ప్రధాన వార్తలు

కొలుసుకు భూ గొలుసు
బడాబాబుల లులుకు సబ్సిడీ ఎందుకు? హైదరాబాద్లో ప్రభుత్వంతో సంబంధం లేకుండా మార్కెట్ రేటుకే లీజుకు.. ఏపీలో మాత్రం రూ.వేల కోట్ల ఖరీదైన ప్రభుత్వ భూములు నామమాత్రపు లీజుకు అప్పగింత హైపర్ మార్కెట్ నిర్మించాక భారీగా అద్దెలు వసూలు చేసుకుని జేబులు నింపుకోనున్న లులు ఈ ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లిగవ్వ కూడా దక్కదు! హైపర్ మార్కెట్ ద్వారా వచ్చేవి కూడా తక్కువ జీతాలుండే ఉద్యోగాలేఅయినవారికి అడ్డంగా కట్టబెట్టడం... కావాల్సినవారికి నిలువునా దోచిపెట్టడంలో కూటమి ప్రభుత్వం బరితెగించి వ్యవహరి స్తోంది...! అత్యంత విలువైన భూములను పప్పుబెల్లాలు మాదిరి కారుచౌకగా పంచేస్తోంది..! ఉర్సా నుంచి లులు వరకు... సత్వ మొదలు కపిల్ చిట్ ఫండ్ దాక.. పట్టపగ్గాల్లేకుండా భూ పందేరానికి పాల్పడుతోంది..! కూటమి పార్టీల నేతలకు కట్టబెట్టేస్తోంది...! ఈ క్రమంలో నిన్న జనసేన ఎంపీ బాలశౌరి సంస్థకు 115 ఎకరాలు ధారాదత్తం చేయగా. నేడు మంత్రి కొలుసు పార్థసారథికి చెందిన కంపెనీకి ఏకంగా 845 ఎకరాలు రాసిచ్చేసింది..! ఆ కథాకమామీషు ఇదిగో...!సాక్షి, అమరావతి: ‘‘అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించను’’ అంటూ... దైవసాక్షిగా మంత్రులు ప్రమాణం చేస్తారు. కానీ, దాన్ని పక్కకుపెట్టి సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తన నియోజకవర్గంలోని విలువైన భూములను సొంత సంస్థకు దక్కించుకున్నారు. పరిశ్రమల కోసం అంటూ వందల ఎకరాలను నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్కు కూటమి ప్రభుత్వం ధారదత్తం చేసింది. ఈ సంస్థ మంత్రి పార్థసారథి సతీమణి కమలాలక్ష్మి, ఆయన డ్రైవర్ కొలుసు ప్రసాద్ పేరిట ఏర్పాటైనదే..! కన్స్ట్రక్షన్, టెలికాం, కేబుల్స్ నిర్మాణ రంగాల్లో ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేస్తోంది.⇒ తాజాగా రూ.150 కోట్ల పెట్టుబడితో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి వద్ద 20 టీపీడీ (టన్స్ పర్ డే) సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్కు ఇలా దరఖాస్తు చేసుకోగానే అలా ఏకంగా రూ.845.60 ఎకరాల భూమిని అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం శరవేగంగా ఉత్తర్వులు ఇచ్చేసింది. ⇒ మొత్తం భూమిలో రూ.5 లక్షల చొప్పున 45.60 ఎకరాలను నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్కు పూర్తిగా విక్రయించేలా, సీబీజీ ప్లాంట్ పక్కనే ఖాళీగా ఉన్న మరో 800 ఎకరాలను నైపర్ గడ్డి పెంపకం కోసం లీజు విధానంలో కూటమి ప్రభుత్వం కేటాయించింది. దీనికి ఏడాదికి రూ.15 వేల వంతున.. 25 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ లీజు మొత్తాన్ని 5 శాతం చొప్పున పెంచుతారు.అమ్మిన భూమి విలువే రూ.31 కోట్లుప్రస్తుతం ఆగిరిపల్లి మండలంలో ఎకరం భూమి ధర రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షలు పైనే పలుకుతోంది. అదే రోడ్డు పక్క భూములైతే రూ.కోటి పైమాటే. అంటే, ప్రభుత్వ ధర ప్రకారమే రూ.590 కోట్లకు పైగా విలువైన భూమి అన్నమాట. ఇందులో ఎకరం రూ.5 లక్షలు చొప్పున 45.60 ఎకరాలను అమ్మేసింది. దీని విలువే రూ.31.50 కోట్లు. ఇక రూ.15 వేలు లీజు చొప్పున 800 ఎకరాలను మంత్రి సంస్థకు కూటమి ప్రభుత్వం కానుకగా కట్టబెట్టిందనే చెప్పాలి. ఈ ప్లాంట్ ద్వారా కేవలం 500 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. కేవలం భూములే కాకుండా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద మరిన్ని రాయితీలతో పాటు కేంద్ర గ్రాంట్లను కూడా అందించనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.రిలయన్స్ ప్లాంట్కు మించి..వాస్తవానికి మంత్రి పార్థసారథి సంస్థకు కేటాయించిన భూములు.. దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న సీబీజీ ప్లాంట్కు కూడా ఇవ్వలేదు. ఈ స్థాయిలో కేటాయింపు అంటే.. దీనివెనుక ఏదో అర్థం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కంపెనీలుపార్థసారథి సతీమణి కమలా లక్ష్మి పేరిట నితిన్సాయి కన్స్ట్రక్షన్స్, మరో 4 కంపెనీలు ఉన్నాయి. 2006లో రూ.3.47 కోట్ల మూలధనంతో 301, స్వర్ణ ప్యాలెస్ 13, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ చిరునామాతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. కారుణ్య పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హరిత పవర్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు నేరుగా కొలుసు పార్థసారథి పేరును సూచించేలా కేపీఆర్ టెలీ ప్రొడక్ట్స్ పేరిట మరో కంపెనీ ఉంది. ఈ కంపెనీలతో తన అధికారాన్ని ఉపయోగించుకుని కన్స్ట్రక్షన్, సబ్ స్టేషన్లు, టెలికాం కేబుల్స్ నిర్మాణం వంటి కాంట్రాక్టులను దక్కించుకుంటున్నారు.బడాబాబుల లులుకు సబ్సిడీ ఎందుకు?హైదరాబాద్ లులు మాల్కు వెళ్లి కాఫీ తాగాలంటే కనీసం రూ.100 చెల్లించాలి. పిల్లలు ముచ్చట పడ్డారని పాప్కార్న్ కొందామంటే తక్కువలో తక్కువ రూ.250 వరకు వదిలించుకోవాలి. ఆ మాల్లోని సినిమా థియేటర్లు, బ్రాండెడ్ ఔట్ లెట్స్లో అయితే దీనికి రెట్టింపు ధర చెల్లించాల్సిందే. సీఎం చంద్రబాబుతో లులు గ్రూపు చైర్మన్ యూసఫ్ ఆలీ కేవలం బడాబాబులు విలాసాల కోసం మాల్లు నిర్మించే లులుకు విలువైన ప్రభుత్వ భూములను అత్యంత చౌకగా కేటాయించడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విచిత్రం ఏమంటే... కేరళ, హైదరాబాద్లో మాల్స్ నిర్మించిన లులుకు ఎక్కడా ప్రభుత్వాలు భూములను కేటాయించలేదు. హైదరాబాద్లో ప్రైవేటు సంస్థల నుంచి దీర్ఘకాలం లీజుకు తీసుకుని రూ.1,500 కోట్ల పెట్టుబడితో నిర్మించింది. లులూ హైపర్ మార్కెట్ ద్వారా వచ్చేవి కూడా తక్కువ జీతాలుండే ఉద్యోగాలే. అలాంటి లులుకు చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను కారుచౌకగా అప్పగించడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు.. లులుకు భూ కేటాయింపులపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్కే లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అయితే.. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు పప్పుబెల్లాల్లా భూములను పంచిపెట్టాడాన్ని బహిరంగంగానే తప్పుపడుతున్నారు. విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన భూమిని లాగేసుకుని లులుకు ఇవ్వడంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తక్షణం ఈ జీవో ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్త బంద్కు సిద్ధమంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. అత్యంత విలువైన భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి ఆర్టీసీనే పెద్ద భవనం నిర్మించి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తే ఆస్తులతో పాటు సంస్థకు ఆదాయం పెరిగేదని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. అలాకాకుండా ప్రభుత్వమే ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ బడాబాబుల విలాసాల కోసం లులుకు అప్పగించడం దారుణం అని పేర్కొంటున్నారు. లులు గ్రూపు చైర్మన్ యూసఫ్ అలీ ఇలా విజయవాడ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కౌగిలించుకోగానే.. అలా రెండు రోజుల్లోనే జీవో వచ్చిందంటే వీరి అనుబంధం ఎంత దృఢమైనదో అర్థం అవుతోందని మరో అధికారి వ్యాఖ్యానించారు.ఎంపీ బాలశౌరి తనయుడి కంపెనీకి మల్లవల్లిలో 115 ఎకరాల భూమిజనసేన ఎంపీ బాలశౌరి తనయుడు అనుదీప్ వల్లభనేనికి చెందిన అవిశా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్కు మల్లవల్లి వద్ద ఎకరం రూ.16.5 లక్షలు చొప్పున 115.65 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ అభివృద్ధి చేసిన భూమి ఎకరం ధర రూ.90 లక్షలుగా ఉంది. అంటే రూ.104 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.19 కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మల్లవల్లి ఫుడ్ పార్కులో 13.85 ఎకరాల్లో అవిశాఫుడ్స్.. 83.50 ఎకరాల్లో 500 కేఎల్పీడీ సామర్థ్యంతో బయో ఇథనాల్ యూనిట్ను ఏర్పాటు చేయనుంది.

నిమిష ప్రియ మరణశిక్ష రద్దు!
సనా: భారతీయ నర్సు నిమిష ప్రియకు ఎట్టకేలకు మరణశిక్ష నుంచి విముక్తి లభించింది. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న ఆమెకు గతంలో విధించిన మరణశిక్షను శాశ్వతంగా రద్దుచేసినట్లు భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ మత ప్రబోధకుడు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదలచేసింది. అయితే భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆమెకు మరణశిక్ష రద్దుచేయాలంటూ వస్తున్న అభ్యర్థనలను పరిశీలించేందుకు యెమెన్ రాజధాని సనా సిటీలో ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

‘లండన్ మేయర్ దుష్టుడు’.. సాదిక్ ఖాన్పై ట్రంప్ మాటల దాడి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు నోరు పారేసుకున్నారు. లండన్ మేయర్ను దుష్టుడు అని, అతను చేయకూడని పనిచేశాడని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్లో లండన్కు రావాలనుకుంటున్నారా? అని ట్రంప్ను ఒక విలేకరి అడిగినప్పుడు ఆయన తానేమీ మీ మేయర్ అభిమానిని కాదని, అతను చేయకూడని పనిచేశాడని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు.సోమవారం స్కాట్లాండ్లో యూకే ప్రధానితో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన లండన్ మేయర్ సాదిక్ ఖాన్పై మాటల దాడి చేశారు. కాగా యునైటెడ్ కింగ్డమ్లో అత్యధిక జనాభా కలిగిన లండన్కు మొదటి ముస్లిం మేయర్గా సాదిక్ ఖాన్ గుర్తింపు పొందారు. రాజకీయ ప్రత్యర్థులు తన మతాన్ని విమర్శించిన సందర్బాల్లో సాదిక్ ఖాన్ ఎదురుదాడికి దిగుతుంటారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో సాదిక్ ఖాన్పై పలు విమర్శలు చేశారు. Trump Calls London Mayor A ‘Nasty Person’ Right To Keir Starmer’s Face https://t.co/ZmdNmIEzzh via @dailycaller— But Not This Day (@butnotthisday) July 29, 2025అయితే సాదిక్ ఖాన్ తాను ఇటువంటి విమర్శలను పట్టించుకోనని గతంలోనే స్పష్టం చేశారు. 2016, మే 9న ఖాన్ లండన్ మేయర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి అధ్యక్ష అభ్యర్థి ట్రంప్.. సాదిక్ ఖాన్పై పలు విమర్శలు చేశారు. ‘గుడ్ మార్నింగ్’ బ్రిటన్’లో ఖాన్ను మెరటు వ్యక్తి అని, అజ్ఞాని అని ట్రంప్ సంబోధించారు.

వారిద్దరూ అద్భుతం.. మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: శుబ్మన్ గిల్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో ఓటమి అంచుల నుంచి తప్పించుకొని మ్యాచ్ను భారత్ ‘డ్రా’గా ముగించడంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా... తర్వాతి ఐదు సెషన్లలో మరో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ప్రత్యర్ధిని నిలువరించగలిగింది. ఇది మన జట్టు పట్టుదలను చూపించింది.మాది ఒక గొప్ప జట్టు..ఈ విషయాన్ని భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మంచి జట్టుకు, గొప్ప జట్టుకు మధ్య ఉన్న తేడాను తాము చూపించగలిగామని అతను చెప్పాడు. ‘మైదానంలో 143 ఓవర్ల పాటు ఒకే లక్ష్యంతో ఒకే తరహా ఆలోచనతో మానసికంగా దృఢంగా ఉండటం చాలా కష్టం. కానీ మేం దానిని చేసి చూపించాం. ఒక మంచి జట్టుకు, గొప్ప జట్టుకు మధ్య ఇదే ప్రధాన తేడా. ఈ టెస్టులో ఆటతో మాది గొప్ప జట్టని నిరూపించాం’ అని గిల్ వ్యాఖ్యానించాడు.సున్నాకే 2 వికెట్లు కోల్పోయిన దశలో సీనియర్ కేఎల్ రాహుల్తో కలిసి గిల్ నెలకొల్పిన భాగస్వామ్యమే జట్టు రాతను మార్చింది. 70.3 ఓవర్ల వీరి భాగస్వామ్యంలో 188 పరుగులు వచ్చాయి. ఈ పార్ట్నర్షిప్తోనే తాము మ్యాచ్ను కాపాడుకోగలమనే నమ్మకం కలిగిందని గిల్ చెప్పాడు. ‘మా జట్టు పట్టుదలగా ముందుకు వెళ్లాలంటే కావాల్సిన అగ్గిని రగిల్చేందుకు ఒక నిప్పు కణిక అవసరమైంది. నేను, రాహుల్ కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం అలాంటిదే. మేం పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోగలమని అప్పుడే అనిపించింది. తుది ఫలితం చాలా సంతోషాన్నిచ్చింది. శనివారం మేం ఉన్న స్థితితో పోలిస్తే మ్యాచ్ను డ్రా చేసుకోవడం ఎంతో సంతృప్తికరం. నా ఇన్నింగ్స్ పట్ల కూడా ఎంతో ఆనందంగా ఉన్నా’ అని గిల్ పేర్కొన్నాడు.భారత్ ఓటమి నుంచి తప్పించుకోవడంలో కీలక పాత్ర పోషించిన జడేజా, సుందర్లపై కూడా కెప్టెన్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు 55.2 ఓవర్లు ఆడి అభేద్యంగా 203 పరుగులు జత చేశారు. ‘జడేజా, సుందర్ క్రీజ్లో ఉన్నప్పుడు కూడా బ్యాటింగ్కు అంత అనుకూల పరిస్థితి ఏమీ లేదు.బంతి అనూహ్యంగా స్పందిస్తోంది. కానీ అలాంటి స్థితి నుంచి ప్రశాంతంగా ఆడుతూ ఇద్దరూ సెంచరీలు సాధించడం చాలా గొప్ప విషయం. ఏకాగ్రత చెదరకుండా ప్రతీ బంతిపై వారు దృష్టి పెట్టి డ్రా వరకు తీసుకెళ్లడం ఎంతో ప్రత్యేకం. ఇది మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని గిల్ అన్నాడు.చదవండి: IND vs PAK: ‘పాక్తో మ్యాచ్ ఆడాలి’!.. గంగూలీపై అభిమానుల ఆగ్రహం

అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యూయార్క్ సెంట్రల్ మాన్హట్టన్లో జరిగిన ఈ కాల్పుల ఘటనలో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారితో సహా నలుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. సీఎన్ఎస్ నివేదిక ప్రకారం కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వెగాస్కు చెందిన 27 ఏళ్ల షేన్ తమురాగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కూడా గాయాలతో మృతిచెందాడని పోలీసులు తెలిపారు.గ్రాండ్ సెంట్రల్ స్టేషన్, రాక్ఫెల్లర్ సెంటర్, మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్లకు సమీపంలోని మిడ్టౌన్ మాన్హట్టన్లోని రద్దీగా ఉండే ప్రాంతంలోని ఒక భవనంపైకి కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతంలో లాక్డౌన్ విధించారు. ఈ ప్రాంతంలో పలు ఫైవ్ స్టార్ హోటళ్లు, కోల్గేట్-పామోలివ్, ఆడిటింగ్ సంస్థ కేపీఎంజీతో సహా పలు కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలన్నాయి. మేయర్ ఎరిక్ ఆడమ్స్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఈ దాడిపై విచారం వ్యక్తం చేశారు. పోలీసు అధికారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.4 people, including NYPD officer, killed in shooting at Manhattan office building. https://t.co/7Fj8zQKr5b— Ground News (@Ground_app) July 29, 2025పోలీసులు ‘ఎక్స్’లో పార్క్ అవెన్యూలో జరిగిన ఘటనలో నిందితుడు మృతి చెందాడని, అతని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఘటన జరిగిన అనంతరం ఆ స్థలాన్ని తమ స్వాధీనంలోనికి తీసుకున్నామని, ఒంటరి షూటర్ను చుట్టుముట్టామని పోలీసు కమిషనర్ జెస్సికా టిష్ ‘ఎక్స్’ లో రాశారు. ఫాక్స్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనలో ఒక పోలీసు అధికారితో సహా కనీసం ఆరుగురిపై కాల్పులు జరిగాయని, ఆ అధికారి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. సాయంత్రం రద్దీ సమయంలో పార్క్ అవెన్యూ సమీపంలో అధికారులు ఉన్న సమయంలో కొందరు సాయుధులు, బాలిస్టిక్ షర్టులను ధరించి కాల్పులు జరిపారని సమాచారం.

జగన్ నెల్లూరు పర్యటనపైనా ఆంక్షలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఈనెల 31న వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో పోలీసులు మరోమారు కఠిన ఆంక్షలు విధించారు. ఆయన పర్యటనలో ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారు. హెలిప్యాడ్ వద్దకు కేవలం పది మందిని మాత్రమే అనుమతిస్తామని, ర్యాలీగా వెళ్లొద్దని, అభిమానులు తరలిరావడానికి వీల్లేదంటూ వివిధ ఆంక్షలతో వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులిచ్చారు. ఈ ఆంక్షలపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు.మాజీమంత్రి కాకాణితో ములాఖత్.. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిపై దాదాపు 13 అక్రమ కేసులు బనాయించి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ జగన్ కాకాణితో ములాఖత్ కానున్నారు. అక్కడ నుంచి.. టీడీపీ రౌడీమూకలు ఇటీవల ధ్వంసం చేసిన మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి వెళ్తారు.ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఈ మేరకు వైఎస్ జగన్ పర్యటన ఖరారు కావడంతో పోలీసులు ఆయన పర్యటనలో ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకు కఠినమైన ఆంక్షలు విధిస్తూ ఇప్పటికే వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డికి రెండు నోటీసులు అందించారు.హెలిప్యాడ్ వద్దకు పది మందే వెళ్లాలంట..ఇక వెంకటాచలం మండలం చెముడుగుంటలోని సెంట్రల్ జైలుకు సమీపంలో పోలీసులు అనుమతిచ్చిన హెలిప్యాడ్ వద్దకు కేవలం పదిమంది మాత్రమే వెళ్లాలని, అంతకుమించి ఎవరూ వెళ్లకూడదని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే, జైలు ఆవరణలోకి ఎవరూ రాకూడదని, కేవలం ముగ్గురితోనే వెళ్లి కాకాణితో ములాఖత్ కావాలని స్పష్టంచేశారు.అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరులోని ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి కేవలం మూడు వాహనాల్లోనే వెళ్లాలని ఈనెల 27న నోటీసు ఇ చ్చిన పోలీసులు సోమవారం దానిని సవరించి 15 వాహనాలతో వెళ్లొచ్చని మరో నోటీసు జారీచేశారు. అయితే, ప్రసన్నకుమార్రెడ్డి ఇంటి వద్దకు ఎవరూ వెళ్లకూడదని, ఒక్క వైఎస్ జగన్ మాత్రమే వెళ్లాలంటూ నోటీసులు ఇవ్వడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.గతంలో హెలిప్యాడ్కు అనుమతి ఇవ్వకుండా.. నిజానికి.. ఈనెల 3న వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన ఖరారైనప్పటికీ హెలిప్యాడ్కు స్థల అనుమతులు కూడా ఇవ్వకుండా టీడీపీ కూటమి నేతలు అడ్డంకులు సృష్టించారు. ప్రైవేటు స్థలంలో హెలికాప్టర్ దిగేందుకు స్థల యజమాని ఒప్పుకున్నా.. కూటమి నేతలు వారిని భయపెట్టి స్థలం ఇవ్వనీయకుండా అడ్డుకున్నారు.పోలీసులు సైతం హెలిప్యాడ్కు అనుమతులివ్వకుండా ఇబ్బందిపెట్టారు. ఈ నేపథ్యంలో.. స్థానిక ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి హెలిప్యాడ్ను అనుమతివ్వాలని న్యాయస్థానానికి వెళ్లడంతో అప్పట్లో జగన్ పర్యటన వాయిదా పడింది. ఈసారి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పర్యటన ఆపేదిలేదని తెగేసి చెప్పడంతో పోలీసులు కఠినమైన ఆంక్షలు పెట్టి అనుమతులిచ్చారు.ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకే.. ఇదిలా ఉంటే.. ఏడాదిలోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించకుండా తప్పుచేశామన్న భావన ప్రజల్లో బలంగా ఏర్పడడంతో ఆయన ఎక్కడకెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఊహించని స్థాయిలో జనం రావడాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకే ఆ ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకు జగన్ పర్యటనలకు ఇలా ఆంక్షలు విధిస్తూ.. కుట్రలు పన్నుతోంది.

ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: శు.పంచమి రా.12.43 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: ఉత్తర రా.8.33 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: తె.5.38 నుండి 7.12 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.04 వరకు, తదుపరి రా.10.59 నుండి 11.43 వరకు,అమృతఘడియలు: ప.12.55 నుండి 2.36 వరకు, నాగ పంచమిసూర్యోదయం : 5.40సూర్యాస్తమయం : 6.31రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం..... ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ. ఉద్యోగులకు హోదాలు.వృషభం.... మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు ఒత్తిడులు.మిథునం.... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.కర్కాటకం... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. నిరుద్యోగుల యత్నాలు సఫలం. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.సింహం... అనుకున్న పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. మిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కన్య....పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. పరిచయాలు పెరుగుతాయి. సన్మానయోగం. దైవచింతన. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.తుల... బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.వృశ్చికం... పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.ధనుస్సు.. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. విందువినోదాలు. పరిచయాలు పెరుగుతాయి. బంధువుల కలయిక. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.మకరం.... కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ఖర్చులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు.కుంభం... మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. ఏ పని కూడా ముందుకు సాగదు. కుటుంబంలో ఒత్తిడులు. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.మీనం... సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

నిలువెత్తు అబద్ధాలకు అసలైన వారసుడు లోకేశ్
సాక్షి, అమరావతి: ‘బాబూ.. లోకేశ్..! మీ తండ్రి చంద్రబాబు 100కు 100 శాతం అబద్ధాలు చెప్తే మీరు 100కు 200 శాతం అబద్ధాలు చెప్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. నిలువెత్తు అబద్ధాలకు అసలైన, సిసలైన వారసుడు మీరే. ‘సాక్షి’ పత్రిక వాస్తవాలు రాస్తే తట్టుకోలేక అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు’ అని వైఎస్సార్సీపీ మండిపడింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పార్టీ ట్వీట్ చేసింది. ‘ఎన్టీఆర్గారిని మీ నాన్న వెన్నుపోటు పొడిచిన దగ్గర్నుంచి, అత్యంత చెత్త పాలన చేస్తున్న మీకు జాకీలుగా పనిచేయడమే ఎల్లో మీడియా పని. నాణేనికి రెండోవైపు చూపిస్తున్న ‘సాక్షి’పై మీ దుగ్ధ కొత్త విషయమేమీ కాదు’ అని స్పష్టం చేసింది. ట్వీట్ ద్వారా ఇంకా వైఎస్సార్సీపీ ఏమన్నదంటే...?⇒ లోకేశ్ గారూ... తమ ఏలుబడిలో ప్రభుత్వ విద్యారంగం మొత్తం ధ్వంసమైందన్న సంగతి ప్రజలకు తెలిసిందే. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పడిపోకపోతే ఇప్పుడు పనిచేస్తున్న లెక్చరర్లలో మిగులు ఎందుకు ప్రకటించినట్లు? ఆయా కాలేజీల్లో 455 పోస్టులను ఎందుకు రద్దు చేశారు? మరో 150 మంది లెక్చరర్లను మిగులుగా ప్రకటించడానికి ఎందుకు ఫైల్ సిద్ధం చేసినట్టు? ⇒ గత ఏడాది కన్నా అడ్మిషన్లు పెరిగితే లెక్చరర్ల సంఖ్య పెరగాలి కదా? ఏప్రిల్ 23న టెన్త్, జూన్ 12న సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా వచ్చాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు జూన్ 2 నుంచి ప్రారంభమయ్యాయి. జూలై పూర్తి కావొస్తోంది. అయినా, ఇంకా అడ్మిషన్లు పెరుగుతున్నాయని చెప్పడం వాస్తవాలను మరుగునపరచడమే కదా? ⇒ మీ తింగరి చర్యల కారణంగా ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పడిపోయిన మాట వాస్తవం కాదా? ‘సాక్షి’ పత్రిక ఆ విషయాన్ని జూలై 9న వెలుగులోకి తీసుకురాలేదా? ఇప్పుడు కూడా ‘సాక్షి’ వాస్తవాలను రాసేసరికి అంకెల గారడీ చేయడానికి మీరు సాగిస్తున్న ప్రయత్నాలపై మీ శాఖ సిబ్బందిలో విస్తృతంగా చర్చ జరుగుతున్నమాట వాస్తవం కాదా? ⇒ విద్యా సంస్కరణల్లో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచి్చన హైసూ్కల్ ప్లస్ ఎందుకు రద్దు చేశారు? ⇒ బాలికలకు మండలానికో జూనియర్ కాలేజీ ఎందుకు రద్దైంది? ⇒ సీబీఎస్ఈని ఎందుకు రద్దు చేశారు? ⇒ ఐబీ దాకా ప్రయాణాన్ని ఎందుకు ఆపేశారు? ⇒ టోఫెల్ క్లాసులను ఎందుకు నిలిపేశారు? ⇒ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను ఎందుకు ఇవ్వడంలేదు? ⇒ డిజిటల్ ఎడ్యుకేషన్పై పెట్టిన సిలబస్ను ఎందుకు రద్దు చేశారు? ⇒ గోరు ముద్దను ఎందుకు దెబ్బతీశారు? ఇప్పుడు ఎందుకు ఆ నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వలేకపోతున్నారు? రోజుకో మెనూను ఎందుకు తీసేశారు? ⇒ నాడు–నేడు పనులను ఎందుకు నిలిపేశారు? ⇒ విద్యా దీవెన, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన రూ.6,400 కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు? వీటికి సమాధానాలు చెప్పగలరా లోకేశ్..? అని వైఎస్సార్సీపీ ఎక్స్ వేదికగా నిలదీసింది.

గాజాలో కరువు వాస్తవమే: ట్రంప్
స్కాట్లాండ్: గాజాలో కరువు పరిస్థితులున్న విష యం వాస్తవమేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. కరువు లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదన్నారు. ‘టీవీల్లో చూస్తే తెలుస్తుంది. అక్కడున్న చిన్నారులు ఎంత ఆకలితో ఉన్నారో... అక్కడ నిజంగానే కరువుంది. దీనిని దాచిపెట్టలేం’అని స్కాట్లాండ్లో పర్యటిస్తున్న ట్రంప్ సోమ వారం పేర్కొన్నారు. గాజా ప్రాంతంలో అమెరికా ఆహార కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, చిన్నారుల పొట్ట నింపుతుందని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా సంచరించే చోట, సరిహద్దులు లేని చోట తాము అవాంతరాలు కల్పించబోమన్నారు. గాజా లో హమాస్ చేయలేనిది ఎంతో చేయగలమన్నారు. ‘బందీలందరినీ హమాస్ ఎక్కడ దాచిందో తెలిసిన ఇజ్రాయెల్ హమాస్తో ఒప్పందం కష్టమంటోంది. అదే సమ యంలో, చిట్టచివరి 20 మంది బందీలను హమాస్ రక్షణ కవచాలుగా భావిస్తోంది. అందుకే, వారిని వి డుదల చేయడం లేదు’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.గాజాలో 17 టన్నుల ఆహారం జారవేతయూఏఈ వైమానిక దళం విమానాలు రెండో రోజు సోమవారం గాజాలోని పాలస్తీనియన్లకు 17 టన్నుల ఆహార పదార్థాలను జారవిడిచాయని జోర్డాన్ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 19 టన్నుల ఆహార పదార్థాలను ఒక ట్రక్కు కింద లెక్క. అంటే ట్రక్కు కంటే తక్కువ ఆహారాన్ని విడిచినట్లేనని ఐరాస పాలస్తీనా శరణార్థి విభాగం చీఫ్ ఫిలిప్ తెలిపారు. ఆదివారం 25 టన్నుల ఆహార ప్యాకెట్లను జారవిడవడం తెల్సిందే. ఇజ్రాయెల్ ఆర్మీ నెలలుగా అమలు చేస్తున్న దిగ్బంధంతో గాజాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడటం, జనం, ముఖ్యంగా చిన్నారులు ఆకలి చావులకు గురవుతుండటంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.పుతిన్కు గడువు 10, 12 రోజులేఉక్రెయిన్తో ఒప్పందానికి రాకుంటే ఆంక్షలేట్రంప్ తాజా హెచ్చరికఉక్రెయన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు విధించిన 50 రోజుల గడువును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదించారు. అధ్యక్షుడు పుతిన్ 10, 12 రోజుల్లో ఉక్రెయిన్తో ఒప్పందం చేసుకోకుంటే ఆంక్షలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమవారం ఆయన స్కాట్లాండ్లో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని కావాలనే పొడిగిస్తూ పోతున్న పుతిన్ వైఖరితో అసహనంతో ఉన్నానన్నారు. ఇంత సుదీర్ఘకాలం వేచి ఉండటంలో అర్థం లేదంటూ, మున్ముందు ఏం జరగనుందో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. అందుకే పుతిన్కు తక్కువ సమయం ఇస్తున్నట్లు తెలిపారు. భారీ టారిఫ్ల ను రష్యాపై విధిస్తారా అన్న ప్రశ్నకు ఆయన.. ఇందుకు సంబంధించిన చర్యలపై ఇవ్వాళోరేపో ఒక అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రకటించారు. ప్రస్తుత పరిణామాలపై పుతిన్తో మాట్లా డాలనే ఆసక్తి తనకు అంతగా లేదని చెప్పారు.

భూకంపం వస్తోంది.. జాగ్రత్త..!
ఫోన్ అంటే కాల్స్, మెసేజెస్, వినోదమేనా? అంతకు మించి.. చూడ్డానికి చిన్న పరికరమే కావొచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కాపాడే సంజీవని కూడా. అవును మీరు చదువుతున్నది నిజమే. భూకంప కేంద్రం నుంచి తీవ్రత చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించేలోపే.. విపత్తు రాబోతోందని యూజర్లను హెచ్చరించే వ్యవస్థ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంది. మొబైల్లోని యాక్సిలరేషన్ సెన్సార్ల ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ ప్రపంచంలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించే ప్రజలకు సందేశాల రూపంలో హెచ్చరిస్తోంది.– సాక్షి, స్పెషల్ డెస్క్ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్ (ఏఈఏ) వ్యవస్థను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2020 నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లలో పరిచయం చేసింది. ప్రాథమిక (ప్రైమరీ వేవ్స్), ద్వితీయ (సెకండరీ వేవ్స్) భూకంప తరంగాలను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. ఏఈఏ సిస్టమ్ ఇప్పటి వరకు 98 దేశాలలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించే ప్రజలకు హెచ్చరికలను పంపింది. ఇప్పటి వరకు 18,000 పైచిలుకు భూకంప సంఘటనలకు సంబంధించి 79 కోట్లకుపైగా అలర్ట్స్ జారీ చేసింది. ఈ వ్యవస్థ ఇప్పుడు నెలకు సగటున 60 హెచ్చరికలను పంపుతోంది. దాదాపు 1.8 కోట్ల మంది కనీసం ఒక హెచ్చరికనైనా అందుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. గూగుల్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ సీస్మాలజీ ల్యాబొరేటరీ మూడు సంవత్సరాలుగా ఈ వ్యవస్థ పనితీరు, పద్ధతులను వివరిస్తూ డేటాను విడుదల చేశాయి.సెకన్ల ముందు హెచ్చరిక..భూకంపం వచ్చే కొన్ని సెకన్ల ముందు యూజర్లకు ఏఈఏ హెచ్చరిక సందేశాన్ని పంపుతుంది. భూకంప తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉంటే ‘మీరు జాగ్రత్త’ అని, ముప్పు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటే ఆడియో రూపంలో వార్నింగ్తోపాటు పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది. భూ ప్రకంపనలను గుర్తించడానికి ఫోన్లోని యాక్సిలెరోమీటర్ సాయంతోనే భూ ప్రకంపనలను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. భూకంప తరంగాలు ఫోన్ను చేరగానే ఆ సమాచారాన్ని గూగుల్ సర్వర్లకు పంపుతుంది. ఒక ప్రాంతంలోని ఇతర ఫోన్ల నుంచి కూడా ఇలాంటి సమాచారమే వస్తే భూకంపం సంభవించినట్టు గూగుల్ నిర్ధారిస్తుంది. అత్యంత తీవ్రంగా భూమి కంపించకముందే ప్రభావిత ప్రాంతంలో.. ఆండ్రాయిడ్ ఫోన్ను వాడుతున్న వారికి ఈ వ్యవస్థ హెచ్చరికలను పంపుతుంది. భూకంప తరంగాల కంటే వేగంగా హెచ్చరికలను ప్రసారం చేయడానికి ఏఈఏ కాంతి వేగాన్ని ఉపయోగిస్తుంది.యూఎస్తో మొదలు..ఏఈఏ వ్యవస్థ తొలుత 2020లో యూఎస్లో మొదలైంది. 2021లో న్యూజిలాండ్, గ్రీస్లో, ఆ తర్వాత మిగిలిన దేశాలకు విస్తరించారు. ఈ వ్యవస్థ హెచ్చరించిన సంఘటనల్లో 2023లో టర్కీ–సిరియా (రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.8), ఫిలిప్పీన్స్ (6.7), నేపాల్ (5.7), 2025 ఏప్రిల్లో టర్కీలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపాలు ఉన్నాయి. ఇప్పటివరకు గుర్తించిన సంఘటనలలో 2,000 కంటే ఎక్కువ తీవ్ర భూకంపాలు ఉన్నాయి. ఇక ఏఈఏ బృందం 2023 ఫిబ్రవరి–2024 ఏప్రిల్ మధ్య 15 మందిని సర్వే చేస్తే.. 79% మంది ఈ హెచ్చరికలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. భూకంపం రాకముందే హెచ్చరిక అందుకున్నట్టు 5.4 లక్షల మంది చెప్పడం విశేషం.కోట్లాది మందికి..2023 నవంబర్లో ఫిలిప్పీన్స్లో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు.. భూకంపం ప్రారంభమైన 18.3 సెకన్ల తర్వాత ఈ వ్యవస్థ మొదటి హెచ్చరికను పంపింది. అత్యంత తీవ్ర ప్రకంపనలు సంభవించిన భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్నవారికి 15 సెకన్లపాటు మెసేజులు పంపారు. దూరంగా ఉన్నవారికి, తక్కువ ప్రకంపనలు వచ్చిన ప్రాంత యూజర్లకు ఒక నిమిషంపాటు అలర్ట్స్ జారీ చేశారు. ఇలా మొత్తంగా 25 లక్షల మందిని అప్రమత్తం చేశారు. 2023 నవంబర్లో నేపాల్లో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు కోటి మందికిపైగా హెచ్చరికలు అందాయి. 2025 ఏప్రిల్లో టర్కీలో భూమి కంపించడం ప్రారంభమైన 8 సెకన్ల తర్వాత మొదటి అలర్ట్ జారీ అయింది. ఈ ఘటనలో 1.1 కోట్ల మందికిపైగా ఈ సందేశాలు అందుకున్నారు.అలర్ట్స్ అందుకోవాలంటే వినియోగదారులు వైఫై లేదా సెల్యులార్ డేటా కనెక్టివిటీని కలిగి ఉండాలి. ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్, లొకేషన్ సెట్టింగ్స్ రెండూ ఆన్లో ఉండాలి.భూకంప తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉంటే ‘మీరు జాగ్రత్త’ అని, ముప్పు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటే ఆడియో రూపంలో వార్నింగ్తోపాటు పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది.
అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం..
‘లండన్ మేయర్ దుష్టుడు’.. సాదిక్ ఖాన్పై ట్రంప్ మాటల దాడి
ఇంగ్లండ్తో ఐదో టెస్టు.. భారత జట్టులో కీలక మార్పులు! వారిద్దరిపై వేటు?
ఓటీటీలో హిట్ సినిమా.. ఎమోషనల్గా 'అక్కా-తమ్ముడి' అనుబంధం
ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కోశాధికారిగా అలెక్స్
సొంత ఊరు లేదు.. కొత్త ఊరు రానివ్వరు
ఫోన్లో యువకుడితో మాట్లాడుతోందని..
పాములు, కుక్కలతో వినూత్న నిరసన
వారిద్దరూ అద్భుతం.. మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: శుబ్మన్ గిల్
ఆ ఆస్తులన్నీ నా కుమారుడివే..?
'నేను చేసిన తప్పు మీరు చేయకండి.. నాలుగేళ్లలో 750 ఇంజెక్షన్లు'
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
డిప్యూటీ సీఎం డ్యూటీ.. వెంటనే సీఎం డ్యూటీ
మీకు దండం పెడతా.. దయచేసి కూర్చోండి..!
చరిత్ర సృష్టించిన రాహుల్-గిల్ జోడీ.. ప్రపంచంలోనే
‘సృష్టి’ మాయ.. 90వేలకు కొనుగోలు చేసి.. 40లక్షలకు శిశువు అమ్మకం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్ చేయాలనుంది: నాగచైతన్య
కెరీర్ పతనంతో డిప్రెషన్.. పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్? 25 ఏళ్లుగా మిస్సింగ్
'హరి హర వీరమల్లు'కు జూనియర్ దెబ్బ
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
చాలా సంతోషంగా ఉంది.. అందుకే వారు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు: గిల్
కొత్త రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీ
చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్
.. రాష్ట్రాన్ని నెంబర్వన్ చేస్తారంటే.. అప్పుల్లోనా సార్!
తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్, అనన్య మార్క్స్ షీట్ వైరల్
వాళ్లేమో కుర్చీ కోసం కోట్లాడుకుంటున్నారు. వీళ్లేమో అధికారాల కోసం కొట్టుకుంటున్నారు!
డబుల్ ధమాకా: రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. భార్య ఆరో నెల గర్భిణీ!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
10 ఏళ్లుగా డిప్రెషన్.. చనిపోతానని నాన్న ఎప్పుడో చెప్పాడు: జయసుధ కుమారుడు
అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం..
‘లండన్ మేయర్ దుష్టుడు’.. సాదిక్ ఖాన్పై ట్రంప్ మాటల దాడి
ఇంగ్లండ్తో ఐదో టెస్టు.. భారత జట్టులో కీలక మార్పులు! వారిద్దరిపై వేటు?
ఓటీటీలో హిట్ సినిమా.. ఎమోషనల్గా 'అక్కా-తమ్ముడి' అనుబంధం
ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కోశాధికారిగా అలెక్స్
సొంత ఊరు లేదు.. కొత్త ఊరు రానివ్వరు
ఫోన్లో యువకుడితో మాట్లాడుతోందని..
పాములు, కుక్కలతో వినూత్న నిరసన
వారిద్దరూ అద్భుతం.. మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: శుబ్మన్ గిల్
ఆ ఆస్తులన్నీ నా కుమారుడివే..?
'నేను చేసిన తప్పు మీరు చేయకండి.. నాలుగేళ్లలో 750 ఇంజెక్షన్లు'
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
డిప్యూటీ సీఎం డ్యూటీ.. వెంటనే సీఎం డ్యూటీ
మీకు దండం పెడతా.. దయచేసి కూర్చోండి..!
చరిత్ర సృష్టించిన రాహుల్-గిల్ జోడీ.. ప్రపంచంలోనే
‘సృష్టి’ మాయ.. 90వేలకు కొనుగోలు చేసి.. 40లక్షలకు శిశువు అమ్మకం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్ చేయాలనుంది: నాగచైతన్య
కెరీర్ పతనంతో డిప్రెషన్.. పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్? 25 ఏళ్లుగా మిస్సింగ్
'హరి హర వీరమల్లు'కు జూనియర్ దెబ్బ
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
చాలా సంతోషంగా ఉంది.. అందుకే వారు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు: గిల్
కొత్త రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీ
చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్
.. రాష్ట్రాన్ని నెంబర్వన్ చేస్తారంటే.. అప్పుల్లోనా సార్!
తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్, అనన్య మార్క్స్ షీట్ వైరల్
వాళ్లేమో కుర్చీ కోసం కోట్లాడుకుంటున్నారు. వీళ్లేమో అధికారాల కోసం కొట్టుకుంటున్నారు!
డబుల్ ధమాకా: రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. భార్య ఆరో నెల గర్భిణీ!
నాన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చేయకు
10 ఏళ్లుగా డిప్రెషన్.. చనిపోతానని నాన్న ఎప్పుడో చెప్పాడు: జయసుధ కుమారుడు
సినిమా

మాంచెస్టర్లో ఇంగ్లాండ్ ప్లేయర్ల హైడ్రామా.. బెన్ స్టోక్స్పై అమితాబ్ సెటైర్లు!
టీమిండియా నాలుగో టెస్ట్ మ్యాచ్పై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో చివర్లో జరిగిన హైడ్రామాపై సోషల్ మీడియా వేదికగా అమితాబ్ రియాక్ట్ అయ్యారు. ట్విటర్ వేదికగా చేసిన పోస్ట్కు తనదైన శైలిలో క్యాప్షన్ రాసుకొచ్చారు. అరే.. మనోడు తెల్లోడికి టీకా ఇచ్చిపడేశాడు అంటూ ట్వీట్ చేశారు. ఇది కాస్తా నెట్టంట వైరల్ కావడంతో ఫ్యాన్స్ సైతం ఈ పోస్ట్ రీపోస్ట్ చేస్తున్నారు.అయితే ఫోర్ట్ టెస్ట్లో జడేజా, సుందర్ సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ డ్రాకు అంగీకరించాలని జడేజాను కోరాడు. కానీ జడేజా, సుందర్ మ్యాచ్ను ముగించేందుకు నిరాకరించారు. అప్పటికీ ఇంకా 15 ఓవర్ల ఆట మిగిలి ఉండడంతో భారత బ్యాట్స్మెన్ డ్రాకు నిరాకరించారు. బెన్ స్టోక్స్ డ్రా ఆఫర్ను తిరస్కరించాక.. జడేజా, సుందర్ తమ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు జట్ల కెప్టెన్ల అంగీకారంతో టెస్ట్ డ్రాగా ముగించారు. మ్యాచ్ చివర్లో ఇంగ్లాండ్ ప్లేయర్లు చేసిన హంగామాతో సోషల్ మీడియాలో ట్రోల్ పెద్దఎత్తున వైరలయ్యాయి. కాగా.. ఈ మ్యాచ్లో జడేజా 107 పరుగులు సాధించగా.. వాషింగ్టన్ సుందర్ 101 రన్స్తో నాటౌట్గా నిలిచారు.ఇక సినిమాల విషయానికొస్తే అమితాబ్ బచ్చన్ సెక్షన్ 84 అనే చిత్రంలో కనిపించనున్నారు. ఇందులో నిమ్రత్ కౌర్, డయానా పెంటీ, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రల్లో నటించారు. ఆ తర్వాత టాలీవుడ్ మూవీ కల్కి 2898 ఏడీ పార్ట్-2లో నటించనున్నారు. Take !?? अरे गोरे को टिका (tika - sorry tayka diya ) दिया रे !!🤣 https://t.co/1ybakYvNFM— Amitabh Bachchan (@SrBachchan) July 27, 2025

'మహావతార్ నరసింహా' కలెక్షన్.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా
కొన్నిసార్లు చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తుంటాయి. అలా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'మహావతార్ నరసింహా' అనే యానిమేటెడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా యానిమేటెడ్ చిత్రాలు మన దగ్గర పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. కానీ ఈ మూవీ మాత్రం మౌత్ టాక్తో పాటు కళ్లు చెదిరే కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. తాజాగా ఆదివారం ఒక్కరోజే ఏకంగా రూ.10 కోట్లకు పైన వసూళ్లు రావడం విశేషం.ఓవైపు 'హరిహర వీరమల్లు' లాంటి తెలుగు సినిమా పోటీ ఉన్నప్పటికీ.. 'మహావతార్ నరసింహా' స్క్రీన్ కౌంట్ పెంచుకుంటూ పోతోంది. తొలిరోజు కొన్ని థియేటర్లు దక్కగా.. రెండోరోజు, మూడో రోజుకి థియేటర్ల సంఖ్య పెరిగింది. అదే రీతిన వసూళ్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. తొలిరెండు రోజుల్లో కలిపి రూ.5 కోట్ల మేర కలెక్షన్స్ రాగా.. మూడో రోజైన ఆదివారం మాత్రం దేశవ్యాప్తంగా రూ.11.25 కోట్లు వచ్చినట్లు స్వయంగా నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)ఈ లెక్కన చూసుకుంటే మూడు రోజుల్లో కలిపి దాదాపు రూ.20 కోట్ల వసూళ్లకు చేరువలో ఉందని తెలుస్తోంది. కేజీఎఫ్, కాంతార, సలార్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేటెడ్ సినిమా 'మహావతార్ నరసింహా'. మనకు బాగా తెలిసిన విష్ణు అవతారాలు ఆధారంగా ఓ యూనివర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా రిలీజైన తొలి పార్ట్ ఇది. నరసింహా స్వామి అవతారం స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా అమితంగా నచ్చేస్తోంది.సాధారణంగా మన దగ్గర యానిమేటెడ్ మూవీస్ పెద్దగా వర్కౌట్ కావు. గతంలో 'హనుమాన్' తదితర చిత్రాలు వచ్చాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సరే వసూళ్లు రాబట్టుకోలేకపోయాయి. ఈ సినిమా మాత్రం కోట్ల రూపాయలు కలెక్షన్స్, అది కూడా పాన్ ఇండియా లెవల్లో అంటే విశేషమనే చెప్పాలి.(ఇదీ చదవండి: ఏంటమ్మా అన్నావ్, ఇంకోసారి అను.. అనసూయపై మళ్లీ ట్రోలింగ్!)

'ఎప్పటికీ నేను మీ బక్కోడు'.. తెలుగులో అనిరుధ్ అదిరిపోయే స్పీచ్!
విజయ్ దేవరకొండ వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. తిరుపతి వేదికగా కింగ్డమ్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ఇక రిలీజ్కు మూడు రోజుల సమయం మాత్రమే ఉండడంతో హైదరాబాద్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యూసుఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో జరిగిన ఈ ఈవెంట్కు కింగ్డమ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు ఆడియన్స్ను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగులో మాట్లాడి అందిరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.అనిరుధ్ మాట్లాడుతూ..'ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చిన అభిమానులకు నా ధన్యవాదాలు. గత 12 ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్నారు. నన్ను మీ కొడుకులా చూసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను మీ వాడిని చేసుకున్నారు. మీరు నా వాళ్లు అయ్యారు. ఎప్పటికీ నేను మీ అనిరుధ్నే.. అలాగే మీ బక్కోడు..' అంటూ తెలుగులో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Once again Proved Telugu audience >>>> Any industry 🥵🥵🔥🔥#VijayDeverakomda #Kingdom #KingdomOnJuly31st pic.twitter.com/S6eUwfUqLq— Srinivas (@srinivasrtfan) July 28, 2025

మరో ఓటీటీకి సూపర్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ కమెడియన్ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం గరుడన్. విడుదలై మూవీతో హీరోగా ఆకట్టుకున్న కమెడియన్ సూరి లీడ్ రోల్లో నటించారు. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ రాసిన స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. అక్కడ హిట్ కావడంతో తెలుగులోనూ భైరవం పేరుతో రీమేక్ చేసి ఇటీవలే విడుదల చేశారు. తెలుగు వర్షన్లో మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే గరుడన్ చిత్రం అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని మరో ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సన్ నెక్ట్స్ వేదికగా గరుడన్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో సూరితో పాటు శశి కుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. ఈ రూరల్ యాక్షన్ డ్రామాకు ఆర్ఎస్ దురైసెంథిల్ కుమార్ డైరెక్ట్ చేశాడు. Power, loyalty, betrayal – when friends turn foes, the fight becomes deadly.Garudan is coming to SunNXT on August 1. Are you ready for the storm?#GarudanOnSunNXT #Garudan #TamilCinema #PowerAndBetrayal #SunNXT #ActionDrama pic.twitter.com/wrcLo57YRF— SUN NXT (@sunnxt) July 28, 2025
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

అవిశ్రాంత యోధుడు సిరాజ్.. కోహ్లిని కూడా దాటేశాడు..!
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇటీవలి కాలంలో టీమిండియా ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా మారిపోయాడు. ముఖ్యంగా టెస్ట్ల్లో అవిశ్రాంత యోధుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మాంచెస్టర్ టెస్ట్లో పాల్గొన్న సిరాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ దశాబ్దంలో (2020ల్లో) భారత్ తరఫున అత్యధిక టెస్ట్లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిని సైతం అధిగమించాడు. విరాట్ 2020 నుంచి టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించకముందు వరకు 39 టెస్ట్లు ఆడగా.. సిరాజ్ మాంచెస్టర్ టెస్ట్తో 40వ టెస్ట్ పూర్తి చేసుకున్నాడు. 2020 డిసెంబర్లో టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేసిన సిరాజ్.. ఆ ఏడాదంతా (2020) టెస్ట్లు ఆడకపోయినా ఈ దశాబ్దంలో భారత్ తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా నిలవడం విశేషం.వర్క్ లోడ్ కారణంగా మేనేజ్మెంట్ రొటేషన్ పాలసీని ప్రవేశపెట్టినప్పటికీ సిరాజ్ టీమిండియా ఆడిన ప్రతి టెస్ట్ మ్యాచ్లోనూ ఆడాల్సి వస్తుంది. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు క్రమం తప్పకుండా విశ్రాంతినిస్తున్న మేనేజ్మెంట్ సిరాజ్ను మాత్రం దాదాపుగా ప్రతి మ్యాచ్లో ఆడిస్తుంది. లెక్కలు చూసుకోవడానికి ఇది బాగానే ఉన్నా పరిస్థితి ఇలాగే కొనసాగితే సిరాజ్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.పని భారం ఎక్కువై సిరాజ్ గాయాల బారిన పడితే కెరీర్ అర్దంతరంగా ముగిసే ప్రమాదం ఉంది. ఇప్పటికే సిరాజ్ వయసు 31 సంవత్సరాలు. ఇలా నిర్విరామంగా ఆడితే అతని కెరీర్ మరో రెండు, మూడేళ్లకు మించి కొనసాగే అవకాశం ఉండదు. టీమిండియా మేనేజ్మెంట్ ఇకనైనా మేల్కొని సిరాజ్కు కూడా వరుస విరామాల్లో విశ్రాంతి కల్పించకపోతే చేజేతులా ఓ టాలెంటెడ్ క్రికెటర్ కెరీర్ను ప్రమాదంలోకి తోసేసినట్లవుతుంది. సిరాజ్ తాజాగా ముగిసిన మాంచెస్టర్ టెస్ట్లో సింహభాగం బౌలింగ్ చేశాడు. 24 ఏళ్ల యువ పేసర్ అన్షుల్ కంబోజ్ కేవలం 18 ఓవర్లు వేస్తే సిరాజ్ బుమ్రా తర్వాత అత్యధికంగా 30 ఓవర్లు బౌలింగ్ చేశాడు. కెప్టెన్లకు సిరాజ్పై ఉన్న నమ్మకంతో అతనికే తరుచూ బౌలింగ్ రొటేట్ చేస్తున్నారు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇది సమంజసమే అయినప్పటికీ.. ఓ టాలెండెట్ బౌలర్ అర్దంతరంగా ముగిసిపోయే ప్రమాదం ఉంది.సిరాజ్ త్వరలో తన కెరీర్లో 41వ టెస్ట్ ఆడటం కూడా దాదాపుగా ఖరారైంది. ఇంగ్లండ్తో ఐదో టెస్ట్లో ఒకవేళ బుమ్రాకు విశ్రాంతినిచ్చినా సిరాజ్ను మాత్రం తప్పక ఆడిస్తారు. ఈ విషయంలో టీమిండియాకు మరో ఆప్షన్ కూడా లేదు. సత్తా చాటుతాడనుకున్న యువ పేసర్ అన్షుల్ కంబోజ్ నాలుగో టెస్ట్లో ప్రభావం చూపలేకపోయాడు. మరో ఆప్షన్ అయిన ప్రసిద్ద్ కృష్ణను మేనేజ్మెంట్ నమ్మే పరిస్థితుల్లో లేదు. మరో రెండు ఆప్షన్లైన ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్ గాయాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జులై 31 నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్ట్లో సిరాజ్ ఆడటం దాదాపుగా ఖాయమనే చెప్పాలి.

ఆసియా కప్కు ముందు హాంగ్కాంగ్ జట్టు కీలక నియామకం
త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్కు ముందు హాంగ్కాంగ్ క్రికెట్ కీలక నియామకం చేపట్టింది. వారి జట్టుకు శ్రీలంక మాజీ ఓపెనర్ కౌశల్ సిల్వను హెడ్ కోచ్గా నియమించింది. డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన కౌశల్ 2011-18 మధ్యలో శ్రీలంక తరఫున 39 టెస్ట్లు ఆడి 3 సెంచరీలు, 12 అర్ద సెంచరీల సాయంతో 2099 పరుగులు చేశాడు. అలాగే వికెట్ కీపింగ్లో 34 క్యాచ్లు, ఓ స్టంపింగ్ చేశాడు.39 ఏళ్ల కౌశల్ గతంలో శ్రీలంక, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో కోచింగ్ బాధ్యతలు నిర్వహించాడు. అంతర్జాతీయంగా అతనికి ఇదే తొలి కమిట్మెంట్. ఆసియా కప్కు ముందు కౌశల్ ముందు పలు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. హాంగ్కాంగ్ బౌలింగ్ దళం నిర్మించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. అలాగే యువ ప్రతిభను గుర్తించి ఆసియా కప్ కోసం జట్టును సిద్ధం చేయాల్సి ఉంది.హాంగ్కాంగ్ ఈ ఎడిషన్ ఆసియా కప్కు అర్హత సాధించిన ఎనిమిది జట్లలో ఒకటి. ఆ జట్టు క్వాలిఫయర్ పోటీల ద్వారా ఖండాంతర టోర్నీకి అర్హత సాధించింది. సెప్టెంబర్ 19 నుంచి టీ20 ఫార్మాట్లో జరుగబోయే ఈ టోర్నీలో హాంగ్కాంగ్ సహా ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఒమన్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీకి సంబంధించి వేదికలు ఇంకా ఖరారు కాలేదు. హాంగ్కాంగ్ టోర్నీ తొలి మ్యాచ్లోనే ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనుంది.

‘పాక్తో మ్యాచ్ ఆడాలి’!.. గంగూలీపై అభిమానుల ఆగ్రహం
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదా నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని వాపోతున్నారు. అసలేం జరిగిందంటే.. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్కు ఇటీవలే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.కుదిరితే మూడుసార్లుఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ మెగా ఈవెంట్లో భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఇరుజట్లు సెప్టెంబరు 14న దుబాయ్లో ముఖాముఖి తలపడనున్నాయి. ఆసియా క్రికెట్ మండలి (ACC) ప్రసారకర్తలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సూపర్ ఫోర్ దశలో ఇరుజట్లు మరోసారి పరస్పరం ఢీకొట్టే అవకాశం ఉంది. అంతా సవ్యంగా సాగి.. మెరుగైన ప్రదర్శన కనబరిస్తే సెప్టెంబరు 28 నాటి ఫైనల్లోనూ దాయాదులు పోటీపడతాయి. నిజానికి ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్వి. అయితే, అంతకుముందు పాక్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులు దక్కించుకోగా.. టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిరాకరించింది. తటస్థ వేదికపైనేభద్రతా కారణాల దృష్ట్యా పాక్కు వెళ్లలేమని ఐసీసీకి తేల్చిచెప్పింది. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా ఈ టోర్నీ జరుగగా.. టీమిండియా చాంపియన్గా నిలిచింది.అయితే, నాటి చర్చల ప్రకారం 2027 వరకు భారత్- పాక్ ఏ టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకున్నా తటస్థ వేదికపైనే ఆడాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇందుకు అంగీకరించాయి. కానీ.. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మరోసారి పరిస్థితులు శ్రుతిమించాయి.పాక్కు బుద్ధి చెప్పిన భారత సైన్యంప్రశాంతమైన పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. ఇందుకు ప్రతిగా భారత సైన్యం పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, ఉగ్రవాదులపై జరిపిన దాడులకు పాక్ సైన్యం స్పందిస్తూ.. ప్రతిదాడికి దిగగా.. ఇండియన్ ఆర్మీ గట్టిగా బుద్ధిచెప్పింది.ఈ నేపథ్యంలో ఇకపై పాకిస్తాన్తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదని.. క్రీడల్లోనూ బంధం తెంచుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంపై గంగూలీ గతంలో స్పందిస్తూ.. ఈ డిమాండ్లకు మద్దతు తెలిపాడు. అయితే, తాజాగా మరోసారి ఆసియా కప్-2025 నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రశ్న ఎదురుకాగా దాదా భిన్నంగా స్పందించాడు.పాక్తో మ్యాచ్.. ఆటలు కొనసాగాలి‘‘ఇరుజట్లు పరస్పరం పోటీపడటంలో నాకెలాంటి ఇబ్బందీ లేదు. ప్రణాళిక ప్రకారం క్రీడలు కొనసాగాలి. అదే సమయంలో పహల్గామ్ వంటి ఘటనలను అరికట్టాలి. అయితే, ఆటలు మాత్రం కొనసాగుతూనే ఉండాలి. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలి. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. కాబట్టి క్రీడలు కొనసాగించడంలో తప్పులేదు’’ అని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇటీవల ప్రపంచ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 సీజన్లో భాగంగా ఇండియా- పాకిస్తాన్తో తలపడాల్సి ఉండగా.. విమర్శల నేపథ్యంలో మ్యాచ్ రద్దైపోయింది. ఇండియా చాంపియన్స్ జట్టులో భాగమైన శిఖర్ ధావన్, సురేశ్ రైనా తదితరులు పాక్తో ఆడేందుకు విముఖత వ్యక్తం చేయడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆసియా కప్ వంటి కీలక టోర్నీలో బీసీసీఐ.. దాయాదితో ముఖాముఖి పోరు నాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!చదవండి: Asia Cup 2025: పూర్తి షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్లు ఎప్పుడంటే? #WATCH | Kolkata: On India-Pakistan placed in the same group in the Asia Cup, former Indian cricketer Saurav Ganguly says, "I am okay. The sport must go on. At the same time Pahalgam should not happen, but the sport must go on. Terrorism must not happen; it needs to be stopped.… pic.twitter.com/Qrs17KOKrN— ANI (@ANI) July 27, 2025

వరుస ఓటములతో చితికిపోయిన విండీస్కు మరో షాక్
స్వదేశంలో ఆస్ట్రేలియా చేతిలో వరుస పరాజయాలతో విసిగి వేసారిపోయిన వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది. నాలుగో టీ20లో స్లో ఓవర్ రేట్ మెయిన్టైన్ చేసినందుకు గానూ ఆ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్లో 10 శాతం కోత విధించింది. ఆ మ్యాచ్లో విండీస్ బౌలర్లు నిర్దేశిత సమయంలోగా రెండు ఓవర్లు వెనుకపడ్డారు. దీంతో ఓవర్కు 5 శాతం చొప్పున ఐసీసీ విండీస్ ఆటగాళ్లందరికీ జరిమానా విధించింది. ఈ జరిమానాను విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరం లేదని మ్యాచ్ రిఫరీ అన్నాడు.నాలుగో టీ20లో విండీస్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసినా ఘోర పరాజయం ఎదుర్కొంది. ఆ మ్యాచ్లో విండీస్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రూథర్ఫోర్డ్ 31, రోవ్మన్ పావెల్, రొమారియో షెపర్డ్ తలో 28, హోల్డర్ 21 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో జంపా 3, ఆరోన్ హార్డీ, బార్ట్లెట్, అబాట్ తలో 2 వికెట్లు తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. మ్యాక్స్వెల్ (47), ఇంగ్లిస్ (51), కెమరూన్ గ్రీన్ (55 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్లతో విరుచుకపడటంతో 19.2 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. విండీస్ బౌలర్లలో బ్లేడ్స్ 3, హోల్డర్, షెపర్డ్, అకీల్ హొసేన్ తలో వికెట్ తీశారు.కాగా, 5 మ్యాచ్ల ఈ టీ20 సిరీస్లో విండీస్కు ఏది కలిసి రావడం లేదు. ఇప్పటివరకు ఆడిన నాలుగు టీ20ల్లో ఓటమిపాలైంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే 0-4తో సిరీస్ను కోల్పోయింది. అంతకుముందు టెస్ట్ సిరీస్లోనూ విండీస్ది ఇదే పరిస్థితి. మూడు మ్యాచ్ల ఆ సిరీస్ను కూడా విండీస్ 0-3 తేడాతో కోల్పోయింది. స్వదేశంలో జరుగుతున్న ఈ సిరీస్లలో విండీస్ ఇప్పటివరకు ఒక్క గెలుపుకు కూడా నోచుకోలేదు.
బిజినెస్

TCS Layoffs: ‘రాజీనామాలు మాత్రం చేయొద్దు’
దేశీయ అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 12,000 మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ తొలగింపు మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.ఈ ప్రకటన ఐటీ రంగంలో ప్రకంపనలు సృష్టించింది. టీసీఎస్ ఉద్యోగుల తొలగింపు ప్రకటనను ఐటీ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఒత్తిడికి తలొగ్గి రాజీనామాలు చేయొద్దుఈటీ నివేదిక ప్రకారం.. టీసీఎస్ తొలగింపులను చట్టవిరుద్ధమని ప్రకటించిన ఐటీ ఉద్యోగ సంఘాలు ఒత్తిడికి తలొగ్గి ఎవరూ రాజీనామా చేయొద్దంటూ టీసీఎస్ సిబ్బందికి సూచించాయి. అదే సమయంలో లేఆఫ్ ప్రణాళికలను ఉపసంహరించుకోవాలని, ప్రభావిత ఉద్యోగాలను పునరుద్ధరించాలని కర్ణాటక స్టేట్ ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ టీసీఎస్ యాజమాన్యాన్ని కోరింది.రాజీనామా చేయాలని ఉద్యోగులపై ఒత్తిడి చేయొద్దని ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (ఎఫ్ఐటీఈ) టీసీఎస్ను కోరింది. బాధితులకు నోటీస్ పీరియడ్ పేమెంట్స్, సెవెరెన్స్ బెనిఫిట్స్, ఏడాది పాటు ఇన్సూరెన్స్ కవరేజీని అందించాలని డిమాండ్ చేసింది. టీసీఎస్ ఆర్థికంగా పటిష్టంగా ఉందని, అనిశ్చితులేవీ లేనప్పటికీ ప్రకటించిన ఈ తొలగింపులు పూర్తిగా లాభాపేక్షతో తీసుకున్న నిర్ణయాలేనని ఎఫ్ఐటీఈ పేర్కొంది. అన్ని రికార్డులు సిద్ధం చేసుకోవాలని, స్వచ్ఛంద రాజీనామాలకు ఎవరూ వెళ్లొద్దని, నిష్క్రమించాలని ఒత్తిడి చేస్తే రాష్ట్ర లేబర్ కమిషనర్ లేదా ఎఫ్ఐటీఈ సహాయం తీసుకోవాలని ఉద్యోగులకు సూచించింది. 👉 వేలాది లేఆఫ్లు.. ఎమోషనల్ అయిన మైక్రోసాఫ్ట్ సీఈవో

అమ్మకాల ఒత్తిడి.. బేర్మన్న మార్కెట్లు
బ్యాంకింగ్, ఐటీ, రియల్టీ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడితో బెంచ్ మార్క్ భారతీయ ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 572.07 పాయింట్లు (0.70 శాతం) క్షీణించి 80,891 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 156.10 పాయింట్లు లేదా 0.63 శాతం క్షీణించి 24,680.90 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ అనుబంధ షేర్లలో హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ మాత్రమే 1.23 శాతం వరకు లాభపడగా, మిగతావి నష్టాల్లో స్థిరపడ్డాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, టైటాన్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ షేర్లు 1.14 శాతం నుంచి 7.31 శాతం మధ్య నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.26 శాతం, 0.84 శాతం నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా మినహా ఎన్ఎస్ఈలోని ఇతర సెక్టోరల్ ఇండెక్స్లన్నీ రెడ్లో స్థిరపడగా, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 4.26 శాతం నష్టంతో ముగిసింది.

పెన్షనర్లు.. ట్యాక్స్ ప్లానింగ్
అరవైఏళ్లు, 80 ఏళ్లు దాటిన వారు.. ఇలా వయసు పైబడిన వారికి, అంటే సీనియర్ సిటిజన్లకు బేసిక్ లిమిట్ మారుతుంది. ఇదంతా పాత పద్ధతిలో. కొత్త పద్ధతిలో సీనియారిటీతో సంబంధం లేకుండా అందరికీ ఒకే బేసిక్ లిమిట్. ఈ బేసిక్ లిమిట్లు, శ్లాబులు, రేట్లూ మీకు తెలిసినవే. పెన్షన్ని ‘జీతాల’ పరిధిలో పరిగణిస్తారు. పెన్షన్ కూడా ట్యాక్సబుల్ ఆదాయమే. రూ.10,000 పన్ను భారం దాటిన వారు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. సీనియర్ సిటిజన్లకు వ్యాపారం, వృత్తి మీద ఆదాయం లేకపోతే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సినవసరం లేదు.ఆదాయపు పన్ను చట్ట ప్రకారం, జీతాన్ని ఎలా ట్యాక్సబుల్గా భావిస్తారో, అలాగే పెన్షన్లను కూడా భావిస్తారు. చాలా మంది పెన్షన్ మీద మినహాయింపు ఉందనుకుంటారు. కానీ, అది నిజం కాదు. పెన్షన్ ట్యాక్సబుల్ ఆదాయమే. బేసిక్ లిమిట్ లోపు ఉంటే తప్ప.. పన్ను భారం తప్పించుకోవడం ఉండదు. గవర్నమెంటులో రిటైర్ అయిన వారికి కమ్యూటెడ్ పెన్షన్ మినహాయింపు ఉంది. ముందుగా లెక్కలు కట్టి, ట్యాక్స్ ప్లానింగ్ ద్వారా కమ్యుటెడ్ పెన్షన్ మార్చుకోవచ్చు. పరమ్వీర్ చక్ర, మహా వీర్ చక్ర, వీర్ చక్ర మొదలైన వాటికి సంబంధించిన పెన్షన్లకు మినహాయింపు ఉంది. విదేశాల్లో సెటిల్ అయిన పెన్షనర్లకు వచ్చే పెన్షన్లను మన దేశంలోని ఆదాయంగా పరిగణిస్తారు. పెన్షన్లలో ఎరియర్స్ అంటే .. బకాయిలు వస్తే, వాటిని పన్ను పరిధిలోకి చేర్చి 89(1) సెక్షన్ కింద రిలీఫ్ పొందవచ్చు. ఈ పెన్షన్లో స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు ఉంది.ఇక ఫ్యామిలీ పెన్షన్ విషయానికొద్దాం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, తన పెన్షన్ని కుటుంబంలోని వ్యక్తికి ఇవ్వొచ్చు. ఇలాంటి చెల్లింపులను ఫ్యామిలీ పెన్షన్ అంటారు. ఇక్కడ పెన్షన్ అని పేరుంది కానీ, ఇలాంటి పెన్షన్ను ‘జీతం’గా భావించరు. ఇతర ఆదాయంగా భావిస్తారు. టీడీఎస్ అంశాలు వర్తించవు. పాత పద్ధతి అయితే రూ.15,000 మినహాయింపు ఇస్తారు. కొత్త పద్ధతి అయితే, రూ.25,000 మినహాయింపు వస్తుంది. సైన్యంలోని ఫ్యామిలీ సభ్యులకు మినహాయింపు పూర్తిగా ఇస్తారు. ఈ విషయానికి సంబంధించి చాలా పరిస్థితులనే పొందుపర్చారు. కానీ విధి నిర్వహణలో ఉండగా, సైన్యంలో చనిపోతే వారి కుటుంబానికి వచ్చే పెన్షన్ మీద మినహాయింపు ఉంటుంది. పెన్షన్, ప్యామిలీ పెన్షన్కి సంబంధించి ట్యాక్స్ ప్లానింగ్ విషయాలు..పాత పద్ధతిలో వెళ్తే మంచిదా. కొత్త పద్ధతిలో వెళ్తే మంచిదా అనేది ఆలోచించుకోవాలి.వైద్యానికి సంబంధించిన మినహాయింపులను గత వారం తెలుసుకున్నాం. ఇవి పాత పద్ధతిలో ఉంటాయి. పెన్షనరీ బెనిఫిట్స్ భారీగా వస్తాయి. వాటిని సక్రమంగా, సరిగ్గా, సమగ్రంగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయొచ్చు.80సీ డిడక్షన్లు అనవసరం అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. వార్ధక్యంలో సేవింగ్ మీద పెద్ద మొత్తాల్ని ‘బ్లాక్’ చేసుకోవడం ఎందుకు. చేతిలో లేదా అందుబాటులో బ్యాంకు బ్యాలెన్సులు ఉంటే మంచిది. ఉదాహరణకు వైద్యంలాంటి ఏ అవసరానికైనా ఉపయోగపడుతుందనేది ఆలోచన.సీనియర్ సిటిజన్లకు ఎన్నో స్కీములు ఉన్నాయి. సరైన నిర్ణయం తీసుకోండి. ఆకర్షణీయమైన ప్రైవేట్ వ్యక్తుల చేతిల మోసపోకండి. అయితే, ఎన్నో మంచి ఇన్వెస్ట్మెంట్లు, స్కీములు ఉన్నాయి. కేవలం పాత పద్ధతిలోనే వాటిపై వడ్డీకి మినహాయింపులు ఉన్నాయి. ఎన్నారై సిటిజన్లు 15హెచ్ ఇవ్వకూడదు. కానీ రెసిడెంట్లు ఇవ్వొచ్చు. బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్ల మీద వడ్డీ రూ. లక్ష దాటితే, టీడీఎస్ వర్తిస్తుంది. ట్యాక్సబుల్ ఇన్కం లోపల ఆదాయం ఉంటే, 15హెచ్ ఇస్తే పన్ను రికవరీ చేయరు. బేసిక్ లిమిట్ దాటితే 15హెచ్ ఇవ్వకూడదు.గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్, పీఎఫ్, సూపర్ యాన్యుయేషన్ ఫండ్ .. వీటన్నింటికీ పూర్తి మినహాయింపు ఉంది. కానీ, అవి ఇన్వెస్ట్ చేస్తే వచ్చే వడ్డీ/ఆదాయంపై మినహాయింపు కొత్త విధానంలో లేదు.75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు పెన్షన్ ఉండి, ఒకే ఒక బ్యాంకు అకౌంటులో నుంచి వడ్డీ .. ఈ రెండింటి మీదా పన్ను రికవరీ అయితే, రిటర్ను వేయనక్కర్లేదు.రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పిల్లల చదువు కోసమా, స్వంత వైద్యానికా, ఇల్లు కొనుక్కోవడమా, బంగారం కొనడమా, షేర్స్లో ఇన్వెస్ట్ చేయడమా, పిల్లలకు బహుమతిగా ఇవ్వడమా.. ఇలా ఎన్నో ఆలోచనలు.తన సొంత పెన్షన్, భార్య ఫ్యామిలీ పెన్షన్.. ఇలా రెండూ కలిపి తడిసి మోపెడై.. పన్ను భారం చెల్లించే పెన్షనర్లు ఇంకొందరు. ఆదాయం అధికంగా ఉంటే పన్ను చెల్లించడమే ట్యాక్స్ ప్లానింగ్.

టెస్లా బాటలోనే మరో కంపెనీ
భారత్లో టెస్లా అరంగేట్రం చేసిన కొన్ని రోజుల్లోనే వియత్నాం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్ఫాస్ట్ ఇండియాలో తన మొదటి షోరూమ్ను గుజరాత్లోని సూరత్లో ప్రారంభించింది. సూరత్లోని పిప్లోడ్లో 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫెసిలిటీ ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్, వాహన అమ్మకాలు, సర్వీస్ సపోర్ట్ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ షోరూమ్లో విన్ఫాస్ట్ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీలు వీఎఫ్ 6, వీఎఫ్ 7లను ప్రదర్శిస్తుంది.విన్ఫాస్ట్ వీఎఫ్ 7, వీఎఫ్ 6 మోడళ్లలో రైట్హ్యాండ్ డ్రైవ్ వెర్షన్ను మొదటిసారి ఇండియాలోనే విడుదల చేస్తున్నట్లు చెప్పింది. ఈ ఏడాది చివరి నాటికి 27 నగరాల్లో 35 డీలర్షిప్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. విన్ఫాస్ట్ తన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీల కోసం 2025 జులై 15న అధికారికంగా బుకింగ్లను ప్రారంభించింది. ఎక్స్క్లూజివ్ షోరూమ్ల్లో లేదా అధికారిక వెబ్సైట్ VinFastAuto.in ద్వారా రూ.21,000 పూర్తిగా రీఫండబుల్ అమౌంట్తో బుక్ చేసుకోవచ్చని చెప్పింది.ఇదీ చదవండి: బంగారు బాతులను చంపేస్తున్నారు.. దేశానికి సిగ్గుచేటుతమిళనాడులోని తూత్తుకుడిలో రాబోయే రోజుల్లో విన్ఫాస్ట్ ఏర్పాటు చేయనున్న కర్మాగారంలో ఈ వాహనాలను స్థానికంగా అసెంబుల్ చేస్తామని పేర్కొంది. విన్ఫాస్ట్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ మాట్లాడుతూ..‘భారతీయ వినియోగదారులకు విన్ఫాస్ట్ డ్రైవింగ్ అనుభవాన్ని చేరువ చేయబోతున్నందుకు సంతోషిస్తున్నాం’ అని చెప్పారు. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2020లో కేవలం 5,000 యూనిట్ల నుంచి 2024 నాటికి 1,13,000 యూనిట్లకు పుంజుకుంది. ప్రస్తుతం మొత్తం కార్ల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 3 శాతం కంటే తక్కువగా ఉండగా, 2030 నాటికి ఈ వాటాను 30 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఫ్యామిలీ

ఫ్యాషన్ ఫ్రమ్ నేచర్.. డిజైనింగ్తో స్టోరీ టెల్లింగ్..
15 ఏళ్ల వయసులోనే ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన.. రెండేళ్లలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వెరసి దేశంలోనే అతిపిన్న వయస్కుడైన ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తున్నాడు అమోగ్ రెడ్డి. భారతీయ సంప్రదాయ, వివాహ కోచర్లో తన నైపుణ్యాలతో ప్రసిద్ధి చెందిన అమోగ్.. వారసత్వ హంగులను ఆధునిక ఫ్యాషన్తో సమ్మిళితం చేస్తూ అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ ఔత్సాహికులను ఆకర్షిస్తున్నారు. అంతేకాకుండా ‘యంగెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్’ బిరుదును సైతం పొందారు. ఈ ప్రయాణంలో భాగంగానే నగరంలోని హెచ్ఐసీసీ నోవోటెల్ వేదికగా వినూత్నంగా ఫారెస్ట్ థీమ్తో ఆదివారం నిర్వహించిన ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్లో వనమ్ కలెక్షన్స్ ఆవిష్కరించారు. డిజైనింగ్తో స్టోరీ టెల్లింగ్.. మన ఊహకందని నూతన ఫ్యాషన్ ఫార్ములాతో సమ్మిళితమై రూపొందించారు. ఆ సౌందర్యం ఒక్కొక్క లేయర్లా నిరంతరం ఆకర్షణీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటుందని అమోగ్ రెడ్డి తన ఆలోచనలను పంచుకున్నారు. నోవోటెల్ వేదికగా చిన్నారులతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 12వ సీజన్ ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్లో అమోగ్ రూపొందించిన డిజైనింగ్ వేర్ ప్రకృతిని ప్రతిబింబించాయి. ప్రకృతిలోని వర్ణాలు, అరణ్యంలోని అందాల నుంచి ప్రేరణ పొందాయి. ఆకారాల కవిత్వమే ఈ వనమ్ కలెక్షన్ అని అమోగ్ పేర్కొన్నారు. ప్రకృతి అందాలే ఈ డిజైన్లను రూపొందించడానికి ప్రేరేపించాయన్నారు. క్రియేటివిటీని హైదరాబాద్లో ప్రారంభించి దేశంతో పాటు ప్రపంచ నలుమూలలా విస్తరింపజేయాలనే లక్ష్యంతో ఉన్నానన్నారు. ఈ కలెక్షన్లోని ప్రతి డిజైన్ ఒక కథను చెబుతుంది. వినూత్న పద్ధతుల్లో ఆధునిక ఫ్యాషన్ హంగులతో సంప్రదాయ హస్తకళలను సమన్వయం చేయడంతో ఫ్యాషన్ ప్రియులను అలరించాయి.(చదవండి: శ్రావణ శోభను తెచ్చేలా..పట్టుతో స్టైలిష్గా మెరుద్దాం ఇలా..!)

ఫుడ్ అండ్ ఫ్యాషన్ టిప్స్ : వర్షంలో హాయి..హాయి
వెన్నెల్లో హాయి.. హాయి.. మల్లెల్లో హాయి హాయి.. వరాల జల్లే కురిసే.. తప్పేట్లు హాయి హాయి తృమ్పేట్లు హాయి హాయి.. ఇవ్వాళ మనసే మురిసే.. మే నెల్లో ఎండ హాయి ఆగష్టు లో వాన హాయి.. జనవరిలో మంచు హాయి.. హాయి రామ హాయి.. హాయిగుంటే చాలు నంది వెయ్యి మాటలెందుకండి.. ఈ పాట వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో.. సరైన ప్రణాళికతో జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలోనూ అంతే హాయిగా ఉంటుందంటున్నారు నిపుణులు.. భాగ్యనగరంలో ప్రస్తుతం వర్షాలు ముసురుకున్నాయి. వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సరైన జాగ్రత్తలు పాటించకుంటే ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి.. – సాక్షి, సిటీబ్యూరోగజిబిజి నగర జీవన శైలి.. వర్షాకాలంలో మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఓవైపు ముసురుకున్న వర్షాలతో తేమ బురద వాతావరణం. మరోవైపు ట్రాఫిక్ కష్టాలు.. వీటికి మించి ఆరోగ్య సమస్యలు.. ఈ నేపథ్యంలో చక్కని చిట్కాలు పటిస్తే వీటి నుంచి ఇట్టే పరిష్కారం లభిస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. వీటిని ఓ సమస్యగా కాకుండా జీవనశైలిలో భాగంగా మార్చుకుంటే శ్రేయస్కరం.. ఇందులో భాగంగా నగరవాసులకు పలు చిట్కాలు.. ట్రావెల్ అండ్ వర్క్ లైఫ్.. నగరంలో వర్షాకాలం అనగానే ట్రాఫిక్ కష్టాలు తప్పవు.. ఎక్కడికక్కడ నిలిచిపోయే వర్షపు నీరు, వాహనాల బ్రేక్డౌన్లు సర్వసాధారణం. దీనిని దృష్టిలో ఉంచుకుని అవకాశం ఉన్న ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ తీసుకోవడం ఉత్తమం. దీనివల్ల ట్రాఫిక్ కష్టాలతో పాటు వర్షం తడవాల్సిన పరిస్థితి ఉండదు.. పైగా సమయం కూడా ఆదా అవుతుందిఇంటి పరిసరాలపై శ్రద్ధ : వర్షాకాలంలో ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి చుట్టూ నిరు నిలిచే ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలి. పైప్లైన్లు బ్లాక్ అవ్వకుండా క్లీన్ చేసుకోవాలి. మేడపై కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ప్రధానంగా ఇంటి నుంచి బయటకు వెళ్లే డెయ్రిన్లలోని చెత్తను తొలగించుకోవడం ఉత్తమం. దీంతోపాటు విద్యుత్ వైర్లు, మీర్ల వద్ద తేమ లేకుండా చూసుకోవాలి. ఇన్వర్టర్లు, టార్చ్లైట్లు, బ్యాటరీ బ్యాకప్ప్ చెక్ చేసుకోవాలి. అత్యవసర పరిస్థితులకు పవర్ బ్యాంక్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. చల్లని వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. సరైన ఆహారంతో ఆరోగ్య భద్రత సాధ్యమని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బయటి ఆహారం, స్ట్రీట్ ఫుడ్ ఎంత మేరకు నివారిస్తే అంత మంచిది.సరైన ఆహారంతో ఆరోగ్య భద్రత..: వీధిపక్కన దొరికేకే ఆహారానికి దూరంగా ఉండాలి.. ఇంట్లో చల్లని వాతావరణానికి తగినట్లు వేడివేడిగా వెజ్ సూప్స్, ఉల్లిపాయ పకోడి, అల్లం టీ వంటి హీటింగ్ ఫుడ్స్ వల్లఆ హ్లాదంతో పాటు ఆరోగ్య సొంతం. నీరు తాగడంలో అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వేడి నీరు, శుద్ధి చేసిన నీటిని తాగడం మంచిది. వర్షాకాలంలో తీసుకునే ఆహారం చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై త్రీవ ప్రభావాన్ని చూపుతాయి. వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. వర్షా కాలపు ఫ్యాషన్ టిప్స్.. : వర్షంలో మన ఫ్యాషన్ కూడా మారాలి. స్టైలిష్ ఉండే సమయంలో ప్రాక్టికల్గా కూడా ఆలోచించాలి.. వర్ష నిరోధక/వాటర్ ఫ్రూఫ్ షూస్, అనువుగా ఉండే రబ్బరు చెప్పులు సౌకర్యవంతంగా ఉంటాయి. సింథటిక్ లేదా డ్రై–ఫిట్ డ్రెస్సులు వేసుకుంటే తడవడం, ఆరిపోవడం తేలిక. లెదర్ బ్యాగ్స్కు బదులుగా వాటర్ప్రూఫ్ బ్యాగ్స్ ఎంచుకోవాలి. ల్యాప్టాప్ బ్యాక్స్కి కూడా వాటర్ప్రూఫ్ కవర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించాలి.ఎక్కువ దూరం నడవాల్సిన పనిలేని వారు ఎంఎంటీఎస్, మెట్రో వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఆశ్రయించడం ఉత్తమం.ఒక వేళ అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే ట్రాఫిక్ అప్డేట్స్ తెలుసుకోవాలి. ఇందుకోసం అనేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వర్షాలతో సంబంధం లేకుండా వాహనాల్లో రెయిన్ కోట్స్, గొడుగు, అదనపు మాస్క్, టవల్ క్యారీ చేయడం మంచిది. మైండ్ఫుల్ లివింగ్.. వర్షం మనసుకు ప్రశాంతతను, నూతనోత్సాహాన్ని తెస్తుంది. వర్షాన్ని కాఫీ కప్పుతో ఆస్వాదిస్తూ బుక్స్ చదవడం, ఇంట్లో గేమ్స్ ఆడడం, ఫ్యామిలీతో టైమ్ గడపడం లాంటి చిన్న విషయాలు జీవితాన్ని మరింత ఆహ్లాదంగా మార్చుతాయి. ఒక రకంగా వర్షాలు వరద బీభత్సాలే.. కాకుండా ఒక్కసారిగా పరిసరాలను శుభ్రం కూడా చేస్తాయి. ఫలితంగా ప్రకృతి ప్రదేశాలకు పచ్చదనాన్ని అందుతాయి. అయితే సరైన జాగ్రత్తలు లేకపోతే సమస్యలే ఎక్కువ ఇబ్బందిపెడతాయి. ముఖ్యంగా హైదరాబాదీయులు ఈ వర్ష కాలాన్ని ఒక లైఫ్స్టైల్ ఫెస్టివల్గా మార్చుకుంటే.. ఈ కాలమెంతో మధురంగా మారుతుంది. ఇదీ చదవండి: నో జిమ్, ఓన్లీ చాట్జీపీటీ, డంబెల్స్ 18 కిలోలు తగ్గిన మెరుపు తీగ

నో జిమ్, ఓన్లీ చాట్జీపీటీ, డంబెల్స్ 18 కిలోలు తగ్గి మెరుపు తీగలా
అధిక బరువును తగ్గించుకుని ఫిట్గా ఉండాలని అందరూ అనుకుంటారు. కొందరు అనుకోవడంతోనే సరిపెట్టుకుంటారు. మరికొందరు దాన్ని సాధించి తీరతారు. అదీ ఖరీదైన జిమ్లు, క్రాష్ డైట్లు ఇలాంటివేమీ లేకుండానే శరీరం మీద అవగాహన పెంచుకుని, అధిక బరువును తగ్గించుకుంది. 20 ఏళ్ల వయసులో చాలా పట్టుదలగా అదీ సింపుల్ చిట్కాలతో ఫిట్నెస్ సాధించింది. పదండి ఆమె పాటించిన టిప్స్ ఏంటో తెలుసుకుందాం. ప్రముఖ కంటెంట్ సృష్టికర్త ఆర్య అరోరా జత డంబెల్స్ , కొంచెం స్వీయ-అవగాహన, చాట్జీపీటీ సాయంతో 18 కిలోల బరువు తగ్గింది. ఈ వెయిట్ లాస్జర్నీని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు, వీడియోల ద్వారా అభిమానులను ఆకర్షిస్తోంది.తన విజయానికి కారణమైన చిట్కాల గురించి పంచుకుంటూ ఆర్య వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏడంటే ఏడు టిప్స్జిమ్ వర్కౌట్స్, ఫ్యాన్సీ డైట్ ఇవేమీ లేకుండా 18 కేజీల బరువు తగ్గింది. ఆర్య మొదట్లో అధిక బరువుతో బాధపడేది. కానీ , ఇపుడు స్లిమ్ అండ్ ట్రిమ్గా మారిపోయింది. ఇందుకు 7 చిట్కాలు ఫాలో అయినట్టు పేర్కొంది. View this post on Instagram A post shared by Aryaa Arora (@wutaryaadoin)BMR : ముందు తన శరీరానికి అవసరమైన కేలరీల గురించి అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది. ఇందుకు చాట్ జీపీటీ సాయాన్ని తీసుకుంది. ChatGPT ప్రాంప్ట్ని ఉపయోగించి తన బేసల్ మెటబాలిక్ రేట్ (BMR)ను అంచనావేసింది. రోజువారీ కేలరీల అవసరాలను నిర్ణయించడంలో సహాయపడే మెట్రిక్. బరువు తగ్గడానికి కేలరీ ఇంటేక్ ఎంత? అని చాట్ జీపీటీని కోరింది. తన శరీరాకృతిని బట్టి ఏఐ ఇచ్చిన డేటాతో సరైన కేలరీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇదీ చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన పోర్షన్-బ్యాలెన్సింగ్: ఆర్య పోర్షణ్ బ్యాలెన్సింగ్ ప్రధానంగా పాటించింది. 40% ప్రోటీన్, 30% ఫైబర్, 20% కార్బోహైడ్రేట్లు, 10% ఆరోగ్యకరమైన కొవ్వులు.పరిమితంగా తినడం పరిష్కారం కాదని,అవగాహన , నియంత్రణ ముఖ్యమని స్పష్టం చేసింది. "కటింగ్ లేదు, బ్యాలెన్స్ మాత్రమే" అంటుంది. View this post on Instagram A post shared by Aryaa Arora (@wutaryaadoin)బరువు తగ్గడమే కాదు ఎనర్జీ పెంచుకోవాలి : బరువు తగ్గడం, ఫ్యాట్ను కరిగించడంతోపాటు బాడీకి శక్తి కావాలి, దానికి తగ్గ వ్యాయామం కావాలి అంటుంది ఆర్య. ఈ విషయంలో తనకైతే డంబెల్స్చాలు అంటుంది.2.5 కిలోలతో ప్రారంచి, 5 కిలోల డంబెల్స్తో వర్కైట్స్ చేసింది. రోజూ నడక, రెండు రోజులు , 4 రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో కండరాలు దృఢంగా మారడంతో పాటు వేగంగా శరీరంలోని కొవ్వు కరిగిపోతుందని ఆర్య తెలిపింది. క్యాలరీల లెక్కలు: ఆర్య క్యాలరీల అవగాహన రావాలంటే వారం రోజులు చాలు అని, అలాగ ఒక వారంపాటు తన ఆహారాన్ని ట్రాక్ చేసుకుంటూ, ఆహార అలవాట్లను బాగా అర్థం చేసుసుకుని ఆచరించినట్టు తెలిపింది.జంక్ ఫడ్ : జంక్ ఫుడ్ విషయంలో 80:20 నియమాన్ని పాటించిదట. తినే ఫుడ్ లో జంక్ ఫుడ్ శాతాన్ని 20 శాతానికి పరిమితం చేసింది. ప్రాసెస్ చేసిన ఫుడ్, చక్కెర, పిండి, నూనె పదార్థాలు, ఫ్రై చేసిన ఫుడ్ ను తీసుకోవడం ఆమె తగ్గించింది. నీళ్లు, నిద్ర: బరువు తగ్గే క్రమంలో రోజుకు 2-3 లీటర్ల నీరు, 7-8 గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరమని తద్వారా శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరిగి, జీర్ణ క్రియ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది.హార్మోన్స్ : బరువు తగ్గడంలో మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనదని ఆర్య తెలిపింది. ఇందుకోసం క్రమం తప్పకుండా చదవడం, ధ్యానం కృతజ్ఞతా భావంతో ఉండటం ఇవి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని పేర్కొంది.

దక్ష నగార్కర్ గ్లామర్ రహస్యం ఏంటో తెలుసా?
సాక్షి, సిటీబ్యూరో: సౌందర్య రంగంలో బ్యూటీ కేర్ తప్పనిసరని, నగరంలోని ఈ తరం ఫ్యాషన్ ఔత్సాహికులు వ్యక్తిగత సౌందర్య సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ప్రముఖ సినీతార దక్ష నగార్కర్ తెలిపారు. మణికొండ అల్కా పూర్ వేదికగా నూతనంగా ఏర్పాటు చేసిన హెయిర్ అండ్ బ్యూటీ ప్రీమియం సెలూన్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణంలో గ్లామర్ కీలకపాత్ర పోషించిందని, బ్యూటీ కేర్తోపాటు ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండటం కూడా తన గ్లామర్ రహస్యమని తెలిపారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్, పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల స్టైలిస్ట్ అమ్జద్ హబీబ్ తన సేవలను నగరంలో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని బిజినెస్ హెడ్ ఆపరేషన్స్ మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెలూన్ నిర్వాహకులు విజయలక్ష్మి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇవీచదవండి: Ananya Reddy తొలిప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్, మార్క్ షీట్ వైరల్చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన
ఫొటోలు
అంతర్జాతీయం

‘ఆకలి చావులను అరికట్టండి’: గాజా పరిస్థితులపై ఒబామా ఆవేదన
గాజా: గాజా స్ట్రిప్లో అంతకంతకూ పెరుగుతున్న మానవతా సంక్షోభం మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో ఆకలి చావులను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గాజాలో సంక్షోభానికి శాశ్వత పరిష్కారం.. ఇజ్రాయెల్ బందీలను వెనక్కి తీసుకురావడం, ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను నిలిపివేయడం జరగాలని ఒబామా పేర్కొన్నారు. ఆకలితో అక్కడి అమాయక ప్రజలు చనిపోతున్నారని, దీనిని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒబామా పేర్కొన్నారు.గాజా స్ట్రిప్లోని బాధితులను కలుసుకునేందుకు, వారికి సహాయం చేసేందుకు అనుమతులు ఉండాలన్నారు. వారికి ఆహారం, నీటిని దూరంగా ఉంచడం సమర్థనీయం కాదన్నారు. మరోవైపు గాజాలో పోషకాహార లోపం ఆందోళనకర స్థాయికి చేరుకున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (హూ) ఆదివారం హెచ్చరించింది. వారికి అందే సహాయాన్ని ఉద్దేశపూర్వకంగా నిరోధించడం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది నమోదైన 74 పోషకాహార లోపం మరణాలలో 63 జూలైలో సంభవించాయి. ఇందులో 24 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. While a lasting resolution to the crisis in Gaza must involve a return of all hostages and a cessation of Israel’s military operations, these articles underscore the immediate need for action to be taken to prevent the travesty of innocent people dying of preventable starvation.…— Barack Obama (@BarackObama) July 27, 2025ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, గాజాలో దాదాపు ఐదుగురు పిల్లలలో ఒకరు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆహార నిపుణులు కూడా గాజాలో కరువు పరిస్థితులపై ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఇక్కడి జనాభాకు సహాయం అందించడంపై ఇజ్రాయెల్ పరిమితులు విధించింది. కాగా ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం గాజాలోని మూడు ప్రాంతాలలో రోజుకు 10 గంటల పాటు యుద్ధానికి విరామం ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ విరామం ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు ఉంటుందని ఇజ్రాయెల్ తెలిపింది.

ఈయూతో ట్రంప్ భారీ వాణిజ్య ఒప్పందం.. దిగుమతులపై 15శాతం సుంకాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్తో భారీ వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు. ఇకపై ఈయూ దిగుమతులపై అమెరికా 15 శాతం సుంకాలను విధించనున్నదని వెల్లడించారు. యునైటెడ్ స్టేట్స్ దీనిని మునుపెన్నడూ లేని భారీ వాణిజ్య ఒప్పందంగా అభివర్ణించింది.యూరోపియన్ వస్తువులపై 30శాతం అమెరికా సుంకాలను నివారించేందుకు ఆగస్టు ఒకటితో గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ ఒప్పందం కుదిరింది. స్కాట్లాండ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ల మధ్య జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈయూతో తాము ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇది ఇరు దేశాలకు లబ్ధి చేకూర్చే ఒప్పందం అని, బహుశా ఇది ఆ దేశంతో కుదిరిన పెద్ద ఒప్పందం అని ట్రంప్ వార్తాసంస్థ ఎఎఫ్పీకి తెలిపారు. Today, President Trump secured a HUGE, POWERFUL TRADE DEAL between the U.S. and EU 🇺🇸 The EU will: 💰 Invest $600 Billion in U.S.⚡️ Purchase $750 Billion in American Energy💸 Open Markets to U.S. pic.twitter.com/PWNtlhpH5b— The White House (@WhiteHouse) July 28, 2025ఈ 15శాతం సుంకాలు యూరప్లోని కీలకమైన ఆటోమొబైల్ రంగం, ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లతో సహా అన్ని రంగాలకు వర్తిస్తాయని ట్రంప్ తెలిపారు. ఈ ఒప్పందం కారణంగా 27 దేశాల ఈయూ కూటమి యునైటెడ్ స్టేట్స్ నుండి 750 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనశక్తిని కొనుగోలు చేస్తుందని, ఈయూ 600 బిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడులను అందిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుండి ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా, రాబోయే మూడు సంవత్సరాలలో యూరోపియన్ యూనియన్ అమెరికా నుంచి ద్రవీకృత సహజ వాయువు, చమురు అణు ఇంధనాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుందని వాన్ డెర్ లేయన్ తెలిపారు.విమానాలు, కొన్ని రసాయనాలు, పలు వ్యవసాయ వస్తువులు, కీలక ముడి పదార్థాలు తరహా ఉత్పత్తులపై సుంకాలను తొలగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని ఆమె పేర్కొన్నారు. జనవరిలో ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఈయూ పలు సుంకాల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంది. కార్లపై 25శాతం పన్ను, ఉక్కు, అల్యూమినియంపై 50శాతం సుంకాన్ని ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడు ఒప్పందం కుదరకపోతే ఈ 10శాతం సుంకాల రేటు 30శాతం వరకు పెరుగుతుందని అమెరికా హెచ్చరించింది.

జర్మనీలో రైలు ప్రమాదం.. ముగ్గురు మృతి
బెర్లిన్: జర్మనీలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. 100 మందితో వెళ్తున్న రైలు పట్టాలు తప్పడంతో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. జర్మనీలోని సిగ్మరింగెన్ పట్టణం నుండి ఉల్మ్ నగరానికి వెళుతున్న ప్యాసింజర్ రైలు అటవీ ప్రాంతంలో పట్టాలు తప్పింది.ఆదివారం(అక్కడి కాలమానం ప్రకారం) నైరుతి జర్మనీలోని బాడెన్-వుర్టెంబర్గ్ పరిధిలోని రీడ్లింగెన్ పట్టణానికి సమీపంలో సాయంత్రం 6:10 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారని పోలీసులు తెలిపారు. 50 మంది గాయపడ్డారని భావిస్తున్నారు. అయితే వీరి సంఖ్య ఎంతనేది చెప్పేందుకు అధికారులు నిరాకరించారు. రెండు రైలు బోగీలు పట్టాలు తప్పాయని, దీనికిగల కారణం తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. Γερμανία: Επιβατικό τρένο εκτροχιάστηκε - Αναφορές για αρκετούς νεκρούς και τραυματίες👉🔗https://t.co/6rBCB839rL#ingr #innews #τρενο #γερμανια pic.twitter.com/eX9s7kocd2— in.gr/news (@in_gr) July 27, 2025రైల్వే అధికారులు ప్రస్తుతం ప్రమాద తీరుతెన్నులను పరిశీలిస్తున్నారని ఆపరేటర్ తెలిపారు. ఈ మార్గంలో 40 కిలోమీటర్ల (25-మైళ్ల) పొడవునా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు స్థానిక వాతావరణశాఖ ఈ ప్రాంతంలో తీవ్రమైన తుఫాను గాలులు వీస్తున్నందున కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. రవాణా మంత్రులతో మాట్లాడుతున్నానని, అత్యవసర సేవలను అందించాలని కోరానని ఆయన తెలిపారు.స్థానిక టీవీ స్టేషన్ ఎస్డబ్ల్యూ ఆర్ తెలిపిన వివరాల ప్రకారం గాయపడిన వారిని ఆ ప్రాంతంలోని వివిధ ఆస్పత్రులకు తరలించేందుకు హెలికాప్టర్లు సేవలు అందించాయి. కాగా 2022 జూన్లో దక్షిణ జర్మనీలోని బవేరియన్ ఆల్పైన్ రిసార్ట్ సమీపంలో ఒక రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. 1998లో లోయర్ సాక్సోనీలోని ఎస్చెడ్లో హై-స్పీడ్ రైలు పట్టాలు తప్పగా, 101 మంది మృతిచెందారు.

గ్రీస్లో కార్చిచ్చు విధ్వంసం
ఏథెన్స్: గ్రీస్లో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. వారంరోజులకు పైగా కొనసాగుతున్న మంటలతో వేలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏథెన్స్ శివారు ప్రాంతం క్రియోనేరిలో మరో కార్చిచ్చు చెలరేగింది. ఇప్పటికే అనేక ప్రాంతాలను మంటలు చుట్టుముట్టగా.. క్రియోనేరిలోని కార్చిచ్చు వేలాది మందిని ప్రమాదంలో పడేసింది. ఏథెన్స్కు ఈశాన్యంగా దాదాపు 20 కి.మీ దూరంలో ఉన్న క్రియోనేరిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు, పొడి పరిస్థితులు, బలమైన గాలులతో మంటలు మరింత తీవ్రమవుతున్నాయి. గ్రీకు జర్నలిస్ట్ ఎవాంజెలో సిప్సాస్ ఎక్స్లో షేర్ చేసిన వీడియోలో వినాశకరమైన కార్చిచ్చు దృశ్యాలు కనిపించాయి. ఏథెన్స్కు ఉత్తరాన కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీపంలోని మరో గ్రామంలో పేలుళ్లు సంభవించాయి. ఆ ప్రాంతంలో కర్మాగారాలు ఉండటంతో మరింత ప్రమాద భయాలు మరింత పెరిగాయి. హెలికాప్టర్లు ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయతి్నస్తున్నారు. క్రీట్, ఎవియా, కైథెరా దీవులలో మరో మూడు ప్రధాన కార్చిచ్చులు చెలరేగాయి. ఈ మంటలను ఆర్పేందుకు దేశవ్యాప్తంగా 335 అగ్నిమాపక సిబ్బంది, 19 విమానాలు, 13 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి. వైమానిక దళాలు పగటిపూట మాత్రమే పరిమితం కావడంతో సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోంది. గ్రీసులో ఈ వేసవిలో వేడిగాలులు వీయడం ఇది మూడోసారి. శనివారం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయి.
జాతీయం

ఆపరేషన్ సిందూర్ అద్భుతం : వైఎస్ అవినాష్
సాక్షి,న్యూఢిల్లీ: జాతీయ భద్రతకు కేంద్రం తీసుకునే అన్ని చర్యలకు వైఎస్సార్సీపీ మద్దతిస్తుందని ఆ పార్టీ ఎంపీ వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. లోక్సభలో అపరేషన్ సిందూర్పై జరిగిన చర్చలో వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. పాకిస్తాన్ చర్యలకు జవాబు దారి చేయాలి. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి హకీమ్ స్వయంగా పాశ్చాత్య దేశాల కోసం ఉగ్రవాదులకు మద్దతిస్తున్నామని చెప్పాడు. వైఎస్సార్సీపీ జమ్మూ కాశ్మీర్ పౌరులకు సంఘీభావం ప్రకటిస్తోంది. అనేక సంవత్సరాల అస్థిర పరిస్థితుల మధ్య మళ్లీ ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరుగుతోంది. పహల్గాం దాడితో ఈ ప్రయత్నాలకు కొంత దెబ్బ తగిలింది. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ అద్భుతంగా నిర్వహించిన భారత ఆర్మీని వైఎస్సార్సీపీ అభినందిస్తోంది. ఈ ఆపరేషన్ భారత రక్షణ సామర్థ్యానికి ఒక ప్రతీక. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగానే ఆపరేషన్ సిందూర్ నిర్వహించారు. అత్యంత ఖచ్చితత్వంతో సైనిక బలగాలు పాకిస్తాన్లోని ఉగ్రస్తావరాలను ధ్వంసం చేశాయి. అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి కేవలం ఉగ్రస్థావరాలపైనే దాడి జరిగింది. అరగంటలోపే మొత్తం ఆపరేషన్ పూర్తి చేశారు. డ్రోన్ సిస్టంలతో వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు విజయవంతంగా పూర్తి చేసింది. సంఖ్యాత్మక బలం కంటే సాంకేతికత ముఖ్యమని ఆపరేషన్ సిందూర్ చాటి చెప్పింది. సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తతతో సన్నద్ధంగా ఉండడం కీలకం. జాతీయ సార్వభౌమత్వాన్ని రక్షించడానికి రక్షణ బడ్జెట్ను పెంచడం మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ చర్చలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్పహల్గాం దాడి జరిగిన రోజు, కాల్పుల విరమణ జరిగిన రోజు ప్రధాని నరేంద్ర మోదీకి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు మధ్య ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణ జరగలేదు. కాల్పుల విరమణకు తానే కారణమన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటనను తోసి పుచ్చారు.ఆపరేషన్ సింధూర్ దాడి తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రతిపాదన చేసింది. స్వయంగా పాకిస్తాన్ డీజీఎంఓ కాల్ చేసి కాల్పుల విరమణ చేయాలని అడిగారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను సృష్టించినది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ హయాంలోనే చైనాకు కాశ్మీర్ భూభాగం ధారా దత్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే పాకిస్తాన్ చైనా కారిడార్ ఒప్పందాలు జరిగాయి.ఎంపీ గౌరవ్ గొగోయ్ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాక్పై భారత్ కాల్పుల విమరణకు ఎందుకు అంగీకరించిందో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాకుండా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని లోక్సభలో కాంగ్రెస్ లోక్సభ ఎంపీ గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. భారత్-పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా ఇరు దేశాలపై తాను ఒత్తిడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 26సార్లు పాకిస్తాన్లను కాల్పుల విరమణకు బలవంతం చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 26 సార్లు మాట్లాడారు. దీని వెనుక ఉన్న నిజం మాకు తెలుసుకోవాని అనుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు. పాక్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆర్థిక సహాయం అందించకుండా భారత్ ఎందుకు ఆపలేకపోయిందని ప్రశ్నించారు. పహల్గాం ఘటన జరిగి నెలలు గడుస్తున్నా.. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టకపోవడం,పాక్కు బుద్ధి చెప్పామంటూనే ఆపరేషన్ సిందూర్ను ఆపేయడం వంటి అంశాలపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధీటుగా బదులిచ్చారు. ‘ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. గ్యాప్ ఇచ్చాం అంతే. పాక్, పాక్ ఆక్రమిత ఉగ్రవాదుల ఏరివేతే లక్క్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో దాయాది దేశం మన కాళ్ల బేరానికి వచ్చింది. భారత్ సైనికులు సింహాలు. దేశ రక్షణ సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వేసే విషయంలో జాగ్రతగా ఉండాలి’ అంటూ ప్రతిపక్షాలకు రాజ్నాథ్ సూచించారు. ప్రజా సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను ప్రభుత్వానికి అడగడం ప్రతిపక్షం పని. కొన్నిసార్లు, మన విమానాలను ఎన్ని కూల్చివేసారని మన ప్రతిపక్ష సభ్యులు అడుగుతూనే ఉంటారు. కానీ మన దళాలు ఎన్ని పాకిస్తాన్ విమానాలను కూల్చివేశామని వారు ఎప్పుడూ అడగరు. మీరు ప్రశ్నలు అడగాలనుకుంటే, ఈ ఆపరేషన్లో మన సైనికుల్లో ఎవరికైనా హాని జరిగిందా అని అడగండి? ఇలాంటి ప్రశ్నలకు మీ వద్ద సమాధానం ఉందా? లేదు’ అని అన్నారు.సోమవారం (జులై 28)లోక్సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్పై రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్య.ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య ప్రారంభించాం.ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి సత్తా చూపించాం.పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మతం పేరు అడిగి మరి పర్యాటకుల్ని కాల్చి చంపారు మన ఆడబిడ్డలకు జరిగిన అన్యాయంపై ఊరుకునేది లేదు. పాక్,పీవోకేలోని పాక్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేశాం. భారత సైన్యం వ్యూహాత్మకంగా ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసింది. పాకిస్తాన్లో తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాం. 100మందికిపైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాం.హిబ్జుల్,లష్కరే తోయిబా ఉగ్రశిబిరాల్ని నేలమట్టం చేశాం.టెర్రరిస్టుల ఇళ్లలోకి చొచ్చుకెళ్లీ మరి 22 నిమిషాల్లో వారి స్థావరాల్ని ధ్వంసం చేశాం.పాక్ ఉగ్రస్థావరాలపై దాడి జరిపిన తర్వాత ఆదేశ డీజీఎంవోకు సమాచారం అందించాం.పాక్ డ్రోన్లను భారత్ వాయిసేన కూల్చేసింది. పాక్లో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాడి చేశాం.ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న సైన్యానికి నా సెల్యూట్.పాక్ దాడుల్లో భారత ఆయుధ సంపత్తికి ఎలాంటి నష్టం జరగలేదు.భారత నౌకా దళం కూడా పాక్కు గట్టిగా బుద్ధి చెప్పింది.పాక్ను ఆక్రమించుకోవడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదు.తమ దేశంపై దాడులు వెంటనే ఆపాలని పాక్ కోరింది.మన దాడులతో పాక్ మన కాళ్ల బేరానికి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ ముగియలేదు..గ్యాప్ ఇచ్చాం. ఆపరేషన్ సిందూర్ ఆపాలని మాపై ఎలాంటి ఒత్తిడి లేదు.బాధితులపై జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకున్నాం’ అని స్పష్టం చేశారు.

సొంత దేశాన్నే ఏర్పాటు చేయొచ్చు.. అయితే?
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఉంటూ, రెండంతస్థుల భవనంలో వెస్ట్ ఆర్కిటికా, సబోర్గా, పౌల్వియా, లాడోనియా తదితర నకిలీ దేశాల రాయబార కార్యాలయాలను నిర్వహిస్తున్న హర్ష్ వర్ధన్ జైన్ను ఇటీవల ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసింది. ఈ నేపధ్యంలో ఆయన సాగించిన అనేక బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి.47 ఏళ్ల ఈ మోసగాడు దౌత్యపరమైన ప్లేట్లు కలిగిన లగ్జరీ కార్లలో తిరిగాడు. దశాబ్ద కాలంలో 162 విదేశాల్లో పర్యటించాడు. రూ. 300 కోట్ల ఆర్థిక కుంభకోణాన్ని నడిపాడని ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్)దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఇంతకీ కొత్త దేశాన్ని ఎలా సృష్టిస్తారు? ఇందుకు ఏ విధమైన రూపకల్పన చేస్తారు? దేశ జెండాలు, పాస్పోర్ట్లు, రాజ్యాంగాలు, జాతీయ గుర్తింపులను ఎలా సృష్టిస్తారు.. అనే వివరాల్లోకి వెళ్లే ముందు ఒక స్వతంత్ర దేశాన్ని ఎలా ఏర్పాటు చేయాలని విషయంలోకి వెళదాం.మోంటెవీడియో కన్వెన్షన్ ప్రకారం ఒక దేశానికి నాలుగు లక్షణాలు అవసరం. ఎవరూ హక్కుదారులుకాని భూభాగం, శాశ్వత జనాభా, అధికార ప్రభుత్వం, దౌత్యంలో పాల్గొనే సామర్థ్యం అనేవి తప్పనిసరి. అయితే ఐక్యరాజ్య సమితి గుర్తింపు లేకపోతే ఆ దేశానికి గుర్తింపు దక్కదు. అయినప్పటికీ ఇటువంటి దేశాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. 2019లో భారత్ విడిచి పారిపోయిన అత్యాచార నిందితుడు నిత్యానంద కొంతకాలానికి తెరపైకి వచ్చి, తాను ఒక కొత్త దేశాన్ని స్థాపించానని, దానికి యునైటెడ్ స్టేట్ ఆఫ్ కైలాస అని పేరు పెట్టానని తెలిపాడు. ఈ దేశం ఏర్పాటుకు తన అనుచరులు ఈక్వెడార్ సమీపంలో భూమిని కొనుగోలు చేశారని నిత్యానంద తెలిపారు. అయితే అది వాస్తవానికి ఎక్కడ ఉందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు.నిత్యానంద వాదనను ఈక్వెడార్ తిరస్కరించింది. తమ గడ్డపై లేదా సమీపంలో అలాంటి దేశం ఏదీ లేదని స్పష్టం చేసింది. అయితే నిత్యానంద మాత్రం తన దేశం పేరుతో కైలాస వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్, దౌత్య మిషన్లు, సొంత పాస్పోర్ట్లు, కరెన్సీని జారీ చేశారు. 2023 ఫిబ్రవరిలో నిత్యానంద సహాయకురాలు విజయప్రియ జనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నప్పుడు కైలాస దేశం అందరి దృష్టిని ఆకర్షించింది. కైలాస దేశం ప్రపంచంలోని పలు దేశాలలో తన రాయబార కార్యాలయాలను ప్రారంభించిందని ఐక్యరాజ్య సమితిలో విజయప్రియ పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా, స్వయం ప్రకటిత సూక్ష్మదేశాలు చాలానే ఉన్నాయి. 1967లో పాడీ రాయ్ బేట్స్ బ్రిటిష్ సైనిక వేదిక అయిన సీలాండ్ను ఆక్రమించి, ఒక దేశంగా ప్రకటించాడు. దానికి ఒక జెండా, రాజ్యాంగం రూపొందించాడు. పాస్పోర్ట్లను కూడా జారీ చేశాడు. అయితే నేటికీ ఎవరూ సీలాండ్ను సార్వభౌమ దేశంగా గుర్తించ లేదు. ఇదేవిధంగా చెక్ రిపబ్లిక్ నేత వీటీ జెడ్లికా 2015లో లిబర్ల్యాండ్ను స్వేచ్ఛావాద కలల దేశంగా ప్రకటించాడు. అయితే నేటికీ దీనికి గుర్తింపు లేదు. ఏది ఏమైనప్పటికీ దేశ నిర్మాణం అంత తేలికైన పనేమీ కాదు.

ఆపరేషన్ మహదేవ్ పహల్గాం ఉగ్రదాడి మాస్టర్మైండ్ హతం
శ్రీనగర్: ‘పహల్గాం’ గాయానికి ప్రతీకారం మొదలైంది. దేశమంతటా ఆగ్రహావేశాలు రగిల్చిన ఆ దాడికి పాల్పడ్డ ఉగ్ర ముష్కరులకు కౌంట్డౌన్ మొదలైంది. పహల్గాం దాడి సూత్రధారి అయిన ఉగ్ర ముష్కరుడు హషీం మూసా అలియాస్ సులేమాన్ అలియాస్ ఆసిఫ్ను భద్రతా దళాలు సోమవారం మట్టుబెట్టాయి. జమ్మూ కశ్మీర్లో శ్రీనగర్ శివార్లలోని అటవీ ప్రాంతంలో ‘ఆపరేషన్ మహదేవ్’ పేరిట జరిపిన భీకర ఎన్కౌంటర్లో సులేమాన్తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను ఎలైట్ పారా కమెండో దళాలు కాల్చిపారేశాయి. వారిని జిబ్రాన్, హంజా అఫ్గానీగా గుర్తించారు. జిబ్రాన్ గతేడాది సోనామార్గ్లో టన్నెల్ ప్రాజెక్టు పనులు చేస్తున్న సిబ్బందిని పొట్టన పెట్టుకున్న ఉగ్ర ముఠా సభ్యుడని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి ఒక ఎం4 కార్బైన్, రెండు ఏకే రైఫిళ్లు, మందుగుండు, గ్రెనేడ్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నా రు. ముష్కరుల మృత దేహాలను బలగాలు స్థానిక పోలీసులకు అప్పగించాయి. ఈ ముష్కరులకు సన్ని హితులైన మరో ఉగ్ర ముఠా సభ్యులు సైతం ఎన్కౌంటర్ ప్రాంతానికి సమీపంలోనే నక్కినట్టు బలగాలకు సమాచారం అందింది. దాంతో సమీప ప్రాంతాలన్నింటినీ దిగ్బంధించి జల్లెడ పడు తున్నారు. ‘ఆపరేషన్ మహదేవ్’ ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నట్టు సైనిక, స్థానిక పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. ఇందుకోసం భారీ సంఖ్యలో అదనపు బలగాలను మోహరించారు. సై న్యం, భద్రతా బలగాలు, కశ్మీర్ పోలీసు విభాగ సి బ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నా రు. ఆపరేషన్ మహదేవ్ ఇప్పట్లో ముగి యబోదని కశ్మీర్ జోన్ ఐజీ వీకే బిద్రీ స్పష్టం చేశారు..కునుకు తీస్తుండగానే...హషీం మూసా. అలియాస్ అబూ సులేమాన్. అలియాస్ ఆసిఫ్. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తయిబా టాప్ కమాండర్. పహల్గాం ఉగ్ర దాడి సూత్రధారి. ఆపరేషన్ మహదేవ్లో మన బలగాలు మట్టుబెట్టిన ముగ్గురు ముష్కరుల్లో అతి ముఖ్యుడు. అయితే ఇంతటి విజయం అంత తేలిగ్గా ఏమీ లభించలేదు. ఇందుకోసం సైన్యం అవిశ్రాంతంగా శ్రమించింది. సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీస్తో కలిసి ఏకంగా 14 రోజుల పాటు కలిసికట్టుగా, నిర్విరామంగా వేట సాగించింది. చివరికి శ్రీనగర్ శివార్లలోని అటవీ ప్రాంతంలో మూసా ముఠా ఆనుపానులు కనిపెట్టి ముప్పేట దాడి చేసింది. రెప్పపాటులో దాని కథ ముగించింది. జమ్మూ కశ్మీర్లోని లిడ్వాస్ ప్రాంతంలోని చినార్ కార్ప్స్ సైనిక విభాగం ఈ ఆపరేషన్ను ఆద్యంతం పర్యవేక్షించింది. అనంతరం ఘటనా స్థలిలో తీసిన డ్రోన్ ఫుటేజీని విడుదల చేసింది. అందులో ముగ్గురు ముష్కరుల మృతదేహాలు కనిపిస్తున్నాయి. వీరంతా లష్కరే, పాక్కే చెందిన మరో ఉగ్ర ముఠా జైషే మహ్మద్కు చెందిన ఉగ్రవాదులేనని తేలింది. పహల్గాం ఉగ్ర దాడి తమ పనేనని లష్కరే ప్రకటించుకోవడం తెలిసిందే. ఈ ముగ్గురిలో ముఖ్యుడైన మూసా దాడి సమయంలో తీరిగ్గా కునుకు తీస్తూ ఉండటం ఈ ఉదంతం మొత్తంలో కొసమెరుపు!అలా ఉచ్చు బిగించారు...నిజానికి ఆపరేషన్ మహదేవ్ రెండు రోజులుగా కొనసాగుతోంది. దట్టమైన దాచిగాం అడవుల లోతట్టు ప్రాంతం నుంచి అందని అనుమానాస్పద సిగ్నల్స్, కమ్యూనికేషన్తో బలగాలు అప్రమత్తమ య్యాయి. వాటి ఆధారంగానే అనుమానితుల జాడను కనిపెట్టగలిగాయి. ఆ వెంటనే సైనిక బృందాలు, ప్రత్యేక బలగాలు (ఎలైట్ ఫోర్సెస్) రంగంలోకి దిగి రెండు రోజులుగా పరిసరాలను జల్లెడ పడుతూ వచ్చాయి. ఆ క్రమంలో ఒక చెట్టు కింద తాత్కాలిక గుడారంలో విశ్రమిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను యాదృచ్చికంగా గుర్తించాయి. దాడిని ఏ మాత్రమూ ఊహించని ముష్కరులు టెంట్లో తీరిగ్గా కునుకు తీస్తూ కనిపించారు. సైనికులు వెంటనే తూటాల వర్షం కురిపించి వారిని హత మార్చారు. ఆపరేషన్ను పర్యవేక్షించిన అత్యున్నత స్థాయి అధికారి ఒకరు ఈ మేరకు ధ్రువీకరించారు.రూపం మార్చుకున్న మూసాఎట్టి పరిస్థితుల్లోనూ భద్రతా దళాలకు చిక్కొద్దనే ఉద్దేశంతో మూసా తన రూపాన్ని వీలైనంతగా మార్చుకున్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ఆ క్రమంలో అతడు భారీగా బరువు కోల్పోయాడన్నారు. పహల్గాం దాడిలో పాల్గొంది ఈ ఉగ్రవాదులే.. మూసా(కుడివైపు చివర)అలాగే.. ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సైన్యం ప్రకటించింది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ను తెలియజేస్తామని ఎక్స్ ద్వారా తెలియజేసింది. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ములనార్, హర్వాన్ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. మరిన్ని బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నట్లు సమాచారం. OP MAHADEVContact established in General Area Lidwas. Operation in progress.#Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/xSjEegVxra— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) July 28, 2025

పామును కరిచి బతికిన పిల్లాడు.. అసలు జరిగింది ఇదే!
పట్నా: బిహార్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. విషం చిమ్మే తాచుపామును కొరికి కూడా ఏడాది వయసు పిల్లాడు బతికి బట్టకట్టిన విషయం తెలిసిందే. బొమ్మ అనుకుని పామును పట్టుకున్న పిల్లవాడు. దానిని నోటితో కొరికి చంపాడు. స్వల్ప విష ప్రభావంతో ఆస్పత్రిపాలైన బుడ్డోడు.. చివరకు ప్రాణాలతో బయపడ్డాడు. అయితే పామును కొరికినప్పటికీ పిల్లాడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంపై సర్వత్రా ఆశ్యర్చానికి గురవుతున్నారు.తాజాగా చిన్న పిల్లాడు బతికి బయటపడటంపై గల కారణాలను వైద్యులు వెల్లడించారు. సాధారణంగా పాము వ్యక్తులను కరిచినప్పుడు దానికున్న విషం రక్తంలోకి ప్రసరిస్తుందని, ఇది , నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని తెలిపారు. దీనివల్ల అనారోగ్యానికి గురికావడం లేదా కొన్నిసార్లు మనుషులు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. అయితే గోవింద్ విషయంలో విషం నోటి ద్వారా జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించిందన్నారు. మానవ జీర్ణవ్యవస్థ కొన్ని సందర్భాల్లో విషాన్ని విచ్ఛిన్నం చేసి తట్టుకోగలదని, ప్రాణాపాయాన్ని నివారిస్తుందన్నారు. ఒకవేళ శరీరంలో అంతర్గత రక్తస్రావం అయితే.. బాలుడుపరిస్థితి భిన్నంగా ఉండేదని, కానీ అదృష్టవశాత్తు అలాంటి సమస్యలు ఏం రాలేదని అన్నారు. అసలేం జరిగిందంటే.. బీహార్లో, ఏప్రిల్ 2023 మరియు మార్చి 2024 మధ్య 934 మంది పాముకాటు కారణంగా మరణించారని ప్రభుత్వ డేటా చూపిస్తుంది. అదే సమయంలో, 17,800 మందికి పైగా రాష్ట్ర ఆసుపత్రులలో పాముకాటుకు చికిత్స పొందారు వెస్ట్చంపారన్ జిల్లాలోని మొహఛీ బంకాత్వా గ్రామంలో గోవింద్ కుమార్ అనే ఏడాది వయసు పిల్లాడిని తల్లి ఇంటి వరండాలో వదిలేసి సమీపంలో వంటచెరకు సేకరిస్తోంది. అదే సమయంలో పిల్లాడి వైపు ఒక తాచుపాము వచ్చింది. దీనిని బొమ్మగా భావించిన పిల్లాడు పక్కన ఉన్న వస్తువుతో కొట్టాడు. దాంతో అది పిల్లాడి అరచేతికి చుట్టుకుంది. మెత్తగా ఉండటంతో పిల్లాడు అదేదో తినే వస్తువును అనుకుని వెంటనే నోట్లో పెట్టుకుని పరపరా నమిలేశాడు. దీంతో పాము సెకన్లలో చనిపోయింది. అదే సమయానికి అటుగా వచ్చిన పిల్లాడి అమ్మమ్మ మాతేశ్వరీ దేవి .. పిల్లాడి చేతిలో పామును చూసి హుతాశురాలైంది. వెంటనే పిల్లాడిని, పామును వేరుచేసింది. అయితే పిల్లాడు నీరసించిపోయి తర్వాత స్పృహకోల్పోయాడు. విషయం తెలుసుకుని పరుగున వచ్చిన పిల్లాడి తల్లి, కుటుంబసభ్యులు వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చేరి్పంచారు. అయితే పిల్లాడి పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే బేఠియా పట్టణంలోని ప్రభుత్వ వైద్య బోధనాస్పత్రికి తరలించారు. హుటాహుటిన పిల్లాడికి అత్యయిక వైద్యం మొదలెట్టి పిల్లాడి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం పిల్లాడు కోలుకుంటున్నాడు.
ఎన్ఆర్ఐ

లవ్ ప్రపోజల్ తిరస్కరించిన ఇండియన్ టెకీకి బాస్ చుక్కలు : నెటిజన్లు ఏమన్నారంటే
పనిప్రదేశాల్లో ఉద్యోగాలు చేసే మహిళలపై వేధింపులకు నిదర్శనం ఈ ఘటన. కావాలనే జీతాలు పెంచకపోవడం, ప్రమోషన్లు నిరాకరించడం, జీతం ఆలస్యంగా ఇవ్వడం ఇలాంటివి సాధారణంగా కొంతమంది ఉద్యోగులెదుర్కొనే వేధింపులు. దీనికి అదనంగా మహిళలు లైంగిక వేధింపులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తన వేధింపుల పర్వంపై ఇండియన్ టెకీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.10 మంది ఉద్యోగులతో కూడిన ఒక చిన్న యూరోపియన్ టెక్ కంపెనీ అది. అలాంటి కంపెనీలో భారతీయ టెక్ రిమోట్గా పనిచేస్తోంది. అయితే ఆమెకు వివాహితుడైన మేనేజర్ ఒక అభ్యంతరకర ప్రపోజల్ పెట్టాడు. దీన్ని ఆమె అంగీకరించలేదు. అంతే అతగాడి వేధింపులు మొదలైనాయి. బాస్ ఇన్డైరెక్ట్గా పెట్టిన ప్రేమ ప్రతిపాదన తిరస్కరించిన తర్వాత తనను వృత్తిపరంగా లక్ష్యంగా చేసుకోవడం మొదలు పెట్టాడని రెడ్డిట్లో ఆరోపగించింది. చీటికి మాటికి కోపగించుకోవడం, పురుష సహోద్యోగులతో మాట్లాడుతున్నా కూడా సహించేవాడు కాదు. వృత్తిపరంగా, జీతాల జాప్యం, ఆమె చేయని తప్పులకు బహిరంగంగా మందలింపులు లాంటివి కూడా ఎదుర్కొన్నానని తెలిపింది. తన ప్రతీ పనినీ, ప్రతీ కదలికను ప్రశ్నించడం, అవమానించడం, అతనికి పరిపాటిగా మారిపోయిందని వాపోయింది. ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నాడు. గతంలో, రెండు రోజులు సెలవు అడిగినా ఇచ్చేవాడని, దీనికి తన పనితీరు, టాలెంటే కారణమని భావించాను కానీ, దాని వెనుకున్న అతని దుర్బుద్ధి ఇపుడు అర్థమవుతోందని తెలిపింది. ఇంత జరుగుతున్నా, ఈ ఉద్యోగాన్ని వదల్లేను. ఎందుకంటే..రిమోట్గా వర్క్ చేసుకోడానికి అవకాశం ఉంది.ఈ సమయంలో తన కుటుంబానికితన అవసరం చాలా ఉంది. కానీ ఈ వేధింపులో భరించలేనిదిగా మారుతున్నాయి. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్ గొప్పగా లేదు, కాబట్టి మారడం కష్టం అని ఆమె పేర్కొంది.దీనిపై నెటిజన్లు చాలా మంది ఆమెకు సంఘీభావం తెలుపుతూ, కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం మారితేనే మంచిది. ఎందుకంటే ఎవరికి కంప్లయింట్ చేసినా. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు Prevention of Sexual Harassment (POSH) కేసు పనిచేస్తుందని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే HRలు కంపెనీల కోసం పనిచేస్తాయి తప్ప ఉద్యోగుల కోసం కాదు. కాబట్టి వీలైతే ఉద్యోగం మారిపోండి అని మరికొందరు సలహా ఇచ్చారు.‘‘నీ పని నువ్వు చూస్కో.. అనవసర మెసేజ్లు జోలికి పోకు. మరో ఉద్యోగం దొరికేవరకు జాగ్రత్తగా ఉండు’’ అని ఒకరు, ‘‘మున్ముందు పరిస్థితి మరింత టాక్సిక్గా మారుతుంది. మీ మెంటల్ హెల్త్ను కాపాడుకోండి’’ అని ఒకరు, ఇది చేదు నిజం.ఉద్యోగం మారడం ఒక్కటే ఆప్షన్ మరొకరు సూచించారు. మొత్తానికి ఆమె పోస్ట్ కార్యాలయంలో వేధింపుల గురించి ఆన్లైన్లో చర్చకు దారితీసింది. చాలామంది మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని , సురక్షితమైన ఆఫీసు వాతావరణాన్ని కోరుకోవాలని సూచించారు.

డల్లాస్లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంచ్
అమెరికాలోని డల్లాస్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ గా రీ లాంఛ్ అయింది. న్యూయార్క్, న్యూజెర్సీ నుండి వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, కాలిపోర్నియా, చికాగో, నార్త్ కరోలినా, అట్లాంటా, ఫ్లోరిడా మొదలగు నగరాలతో పాటు నార్త్ అమెరికాకు నలుదిక్కులా విస్తరించి.. పుట్టిన నేల నుంచి పెరిగిన గడ్డ వరకు.. ప్రవాసులకు అండగా.. మరింత చేరువగా.. సరికొత్తగా ఆవిష్కృతం అయింది సాక్షి టీవీ నార్త్ అమెరికా. టెక్సాస్, ఫెయిర్వ్యూ లోని సౌత్విండ్ ఎల్ఎన్ వేదికగా ఈ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. అమెరికా, భారత జాతీయగీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఈవెంట్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా, సాక్షి టీవీ స్టాప్, యాడ్ అమిరిండో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ AAA నుంచి రఘు వీరమల్లు , పవన్ కుమార్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, అసోసియేషన్ హెడ్స్, సబ్జెక్టు మేటర్ ఎక్స్పర్ట్స్, తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్లే చేసిన సాక్షి టీవీ నార్త్ అమెరికా AVని ప్రవాసులు ఎంతో ఆకసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ USA కి ప్రవాసులు తమ శుభాకాంక్షలు తెలిపారు.నార్త్ అమెరికాకు నలుదిక్కుల వ్యాప్తి చెంది.. US లో నెంబర్ 1 నెట్వర్క్ గా రూపాంతరం చెంది.. ప్రవాసుల గొంతుకగా Sakshi TV USA నిలుస్తోందని కె.కె. రెడ్డి పెర్కొన్నారు. డల్లాస్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్ అవటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాక్షి టీవీ ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరించారు. ఇక సాక్షి టీవీ ఎన్నారై ప్రత్యేక కార్యక్రమాల గురించి సింహా వివరించారు. అమెరికాలో ప్రవాసుల గొంతుకగా నిలుస్తోన్న సాక్షి టీవీని పలువురు ప్రముఖులు కొనియాడారు. సాక్షి ఎన్నారై కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రవాసులు సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్ ఈవెంట్ పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కె.కె. రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ నార్త్ అమెరికాను అందరూ ఆదరించాలని కోరారు.

అమెరికా నాసా ఎన్ఎస్ఎస్ ఐఎస్డీసిలో సత్తా చాటిన విద్యార్థులు
బంజారాహిల్స్: అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన ఐఎస్డీఎస్ కాన్ఫరెన్స్లో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని శ్రీ చైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని దసపల్లా హోటల్లో నాసా ఏర్పాటు చేసిన ఐఎస్డీఎస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి 475 మంది విద్యార్థులు హాజరైతే అందులో 67 మంది భారత దేశం నుంచి పాల్గొనగా 45 మంది శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులే ఉండటం తమకు గర్వకారణంగా ఉందని అన్నారు. అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో అంతర్జాతీయ స్థాయిలో 60 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకొని తాము వరల్డ్ నెం1.గా నిలిచామని తెలిపారు. వీటిలో వరల్డ్ ఫస్ట్ ప్రైజ్ 3 ప్రాజెక్టులు, వరల్డ్ సెకండ్ ప్రైజ్ 4 ప్రాజెక్టులు, వరల్డ్లో మూడో ప్రైజ్ కింద 10 ప్రాజెక్టులు గెలుచు కోవడంతో పాటు 43 ప్రాజెక్టులకు హానరబుల్ మెన్షన్స్ సాధించాయని తెలిపారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి మరే ఏ ఇతర పాఠశాల నుంచి విద్యార్థులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనలేదన్నారు.ఈ కాన్ఫరెన్స్లో ఆర్టిస్టిక్ కేటగరిలో 500 డాలర్ల బహుమతి అందుకున్న ఏకైక టీం తమదేనని ఆమె వెల్లడించారు.

అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో నాట్స్ సేవా కార్యక్రమాలు
డాలస్, టెక్సాస్ : భాషే రమ్యం .. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేలా అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో కార్యక్రమాన్నిచేపట్టి వీధులను శుభ్రం చేసింది. ఫ్రిస్కో నగరంలో ఫీల్డ్స్ పార్క్వేలో చెత్తను తీసేసి.. అక్కడ వీధిని శుభ్ర పరిచింది. దాదాపు 20 మందికి పైగా తెలుగు వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరిలో అవగాహన పెంచే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 25 పౌండ్లకు పైగా చెత్తను సేకరించి ఆ వీధిని బాగుచేసింది. ఈ కార్యక్రమం ద్వారా యువతలో పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించే లక్ష్యాలు నెరవేరుతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్ధులకు సామాజిక బాధ్యతను నేర్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకీ , పెద్దలకీ మరియు మద్దతు అందించిన దాతలకు నాట్స్ డాలస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ. శ్రావణ్ నిడిగంటిలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహ కోశాధికారి రవి తాండ్ర , మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె,డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న, వంశీ వేనాటి, కిరణ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. మానవతా విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఈ తరహా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డాలస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు.
క్రైమ్

సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, విజయవాడ: స్పష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే డాక్టర్ అట్లూరి నమ్రతతో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేసుల నేపథ్యంలో.. నగరంలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ను రాత్రికి రాత్రే ఎత్తేసినట్లు తెలుస్తోంది. సెంటర్కి ఉన్న బోర్డులను తొలగించడంతో పాటు సెల్లార్లో ఉన్న రెండు కార్లు మాయం అయ్యాయి. అదే సమయంలో..విజయవాడ సెంటర్కు అనుమతులు లేవని, అక్రమంగా నిర్వహిస్తున్నారని జిల్లా వైధ్యాధికారులు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సోమవారం ఉదయం సెంటర్కు ఉన్న బోర్డులు మాయం కావడం గమనార్హం. ఉదయం 11గం. అయినా సిబ్బంది సెంటర్కు రాలేదు. మరోవైపు ల్యాబ్ ఇంఛార్జి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై వచ్చిన ఆరోపణలపై అధికారులు చర్యలు సిద్ధం అవుతుండగా.. డాక్టర్ కరుణ, డాక్టర్ వైశాలి, మిగతా సిబ్బంది సైతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సెంటర్ వద్దకు చేరుకుని పరిశీలనలు జరుపుతున్నారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరొకరి వీర్యకణాలతో సంతానం కలిగించడం లాంటి గలీజు దందా ఓ కేసు ద్వారా బయటపడింది. సికింద్రాబాద్లో ఇది చోటు చేసుకోగా.. అటుపై విజయవాడ, విశాఖపట్నంలోసెంటర్లలోనూ ఇంతకు మించే వ్యవహారాలు జరిగాయని తేలింది. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి.. సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించే ప్రయత్నాలు జరిగాయని వెల్లడైంది. గతంలోనూ ఈ సెంటర్లపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి పిల్లలు లేని వారి నుంచి లక్షలు రూపాయలు వసూలు చేసింది డాక్టర్ నమ్రతా. ఢిల్లీకి చెందిన గర్భిణిని ఫ్లైట్లో విశాఖకు తీసుకొచ్చి .. కోల్కతాలోని ఓ దంపతులకు సరోగసి బిడ్డగా అప్పగించింది. ఇందుకుగానూ రూ.30 లక్షలు వసూలు చేసి.. ఇదే విధంగా కోట్ల రూపాయల దందా చేసినట్లు తేలింది. దీంతో ఆమెపై కేసు నమోదు కావడంతో పాటు సెంటర్లకు సీజ్ పడడం, ఆమె లైసెన్స్లు రద్దు కావడం జరిగిది. అయితే.. తీగలాగితే.. సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం ఘటనతో.. శనివారం ఉత్తర మండలం డీసీపీ సాధనరష్మి పెరుమాళ్, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వీర్య సేకరణ, ఐవీఎఫ్, సరోగసీ విధానం తదితర అంశాలను అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో విశాఖపట్నం, విజయవాడల్లోనూ సోదాలు చేపట్టారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కోల్కతాలలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీవారు బ్రాంచీలు నిర్వహిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఆసుపత్రి నిర్వాహకులపై గతంలో హైదరాబాద్ కేపీహెచ్బీ, గోపాలపురం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నమ్రత వైద్యురాలి లైసెన్స్ రద్దు చేసినా(గతంలో) మరొక వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసీ దందా కొనసాగిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ తరుణంలో.. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసుల ఆరాలు తీయగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. వ్యాపార అభివృద్ధి కోసం బీహార్ నుంచి పూజారులను రప్పించి మరీ 9 రోజులపాటు నమ్రత హోమాలు చేయించింది. బెజవాడ సృష్టిలో.. డాక్టర్ కరుణ, డాక్టర్ సోనాలి, డాక్టర్ వైశాలి ఆధ్వర్యంలో సెంటర్ను నమ్రత నడిపిస్తోంది. ఇటు విశాఖలోనూ మహారాణిపేట పీఎస్ పరిధిలోని సెంటర్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2023లోనే వీటి లైసెన్లు ముగిశాయి. అయినా కూడా రెండు ఫ్లోర్లలో అనధికార సెంటర్లు నడుపుతున్నట్లు గుర్తించారు. అక్కడి మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకుని.. కీలక రికార్డులు స్వాధీనపర్చుకున్నారు. ఇక్కడా ఇతర డాక్టర్ల లైసెన్స్ల మీద నమ్రత నడిపిస్తున్న దందా బయటపడింది. నమ్రతకు నమ్మిన బంటుగా కల్యాణి..విశాఖ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో మేనేజర్గా పని చేసిన కల్యాణి అరాచకాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపడంలో కల్యాణి నెట్ వర్క్ కీలకమని, వాళ్లకు బ్రెయిన్వాష్ చేయడంలో కల్యాణి సిద్ధహస్తురాలిగా మారిందని పోలీసులు గుర్తించారు. 2020 నుంచి నమ్రతతో కలిసి పని చేస్తున్న కల్యాణి.. గతంలో ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. అయితే ఈ ఐదేళ్లలో నర్సు నుంచి ఏకంగా ఓ యూనిట్ మేనేజర్గా ఆమె ఎదిగడం కొసమెరుపు.

గబ్బిలాలతో చిల్లీ చికెన్!!
ఫాస్ట్ఫుడ్ ప్రియులకు వెన్నులో వణుకు పుట్టించే వార్త ఇది. మీరు ముక్కు తుడుచుకుంటూ, లొట్టలేసుకుంటూ తిన్నది ‘చిల్లీ చికెన్’ కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే.. చికెన్ పేరిట గబ్బిలాల మాంసాన్ని హోటల్స్కు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు చేరవేసే ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి.తమిళనాడు సేలం జిల్లా డేనిష్ పేట అటవీ ప్రాంతంలో తుపాకులతో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పేర్లను కమల్, సెల్వంగా చెప్పిన నిందితులు.. విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలను తెలియజేశారు. కొన్ని నెలలుగా గబ్బిలాలను వేటాడుతున్న వీళ్లిద్దరూ.. వాటిని చంపి ఆ మాంసాన్ని చికెన్ పేరిట హోటల్స్కు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు సప్లై చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు.. కొన్ని హోటల్స్కు చిల్లీ చికెన్ తదితర ఐటెమ్స్ను వీళ్లే స్వయంగా గబ్బిలాల మాంసంతో వండించి నేరుగా చేరవేస్తున్నారట. తమ కంటే ముందు కొంతమంది.. కొన్నేళ్లుగా ఇలాగే చేస్తున్నారంటూ మరో బాంబ్ పేల్చారు. దీంతో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులను అప్రమత్తం చేశారు. సేలం, కమల్ ఇచ్చిన సమాచారంతో నగరంలోని పలు రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్సెంటర్లపై పోలీసులు తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇంతకాలం పిల్లి, కుక్క, ఎలుకల మాంసాన్ని ఇలా తరలించడం చూశాం. ఇప్పుడు ఏకంగా గబ్బిలాల మాంసాన్ని చేరవేస్తుండడం ఇప్పుడు కలవరపాటుకు గురి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

మాజీ ప్రియుడి టార్చర్ భరించలేక..
బంజారాహిల్స్: యువతి ఆత్మహత్య కేసులో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకృష్ణానగర్ బీ–బ్లాక్లో నివసించే రేణుక కొంతకాలం క్రితం చల్లా వినయ్కుమార్ను ప్రేమించింది. సదరు యువకుడు జులాయిగా తిరుగుతుండడంతో పాటు డ్రగ్స్కు బానిస కావడంతో యువతి కొంతకాలంగా దూరంగా ఉంటోంది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న యువకుడు ఈనెల 9న యువతి పని చేస్తున్న ప్రాంతానికి వెళ్లి తీవ్రంగా కొట్టి ఆమె ద్విచక్రవాహనంపైనే బలవంతంగా ఎక్కించుకుని మద్యం మత్తులో వస్తుండగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో వారు వాహనాన్ని సీజ్ చేశారు. ఇంటికి వెళ్లిన యువతిని ద్విచక్ర వాహనం ఏదని తల్లి ప్రశ్నించగా మెకానిక్కు ఇచ్చానని చెప్పింది. అయితే తల్లికి అబద్ధం చెప్పానన్న బాధను తట్టుకోలేక ఈనెల 10న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. దీంతో మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడు వినయ్కుమార్పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న వినయ్కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాధిత యువతి ద్విచక్రవాహనం కూడా తన బాబాయిది కావడంతో పాటు పోలీసులు సీజ్ చేయడం, డ్రంకన్ డ్రైవ్లో వినయ్కుమార్ దొరకడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్యకు ప్రేరేపించిన ఫోన్ కాల్
కర్ణాటక: బెంగళూరు ఉత్తర తాలూకా అంచెపాళ్య గ్రామంలో భీమన అమావాస్య రోజున భర్తకు పాదపూజ చేసి అదేరోజు రాత్రి భార్య ఆత్మహత్య చేసుకున్న కేసులో ట్విస్టు చోటుచేసుకుంది. అంచెపాళ్య నివాసి అభిషేక్ భార్య స్పందన (24) ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. తమ కుమార్తెను అభిషేక్, అతని తల్లి లక్ష్మమ్మ హత్య చేసి ఆత్మహత్యగా చెబుతున్నారని, వరకట్నం కోసం వేధించేవారని స్పదన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో స్పందన ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. భర్తకు పరాయి స్త్రీతో సంబంధం ఉందని స్పందనకు అనుమానం ఉండేది. భీమన అమావాస్య రోజున భర్తకు పాదపూజ చేస్తున్న సమయంలో భర్తకు ఆ మహిళ ఫోన్ చేయడంతో కలత చెందిన స్పందన ఆరోజు రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇలా భర్త అక్రమ సంబంధం భార్య ప్రాణాలను బలిగొంది.