ప్రధాన వార్తలు

ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
సాక్షి, అమరావతి: అక్రమ కేసులపై కూటమి సర్కార్కు ఎదురు దెబ్బ తగిలింది ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట లభించింది. కేఎస్ఆర్(కొమ్మినేని శ్రీనివాసరావు) లైవ్ షోకు సంబంధించి సాక్షి టీవీపై నమోదైన కేసులో ఏపీ హైకోర్టు స్టే విధించింది. సాక్షి టీవీపై తదుపరి చర్యలను నిలిపేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.పాత్రికేయుల వాక్ స్వాతంత్య్ర హక్కును హరించిన టీడీపీ కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ను తప్పుపట్టింది. లైవ్ షోలో ఓ ప్యానలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై నవ్వినందుకు కొమ్మినేనిని అరెస్ట్ చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. వాక్ స్వాతంత్య్ర హక్కును కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెప్పింది. సాక్షి మీడియాపై కుట్రతోనే..ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా అక్రమ కేసు నమోదు చేసింది. కొమ్మినేని శ్రీనివాసరావు. సాక్షి మీడియా యాజమాన్యంపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అందుకు నిదర్శనం. అసలు ఉదంతంతో ఏ మాత్రం సంబంధం లేని బీఎన్ఎస్ సెక్షన్ల కింద కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. బీఎన్ఎస్ సెక్షన్లు 79, 196(1), 353(2), 299, 356(2) 61(1) కింద కేసు నమోదు చేయడం. ప్రభుత్వ కుట్రకు తార్కాణం.ఎందుకంటే కుట్రపూరితంగా కుట్ర పూరితంగా వ్యవహరించడం, విద్వేషాలను వ్యాపింప చేయడం తదితర నేరాలకు ఈ సెక్షన్లు వర్తిస్తాయి. అంతేగానీ ఓ టీవీ చానళ్లో స్వతంత్ర విశ్లేషకుడు వ్యక్తం చేసిన అభిప్రాయానికి ఆ సెక్షన్లు నమోదు చేయడం విడ్డూరం. అసలు చర్చా గోష్ఠిలో ఎక్కడా కుల ప్రస్తావనే లేకపోయినా, బీఎన్ఎస్ 3(1)(యు) సెక్షను చేరుస్తూ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉండన్నది సుస్పష్టం. ‘‘నవ్వడం నేరమా? దానికే అరెస్ట్ చేసేస్తారా. నవ్వడమే తప్పయితే, మేం ప్రతి రోజూ నవ్వుతూనే కేసులను విచారణ చేస్తుంటాం. లైవ్ షోలో ప్యానలిస్ట్ వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వారే తప్ప, ఆయన ఎలాంటి అనుచిత, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదు. ఓ జర్నలిస్టుగా లైవ్ న్యూస్ షోలో పాల్గొనే కొమ్మినేని హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వంపై ఉంది. అప్పుడే ఆయన వాక్ స్వాతంత్య్ర హక్కును కూడా పరిరక్షించినట్లవుతుంది’’ :::కొమ్మినేనికి బెయిల్ సందర్బంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

క్లస్టర్ బాంబుతో ఇజ్రాయెల్ గజగజ
ఇరాన్- ఇజ్రాయెల్ (Iran-Israel) పరస్పర దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారింది. యుద్ధం 8వ రోజుకి చేరగా.. తమ భూభాగంలోకి ఏకంగా క్లస్టర్ బాంబులను ఇరాన్ ప్రయోగించిందని ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు దిగింది. అసలు ఈ క్లస్టర్ బాంబు అంటే ఏమిటి? వాటి ప్రమాద తీవ్రత ఎంత?. ఆ బాంబును చూసి ఇజ్రాయెల్ ఎందుకు వణికిపోతోంది? వాటిని నిషేధం నిజంగానే అమల్లో ఉందా?.. క్లస్టర్ బాంబు అనేది ఒక క్షిపణిలా కనిపించినా.. అది గాలిలోనే తెరుచుకుని చిన్న చిన్న పేలుళ్లతో కూడిన సబ్మ్యూనిషన్లు (submunitions) అనే మినీ బాంబులను నేల మీదకు వదిలిపెడుతుంది. భూమిని తాకిన వెంటనే అవి పేలిపోతాయి. ఇరాన్ ఇజ్రాయెల్పై జరిపిన తాజా దాడిలో.. ఒక మిసైల్ సుమారు 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి, దాని నుండి సుమారు 20 చిన్న పేలుడు పదార్థాలు (submunitions) సెంట్రల్ ఇజ్రాయెల్లో 8 కిలోమీటర్ల పరిధిలో పడ్డాయని సమాచారం. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో ఇలాంటి బాంబులను వాడినట్టు నమోదైన ఇది మొట్టమొదటి కేసు.మోస్ట్ డేంజర్ఇరాన్కు చెందిన ఇతర బాలిస్టిక్ క్షిపణుల కంటే ఈ క్లస్టర్ బాంబు క్షిపణులు భారీ ముప్పును కలిగిస్తాయనేది ఇజ్రాయెల్ వాదన. యుద్ధ తీవ్రతను పెంచేందుకు.. భారీ ముప్పును కలిగించేందుకు.. ఇరాన్ ఈ ఆయుధాలను ఉపయోగిస్తోందని, తమ పౌరులకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. డ్యామేజ్ ఏంటంటే.. ఇజ్రాయెల్ వార్తా సంస్థ ప్రకారం.. జూన్ 19న జరిగింది ఇదే. క్షిపణుల్లో ఒకటి అజోర్లోని మధ్య పట్టణంలో ఓ నివాసాన్ని తాకినట్లు తెలుస్తోంది. అయితే, దీని కారణంగా పెద్దగా ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కాగా.. ఇందులోని కొన్ని బాంబులు పేలకుండా ఉన్నాయని, ఇవి పౌరుల ప్రాణాలకు నష్టం కలిగిస్తాయని అధికారులు తెలిపారు. ఈక్రమంలో తమ ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది. అలాంటివాటిని గుర్తిస్తే పౌరులు వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని ప్రజలను హెచ్చరించింది. వివాదాలకు కేరాఫ్గా..క్లస్టర్ బాంబులను వివాదాలకు కేంద్ర బిందువుగా చెబుతుంటారు. అందుకు కారణం.. ఇవి కలిగించే నష్టమే. సాధారణ క్షిపణి ఒక్క స్థలంలో పెద్ద పేలుడు కలిగిస్తుంది. కానీ క్లస్టర్ బాంబు చిన్న చిన్న మ్యూనిషన్లను పెద్ద ప్రాంతంలో చల్లుతుంది. ఒక్కో submunition శక్తి తక్కువైనా, దాని విస్తృత పరిధి కారణంగా ఎక్కువమందికి ప్రమాదం కలిగించవచ్చు. మరీ ముఖ్యంగా జనావాసాలపై గనుక పడితే వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వీటిలో కొన్నివాటిని భూమిని తాకిన వెంటనే పేలకుండా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇవి తరువాత కాలంలో కూడా పౌరులకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అందుకే వీటి వినియోగంపై ఆంక్షలున్నాయి. 2008లో జరిగిన క్లస్టర్ మ్యూనిషన్లపై సమావేశ ఒప్పందం ప్రకారం.. ఈ బాంబులను ఉపయోగించడం, నిల్వ చేయడం, అమ్మకాలు-కొనుగోలు జరపడం పూర్తిగా నిషేధించబడింది. ఈ ఒప్పందంపై 111 దేశాలు, 12 ఇతర ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని అంగీకరించాయి. కానీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా, చైనా, భారత్ కూడా ఈ ఒప్పందంపై సంతకాలు చేయలేదు. 2023లో ఉక్రెయిన్ సంక్షోభంలో రష్యాకు వ్యతిరేకంగా క్లస్టర్ బాంబులను అందించిందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రష్యా కూడా తమపై క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఉక్రెయిన్ సైతం ఆరోపించింది. U.S. President Joe Biden is under scrutiny for providing Ukraine with cluster bombs.But what makes cluster bombs so controversial?#clusterbomb #joebiden #internationaltreaty #treaty pic.twitter.com/JCuAe0RM9H— CGTN Europe Breaking News (@CGTNEuropebreak) July 11, 2023

వైఎస్ జగన్పై బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: ఏపీని రప్పా రప్పా రాజకీయం ఊపేస్తోంది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీకు జీవించే హక్కు ఉందా? నీ తల నరకొచ్చు కదా.. అంటూ జగన్ను ఉద్దేశించి ప్రెస్మీట్లో రెచ్చిపోయారాయన. ఇటీవలె ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు జగన్ను ఉద్దేశించి ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. జగన్ను భూస్థాపితం చేస్తానంటూ చంద్రబాబు ఊగిపోయారు. ఇప్పుడు బాబు బాటలోనే బుచ్చయ్యచౌదరి ఇలాంటి దారుణ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.నిన్న ఏం అంటావు నువ్వు .... గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టే నరుకుతామని అంటే ..దానిలో తప్పు ఏముందని అంటున్నావు .. నేను అంటున్నా .. నీతల నరకొచ్చుగా!::ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరివైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంలో.. ఓ యువకుడు పుష్ప2 చిత్రంలోనే ఫేమస్ డైలాగ్తో వైఎస్ జగన్ ఫొటోను ఫ్లెక్సీగా ప్రదర్శించారు. అయితే అందులో డైలాగ్ అభ్యంతకరంగా ఉందంటూ పోలీసులు అతనిపై కేసు పెట్టారు. గురువారం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో కొందరు పాత్రికేయులు ఈ విషయాన్ని జగన్ వద్ద ప్రస్తావించారు.అయితే ఆ ఫ్లెక్సీలో ఉన్న డైలాగును స్వయంగా విలేకరుల నోటి నుంచే జగన్ అడిగి తెలుసుకున్నారు. అంతేతప్ప .. ఆయన స్వయంగా ఏం ఆ డైలాగ్ను కొట్టలేదు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగులు, మేనరిజాలను పాటించే స్వేచ్ఛ కూడా లేదా? అంటూ చంద్రబాబును నిలదీశారు. అంతేకాదు.. ఆ పోస్టర్ ప్రదర్శించింది స్వయానా టీడీపీ అభిమానినే అని ఆధారాలు సైతం ప్రదర్శించారాయన.అయితే జగన్ ప్రెస్మీట్లో మాట్లాడిన మాటలను టీడీపీ ఘోరంగా వక్రీకరించింది. జగన్ నోటి నుంచి రప్పా రప్పా నరుకుతాం అనే డైలాగ్ వచ్చిందంటూ గగ్గోలు పెట్టింది. సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల.. మరికొందరు నేతలు వరుసగా ప్రెస్మీట్లు పెడుతూ నరుకుడు డైలాగ్ కొట్టారంటూ జగన్ను తీవ్రంగా తప్పుబట్టారు. మరోవైపు.. ఐటీడీపీ అండ్ కో తమ ఎడిటింగ్లకు పని చెప్పి సోషల్ మీడియాలోనూ జగన్ అనని ఆ డైలాగ్ను ఆపాదిస్తూ విషప్రచారాన్ని ఉధృతం చేసింది.

‘కుబేర’ మూవీ రివ్యూ
శేఖర్ కమ్ముల(Sekhar kammula)కు సెన్సిబుల్ దర్శకుడు అనే పేరుంది. అందమైన ప్రేమ కథలను, ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కిస్తూ ఓ మంచి సందేశం ఇవ్వడం ఆయన స్టైల్. అందుకే సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకొని వచ్చినా.. శేఖర్ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. లేట్గా వచ్చిన డిఫరెంట్ సినిమానే చూపిస్తాడనే నమ్మకం టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉంది. లవ్స్టోరీ(2021) తర్వాత ఆయన నుంచి వచ్చిన చిత్రం కుబేర(Kuberaa Review). తొలిసారి ధనుష్(Dhanush), నాగార్జున లాంటి బడా హీరోలతో ఆయన ఈ సినిమా తెరకెక్కించాడు. నేషనల్ క్రష్ రష్మిక ఇందులో మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో కుబేరపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘కుబేరా’ కథేంటంటే..?దీపక్ (నాగార్జున) నిజాయితీ గత సీబీఐ అధికారి. కేంద్రమంత్రి అవినీతి బయటపెట్టడంతో అన్యాయంగా ఆయన్ను జైలుపాలు చేస్తారు. కోర్టుకు వెళ్లినా న్యాయం జరగదు. అదే సమయంలో తనకు సహాయం చేయడానికి దేశంలోనే బడా వ్యాపారవేత్త నీరజ్ మిత్రా(జిమ్ సర్భ్) ముందుకు వస్తాడు. ఓ ఒప్పందం చేసుకొని దీపక్ని బయటకు తెస్తాడు. ఆ ఒప్పందం ప్రకారం దీపక్ రూ.లక్ష కోట్ల బ్లాక్ మనీని కేంద్ర మంత్రుల బినామీల అకౌంట్లకు బదిలీ చేయాలి. అందులో రూ. 50 వేల కోట్లను వైట్లో మరో 50 వేల కోట్లను బ్లాక్లో బదిలీ చేయాల్సి ఉంటుంది(Kuberaa Review). దాని కోసం దీపక్ నలుగురు బిక్షగాళ్లను తీసుకొచ్చి, వాళ్ల పేరు మీద రూ. 10 వేల కోట్ల చొప్పున అకౌంట్లో జమ చేస్తాడు. వారిలో ఒక భిక్షగాడే దేవా(ధనుష్). పని ఇప్పిస్తామని చెప్పి తిరుపతి నుంచి ముంబైకి తీసుకొచ్చి.. దేవా పేరుపై డబ్బులు జమ చేస్తారు. ఆ డబ్బులను మళ్లీ కేంద్ర మంత్రుల బినామీకి బదిలీ చేయించే క్రమంలో దేవా వారి నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దేవా ఎందుకు తప్పించుకున్నాడు? నీరజ్ గ్యాంగ్ అతన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఏంటి? నీరజ్ గురించి దీపక్ని తెలిసి అసలు నిజం ఏంటి? కేంద్ర మంత్రులకు నీరజ్ మిత్రా రూ. లక్ష కోట్లను లంచంగా ఎందుకు ఇస్తున్నాడు? బిచ్చగాడైన దేవా..బడా వ్యాపారవేత్త నీరజ్కి చెప్పిన గుణపాఠం ఏంటి? చివరకి రూ. లక్ష కోట్లు చేతులు మారాయా లేదా? ఈ కథలో సమీరా(రష్మిక)పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సెన్సిబుల్ కథలో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడంలో శేకర్ కమ్ముల దిట్ట. సమాజంలో జరుగుతున్న పరిణామాలనే కథగా మలిచి.. ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే ఒక మంచి సందేశం అందిస్తుంటాడు. అలా అని సందేశం ఇవ్వడానికి సినిమా తీసినట్లుగా అనిపించదు. సినిమా చూస్తే మనకే ఓ సందేశం అందుతుంది. కుబేర చిత్రాన్ని కూడా అలానే తెరకెక్కించాడు. కార్పోరేట్ వ్యవస్థలు రాజకీయాలను ఎలా శాసిస్తున్నాయి? రాజకీయ నాయకులు తన స్వార్థం కోసం ఎలాంటి అవినీతి పనులు చేస్తున్నారు? బ్లాక్ మనీ ఎలా చేతులు మారుతుంది? బినామీ వ్యవస్థలు ఎలా ఉంటాయనేది కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. దీని కోసం శేకర్ కమ్ముల చాలా లోతుగా అధ్యయనం చేసినట్లుగా సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే ప్రతీ విషయం డీటేయిల్డ్గా చూపించాలనే తాపత్రాయంతో నిడివిని అమాంతం పెంచేశారు. మూడు గంటలకు పైగా నిడివి ఉన్న ఈ చిత్రాన్ని దాదాపు అరగంటకు తగ్గించిన పర్వాలేదనిపిస్తంది. కట్ చేసినా పర్లేదు అనే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అదొక్కటే సినిమాకు పెద్ద మైనస్. అయితే ధనుష్ , నాగార్జున తమ నటనతో ఆ సాగదీతను కొంతమేర కప్పిపుచ్చుకొచ్చారు. తనకి ఏమీ వద్దని, ఏ ఆశ లేని ఒక బిచ్చగాడు.. ఈ ప్రపంచంలోని అన్నీ తనకే కావాలనుకునే ఒక ధనవంతుడు.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ నిజాయితీ ఆఫీసర్.. ఈ మూడు రకాల పాత్రల చుట్టే కథ తిరుగుతుంది. ఆయిల్ స్కామ్ సన్నివేశంతో కథని ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత నాగార్జున పాత్ర ఎంట్రీ, బ్లాక్ మనీ బదిలీ ప్లాన్.. బిచ్చగాళ్ల ఎంపిక.. ఇవన్నీ చకచక సాగిపోతాయి. దాదాపు 30 నిమిషాల తర్వాత ధనుష్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. దేవా తప్పించుకుపోయిన తార్వత కథనం పరుగులు పెరుగుతుంది. అతన్ని ఎలా పట్టుకుంటారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్లో నాటకీయత ఎక్కైవైనట్లుగా అనిపిస్తుంది. వ్యాపారవేత్త నీరవ్ మిత్రా బిచ్చగాడిలా మారడం.. అధికార బలం ఉన్నా బిచ్చగాడిని పట్టుకోలేకపోవడం.. సినిమాటిక్గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల శేకర్ లాజిక్ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ రొటీన్గానే ఉంటుంది. ఎప్పటి మాదిరే తను చెప్పాలనుకున్న కథను శేఖర్ కమ్ముల చాలా నిజాయితీగా చెప్పేశాడు. ఎవరెలా చేశారంటే.. ధనుష్ నటన గురించి ప్రత్యేక్షంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతాడు. అలాంటి నటుడు శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడికి దొరికితే ఎలా ఉంటుంది? కొత్త నటీనటులతోనే అద్భుతంగా నటింపజేసే శేకర్.. ధనుష్లోని టాలెంట్ని పూర్తిగా వాడేశాడు. బిచ్చగాడు దేవ పాత్రలో నటించలేదు..జీవించేశాడు. తెరపై ఓ స్టార్ హీరో ఉన్నాడనే సంగతే గుర్తుకురాదు. బిచ్చగాడే మన కళ్లముందు కనిపిస్తాడు. ఇలాంటి పాత్రను ఒప్పుకున్నందుకే అభినందించాలి. ఇక ఆయన నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువే అనిపిస్తుంది. నాగార్జున కూడా ఇందులో డిఫరెంట్ పాత్ర పోషించాడు. సీబీఐ ఆఫీసర్ దీపక్గా చక్కగా నటించాడు. ఆయన కెరీర్లో ఇది కూడా ఒక డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది. రష్మిక తన పాత్రకు న్యాయం చేసింది. ఆమె ఎంట్రీ కామెడీగా ఉన్నా.. రాను రాను ఆమె పాత్ర ప్రాధాన్యత పెరుగుతుంది. విలన్గా జిమ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై స్టైలీష్గా కనిపంచాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేవాడు. పాటలు సందర్భానుసారంగా వస్తుంటాయి. పోయిరా పోయిరా పాటతో పాటు అమ్మ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగుంది. ముంబై సెట్తో పాటు ప్రతీది సహజంగా తీర్చిదిద్దారు. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమాలో నిర్థాక్షిణంగా కట్ చేయాల్సిన సీన్లు చాలానే ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్

అమెరికాతో మాకేంటి.. ఇరాన్ సంగతి మేమే తేలుస్తాం: నెతన్యాహు
టెలీ అవీవ్: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందన్నారు. న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేము అంటూ కామెంట్స్ చేశారు.తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు మాట్లాడుతూ..‘ఇరాన్పై దాడిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) చేరాలనుకుంటున్నారా లేదా అనేది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయమే. ఇరాన్లో ఫోర్డ్లోని భూగర్భ అణు కేంద్రంతో సహా ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇరాన్లో అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు ఉంది. ఇందుకు అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు వేచి చూసే ఆలోచనేమీ లేదు. ఇప్పటివరకు నిర్వహించిన దాడుల విషయంలో కూడా యూఎస్ ఆదేశాల కోసం వేచి చూడలేదు. ఇరాన్లో పరిపాలనను పతనం చేసే ఉద్దేశం మాకు లేదు. అది పూర్తిగా ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయం’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్పై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్తో కలవాలని అటు అమెరికా అనుకుంటున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇరాన్పై సైనిక చర్య చేపట్టే విషయంలో ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.

వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి.. 10 లక్షల సాయం అందజేత
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా వెంగళాయపాలెనికి చెందిన పార్టీ కార్యకర్త సింగయ్య ప్రమాదం కారణంగా మృతిచెందారు. ఈ నేపథ్యంలో పార్టీ వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, బలసాని కిరణ్ కుమార్, నూరి ఫాతిమా వెంగళాయపాలెంలో సింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం, పార్టీ తరఫున సింగయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కు అందజేశారు.ఈ సందర్బంగా మాజీ మంత్రి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘సింగయ్య వైఎస్సార్సీపీ కార్యకర్త. వైఎస్ జగన్ అభిమాని. వైఎస్ జగన్ పర్యటనలో కారు ప్రమాదం కారణంగా సింగయ్య మృతిచెందాడు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. విషయం తెలుసుకోగానే వైఎస్ జగన్.. వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును సింగయ్య భార్యకు అందించాం. సింగయ్య మృతుని కూడా కూటమి ప్రభుత్వం రాజకీయం చేయాలని చూసింది.వైఎస్ జగన్ పర్యటనలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఎవరూ భయపడరు. వాటిపై న్యాయపోరాటం చేస్తాం. కానీ, వైఎస్సార్సీపీ నాయకుల్ని గాని కార్యకర్తలు గాని పోలీసులు అక్రమంగా నిర్బంధిస్తే చూస్తూ ఊరుకోం. వైఎస్ జగన్ పర్యటనకు ప్రజలు రానివ్వకుండా చేయాలని ప్రభుత్వం పోలీసులు ద్వారా కుట్ర పన్నింది. ఆ కుట్రను ఛేదించుకుంటూ వేలాది మంది జనం తరలివచ్చారు.మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘సింగయ్య వైఎస్సార్సీపీకి కరుడుగట్టిన కార్యకర్త. ప్రమాదంలో ఆయన చనిపోవడం బాధాకరం. ఈ విషయం తెలుసుకోగానే వైఎస్ జగన్ మమ్మల్ని అందరినీ సింగయ్య ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి అండగా ఉండమని ఆదేశించారు. వైఎస్ జగన్ పంపిన 10 లక్షలు ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి అందించాం. సింగయ్య కుటుంబానికి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుంది.పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య యాక్సిడెంట్లో చనిపోవడం బాధాకరం. ఆయన కుటుంబానికి ఎప్పుడు పార్టీ అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

ఎయిరిండియా ఘటన: బ్లాక్బాక్స్ ఎపిసోడ్లో ట్విస్టులు
279 మంది ప్రాణాలు బలిగొన్న అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ ప్రమాదంలో కీలకంగా భావిస్తున్న విమానపు బ్లాక్బాక్స్(Air India Black Box) తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో డాటా సేకరణ కష్టతరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ ఎక్స్క్లూజివ్గా కథనం ప్రచురించింది.జూన్ 12వ తేదీన బోయింగ్ సంస్థకు చెందిన డ్రీమ్లైనర్ విమానం(ఏఐ 171 సర్వీస్) ప్రమాదంలో నేలను తాకగానే పేలిపోయి.. కాలి బూడిదైన సంగతి తెలిసిందే. అయితే ఘటన జరిగిన 28 గంటల తర్వాత శకలాల నుంచి బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రమాదం ధాటికి అందులో ఓ పార్ట్ పైభాగం బాగా దెబ్బతిన్నట్లు అధికారులు ఇప్పుడు గుర్తించారు. ఇదిలా ఉంటే.. బ్లాక్బాక్స్ను డీకోడ్ చేసేందుకు అమెరికాకు పంపించబోతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని కేంద్రం గురువారం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దానిని టెక్నికల్, సెక్యూరిటీ అంశాలను పరిశీలించాకే బ్లాక్బాక్స్ను ఎక్కడికి పంపించాలనే విషయాన్ని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) మాత్రమే నిర్ణయిస్తుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. అయితే..డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్(DFDR), కాక్పిట్ వాయిస్ రికార్డర్(CVR)లను కలిపి బ్లాక్బాక్స్గా వ్యవస్తారు. పేరుకు బ్లాక్బాక్స్ అనే కానీ.. ప్రమాదం తర్వాత శకలాల నుంచి సేకరణ కోసం సులువుగా బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది. ఇక ఇందులో.. ఇప్పుడొస్తున్న సీవీఆర్లు 25 గంటలపాటు కాక్పిట్ సంభాషణలను నమోదు చేయగలవు. 2021లో తీసుకొచ్చిన నిబంధనే అందుకు కారణం. కానీ, ప్రమాదానికి గురైన బోయింగ్ 787 విమానం అంతకు ముందు మోడల్. ఇందులో కేవలం రెండున్నర గంటల రికార్డును మాత్రమే రికార్డుచేయగలదు. ఇక ఏడీఆర్.. విమానం వేగాన్ని, నియంత్రణ క్షణాలు తదితరాలను నమోదు చేస్తుంది. బ్లాక్బాక్స్లోని డాటాను ఇంజినీరింగ్ ఫార్మట్లోకి మార్చిన తర్వాతే సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. సేకరణ టైంలో ఏదైనా పొరపాటు దొర్లితే.. డాటా మొత్తం కనిపించకుండా పోతుంది(ఎరేస్ అవుతుంది).AAIB ముందు ఆప్షన్లు ఇవేలక్నోలోని హాల్(HAL) సెంటర్కు పంపడంఅమెరికాలోని ఎన్టీఎస్బీకి (National Transportation Safety Board) జాతీయ రవాణా భద్రతా సంస్థకి పంపడంయూకే లేదంటే సింగపూర్లోని సివిల్ ఏవియేషన్ అథారిటీకి పంపడంబ్లాక్బాక్స్లో ఓ పార్ట్ పైభాగం బాగా దెబ్బతిందని.. ఇక్కడ దానిని రికవరీ చేసే ప్రయత్నం ఫలించకపోవచ్చని ఏఏఐబీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అడ్వాన్స్డ్ డాటా రికవరీ కోసం దానిని అమెరికాకే పంపించే యోచనలో ఏఏఐబీ ఉన్నట్లు సదరు కథనం వెల్లడించింది.ఇదీ చదవండి👉: దక్షిణ కొరియా విమాన ప్రమాద ఘటనలో బ్లాక్బాక్స్ ట్విస్ట్!

నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!
బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోవాలి.చెమటలు చిందించాలి చాలామంది మదిలో మెదిలే ఆలోచన ఇది. కానీ ఇవేమీ లేకుండానే హ్యాపీగా నెలకు 7 కిలల దాకా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు ఒక వైద్యుడు. అదీ కఠినమైన డైట్ లేకుండా బరువు తగ్గడం సాధ్యమే అంటున్నారు. మరి ఆ జాదూ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా.. పదండి.. ఆలస్యం ఎందుకు..!నాన్-ఇన్వాసివ్ కార్డియాలజీలో నిపుణుడైన కార్డియాలజిస్ట్ డాక్టర్ బిమల్ ఛాజెర్ సోషల్మీడియా ద్వారా తన ఫాలోయర్లకు అనేక ఆరోగ్య చిట్కాలను అందిస్తూ ఉంటారు. తాజాగా 'జాదూ డైట్ (మ్యాజిక్ డైట్) ఫర్ వెయిట్ లాస్' అంటూ కొన్ని వివరాలను షేర్ చేశారు. ఆయన షేర్ చేసిన వీడియో ప్రకారం ఇది శాకాహారంతో బరువు తగ్గించుకునే ఒక ప్రణాళిక. కడుపు మాడ్చుకోవాల్సి అవసరం లేకుండానే సరళమైన డైట్తో కేవలం ఒక నెలలో కనీసం 7 కిలోల బరువును తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని హామీ ఇస్తున్నారు కూడా.వెయిట్ లాస్ జర్నీ- చిట్కాలుడాక్టర్ బిమల్ ఛాజెర్ చెబుతున్న డైట్ సరళమైన, ఆరోగ్యకరమైన ఆహారాల కలయితో ఉంటుంది. బరువు తగ్గడం మాత్రమే కాకుండా ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిదనీ, ఆకలితో ఉండకుండా కేలరీల లోటును భర్తీ చేసి.శరీరం సహజంగా కొవ్వును కరిగించడానికి అనుమతిస్తుంది. ఇదీ చదవండి: 118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో'జాదూ డైట్ ఫర్ వెయిట్ లాస్'మనం మన కడుపును అధిక కేలరీల ఆహారంతో నింపితే, మన బరువు పెరుగుతుంది, అదే తక్కువ కేలరీల ఆహారంతో నింపితే, ఆకలీ వేయదు, బరువూ పెరగదు సింపుల్ మ్యాజిక్ అంటారాయన. స్వీట్ కార్న్, బీట్ రూట్, క్యారెట్లతో చేసిన సలాడ్, గుమ్మడికాయ, బీన్స్, క్యారెట్ ముక్కలు, రాగిపిండితో చేసిన సూప్ ఇలాంటివి ఆయన షేర్ చేసిన వీడియో మనం చూడవచ్చు.జాదూ డైట్లో నిజానికి బాగా తినాలి, కానీ లో-కేలరీల ఆహారాలకు కట్టుబడి ఉండాలి. ఉదాహరణకు పండ్లు, కూరగాయలు, సలాడ్లు...ఇది శరీరాన్ని ఆహారం లేకుండా ఉంచకుండా వేగంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఫలితంగా నెలలో 7 కిలోల బరువు తగ్గడం పక్కా..అది కూడా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అని చెప్పారు. View this post on Instagram A post shared by Food Link (@ig_foodlink)ఆహారంగా ఇంకా ఏం తీసుకోవచ్చుబ్లాక్ టీ తాగవచ్చు. ఎక్కువ పండ్లు తీసుకోవాలి. ప్రోటీన్ , ఇతర పోషకాల కోసం మూంగ్ లేదా మసూర్ దాల్ తీసుకోవచ్చు. ఇందులో దోసకాయ, బీట్రూట్ క్యారెట్ ఇలా పచ్చి కూరగాయలతో కలిపి పప్పును తినవచ్చు.రాత్రి భోజనంలో సూప్తో పాటు సలాడ్ , ఉడికించిన కూరగాయలుఎన్ని రోజులు చేయాలి?ఈ డైట్ను కేవలం ఒక నెల పాటు మాత్రమే సాగించాలి.దీన్ని ఎప్పటికీ అనుసరించాల్సిన అవసరం లేదు. ఈ డైట్తో మీరు సుమారు 3 నెలల్లో 10-20 కిలోలు తగ్గవచ్చు. ఈ జాదూ డైట్ అద్భుతంగా పనిచేస్తుందనంటూ కోలకత్తాకు చెందిన ఒక మహిల 86 కిలోల-62 కిలోలకు తగ్గిన వైనాన్ని ఉదహరించారు.గమనిక: ఈ కథనం డా. బిమల్ షేర్ చేసిన సమాచారం అందించినంది మాత్రమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాల్లో ఎల్లప్పుడూ వైద్య సలహాలు తీసుకోవడం ఉత్తమం.

కరుణ్తో కలిసి సుదీర్ఘ కాలం టీమిండియాకు ఆడాలి.. కేఎల్ రాహుల్ ఆశాభావం
భారత టెస్టు జట్టు సభ్యులైన కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి వివిధ వయో విభాగాల్లో ఈ కర్ణాటక మిత్రులు కలిసి ఆడారు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత రాహుల్, నాయర్లకు ఒకే టెస్టులో కలిసి ఆడే అవకాశం దక్కింది. టీమ్లో రాహుల్ రెగ్యులర్ మెంబర్ కాగా, ఎనిమిదేళ్ల తర్వాత నాయర్ పునరాగమనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమ స్నేహం చిరకాలం కొనసాగడంతో పాటు టీమిండియా తరఫున ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు రాహుల్ చెప్పాడు.‘11 ఏళ్ల వయసులో ఇద్దరం ఒకేసారి క్రికెట్ ఆడటం ప్రారంభించాం. ఈ ప్రయాణం ఇప్పటికీ సాగుతోంది. ఇద్దరి కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. గత 2–3 ఏళ్లలో అద్భుతంగా ఆడి ఎన్నో ప్రతికూలతలను దాటి నాయర్ పునరాగమనం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్లో ఉండే పరిస్థితులు, సవాళ్ల గురించి మేము మాట్లాడుకున్నాం. మేమిద్దరం కలిసి భారత్ తరఫున సుదీర్ఘ కాలం ఆడాలని కోరుకుంటున్నా’ అని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రాహుల్, కరుణ్ సభ్యులుగా ఉన్నారు. ఈ ఇద్దరు ఇవాల్టి నుంచి (జూన్ 20) లీడ్స్ వేదికగా ప్రారంభమయ్యే తొలి మ్యాచ్లో ఆడటం దాదాపుగా ఖరారైంది. ఈ మ్యాచ్లో రాహుల్ ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం ఉండగా.. కరుణ్ మిడిలార్డర్లో ఐదు లేదా ఆరు స్థానాల్లో బ్యాటింగ్కు రావచ్చు. విరాట్, రోహిత్ల టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత భారత బ్యాటింగ్ విభాగంలో రాహులే సీనియర్ సభ్యుడు. పైగా రాహుల్కు గత ఇంగ్లండ్ పర్యటనలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఓపెనర్గానే గత పర్యటనలో రాహుల్ సెంచరీ చేశాడు. ఇటీవలికాలంలో రాహుల్ పలు బ్యాటింగ్ స్థానాలు మారినా ఓపెనర్గా అయితే అతను పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. రాహుల్ ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ పర్వాలేదనిపించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్లో ఇరగదీశాడు.కరుణ్ విషయానికొస్తే.. గత రెండు దేశవాలీ సీజన్లలో పరుగుల వరద పారించిన ఇతగాడు.. తాజాగా ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించి మాంచి జోష్లో ఉన్నాడు. కరుణ్కు ఇంగ్లండ్ గడ్డపై ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. కౌంట్లీలో అతని పేరిట ఓ డబుల్ సెంచరీ, పలు సెంచరీలు ఉన్నాయి. కరుణ్ తనకు గుర్తింపు తెచ్చిన ట్రిపుల్ సెంచరీని ఇంగ్లండ్పైనే సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై, ఇంగ్లండ్పై ఘనమైన ట్రాక్ రికార్డు ఉండటంతో కరుణ్పై ఈ సిరీస్లో భారీ అంచనాలు ఉన్నాయి. కరుణ్ను భారత క్రికెట్ అభిమానులు విరాట్కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. దోస్తులు (రాహుల్, కరుణ్) నేటి నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్లో ఏమేరకు రాణిస్తారో చూడాలి.

గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్.. పాస్వర్డ్లు లీక్
గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, గిట్హబ్లోని డెవలపర్ ఖాతాలు, కొన్ని ప్రభుత్వ పోర్టల్స్లోని దాదాపు 16 బిలియన్లకు పైగా పాస్వర్డ్లు లీక్ అయినట్లు సైబర్న్యూస్, ఫోర్బ్స్ నివేదికలు తెలిపాయి. ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ లీక్ల్లో ఇది ఒకటిగా నిలిచిందని పేర్కొన్నాయి. ఈ లీక్ వల్ల మిలియన్ల మంది వినియోగదారుల వ్యక్తిగత డేటా ప్రమాదంలో ఉందని చెప్పాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఫిషింగ్ స్కామ్లు, ఐడెంటిటీ థెఫ్ట్, అకౌంట్ హ్యాకింగ్కు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తి చేశాయి.లీక్ అయిన డేటా ఏళ్ల తరబడి ఉన్న పాత సమాచారం మాత్రమే కాదని భద్రతా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కువ భాగం కొత్త డేటా, బాగా వ్యవస్థీకృతమైన సమాచారం ఉందన్నారు. ఈ లీక్ల కోసం సైబర్ నేరగాళ్లు ఇన్ఫోస్టీలర్స్ అని పిలువబడే ఒక రకమైన మాల్వేర్ను ఉపయోగించి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ మాల్వేర్ ప్రోగ్రామ్లు యూజర్లకు తెలియకుండానే తమ పరికరాల నుంచి లాగిన్ పాస్వర్డ్లను దొంగిలించి హ్యాకర్లకు పంపుతాయన్నారు. ఈ సమాచారాన్ని డార్క్ వెబ్ ఫోరమ్ల్లో అమ్మకానికి ఉంచుతారని తెలిపారు.లీకేజీలో ఏముంది?లీకైన డేటాలో గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి గిట్హబ్ల్లోని డెవలపర్ ఖాతాల్లోని సమాచారం ఉందనే అంచానాలున్నాయి. కొన్ని ప్రభుత్వ పోర్టల్స్ లాగిన్ సమాచారం కూడా లీకైందని చెబుతున్నారు. ఈ డేటా అంతా నిర్మాణాత్మకంగా, ఉపయోగించదగినదిగా ఉన్నందున నిపుణులు ఈ లీక్ను ‘గ్లోబల్ సైబర్ క్రైమ్ కోసం బ్లూప్రింట్’ అని పిలుస్తున్నారు. దాదాపు 30 బిగ్ డేటా సెట్లు, ఒక్కొక్కటి మిలియన్ల నుంచి బిలియన్ల లాగిన్ వివరాలు వివరాలను సేకరించాయని, మొత్తం 16 బిలియన్లకు పైగా పాస్వర్డ్లను దొంగిలించారని భావిస్తున్నారు.ఎందుకంత తీవ్రతదొంగిలించబడిన ఈ డేటాను ఎంత సులభంగా కొనుగోలు చేయవచ్చనే దానిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. పరిమిత సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ మొత్తంలో డబ్బు ఉన్నవారు కూడా డార్క్ వెబ్లో ఈ పాస్వర్ట్లను యాక్సెస్ చేసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇది రోజువారీ వినియోగదారుల నుంచి పెద్ద కంపెనీల వరకు దాదాపు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది.ఇదీ చదవండి: వీర్య దానంతో పుట్టినవారికి ఆస్తిలో సమాన వాటాఇప్పుడు ఏం చేయాలి?సంప్రదాయ పాస్వర్ట్ల నుంచి పాస్ కీ వంటి మరింత సురక్షితమైన ఆప్షన్లకు మారాలని గూగుల్ ఇప్పటికే వినియోగదారులకు సూచించింది. ముఖ్యంగా లాగిన్ వివరాలు అడిగితే ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్స్ ద్వారా పంపే లింక్లను క్లిక్ చేయవద్దని ఎఫ్బీఐ ప్రజలను హెచ్చరించింది. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. అన్ని ప్రధాన ఖాతాల్లో పాస్వర్డ్లను మార్చడం, బలమైన, ప్రత్యేకమైన పాస్వర్డ్లను ఉపయోగించడం, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఎ)ను ఆన్ చేయడం ద్వారా భవిష్యత్తులో జరిగే మోసాలను కట్టడి చేయవచ్చు.
రచ్చకెక్కిన కళానిధి మారన్ కుటుంబ వ్యవహారం
అచ్చం నాన్నలాగే!.. కుమారుడితో రోహిత్- రితికా.. వీడియో వైరల్
వైఎస్ జగన్పై బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
పోరాడిన కమిందు మెండిస్.. అయినా బంగ్లాదేశ్కే స్వల్ప ఆధిక్యం
ఇన్ స్టా ఫాలోవర్స్ లేరని హీరోయిన్గా తీసేశారు: శివాత్మిక
నైట్రైడర్స్ హెడ్ కోచ్గా సీఎస్కే దిగ్గజం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై పీసీసీ చీఫ్ క్లారిటీ
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!
భర్త పుట్టిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని పిచ్చి పని చేసిన భార్య..!
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్ రికార్డు బద్దలు
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
నాన్నకు కారు గిఫ్ట్ ఇచ్చిన తెలుగు యాంకర్
‘సచిన్, గంభీర్, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
సాక్షి కార్టూన్ 18-06-2025
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
నాకు పునర్జన్మనిచ్చింది వారే.. లైవ్ లో కన్నీరు పెట్టుకున్న కొమ్మినేని
రచ్చకెక్కిన కళానిధి మారన్ కుటుంబ వ్యవహారం
అచ్చం నాన్నలాగే!.. కుమారుడితో రోహిత్- రితికా.. వీడియో వైరల్
వైఎస్ జగన్పై బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
పోరాడిన కమిందు మెండిస్.. అయినా బంగ్లాదేశ్కే స్వల్ప ఆధిక్యం
ఇన్ స్టా ఫాలోవర్స్ లేరని హీరోయిన్గా తీసేశారు: శివాత్మిక
నైట్రైడర్స్ హెడ్ కోచ్గా సీఎస్కే దిగ్గజం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై పీసీసీ చీఫ్ క్లారిటీ
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!
భర్త పుట్టిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని పిచ్చి పని చేసిన భార్య..!
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్ రికార్డు బద్దలు
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
నాన్నకు కారు గిఫ్ట్ ఇచ్చిన తెలుగు యాంకర్
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
‘సచిన్, గంభీర్, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
సాక్షి కార్టూన్ 18-06-2025
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
SBI క్రెడిట్ కార్డు కొత్త రూల్.. జూలై 15 నుంచి..
సినిమా

మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. ఉపాసన పోస్ట్ వైరల్
మెగా హీరో రామ్ చరణ్ ముద్దుల కూతురు క్లీంకార రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తల్లి ఉపాసన క్యూట్ అండ్ స్వీట్ పోస్ట్ పెట్టింది. హైదరాబాద్లోని నెహ్రూ జూలో తన పేరుతో ఉన్న పులిపిల్లని క్లీంకార తొలిసారి కలిసింది. ఈ విషయాన్ని ఉపాసన పోస్ట్ పెట్టి మరీ తన ఆనందాన్ని పంచుకుంది. గతంలో పులిపిల్లని చరణ్-ఉపాసన దంపతులు దత్తత తీసుకోగా.. ఇప్పుడు దానికి వీళ్ల కూతురి పేరు పెట్టడం విశేషం.2012లో రామ్ చరణ్-ఉపాసన పెళ్లి చేసుకున్నారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన సంబంధం. తర్వాత కెరీర్ పరంగా ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత జూన్ 20న ఉపాసనకు కూతురు పుట్టింది. పాపకు క్లీంకార అని పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఇప్పటివరకు చాలాసార్లు పాపతో తీసుకున్న ఫొటోలని పోస్ట్ చేశారు కానీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)గతంలో చరణ్ దంపతులు.. నెహ్రూ జూలోని పులిని దత్తత తీసుకున్నారు. ఇలా చేసినందుకుగానూ హైదరాబాద్ జూ అధికారులు.. మెగా డాటర్ గౌరవార్థం ఓ పులికి క్లీంకార అని పేరు పెట్టారు. ఇప్పుడు దాన్ని క్లీంకార ప్రత్యక్షంగా చూసింది. 'ఏడాది క్రితం ఈ పులిపిల్ల ఓ పసికూన. ఇప్పుడు శివంగిలా మారి క్లీంకార కలిసి పేరుని పంచుకుంది. ఈ విషయంలో హైదరాబాద్ జూ నిర్వహకులకు థ్యాంక్యూ. క్రూరమృగాలు అడవిలో ఉండాలి. కానీ అవి కూడా గౌరవంతో బతకాలి' అని ఉపాసన రాసుకొచ్చింది. ఇది ఇప్పుడు మెగా అభిమానులకు నచ్చేస్తోంది.చరణ్ సినిమాల విషయానికొస్తే.. 'ఆర్ఆర్ఆర్' తర్వాత గేమ్ ఛేంజర్ చేశాడు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైంది. కానీ ఘోరమైన డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం 'పెద్ది' చేస్తున్నాడు. బుచ్చిబాబు తీస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మూడు నెలల క్రితం రిలీజైన గ్లింప్స్ వీడియో ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. (ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలోకి వచ్చిన '8 వసంతాలు', 'కుబేర', 'సితారే జమీన్ పర్' సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో ఈ వీకెండ్ బిగ్ స్క్రీన్స్ కళకళలాడటం గ్యారంటీ. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ శుక్రవారం 24 వరకు కొత్త చిత్రాలు-వెబ్ సిరీసులు ఉన్నాయి. వీటిలో పలు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. ఘటికాచలం, హద్దులేదురా, జింఖానా, యుద్ధకాండ, లవ్లీ, గ్రౌండ్ జీరో సినిమాలతో పాటు కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీసు.. ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పుడు చెప్పిన వాటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఉన్నాయి. అలానే ఇతర భాషా చిత్రాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (జూన్ 20)అమెజాన్ ప్రైమ్యుద్ధకాండ ఛాప్టర్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమాలవ్లీ - మలయాళ మూవీఘటికాచలం - తెలుగు మూవీఆహాఅలప్పుజా జింఖానా - తెలుగు మూవీజిన్ ద పెట్ - తమిళ సినిమాసేవ్ నల్ల పసంగ - తమిళ సిరీస్యుగీ - తమిళ సినిమా నెట్ఫ్లిక్స్కె-పాప్ డీమన్ హంటర్స్ - కొరియన్ సినిమాఒలింపో - స్పానిష్ సిరీస్సెమీ సోయిటర్ - ఇంగ్లీష్ సినిమాఏ కింగ్ లైక్ మీ - ఇంగ్లీష్ మూవీగ్రీన్ బోన్స్ - తగలాన్ సినిమాబేబీ ఫార్మ్ సీజన్ 1 - నైజీరియన్ సిరీస్ఏ లాగోస్ లవ్ స్టోరీ - నైజీరియన్ మూవీద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 - హిందీ కామెడీ షో (జూన్ 21)హాట్స్టార్ఫౌండ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 - తెలుగు డబ్బింగ్ సిరీస్జీ5డిటెక్టివ్ షెర్డిల్ - హిందీ సినిమాగ్రౌండ్ జీరో - హిందీ మూవీప్రిన్స్ అండ్ ఫ్యామిలీ - మలయాళ సినిమాఎమ్ఎక్స్ ప్లేయర్ఫస్ట్ కాపీ - హిందీ సిరీస్లయన్స్ గేట్ ప్లేకబోల్ - ఫ్రెంచ్ సిరీస్ఎలెవన్ - తమిళ మూవీబుక్ మై షోహద్దులేదురా - తెలుగు సినిమా(ఇదీ చదవండి: హిట్3 మేకర్స్పై కేసు వేసిన అభిమాని)

'8 వసంతాలు' సినిమా రివ్యూ
తెలుగు సినిమాల్లో ప్రేమకథలకు కొదవలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలా వచ్చిన చిత్రం '8 వసంతాలు'. గతంలో 'మధురం' అనే షార్ట్ ఫిల్మ్తో ఆకట్టుకున్న దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి.. ఇప్పుడు ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనంతిక సనీల్ కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డి హీరోహీరోయిన్లుగా నటించారు. తాజాగా ఇది థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?శుద్ధి అయోధ్య(అనంతిక).. ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్(హను రెడ్డి) వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకుని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మ గౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలో వచ్చిన సంజయ్ (రవి దుగ్గిరాల) ఎవరు? చివరకు శుద్ధి ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రేమకథా సినిమా అనగానే.. హా ఏముంది అబ్బాయి-అమ్మాయి ప్రేమించుకుంటారు. కుదిరితే ఒక్కటవుతారు లేదంటే విడిపోతారు. ఇందులో పెద్ద చెప్పుకోవడానికి ఏముందిలే అనుకుంటాం. కానీ ప్రేమకథని ఎంత అందంగా, ఎంత హృద్యంగా చెప్పొచ్చో కొందరు దర్శకులు నిరూపించారు. అలా 'అందాల రాక్షసి', 'సీతారామం' లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వాటితో సరిసమానంగా నిలిచే చిత్రం ఈ '8 వసంతాలు'.సినిమా టైటిల్స్ పడుతున్న టైంలోనే మొత్తం కథని రివర్స్లో చూపించేస్తారు. అలా ఊటీలో ఓ కరాటే ఇన్స్టిట్యూట్లో కథ మొదలవుతుంది. తనని ఓడిస్తే ఐపాడ్ గిఫ్ట్గా ఇస్తానని హీరో వరుణ్ ఛాలెంజ్ చేస్తాడు. అక్కడున్న వాళ్లందరూ అతడి చేతిలో ఓడిపోతారు. కానీ శుద్ధి అతడిని ఓడిస్తుంది. అహాన్ని నేలకు దించుతుంది. ఆ క్షణం వరుణ్.. శుద్ధితో ప్రేమలో పడిపోతాడు. తర్వాత ఆమె వెంటపడటం, ప్రేమలో పడేసేందుకు చేసే ప్రయత్నాలు ఆహ్లాదంగా ఉంటాయి. అంతా సవ్యంగానే ఉంది కదా అనుకునే టైంలో వరుణ్ తన స్వార్థం చూసుకుంటాడు. శుద్ధిని దూరం పెడతాడు. దీంతో ఆమె వచ్చి వరుణ్ ముందు నిలబడుతుంది. వీళ్లిద్దరి మధ్య సాగే సంభాషణ విజిల్స్ వేయిస్తుంది. అలా అదిరిపోయే సీన్తో ఇంటర్వెల్ పడుతుంది.సెకండాఫ్కి వచ్చేసరికి శుద్ధికి కరాటే నేర్పిన గురువు చనిపోవడం, ఆయన అస్థికల్ని గంగలో కలపడం ఇలా సాగుతుంది. కొన్నాళ్ల తర్వాత శుద్ధి జీవితంలోకి సంజయ్ వస్తాడు. ఈమెలానే అతడు కూడా ఓ రచయిత. అయితే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారా? ఇంతకీ సంజయ్ గతమేంటి? చివరలో శుద్ధితో సంజయ్ ఒక్కటయ్యాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.'8 వసంతాలు'.. ఈ పేరు వినగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. సినిమా కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. కాకపోతే ఓపికతో చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి సీన్ నుంచి చివరివరకు కొండల మధ్య పారుతున్న నదిలా ఈ సినిమా అలా వెళ్తూ ఉంటుంది. మధ్యమధ్యలో బలమైన సన్నివేశాలు, మనసుని తాకే డైలాగ్స్ వస్తుంటాయి. తొలి భాగంలో మహిళల గుణం గురించి హీరోయిన్ చెప్పే ఓ సీన్ భలే ఉంటుంది. ఇంటర్వెల్కి ముందు శుద్ధి-వరుణ్ మధ్య సంభాషణ వర్త్ వర్మ వర్త్ అనిపిస్తుంది.ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి సంజయ్ పాత్ర ఎంత బలమైనదో అర్థమవుతుంది. ఎందుకంటే క్లైమాక్స్కి కాసేపు ముందు వచ్చే ఈ పాత్రకు పెద్దగా సీన్స్ ఉండవు. కానీ క్లైమాక్స్లో ఇతడి పాత్రని తొలి సీన్ నుంచి లింక్ చేసిన విధానం.. థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. అలానే '8 వసంతాలు' అనే టైటిల్ ఎందుకు పెట్టారో కూడా చివర్లో రివీల్ చేసిన విధానం బాగుంది. సినిమాలో ఎన్ని పాత్రలున్నా సరే హీరోయిన్ పాత్ర మాత్రం గుర్తుండిపోతుంది. డైలాగ్స్ అయితే భావుకత, కవితలు అంటే ఇష్టపడేవారితో పాటు సగటు ప్రేక్షకుడికి కూడా నచ్చేస్తాయి.ఎవరెలా చేశారు?శుద్ధి అయోధ్య పాత్రలో అనంతిక జీవించేసింది. 17 ఏళ్ల అమ్మాయిగా, 25 ఏళ్ల మహిళగా వేరియేషన్స్ చూపించింది. వరుణ్గా చేసిన హనురెడ్డి.. ఎన్నారై కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. సెకండాఫ్లో వచ్చే సంజయ్ పాత్రధారి రవి దుగ్గిరాల ఇదివరకే 'మధురం'లో నటించాడు. ఇందులో అతడి పాత్ర ఉన్నది కాసేపు అయినా డిజైన్ చేసిన విధానం బాగుంది. మిగిలిన పాత్రధారులు కూడా ఎవరికి వాళ్లు పూర్తిగా న్యాయం చేశారు.టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో డైలాగ్స్ మెయిన్ హైలైట్. ప్రతి 10-15 నిమిషాలకు ఒకటి వస్తుంటుంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. ఊటీ, కశ్మీర్, కాశీ అందాల్ని బాగా చూపించారు. ఇక డైరెక్షన్ విషయానికొస్తే.. ఇదివరకే మధురం షార్ట్ ఫిల్మ్, మను సినిమాతో తానెంటో నిరూపించుకున్న ఫణీంద్ర నర్సెట్టి.. ఇప్పుడు '8 వసంతాలు' సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.స్వచ్ఛమైన ప్రేమకథని వినసొంపైన సంగీతంతో మనసుని తాకే సంభాషణలతో తీసిన ఓ మంచి సినిమా చూడాలనుకుంటే '8 వసంతాలు' అస్సలు మిస్ కావొద్దు. కుటుంబంతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు.- చందు డొంకాన

సూర్య- ఆర్జే బాలాజీ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్
హీరో సూర్య 45వ చిత్రం ఇప్పటికే ప్రారంభమైంది. తాజాగా టైటిల్ను మేకర్స్ రివీల్ చేశారు. గతేడాదిలో పొల్లాచ్చి సమీపంలోని ఆనైమలై ప్రాంతంలో గల ప్రసిద్ధి చెందిన మాసానీ అమ్మన్ ఆలయంలో పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. నటుడు ఆర్జే బాలాజీ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాశ్బాబు, ఎస్ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటి త్రిష హీరోయిన్గా నటించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.సూర్య- ఆర్జే బాలాజీ ప్రాజెక్ట్కు 'కరుప్పు' అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఇదొక యాక్షన్ అడ్వెంచరస్ చిత్రమని తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇదే ఏడాది చివరలో కరుప్పు విడుదల కావచ్చని సమాచారం. రేటియో జాకీగా కెరీర్ను ప్రారంభించిన ఆర్జే బాలాజీ మల్టీ టాలెంటెడ్ అని తెలిసిందే. ఆయన నటుడు, గాయకుడు మాత్రమే కాదు, దర్శకుడిగానూ కొలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు. నయనతారతో ‘అమ్మోరు తల్లి’ తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘వీట్ల విశేషం’ అంటూ సత్యరాజ్తో ఓ మూవీ తీసి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు హీరో సూర్యతోనే ఛాన్స్ దక్కించుకుని హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

కరుణ్తో కలిసి సుదీర్ఘ కాలం టీమిండియాకు ఆడాలి.. కేఎల్ రాహుల్ ఆశాభావం
భారత టెస్టు జట్టు సభ్యులైన కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి వివిధ వయో విభాగాల్లో ఈ కర్ణాటక మిత్రులు కలిసి ఆడారు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత రాహుల్, నాయర్లకు ఒకే టెస్టులో కలిసి ఆడే అవకాశం దక్కింది. టీమ్లో రాహుల్ రెగ్యులర్ మెంబర్ కాగా, ఎనిమిదేళ్ల తర్వాత నాయర్ పునరాగమనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమ స్నేహం చిరకాలం కొనసాగడంతో పాటు టీమిండియా తరఫున ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు రాహుల్ చెప్పాడు.‘11 ఏళ్ల వయసులో ఇద్దరం ఒకేసారి క్రికెట్ ఆడటం ప్రారంభించాం. ఈ ప్రయాణం ఇప్పటికీ సాగుతోంది. ఇద్దరి కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. గత 2–3 ఏళ్లలో అద్భుతంగా ఆడి ఎన్నో ప్రతికూలతలను దాటి నాయర్ పునరాగమనం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్లో ఉండే పరిస్థితులు, సవాళ్ల గురించి మేము మాట్లాడుకున్నాం. మేమిద్దరం కలిసి భారత్ తరఫున సుదీర్ఘ కాలం ఆడాలని కోరుకుంటున్నా’ అని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రాహుల్, కరుణ్ సభ్యులుగా ఉన్నారు. ఈ ఇద్దరు ఇవాల్టి నుంచి (జూన్ 20) లీడ్స్ వేదికగా ప్రారంభమయ్యే తొలి మ్యాచ్లో ఆడటం దాదాపుగా ఖరారైంది. ఈ మ్యాచ్లో రాహుల్ ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం ఉండగా.. కరుణ్ మిడిలార్డర్లో ఐదు లేదా ఆరు స్థానాల్లో బ్యాటింగ్కు రావచ్చు. విరాట్, రోహిత్ల టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత భారత బ్యాటింగ్ విభాగంలో రాహులే సీనియర్ సభ్యుడు. పైగా రాహుల్కు గత ఇంగ్లండ్ పర్యటనలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఓపెనర్గానే గత పర్యటనలో రాహుల్ సెంచరీ చేశాడు. ఇటీవలికాలంలో రాహుల్ పలు బ్యాటింగ్ స్థానాలు మారినా ఓపెనర్గా అయితే అతను పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. రాహుల్ ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ పర్వాలేదనిపించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్లో ఇరగదీశాడు.కరుణ్ విషయానికొస్తే.. గత రెండు దేశవాలీ సీజన్లలో పరుగుల వరద పారించిన ఇతగాడు.. తాజాగా ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించి మాంచి జోష్లో ఉన్నాడు. కరుణ్కు ఇంగ్లండ్ గడ్డపై ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. కౌంట్లీలో అతని పేరిట ఓ డబుల్ సెంచరీ, పలు సెంచరీలు ఉన్నాయి. కరుణ్ తనకు గుర్తింపు తెచ్చిన ట్రిపుల్ సెంచరీని ఇంగ్లండ్పైనే సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై, ఇంగ్లండ్పై ఘనమైన ట్రాక్ రికార్డు ఉండటంతో కరుణ్పై ఈ సిరీస్లో భారీ అంచనాలు ఉన్నాయి. కరుణ్ను భారత క్రికెట్ అభిమానులు విరాట్కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. దోస్తులు (రాహుల్, కరుణ్) నేటి నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్లో ఏమేరకు రాణిస్తారో చూడాలి.

వరుస వైఫల్యాలు.. స్టార్ ఆటగాడిపై వేటు వేసిన ఆస్ట్రేలియా
మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా.. జూన్ 25 నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్కు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ మిడిలార్డర్ ఆటగాడు మార్నస్ లబూషేన్పై వేటు వేసింది. లబూషేన్ గత కొంతకాలంగా పేలవ ఫామ్లో ఉన్నాడు. ఈ కారణంగా అతనికి తొలి టెస్ట్ తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాన్ని సెలెక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ ఓ ప్రకటనలో తెలిపారు. లబూషేన్ తమ జట్టులో కీలక సభ్యుడని చెబుతూనే అతని రెండేళ్ల గణాంకాలను ప్రస్తావించాడు. 2023లో 34.91 సగటున పరుగులు చేసిన లబూషేన్.. గతేడాది (2024) తన సగటును (30.93) మరింత దిగజార్చుకున్నాడని అన్నాడు. ఈ ఏడాది సైతం లబూషేన్ ఫామ్ను దొరకబుచ్చుకోలేకపోయాడని తెలిపాడు (4 టెస్ట్ల్లో 16 సగటు). చివరి రెండు ఇన్నింగ్స్ల్లో (డబ్ల్యూటీసీ ఫైనల్) ఓపెనర్గా అవకాశమిచ్చినా దారుణంగా విఫలమయ్యాడని (17,22) అన్నాడు. తొలి టెస్ట్ జట్టు నుంచి తప్పించినా లబూషేన్ టాలెంట్ను గౌరవిస్తూ మున్ముందు పరిశీలిస్తామని తెలిపాడు.మరోవైపు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్కు కూడా తొలి టెస్ట్ తుది జట్టులో అవకాశం ఇవ్వలేమని బెయిలీ చెప్పాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా స్మిత్ గాయపడ్డ (చేతి వేలి) విషయాన్ని ధృవీకరించాడు. స్మిత్ సర్జరీని తప్పించుకున్నప్పటికీ.. ఎనిమిది వారాలు చేతికి కట్టుతో ఉండాలని డాక్టర్లు చెప్పినట్లు తెలిపాడు. బ్యాటింగ్కు ఇబ్బంది లేకపోతే రెండో టెస్ట్లో (జూన్ 3) స్మిత్ను ఆడించే అవకాశాలున్నాయని అన్నాడు. లబూషేన్, స్మిత్ స్థానాల్లో సామ్ కొన్స్టాస్, జోస్ ఇంగ్లిస్లను తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. కొన్స్టాస్ గతేడాది భారత్తో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో ఆకట్టుకున్నాడు. లబూషేన్ స్థానంలో తొలి టెస్ట్లో అతను ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు. స్టీవ్ స్మిత్ స్థానాన్ని మిడిలార్డర్లో ఇంగ్లిస్ భర్తీ చేస్తాడు. ఇంగ్లిస్ ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో ఆడిన తన అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీతో ఇరగదీశాడు. ప్లేయింగ్ ఎలెవెన్లో మిగతా స్థానాలపై ఆసీస్ ఇంకా ప్రకటన చేయలేదు. జూన్ 25 నుంచి బార్బడోస్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబూషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్. ఆసీస్తో తొలి టెస్ట్కు విండీస్ జట్టు: కెవ్లాన్ ఆండర్సన్, బ్రాండన్ కింగ్, క్రెయిగ్ బ్రాత్వైట్, మిఖైల్ లూయిస్, జాన్ క్యాంప్బెల్, కీసీ కార్టీ, జస్టిన్ గ్రీవ్స్, రోస్టన్ ఛేజ్, జోహన్ లేన్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, జోమెల్ వార్రికన్, అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్, ఆండర్సన్ ఫిలిప్, జేడన్ సీల్స్

IND VS ENG 1st Test: టీమిండియా అంతా కలిసినా 'ఆ ఒక్కడితో' సమానం కాదు..!
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా ఇవాల్టి నుంచి (జూన్ 20) తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో (2025-27) ఇరు జట్లకు మొదటిది. భారతకాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి పోట్టి క్రికెట్కే అలవాటు పడిన ఫ్యాన్స్, ఈ మ్యాచ్ నుంచి సుదీర్ఘ ఫార్మాట్లోని అసలు సిసలైన మజాను ఎంజాయ్ చేస్తారు.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు కూడా సంసిద్దంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు బరిలోకి దిగి సత్తా చాటుదామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్టార్ త్రయం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత శుభ్మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా సరికొత్త శకంలోకి అడుగుపెట్టబోతుంది. మరోవైపు ఇంగ్లండ్ బెన్ స్టోక్స్ సారథ్యంలో యువకులు, అనుభవజ్ఞులతో ఉరకలేస్తుంది. ఇంగ్లీష్ జట్టు తమ బజ్బాల్ అటాకింగ్ గేమ్ను టీమిండియాపై ప్రయోగించాలని ఆరాట పడుతుంది.ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ఇదివరకే ప్రకటించగా.. భారత్ తమ కసరత్తును దాదాపుగా పూర్తి చేసింది. మ్యాచ్కు చాలా సమయం ముందుగానే జట్టును ప్రకటించి తమ ప్రణాళికలను బహిర్గతం చేయకూడదనే భారత మేనేజ్మెంట్ ఉద్దేశం.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్కు ముందు ఓ ఆసక్తికర విషయం సోషల్మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటంటే.. టీమిండియా ఆటగాళ్ల మొత్తం టెస్ట్ సెంచరీల సంఖ్య కన్నా, ఒక్క ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ టెస్ట్ సెంచరీల సంఖ్యనే అధికంగా ఉండటం. రూట్ తన టెస్ట్ కెరీర్లో 36 సెంచరీలు బాదగా.. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు సభ్యులంతా కలిపి 29 సెంచరీలే చేశారు. వీరిలో కేఎల్ రాహుల్ అధికంగా 8 సెంచరీలు చేయగా.. వైస్ కెప్టెన్ పంత్ 6, కెప్టెన్ గిల్ 5, యశస్వి జైస్వాల్ 4, రవీంద్ర జడేజా 4, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి తలో సెంచరీ చేశారు. అంటే, రూట్ సెంచరీల కంటే టీమిండియా ఆటగాళ్లందరూ కలిపి చేసిన సెంచరీలు ఇంకా 7 తక్కువ అన్నమాట. రూట్ మరో 373 పరుగులు చేస్తే..భారత్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రూట్ మరో 373 పరుగులు చేస్తే, టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి దూసుకొస్తాడు. ప్రస్తుతం 13006 పరుగులు ఖాతాలో కలిగి ఉన్న రూట్.. మరో 373 పరుగులు చేస్తే, రాహుల్ ద్రవిడ్ (13288), జాక్ కల్లిస్ (13289), రికీ పాంటింగ్ను (13378) అధిగమిస్తాడు. అప్పుడు సచిన్ టెండూల్కర్ ఒక్కడే (15921) రూట్ కంటే ముందుంటాడు.ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత తుది జట్టు (అంచనా).. యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి/శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణ/అర్షదీప్ సింగ్టీమిండియాతో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.

చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్.. పాత రికార్డులన్నీ బద్దలు
వ్యూయర్షిప్ విషయంలో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ రికార్డులను తిరగరాసింది. క్రికెట్ చరిత్రలో అత్యధికంగా వీక్షించబడిన టీ20 మ్యాచ్గా చరిత్ర సృష్టించింది. ఈ హై ఓల్టేజీ మ్యాచ్ వీక్షణ సమయం 31.7 బిలియన్ నిమిషాలు అని అధికారిక టీవీ మరియు డిజిటల్ ప్రసారకులు జియోస్టార్ గురువారం తెలిపారు. టీవీ మరియు డిజిటల్ వ్యూయర్షిప్ చరిత్రలో ఇది సరికొత్త రికార్డు.టీవీ వ్యూయర్షిప్కు (స్టార్ స్పోర్ట్స్) సంబంధించి ఈ మ్యాచ్ అత్యధిక రీచ్ (169 మిలియన్ల వీక్షకులు మరియు 15 బిలియన్ నిమిషాల వీక్షణ సమయం) నమోదు చేసిన టీ20 మ్యాచ్గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. జియో హాట్స్టార్లో ఈ మ్యాచ్ డిజిటల్ చరిత్రను తిరిగరాసింది. 892 మిలియన్ వీడియో వ్యూస్, 55 మిలియన్ల పీక్ కంకరెన్సీ, 16.74 బిలియన్ నిమిషాల వీక్షణ సమయంతో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద టీ20 మ్యాచ్గా అవతరించింది.ఈ ఒక్క మ్యాచే కాకుండా సీజన్ మొత్తంలో ప్రసారకులు కొత్త గరిష్టాలను నమోదు చేశారు. వీక్షకుల సంఖ్య టెలివిజన్ మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లపై సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. 840 బిలియన్ నిమిషాలకు పైగా వీక్షణ సమయాన్ని నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.డిజిటల్లో జియోహాట్స్టార్ 23.1 బిలియన్లకు పైగా వీక్షణలు మరియు 384.6 బిలియన్ నిమిషాల వాచ్-టైమ్తో కొత్త బెంచ్మార్క్లను నెలకొల్పింది. ఇది డిజిటల్ వీక్షణలో సంవత్సరానికి 29% పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. కనెక్టెడ్ టీవీ (CTV) వినియోగంలో పదునైన పెరుగుదల ఈ ఊపుకు దారితీసింది. ఈ ఒక్కటే 49 శాతం పెరిగింది. ఇది భారతదేశంలో పెద్ద స్క్రీన్ డిజిటల్ వీక్షణ వృద్ధిని నొక్కి చెబుతుంది. టీవీలో స్టార్ స్పోర్ట్స్ 456 బిలియన్ నిమిషాల వాచ్ టైమ్ను పొందిం అత్యధిక రేటింగ్ను నమోదు చేసింది.కాగా, జూన్ 3న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో ఆర్సీబీ పంజాబ్పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి తమ తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది.
బిజినెస్

వేలాది ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం
ప్రముఖ ఐటీ సర్వీస్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ప్రధానంగా తన సేల్స్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని వేలాది ఉద్యోగాలను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో కంపెనీ పునర్నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. జులై ప్రారంభంలో ఉద్యోగాల్లో కోతలను ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు.ఇప్పటికే మైక్రోసాఫ్ట్ మే నెలలో 6,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. తర్వాత కొన్ని వారాలకు 300కి పైగా తొలగించింది. ఈ ఏడాది మూడో అతిపెద్ద ఉద్యోగుల తగ్గింపునకు సంస్థ సిద్ధమవుతోంది. గతంలో ప్రకటించిన లేఆఫ్స్ ద్వారా ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రొడక్ట్ డెవలపర్లు ప్రభావితం అయ్యారు. ఈసారి భిన్నంగా మైక్రోసాఫ్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగ కోతలను విధించే అవకాశం ఉంది. జూన్ 2024 నాటికి కంపెనీ మొత్తం 2,28,000 మంది ఉద్యోగుల్లో 45,000 మంది ఈ విభాగంలో పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: కొనుగోళ్ల వైపు ‘టాటా’ చూపుప్రత్యేకంగా సేల్స్ విభాగంతో సంబంధం లేకుండా చిన్న, మధ్య తరహా కస్టమర్లకు ఎక్కువ సాఫ్ట్వేర్ సర్వీసులను అమ్మేందుకు థర్డ్ పార్టీ సంస్థలను వాడుకునేలా కంపెనీ ఏప్రిల్లో ప్రణాళికలు ప్రకటించింది. దాంతో ఈ విభాగంలో కోతలకు పూనుకుంటున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. కృత్రిమ మేధ పెట్టుబడుల నిర్వహణ టెక్ కంపెనీలకు సవాలుగా మరుతుంది. దాంతో ఇలా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డేటా సెంటర్ వ్యయం కోసం మైక్రోసాఫ్ట్ సుమారు 80 బిలియన్ డాలర్లు కేటాయించింది.

కొనుగోళ్ల వైపు ‘టాటా’ చూపు
ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ఇతర కంపెనీలను కొనుగోలు చేసే అవకాశాలను అన్వేషిస్తోంది. ఓవైపు సొంతంగా కార్యకలాపాలు విస్తరిస్తూనే టాటా గ్రూప్ కంపెనీ కొంతకాలంగా పలు సంస్థలను సొంతం చేసుకుంటోంది. ఏడాది క్రితం క్యాపిటల్ ఫుడ్స్తోపాటు, ఆర్గానిక్ ఇండియాను రూ.7,000 కోట్ల సంయుక్త విలువలో కొనుగోలు చేసింది. మార్కెట్లో కంపెనీ ఎల్లవేళలా ఇతర సంస్థల కొనుగోలుకి సిద్ధంగా ఉంటుందని టాటా కన్జూమర్ డైరెక్టర్ పీబీ బాలాజీ పేర్కొన్నారు.కంపెనీ పోర్ట్ ఫోలియోకు సరిపోయే సంస్థ తగిన ధరలో దొరికితే వదిలిపెట్టబోమని బాలాజీ తెలియజేశారు. అయితే సొంతంగా కార్యకలాపాలు విస్తరించడానికే తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఐదేళ్ల క్రితం ఆవిర్భవించిన కంపెనీ ప్రధానంగా ఫుడ్ విభాగంలో కొనుగోళ్లకు తెరతీసింది. ఈ బాటలో బెంగళూరు సంస్థ కొట్టారం ఆగ్రో ఫుడ్స్ను సైతం చేజిక్కించుకుంది. ఇదీ చదవండి: మూడేళ్లలో లక్ష ఎంఎస్ఎంఈలుఅత్యంత గరిష్టాలకు చేరిన టీ ధరలు ఇటీవల నిలకడను సంతరించుకుంటున్నట్లు వాటాదారుల వార్షిక సమావేశంలో బాలాజీ పేర్కొన్నారు. వెరసి ఇకపై కంపెనీ మార్జిన్లు, లాభదాయకత మెరుగుపడనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది తేయాకు దిగుబడి గతేడాదిని మించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కాఫీ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ ఈ ఏడాది సాధారణ స్థితికి చేరవచ్చని అంచనా వేశారు.

ఫండ్స్ కోసం పబ్లిక్ ఇష్యూ బాట
సాస్(ఎస్ఏఏఎస్) సేవల కంపెనీ క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 430 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.83 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 120 కోట్లు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయాలకు, ప్రొడక్టులు, ప్లాట్ఫామ్ సంబంధ రీసెర్చ్, డిజైనింగ్, డెవలప్మెంట్కు రూ. 152 కోట్లు చొప్పున వెచ్చించనుంది. రూ.10 కోట్లు కంప్యూటర్ సిస్టమ్స్ కొనుగోలుకి, మరికొన్ని నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. ఇంతక్రితం 2021 డిసెంబర్లో కంపెనీ సెబీకి దరఖాస్తు చేసినప్పటికీ అనుమతి లభించలేదు. కంపెనీ ప్రధానంగా ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు ఏఐ ఆధారిత క్లౌడ్నేటివ్ సాస్ ప్రొడక్టులు, సొల్యూషన్లు అందిస్తోంది. గతేడాది(2024–25) కంపెనీ ఆదాయం 14 శాతం పుంజుకుని రూ. 598 కోట్లను తాకింది. టర్న్అరౌండ్ సాధించి రూ. 13 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది రూ. 59 కోట్ల నష్టాలు ప్రకటించింది.పీఎన్జీఎస్ రెవా డైమండ్ సెబీకి దరఖాస్తున్యూఢిల్లీ: రిటైల్ జ్యువెలరీ కంపెనీ పీఎన్జీఎస్ రెవా డైమండ్ జ్యువెలరీ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో దాదాపు రూ. 289 కోట్లు కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించనుంది. 2028కల్లా కొత్తగా 15 స్టోర్లను తెరిచే ప్రణాళికల్లో ఉంది. ఈ బాటలో ప్రధాన బ్రాండు ‘రెవా’ మార్కెటింగ్, ప్రమోషనల్ కార్యక్రమాల కోసం రూ. 35 కోట్లకుపైగా వెచ్చించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. ఇదీ చదవండి: మూడేళ్లలో లక్ష ఎంఎస్ఎంఈలుప్రమోటర్ పీఎన్ గాడ్గిల్ అండ్ సన్స్ స్లంప్ సేల్ ద్వారా డైమండ్ బిజినెస్ను విక్రయించడంతో కంపెనీ ఆవిర్భవించింది. దీంతో పీఎన్జీఎస్ రెవా ప్రత్యేక కంపెనీగా సొంత గుర్తింపుతో డైమండ్ జ్యువెలరీ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2025 మార్చి31కల్లా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకల్లో 33 స్టోర్లను కలిగి ఉంది. గతేడాది(2024–25) ఆదాయం 32 శాతం ఎగసి రూ. 258 కోట్లను తాకగా.. నికర లాభం 40 శాతం జంప్చేసి రూ.59 కోట్లను అధిగమించింది.

మూడేళ్లలో లక్ష ఎంఎస్ఎంఈలు
అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ భారత్లో మరిన్ని చిన్న, మధ్య తరహా సంస్థలతో (ఎంఎస్ఎంఈ) కలిసి పని చేసే ప్రణాళికల్లో ఉంది. తమ ‘వృద్ధి’ ప్రోగ్రాం కింద వచ్చే మూడేళ్లలో భారత్లో తమ సరఫరా వ్యవస్థలో మరో లక్ష ఎంఎస్ఎంఈలను భాగం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం చిన్న సంస్థల కార్యకలాపాల విస్తరణకు తోడ్పడే ఐడియాస్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్ (ఐ2ఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వాల్మార్ట్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జేసన్ ఫ్రెమ్స్టాడ్ తెలిపారు.ఇప్పటికే ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ మార్కెట్ప్లేస్ల ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో చిన్న సంస్థలను అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. వృద్ధి ప్రోగ్రాం ద్వారా కార్యకలాపాలను విస్తరించుకునేందుకు ఎంఎస్ఎంఈలకు అవసరమయ్యే నైపుణ్యాల్లో వాల్మార్ట్ మార్గదర్శకత్వం వహిస్తోంది. 2019లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 70,000 ఎంఎస్ఎంఈలకు శిక్షణనిచ్చినట్లు ఫ్రెమ్స్టాడ్ వివరించారు. ఇదీ చదవండి: ‘రేర్ ఎర్త్’ రీసైక్లింగ్పై రూ.100 కోట్ల పెట్టుబడులువృద్ధి ప్రోగ్రాం విజయవంతం కావడంతో మెక్సికో, అమెరికాలో కూడా వాల్మార్ట్ ఇదే తరహా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. గత 25 ఏళ్లుగా భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్న వాల్మార్ట్ రెండు దశాబ్దాల్లో సుమారు 30 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆహారోత్పత్తులు, ఫార్మా, సైకిళ్లు మొదలైనవి కొనుగోలు చేసింది.
ఫ్యామిలీ

ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరో
జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం 787-8 డ్రీమ్లైనర్ బోయింగ్ తీవ్ర విషాదాన్ని నింపింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే విమానాశ్రయానికి సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ ప్రాంతంలో కూలిపోవడంతో భోజనం తింటున్న విద్యార్థులు నలుగురు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ వార్త తెలియగానే, అహ్మదాబాద్ నివాసి రాజు పటేల్ మానవత్వాన్ని చాటుకున్న వైనం నెట్టింట పలువుర్ని ఆకట్టుకుంటోంది. ఆయన ప్రదర్శించిన చొరవ, నిజాయితీ ప్రశంసలు దక్కించుకుంటోందిఅహ్మదాబాద్ నివాసి రాజు పటేల్ (56) విమానం కూలిపోయిన సమయంలో భారీ పేలుడు శబ్దాన్ని విని ఉలిక్కి పడ్డారు. అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. హా హా కారాలు వినపడుతున్నాయి. ఇది విన్న నరాజు పటేల్ వెంటనే స్పందించారు. తన వద్ద పనిచేస్తున్న సిబ్బందితో కలిసి ఆయన పరుగున ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. కానీ అప్పటికే అదుపు చేయలేని రీతిలో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడి ఉన్నారు. ఇంతలో సహాయ దళాలు అక్కడికి చేరుకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న కొద్దిమందిలో రాజు, దట్టమైన పొగ, పెరుగుతున్న మంటలు, కేకలు, అరుపులు వినిపిస్తున్నా గందర గోళ పడలేదు. స్థానికులు ఇచ్చిన బట్టలు, చాపలను ఉపయోగించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమయం వృథా చేయకుండా, గాయపడ్డవారిని వీలైనంత వేగంగా అంబులెన్స్లలోకి ఎక్కించి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. దీంతో పటేల్ బృందం సేవలను చూసిన రెస్క్యూ అధికారులు, వారిని రాత్రి 9 గంటల వరకు సహాయక చర్యల్లో కొనసాగమని కోరడం గమనార్హం.అంతేకాదు సంఘటనా స్థలం శిథిలాల నుండి రూ. 60 వేల నగదు, 70 తులాల (బంగారం, హారాలు, గాజులు, మంగళసూత్రాలు, ఉంగరాలు, ) బంగారు ఆభరణాలను వెలికితీశారు. ఇంకా విదేశీ కరెన్సీ, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఐడి కార్డులు, వెండి వస్తువులను సేకరించి వాటిని జాగ్రత్తగా, నిజాయితీగా పోలీసులకు తిరిగి ఇచ్చారు.‘‘మొదటి 15 నుండి 20 నిమిషాల వరకు, తొందరగా దగ్గరికి చేరుకోలేకపోయాము. మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి, కానీ మొదటి అగ్నిమాపక దళం , 108 అంబులెన్స్లు వచ్చిన తర్వాత,సహాయం చేయడానికి ముందుకు సాగాం’’ అన్నారు రాజు. సమయానికి స్పందించడంతో పాటు, ఎంతో ధైర్య సాహసాన్ని ప్రదర్శించి ఆయన చేసిన సేవలతో పాటు తాను సేకరించిన వస్తువులను ఎంతో నిజాయితీగా అధికారులకు అప్పగించడం నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది.మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమైన రాజు పటేల్, బృందానికి హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు. ఆపద సమయాల్లో ఆదుకున్నవాడే మానవుడు మహనీయుడు అని పేర్కొంటున్నారు.

అనధికార దత్తతతో అగచాట్లు! ఈ విషయాలు తెలుసుకోకపోతే!
విజయనగరం ఫోర్ట్: డెంకాడ మండలానికి చెందిన దంపతులు మగ శిశువును తెలిసిన వారి దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దత్తత తీసుకున్నారు. అయితే అశిశువుకు జనన ధ్రువీకరణ పత్రం అవసరం పడడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేస్తే జనన «ధ్రువీకరణ పత్రం ఇవ్వలేమని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో వారు ఐసీడీఎస్ కార్యాలయంలో సంప్రదించగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వెళ్లి అడగాలని చెప్పడంతో వెనుదిరిగారు. ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చింది. అధికారుల దృష్టికి రాకుండా అనధికారికంగా దత్తత ఇచ్చేస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. అ«నధికారికంగా దత్తత ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరమని అధికారులు పదేపదే చెబుతున్నారు. కానీ ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. గుట్టుగా పిల్లలను దత్తత ఇచ్చేస్తున్నారు. కొంతమంది పిల్లలను దత్తత ఇచ్చే తల్లిదండ్రులకు డబ్బులు, బంగారం వంటివి ఇచ్చి పిల్లలను అనధికారికంగా దత్తత తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది గర్భం దాల్చిన వారు వైద్యఖర్చులు భరించిన వారికి పిల్లలను దత్తత ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దత్తత పేరిట విక్రయాలు అభంశుభం పిల్లలను బాహ్య ప్రపంచం తెలియకుండానే కన్నతల్లి ముఖం చూడకుండానే ఇంకొకరికి ఇచ్చేస్తున్నారు. పోనీ అనధికారికంగా దత్తత ఉచితంగా ఇస్తున్నారా? అంటే అదీ లేదు. వేలు, లక్షలు తీసుకుని పిల్ల లను దత్తత ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆడపిల్ల అయితే రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర..మగ పిల్లవాడు అయితే రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు విక్రయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అజ్ఞాతవ్యక్తుల సమాచారంతో.. గ్రామీణ ప్రాంతంలో బాల్య వివాహాలు జరిగినా, అనధికారికంగా దత్తత ఇచ్చినా ఐసీడీఎస్ అధికారులకు అంగన్వాడీలు తెలియజేయాలి. కానీ అంగన్వాడీలు ఈ విషయాలను అధికారులకు తెలియజేయడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అజ్ఞాత వ్యక్తులు సమాచారం ఇస్తే అధికారులకు అనధికారిక దత్తత, బాల్య వివాహాల గురించి తెలుస్తోంది. పర్యవేక్షణ కరువు అనధికారికంగా పిల్లలనుదత్తత ఇచ్చిన వారిని గుర్తించి తిరిగి ఆ శిశువులను తల్లిదండ్రులకే అప్పజెప్పి నప్పుడు 6 నెలల వరకు పర్యవేక్షణ చేయాలి. శిశువును మళ్లీ ఎవరికైనా దత్తత ఇచ్చేశారా? లేదంటే వారే పెంచుతున్నారా? అనేది ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పర్యవేక్షించాలి. కానీ అటువంటి పర్యవేక్షణ చేయడం లేదనే తెలుస్తోంది. చట్టప్రకారం దత్తత తీసుకోవాలిపిల్లలు లేని తల్లిదండ్రులు దత్తత తీసుకోవాలంటే ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశుగృహ కార్యాలయానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే పిల్లలు దత్తత తీసుకోవాలనుకున్న తల్లిదండ్రులు ఆరోగ్యవంతులై ఉండాలి, ఆర్థికస్థితి బాగుండాలి. ఎటువంటి వ్యాధులు ఉండకూడదు. పిల్లలు పుట్టరని వైద్యుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. వయస్సు 45 ఏళ్ల లోపు ఉండాలి. అటువంటి వారు దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి అర్హులు అనుకుంటే అప్పుడు దత్తత ఇస్తారు.అనధికారిక దత్తతతో చిక్కులు అనధికారిక దత్తతతో అనేక చిక్కులు ఉన్నాయి. వారికి జనన ధ్రువీకరణ పత్రం రాదు. అదేవిధంగా దత్తత వెళ్లిన పిల్లలకు హక్కుల కోసం పోరాటం చేయడానికి వీలుండదు. దీని వల్ల నష్టపోవాల్సిన పరిస్థితి.అనధికారిక దత్తత తీసుకుంటే అది చెల్లదు. చట్ట ప్రకారమే పిల్లలను దత్తత తీసుకోవాలి. అనధికారికంగా దత్తత తీసుకుంటే చర్యలు తీసుకుంటాం. టి.విమలరాణి, పీడీ, ఐసీడీఎస్

పర్యాటకుల తాకిడితో బెంబేలెత్తే టాప్ 10 ప్రదేశాలివే..!
తిండి ఎక్కువై ఒకడు ఏడిస్తే..తిన్నదరక్క మరొకడు ఏడ్చాడనేది సామెత కావచ్చు కానీ...ఎప్పటికీ కళ్లకు కట్టే వాస్తవం కూడా అదే. ప్రపంచంలో అనేక దేశాలు టూరిజం అభివృద్ధికి రోజుకో ప్లాన్ వేస్తూ నానా తంటాలు పడుతున్నాయి. అదే సమయంలో కొన్ని దేశాలు మాత్రం టూరిస్ట్లను ఎలా నియంత్రించాలా ఆని తలలు పట్టుకుంటున్నాయి. పర్యాటకుల వల్ల ఆదాయం సంగతి దేవుడెరుగు ముందు తమ దేశాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆలోచిస్తున్నారు. అలాంటి దేశాల గురించి ఒకసారి పరిశీలిస్తే... గత 2024–25 గణాంకాల ప్రకారం చూస్తే...ప్రపంచపు టాప్ 10 పర్యాటక దేశాలు..ఫ్రాన్స్: ఈ పర్యాటకుల కలల రాజ్యం..గత ఏడాది 89.4మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకులతో ప్రధమ స్థానంలో ఉంది. అయితే పర్యాటకుల సంఖ్య తగ్గడంతో ఆ దేశం హమ్మయ్య అనుకుంటూ ఊపిరిపీలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఈ దేశం అంతకు ముందు ఏడాది 2023లో పర్యాటకుల సంఖ్య 100మిలియన్లకు చేరి రికార్డ్ సృష్టించగా, ఆ తర్వాత చేపట్టిన నియంత్రణ చర్యలతో ఆ సంఖ్య తిరోగమించింది.స్పెయిన్: ఈ దేశం గత ఏడాది 83.7మిలియన్ల పర్యాటకులతో 2వ స్థానంలో నిలిచింది. ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో రకరకాల ఆకర్షణలతో గత ఆరేళ్లుగా రికార్డు సంఖ్యలో పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది.అమెరికా: అగ్రరాజ్యం అమెరికా కూడా పర్యాటకుల రద్దీకి గురవుతోంది. గత ఏడాది 79.3మిలియన్ల మందిని ఆకర్షించింది. ట్రంప్ సర్కారు విధానాలతో ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య ఇప్పటికే తగ్గినట్టు కనిపిస్తోంది.చైనా: అత్యధిక జనాభా కలిగిన ఈ దేశం అత్యధిక టూరిస్ట్ల రాకతో ఇబ్బందులు పడుతోంది. ఈ దేశాన్ని గత ఏడాది 65.7 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారు.ఇటలీ: రోమన్ చరిత్ర, వైన్, కళలకు నిలయం లాంటి ఈ దేశం గత ఏడాది 64.5 మిలియన్ల పర్యాటకుల్ని రాబట్టింది. దీంతో ప్రస్తుతం టూరిజం ప్రమోషన్ కార్యక్రమాలు తగ్గాయి.టర్కీ: ఇస్తాంబుల్, కేప్ పా, క్యాపాడోసియా వంటి ప్రదేశాలతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ దేశం గత ఏడాది 51.2 మిలియన్ల టూరిస్ట్లతో 6వస్థానంలో నిలిచింది. అయితే భారత దేశంతో తెచ్చుకున్న అకారణ శతృత్వం ఈ ఏడాది పర్యాటకుల సంఖ్యను గట్టిగా ప్రభావితం చేయవచ్చు.మెక్సికో: బీచ్, సంస్కృతి, పురాతత్వ ప్రదేశాలతో పాటు చవులూరించే వంటకాలకూ పేరొందిన ఈ దేశం... గత ఏడాది 45.మిలియన్ల మందిని ఆకర్షించింది. థాయ్లాండ్: ఇటీవలే మిస్ వరల్డ్ కిరీటాన్ని కూడా దక్కించుకున్న ఈ దేశానికి ల్యాండ్ ఆఫ్ స్మైల్స్గా పేరుంది. గత ఏడాది 39.8 మిలియన్ల టూరిస్ట్లను తన ఖాతాలో వేసుకుంది.జర్మనీ: తరచుగా బీర్ ఉత్సవాలు, చారిత్రక నగరాలతో అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచే ఈ దేశాన్ని గత ఏడాది సందర్శంచిన పర్యాటకుల సంఖ్య 39.6 మిలియన్లు. యు.కే..లండన్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వంటి ఐకానిక్ ప్రాంతాలతో పర్యాటకుల్ని కట్టి పడేస్తున్న యునైటెడ్ కింగ్డమ్... గత ఏడాది 39.6 మిలియన్ల మందిని తన దేశానికి రప్పించింది.గత 2024–25 గ్లోబల్ పర్యాటక గణాంకాలలో అగ్రస్థానాల్లో యూరోప్ – ఉత్తర అమెరికా దేశాలు నిలుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మిగిలిన దేశాల పరిస్థితి ఎలా ఉన్నా... టాప్ 10లో.. తీవ్రమైన పర్యాటకుల రద్దీతో స్పెయిన్, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలకు తీవ్రమైన ఇబ్బంది కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. జవనవ్యయం, ధరలు పెరిగి, జీవన నాణ్యతకు ముప్పు ఏర్పడుతోంది. దీంతో ఈ పరిస్థితిని విరోధించాలనే స్థానికుల డిమాండ్ మేరకు నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.(చదవండి: అత్యంత కాలుష్యరహిత హిల్స్టేషన్.. ! మన తెలుగు రాష్ట్రాలకు దగ్గర్లోనే...)

పొగడ్తల కోసమా దానం? ఎలాంటి దానం గొప్పది!
పవిత్రమపి యత్ క్రూరం కర్మ తన్నహి శోభతేపరోపకారకం శాంతం కర్మ సద్భిః ప్రశస్యతే మనం చేసే పని ఎంత పవిత్రమైనదైనా క్రూరంగా ఉంటే మాత్రం రాణించదు. అది శాంతమై, ఇతరులకు ఉపకారం కలిగించేదైతే సజ్జనులు దాన్ని ప్రశంసిస్తారు. పూర్వం ఒక గ్రామంలో వృద్ధ స్నేహితులు ఇద్దరుండేవారు. వాళ్ళిద్దరూ బాగా కలిగిన ధనవంతులే. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవారు. ఒకసారి ఊరి బయటకు వారు షికారుకు వెళ్లినప్పుడు వారిని పిచ్చి కుక్క కరిచింది. ఫలితంగా ‘రేబిస్ వ్యాధి’ సోకింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. మరణం తప్పదని నిర్ధారణ అయింది.ఇప్పుడు వాళ్ళకు ఏదో దాన ధర్మాలు చేసుకుంటే మంచిదనీ, కీర్తి ప్రదమనీ అనిపించింది. పిచ్చికుక్కలు మానవజాతికి ప్రమాదకారులు కనుక వాటివల్ల తమ లాగానే ఇతరులు బాధపడకూడదనే సదుద్దేశంతో వారిలో ఒకాయన, తన యావత్తు ఆస్తినీ పిచ్చికుక్కల్ని చంపటానికి ఖర్చు పెట్టాలని వీలునామా రాశాడు. ఇక రెండవ వ్యక్తి, పిచ్చికుక్క కాటువల్ల వచ్చే రోగానికి మంచి మందు కనిపెట్టి దాన్ని రోగులకు ఉచితంగా ఇచ్చి వైద్యం చేయాలంటూ అందుకోసం తన ఆస్తినంతా ఖర్చుపెట్టాలని వీలు నామాలో రాశాడు. ఎలా వుంది, వీరిరువురి దానాల తీరు? ఇద్దరూముందు తరాలవారికై మంచి పనే చేశారు. కాని మొదటాయన చేసిన దానం చాలా క్రూరమైంది. హింసాత్మకం. రెండవవాడు చేసింది సున్నితమైంది. జాతికి బాగా ఉపయోగపడేది. ఈరెండవ పద్ధతి దానాన్నే పెద్దలు మెచ్చుకుంటారు. ఇలాగే దానధర్మాల కోసం ధనం బాగా ఖర్చుపెట్టే దాతలున్నారు. బీదలకు అన్న సత్రాలు కట్టిస్తారు. పాఠశాలలు నెలకొల్పుతారు. బావులు, చెరువులు తవ్విస్తారు. దళిత దీన జనాలకై తిండి, వస్త్రాలు, వసతి వంటివెన్నో కల్పిస్తారు. కానీ ఇలాంటివి చేసే వ్యక్తులకెంతో ఓర్పు, జాలి, దయాదాక్షిణ్యా దులుండటం అవసరం. లేకపోతే ఆ దానాల ఫలితాన్నందు కోలేరు. ముఖ్యంగా ‘నేను చేస్తున్నాను’ అనే అహంకారం ఉండ కూడదు. ‘నా గురించి పదిమంది పొగడాలి’ అనే కాంక్ష ఉండ రాదు. ‘దానం చేయటం నా కర్తవ్యం’ అని భావిస్తూ ఫలాపేక్ష రహితంగా చేసే దానం ఉత్తమం. జయ గురుదత్త!శ్రీ గణపతి సచ్చిదానందస్వామి
ఫొటోలు
అంతర్జాతీయం

నో బ్రా.. నో ఎగ్జామ్!!
ఆ అమ్మాయిలంతా పరీక్ష రాసేందుకు క్యూ లైన్లో నిలబడ్డారు. ఒక్కొక్కరిగా ముందుకు వెళ్తున్న క్రమంలో.. వాళ్ల ముఖంలో హవభావాలు మారిపోతున్నాయి. తనిఖీల పేరుతో అక్కడి సిబ్బంది ఇబ్బందికరంగా తాకుతుండడమే అందుకు కారణం. అదీ అధికారిక పద్ధతిలోనే కావడం ఇంకా దారుణం. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఓ వీడియోపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెతుతున్నాయి. పరీక్షా హాల్లోకి ప్రవేశించే ముందు మహిళా విద్యార్థులను బ్రా ధరించారా? లేదా? అని ఛాతీ భాగాన్ని తాకుతూ కనిపించారు. ఈ ఘటన విద్యా సంస్థల్లో వ్యక్తిగత గౌరవం, మానవ హక్కులు, మరియు లైంగిక సమానత్వం వంటి అంశాలపై తీవ్ర చర్చకు దారితీసింది. నైజీరియాలోని ఒలాబిసీ ఒనాబంజో యూనివర్సిటీలో (Olabisi Onabanjo University - OOU) చోటు చేసుకుంది. పరీక్షకు హాజరయ్యే బాలికలు, విద్యార్థినుల కోసం డ్రెస్ కోడ్ రూల్స్ పెట్టింది. కురచ దుస్తులు వేసుకున్నా.. శరీర భాగాలు కొంచెం కనిపించినా అది వర్సిటీ నైతికతను దెబ్బ తీసే అంశమని పేర్కొంది. పైగా ఎదుటివాళ్లను రెచ్చగొట్టడం కిందకే వస్తుందని తెలిపింది. ఈ క్రమంలో నో బ్రా.. నో ఎంట్రీ ఫర్ ఎగ్జామ్ రూల్ను కఠినంగా అమలు చేయించింది. 📌 ఘటనపై యూనివర్సిటీ పెద్దలు మాత్రం అధికారికంగా స్పందించలేదు. No bra, no exam అనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నామని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు.. విద్యార్థి సంఘం అధ్యక్షుడు ముయిజ్ ఒలాటుంజీ ఈ విధానంపై మిశ్రమ స్పందన తెలియజేశారు. అయితే.. ⚖️ మానవ హక్కుల సంఘాల ప్రతినిధి హరునా అయాగీ మాత్రం ఇది విద్యార్థుల హక్కులను ఉల్లంఘించే చర్యగా పేర్కొంటూ, చట్టపరమైన చర్యలకు వెళ్తామని హెచ్చరించారు.🎓 చేదు అనుభవం ఎదురైన ఆ విద్యార్థినులు మాత్రం.. ఈ విధానాన్ని లైంగిక వేధింపుగా అభివర్ణించారు. “No bra. No entry” is not a new policy in Olabisi Onabanjo University.OOU promotes a dress code policy aimed at maintaining a respectful and distraction-free environment, encouraging students to dress modestly and in line with the institution's values. https://t.co/xO70cBiabG pic.twitter.com/pTWjpABFmT— ART&SCIENCE (@MAO_of_Africa) June 17, 2025👉గమనిక: పై వీడియో కేవలం వార్తకు అనుగుణంగా సమాచారం అందించడానికి మాత్రమే. అశ్లీలతను పెంపొందించడం కోసమో లేదంటే ఎవరినీ అగౌరవపర్చడం కోసమో కాదు

ఏమీ ఎరుగని పూవుల్లారా!
ఏమీ ఎరుగని పూవుల్లారా,అయిదారేడుల పాపల్లారా!మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తేఅవి మీకే అని ఆనందించేకూనల్లారా!..రెండేళ్ల వయసులో ఎలా ఉండాలి?.. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ.. తల్లిదండ్రుల ఒడిలో సేదతీరుతూ ఉండాలి . కానీ, ఈ చిన్నారి మాత్రం తోటి పిల్లలతో కలిసి ఎక్కడ నీరు దొరక్కుండా పోతుందా? అనే భయంతో పరుగులు ఇలా పెడుతోంది. తమ బిడ్డలకు అందమైన బాల్యం చెక్కాలని ఆ దేవుడ్ని మొక్కుకోని తల్లిదండ్రులు ఉంటారా?. కానీ, తమ బిడ్డలు ప్రాణాలతో ఉంటే చాలని వేడుకుంటున్నారు గాజా ప్రజలు.గాజా.. గత ఏడాదిన్నరగా ఇజ్రాయెల్ దాడులతో.. తీవ్ర మానవ సంక్షోభంతో అల్లలాడుతున్న నేల. మానవతా సాయం ఆగిపోవడంతో సంక్షోభం తలెత్తి చివరకు తిండి, మంచి నీటిని కూడా పరిమితులు విధించడంతో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by عبد الرحمن ناصر | Abdulrahman Nasir (@abdulrahman_nasir7)యూనిసెఫ్ గణాంకాల ప్రకారం..ప్రస్తుతం కల్లోల గాజాలో చిన్నారులకు రోజుకి ఒకటిన్నర నుంచి 2 లీటర్ల నీరు అందిస్తున్నారు. సాధారణంగా.. అన్ని అవసరాలకు కలిపి 15 లీటర్ల నీరు ఒకరోజుకి అవసరం పడుతాయి. ఇందులో తాగు నీటికే 3 లీటర్ల అవసరం. అలాంటిది ఇక్కడి చిన్నారులకు ఒకరోజులో 2 లీటర్ల లోపే నీరు అందుతుండడం.. సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది.గణాంకాలు.. కఠోర వాస్తవాలుగాజాలో 2023 అక్టోబర్ నుండి ప్రారంభమైన యుద్ధంలో వేలాది మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు, మరియు ఈ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.2023లోనే గాజాలో జరిగిన దాడుల్లో పిల్లలే అత్యధికంగా మరణించారు అని జెనీవాలో యునిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్టర్ ప్రకటించారు.మొత్తం గాజా మరణాల్లో.. 70% మరణాలు మహిళలు మరియు పిల్లలే అని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. యుద్ధం, ఆకలి, నీటికొరత, వైద్య సౌకర్యాల లేమి కారణంగా 14,000 మంది పిల్లలు మరణించే ప్రమాదం ఉంది అని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.ఇంకా..19 లక్షల మంది స్థానభ్రంశం చెందారు, వారిలో సగానికి పైగా పిల్లలే.370 స్కూళ్లు నేలమట్టమయ్యాయి, పిల్లలు విద్యా అవకాశాలు కోల్పోయారు.నీటి లభ్యత 5%కి పడిపోయింది, దీని వల్ల డీహైడ్రేషన్తో పసికందులు మరణిస్తున్నారు.బాల్యం అనే భావన అక్కడ పూర్తిగా విచ్ఛిన్నమైందని యునిసెఫ్ పేర్కొంది. ఈ గణాంకాలు గాజాలోని పిల్లల పరిస్థితి ఎంత భయానకంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. *పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూఏమీ ఎరుగని పూవుల్లారా,అయిదారేడుల పాపల్లారా!మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తేఅవి మీకే అని ఆనందించేకూనల్లారా!అచ్చటికిచ్చటి కనుకోకుండాఎచ్చటెచటికో ఎగురుతుపోయేఈలలు వేస్తూ ఎగురుతుపోయేపిట్టల్లారా!పిల్లల్లారా!గరికిపచ్చ మైదానాల్లోనూ,తామరపూవుల కోనేరులలోపంటచేలలో, బొమ్మరిళ్లలో,తండ్రి సందిటా, తల్లి కౌగిటా,దేహధూళితో, కచభారంతో,నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ,ఎక్కడ చూస్తే అక్కడ మీరైవిశ్వరూపమున విహరిస్తుండేపరమాత్మలుఓ చిరుతల్లారా!మీదే, మీదే సమస్తవిశ్వం!మీరే లోకపు భాగ్యవిధాతలు!మీ హాసంలో మెరుగులు తీరునువచ్చేనాళ్ల విభాప్రభాతములు!ఋతువుల రాణి వసంతకాలంమంత్రకవాటం తెరచుకునీ,కంచు వృషభముల అగ్నిశ్వాసంక్రక్కే గ్రీష్మం కదలాడీ,ఏళ్లు, బయళ్లూ, వూళ్లూ, బీళ్లూఏకంచేసే వర్షాకాలం,స్వచ్ఛ కౌముదుల శరన్నిశీథినులు,హిమానీ నిబిడ హేమంతములు,చలివడకించే శైశిరకాలంవస్తూ పోతూ దాగుడుమూతలక్రీడలాడుతవి మీ నిమత్తమే!ఇవాళలాగే ఎప్పుడు కూడాఇనబింబం పయనించు నింగిపై!ఎప్పుడు కూడా ఇవాళలాగేగాలులు వీచును, పూవులు పూచును!నాకు కనంబడు నానాతారక,లనేక వర్ణా, లనంత రోచులుదిక్కు దిక్కులా దివ్యగీతములుమీరూ వాటికి వారసులే! ఇవిమీలో కూడా మిలమిలలాడును!నా గత శైశవ రాగమాలికలప్రతిధ్వనులకై,పోయిన బాల్యపు చెరిగిన పదములచిహ్నాల కోసం,ఒంటరిగా కూర్చిండి వూరువులుకదిలే గాలికి కబళమునిస్తూ,ప్రమాద వీణలు కమాచి పాడగసెలయేళ్లను, లేళ్లను లాలిస్తూ,పాతాళానికి పల్టీకొట్టీవైతరణీనది లోతులు చూస్తూ,శాంతములే, కేకాంతముగా, దిగ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూమెటిక విరుస్తూ ఇట కూర్చిండిననను చూస్తుంటే నవ్వొస్తోందా?ఉడుతల్లారా!బుడతల్లారా!ఇది నా గీతం, వింటారా?*సేకరణ: శ్రీశ్రీ మహాప్రస్థానం/శైశవగీతి

ప్చ్.. పాకిస్తాన్ పీత కష్టాలు
ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ సూపర్ సక్సెస్.. ఆపరేషన్ సిందూర్ అట్టర్ ప్లాప్ అని డప్పు కొట్టి ప్రకటించుకున్నా పాక్ను పట్టించుకునే నాథుడే(దేశం)కరువయ్యాడు. పైగా 'ది ఇంటెల్ ల్యాబ్'కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ పాక్ పాలిట పీడకలగా తయారయ్యాడు.భారత సైన్యం అసలు తమ ఎయిర్బేస్లపై దాడులే జరపలేదని పాక్ చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్లో మురిద్, జాకోబాబాద్, భోళరిలో మిలిటరీ స్థావరాలను భారత సైన్యం నాశనం చేసింది. అయితే ధ్వంసమైన ఈ ఎయిర్బేస్లను టార్పలిన్(tarpaulin)లతో కప్పి దాచేసే ప్రయత్నం చేసింది పాక్. ఈ విషయాన్ని బయటపెట్టిన డామియన్.. ఇప్పుడు మరో కీలక సమాచారాన్ని ఎక్స్ వేదికగా వదిలాడు. అందులో రహీం యార్ ఖాన్ బేస్ను పాక్ ఎంతకీ పునరుద్ధరించలేకపోతోందని వెల్లడించాడు.Pakistan once again issues a NOTAM for Rahim Yar Khan, the runway struck by India in May 2025 now remains offline estimated till 04 July 2025 pic.twitter.com/M6nE1ONTmL— Damien Symon (@detresfa_) June 19, 2025ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఫేజ్1లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం.. ఫేజ్2లో రహీమ్ యార్ ఖాన్ బేస్ను సైతం దెబ్బ తీసింది. అయితే జులై 4వ తేదీ దాకా దాని కార్యకలాపాలు ప్రారంభం కాబోవని పాక్ సైన్యం తాజాగా నోటామ్(notice to airmen) సైతం జారీ చేసింది.ఆపరేషన్ సిందూర్లో భాగంగా.. పక్కా ప్రణాళికతో భారత్ ఈ ఎయిర్బేస్ను దెబ్బ తీసింది. దీంతో పాకిస్తాన్కు జరిగిన నష్టం మాములిది కాదు. పంజాబ్ ప్రావిన్స్లో పాక్కు ఇదే వ్యూహాత్మక స్థావరంగా ఉండేది. అంతేకాదు.. ఈ ఎయిర్బేస్కు అనుసంధానంగా రహీమ్ యార్ ఖాన్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. ఒకే రన్వే ఉన్న ఈ ఎయిర్పోర్టును భారత్ జరిపిన దాడి తర్వాత వారం పాటు మూసే ఉంచుతామని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే అది కూడా ఇప్పటిదాకా తెరుచుకోకపోవడం గమనార్హం. దీంతో.. దాడి ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ‘‘అది ఇంకెప్పటికి తెరుచుకుంటుందో?’’ అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.India didn’t just respond, it decimated yet another key site of #Pakistan's attack. #Rahimyarkhan airport, a key launchpad for Pakistani drone attacks, now lies in ruins.Precision. Power. Payback.#PakistanIndianWar pic.twitter.com/zvkaaWFH5R— DrVinushaReddy (@vinushareddyb) May 10, 2025విశేషం ఏంటంటే.. రాజస్థాన్ బికనీర్లో నిర్వహించిన ఓ ర్యాలీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎయిర్బేస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాక్ రహీమ్ యార్ ఖాన్ ఎయిర్బేస్ ఇంకా ఐసీయూలోనే ఉంది. అది ఎప్పటికీ తిరిగి తెరుచుకుంటోందో కూడా చెప్పలేకపోతున్నారు అని మోదీ తన ప్రసంగంలో వ్యంగ్యం ప్రదర్శించారు. " مودی" نے رحیم یارخان ائیر بیس تباہ کردیا 😂😂راجھستان ، رحیم یارخان بارڈر کے دوسری طرف عوامی جلسے سے خطاب#modi #rajasthan #RahimYarKhan #rahimyarkhanpakistan pic.twitter.com/9oRsvL5ql6— Rana Kashif (@ranakashi102) May 23, 2025📍రహీం యార్ ఖాన్ (Rahim Yar Khan) పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న ఒక ప్రముఖ నగరం(జిల్లా కేంద్రం కూడా). ఇది పాకిస్తాన్లో 21వ అతిపెద్ద నగరం. ఈ నగరం పూర్వపు పేరు నౌషెహ్రా. అయితే 1881లో బహావల్పూర్ రాష్ట్ర నవాబ్ సాదిక్ ఖాన్ IV.. తన కుమారుడు రహీం యార్ ఖాన్ (1877–1881) పేరును ఈ నగరానికి పెట్టాడు. ఈ ప్రాంతంలో పట్టన్ మినారా అనే 2000 సంవత్సరాల పురాతన బౌద్ధ స్థూపం ఉంది, ఇది మౌర్యుల హక్రా లోయ నాగరికతకు చెందినదిగా చరిత్రకారులు భావిస్తుంటారు.

లాడెన్ను అంత తేలికగా మరిచిపోయారా?
పహల్గాం ఘటన తర్వాత.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తన మధ్యవర్తిత్వంతోనే చల్లారాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్న మ్యాటర్ తెలిసిందే. అంతేకాదు.. అందుకు సహకరించారంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను వైట్హౌజ్కు ఆహ్వానించి మరీ భోజనం పెట్టారు. ఈ పరిణామంపై తిరువనంతపురం(కేరళ) కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యంగ్యంగా స్పందించారు.‘‘పాకిస్తాన్ అనేది గతంలో ఒసామా బిన్ లాడెన్ను తమ సైనిక శిబిరం సమీపంలో దాచిన దేశం. అలాంటి దేశానికి చెందిన సైన్యాధిపతికి అమెరికా అధ్యక్షుడు ఆతిథ్యమివ్వడం విడ్డూరం. ఈ పరిణామం.. బహుశా అమెరికా ప్రజలు ఒసామాను మరిచిపోయారా? అనే సందేహాన్ని కలిగిస్తోంది’’ అని థరూర్ వ్యాఖ్యానించారు. .. పాక్ ప్రతినిధి బృందాన్ని కలిసిన కొంతమంది అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్మెన్లు ఉన్నారు. కానీ ఒసామా బిన్ లాడెన్ అనే పేరును అమెరికన్లు అంత త్వరగా మరచిపోయి ఉండరని నేను అనుకోను. ఇది అమెరికన్లకు అంత సులభంగా మరిచిపోలిగిన విషయమైతే కాదు. పాక్ లాడెన్ను తన ఆర్మీ శిబిరం దగ్గర దాచిన విషయంలో బాధ్యత వహించాల్సిందే. వారు(పాక్) అమెరికా చరిత్రలోనే అతి పెద్ద ఉగ్రదాడికి కారణమైన వ్యక్తిని రహస్యంగా దాచారు. పైగా భారత్పై ఉగ్రదాడులకు కూడా ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు... కనీసం ఈ సమావేశాన్ని ఉపయోగించుకుని అయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. పాక్ ఆర్మీ చీఫ్ను హెచ్చరించి ఉండాలి. వాళ్ల దేశం నుంచి ఉగ్రవాదులను ఆర్థికంగా, సాయుధంగా, శిక్షణ ఇచ్చి మరీ భారత్కు పంపడం మంచిది కాదని చెప్పి ఉండాలి. మందు, విందుతో పాటు పాక్ ఆర్మీ చీఫ్కు అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్మెన్లు ఈ విషయాలన్నీ చెప్పి ఉండాలి. ఎందుకంటే ఇదంతా అమెరికా ప్రయోజనాలకు సంబంధించిన అంశం కూడా’’ అని థరూర్ ఖ్యానించారు. పహల్గాం దాడి తర్వాత.. పాక్ ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుందో తెలియజేసేందుకు ఎంపీల అఖిల పక్ష బృందాలను పలు దేశాలకు కేంద్రం పంపుతోంది. అందులో శశిథరూర్ కూడా ఉన్నారు.#WATCH | Thiruvananthapuram, Kerala | On US President Donald Trump's lunch meeting with Pakistan Army Chief Asim Munir, Congress MP Shashi Tharoor says, "I hope the food was good and he gets some food for thought in the process. I hope that in these interactions, the Americans… pic.twitter.com/QJn6BHEjoY— ANI (@ANI) June 19, 20252001 సెప్టెంబర్ 11వ తేదీన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్పై ఉగ్రదాడి జరిగి 3 వేల మందికిపైగా మరణించారు. ఈ దాడుల వెనుక ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ ఖైదా ఉందని తేలింది. పదేళ్ల తర్వాత.. 2011, మే 2వ తేదీన అమెరికా నేవీ సీల్ బలగాలు పాకిస్తాన్లోని అబోట్టాబాద్ అనే పట్టణంలో నిర్వహించిన రహస్య ఆపరేషన్లో లాడెన్ను హతమార్చాయి. ఇందుకోసం జరిపిన ఆపరేషన్కు Operation Neptune Spear అనే కోడ్ పేరు పెట్టారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా ఈ దాడిని పర్యవేక్షించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. అయితే తానే చెబితేనే యుద్ధం ఆగిందని ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ల చొరవతోనే ఇది సాధ్యమైందని చెబుతూ ఇద్దరినీ వైట్హౌజ్ లంచ్ ఈవెంట్కు ఆహ్వానించారు. అసిమ్ మునీర్ అప్పటికే అమెరికా చేరుకోగా.. జీ7 సదస్సుకు హాజరైన మోదీతో ట్రంప్ ఫోన్లో 35 నిమిషాలపాటు సంభాషించారు. అయితే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించిన మోదీ.. ట్రంప్ మధ్యవర్తిత్వం చేశారన్న ప్రకటనను తోసిపుచ్చారు. పాక్ ఆర్మీ బతిమాలినందు వల్లే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందని, భారత్-పాక్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం జరగలేదని.. ఇక మీదటా జరగబోదని ట్రంప్తో స్పష్టం చేశారు.
జాతీయం

టీవీలకు కనెక్ట్ అవుతున్నారు!
‘ఓటీటీలో కొత్తగా ఏ సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయో?’.. ‘ఆ హీరో, హీరోయిన్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా’.. ఎవరి నోట విన్నా ఇప్పుడు ఇవే మాటలు. ఇంటర్నెట్తో పనిచేసే కనెక్టెడ్ టీవీ ఉంటే చాలు.. ఎంచక్కా ఇంట్లో కూర్చుని నచ్చిన సినిమాను, సిరీస్ను తమకు అనుకూలమైన సమయంలో ఆస్వాదిస్తున్నారు. ఈ కనెక్టెడ్ టీవీలు ఇప్పుడు పల్లెలకూ విస్తరిస్తున్నాయి. 2025 జనవరి–మార్చిలో కొత్తగా 3.5 కోట్ల కనెక్టెడ్ టీవీ వ్యూయర్లు పెరిగారని కాంటార్ మీడియా కంపాస్ నివేదిక వెల్లడించింది. ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు ఇప్పుడు కంటెంట్ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్లపై ఆధారపడుతున్నారట.ఇంటర్నెట్ విస్తృతి మనదేశంలో కేవలం స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగేందుకే పరిమితం కాలేదు. కనెక్టెడ్ టీవీల జోరుకూ దోహద పడుతోంది. దాంతో సంప్రదాయ టీవీ వీక్షణ నుంచి డిజిటల్ వైపు జనం మళ్లుతున్నారు. దేశవ్యాప్తంగా మూడు నెలల్లోనే కనెక్టెడ్ టీవీ వీక్షకులు కొత్తగా 3.5 కోట్ల మంది తోడవడమే దీనికున్న క్రేజుకు నిదర్శనం. యువ వీక్షకులు సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం, ఓవర్ ద టాప్ (ఓటీటీ) జోరు, టెలికం కంపెనీల చవక బ్రాడ్బ్యాండ్ ప్యాక్స్, స్మార్ట్ టీవీలు అందుబాటు ధరలో లభించడం.. వెరసి కనెక్టెడ్ టీవీల సంఖ్య దేశంలో దూసుకుపోతోంది. తీరిక సమయంలో చూసేస్తున్నారుఅమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, జియో హాట్స్టార్ వంటి ఓటీటీ యాప్స్ ద్వారా ఆన్–డిమాండ్ కంటెంట్ను ఆస్వాదించేందుకు కనెక్టెడ్ టీవీ వీలు కల్పిస్తుంది. ఇంటర్నెట్ ఆధారిత కనెక్టెడ్ టీవీల్లో వీక్షకులు తమకు వీలున్న సమయంలో నచ్చిన కంటెంట్ను వీక్షించే సౌలభ్యం ఉంటుంది. భారత్లో పూర్తి డిజిటల్ టీవీ వీక్షకులు 23 శాతం ఉన్నారు. సంప్రదాయ టీవీకి వీరు దూరం. కేబుల్, ఉపగ్రహం, ఓవర్ ద ఎయిర్ సిగ్నల్స్ ద్వారా నిర్దిష్ట సమయం ప్రకారం ప్రసారమయ్యే కార్యక్రమాల వీక్షణకే సంప్రదాయ టీవీ పరిమితం అవుతుంది. 58% మంది భారతీయులు ఇప్పటికీ ప్రతి నెలా సంప్రదాయ టీవీ వీక్షణపై ఆధారపడుతున్నారు. పాత తరం జనాభాలో సంప్రదాయ టీవీకి ఇప్పటికీ ప్రజాదరణ కొనసాగుతోంది. యువతరం డిజిటల్కు..మీడియా ప్రాధాన్యతలలో తరాలనుబట్టి అంతరం స్పష్టంగా కనిపిస్తోంది. 15–34 సంవత్సరాల వయస్సు గలవారిలో.. అంటే జనరేషన్ జెడ్ (13–28 ఏళ్ల మధ్య ఉన్నవారు), యంగ్ మిలీనియల్స్ (29–34 ఏళ్ల మధ్య ఉన్నవారు) డిజిటల్, ఓటీటీని 55%, సోషల్ మీడియాను 57% మంది ఇష్టపడుతున్నారు.45 ఏళ్లకుపైగా వయసున్న వారిలో 44% మంది ఇంటర్నెట్ ఆధారిత ఇతర కార్యక్రమాల కంటే సంప్రదాయ టీవీ వీక్షణకే మొగ్గు చూపుతున్నారు. కుటుంబంతో కలిసి చూడగలిగే ఆరోగ్యకర షోలను లక్ష్యంగా చేసుకునే వీడియో స్ట్రీమింగ్ కంపెనీల కంటెంట్, మార్కెటింగ్ వ్యూహాలను పట్టణ ప్రాంతాల్లో కనెక్టెడ్ టీవీ సెట్ల పెరుగుదల ప్రభావితం చేస్తోంది. గ్రామీణ భారతం హవాగ్రామీణ వాసులు సంప్రదాయ టీవీనే చూస్తున్నారనుకుంటే పొరపాటే. గ్రామీణ భారతం ఒక మీడియా పవర్హౌస్గా అవతరించింది. పాత అంచనాలను బద్దలు కొడుతూ గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వీక్షకులు 74%, సంప్రదాయ వీక్షకులు 75% ఉన్నారు. కనెక్టెడ్ టీవీ మెట్రోలకే పరిమితం కాలేదని.. పట్టణ, గ్రామీణ ప్రేక్షకులను సమానంగా చేరుకుంటోందని కాంటార్ నివేదిక స్పష్టం చేసింది. ఇక ప్రకటనల విషయానికొస్తే విభిన్న ప్రేక్షకులను వేర్వేరు సందేశాలతో చేరుకోవడానికి కనెక్టెడ్ టీవీ ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుందని వినోద పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సమేతంగా ఈ కనెక్టెడ్ టీవీలో సినిమాలూ, వెబ్ సిరీస్లూ చూడటం కూడా పెరిగింది. ముఖ్యంగా పండుగలు, సెలవు రోజుల్లో కనెక్టెడ్ టీవీ గ్రామీణ ప్రాంతాల్లోనూ వినోద కేంద్రంగా మారిందని వారు అంటున్నారు.

54 ఉన్నత విద్యాసంస్థలకు గ్లోబల్ గుర్తింపు
సాక్షి. న్యూఢిల్లీ: విద్యారంగంలో భారత్ మరో మైలురాయిని అందుకుంది. క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్–2026లో మన దేశానికి చెందిన 54 ఉన్నత విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఈ రంగంలో ఇప్పటివరకు భారత్ అందుకున్న అతిపెద్ద గ్లోబల్ రికార్డు ఇది. లండన్కు చెందిన గ్లోబల్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనలిటిక్స్ సంస్థ క్వాక్క్వరెల్లీ సిమండ్స్ (క్యూఎస్) గురువారం విడుదల చేసిన వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్–2026 జాబితాలో ప్రపంచంలోని 1,500కి పైగా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ ర్యాంకింగ్ కోసం అకడెమిక్ ప్రతిష్ట, ఫ్యాకల్టీ–సూ్టడెంట్ నిష్పత్తి, రీసెర్చ్ ప్రభావం, అంతర్జాతీయ విద్యార్థుల భాగస్వామ్యం, గ్రాడ్యుయేట్ల ఉద్యోగావకాశాలు వంటి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. వరుసగా 14వ సంవత్సరం ‘ఎంఐటీ’టాప్.. అమెరికా కేంబ్రిడ్జిలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయంగా వరుసగా 14వ సంవత్సరం కూడా తొలి ర్యాంకు పొందింది. తరువాత.. ఇంపీరియల్ కాలేజ్ లండన్ రెండో స్థానంలో, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం మూడవ స్థానంలో ఉన్నాయి. జాబితాలో 192 విద్యాసంస్థలతో అత్యధిక ప్రాతినిధ్యం వహించే దేశంగా అమెరికా ఉంది. గత సంవత్సరం నుండి దాదాపు 500 విశ్వవిద్యాలయాలు తమ పనితీరును మెరుగుపరుచుకున్నాయి. వీటిలో మలేసియాలోని సన్వే యూనివర్సిటీ 120 స్థానాలకు పైగా తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. భారత్లో ఐఐటీ–ఢిల్లీ టాప్.. ఇక ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్న భారత్లోని 54 ఉన్నత విద్యాసంస్థల్లో 65.5 స్కోర్తో ఐఐటీ–ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 2025లో 150, 2024లో 197 ర్యాంకు నుంచి ఈ ఏడాది ప్రపంచంలో 123వ స్థానానికి చేరుకుంది. అకడమిక్ రెప్యుటేషన్లో 142వ స్థానంలో, ఫ్యాకలీ్టకి సైటేషన్స్లో 86వ స్థానంలో నిలిచింది. దేశంలోని ఇతర ఐఐటీలు, ప్రధాన వ ర్సిటీలూ ప్రభావవంతమైన ప్రదర్శన చేశాయి. ఐఐటీ హైదరాబాద్కు 664వ ర్యాంకు, వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ (విట్)కు 691వ ర్యాంకు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు 801–850 మధ్య ర్యాంకు, ఉస్మానియా యూనివర్సిటీ 1,201–1,400 మధ్య ర్యాంకులో నిలిచింది. అలాగే, ఐదు భారతీయ విశ్వవిద్యాలయాలు ఎంప్లాయర్ రెప్యుటేషన్ కోసం పోటీపడి ప్రపంచవ్యాప్తంగా టాప్–100లో స్థా నం సంపాదించాయి. అంతేకాక.. సగటున 43.7 స్కోరుతో 8 భారతీయ విద్యాసంస్థలు పరిశోధన ప్రభావం పరంగా సైటేషన్స్ ఫర్ ఫ్యాకల్టీలో టాప్–100లో స్థానం సంపాదించాయి. ఇక 2025లో ఉత్తమ భారతీయ విశ్వవిద్యాలయంగా ర్యాంకు పొంది గతేడాది 118వ స్థానంలో ఉన్న ఐఐటీ బాంబే, ఈ సంవత్సరం 129వ స్థానానికి పడిపోయింది. ఐఐటీ మద్రాస్ గతేడాదితో పోలిస్తే 47 స్థానాలు ఎగబాకి 180వ స్థానానికి చేరుకుంది. ఐఐటీ ఖరగ్పూర్ (215), ఐఐఎస్సీ బెంగళూరు (219), ఢిల్లీ వర్సిటీ (328).. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ (851–900), బిట్స్ పిలాని (668) వంటివి కూడా తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నాయి. ప్రపంచంలో భారత్కు 4వ స్థానం.. ఇదిలా ఉంటే.. ఈ సంవత్సరం భారత్ నుంచి ఎనిమిది కొత్త విద్యాసంస్థలు మొదటిసారిగా ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్నాయి. దీంతో జాబితాలో చోటు దక్కించుకున్న మొత్తం భారతీయ విద్యా సంస్థల సంఖ్య 54కి చేరుకుంది. అమెరికా (192), యూకే (90), చైనా (72) తర్వాత నాలుగో స్థానంలో భారత్ నిలిచింది. ఈ సంవత్సరం మరే దేశ విద్యా సంస్థలు కూడా ఇంత ఎక్కువ సంఖ్యలో క్యూఎస్ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకోలేదు. ఇక ఈ ఏడాది ఎనిమిది కొత్త విద్యా సంస్థలకు ర్యాంకులతో భారత్ తొలిస్థానంలో ఉండగా.. జోర్డాన్, అజర్బైజాన్ దేశాలు ఆరు కొత్త సంస్థలతో రెండో స్థానంలో ఉన్నాయి. ప్రధాని, కేంద్రమంత్రి హర్షం.. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ–2026 ర్యాంకింగ్స్లో భారత్ సాధించిన మైలురాయిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లు హర్షం వ్యక్తంచేశారు. ఈ ర్యాంకింగ్స్ మన విద్యా రంగానికి గొప్ప కీర్తిని తెస్తున్నాయని.. దేశ యువత ప్రయోజనం కోసం పరిశోధన, ఆవిష్కరణ, పర్యావరణ వ్యవస్థలను మరింతగా పెంచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ గురువారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అలాగే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ‘ఎక్స్’వేదికగా స్పందిస్తూ.. ‘2014లో కేవలం 11 భారత విద్యాసంస్థలు మాత్రమే ఈ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకోగా, ఇప్పుడా సంఖ్య అయిదింతలు పెరిగి 54కి చేరింది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్దంలో అమలుచేసిన విద్యా సంస్కరణల ఫలితం. అలాగే, నూతన విద్యా విధానం (ఎన్పీఈ)–2020 వల్ల ఇది సాధ్యమైంది. రికార్డు స్థాయిలో 54 సంస్థలు ఆ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకోవడం భారత విద్యావ్యవస్థలో సంభవించిన మార్పు, పురోగతికి నిదర్శనం. ఇది ఒక మార్పు మాత్రమే కాదు–ఒక విద్యా విప్లవం’అని తెలిపారు.

బనకచర్లను అడ్డుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు ప్రీఫీజబిలిటీ నివేదికను తిరస్కరించాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి విజ్ఞప్తి చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్–1980 (జీడబ్ల్యూడీటీ), ఏపీ పునర్విభజన చట్టం–2014లకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జల్శక్తి మంత్రి పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఇతర ఉన్నతాధికారులతో రేవంత్, ఉత్తమ్తోపాటు ఎంపీలు మల్లురవి, రఘువీర్ రెడ్డి, నీటి పారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం సమావేశమయ్యారు. బనకచర్ల అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళన నెలకొందని వివరించారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోందని.. జీడబ్ల్యూడీటీ–1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదన్నారు. 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటే ముందు ఆ నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జల్శక్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే అపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాలని, అయితే బనకచర్ల విషయంలో ఏపీ వీటన్నింటిని ఉల్లంఘిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, జల్శక్తి శాఖ తక్షణమే జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్ట్ ముందుకెళ్లకుండా చూడాలని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కోరారు.వరద నిజమైతే ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధానంపై చర్చిద్దాంసీడబ్ల్యూసీ పరిధిలోని సాంకేతిక సలహా మండలి నుంచి అనుమతులు పొందకుండానే వరద జలాల పేరుతో పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఏపీ చేపట్టిందని కేంద్ర మంత్రి పాటిల్కు రేవంత్, ఉత్తమ్ వివరించారు. గోదావరి అవార్డు ప్రకారం పోలవరం డిజైన్లు మార్పు చేసిందని, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడుతోందని, తాము అభ్యంతరాలు లేవనెత్తినా పనులు కొనసాగిస్తూనే ఉందని చెప్పారు. గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఏపీ భావిస్తుంటే పోలవరం–బనకచర్లకు బదులు, కేంద్రం నిధులు ఇచ్చే ఇచ్చంపల్లి–నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చకు తాము సిద్ధమని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాము ఎట్టిపరిస్థితుల్లో రాజీపడబోమని, అన్ని వేదికల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలిపారు. కేంద్రం స్పందన సానుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం స్పష్టం చేశారు.1,500 టీఎంసీలను వాడుకునేలా..» తెలంగాణకు గోదావరి నదిలో 1,000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు మొత్తంగా 1,500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జల్శక్తి శాఖ, ఏపీ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేయాలని, దానికి కేంద్రం ఆమోదం తెలపాలని సీఆర్ పాటిల్కు రేవంత్ విజ్ఞప్తి చేశారు. 1500 టీఎంసీల నీటితో కోటి న్నర ఎకరాలకు నీరు అందుతుందని, ఆ తర్వాత ఏపీ చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీ లిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.» ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతు ల ప్రక్రియలో సత్వరం స్పందిస్తూ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శించడం తగదని సీఎం రేవంత్ అన్నారు. ఈ వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య అపోహలు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయన్నా రు. పాలమూరు–రంగారెడ్డి, సమ్మక్క–సారక్క, తుమ్మిడి హెట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతోపాటు అన్ని రకా ల అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు.» గంగా, యమునా నదుల ప్రక్షాళనకు నిధులిచ్చినట్లే మూసీ పునరుజ్జీవానికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి పాటిల్కు రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Ahmedabad Plane Incident: ‘ఒక ఇంజిన్ను మార్చిలో చేంజ్ చేశాం..’
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనంతరం ఎయిర్లైన్స ఇండియాపై అపనమ్మకం ఎక్కువ కావడంతో ఆ సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విమాన మెయింటినెన్స్ పరంగా చూస్తే తమ నుంచి ఎటువంటి తప్పిదాలు లేకపోయినా ఆ ప్రమాదం జరగడం నిజంగా దురదృష్టకర పరిణామమన్నారు ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్బెల్ విల్సన్. ఈ మార్చి నెలలో ప్రమాదానికి గురైన విమానానికి కుడివైపున ఉన్న ఇంజిన్ను మార్చామన్నారు. అదే సమయంలో ఏప్రిల్లో ఎడమవైపు ఇంజిన్ను పరీక్షించామని స్పష్టం చేశారు. అయితే 2024 జూన్లో ఆ విమానానినికి మేజర్ ఇన్స్పెక్షన్ నిర్వహించామని, ఈ డిసెంబర్లో ఆ విమానాన్ని పూర్తి పర్యవేక్షణ అనేది షెడ్యూల్ చేయబడిందన్నారు. ఈ మేరకు సదరు ఎయిర్లైన్స్ సంస్థ లాయల్టీ ప్రొగ్రామ్ మహరాజా క్లబ్ సభ్యులకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేశారు క్యాంప్బెల్ విల్సన్. ఇక్కడ విమానం మెయింటినెన్స్ నిర్వహణలో ఎటువంటి లోపం జరగలేదని, పైలట్ల విషయంలో కూడా అపార అనుభవం ఉన్నవారే ఉన్నారన్నారు. ఆ విమానాన్ని నడిపన పైలట్, కో పైలట్లకు ఇద్దరికీ కలిపి 13,400 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉందన్నారు.
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

మంట కలిసిన మానవ సంబంధం
వరంగల్: ధన దాహం.. ఆస్తి పంపకాల్లో తేడాలతో రక్త సంబంధాలు మంట కలిసిపోతున్నాయి.. భూ వివాదంలో అన్నాదమ్ముళ్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హత్యకు దారితీసింది. సొంత త మ్ముళ్లు (పినతల్లి కుమారులు).. అన్నయ్య వల్లపు కృష్ణ(43)ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సీరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగయ్యకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య మాణిక్యమ్మకు ఒక కొడుకు కృష్ణ, ముగ్గురు కుమార్తెలు ప్రమీల, రమణ, వినోద ఉన్నారు. రెండవ భార్య నర్సమ్మకు ఇద్దరు కొడుకులు నరేశ్, మహేశ్ ఉన్నారు.లింగయ్యకు గ్రామ ప్రధాన రహదారికి ఆనుకుని 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొన్నేళ్ల క్రితం లింగయ్య తన ముగ్గురు కొడుకులకు, కూతురు రమణకు భూమి పట్టా చేయించాడు. కొన్నేళ్ల తర్వాత భూమి పంపకాలు చేశాడు. బిడ్డకు ఎందుకు పట్టా చేశావని రెండో భార్య కొడుకులు తండ్రితో గొడవ పడుతున్నారు. పలుమార్లు పంచాయితీలు, పోలీస్ స్టేషన్లో కేసుల దాకా వెళ్లింది. అయినా సమస్య పరి ష్కారం కాలేదు. ఈ క్రమంలో భూమి పంపకాల్లో రిజిస్ట్రేషన్ సర్వేనంబర్ ప్రకారం రెండో భార్య కొడుకుల్లో ఒకరు నరేశ్కు రోడ్డు వైపు వచ్చింది. కాగా, తండ్రి.. ముగ్గురు కుమారులకు రోడ్డువైపు సమానంగా ఉండేలా పంపకాలు చేశాడు. కానీ, నరేశ్ రిజిస్ట్రేషన్ ప్రకారం తనకు భాగం వచ్చిందంటూ తండ్రి చేసిన పంపకాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ పంచాయితీ ముదిరిపాకాన పడింది. కృష్ణ తన భార్య సత్యవతి, కుమారుడు మిన్ను, కుమార్తెతో కలిసి హైదరాబాద్లో బతుకుతున్నాడు. ఈ నెల 17న (మంగళవారం) హైదరాబాద్ నుంచి సీరోలుకు వచ్చాడు. బుధవారం ఉదయం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. ముందస్తు పథకం ప్రకారం తమ్ముళ్లు నరేశ్, మహేశ్, వారి భార్యలు, కాంపలి్లకి చెందిన నున్న వీరన్న(నరేశ్ బావమరిది) కలిసి వ్యవసాయ భూమి వద్ద కృష్ణతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న తండ్రి లింగయ్య అక్కడికి చేరుకున్నాడు. గొడవ ముదరడం, తండ్రి గొడవను ఆపే యత్నం చేశారు. అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో నరేశ్ తన అన్న కృష్ణ కుడి మెడపై నరికాడు. ఆపే యత్నం చేస్తున్న తండ్రికి సైతం గాయాలయ్యాయి. కృష్ణ రక్తమడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలియడంతో సీరోలు ఎస్సై నగేశ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, తండ్రి లింగయ్యను చికిత్స నిమిత్తం వెంటనే మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మరిపెడ సీఐ రాజ్కుమార్ సీరోలుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, నిందితుడు నరేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కొడుకు పుట్టిన రోజే తండ్రి మరణం..మృతుడు వల్లపు కృష్ణ కొడుకు మిన్ను పుట్టిన రోజు బుధవారం. సాయంత్రం వేడుకలు చేద్దామని అనుకున్న తరుణంలో ఈ హత్య జరగడంతో ఆ కుటుంబాన్ని కుంగదీసింది.

ప్రియుడే కాలయముడు?
విశాఖపట్నం: భీమిలి కృష్ణా కాలనీకి చెందిన బంగారు కవిత మృతి కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. భీమిలి బీచ్రోడ్డు సమీపంలోని జీడి తోటలో బంగారు కవిత మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. ఆమె ప్రియుడే కవితను కిరాతకంగా హత్య చేసి.. నెల రోజులుగా ఏమీ ఎరుగనట్టు నాటకమాడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. క్రైమ్ సినిమా కథను తలపించేలా సాగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలివి.. కృష్ణా కాలనీకి చెందిన బంగారు కవితకు, భీమిలికి చెందిన పారిశుధ్య కార్మికుడు బొడ్డు రాజుతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే గత కొంతకాలంగా వారిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి, తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కవితను అడ్డు తొలగించుకోవాలని రాజు నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం మాట్లాడదామనే నెపంతో గత నెలలో ఆమెను బీచ్రోడ్డు సమీపంలోని ఎర్రమట్టి దిబ్బల వద్దకు పిలిపించాడు. అక్కడికి వచ్చిన ఆమెపై రాయితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పక్కనే ఉన్న జీడి తోటలోకి తీసుకెళ్లి, ఒక చెట్టు కొమ్మకు వేలాడదీసి వచ్చేశాడు. ఆ తర్వాత రాజు ఏమీ తెలియనట్టు అందరితో కలిసి తిరుగుతూ, పోలీసులను సైతం తప్పుదోవ పట్టించాడు. కవిత కనబడటం లేదని ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానంతో రాజును పలుమార్లు విచారించారు. అయినప్పటికీ తనకు ఏమీ తెలియదని నమ్మబలుకుతూ దర్యాప్తును పక్కదారి పట్టించాడు. అయితే కవిత మృతదేహం లభ్యమైన తర్వాత పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. పక్కా ఆధారాలతో బొడ్డు రాజును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అతడు చేసిన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఒక వైపు దారుణ హత్యకు పాల్పడి, మరో వైపు నెలరోజుల పాటు అందరినీ నమ్మించిన రాజు తీరుపై పోలీసులు, స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

పీక్స్కు టీడీపీ ఫేక్ ప్రచారం
ప్రత్తిపాడు/నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దుష్ప్రచారంలో టీడీపీ చెలరేగిపోతోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న రహదారిలో ఓ రోడ్డు ప్రమాదం జరిగితే, దాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెట్టి పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోంది. బుధవారం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు సమీపంలో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన ప్లంబర్ చీలి సింగయ్య (53)ను టాటా సఫారీ (ఏపీ 26 సిఈ 0001) వాహనం ఢీకొంది. దీని వెనుక చాలా దూరంలో జగన్ కాన్వాయ్ వస్తోంది. ఇదే అదునుగా పచ్చ మీడియా రెచ్చిపోయింది.ఈ ప్రమాదాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగింది. అంతటితో ఆగక టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతాలోనూ పోస్ట్ చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ స్పష్టత ఇచ్చారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠితో కలిసి మధ్యాహ్నం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గుంటూరు ఏటుకూరు రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు, దానికంటే 50 మీటర్ల ముందు టాటా సఫారీ వాహనం తగిలి వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) గాయపడ్డాడు. అతన్ని 108 అంబులెన్స్లో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అయితే అప్పటికే సింగయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు’ అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామన్నారు.కాగా, సింగయ్య ప్రమాదం బారిన పడటాన్ని గమనించిన వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయన్ను రోడ్డు పక్కకు తీసుకొచ్చారు. సింగయ్యకు భార్య లూర్థు మేరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వాస్తవం ఏమిటో తెలిశాక కూడా టీడీపీ ట్విటర్ ఖాతా నుంచి ఆ తప్పుడు పోస్టును తొలగించకపోవడం గమనార్హం.

మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి ఎన్కౌంటర్
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సాక్షి, పాడేరు : ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవా రుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కీలక నేతలు సహా ము గ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కింటుకూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్ బల గాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మావోయి స్టుల కు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకు న్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్, అలి యాస్ బిర్సు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, ఏఓబీ జోనల్ కమిటీ ఏరియా కమిటీ సభ్యురాలు అంజు మరణించారు. వీరిలో రవి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం. అరుణ ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్య. ఈమెది విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. గాజర్ల రవి, అరుణపై పోలీస్ రివార్డులున్నాయి. మావో యిస్టులకు సంబంధించిన పలు కీలక సంఘటనల్లో వీరు పాల్గొన్నట్లు పోలీస్ కేసులు నమోదయ్యాయి. అంజుది ఛత్తీ స్గఢ్ అని తెలిసింది. కాగా సంఘటన స్థలంలో పలు ఏకే–47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సేఫ్జోన్ అని..: ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యాన్ని పోలీస్ బలగాలు జల్లెడపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరు స ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో పాపికొండలు, అభయార ణ్యంలోని కొండమొదలు, కింటుకూరు ప్రాంతాలను సేఫ్జోన్గా భావించిన మావోయిస్టులు ఇక్కడకు వచ్చినట్లు భావిస్తున్నారు. సుమారు ఆరునెలల క్రితమే పది మంది మావోయిస్టులు కింటుకూరు అటవీ ప్రాంతానికి వచ్చినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలో నెలరోజుల క్రితం వై. రామవరం–కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.అరుణ అలియాస్ అరుణక్క..వెంకటలక్ష్మి చైతన్య అలియాస్ అరుణ, అలియాస్ అరుణక్క (55) మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు. 20 ఏళ్ల వయస్సు లోనే మావోయిస్టు ఉద్యమం బాటపట్టారు. అమె తమ్ముడు గోపి అలియాస్ ఆజాద్ కూడా 2006లో అక్క మార్గంలోనే ఉద్యమంలో చేరాడు. 2016లో జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్ మృతిచెందారు. అరుణక్క మావోయిస్టు పార్టీలో ఏఓబీ స్పెష ల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉంటూ మహిళా విభాగాల్లో 30 ఏళ్లుగా కీలకంగా వ్యవహరించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి భార్య చనిపోవడంతో అరుణక్కను రెండో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవ రిలో ఒడిశా–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చలప తి మరణించారు. భర్త మరణంతో అరుణ కుంగిపోలేదు. అనేక ఎన్కౌంటర్ల నుంచి ఆమె తప్పించుకున్నారు. పోలీసుల నిర్బంధం తీవ్రంగా ఉండడంతో ఇటీవల కాలంలో రంపచోడ వరం అటవీ ప్రాంతాన్ని సేఫ్జోన్గా మార్చుకుని తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఆరుగురు మావోయిస్టులు భద్ర త ఉన్నప్పటికీ ఎన్కౌంటర్లో బలయ్యారు. ఆమెకు భద్రతగా ఉన్న అంజూ కూడా మృతిచెందారు. ఇక అరుణక్కపై ఏపీలో రూ. 20 లక్షల రివార్డు ఉంది. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసిన ఘటనలో అరుణక్క పాల్గొన్నట్లు పోలీసులు కేసు నమోదుచేశారు. కొద్ది రోజుల క్రితమే పట్టుకుని..నా కుమార్తెను పోలీసులు కొద్ది రోజుల క్రితమే పట్టుకుని బంధించి ఇప్పుడు హతమార్చారు. దీన్ని ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నాం. గతంలో నా కుమారుడు ఆజాద్ను బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం .– లక్ష్మణరావు, అరుణక్క తండ్రిఅగ్రనేతగా ఎదిగి.. శాంతి చర్చల్లో పాల్గొని..సాక్షి ప్రతినిధి, వరంగల్/టేకుమట్ల: మావోయిస్టు అగ్రనేత, శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్ మృతితో ఆయన స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాడిక ల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) నుంచి అజ్ఞాతవాసంలోకి వెళ్లిన రవి.. దళ సభ్యుడిగా మొదలు పెట్టి కేంద్ర కమిటీ వరకు ఎదిగారు. విద్యార్థి దశనుంచే ఉద్యమాలపై ఆసక్తితో విప్లవాల బాట పట్టారు. 1985–86 సంవత్సరంలో వరంగల్లోని ఐటీఐలో చదువుతున్న క్రమంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై ఆర్ఎస్యూలో పనిచేశారు. తన అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ అప్పటికే ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండటంతో ఆ ప్రభావం రవిపై పడింది. 1992లో పూర్తిస్థాయిలో ఉద్యమంలోకి వెళ్లారు. 1994–98 మధ్య ఏటూరునాగారం దళ సభ్యుడిగా, మహాదేవ పూర్లో కమాండర్గా పని చేశారు. 1994లో లెంకలగడ్డలో మందుపాతర పేల్చి ఏడుగురు పోలీసులను చంపిన కేసులో నిందితుడిగా ఉన్నారు. 1998లో ఎన్టీఎస్జెడ్సీ సభ్యుడిగా నియమితుల య్యారు. 2000 సంవత్సరంలో ఖమ్మం – కరీంనగర్ – వరంగల్ (కేకే డబ్ల్యూ) కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2001లో ఏటూరునాగారం పోలీస్ స్టేషన్పై జరిగిన దాడిలో పాల్గొన్నట్టు సమాచారం ఉంది. 2002 సంవత్సరంలో మహాదేవపూర్ కమాండర్గా పనిచేస్తున్న స్వరూప అలియాస్ జిలానీ బేగంను వివాహం చేసుకోగా ఆమె ఏవోబీలోని రామగూడలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయింది. 2007లో ఆంధ్ర ఒడిశా బోర్డర్కు బదిలీ అయిన రవి.. అక్కడ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతూనే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శాంతి చర్చల ఎజెండా రూపకల్పనలో కీలకపాత్రగాజర్ల రవి 2004లో శాంతి చర్చల ప్రతినిధిగా వ్యవహరించారు. కాల్పుల విరమణ, శాంతి చర్చల కు మేధావులు జరిపిన సంప్రదింపులకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు చర్చల ప్రతినిధులుగా జనశక్తి పార్టీ నుంచి వెంకటేశ్ అలియాస్ రియాజ్, మావోయిస్టు పార్టీ నుంచి అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గౌతమ్ అలియాస్ సుధాకర్లతో పాటు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో గాజర్ల రవి కూడా పాల్గొన్నారు. శాంతి చర్చల ఎజెండాను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. రవి అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ (మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ సభ్యుడు) 2008 ఏప్రిల్ 2న ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందగా, ఆయన తమ్ముడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉంటూ అనారోగ్యంతో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.రవి మృతిపై జిల్లా పోలీసులు బుధవారం మధ్యాహ్నం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వెలిశాలకు తీసుకువచ్చి గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎన్కౌంటర్పై అనుమానాలు.. నా సోదరుడి మరణంపై అనుమానాలున్నాయి. ఇప్పటివరకు మృతదేహాల ఫొటోలను విడుదల చేయలేదు. పోలీసులు మృతుల కుటుంబసభ్యులకు మధ్యాహ్నం వరకు సమాచారమివ్వలేదు. ఇది ఎన్కౌంటరో?.. పట్టుకుని కాల్చి చంపారో? ఏదైనా విష ప్రయోగం చేసి ఉండొచ్చు. – మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్