ గాయం ఎఫెక్ట్.. సరికొత్త రూల్ను తీసుకురానున్న బీసీసీఐ!
ట్రంప్-పుతిన్ల భేటీపై భారత్ స్పందన
జియో కొత్త ప్లాన్ వచ్చింది.. చవగ్గా 28 రోజులు వ్యాలిడిటీ
ఉచిత బస్సు పథకం.. అసలు రంగు ఇదే!
మీరేమైనా యుద్ధానికి వెళ్తున్నారా?.. వాహనాలకు ఆ రంగులేంటి?
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
కాల్చిపడేస్తా ఖబడ్దార్!
సచిన్కు కాబోయే కోడలు సానియా ఆస్తి ఎంతో తెలుసా?
రాత్రుళ్లు నిద్రపోడు, 60ఏళ్ల హీరో సూపర్ ఫిట్
వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!
మళ్లీ సెలవులొచ్చాయ్.. ఈ శుక్రవారం ఓటీటీల్లో 26 సినిమాలు!
టాలీవుడ్ యాంకర్ లాస్య వరలక్ష్మీ వ్రతం.. ఫోటోలు
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి శుభవార్తలు.. వాహనయోగం
విరిగిపడిన కొండ చరియలు.. హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జాం
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం.. తొలి రోజే వార్-2కు షాకింగ్ కలెక్షన్స్!
ఈ రాశి వారికి రాబడి పెరుగుతుంది.. సంఘంలో విశేష గౌరవం
‘వార్ 2 ’మూవీ రివ్యూ
బుడమేరులో బోగస్ ఆపరేషన్!
మనమెందుకు భుజాలు తడుముకోవాలి.. అననివ్వండి సార్!!
దేశ ప్రజలకు శుభవార్త.. ట్యాక్స్పై ప్రధాని మోదీ కీలక ప్రకటన
కెప్టెన్గా రుతురాజ్పై వేటు.. జట్టులో పృథ్వీషాకు చోటు
మామూలు సమయంలోనే కనపడరు.. ఇక ఇప్పుడొచ్చి ఎలా ఆదుకుంటారనుకుంటున్నావ్!
విద్యార్థిని ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం
మ్యాక్స్వెల్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ఆసీస్
Mumbai Airport: రన్వేను తాకిన విమానం తోక భాగం
చీరలో జాన్వీ అలా.. జపాన్లో మీనాక్షి ఇలా
సర్కారు డాక్టర్లూ.. ఇదేం పద్ధతండీ
నగరం నలువైపులా భారీ లేఅవుట్లు.. కొత్త వెంచర్లు..
మంచిరోజు చూసి గుడ్ న్యూస్ చెప్పిన నితిన్
‘అమరావతిని లేపడానికి పొన్నూరును ముంచేశారు’
రిషబ్ పంత్ గాయం ఎఫెక్ట్.. సరికొత్త రూల్ను తీసుకురానున్న బీసీసీఐ!
ట్రంప్-పుతిన్ల భేటీపై భారత్ స్పందన
జియో కొత్త ప్లాన్ వచ్చింది.. చవగ్గా 28 రోజులు వ్యాలిడిటీ
ఉచిత బస్సు పథకం.. అసలు రంగు ఇదే!
మీరేమైనా యుద్ధానికి వెళ్తున్నారా?.. వాహనాలకు ఆ రంగులేంటి?
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
కాల్చిపడేస్తా ఖబడ్దార్!
సచిన్కు కాబోయే కోడలు సానియా ఆస్తి ఎంతో తెలుసా?
రాత్రుళ్లు నిద్రపోడు, 60ఏళ్ల హీరో సూపర్ ఫిట్
వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!
మళ్లీ సెలవులొచ్చాయ్.. ఈ శుక్రవారం ఓటీటీల్లో 26 సినిమాలు!
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి శుభవార్తలు.. వాహనయోగం
విరిగిపడిన కొండ చరియలు.. హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జాం
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం.. తొలి రోజే వార్-2కు షాకింగ్ కలెక్షన్స్!
ఈ రాశి వారికి రాబడి పెరుగుతుంది.. సంఘంలో విశేష గౌరవం
‘వార్ 2 ’మూవీ రివ్యూ
బుడమేరులో బోగస్ ఆపరేషన్!
మనమెందుకు భుజాలు తడుముకోవాలి.. అననివ్వండి సార్!!
దేశ ప్రజలకు శుభవార్త.. ట్యాక్స్పై ప్రధాని మోదీ కీలక ప్రకటన
కెప్టెన్గా రుతురాజ్పై వేటు.. జట్టులో పృథ్వీషాకు చోటు
మామూలు సమయంలోనే కనపడరు.. ఇక ఇప్పుడొచ్చి ఎలా ఆదుకుంటారనుకుంటున్నావ్!
రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ
సినిమా

డాగ్ లవర్స్.. ఈ వీడియో చూడండి: ఆర్జీవీ
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కుక్కడ బెడద ఎక్కువైపోయింది. వీధి కుక్కల దాడిలో పలువురు యువకులు, చిన్న పిల్లలు తీవ్రంగా గాయపడుతున్నారు. దీంతో సుమోటోగా కేసు తీసుకున్న సుప్రీం కోర్టు.. 8 వారాల్లోగా నగరంలోని వీధి కుక్కలన్నింటిని షెల్టర్లకు తరలించాలని ఆగస్ట్ 11న ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు దీన్ని అడ్డుకోవాలని జంతు ప్రేమికులు ప్రయత్నిస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుని పలువురు జంతు ప్రేమికులు తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా వేదికగా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇందులో సదా, జాన్వీ కపూర్, సోనాక్షి సిన్హా లాంటి సినీ తారలు కూడా ఉన్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma ) వీరందరికి కౌంటర్ ఇస్తూ ఓ ట్వీట్ చేశాడు.వీధి కుక్కల దాడిలో చనిపోయిన ఓ చిన్నారికి సంబంధించిన వీడియోని ఎక్స్లో షేర్ చేస్తూ.. ‘సుప్రీంకోర్టు తీర్పుపై ఏడుస్తున్న డాగ్ లవర్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ ఒక నగరం మధ్యలో పట్టపగలు నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది. పలువురు నెటిజన్స్ ఆర్జీవీ పోస్ట్కి మద్దతు తెలుపుతున్నారు. గతంలో ఇలాంటివి చాలా జరుగాయంటూ ఆయా వీడియోలను షేర్ చేస్తున్నారు. To all the DOG LOVERS who are crying hoarse on the SUPREME court’s judgement on STRAY DOGS , please check this video , where a 4 year old boy was killed by street dogs in broad day light in the middle of a city pic.twitter.com/DWtVnBchvQ— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2025

'కూలీ'తో సక్సెస్.. కాస్ట్లీ కారు కొన్న నటుడు
రీసెంట్గా వచ్చిన 'కూలీ' సినిమా.. ప్రేక్షకుల్ని అలరిస్తోంది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. వీకెండ్ కావడంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. అయితే ఈ చిత్రంలో అందరికంటే మలయాళ నటుడు సౌబిన్ షాహిర్.. యాక్టింగ్లో ఎక్కువ మార్కులు కొట్టేశాడు. తనదైన నటనతో కట్టిపడేశాడు. అలా అందరి ప్రశంసలు అందుకుంటున్న ఇతడు.. ఇప్పుడు కోట్లు విలువ చేసే ఖరీదైన కారు కొనేశాడు. ఇంతకీ దీని ధర ఎంతంటే?(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)ఓటీటీల్లో మలయాళ డబ్బింగ్ సినిమాలు చూసే తెలుగు ఆడియెన్స్కి సౌబిన్ చాలా ఏళ్లుగా పరిచయమే. అప్పుడెప్పుడో వచ్చిన 'ప్రేమమ్' నుంచి గతేడాది రిలీజైన 'మంజుమ్మల్ బాయ్స్' వరకు ఎన్నో చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు 'కూలీ' సినిమాతో దక్షిణాది ప్రేక్షకుల్ని పలకరించాడు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే సినిమాలో తన సక్సెస్ని ముందే అంచనా వేశాడో ఏమో గానీ ఈ మధ్యే బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ కారుని కొనుగోలు చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ కారు విలువ ప్రస్తుతం మార్కెట్లో రూ.3.30 కోట్లు వరకు ఉంది. తన కుటుంబంతో కలిసి సౌబిన్.. కారులో షికారుకి వెళ్లాడు. ఆ విజువల్స్ వీడియోలో చూడొచ్చు. 'కూలీ'తో అటు తమిళం, ఇటు తెలుగు దర్శకుల దృష్టిలో సౌబిన్ పడ్డాడు. మరి రాబోయే రోజుల్లో తెలుగు మూవీస్లోనూ ఇతడికి అవకాశాలు రావడం గ్యారంటీలానే కనిపిస్తోంది.(ఇదీ చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Roadway Cars (@roadwaycars)

సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన 'కూలీ', 'వార్ 2'కి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ వీకెండ్, సెలవులు కలిసి రావడంతో జనాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఓటీటీల్లోనూ పలు కొత్త సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో చాలా వరకు డబ్బింగ్ చిత్రాలే ఉన్నాయి. అయితే ఎలాంటి ప్రకటన లేకుండా రెండు తెలుగు మూవీస్ కూడా స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. ఇంతకీ ఏంటవి? ఎందులో చూడొచ్చు?గత నెల తొలివారం థియేటర్లలోకి వచ్చిన 'వర్జిన్ బాయ్స్' సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. కాకపోతే ఐఫోన్, డబ్బులు గిఫ్ట్స్ అనే ప్రమోషన్లతో వార్తల్లో నిలిచింది. అడల్ట్ కాన్సెప్ట్, యువతని టార్గెట్ చేసుకుని తీసిన ఈ చిత్రం.. ఇప్పుడు ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లోకి వచ్చేసింది. తెలుగులోకి అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: విజయ్తో రొమాంటిక్ స్టిల్.. ‘చాలా స్పెషల్’ అంటూ రష్మిక పోస్ట్)మరోవైపు ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైన 'సూర్యాపేట్ జంక్షన్' అనే తెలుగు సినిమా కూడా ఎలాంటి హడావుడి లేకుండానే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ విషయానికొస్తే.. అర్జున్ (ఈశ్వర్) కాలేజీలో చదువుతూ స్నేహితులతో జాలీ లైఫ్ గడుపుతుంటాడు. జ్యోతితో(నైనా సర్వర్) ప్రేమలో పడతాడు. మరోవైపు నరసింహ (అభిమన్యు సింగ్) ఎమ్మెల్యే అయ్యే ప్రయత్నాల్లో ఉంటాడు.అయితే అర్జున్ స్నేహితుల్లో ఒకడైన శీను.. ఓ రోజు హత్యకు గురవుతాడు. శీనుని ఎవరు చంపారు? ఆ ఘటన వెనకున్న రాజకీయ కుట్ర ఏంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఈ రెండు సినిమాలతో పాటు వీకెండ్ ఓటీటీల్లో రిలీజైన వాటిలో 'జానకి.వి vs స్టేట్ ఆఫ్ కేరళ', 'గ్యాంబ్లర్స్', 'సూపర్ మ్యాన్' తదితర చిత్రాలు కూడా ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. (ఇదీ చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ)

విడాకులతో సంతోషాన్ని వెతుక్కున్నా.. తప్పేముంది?: మలైకా
బాలీవుడ్ నటి మలైకా అరోరా (Malaika Arora) ప్రేమలో ఓడిపోతూనే ఉంది. మలైకా.. 1998లో నటుడు అర్బాజ్ ఖాన్ను పెళ్లాడింది. వీరికి 2002లో కుమారుడు అర్హాన్ ఖాన్ జన్మించాడు. మొదట్లో బాగానే ఉన్న దంపతులు తర్వాత దూరంగా ఉండటం మొదలుపెట్టారు. 2017లో విడాకులు తీసుకున్నారు. అయితే పిల్లాడి బాధ్యతను మాత్రం ఇద్దరూ తీసుకున్నారు. అనంతరం మలైకా.. నటుడు అర్జున్ కపూర్తో ప్రేమలో పడింది. దంపతులుగా విడిపోయినా..ఏళ్ల తరబడి రిలేషన్లో ఉన్న వీరు పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అని అంతా అనుకున్నారు. అంతలోనే ఈ ప్రేమప్రయాణానికి ఫుల్స్టాప్ చెప్తూ బ్రేకప్ చెప్పుకున్నారు. తాజాగా మలైకా కో పెరింటింగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోయినా పిల్లాడి కోసం తల్లిదండ్రులుగా నిలబడ్డాం. ఇప్పుడు వాడికి 22 ఏళ్లు. తల్లి దగ్గర ఏం మాట్లాడాలి? తండ్రి దగ్గర ఎలా ఉండాలి? అనేది బాగా తెలుసు. కోరుకున్నవన్నీ జరగవుకాబట్టి ఇప్పుడు పరిస్థితులు అంత జటిలంగా లేవు. ఎవరి హద్దుల్లో వాళ్లం ఉన్నాం. విడాకుల వల్ల నా కొడుకు ఎఫెక్ట్ అవకూడదనుకున్నాను. అందుకే ఇద్దరం బాధ్యతలు తీసుకున్నాం. కానీ విడాకులు ప్రకటించగానే చాలామంది ఇలా చేస్తావా? ఇలా ఉండకూడదు అంటూ నాకు నీతులు చెప్పారు. నేనేమంటానంటే కొన్నిసార్లు బంధాలనేవి జటిలంగా ఉంటాయి. నా వివాహబంధం కొనసాగాలనే కోరుకున్నాను. కానీ, అది జరగలేదు. దానికి నేనేం చేయగలను?అమ్మ కష్టాలుఅలా అని నేను ప్రేమపై విశ్వాసాన్ని కోల్పోయానని కాదు. ఏదో ఘోర తప్పిదం చేశాననీ కాదు. అందరూ తప్పంతా నాదే అన్నట్లు నావైపే వేలు చూపించారు. సెల్ఫిష్గా ఆలోచించానన్నారు. మీకలా అనిపించుండొచ్చు. కానీ, నేను ఆనందంగా ఉండాలనుకున్నాను. అందుకే ఆ బంధం నుంచి బయటకు వచ్చేశాను. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఇకపోతే నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాను. అమ్మ రోజంతా పని చేస్తూ బిజీగా ఉండేది. మాకోసం అహర్నిశలు శ్రమించింది. తన దగ్గరున్న వస్తువులమ్మేసి మరీ స్కూల్ ఫీజు కట్టేది. డబ్బు విలువ బాగా తెలుసుఅప్పుడు చెల్లిని నేనే చూసుకునేదాన్ని. కుటుంబం కోసం 17 ఏళ్లకే పని చేయడం మొదలుపెట్టాను. డబ్బు సంపాదించడమే నా లక్ష్యం. ఫ్రెండ్స్తో పార్టీలంటూ బయటకు వెళ్లేదాన్ని కాదు. ఇప్పటికీ డబ్బు విషయంలో నేనలాగే ఉంటాను. ప్రతి ఖర్చు పుస్తకంలో రాసుకుంటాను. మరీ ఖరీదైనవాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడను అని చెప్పుకొచ్చింది. కాగా 'చయ్య చయ్య' పాటతో ఫేమస్ అయిన మలైకా.. రాత్రైనా నాకు ఓకే (అతిథి), కెవ్వు కేక (గబ్బర్ సింగ్) పాటలతో టాలీవుడ్కు దగ్గరైంది.చదవండి: అగ్నిపరీక్ష.. ఏంటిది? బిగ్బాస్ వాయిస్ తేడాగా ఉందే!
క్రీడలు

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. ఆటగాళ్లకు జీతాలు కట్!?
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఫార్మాట్తో సంబంధం లేకుండా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన పాకిస్తాన్ కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. అదేవిధంగా ఇప్పటివరకు ఆడిన 11 వన్డేల్లో పాక్ తొమ్మిదింట ఓటమి పాలైంది.టీ20ల్లో మెన్ ఇన్ గ్రీన్ కాస్త ఫర్వాలేదన్పించింది. 14 మ్యాచ్లు ఆడి ఏడింట గెలుపొందింది. అయితే పాక్ జట్టు ప్రదర్శన పట్ల ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. క్రికెట్ పాకిస్తాన్ రిపోర్ట్ ప్రకారం.. ఆటగాళ్లు తీసుకునే జీతాలపై పీసీబీ కోతకు సిద్దమైనట్లు సమాచారం.కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఆటగాళ్లకు ఐసీసీ నుంచి వచ్చే రెవెన్యూలో మూడు శాతం వాటాను బోనస్గా ఇస్తోంది. వచ్చే ఏడాది నుంచి మూడు శాతం వాటాపై కోత విధించాలని పీసీబీ భావిస్తుందంట.కాగా రెండేళ్ల క్రితం కొంతమంది సీనియర్ ఆటగాళ్లు ఐసీసీ ఆదాయంలో తమకు వాటా ఇవ్వాలని పీసీబీపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే మూడు శాతం వాటాను ఆటగాళ్లకు ఇస్తూ పీసీబీ వచ్చింది. కానీ ఇప్పుడు పూర్తిగా జట్టు పరిస్థితి దిగజారిపోవడంతో పీసీబీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు సిద్దమైంది. అంతేకాకుండా ఇప్పటిలో ఆటగాళ్ల జీతాలను కూడా పెంచే యోచనలో పీసీబీ లేనట్లు తెలుస్తోంది.పాకిస్తాన్ ఆటగాళ్ల జీతాలు ఎంతంటే?అయితే ప్రస్తుతం పీసీబీ సెంట్రల్ కాంట్రాక్ట్ కేటగిరీ-ఎలో ఉన్న ఆటగాళ్లకు పాకిస్తాన్ కరెన్సీలో 4.5 మిలియన్లు లభించంనుంది. అంటే భారత కరెన్సీలో సంవత్సరానికి దాదాపు కోటిన్నర రూపాయల వరకు దక్కనుంది. అదేవిధంగా ఐసీసీ వాటా నుంచి 2.07 మిలియన్లు లభిస్తాయి. మొత్తంగా ఏ-గ్రేడ్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.2 కోట్ల పైగా అందనుంది. కేటగిరీ బీలో ఉన్న ఆటగాళ్లకు ఐసీసీ వాటా నుంచి 3 మిలియన్లు, పీసీబీ నుంచి 1.5 మిలియన్లు లభిస్తాయి. మొత్తంగా ఈ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు భారత కరెన్సీ ప్రకారం రూ.13 కోట్లపైగా దక్కనుంది. కేటగిరి సీ లోని ఆటగాళ్లకు మొత్తంగా 7 లక్షలు లభించనుంది.

విరాట్, రోహిత్ రిటైర్మెంట్ వెనుక కుట్ర..? మాజీ ప్లేయర్ సంచలన కామెంట్స్
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. భారత క్రికెట్కు డాదాపు 16 ఏళ్ల పాటు తమ సేవలను అందించిన ఈ ఇద్దరి లెజెండరీ క్రికెటర్లకు సరైన వీడ్కోలు మాత్రం లభించింది.ఈ కోవకు చెందిన వారే టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు. వారిద్దరూ కూడి ఎటువంటి వీడ్కోలు లేకుండా తమ టెస్టు కెరీర్లను ముగించారు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్, కోహ్లిలు వారం రోజుల వ్యవధిలో టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అందిరికి షాకిచ్చారు.ఈ సీనియర్ ద్వయం లేకుండానే ఇంగ్లండ్కు వెళ్లిన భారత జట్టు ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో సమంగా ముగించింది. అయితే తాజాగా రోహిత్, కోహ్లి రిటైర్మెంట్లపై భారత మాజీ ఆల్ రౌండర్ కర్సన్ ఘావ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐలో రాజకీయాల వల్లే వారిద్దరూ త్వరగా రిటైరయ్యారని ఆయన ఆరోపించాడు."వరల్డ్ క్రికెట్లో ప్రస్తుతం అత్యంత ఫిట్గా ఉండే క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఒకడు. మరో మూడేళ్ల పాటు భారత జట్టు తరపున ఆడే సత్తా కోహ్లికి ఉంది. అటువంటిది ఆకస్మికంగా కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడం వెనక కొన్ని శక్తులు ఉన్నాయని నేను అనుకుంటున్నాను.అంతేకాకుండా సుమారు 14 ఏళ్ల పాటు భారత జట్టుకు తన సేవలను అందించిన విరాట్కు బీసీసీఐ కనీసం ఫేర్వెల్ కూడా ఏర్పాటు చేయలేదు. కోహ్లి, రోహిత్ వంటి ఆటగాళ్లు ఘనమైన వీడ్కోలుకు ఆర్హులు. ఇది బీసీసీఐలోని అంతర్గత రాజకీయాల కారణంగా జరిగింది.దీనిని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ కారాణాలతోనే కోహ్లి త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ కూడా కావాలనుకుంటే మరి కొన్నాళ్ల పాటు ఆడేవాడు. కానీ కొంత మంది బీసీసీఐ పెద్దలు అతడిని జట్టు నుంచి బయటకు పంపాలని చూశారు. వారు కోరుకున్న విధంగానే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడని" విక్కీ లాల్వానీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘావ్రీ పేర్కొన్నాడు.

Asia Cup: జైస్వాల్ కాదు!.. బ్యాకప్ ఓపెనర్గా అతడే సరైనోడు!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ నేపథ్యంలో భారత జట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammed Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఖండాంతర టోర్నీలో ఓపెనర్లుగా సంజూ శాంసన్ (Sanju Samson), అభిషేక్ శర్మను కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. వికెట్ కీపర్లలోనూ మొదటి ప్రాధాన్యంగా తన ఓటు సంజూకేనని స్పష్టం చేశాడు.గిల్, జైసూ రీ ఎంట్రీ పక్కా!కాగా యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్కు ఆగష్టు 19న బీసీసీఐ తమ జట్టును ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్ల టీ20 రీఎంట్రీపై చర్చ భారత క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు గిల్, జైసూలను తిరిగి జట్టులోకి తీసుకురావాలని సూచిస్తుండగా.. కైఫ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న సంజూ- అభిషేక్ శర్మలనే ఓపెనింగ్ జోడీనే కొనసాగించాలని పేర్కొన్నాడు.జైస్వాల్ కాదు!.. బ్యాకప్ ఓపెనర్గా అతడే సరైనోడు!అయితే, వీరికి బ్యాకప్ ఓపెనర్గా గిల్ను ఎంపిక చేస్తే బాగుంటుందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ‘‘జైస్వాల్, గిల్.. వీరిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే ఆసియా కప్ జట్టులో చోటు దక్కే వీలుంది. నేనైతే శుబ్మన్ గిల్ వైపే మొగ్గుచూపుతాను.ఇంగ్లండ్లో కెప్టెన్గా గిల్ రాణించాడు. 750 పరుగులు కూడా చేశాడు. అంతేకాదు.. ఐపీఎల్లోనూ అతడు మెరుగ్గా రాణించాడు. అయితే, తుదిజట్టులో కాకపోయినా.. బ్యాకప్ ఓపెనర్గానైనా గిల్ పేరు ఆసియా కప్ జట్టులో ఉంటుంది.జితేశ్ శర్మకు నా ఓటునిజానికి ఓపెనింగ్ స్లాట్ కోసం గిల్- జైస్వాల్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. అయితే, ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది కాబట్టి.. గిల్ సరైన ఆప్షన్ అవుతాడు. ఇక బ్యాకప్ వికెట్ కీపర్ విషయానికి వస్తే.. జితేశ్ శర్మకు నా ఓటు.ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ ఫైనల్ చేరి టైటిల్ గెలవడంలో జితేశ్ పాత్ర కూడా కీలకం. కాబట్టి ఆసియా కప్ టోర్నీలో సంజూ ప్రధాన వికెట్ కీపర్గా ఉంటే.. జితేశ్ అతడికి బ్యాకప్గా ఉండాలి’’ అని మహ్మద్ కైఫ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అదే విధంగా.. ఆసియ కప్-2025లో భారత తుదిజట్టును కూడా కైఫ్ ఈ సందర్భంగా ఎంచుకున్నాడు. ఇక బ్యాకప్ ప్లేయర్లుగా వరుణ్ చక్రవర్తి, శుబ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్, జితేశ్ శర్మలను కైఫ్ తన జట్టుకు ఎంపిక చేసుకున్నాడు.ఆసియా కప్-2025లో కైఫ్ ఎంచుకున్న భారత తుదిజట్టు ఇదేసంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. చదవండి: సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్!

‘అదే జరిగితే గావస్కర్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసేవాడు’
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తీరును మాజీ క్రికెటర్ కర్సన్ ఘవ్రీ (Karsan Ghavri) విమర్శించాడు. పటౌడీ ట్రోఫీని ఇంగ్లండ్ బోర్డు ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీగా మారిస్తే.. ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించాడు. ఒకవేళ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ పేరును మార్చి ఉంటే మాత్రం.. సునిల్ గావస్కర్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసేవాడని.. ఇప్పుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడని విమర్శలు చేశాడు.కాగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్కు భారత దిగ్గజం మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ గౌరవార్థం పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. అయితే, తాజాగా టీమిండియా ఇంగ్లండ్లో పర్యటించగా.. దీనికి ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)గా నామకరణం చేశారు. ఇంగ్లండ్ పేస్ దిగ్గజం జేమ్స్ ఆండర్సన్, భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ల పేరు మీదుగా ఇకపై ఈ సిరీస్ను నిర్వహిస్తామని ఇంగ్లండ్ బోర్డు తెలిపింది.అదే జరిగితే గావస్కర్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసేవాడుఈ నేపథ్యంలో కర్సన్ ఘవ్రీ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా తప్పు. ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మధ్య సిరీస్ను ఎల్లప్పుడూ ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీగానే వ్యవహరిస్తారు. టీమిండియా- ఆస్ట్రేలియా ట్రోఫీని బోర్డుర్- గావస్కర్ ట్రోఫీ అనే పిలుస్తారు.ఒకవేళ ఆసీస్తో టీమిండియా సిరీస్కు ఈ పేరును గనుక మార్చి ఉంటే గావస్కర్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసేవాడు. అయినా.. ఈసీబీ, ఎంసీసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా బీసీసీఐ కోరాల్సింది. పటౌడీ పేరు తీసివేయొద్దని గట్టిగా చెప్పాల్సింది.సచిన్ నో చెప్పాల్సిందిసచిన్ టెండుల్కర్ కూడా పేరు మార్పునకు అంగీకరించకుండా ఉండాల్సింది. తను నో చెప్పి ఉంటే బాగుండేది. ఏదేమైనా కనీసం అభ్యంతరం లేవనెత్తకపోవడం సరికాదు’’ అని విమర్శించాడు.‘‘ఏదేమైనా పటౌడీ భారత క్రికెట్లో ఓ దిగ్గజం. ఆయన పేరును తొలగిస్తుంటే మీరెలా ఊరుకున్నారు?’’ అని ఘవ్రీ ప్రశ్నించాడు. ఇక విమర్శల అనంతరం ఈసీబీ విజేత జట్టుకు పటౌడీ మెడల్ ఇస్తామని ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఒకవేళ మీరు మెడల్స్ ఇవ్వాలని అనుకుంటే.. అందుకోసం ట్రోఫీ పేరునే మార్చాల్సిన అవసరం లేదు కదా!’’ అంటూ ఘవ్రీ ఈసీబీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా గుజరాత్కు చెందిన 74 ఏళ్ల కర్సన్ ఘవ్రీ 1974- 1981 మధ్య టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన ఘవ్రీ.. 39 టెస్టుల్లో 913 పరుగులు, 19 వన్డేల్లో 114 పరుగులు సాధించాడు. అదే విధంగా.. లెఫ్టార్మ్ మీడియం పేసర్ అయిన ఘవ్రీ టెస్టుల్లో 109, వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టాడు.2-2తో సమం చేసిన టీమిండియాఇదిలా ఉంటే.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడిన టీమిండియా 2-2తో సిరీస్ సమం చేసింది. ఈ పర్యటనతో టీమిండియా టెస్టు కెప్టెన్గా ప్రయాణం ఆరంభించిన శుబ్మన్ గిల్ .. 754 పరుగులతో సిరీస్ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఈ టూర్లో టీమిండియా ఎడ్జ్బాస్టన్లో తొలిసారి టెస్టు మ్యాచ్ గెలవడం హైలైట్గా నిలిచింది.చదవండి: సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్!
బిజినెస్

ఐదు ఏఐ కోర్సులు.. పూర్తిగా ఉచితం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు డిమాండ్ పెరుగుతోంది. చాలామంది ఇందులో కొత్తగా నైపుణ్యాలను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యా మంత్రిత్వ శాఖ 'స్వయం పోర్టల్'లో ఫ్రీ ఏఐ (AI) కోర్సులను అందిస్తోంది. వివిధ పరిశ్రమలలో ఏఐ ప్రాముఖ్యత పెరుగుతున్న సమయంలో ఈ కోర్సులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఏఐ/ఎమ్ఎల్ యూసింగ్ పైథాన్ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ వంటి వాటికి సంబంధించిన ప్రాథమిక అంశాలను పరిచయం చేస్తారు. ఇందులో స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జీబ్రా, ఆప్టిమైజేషన్, డేటా విజువలైజేషన్ వంటివి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అంతే కాకుండా.. డేటా సైన్స్లో విస్తృతంగా ఉపయోగించే ప్రోగ్రామింగ్ భాషలలో ఒకటైన పైథాన్ను కూడా కవర్ చేస్తుంది. ఈ కోర్సు 36 గంటల పాటు కొనసాగుతుంది. కోర్సు పూర్తయిన తరువాత చివరిలో సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది.క్రికెట్ అనలిటిక్ విత్ ఏఐఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు అందించే ఈ కోర్సు ద్వారా.. క్రికెట్ను ప్రాథమిక ఉదాహరణగా తీసుకుని, పైథాన్ని ఉపయోగించి స్పోర్ట్స్ అనలిటిక్స్ కు సంబంధించిన ప్రాథమిక అంశాలను తెలుసుకోవచ్చు. ఈ కోర్సు 25 గంటలు ఉంటుంది.ఏఐ ఇన్ ఫిజిక్స్ ఈ కోర్సు మెషిన్ లెర్నింగ్ & న్యూరల్ నెట్వర్క్లు వాస్తవ ప్రపంచ భౌతిక శాస్త్ర సమస్యలను ఎలా పరిష్కరించగలవో చెబుతుంది. ఇందులో ఇంటరాక్టివ్ సెషన్లు, ఆచరణాత్మక ఉదాహరణలు, హ్యాండ్స్-ఆన్ ల్యాబ్ వర్క్ మొదలైనవి ఉన్నాయి. ఈ కోర్సు 45 గంటల ఉంటుంది.ఇదీ చదవండి: ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్: తొలిరోజే 1.4 లక్షల కొనుగోళ్లుఏఐ ఇన్ అకౌంటింగ్కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని ఈ కోర్స్ ప్రవేశపెట్టింది. అకౌంటింగ్ పద్ధతుల్లో ఏఐను ఎలా ఉపయోగించుకోవచ్చో.. ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. ఇది 45 గంటల కోర్సు.ఏఐ ఇన్ కెమిస్ట్రీఈ కోర్సు ద్వారా వాస్తవ ప్రపంచ రసాయన డేటాసెట్లను ఉపయోగించాలో తెలుసుకోవచ్చు. అంతే కాకుండా పరమాణు లక్షణాలు, మోడల్ ప్రతిచర్యలు, డిజైన్ డ్రగ్స్ మొదలైనవాటిని ఎలా అంచనా వేయాలో తెలుస్తుంది. ఇది 45 గంటల కోర్సు.

టర్మ్ ఇన్సూరెన్స్ దండగా?
బతికి ఉన్నప్పుడు చూడలేని డబ్బు మనకెందుకని చాలా మంది అనుకుంటారు. దాంతో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపించరు. తీసుకున్నవారిలో కొందరేమో ‘ఛా.. ప్రీమియం అంతా వేస్ట్ అవుతుందే’ అని అనుకుంటూంటారు. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చాలా మందిలో ఉన్న కొన్ని అపోహలు, వాస్తవాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.అపోహ-1‘టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల డబ్బు దండగ. టర్మ్ ఇన్సూరెన్స్ కడితే బతికుంటే డబ్బు రాదు.. చనిపోతే వస్తుంది. అప్పుడు ఆ డబ్బు అనుభవించలేరు. అలాంటప్పుడు నాకేంటి లాభం..’ అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఇన్సూరెన్స్ ఉపయోగించుకోకుండా చివరిదాకా జీవించి ఉన్నారంటే ఎంత ఆరోగ్యవంతులో, ఎంతో అదృష్టవంతులో ఆలోచించాలి. దురదృష్టవశాత్తు మీకేమైనా జరిగితే వచ్చే ఇన్సూరెన్స్ వల్ల పిల్లల చదువులు గానీ, పెళ్లిళ్లు గానీ ఆగిపోవు. ఈఎంఐలు నిలిచిపోవు. స్థూలంగా మీ కుటుంబం లైఫ్స్టైల్ అలాగే ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది లాభం కోసం కాదు.. భరోసా కోసం తీసుకోవాలి.అపోహ-2‘టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు. అందరికీ అర్థం కాని విషయం’ అని కొందరు భావిస్తుంటారు. ఇన్సూరెన్స్ పాలసీల్లో సింపుల్గా అర్థమయ్యే పాలసీ టర్మ్ఇన్సూరెన్స్ అని గుర్తించాలి. మీ బైక్ కోసం లేదా కారు కోసం ప్రతి సంవత్సరం ప్రీమియం కడతారు కదా. ఈ క్రమంలో ఒకవేళ మీ వాహనానికి యాక్సిడెంట్ జరిగితే డబ్బు వస్తుంది. లేదంటే ఉచితంగా రిపేర్ చేస్తారు. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్లోనూ ఇదే విధానం అమలవుతుంది. మీకు ఏదైనా జరిగితే డబ్బు రావాలంటే, దాంతో కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.అపోహ-3‘నేను ఇంకా యువకుడినే. ఆరోగ్యంగా ఉన్నాను. కాబట్టి నాకు ఇన్సూరెన్స్ అవసరం లేదు’ అని కొందరు భావిస్తారు. కొత్త కారు కొన్నప్పుడు ఇన్సూరెన్స్ లేనిదే షోరూమ్ నుంచి బయటికి ఇవ్వరు. పాత వాహనం యక్సిడెంట్ అయి షెడ్లో ఉంటే దానికి ఎవరూ ఇన్సూరెన్స్ ఇవ్వరనే విషయం గుర్తుంచుకోవాలి. మీకు ఏదైనా జబ్బు చేస్తే అప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తారా.. ఇవ్వరా.. అనేది మీ మెడికల్ రిపోర్ట్ను బట్టి ఉంటుంది. అదే చిన్న వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఈజీగా ఇస్తారు. ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ప్రీమియం అనేది ప్రతి సంవత్సరం మారదు. మీరు మొదటి సంవత్సరం ఉదాహరణకు రూ.10,000 కడితే 20 సంవత్సరాల తర్వాత కూడా అదే రూ.10,000 కట్టాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణంతో సంబంధం ఉండదు. తర్వాత మీ ఆరోగ్యం క్షీణించినా పాలసీపై ఎలాంటి ప్రభావం ఉండదు. మీ వయసు పెరిగిన తర్వాత తీసుకుంటే ప్రీమియం ఎక్కువ అవుతుంది. మెడికల్ చెకప్ కూడా అవసరం ఉండొచ్చు.అపోహ-4‘అన్ని టర్మ్ పాలసీలు ఒకేలా ఉంటాయి. చనిపోతే డబ్బులు వస్తాయి. పాలసీలు ఒకటే కంపెనీలే మారుతాయి’ అని అనుకుంటారు. ఒక్కో పాలసీకి ఒక్కో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో(క్లెయిమ్ ఎంత త్వరగా, ఎంత మందికి చేస్తున్నారో తెలిపే సూచిక) ఉంటుంది. ఒక్కో పాలసీకి రైడర్స్, బెనిఫిట్స్, ప్రీమియం, సర్వీసెస్ అన్నీ వేరువేరుగా ఉంటాయి. అవి పాలసీని అనుసరించి మారుతాయి. అందులో మీకేది అవసరమో మంచి అడ్వైజర్ను సంప్రదించి తెలుసుకోవడం ముఖ్యం.ఇదీ చదవండి: కబ్జాసురుల పాపం పండేలా..కొన్ని చిట్కాలుఅపోహ-5‘నాకు కంపెనీ ఇచ్చిన ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. పర్సనల్గా ఇంకొకటి అవసరం లేదు’ అని చెబుతారు. చాలా కార్పొరేట్ కంపెనీలు తమ ఎంప్లాయీస్కు గ్రూప్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటాయి. గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే గుంపులో గోవింద. ప్రత్యేకంగా మీ అవసరాలకు, బాధ్యతలకు తగ్గట్టుగా ఆ పాలసీ ఉండకపోవచ్చు. కంపెనీ పాలసీ ప్రకారం మాత్రమే వాటిని ఇష్యూ చేస్తారు. భవిష్యత్తులో కంపెనీ మారితే, ఉద్యోగం మానిస్తే ఇన్సూరెన్స్ ఉండదు. అక్కడితో ఆగిపోతుంది. అందుకే కంపెనీ ఇచ్చిన ఇన్సూరెన్స్ ఉన్నా పర్సనల్గా ఒక టర్మ్ పాలసీ తీసుకోవడం తప్పనిసరి.

ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్: తొలిరోజే 1.4 లక్షల కొనుగోళ్లు
ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్' (FASTag Annual Pass) ప్రారంభమైంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు & ఎక్స్ప్రెస్వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాలలో దీనిని అమలు చేసింది.రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. యాన్యువల్ పాస్కు జాతీయ రహదారి వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఆగస్టు 15న అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. అంతే కాకుండా టోల్ ప్లాజాలలో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి.జాతీయ రహదారి వినియోగదారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండే.. ఈ ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ ఒక సంవత్సరం లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్లకు (ఏది ముందు అయితే అది) అనుమతిస్తుంది. దీనికోసం రూ. 3000 వన్ టైమ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా లేదా ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లిస్తే.. రెండు గంటల్లోపు యాక్టివేట్ అవుతుంది. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఫాస్ట్ట్యాగ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.

‘అమెరికా’ బాయ్కాట్ ప్రచారం
ఎగుమతిదారులను కలవరపెట్టి, న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య సంబంధాలను దెబ్బతీస్తూ డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుంచి వచ్చే వస్తువులపై 50 శాతం సుంకం విధించిన తర్వాత, దీనిపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ మొదలైంది. అది అమెరికన్ ఉత్పత్తులను వదిలివేయాలంటూ డిమాండ్ చేసే దాకా వెళ్లింది. మెక్డొనాల్డ్స్ కోకా–కోలా అమెజాన్, ఆపిల్.. ఇలా అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థలు భారతదేశంలో బహిష్కరణ డిమాండ్స్ ఎదుర్కుంటున్నాయి.మన భారతం.. మహా మార్కెట్..ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం, సంపన్న వినియోగదారుల పెరుగుతున్న స్థావరంగా కూడా మారుతోంది. దీన్ని లక్ష్యంగా చేసుకుని వేగంగా విస్తరించిన అమెరికన్ బ్రాండ్లకు మన దేశం కీలకమైన మార్కెట్గా అవతరించింది. భారతీయ సంపన్నులు, అధికాదాయ వర్గాలు జీవితంలో ఉన్నతికి చిహ్నాలుగా భావిస్తూ అమెరికన్ అంతర్జాతీయ లేబుల్స్ పట్ల ఆకర్షితులయ్యారు. ఉదాహరణకు, భారతదేశం మెటా, వాట్సాప్కు వినియోగదారుల పరంగా అతిపెద్ద మార్కెట్ అలాగే ఏ ఇతర బ్రాండ్ కంటే డొమినోస్వే దేశంలో ఎక్కువ రెస్టారెంట్లు ఉన్నాయి. పెప్సి కోకా–కోలా వంటి పానీయాలు మన సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి ఇక కొత్త ఆపిల్ స్టోర్ తెరిచినప్పుడు లేదా స్టార్బక్స్ కేఫ్ లో డిస్కౌంట్లను ఇచ్చినప్పుడు మన వాళ్లంతా పొలోమంటూ క్యూలో నిలబడడం కనిపిస్తుందిపోటీ ఇస్తున్నాం.. విస్తరించలేకున్నాం...నిజం చెప్పాలంటే, భారతీయ రిటైల్ కంపెనీలు స్టార్బక్స్ వంటి విదేశీ బ్రాండ్లకు దేశీయ మార్కెట్లో గట్టి పోటీని ఇస్తున్నాయి, కానీ అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం ఒక సవాలుగా ఉంది. అయితే, భారతీయ ఐటి సేవల సంస్థలు మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరపడ్డాయి, టిసిఎస్ , ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లకు సాఫ్ట్వేర్ పరిష్కారాలను అందిస్తున్నాయి. తరచు మన ప్రధాని స్వావలంబన కోసం పిలుపునిస్తూనే ఉన్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ టెక్నాలజీ కంపెనీలు ప్రపంచానికి ఉత్పత్తులను తయారు చేస్తాయి, కానీ ‘ఇప్పుడు మనం భారతదేశ అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది’ అని అన్నారు.నిరసనల వెల్లువ..అమ్మకాలు దెబ్బతింటున్నాయనే తక్షణ సూచనలు లేనప్పటికీ, అమెరికా పన్నులపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ పెరుగుతున్న డిమాండ్స్కు స్వదేశీ సంస్థల గొంతులు కూడా జత కలుస్తున్నాయి. వావ్ స్కిన్ సైన్స్ సహ వ్యవస్థాపకుడు మనీష్ చౌదరి లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసిన తన వీడియో సందేశంలో ఈ విషయంపై స్పందించారు. ‘మేడ్ ఇన్ ఇండియా‘ని ‘గ్లోబల్ అబ్సెషన్‘గా మార్చడానికి వీలుగా మన రైతులకు, స్టార్టప్లకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దక్షిణ కొరియా ఆహార, సౌందర్య ఉత్పత్తుల విజయాల నుంచి మనం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. ‘మనం వేల మైళ్ల దూరంలో నుంచి వచ్చే ఉత్పత్తుల కోసం క్యూ కడుతున్నాం. తమ స్వదేశంలో నిలదొక్కుకోవాలని ఓ వైపు మన తయారీదారులు పోరాడుతుంటే, మరోవైపు మనవి కాని బ్రాండ్లపై మనం గర్వంగా ఖర్చు చేస్తున్నాం‘ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘చైనా మాదిరిగానే భారతదేశానికి కూడా స్వదేశంలో వృద్ధి చెందిన ఎక్స్(గతంలో ట్విట్టర్)/ గూగుల్/ యూట్యూబ్/ వాట్సాప్/ ఎఫ్బీ ఉండాలి’ అని కారు డ్రైవర్ను కాల్ సర్వీస్ ద్వారా సరఫరా చేసే భారతదేశ సంస్థ ‘డ్రైవ్యూ’ సీఈఓ రహ్మ్ శాస్త్రి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.భారతీయ జనతా పార్టీకి అనుసంధానంగా పనిచేసే స్వదేశీ జాగరణ్ మంచ్ గ్రూప్ భారతదేశం అంతటా బహిరంగ ర్యాలీలు నిర్వహించి, అమెరికన్ బ్రాండ్లను బహిష్కరించాలని ప్రజలను కోరుతోంది. ‘ప్రజలు ఇప్పుడు భారతీయ ఉత్పత్తుల వైపు చూస్తున్నారు. అయితే ఇది విజయవంతం కావడానికి మరి కొంత సమయం పడుతుంది‘ అని గ్రూప్ సహ–కన్వీనర్ అశ్వని మహాజన్ అంటున్నారు. ‘ఇది జాతీయవాదం, దేశభక్తికి పిలుపు‘ అని అన్నారాయన. విదేశీ ఉత్పత్తుల స్థానంలో వాటి కంటే మంచివి, ప్రజలు ఎంచుకోగల భారతీయ బ్రాండ్ల స్నానపు సబ్బులు, టూత్పేస్ట్ శీతల పానీయాల జాబితాను ఈ సంస్థ సోషల్ మీడియాలో, షేర్ చేస్తోంది. జాబితా చేశారు. అలాగే ‘విదేశీ ఆహార సంస్థలను బహిష్కరించండి‘ అంటూ మెక్డొనాల్డ్స్ అనేక ఇతర రెస్టారెంట్ బ్రాండ్ల లోగోలతో ప్రచారం చేస్తున్నారు.ఇదీ చదవండి: కబ్జాసురుల పాపం పండేలా..కొన్ని చిట్కాలుఓ వైపు అమెరికా వ్యతిరేక నిరసనలు ఊపందుకుంటున్నా అమెరికన్ కంపెనీ టెస్లా భారతదేశంలో తన రెండవ షోరూమ్ను న్యూఢిల్లీలో ప్రారంభించింది, ఈ ప్రారంభోత్సవానికి భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు అమెరికా రాయబార కార్యాలయ అధికారులు హాజరయ్యారు- సత్య బాబు
ఫ్యామిలీ

ఫ్యాటీ లివర్కు బొప్పాయితో చెక్
కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుని పోయే ఫ్యాటీ లివర్ వ్యాధికి ఇతర ఔషధాలకన్నా బొప్పాయి మంచి మందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో వారేం చెబుతున్నారో చూద్దాం...బొప్పాయిలో విటమిన్ సి, బీటా–కెరోటిన్, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు కాలేయాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.లివర్ డిటాక్స్కు మద్దతు బొప్పాయిలో పపైన్ మరియు కైమో΄ాపైన్ వంటి ఎంజైమ్లు ఉంటాయి, ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. పరోక్షంగా కాలేయం నిర్విషీకరణ విధులకు మద్దతు ఇస్తాయి. ఈ ఎంజైమ్లు ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో, కాలేయంపై జీర్ణ భారాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.కాలేయ ఎంజైమ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. బొప్పాయి వంటి కాలేయానికి అనుకూల మైన పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాలేయ ఎంజైమ్ ప్రొఫైల్స్ మెరుగుపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వాపును తగ్గిస్తుందిబొప్పాయిలోని కొన్ని సమ్మేళనాలు కాలేయ కణజాలాలలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. బొప్పాయిలోని పోషక విలువలుతక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్, సహజ చక్కెరలు, అనారోగ్యకరమైన కొవ్వులు లేదా కొలెస్ట్రాల్ ఉండకపోవడమనే లక్షణాలు కొవ్వు కాలేయ ఆహారాన్ని అనుసరించే వారికి బొ΄్పాయిని ఆదర్శవంతమైన పండుగా చేస్తాయి. ఎంత తినాలి?మితంగా తినడం చాలా ముఖ్యం. రోజుకు ఒక చిన్న గిన్నె బొప్పాయి – ఉదయం లేదా మధ్యాహ్నం స్నాక్గా – సహజ చక్కెరలపై ఓవర్లోడ్ లేకుండా అవసరమైన పోషకాలను అందిస్తుంది. కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారంతో దీన్ని ఎల్లప్పుడూ జత చేయండి.

ముకుందా.. ముకుందా..
విద్యానగర్(కరీంనగర్): కృష్ణ అనే రెండు అక్షరాలు ప్రణవ మంత్రము, మొదలైన పవిత్ర మంత్రాలన్నింటితో సమానమైనవి. సర్వ భయాలు, విఘ్నాలను తొలగించి విజయ పథంలో నడిపించే అద్భుత చైతన్యం కృష్ణనామం. సత్యం జ్ఞాన మనస్తం బ్రహ్మ, ఆనందోబ్రహ్మ, ఆనందం బ్రహ్మణో విద్యాన్ వంటి ఉపనిషత్ వాక్యాల సారం శ్రీకృష్ణ నామమే.కృష్ణతత్వం..కృష్ అంటే భూమి న అంటే లేకపోవడం అని అర్థం. కృష్ణుడు అన్ని మతాలు, దేశాలు, కాలాలకు వర్తించే దివ్య సందేశాన్ని భగవద్గీత ద్వారా అందించి చిరస్మరణీయుడయ్యాడు. పరమ దుషు్టలైన కంస, జరాసంధ, శిశుపాల, నరకాసురాది రాక్షసులను సంహరించి జగద్రక్షకుడయ్యాడు. భారతదేశాన్ని యుధిష్టరుని పాలనలో ఏకచత్రాధిపత్యం కిందికి తెచ్చిన రాజనీతి దురంధరుడు శ్రీకృష్ణ పరమాత్ముడు.కృష్ణావతారం..సమగ్రమైన ఐశ్వర్యం అంటే శాసించే అధికారం, సంపూర్ణ ధర్మం, నిర్మలమైన యశస్సు, పరిపుష్టమైన సౌభాగ్యం, విజ్ఞానం, నిశ్చలమైన వైరాగ్యం ఈ 6 భగవంతుడి లక్షణాలు. నారాయణుని దశావతారాల్లో ప్రతీ అవతారానికి ఇందులో కొన్ని లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అన్ని లక్షణాలున్న పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. నీలమేఘశ్యాముడు, పీతాంబరధారి, చతుర్భుజుడు, శంకచక్ర, గద, పద్మాదరుడు, మణిమయ రత్నమకుట కంకణ ధారుడై శ్రీమహా విష్ణువు ఎనిమిదో అవతారం కృష్ణావతారం. సుమారు 5వేల సంవత్సరాల క్రితం కారాగారంలో దేవకి–వాసుదేవులకు శ్రావణ బహుళ కృష్ణపక్ష అష్టమి రోజు రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. ఆ బాల గోపాల పుణ్యాల పున్నమిగా శ్రీకృషుŠ?ణ్డ జన్మాష్టమి వేడుకలను శనివారం ప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు. బాల కృష్ణుడి లీలలు వయోభేదం లేకుండా అందరినీ అలరించేవే. పాలు, పెరుగు, వెన్నె చౌర్యంతో చిలిపి చేష్టలతోపాటు పసి వయసులోనే పలువురు రాక్షసులను సంహరించిన శ్రీకృష్ణుడి లీలావినోదం వర్ణనలకు అతీతమైంది. అందుకే పారాడే పసిబిడ్డలందరూ ఈరోజు బాలకృష్ణులు మాత్రమే కాదు.. వాళ్ల అల్లరిని ఆనందించి, అల్లారు ముద్దుగా పెంచుకునే తల్లులందరూ యశోదమ్మలే.ఉట్ల పండుగశ్రీకృష్ణుడి జన్మాష్టమి రోజున పిల్లలకు బాలకృష్ణుడి వేషధారణ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బాల్యంలోని శ్రీకృష్ణుడి విన్యాసాలకు చిహ్నంగా ఉట్ల పండుగను వేడుకగా జరుపుతారు. అందనంత ఎత్తులో ఉట్టిని కట్టి.. అందులోని వెన్నను సాహసంతో తీసుకొచి్చన వాళ్లను బాలకష్ణుడి ప్రతీకలుగా భావించేవారు. ప్రస్తుతం ఉట్లలో పాలు, వెన్నకు బదులు డబ్బులు ఉంచి గెలిచినవారికి బహుమతిగా ఇస్తున్నారు. ఉట్టి కొట్టే వేడుక ఆద్యంతం పిల్లలు, యువకులతోపాటు అందరినీ అలరిస్తుంది. ఉట్టిని అందుకునేందుకు చేసే ప్రయత్నాలను సున్నితమైన పద్ధతుల్లో భంగపరుస్తూ వినోదిస్తుంటారు.శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాల ప్రయోజనాలు వేర్వేరు. ఆదర్శ మానవుడికి ప్రతీక శ్రీరాముడు. అందుకే ఆయన ఏకపత్నీవ్రతుడు. దైవానికి ప్రతీక శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కర్మయోగి, కష్టసుఖాల ఎరగక అలసట తెలియక పనులు చేసి ఉచ్చనీచాలన్నీ భరించాడు. లోకోద్ధరణ కృష్ణావతార పరమార్థం. ఉపనిషత్తులు, వేదాల సారాన్ని అందరికీ విడమరిచి అందుబాటులో ఉండేట్లు భగవద్గీతగా చెప్పాడు. జ్ఞానం కంటే పవిత్రమైంది వేరేది లేదు. ఆత్మ జ్ఞానం లభించిన వాడు శాంతి పొంది చివరకు భగవంతుని చేరగలడని జగత్తుకు ఉపదేశమిచ్చి శ్రీకృష్ణుడు జగద్గురువైయ్యాడు. – పవనకృష్ణశర్మ, ప్రధానార్చకుడు, శ్రీదుర్గాభవాని ఆలయం, నగునూర్, కరీంనగర్

కృష్ణం వందే జగద్గురుమ్
చాలామంది కృష్ణుడంటే అల్లరి, చిలిపితనం, మాయలు, మహిమలు... అనే అనుకుంటారు. కానీ కృష్ణుడంటే ఒక చైతన్యం. ఒక స్ఫూర్తి. ఎందుకంటే తానో రాజు కొడుకైనా సామాన్య గోపబాలురతో చెలిమి చేశాడు. అల్లరి పనులతో బాల్యాన్ని ఎలా ఆస్వాదించాలో చెప్పాడు. అంతేకాదు, యవ్వనంలో ఉండే చిన్న చిన్న సరదాలనూ చూపించాడు. బంధాలను నిలుపుకోవడంలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, స్నేహం... ఏదైనా సరే పది కాలాల పాటు సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలో వివరించాడు. భగవద్గీత ద్వారా ఈ సారాన్ని ప్రపంచానికి అందించాడు. నేడు కృష్ణాష్టమి సందర్భంగా ఆయన చెప్పిన ఆ పాఠాలను అర్థం చేసుకుందాం...స్నేహానికి ప్రాణంచిన్నప్పుడు గోపబాలురతో అరమరికలు లేకుండా హాయిగా ఆడుకున్న శ్రీ కృష్ణుడు స్నేహితులకు, శరణార్థులకూ మాట ఇచ్చాడంటే తప్పడం అన్నది లేదు. ‘కురుక్షేత్రంలో ఆయుధం పట్టను’ అని చెప్పాడు. ఆ మాట మీదే నిలబడ్డాడు. అంతేకాదు. అర్జునుడితో చుట్టరికం ఉన్నప్పటికీ అంతకు మించి ఆప్యాయతను చూపించాడు. శ్రీ కృష్ణుడు, కుచేలుడి గురించి ఎలా చెప్పుకుంటారో అదే విధంగా శ్రీకృష్ణుడు, అర్జునుడి బంధం గురించి కూడా మాట్లాడతారు. పాండవులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అండగా నిలిచాడు. వారికి దిక్కుతోచనప్పుడు మార్గదర్శిగా మారాడు. యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. ఇవన్నీ కేవలం స్నేహం కోసం చేసినవే.ఒక భరోసా... ఒక నమ్మకంనమ్మకం అనేది ఏ బంధంలో అయినా ముఖ్యం. నమ్మకం పోగొట్టుకోడానికి ఎంతోసేపు పట్టదు. కానీ సంపాదించుకోడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. కృష్ణుడు చెప్పింది కూడా ఇదే. ‘నన్ను పూర్తిగా నమ్ము.. అంతా నేను చూసుకుంటాను’ అనే భరోసా ఇచ్చాడందరికీ. అందరికన్నా ముందుగా అర్జునుడికి. ఆ నమ్మకంతోనే యుద్ధంలో పోరాడాడు అర్జునుడు. అంగబలం, అర్థబలం, అధికార బలం, సైనిక బలం ఉన్న కౌరవులపై యుద్ధంలో పాండవులు పైచేయి సాధించగలిగారంటే అందుకు కృష్ణుడే కారణం.స్థాయీ భేదాలు చూపలేదు...అవతలి వాళ్ల స్థాయి ఏంటి... వారు ఎలాంటి హోదాలో ఉన్నారు అన్నది పక్కన పెట్టి అందరినీ సమానంగా చూడాలని బోధించాడు కృష్ణుడు. అందుకే సాయం కోసం వచ్చిన కుచేలుడి మనసు అర్థం చేసుకుని ఆనందాన్ని అందించాడు. అదే సమయంలో గౌరవం చూపించాడు. కేవలం స్నేహితులు అనే కాదు. ప్రేమికులు, భార్యా భర్తలు...ఇలా ఏ బంధంలో అయినా సరే అందరినీ సమానంగా చూస్తే ఎలాంటి చిక్కులూ రావని, పరస్పరం గౌరవించుకుంటే సమస్యలే ఉండవని నిరూపించాడు.క్షమాగుణంతప్పులు అందరూ చేస్తారు. కొన్నిసార్లు తెలియక, కొన్ని సార్లు తెలిసి అవి జరుగుతుంటాయి. అంత మాత్రాన ఆ వ్యక్తి పూర్తిగా చెడ్డవాడు అయిపోడు. వాళ్లపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరమూ లేదు. మిత్రులనే కాదు. శత్రువులను కూడా ఒకే రకంగా ఆదరించడంలో కృష్ణుడు ముందుండే వాడు. ఆ మాత్రం క్షమాగుణం లేకపోతే బంధం ఎలా నిలబడుతుంది? మేనత్తకు ఇచ్చిన మాట కోసం శిశుపాలుడు చేసిన వంద తప్పులను మన్నించాడు. ఎవరినైనా ఇష్టపడితే వాళ్ల నుంచి ఏవేవో ఆశించకుండా పూర్తిగా డిటాచ్డ్గా ఉండాలని బోధించాడు కృష్ణుడు.పరిపూర్ణ జీవితంకృష్ణుడంటే అన్ని బంధాలనూ ఆస్వాదించిన వాడని మరచిపోరాదు. బాల్యంలోనే కన్న తల్లిదండ్రులకు దూరమైనా, పెంచిన తల్లిదండ్రులను పరిపూర్ణంగా ప్రేమించాడు. ఆ తర్వాత కన్న తల్లిదండ్రులకూ సాంత్వన నిచ్చాడు. పదహారు వేలమంది గోపికలకూ తన ప్రేమను పంచాడు. అష్టమహిషులనూ అదేవిధంగా ఆదరించాడు. తనను నమ్మి వచ్చిన ఎవ్వరికీ ఏ లోటూ రానివ్వలేదు. తాను సంతోషంగా ఉన్నాడు. తనతో ఉన్న వారిని అదేరీతిలో ఉంచాడు.వ్యక్తిత్వ వికాస గురువుఇప్పుడు వస్తున్న వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నింటికీ మూలాధారం రణరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతే! వ్యక్తిత్వ వికాస బోధకులకు కృష్ణుడే గాడ్ ఫాదర్. అందుకే కృష్ణుడు పరమాత్ముడే కాదు.. అందరికీ పరమ ఆప్తుడు... జగద్గురువు కూడా!– డి.వి.ఆర్.

జయాబచ్చన్ సెల్ఫీ వివాదం, ఘాటుగా స్పందించిన మరో నటి
జయా బచ్చన్ సెల్పీ వివాదం, ఘాటుగా స్పందించిన మరో నటి రాజ్యసభ ఎంపీ సమాజ్వాదీ పార్టీ ఎంపీ, ప్రముఖ నటి జయా బచ్చన్ సెల్ఫీ వివాదంపై మరోనటి బీజేపీనేత రూపాలీగంగూలీ స్పందించారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని నెట్టివేసిన ఘటనపై రూపాలీ అలియాస్ అనుపమ కూడా విమర్శించారు.సమాజ్వాదీ పార్టీ ఎంపీ, ప్రముఖ నటి జయా బచ్చన్ మరోసారి తన సహనాన్ని కోల్పోయిన వీడియోపై రూపాలి గంగూలీ స్పందిస్తూ, తాను పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్లలో జయ బచ్చన్ నుండి నటన నేర్చుకున్నప్పటికీ, ఇపుడు మాత్రం ఆమె నుంచి బిహేవియర్ లక్షణాలను ఎప్పటికీ నేర్చుకోకూడదని భావిస్తున్నా అన్నారు. ఇప్పటికే ఈ వివాదంపై స్పందించిన బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ జయా బచ్చన్పై తీవ్ర విమర్శలు చేశారు.చదవండి: అమితాబ్ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్కాగా అయితే పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు జయాబచ్చన్ సహనం కోల్పోయిన గతంలో కూడా వివాదాన్ని రేపాయి.అలాగే ఇటీవల ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చ సందర్భంగా కూడా జయాబచ్చన్ సహనం కోల్పోయారు. గత ఏడాది జూలై-ఆగస్టులో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆమెను సభకు పరిచయం చేస్తూ ఆమెను జయా అమితాబ్ బచ్చన్ అని సంబోధించడాన్ని తీవ్రంగా తప్పపట్టారు.అమితాబ్ పేరుతో కలిపి తనను పరిచయం చేయడం నచ్చలేదని అన్నారు.కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన ఒక కార్యక్రమాంలో వ్యక్తి సెల్ఫీ తీసుకోవడానికి ఆమె వద్ద వచ్చినపుడు అతనిపై కోప్పడటమేకాదు, అతణ్ణి తోసి వేయడంతో జయా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
ఫొటోలు
అంతర్జాతీయం

చర్చలు విఫలమైతే మరిన్ని టారిఫ్లు
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్, పుతిన్ మధ్య అలస్కాలో శుక్రవారం జరిగే చర్చలు విఫలమైతే భారత్పై అదనపు టారిఫ్లు విధించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ తేల్చిచెప్పారు. ట్రంప్, పుతిన్ చర్చల ద్వారా ఫలితంపైనే టారిఫ్లపై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ సానుకూల ఫలితాలు రాకపోతే భారత్పై సుంకాల మోత తప్పదని వెల్లడించారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు ఇండియాపై సెకండరీ టారిఫ్లు విధిస్తామన్నారు. అప్పటికీ రష్యా దారికి రాకపోతే సెకెంటరీ టారిఫ్లు మరింత పెరుగు తాయని స్పష్టంచేశారు. భారత్ గనుక ముడి చమురు కొనడం ఆపేస్తే రష్యాపై ఒత్తిడి పెరుగు తుందని అమెరికా అంచనా వేస్తోంది. భారత్ ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే 50 శాతం టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే.

పాక్లో కొత్తగా ఆర్మీ రాకెట్ ఫోర్స్
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ వేళ భారత క్షిపణుల ధాటికి పూర్తిగా చేతులెత్తేసిన పాకిస్తాన్కు నెమ్మదిగా తత్వం బోధపడింది. దేశ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టంచేసుకోవాలని ఎట్టకేలకు నిర్ణయించుకుంది. అందులోభాగంగా నూతనంగా ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ పేరిట నూతన విభాగాన్ని ఏర్పాటుచేసుకుంటోంది. పాక్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సంప్రదాయక యుద్ధ సామర్థ్యాలను మెరుగుపర్చుకునే లక్ష్యంతో ఈ ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేస్తున్న ట్లు పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, త్రివిధ దళాధిపతుల సమక్షంలో షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. భూతలం నుంచి ప్రయోగించే అణు, అణ్వస్త్రయేతర బాలిస్టిక్, హైపర్సోనిక్, క్రూయిజ్ క్షిపణులతో ఈ కొత్త ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ను తీర్చిది ద్దనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్తో భారత్ తన క్షిపణుల సత్తాను పాక్కు రుచి చూపించాక ఎట్టకేలకు పాక్ ప్రభుత్వం మేల్కొంది. 2025– 2026 ఆర్థిక సంవత్సరంలో రక్షణరంగ బడ్జెట్ను 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఎవరి పంతం నెగ్గుతుందో!
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలికి, శాంతి దూతగా పేరు సంపాదించాలన్నదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంతం. యుద్ధంలో ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను తమదేశంలో సంపూర్ణంగా విలీనం చేసుకొని, చట్టబద్ధత కల్పించుకోవాలన్నదే రష్యా అధినేత పుతిన్ ఆశయం. రెండు భిన్నమైన లక్ష్యాల సాధన కోసం ట్రంప్, పుతిన్ శుక్రవారం అలస్కాలో సమావేశం కాబోతున్నారు. ఇరువురు నేతల భేటీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడంపైనే చర్చలు జరుగుతాయని పైకి చెబుతున్నా.. తెరవెనుక ఇతర అంశాలూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ అధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాల విషయంలో పుతిన్ పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. అలస్కా భేటీతో ఇరువురు నేతలు ఆశిస్తున్నదేమిటో చూద్దాం.. అందుకే అలస్కా వేదిక ఉక్రెయిన్పై దండయాత్ర కొనసాగిస్తున్న పుతిన్ను ప్రపంచంలో ఏకాకిగా మార్చేందుకు పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు చాలావరకు విఫలమయ్యాయి. అమెరికా నుంచి రష్యాను దూరం చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అమెరికా వద్ద తన ప్రతిష్ట స్థిరంగా చెక్కుచెదరకుండా ఉందని నిరూపించుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. ఇందుకోసం అలస్కా సమావేశాన్ని అవకాశంగా వాడుకోవాలని నిర్ణయించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో తన పట్టు ఏమాత్రం సడలలేదని ట్రంప్తో భేటీ ద్వారా పుతిన్ సంకేతం ఇవ్వబోతున్నారు. సమావేశానికి వేదికగా అలస్కాను ఎంచుకోవడం వెనుక ఒక వ్యూహం ఉంది. అలస్కాకు చేరుకోవాలంటే ఇతర దేశాల గగనతలం గుండా ప్రయాణించాల్సిన అసవరం లేదు. ఎవరినో అనుమతి కోరాల్సిన పనిలేదు. రష్యా నుంచి నేరుగా అలస్కాకు చేరుకోగలరు. అలస్కాను 19వ శతాబ్దంలో రష్యా పాలకులు అమెరికాకు విక్రయించారు. 21వ శతాబ్దంలో కొన్ని సరిహద్దుల్లో బలవంతంగా చేసిన మార్పులను సమర్థించుకోవడానికి అలస్కాను వేదికగా పుతిన్ ఎంచుకున్నారు. దేశాల సరిహద్దులు మార్చడం, భూభాగాల యజమానులు మారడం సాధారణ విషయమేనని ఆయన చెప్పదలిచారు. అలాగైతేనే కాల్పుల విరమణ ఉక్రెయిన్తోపాటు యూరోపియన్ దేశాల అధినేతలను పుతిన్ పక్కనపెట్టారు. ప్రత్యక్షంగా అమెరికాతోనే చర్చలకు సిద్ధమయ్యారు. ఇతర దేశాల పరిగణనలోకి తీసుకోవడం లేదు. చర్చలైనా, ఒప్పందమైనా అమెరికాతోనే అంటున్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినా పుతిన్ పట్టించుకోలేదు. తాము ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను రష్యాలో అంతర్భాగంగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. అలాగైతేనే ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు సిద్ధమని చెబుతున్నారు. అయితే, పుతిన్ డిమాండ్ను ఉక్రెయిన్ వ్యతిరేకిస్తోంది. కబ్జాదారులకు తమ భూమి ఇవ్వబోమని ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ తెగేసి చెప్పారు. ఆక్రమిత ప్రాంతాలను రష్యాలో భాగంగా అధికారికంగా గుర్తించేలా ట్రంప్పై ఒత్తిడి పెంచాలన్నదే పుతిన్ వ్యూహంగా కనిపిస్తోంది. మొదట అమెరికా గుర్తిస్తే తర్వాత ఇతర దేశాలపైనా ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. ఆక్రమిత ప్రాంతాలను వదులుకోకుంటే ఆర్థిక సాయం నిలిపివేస్తామంటూ అమెరికా బెదిరిస్తే ఉక్రెయిన్ దారికి రావడం ఖాయమని పుతిన్ వాదిస్తున్నారు. ఆర్థిక బంధం బలపడుతుందా? అమెరికా–రష్యా మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలపైనా ట్రంప్, పుతిన్ చర్చించబోతున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన రష్యాపై అమెరికా కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలను సడలించి, ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసుకొనే దిశగా ఇరువురు నేతలు ఏదైనా ఒప్పందానికి వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటోంది. అమెరికా సాయంతో గట్టెక్కాలన్న ఆలోచనలో పుతిన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ అంగీకరిస్తే రష్యాకు ఆర్థికంగా అండగా ఉండడానికి ట్రంప్ ముందుకు రావొచ్చు. యుద్ధానికి ఫుల్స్టాప్ పెట్టకపోతే తీవ్ర పరిణామాల ఉంటాయని ట్రంప్ తాజాగా రష్యాను హెచ్చరించడం గమనార్హం. అంటే ఈ విషయంలో ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం జరిగే భేటీలో పుతిన్ను ఆయన ఒప్పించడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. యుద్ధాన్ని ఆపేసి శాంతి దూతగా నోబెల్ శాంతి బహుమతి స్వీకరించాలని ట్రంప్ ఆరాపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్

అదే జరిగితే భారత్కు మరిన్ని సుంకాలు తప్పవు: అమెరికా
భారత్ సుంకాలతో దాడి చేసిన అమెరికా.. భారత్కు మరో హెచ్చరిక జారీ చేసింది. భారత్పై మరిన్ని సుంకాలు లేదంటే ఆంక్షలు తప్పవని అంటోంది. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలస్కాలో భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. చర్చల ఫలితాలను బట్టి ట్రంప్ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.రష్యాతో చమురు కొనుగోళ్ల విషయంలో భారత్పై ఇప్పటికే సుంకాలు విధించాం. ఒకవేళ.. ట్రంప్-పుతిన్ మధ్య చర్చలు గనుక విఫలమైతే భారత్పై మరిన్ని సుంకాలు, ఆంక్షలు తప్పవు. తుది నిర్ణయం చర్చల ఫలితాలను బట్టే ఉంటుంది అని ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ బుధవారం బ్లూమరాంగ్టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భారత్పై సెకండరీ టారిఫ్లు, లేదంటే పరోక్ష ఆంక్షలు విధించే అవకాశం ఉంది అని స్కాట్ స్పష్టం చేశారు.భారత్ తమ మిత్రదేశమంటూనే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించింది అమెరికా. అంతేకాదు.. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు తమ వాణిజ్యం ద్వారా భారత్ పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్ ఆ టైంలో ఆరోపించారు. ఈ తరుణంలో.. రష్యాతో చమురు, ఆయుధాల కొనుగోళ్లు ఆపకపోవడంతో పెనాల్టీ కింద మరో 25 శాతం మోపారు. దీంతో భారత్పై అగ్రరాజ్యం టారిఫ్లు 50 శాతానికి చేరింది. ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారమని తెలిసినా.. జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు కూడా. ట్రంప్ విధించిన దటి దఫా సుంకాలు ఇప్పటికే అమలు అవుతుండగా.. ఈ నెల 27 నుంచి రెండో దఫా ప్రకటించిన సుంకాలు అమల్లోకి రానున్నాయి.ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై వాషింగ్టన్లో వరుస చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఈలోపు ట్రంప్ భారత్పై 50 శాతం సుంకాలు విధించారు. అదే సమయంలో.. భారత్తో వాణిజ్య చర్చలు ఉండబోవని ప్రకటించారాయన. అయితే ఫాక్స్న్యూస్తో ఈ అంశంపై ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ మాట్లాడారు. ఇరు దేశాల చర్చలు కొనసాగే అవకాశమూ ఉందని వ్యాఖ్యానించారు. ఈ నెల 25న అమెరికా నుంచి ప్రతినిధులు భారత్కు చేరుకుంటారని తెలిపారు. అయితే.. వ్యవసాయ, డెయిరీ మార్కెట్ను కాపాడుకునే ఉద్దేశంలో భారత్ ఉందని, ఇది చర్చలకు విఘాతంగా మారే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.మూడున్నరేళ్ల యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి చర్చలు ఉండబోతున్నాయని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధినేత కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్నది అలస్కా వేదికగా శుక్రవారం జరగబోయే చర్చలతోనే తేలిపోతుందని చెబుతున్నారాయన. అదే సమయంలో భూభాగాల మార్పిడితోనే శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని ఇరు దేశాలకు మరోసారి సూచించారు కూడా. అయితే ఈ ఆలోచనను ఉక్రెయిన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. భూభాగాల విషయంలో రాజీ పడటం తమ రాజ్యాంగానికి విరుద్ధమని అంటోంది. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీకి యూరప్ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్ లేకుండా జరిగే చర్చలకు అర్థం ఉండదని, పుతిన్తో జరగబోయే ఒకే ఒక్క భేటీ రష్యా లక్ష్యాలకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వవచ్చని యూరప్ దేశాలు భావిస్తున్నాయి.
జాతీయం

హైకోర్టు కంటే సుప్రీం ఎక్కువ కాదు: సీజేఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాదిరిగానే హైకోర్టులు కూడా రాజ్యాంగ న్యాయస్థానాలేనని, ఇందులో ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అనే తేడా లేదని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. అదేవిధంగా, ఫలానా వ్యక్తినే న్యాయమూర్తిగా సిఫారసు చేయాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టులకు ఆదేశాలు ఇవ్వ జాలదని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ ప్రసంగించారు. సుప్రీంకోర్టులో పనిచేసే న్యాయవాదులను హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించే అంశాన్ని పరిశీలించాలంటూ అంతకుముందు బార్ అధ్యక్షుడు వికాస్ సింగ్ చేసిన వినతిపై ఆయనీ మేరకు స్పందించారు. ‘జడ్జీల నియామకంపై సిఫారసులు చేయాల్సింది ముందుగా హైకోర్టులే. హైకోర్టులు అందజేసిన పేర్లలో కొన్నిటిని మాత్రం మేం సిఫారసు చేస్తాం. తిరిగి మాకు అందిన జాబితాలోని వారు మాత్రమే జడ్జీలుగా నియమితులవుతారు’అని ఆయన తెలిపారు.

‘బిర్యానీ పార్టీ’తో నిరసన
ఛత్రపతి శంభాజీనగర్/థానె: ఛత్రపతి శంభాజీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ జంతు వధ శాలలు, మాంసం దుకాణాల మూసివేతకు ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పద మయ్యాయి. ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు గోకులాష్టమి, ఆగస్ట్ 20న జైన మతస్తుల ‘పర్యుషన్ పర్వ’ల నాడు ఉపవాసాలు, ప్రార్థనలతో రోజంతా గడుపుతారు కాబట్టి మాంసం విక్రయాలపై నగర పరిధిలో నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీనిని నిరసిస్తూ ఏఐఎంఐఎం నేత, మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ తన నివాసంలో శుక్రవారం బిర్యానీ పార్టీ ఏర్పాటు చేశారు. చికెన్ బిర్యానీతోపాటు, శాకాహార భోజనం కూడా సిద్ధం చేసి ఉంచా. మున్సిపల్ కమిషనర్ వస్తే శాకాహారం వడ్డించే వాణ్ని. మేం ఏం తినాలో, తినకూడదో ప్రభుత్వం చెప్పడం సరికాదు. ఇలాంటి వాటిని మానేయాలి. మాంసంపై నిషేధం విధించడం దురదృష్టకర ఘటన’అని ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు.చదవండి: మాంసం దుకాణాలు మూసివేయాలి.. మాకేం సంబంధం?

గగన్యాన్లో జీవన్–1 ప్రయోగం
సూళ్లూరుపేట: గగన్యాన్ ప్రాజెక్టులో భాగమైన జీవన్–1 ప్రయోగాన్ని ఈ ఏడాదిలోనే చేపడతామని షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ తెలిపారు. శుక్రవారం షార్లో మీడియాతో మాట్లాడారు. జీవన్–1 అనంతరం జీ–2, జీ–3 లాంటి ప్రయోగాలుంటాయని తెలిపారు. పలు ప్రయోగాల అనంతరం 2035లో మానవ సహిత గగన్యాన్ మిషన్ ఉంటుందని పేర్కొన్నారు. జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగించిన నైసార్ అద్భుతంగా పనిచేస్తోందని, ఆ ఉపగ్రహానికి ఉన్న 12 అడుగుల యాంటెన్నా కూడా విజయవంతంగా విచ్చుకుందని తెలిపారు. ఈ ఏడాదిలోనే పీఎస్ఎల్వీ ఎన్1 పేరుతో చేపట్టే మరో 5 ప్రయోగాలు కూడా వాణిజ్యపరమైనవేనని చెప్పారు. ఎల్ఎవీఎం3 ఎం5 ద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని లేదా ఈఓఎస్ ఉపగ్రహాన్ని కాని ప్రయోగించే అవకాశముందని వివరించారు. పీఎస్ఎల్వీ సీ62, సీ63 ప్రయోగాలు కూడా ఈ ఏడాది ఉంటాయని తెలిపారు.

‘బిర్యానీ పార్టీ’తో నిరసన
ఛత్రపతి శంభాజీనగర్/థానె: ఛత్రపతి శంభాజీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ జంతు వధ శాలలు, మాంసం దుకాణాల మూసివేతకు ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పద మయ్యాయి. ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు గోకులాష్టమి, ఆగస్ట్ 20న జైన మతస్తుల ‘పర్యుషన్ పర్వ’ల నాడు ఉపవాసాలు, ప్రార్థనలతో రోజంతా గడుపుతారు కాబట్టి మాంసం విక్రయాలపై నగర పరిధిలో నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీనిని నిరసిస్తూ ఏఐఎంఐఎం నేత, మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ తన నివాసంలో శుక్రవారం బిర్యానీ పార్టీ ఏర్పాటు చేశారు. చికెన్ బిర్యానీతోపాటు, శాకాహార భోజనం కూడా సిద్ధం చేసి ఉంచా. మున్సిపల్ కమిషనర్ వస్తే శాకాహారం వడ్డించే వాణ్ని. మేం ఏం తినాలో, తినకూడదో ప్రభుత్వం చెప్పడం సరికాదు. ఇలాంటి వాటిని మానేయాలి. మాంసంపై నిషేధం విధించడం దురదృష్టకర ఘటన’అని ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు.
ఎన్ఆర్ఐ

Nimisha Priya Case: ‘నిమిషకు వెంటనే శిక్ష అమలుపరచండి’
కేరళ నర్సు నిమిష ప్రియ కేసు.. వారానికో మలుపు తిరుగుతోంది. మరణ శిక్ష అమలుకు ఒక్కరోజు ముందు.. అంటే జులై 15న వాయిదా పడ్డట్లు యెమెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిమిష తల్లి విజ్ఞప్తి, మతపెద్దల జోక్యంతో శిక్ష అమలును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఉత్తర్వులు వెలువరించారు. అయితే..అప్పటి నుంచి బాధిత కుటుంబంతో నిమిష తల్లి, మధ్యవర్తులు జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. బ్లడ్ మనీ ప్రైవేట్ వ్యవహారం కావడంతో భారత విదేశాంగ శాఖ దూరంగా ఉంటోంది. దీంతో నిమిష ప్రియ కేసులో చర్చలు ఎలా కొనసాగుతున్నాయో అనే గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహ్దీ హతమార్చిన కేసులో నిమిష ప్రియకు మరణశిక్ష పడింది. అయితే నిమిషకు వెంటనే మరణశిక్ష అమలు చేయాలని అతని సోదరుడు అబ్దుల్ ఫతాహ్ మెహ్దీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు యెమెన్ డిప్యూటీ జనరల్ను కలిసి మరణశిక్ష తేదీ అమలుకు తేదీని ఖరారు చేయాలని కోరారు. అదే సమయంలో ఆ దేశ అటార్నీ జనరల్కు శిక్షను త్వరగతిన అమలు చేయాలంటూ శుక్రవారం ఓ లేఖ రాశాడు.‘‘మా కుటుంబం అంతా కోరుకునేది ఒక్కటే. ఆమె చేసింది క్రూరమైన నేరానికి పాల్పడింది. ఆ నేరానికి క్షమాపణ ఉండదు.. ఉండబోదు. ఆమెకు తక్షణమే శిక్ష అమలు కావాలి. ఇంక ఆలస్యం చేయకుండా న్యాయం అందించాలి’’ అని ఫేస్బుక్లోనూ ఫతాహ్ ఓ పోస్ట్ చేశాడు. అయితే ఫతాహ్ ఇలా డిమాండ్ చేయడం ఇదే తొలిసారేం కాదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. వాస్తవానికి నిమిషకు మరణశిక్ష జూన్ 7వ తేదీనే అమలు కావాల్సి ఉందని, అయితే దానిని జులై 16వ తేదీకి ాయిదా వేశారు. అప్పట ఇనుంచి అమలు చేయకుండా పెండింగ్లో ఉంచారని ఫతాహ్ ఆరోపిస్తున్నాడు. నిమిషకు మరణశిక్షలో జాప్యం చేయొద్దని జులై 25న, ఆగస్టు 4వ తేదీల్లో అక్కడి అదికారులకు లేఖ రాశాడు. మరోవైపు.. కేరళ మతపెద్ద, భారత గ్రాండ్ ముఫ్తా కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ చేస్తున్న వరుస ప్రకటనలనూ అబ్దుల్ ఫతాహ్ ఖండించాడు. మధ్యవర్తిత్వం, సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతోన్న ప్రయత్నాలు కొత్తవేమీ కావు. మాకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. అలాగే మేం ఎదుర్కొన్న ఒత్తిళ్లు మా అభిప్రాయాన్ని మార్చవు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేం. ఇది ఆ మత పెద్దలు అర్థం చేసుకుంటే మంచిది. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోండి. నిమిషకు శిక్ష పడితేనే మా కుటుంబానికి న్యాయం దక్కేది’’ అని అంటున్నాడు. ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ మరణశిక్ష తన దౌత్యం వల్లే వాయిదా పడిందని కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ తాజాగా ప్రకటించారు. అలాగే.. ఈ వ్యవహారంలో కొందరు ఆ ఘనతేనని ప్రకటించుకున్నారని, అవసరమైతే ఆ క్రెడిట్ వాళ్లకే కట్టబెట్టడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ప్రకటించారు. మరోవైపు.. నిమిష ప్రియ వ్యవహారంలో భారత ప్రభుత్వం తాము చేయగలిగినదంతా చేశామంటూ ఇదివరకే ప్రకటించింది. అయితే శిక్ష వాయిదా ప్రకటనను అధికారికంగా ధృవీకరించిన విదేశాంగ శాఖ.. ఏదైనా పురోగతి కనిపిస్తే అధికారికంగా తామే ప్రకటిస్తామని, అప్పటిదాకా వదంతులను నమ్మొద్దంటూ స్పష్టం చేస్తూ వస్తోంది.

అమెరికాలో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు
ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం కోసం అమెరికాలో స్థిరపడిన తెలుగువారు తమ సంప్రదాయాలను మరవటం లేదు. ఏదేశ మేగినా ఎందుకాలిడినా మాతృదేశ విశ్వాసాలను పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధాలకు వేదికైన రక్షాబంధన్ ను న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. న్యూయార్క్ హిక్స్ విల్లేలో ఉన్న అసమాయ్ హిందూ టెంపుల్ రాఖీ పండగ సంబరాలకు వేదిక అయింది.నైటా ప్రెసిడెంట్ వాణి ఏనుగు ఆహ్వానం మేరకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న తెలుగు కుటుంబాలు ఆనందోత్సహాల మధ్య రాఖీ పండగను నిర్వహించారు. తోడబుట్టిన సోదరులకు కొందరు అక్కాచెల్లెళ్లు రాఖీలు కడితే, తాము స్ధిరపడిన అమెరికాలో బాంధవ్యాల రీత్యా సోదరభావం ఏర్పడిన అన్నలు, తమ్ముళ్లకు సోదరీమణులు రాఖీలు కట్టి, వారి నోరు తీపిచేసి, ఆశీర్వాదాలు అందుకున్నారు.చిన్నపిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారికి నైటా నేతృత్వంలో బహుమతులు అందించారు. అలాగే హాజరైనవారందరికీ నైటా కార్యవర్గం పసందైన విందును కూడా ఏర్పాటుచేసింది. వారాంతం కావటంతో తెలుగు కుటుంబాలన్నీ ఒక్కచోట చేరి రాఖీ వేడుకలకు మరింత శోభను తెచ్చారు.కార్యక్రమంలో నైటా వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, సెక్రటరీ హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ నరోత్తమ్ రెడ్డి బీసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అడ్వయిజరీ కమిటీ, ట్రస్టీలు, ఈవెంట్ స్పాన్సర్లు పాల్గొన్నారు.(చదవండి: ఇండియాకు వెళ్లిపో.. ఐర్లాండ్లో అమానుష ఘటన)

వామ్మో.. మామూలు ఖర్చు కాదు!
తిరిగే కాలు, తిట్టే నోరు ఉరికే ఉండవని సామెత. కొంతమంది తెగ తిరుగుతుంటారు. నిరంతరం ప్రయాణిస్తుంటారు. కొత్త ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలను చుట్టి వస్తుంటారు. ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది. ఉన్నత చదువులు, ఉద్యోగాలతో పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రపంచ యాత్రలు చేస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడడం లేదు.15 లక్షల కోట్లు!ప్రపంచ యాత్రలు చేసేవాడు ప్రజ్ఞావంతుడౌతాడని పెద్దలు చెబుతుంటారు. దీన్నే ఫాలో అవుతున్నారు మనవాళ్లు. విదేశీ ప్రయాణాల కోసం భారతీయులు భారీగానే ఖర్చుపెడుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 2009-10లో విదేశీ ప్రయాణాలకు 17 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.50 లక్షల కోట్లు) వెచ్చించారు. ఈ వ్యయం 2024-25 నాటికి దాదాపు వెయ్యి రెట్లు (975%) శాతం పెరిగి 17 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 15 లక్షల కోట్లు) చేరుకుంది. ఈ లెక్కన చూసుకుంటే సగటు వార్షిక వృద్ధి రేటు 58.2 శాతంగా ఉంది.జర్నీలకే ఎక్కువ!గతంలో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఇండియన్స్ ఎక్కువగా ఖర్చు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రయాణాల కోసం కూడా అధికంగా వెచ్చిస్తున్నారు. ఈక్విటీ నుంచి రియల్ ఎస్టేట్ (Real Estate) వరకు ప్రతిదానికీ డబ్బు ఖర్చు పెడుతున్నారు. అయితే విదేశీ ప్రయాణాలకు కూడా ఎక్కువ మొత్తంలో వ్యయం చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇంకా వివరంగా చెప్పాలంటే విదేశాల్లో చదువు కంటే కూడా జర్నీలు చేయడానికే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఈ వ్యయం గత 15 ఏళ్లలో 1000 రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం.ఎక్కడికి వెళ్తున్నారు?తుర్కియే, ఫ్రాన్స్, మారిషస్, అమెరికా, బ్రెజిల్, చైనాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలను భారతీయులు చుట్టి వస్తున్నారు. 2009 సంవత్సరంలో 1.1 కోట్ల మంది ఇండియన్స్ విదేశాలు వెళ్లారు. కోవిడ్-19 (Covid-19) మహమ్మారికి ముందు ఈ సంఖ్య 2.6 కోట్లకు పెరిగింది. కరోనా సమయంలో ఈ సంఖ్య బాగా తగ్గింది. కానీ, కరోనా ముగిసిన తర్వాత పరిస్థితి మెరుగుపడటంతో, 2022లో విదేశాలకు ప్రయాణించిన (travel abroad) భారతీయుల సంఖ్య మళ్లీ 2 కోట్లు దాటింది.చదువుకెంత ఖర్చు?భారతీయులు మెరుగైన జీవితాన్ని గడపడానికి విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారని టీఓఐ నివేదిక వెల్లడించింది. ఉన్నత విద్య, మెరుగైన ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నారు. ఉపాధికి భరోసాయిచ్చే నాణ్యమైన ఉన్నత విద్య కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. విదేశాల్లో విద్యాభ్యాసం కోసం 2024-25లో మనవాళ్లు చేసిన వ్యయం 9.6 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. 2009-10లో ఈ వ్యయం 549 మిలియన్ డాలర్లు. ఏడాదికి 21 శాతం పెరుగుదల నమోదయింది. చదవండి: ప్రపంచంలోనే ఎత్తైన భవనం.. బుర్జ్ ఖలీఫా ఓనర్ ఎవరో తెలుసా?

ఇండియాకు వెళ్లిపో.. ఐర్లాండ్లో అమానుష ఘటన
విదేశాల్లో భారతీయులపై దాడులు పెరిగిపోతున్న పరిస్థితులు చూస్తున్నదే. తాజాగా ఐర్లాండ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆరేళ్ల చిన్నారిపై తోటి పిల్లలు జాత్యాంహకారం ప్రదర్శించారు. ఆమెపై ఇష్టానుసారం దాడి చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడి భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.ఐర్లాండ్ వాటర్ఫోర్డ్ నగరంలో ఆగస్టు 4వ తేదీన దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన ఆరేళ్ల బాలికపై జాత్యంహకార దాడి జరిగింది. భారత్కు తిరిగి వెళ్లిపో అంటూ తోటి పిల్లల్లో కొందరు ఆమెపై ఈ దాడికి తెగబడడం గమనార్హం. ఈ క్రమంలో ఆమె ప్రైవేట్ భాగాలను గాయపరిచినట్లు తల్లి మీడియాకు వివరించారు.సోమవారం సాయంత్రం కిల్బర్రీ ప్రాంతంలోని తన నివాసం బయట నియా నవీన్(6) తోటి పిల్లలలో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో 12-14 ఏళ్ల వయసున్న పిల్లలు కొందరు బాలిక వద్దకు వచ్చారు. అప్పటిదాకా అక్కడే ఉన్న బాలిక తల్లి.. మరో బిడ్డకు పాలిచ్చేందుకు లోపలికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన ఆ బ్యాచ్ సదరు బాలికపై దాడికి తెగబడింది. ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ.. సైకిల్తో ప్రైవేట్ భాగాలను గాయపరిచింది.బాలిక కేకలు విని బయటకు పరిగెత్తుకొచ్చింది ఆ తల్లి. ఆ సమయంలో వాళ్లంతా పారిపోగా.. నడవలేని స్థితిలో బాలిక భయంతో వణికిపోతూ కనిపించింది. డర్టీ ఇండియన్.. గో బ్యాక్ టూ ఇండియా అంటూ వాళ్లు అసభ్య పదజాలం ప్రయోగిస్తూ ఆ బాలికను వారించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.తాను ఎనిమిదేళ్లుగా ఇక్కడ నర్సుగా పని చేస్తున్నానని, ఈ మధ్యే ఐర్లాండ్ పౌరసత్వం దక్కిందని బాలిక తల్లి అనుపా అచ్యుతన్ ‘ఐరీష్ మిర్రర్’ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘మేం అధికారికంగానే ఇక్కడ వచ్చి ఉంటున్నాం.. మంచి వృత్తుల్లో స్థిరపడ్డాం. కానీ, ఇక్కడ భారతీయులెవరికీ భద్రత లేకుండా పోయింది. చివరికి ఇంట్లోనూ భయంతోనే గడపాల్సి వస్తోంది. నా బిడ్డను నేను దాడి నుంచి రక్షించుకోలేకపోయా. ఆమె ఇక నుంచి మునుపటిలా సరదాగా ఆడుకోలేదని నేను భావిస్తున్నా’’ అని జరిగిన ఘటన గురించి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలిక తల్లి తెలిపింది. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పిల్లలపై కఠిన చర్యలు తీసుకోకుండా.. విషబీజాలను వాళ్ల మనసుల్లోంచి తొలగించేలా కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆమె కోరుకుంటోంది.ఐర్లాండ్లో భారతీయులపై జాత్యాంహకార దాడులు పెరిగిపోయాయి. గత జులై నుంచి ఇప్పటిదాకా ఐదు ఘటనలు చోటు చేసుకున్నాయి. కిందటి నెలలోనూ ఓ భారతీయుడిపై జాత్యహంకార దాడి జరిగింది. రాజధాని నగరం డబ్లిన్లోని టల్లాట్లో 40 ఏళ్ల వ్యక్తిని దుండగులు దుస్తులు విప్పించి హింసించారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను భారత రాయబారి ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక కౌన్సిలర్ బాధితుడిని పరామర్శించి, బాసటగా నిలిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు రెండు నెలల క్రితమే ఆ దేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది. భారతీయులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఐర్లాండ్లోని భారతీయ రాయబార కార్యాలయం అలర్ట్ అయ్యి.. హెల్ప్లైన్ నంబర్లు విడుదల చేసింది.Credits: irishmirror
క్రైమ్

అవకాశాలిప్పిస్తానని పదేళ్ల కిత్రం: నటి అరెస్ట్
చెన్నై: కేరళకు చెందిన మలయాళ సినీ నటి వర్మిని మునీర్, సినిమాల్లో అవకాశం కల్పిస్తాని చెప్పి తన బంధువు అయిన ఓ 14 ఏళ్ల బాలికను కేరళ నుంచి చెన్నైకి తీసుకువచ్చింది. ఆ నటి, ఆ అమ్మాయి తిరుమంగళం ప్రాంతంలోని ఓ లాడ్జిలో బస చేస్తున్నారు. ఆ సమయంలో, నటి ఉంటున్న గదికి నలుగురు యువకులు వచ్చారు. వారు బాలిక పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీనికి నటి మిను మునీర్ కూడా సహకరించారని తెలు స్తోంది. దీంతో బాలిక వారి నుంచి తప్పించుకుని కేరళకు వెళ్లిపోయింది. ఈ సంఘటన జరిగి 10 ఏళ్లు అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాధితు రాలు తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించికేరళ రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ బాలికతో నిర్వహించిన విచారణలో, తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ఆమె వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఘటన చెన్నైలోని తిరుమంగళంలోని ఓ లాడ్జిలో జరిగినట్లు తేలడంతో కేరళ రాష్ట్ర పోలీసులు చెన్నై పోలీసులకు సమాచారం అందించారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, తిరు మంగళం మహిళా పోలీసులు, నటి ప్రోద్బలంతో బాలికను లైంగికంగా వేధించిన సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. దీని తరువాత, మల యాళ నటి మిను మునీర్ ను చెన్నై పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నటిని చెన్నైకి తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులు ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

అల్లుడితో అత్త వివాహేతర సంబంధం..!
విజయనగరం: మండలంలోని కెరటం గ్రామంలో ఈ నెల 9వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందిన నిడిగేట్టి కృష్ణ మృతికి గల కారణం ఆయన భార్యకు మేనల్లుడు సాయితో ఉన్న వివాహేతర సంబంధమేనని గజపతినగరం సీఐ జీఏవీ రమణ తెలిపారు. ఇదే కేసు వివరాలను బొండపల్లి పోలీస్స్టేషన్లో గురువారం సాయంత్రం వెల్లడించారు. మృతుడు నీడిగేటి కృష్ణను నారపాటి సాయి ఈ నెల 9న మద్యం తాగుదామని పిలిచి గ్రామం బయటకు తీసుకుని వెళ్లి అక్కడ అతడి పీక నులిమి హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ హత్య ఘటనలో ప్రధాన నిందితుడు సాయి కాగా మృతుడి భార్య రాజు రెండవ నిందితురాలని, మృతుని కొడుకు మైనర్ కూడా హత్యలో పాల్గొన్నట్లు తెలిసిందన్నారు. ప్రధాన నిందితుడు సాయిని బిళ్లలవలస వద్ద గురువారం సాయంత్రం పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. సమావేశంలో ఎస్ఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మరో అక్రమ ‘సృష్టి’
కుత్బుల్లాపూర్: నగరంలో సంచలనం సృష్టించిన ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ సరోగసీ కేసు విషయం మరవకముందే మేడ్చల్ జిల్లాలో మరో అక్రమ సరోగసీ సెంటర్ బండారం బయట పడింది. శుక్రవారం మేడ్చల్ జిల్లా ఎస్ఓటీ పోలీసులు, జిల్లా వైద్యశాఖ అధికారుల సహాయంతో కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని రింగ్రోడ్డు సమీపంలోని సెంటర్పై దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి మరో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులిద్దరూ తల్లీ కొడుకులే కావడం గమనార్హం. పేట్బషిరాబాద్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి, మేడ్చల్ డీఎంహెచ్ఓ ఉమాగౌరితో కలిసి వివరాలు వెల్లడించారు. ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన నారెద్దుల లక్ష్మిరెడ్డి అలియాస్ లక్ష్మి తన కుమారుడు నరేందర్రెడ్డితో కలిసి కుత్బుల్లాపూర్, చింతల్లో ఉంటోంది. గతంలో లక్ష్మి అండం దాతగా, సరోగసీ తల్లిగా వ్యవహరించింది. దీంతో ఆమెకు పలు ప్రైవేట్ ఫెర్టిలిటీ క్లినిక్లతో సంబంధాలు ఏర్పడ్డాయి. క్లినిక్ నిర్వాహకులతో పరిచయాలు పెంచుకుని సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అండం దానం, సరోగసీ తల్లిగా వ్యవహరించే వారిని గుర్తించి తానే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. దీంతో బీటెక్ పూర్తి చేసిన తన కొడుకు నరేందర్రెడ్డితో కలిసి వ్యూహ రచన చేసింది. సెంటర్పై దాడి.. విశ్వసనీయ సమాచారం అందుకున్న మేడ్చల్ ఎస్ఓటీ, పేట్బషిరాబాద్ పోలీసులు వైద్యశాఖ అధికారుల సహాయంతో సెంటర్పై దాడి చేశారు. లక్ష్మి, నరేందర్రెడ్డిలను అరెస్ట్ చేసి అద్దె గర్భ మహిళలు కర్ణాటక రాష్ట్రం బీదర్కు చెందిన గోల్కొండ సాయిలీల, ఏపీలోని రంపచోడవరం ప్రాంతానికి చెందిన మల్లగల్ల వెంకటలలక్ష్మి, సాదల సత్యవతి, విజయనగరం నివాసులు పంటడ అపర్ణ, రమణమ్మ, అల్లూరి సీతారామారాజు జిల్లాకు చెందిన పి.సునీతలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.6.47 లక్షల నగదు, ల్యాప్టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మిపై 2024లో ఇదే తరహాలో ముంబైలో కేసు నమోదైంది. విచారణ కొనసాగుతోందని, ఇందులో ప్రమేయమున్న ప్రైవేటు ఆస్పత్రులు, ఫెర్టిలిటీ క్లినిక్లను గుర్తించి వాటిపై పట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. మేడ్చల్ ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ ఎ.విశ్వప్రసాద్, ఏసీపీ బాలగంగి రెడ్డి, ఎస్ఓటీ, పేట్బషిరాబాద్ పోలీసులు పాల్గొన్నారు.నిరుపేద మహిళలే లక్ష్యంగా.. లక్ష్మి పలు ప్రైవేట్ ఫెర్టిలిటీ క్లినిక్లతో బేరం కుదుర్చుకుని భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటోంది. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న, నిరుపేద మహిళలే లక్ష్యంగా మచి్చక చేసుకుటుంది. ఆపై వారికి డబ్బు ఆశ చూపించి అండం దానం, సరోగసీ తల్లిగా వ్యవహరించేలా ఒప్పందం చేసుకుంటుంది. ఈ క్రమంలో వారిని తన ఇంట్లోనే పెట్టుకుంది.

గుండెపోటుతో హెచ్ఎం మృతి
శ్రీకాకుళం జిల్లా: మండలంలోని గోపీనగర్లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్.స్వప్న (45) గుండెపోటుతో గురువారం మృతి చెందారు. పని ఒత్తిడితోనే ఆమె చనిపోయారని సహోద్యోగులు చర్చించుకుంటున్నారు. బుధవారం విధులకు హాజరైన ఆమెకు అదే రోజు రాత్రి తీవ్ర గుండె నొప్పి రావడంతో రాజాంలో ఉన్న తన కుటుంబ సభ్యులు శ్రీకాకుళం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. స్వప్నకు భర్త నాగరాజు, కుమార్తె హనీ ఉన్నారు. భర్త నాగరాజు శ్రీకాకుళం ఎస్బీఐ ఏడీబీలో మేనేజర్గా విధులు నిర్వహిస్తుండగా కుమార్తె ఇంటర్ చదువుతోంది. ఉపాధ్యాయురాలు 2023లో ఆమదాలవలస మండలానికి బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి ఆ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఒకరు వెళ్లిపోగా ఈమె ఒక్కరే పాఠశాలలో ఉన్నారు. పని ఒత్తిడి, యాప్లలో నిత్యం అప్లోడ్ చేయాల్సిన అంశాలు తదితర విషయాల్లో ఆమె ఒత్తిడికి గురైనట్లు తోటి ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు.