ప్రధాన వార్తలు

చెట్టునే నరకనా... మెడ కోసుకోనా?
ఆంధ్రప్రదేశ్లోని తోతాపురి మామిడి రైతుల హాహాకారాలు ఆ రాష్ట్ర సరిహద్దుల్ని దాటి ప్రతిధ్వనిస్తున్నాయి. కిలోకు పన్నెండు రూపాయలు కనీస ధరగా నిర్ణయించిన ప్రభుత్వం కార్యాచరణపై మాత్రం ముసుగేసింది. ఫలితంగా రెండు రూపాయలకు కూడా కొనే నాథుడు లేక రైతులు మామిడి కాయల్ని రోడ్లపై పారబోస్తున్న దృశ్యాలు దర్శనమిచ్చాయి. పారబోయడానికి మనసొప్పని రైతులు రవాణా ఖర్చులు వచ్చినా చాలని హైదరాబాద్ వంటి దూర ప్రాంత మార్కెట్లకు తరలించిన ఉదంతాలు కోకొల్లలు. తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోతున్న ఈ పరిస్థితుల్లో పసిబిడ్డల్లా పెంచుకున్న చెట్లను నరికేయాలో, చేతిలో వున్న కొడవలితో మెడనే నరుక్కోవాలో అర్థం కావడం లేదంటూ ఒక రైతు వాట్సప్లో పెట్టిన మెసేజ్ కంటతడి పెట్టించింది.ఇదొక్క మామిడి రైతుల ఆక్రందనే కాదు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రైతులందరి ఉమ్మడి ఆవేదన ఇదే. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు క్వింటాల్కు 24 వేలు పలికిన ధర ఇప్పుడు గరిష్ఠంగా ఏడు వేలు దాటకపోవడంతో మిర్చి రైతు కుదేలయ్యాడు. పత్తి ధర పదివేల నుంచి ఐదు వేలకు అంటే సగానికి సగం పడిపోయింది. అప్పుడు 18 వేల దాకా దక్కించుకున్న పొగాకు ఇప్పుడు గరిష్ఠంగా 6 వేలకు పడిపోయింది. పసుపు, కందులు, మినుములు, వేరుశనగ, మొక్కజొన్న, పెసలు, ఉల్లిపాయలు, టమాటా, మామిడిపళ్ళు, అరటి, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ వగైరా వ్యవసాయ ఉత్పత్తుల ధరలన్నీ సగానికి పడిపోయాయి. ఆనాటి జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ధరలు పతనమవకుండా మార్కెట్లో జోక్యం చేసుకునే విధానాన్ని అవలంబించడం సత్ఫలితాలనిచ్చి మంచి ధరలు లభించాయి. రైతన్నకు దరహాసాన్నిచ్చాయి.చంద్రబాబు ప్రభుత్వం ఆ బాధ్యతను వదిలేసింది. మొత్తంగా వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు ఈ ప్రభుత్వం కాడి పారేసింది. జగన్మోహన్రెడ్డి ఇస్తున్న రైతు భరోసా కంటే అధికంగా ఇస్తానని హామీ ఇచ్చి వరసగా రెండో యేడు కూడా ఎగనామం పెట్టింది. వ్యవసాయ రంగం ఈ ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో లేదు. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని అడిగి తెచ్చుకొని తన కమీషన్ల ప్రాధాన్యాన్ని ఆ ప్రభుత్వం చాటి చెప్పుకున్నది. రెండోసారి అదే ప్రాధాన్యతను అమరావతి రూపంలో నిలబెట్టుకొన్నది. క్వాంటమ్ వ్యాలీ, డీప్ టెక్నాలజీ, ఏఐ వగైరాలన్నీ అమరావతి హైప్ కోసం కైపెక్కించడం తప్ప ఆచరణాత్మకమైన మాటలు కావనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. క్వాంటమ్ వ్యాలీకి అవసరమయ్యే ఎకో సిస్టమ్ అమరావతికి అందుబాటులోకి రావడమనేది ఒక సుదూర స్వప్నమే తప్ప ప్రభుత్వం చెబుతున్నట్టు ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించే స్థితి అసంభవమని నిపుణులు చెబుతున్నారు. మధ్యతరగతిని మభ్యపెట్టడానికి యువతకు జోల పాడటానికి ఇటువంటి పదజాలాన్ని వెదజల్లడం బాబు కాకస్కు వెన్నతో పెట్టిన విద్య. ఈ జోలపాటల మాటున అమరావతిలో జరుగుతున్న అసలు కార్యక్రమమేమిటో చాలామందికి అర్థమైంది. అమరావతి పేరుతో ఇప్పటికే తెచ్చిన అప్పులే కాదు, ఇంకా అవసరమైన అప్పులు తీర్చడానికి భూములు అమ్ముతామనీ, అదో సెల్ఫ్ ఫైనాన్స్ కేపిటలనీ చెబుతూ వచ్చారు. తొలుత సమీకరించిన భూముల్లో రైతుల వాటా తీసేయగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు పోనూ మిగిలిన భూముల అమ్మకంతో తెచ్చిన అప్పులు తీర్చడం సాధ్యం కాదనే మాట వినిపిస్తున్నది. ఈ తత్వం బోధపడినందువల్లనే ప్రపంచ బ్యాంకు వాళ్లు ఈ మధ్య ప్రభుత్వానికి తాఖీదులు పంపారట! మీరు అమ్మబోయే భూములెన్ని? ఎప్పటిలోగా అమ్ముతారు? వాటి ద్వారా ఎంత డబ్బు సమీకరిస్తారో చెప్పండని వారు అడుగుతున్నారని సమాచారం.ఇప్పుడు కొత్తగా 45 వేల ఎకరాల భూసేకరణ ప్రయత్నాలకు రైతులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వంలో కలవరం మొదలైనట్టు కనిపిస్తున్నది. కాకస్ పరంగా ఎంత సంపాదించుకున్నా ప్రభుత్వపరంగా మాత్రం అమరావతి ప్రాజెక్టు ఒక నిరర్థక ఆస్తిగానే మిగిలిపోయే ప్రమాదముందనే హెచ్చరికలు వినబడుతున్నాయి. పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ఈ మధ్యకాలంలో బాబు ప్రభుత్వం చేస్తున్న హడావుడి కూడా కమీషన్ల స్టార్టప్ కథేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 80 వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో గేమ్ ఛేంజర్ కాబోతున్నదని ఆయన చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికలో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది పూర్తయితే ఏడు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకూ, ఇంకో 23 లక్షల ఎకరాల స్థిరీకరణకూ ఉపయోగపడుతుంది. జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించి చాలావరకు పూర్తయి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇంకో 14 వేల కోట్లు సరిపోతుందనీ, ఈ పని చేస్తే కూడా అంత ఆయకట్టు అందుబాటులోకి వస్తుందనీ చెబుతున్నారు.అటువంటప్పుడు ఏది తొలి ప్రాధాన్యత కావాలి? 14 వేల కోట్లతో పెండింగ్ పనులు పూర్తి చేయడమా? 80 వేల కోట్లతో కొత్త ప్రాజెక్టును తలకెత్తుకోవడమా? గోదావరి వరద జలాలను ఉపయోగించుకోవాలన్న ఆలోచన ఆ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అవసరమే కావచ్చు. ఈ ఆలోచన కూడా వాస్తవానికి గత ప్రభుత్వంలో వచ్చినదే. కానీ సత్వరం పూర్తి కావలసిన ప్రాజెక్టులకు పైసా విదల్చకుండా చేపట్టిన ఈ నిర్హేతుకమైన ప్రాధాన్యతాక్రమం దేన్ని సూచిస్తుంది? భారీ ప్రాజెక్టుతో భారీ కమీషన్ల దురాశతోనే ఈ రకమైన ఎంపిక చేసుకున్నారంటే తప్పవుతుందా? రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర ఇప్పించలేకపోయిన ప్రభుత్వం, ఉన్న ఊరిలోనే కల్తీలేని విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తెస్తున్న ఆర్బీకేలను మూసి పారేసిన ప్రభుత్వం రైతన్నల కన్నీరు తుడవడానికి భారీ ప్రాజెక్టులను సంకల్పించిందంటే నమ్మశక్యమేనా?ఆలూ లేదు, చూలూ లేదు అన్నట్టుగా బాబు ఈ ప్రాజెక్టును పూర్తిచేసే అవకాశమే లేనప్పటికీ దీనిపై తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు సిగపట్లకు దిగడం ఒక విశేషం. చంద్రబాబుతో సాన్నిహిత్యం కారణంగానే ఆయన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదని బీఆర్ఎస్ ఆరోపించింది. దీనిపై గత కొన్ని వారాలుగా తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ పంచాయితీలో బీఆర్ఎస్ వాదానిదే పైచేయిగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి ఇతరత్రా కారణాలు కూడా కొన్ని దోహదపడి ఉండవచ్చు. ప్రెస్మీట్లలో కాదు, అసెంబ్లీలో చర్చిద్దాం రండని తాజాగా కాంగ్రెస్ మంత్రులు సవాల్ విసురుతున్నారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ప్రాజెక్టునూ పూర్తిచేసిన రికార్డు లేని చంద్రబాబు చిటికెల పందిరిని ఆంధ్ర ప్రజలెవరూ పట్టించుకోకపోయినా తెలంగాణలో అది మంట పుట్టించడం విశేషం.ఒకపక్క అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల రూపంలో భారతీయ రైతును బలిపీఠమెక్కించే సూచనలు పొడసూపుతున్నాయి. వాణిజ్య ఒప్పందం కోసం అమెరికా విధించిన మూడు మాసాల గడువు ఈ నెల తొమ్మిదో తేదీతో ముగిసిపోనున్నది. ఈలోగా భారత్తో కనీసం మినీ ఒప్పందమైనా జరగాలని ట్రంప్ పట్టుపడుతున్నారు. రెండు దేశాల ప్రతినిధుల మధ్య గత వారం రోజులుగా చర్చోపచర్చలు జరుగున్నాయి. జన్యుమార్పిడి సోయాచిక్కుడు, మొక్కజొన్నలను, యాపిల్స్ను, డెయిరీ ఉత్పత్తులను తక్కువ సుంకాలతో భారత మార్కెట్లోకి అనుమతించాలని అమెరికా డిమాండ్ చేస్తున్నది. వందల ఎకరాల భారీ కమతాల్లో పూర్తిగా యంత్రాల సాయంతో, దాదాపు యాభై శాతం సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం దన్నుతో చౌకగా వచ్చే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు తక్కువ సుంకాలతోనే మళ్లీ మార్కెట్లోకి ప్రవేశిస్తే భారతీయ రైతు తట్టుకోగలడా? పైగా భారతీయ వ్యవసాయ రంగంలోకి, ఫుడ్ చెయిన్లోకి జన్యుమార్పిడి ఉత్పత్తులను అనుమతించకపోవడం భారత్ విధానంగా ఉంటూ వస్తున్నది. ఫుడ్ చెయిన్ పరిధిలోకి రాదనే కారణంతో పత్తిలోకి ఇప్పటికే జన్యుమార్పిడి విత్తనాలు ప్రవేశించాయి. రేపోమాపో కుదరనున్న మినీ వాణిజ్యం ఒప్పందంతో ఏం జరగనున్నదని దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. అమెరికా విధించే గడువుకంటే తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఇంటర్వ్యూలో వాణిజ్య–పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఘంటాపథంగా చెప్పారు. శనివారం నాటి పత్రికలో వచ్చిన ఈ ఇంటర్వ్యూలో ‘మన వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే ఎటువంటి ఒప్పందాన్ని చేసుకోబోమ’ని ఆయన చెప్పారు. మొక్కజొన్న ఉత్పత్తిలో టాప్ ఫైవ్లో ఉన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ట్రంప్ ప్రతిపాదనలు అంగీకరించడం బీజేపీకి కూడా ఆత్మహత్యా సదృశమే.వాణిజ్య చర్చల్లో పాల్గొంటున్న అధికారుల భోగట్టాగా పేర్కొంటూ బ్లూమ్బర్గ్ లాంటి వార్తా సంస్థలు మరో కథనాన్ని చెబుతున్నాయి. కేవలం పశువుల దాణా కోసం, పౌల్ట్రీ దాణా కోసం ఉపయోగపడే విధంగా మొక్కజొన్న, సోయా చిక్కుళ్ల ఉప ఉత్పత్తులను అనుమతించే మినీ ఒప్పందం కుదిరే అవకాశముందని ఈ కథనాల సారాంశం. మినీ రవ్వ రూపంలో వచ్చినంత మాత్రాన అది జన్యుమార్పిడి పంట కాకుండా పోతుందా? పశువుల దాణా, కోళ్ల దాణాలోకి ప్రవేశిస్తే అది ఫుడ్ చెయిన్లో భాగం కాకుండా పోతుందా అనేవి చర్చనీయాంశాలు. రెండుమూడు రోజుల్లో జరిగే మినీ ఒప్పందం అనంతరం, మూడు నాలుగు నెలల్లో జరిగే పూర్తి స్థాయి ఒప్పందం అనంతరం మాత్రమే ఈ అంశంపై ఒక స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికి దాణా రూపంలో ప్రవేశించినా, ఒంటె గుడారంలోకి కాళ్లు జాపితే ఏం జరుగుతుందో భవిష్యత్తులో అదే జరుగుతుంది. చంద్రబాబు వంటి వ్యవసాయ వ్యతిరేక విధానాలు అనుసరించే పాలకుల కారణంగా పాతికేళ్ల కిందటే మన రైతులు ఉరితాళ్లు పేనుకున్నారు. ఇప్పుడు కొడవళ్లు మెడపైకి చేర్చుకుంటున్నారు. భవిష్యత్తులో అమెరికా జన్యుమార్పిడి పంట ఉత్పత్తులు భారత మార్కెట్లోకి ప్రవేశిస్తే వ్యవసాయం దండగన్న బాబు జోస్యం నిజమవుతుంది. ఈ విషయంలో నిజంగానే ఆయన విజనరీగా నిలబడిపోతారు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

పాలిసెట్ డేటా ఎరేజ్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాంకేతిక విద్య విభాగంలో గందరగోళం నెలకొంది. పాలిసెట్ సీట్ల కేటాయింపు ఆగిపోయింది. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియని స్థితి ఏర్పడింది. విషయం తెలుసుకునేందుకు మీడియా శనివారం రాత్రి వరకూ ప్రయత్నించినా అధికారులెవరూ అందుబాటులోకి రాలేదు. కిందిస్థాయి సిబ్బంది కూడా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు మాత్రం సాఫ్ట్వేర్లో ఏదో సమస్య వచ్చిందని తెలిపారు. మరికొందరు వెబ్సైట్లో విద్యార్థుల డేటా మొత్తం ఎగిరిపోయిందని చెప్పారు. తాము చెప్పినట్టు ఎవరికీ చెప్పొద్దంటూ వారు వేడుకున్నారు. దీన్నిబట్టి సరిదిద్దలేని తప్పులేవో సాంకేతిక విద్య విభాగంలో జరిగినట్టు తెలుస్తోంది. పాలిసెట్ సీట్ల కేటాయింపు ఏమైంది? పాలిసెట్ సీట్ల కేటాయింపు ఈ నెల 4వ తేదీనే ఉంటుందని కౌన్సెలింగ్ షెడ్యూల్లో సాంకేతిక విద్యా మండలి ప్రకటించింది. కానీ 4వ తేదీ రాత్రివరకూ ప్రకటించలేదు. కౌన్సెలింగ్ క్యాంపు అధికారులను వివరణ కోరితే పాలనాపరమైన అనుమతులు రావాల్సి ఉందని ఒకసారి, ఫీజు రీయింబర్స్మెంట్పై స్పష్టత రావాల్సి ఉందని మరోసారి బదులిచ్చారు. శనివారం ఉదయమే సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. పాలిటెక్నిక్ సీట్ల కోసం దాదాపు 22 వేల మంది ఎదురు చూస్తున్నారు. శనివారం రాత్రివరకు సీట్లు ఖరారు చేయలేదు. దీనిపై అధికారులు స్పందించడం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వేల మంది విద్యార్థుల డేటా తారుమారైనట్టు తెలిసింది. సర్వర్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు సమాచారం. విద్యార్థులు వెబ్సైట్లో పెట్టిన ఆప్షన్లు మొత్తం మారిపోయినట్టు తెలిసింది. దీనిపై సిబ్బంది, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం, ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సమస్య మరింత జటిలమైందని తెలియవచ్చింది. సిబ్బంది అజాగ్రత్తే దీనికి కారణమని తెలుస్తోంది. దీనివల్లే సీట్ల కేటాయింపు ఆగిపోయినట్టు సమాచారం. ఇంజనీరింగ్ కథేంటి? ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు ఆదివారం నుంచి మొదలవ్వాలి. అన్ని యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు కాలేజీలు, సీట్లు, కోర్సుల వివరాలను ప్రభుత్వానికి పంపాయి. ఎక్కువ ప్రైవేటు కాలేజీలున్న జేఎన్టీయూహెచ్ కూడా శనివారం మధ్యాహ్నం గుర్తింపు వివరాలన్నీ సాంకేతిక విద్యా మండలి కార్యాలయానికి పంపింది. వీటిని అప్లోడ్ చేస్తేనే విద్యార్థులు ఆదివారం ఉదయం నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి వీలుంటుంది. కానీ, శనివారం రాత్రి పొద్దుపోయే వరకు ఈ ప్రక్రియ పూర్తవ్వకపోవడంతో అసలు వెబ్ ఆప్షన్లు ఉంటాయా? షెడ్యూల్ను అనుసరిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక విద్య ఉన్నతాధికారి, ఎప్సెట్ క్యాంప్ అధికారి, జేఎన్టీయూహెచ్ రిజి్రస్టార్ శనివారం ఉదయం 11 గంటల నుంచే విద్యాశాఖ కార్యదర్శి వద్ద సమావేశమయ్యారు. పాలిసెట్ డేటా గందరగోళం అవ్వడంపై కొంత సీరియస్గానే చర్చ జరిగినట్టు తెలిసింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్పై గంటల తరబడి చర్చించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత శనివారం రాత్రి ముఖ్యమంత్రి నివాసానికి అధికారులు వెళ్లి చాలా సమయం చర్చించడంతో అసలేం జరుగుతోందనే ఆసక్తి నెలకొంది.

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆసక్తికర సమాచారం నిరుద్యోగులను ఉత్సాహపరుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. సోదరులు కొంత సహాయం అందిస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఊపిరిపీల్చుకుంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మందగించినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలించి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం మ«ధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నలుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.వృషభం...వీరికి మిశ్రమంగా ఉంటుంది. పనులు కొన్ని శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నా అవసరాలకు లోటు ఉండదు. సన్నిహితులతో వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు విజయాల బాటలో పయనిస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. ముఖ్య వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇష్టంలేకున్నా కొన్ని మార్పులు తప్పదు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా సాగవు. గులాబీ, తెలుపు రంగులు. దుర్గాదేవిని ఆరాధించండి.మిథునం...ఎంతటి వ్యవహారమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. ఆ తరువాత కొంత మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. ప్రముఖులు పరిచయం కాగలరు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు అనుకోని పిలుపు రావచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.కర్కాటకం...కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు అన్నింటా అనుకూలమే. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. విష్ణుధ్యానం చేయండి.సింహం...బంధువులు, మిత్రుల సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో మానసిక అశాంతి. అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.కన్య....ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. శ్రమ మరింత పెరిగి సహనాన్ని పరీక్షిస్తుంది. విద్యార్థులు మరింత కృషి చేస్తే ఫలితం కనిపిస్తుంది. సోదరులు, మిత్రులతో అకారణంగా విరోధాలు. అనుకున్న పనుల్లో ప్రతిబ«ంధకాలు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వివాహ, ఉద్యోగయత్నాలు నిదానంగా కొనసాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. గృహ నిర్మాణాలపై నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు నెమ్మదిగా సాగి స్వల్పలాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. పారిశ్రామికవర్గాలకు లేనిపోని చిక్కులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. విందువినోదాలు. గులాబీ, ఎరుపు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.తుల...ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వాహనయోగం. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు సఫలమవుతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.వృశ్చికం...కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధువులు, మిత్రులు చేదోడుగా నిలుస్తారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది. సమస్యలు కొన్ని ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. వాహన, గృహయోగాలు కలుగవచ్చు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. కొద్దిపాటి ఆరోగ్యసమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఇంటాబయటా గౌరవమర్యాదలకు లోటు ఉండదు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, నీలం రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.ధనుస్సు...నేర్పుగా కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల హడావిడి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం. వ్యాపార లావాదేవీలు మరింత ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకునే సమయం. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.మకరం...ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం. విద్యార్థులు, నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. యుక్తి, నేర్పుతో క్లిష్టమైన వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం చివరిలో ఆరోగ్య, కుటుంబసమస్యలు. అనుకోని ధనవ్యయం. బంగారు, తెలుపు రంగులు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.కుంభం...కొన్ని ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. బంధువులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ప్రముఖులు మాటసహాయం అందిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. బాకీలు సైతం వసూలై ఆర్థికంగా బలపడతారు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి. రాజకీయవర్గాలకు మరింత సానుకూలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, గులాబీ రంగులు. వినాయక స్తోత్రాలు పఠించండి.మీనం...ప్రారంభంలో కొన్ని సమస్యలు, వివాదాలు తప్పకపోవచ్చు. అయితే పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సోదరులు, మిత్రుల సహాయం కోరతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి సంగతులు గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహ వేడుకలకు హాజరవుతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో మీ హోదాలు నిలుపుకుంటారు. కళారంగం వారి సేవలకు గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువిరోధాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కెమికల్స్ దిగ్గజంగా భారత్!!
న్యూఢిల్లీ: దేశీయంగా ప్రపంచ స్థాయి కెమికల్ హబ్స్ను నెలకొల్పడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్ ఒక నివేదికలో సూచించింది. అలాగే అత్యధిక సామర్థ్యాలుండే ఎనిమిది పోర్ట్–ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అప్పుడే గ్లోబల్ కెమికల్ తయారీ దిగ్గజంగా భారత్ ఎదగగలదని పేర్కొంది. ‘‘రసాయనాల పరిశ్రమ: అంతర్జాతీయ వేల్యూ చెయిన్లో (జీవీసీ) భారత భాగస్వామ్యానికి దన్ను’’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వివరించింది. 2040 నాటికి భారత్ 1 లక్ష కోట్ల డాలర్ల రసాయనాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. నివేదిక ప్రకారం.. 2023లో జీవీసీలో 3.5 శాతంగా ఉన్న భారత్ వాటా 2040 నాటికి 5–6 శాతానికి పెరగనుందని, 2030 నాటికి అదనంగా 7 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని వివరించింది. గ్లోబల్ కెమికల్ వేల్యూ చెయిన్లో భారత్ వాటా 3.5 శాతమే ఉండటం, 2023లో రసాయనాల వాణిజ్య లోటు 31 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండటమనేది ముడి సరుకు, ఇతరత్రా స్పెషాలిటీ రసాయనాల కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తున్న విషయాన్ని తెలియజేస్తోందని రిపోర్ట్ పేర్కొంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → సమగ్ర ఆర్థిక, ఆర్థికేతర సంస్కరణలు అమలు చేస్తే భారత రసాయనాల పరిశ్రమ 2040 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరేందుకు, జీవీసీలో వాటాను 12 శాతానికి పెంచుకునేందుకు దోహదపడుతుంది. తద్వారా శక్తివంతమైన గ్లోబల్ కెమికల్ కేంద్రంగా భారత్ ఎదగవచ్చు. → కేంద్ర స్థాయిలో ఒక సాధికారిక కమిటీని వేయాలి. ఉమ్మడిగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, వీజీఎఫ్ మొదలైన వాటి కోసం బడ్జెట్ కేటాయింపులతో సాధికారిక కమిటీ కింద కెమికల్ ఫండ్ ఏర్పాటు చేయాలి. హబ్ స్థాయిలోని అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం, మొత్తం హబ్ నిర్వహణను పర్యవేక్షించాలి. → పోర్టుల్లో రసాయనాల ట్రేడింగ్కు సవాలుగా ఉంటున్న మౌలిక సదుపాయాల అంతరాలను పరిష్కరించడంలో పోర్టులకు తగు సూచనలివ్వగలిగేలా కెమికల్ కమిటీ కూర్పు ఉండాలి. అత్యధిక సామర్థ్యాలున్న 8 పోర్ట్ క్లస్టర్స్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. → దిగుమతులు, ఎగుమతి సామర్థ్యాలు, సోర్సింగ్ కోసం ఒకే దేశంపై ఆధారపడటం, మార్కెట్ ప్రాధాన్యత తదితర అంశాల ఆధారంగా అదనంగా రసాయనాలను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలివ్వాలి. → పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండేలా పర్యావరణ అనుమతుల (ఈసీ) ప్రక్రియను వేగవంతం చేయాలి. కాల పరిమితులు, నిబంధనల అమలును పర్యవేక్షించేలా పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం డీపీఐఐటీ కింద ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఈసీ క్లియరెన్స్ ప్రక్రియలను సరళతరం, వేగవంతం చేయాలి. తరచుగా నివేదికలను ప్రచురించాలి. ఈఏసీకి మరింత స్వయం ప్రతిపత్తినివ్వాలి. → స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో (ఎఫ్టీఏ) రసాయనాల పరిశ్రమ కోసం నిర్దిష్ట నిబంధనలను చేర్చేలా భారత్ చర్చలు జరపవచ్చు. పరిశ్రమ ప్రయోజనాలను పరిరక్షించేలా టారిఫ్ కోటాలు లేదా కీలకమైన ముడిసరుకు, పెట్రోకెమికల్ ఫీడ్స్టాక్లపై సుంకాలపరంగా మినహాయింపులులాంటివి చేర్చే అవకాశాలను పరిశీలించవచ్చు. → అంతర్జాతీయంగా పోటీపడటంలో భారత రసాయన రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఫీడ్స్టాక్ కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం పెద్ద సవాలుగా ఉంటోంది. ఫలితంగా 2023లో 31 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య లోటు నమోదైంది. → అంతర్జాతీయంగా పోటీ సంస్థలతో పోల్చి చూసినప్పుడు మౌలిక సదుపాయాల్లో అంతరాలు, కాలం చెల్లిన పారిశ్రామిక క్లస్టర్లు, భారీ స్థాయి లాజిస్టిక్స్ వ్యయాలు మొదలైనవి దేశీ సంస్థలకు ప్రతికూలంగా ఉంటున్నాయి. → దీనికి తోడు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై భారత్ పెట్టే పెట్టుబడులు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. అంతర్జాతీయంగా ఇది సగటున 2.3 శాతంగా ఉండగా, భారత్లో 0.7 శాతంగానే ఉంది. అత్యంత విలువైన రసాయనాలను దేశీయంగా ఆవిష్కరించడానికి ఇది ఆటంకంగా ఉంటోంది. → నియంత్రణ సంస్థలపరమైన జాప్యాలు, ముఖ్యంగా పర్యావరణ అనుమతులపరంగా నెలకొన్న సవాళ్లు, పరిస్థితులకు తగ్గట్లు పరిశ్రమ ఎదగడంలో అవరోధాలుగా ఉంటున్నాయి. → పరిశ్రమలో నైపుణ్యాలున్న ప్రొఫెషనల్స్ కొరత 30 శాతం మేర ఉంది. ముఖ్యంగా గ్రీన్ కెమిస్ట్రీ, నానోటెక్నాలజీ, ప్రాసెస్ సేఫ్టీ లాంటి కొత్త విభాగాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంది. → ప్రస్తుత సవాళ్లను పరిష్కరించి, ప్రతిపాదిత సంస్కరణలను అమలు చేస్తే, భారత్ అంతర్జాతీయంగా పోటీ పడే సామర్థ్యాలను పెంచుకోవచ్చు. పెట్టుబడులను ఆకర్షించవచ్చు. గ్లోబల్ వేల్యూ చెయిన్కి సారథ్యం వహించేలా రసాయనాల రంగాన్ని పటిష్టంగా తీర్చిదిద్దుకోవచ్చు.

సోషల్ మీడియా అరెస్టులు.. ఏపీ జడ్జిలకు హైకోర్టు సంచలన ఆదేశాలు
ఏపీలో అడ్డగోలుగా జరుగుతున్న సోషల్ మీడియా అరెస్టులలో జరుగుతున్న ఉల్లంఘనలపై ఉన్నత న్యాయస్థానం కన్నెర్ర జేసింది. ఈ తరహా అరెస్టులు, రిమాండ్లను కట్టడి చేసే దిశగా అడుగులేసింది. ఒకవైపు ఏపీ జడ్జిలకు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూనే.. ఇంకోవైపు హెచ్చరికలూ జారీ చేసింది. సాక్షి, విజయవాడ: ఏపీలో సోషల్ మీడియా అరెస్టులు, రిమాండ్ల విధింపు విషయంలో జరుగుతున్న అడ్డగోలు ఉల్లంఘనలపై ఉన్నత న్యాయస్థానం కన్నెర్ర జేసింది. ఈ క్రమంలోనే ఏపీ జడ్జిలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ విధింపు విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూనే.. ఇంకోవైపు హెచ్చరికలూ జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే అభియోగాలతో ఈ ఏడాది కాలంలో ఏపీలో లెక్కలేనని అరెస్టులు జరిగాయి. అయితే.. ఇలాంటి కేసుల్లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను చాలావరకు జడ్జిలు పాటించడం లేదని ఉన్నత న్యాయస్థానం గుర్తించింది. ఈ క్రమంలో న్యాయమూర్తులకు హైకోర్టు రిజిస్ట్రార్ తరఫున తాజాగా ప్రత్యేక సర్క్యులర్ జారీ చేయించింది. ‘‘సుప్రీం కోర్టు నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా కొందరు జడ్జిలు రిమాండ్లు విధిస్తున్నారు. అనేక కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని మా దృష్టికి వచ్చింది. ఇది అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోంది. రిమాండ్ విధించేటప్పుడు తప్పనిసరిగా సుప్రీం గైడ్లైన్స్ పాటించాలి. ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి. ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినట్లు.. ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనల, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్ఐఆర్లు పెట్టకూడదు. డీఎస్పీ ఆమోదించాకే విచారించాలి. రిమాండ్కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా? లేదా? పరిశీలించాలి. మొత్తం 14 రోజుల్లోనే విచారణ పూర్తిచేయాలి.. అని తాజా సర్క్యులర్లో హైకోర్టు పేర్కొంది. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు ఖచ్చితంగా ఈ సర్క్యులర్ అమలు చేయాలని, ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని, కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని, సదరు మెజిస్ట్రేట్లు శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. మరోవైపు.. ఇంతకు ముందు ఈ తరహా అరెస్టుల విషయంలో పోలీసుల తీరుపైనా ఉన్నత న్యాయస్థానం అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

సైన్స్నే నమ్మాడు... మిరాకిల్గా నిలిచాడు!
తెలంగాణలో ఓ మారుమూల పల్లెలో దాదాపు అర్ధ శతాబ్దం క్రితం ఓ పల్లెటూరి గొర్లకాపరి కేవలం సైన్సును నమ్మి తన గుండెజబ్బుతో పోరాడి విజయం సాధించిన కథ ఇప్పటికీ మూఢనమ్మకాల్లో కునారిల్లేవారికి మేలుకొలుపు. కంచ కట్టయ్య వరంగల్ జిల్లా, చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేటలో 1948లో జన్మించాడు. 11వ తరగతి వరకు నర్సంపేట హైస్కూల్లో చదివి, తల్లి మరణం తరువాత 1969లో పెళ్లి చేసుకొని, వ్యవసాయం– కులవృత్తి గొర్లమంద వ్యవహారం చూసుకునేవాడు.అకస్మాత్తుగా 1976లో ఆయనకు గుండె జబ్బు వచ్చింది. హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రిలో ఫిజిషియన్కు చూపించగా, ‘ఈయనకు గుండెలో రెండు వాల్వులు (కవాటాలు) పనిచేస్తున్నట్టు లేవు. బతకడం కష్టం’ అని చెప్పి, తమిళనాడులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీఎంసీ) హాస్పిటల్, వెల్లూరులో ఈమధ్య ఆపరేషన్లు చేస్తున్నారనీ, అక్కడికి వెళ్లమనీ చెప్పారు. ఆ రోజుల్లో హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఈసీజీ, ఎకోగ్రామ్ వంటి పరికరాలు కూడా లేవు. నిజానికి అప్పటికే ఆయన ఇద్దరు పిల్లల తండ్రి. భార్య నిరక్షరాస్యురాలు. కట్టయ్య హైదరాబాదులో చదువుకుని ఉద్యోగం చేస్తున్న తమ్ముడిని తీసుకొని వెల్లూరు వెళ్ళాడు. పరీక్షలు చేయించుకుంటే ఆయన గుండెలో అతి కీలకమైన వాల్వ్ పనిచెయ్యడం లేదని తేల్చారు. 45–50 వేల వరకు ఖర్చుపెట్టగలిగితే ఆపరేషన్ చేస్తామన్నారు. ఆపరేషన్కు సిద్ధమయ్యాడు కట్టయ్య. సీఎంసీలోని ప్రసిద్ధ థొరాసిక్ సర్జన్ స్టాన్లీ జాన్ యువకుడు. అప్పుడప్పుడే అమెరికాలో తయారై సీఎంసీకి అందుబాటులోకి వచ్చిన స్టార్–ఎడ్వర్డ్ స్టీల్ వాల్వ్లను అమర్చడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. 1979 నాటికే పేరున్న సర్జన్. గుండెలో అమర్చడం కోసం ఎడ్వర్డ్ కంపెనీ చేసిన మొదటి వాల్వ్ అది. కట్టయ్య స్కూల్లో ఉన్నప్పుడే సైన్సువాదిగా మారాడు. మూఢ నమ్మకాలు ఊళ్ళలో ఆనాడు కోకొల్లలు. ఈనాటికీ ఉన్నాయి. తాను చనిపోతాడని డాక్టర్లు చెప్పాక కూడా ఒక్క పైసా కూడా మూఢ నమ్మకం మీద ఖర్చు పెట్టనని మొండిచేసిన మనిషి. ‘నన్ను బతికిస్తే డాక్టర్లు, మందులు మాత్రమే బతికించగలవు’ అని గట్టిగా నమ్మాడు. వాల్వ్ను గుండెలో పెట్టించుకోవడానికి అప్పులు సప్పులు చేశాడు. సీఎంసీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఆయనకు 1979 డిసెంబర్ 17న ఆపరేషన్ చేస్తామని డేట్ ఇచ్చింది. ఇటువంటి ఆపరేషన్ చేయించుకొని బతికిన మనిషి ఉదాహరణ తన ముందు లేదు. ఆ రోజుల్లో డాక్టర్లు మనుషుల్ని ఇలా ఆపరేషన్ చేసి గుండెను రిపేర్ చేస్తారనే ఆలోచనే లేదు. గ్రామాల్లో ఆనాడు అసలు చదువే లేదు. డాక్టర్లు ఆపరేషన్ ఖర్చులతోపాటు రక్తం ఇవ్వడానికి 8 మంది కావాలని చెప్పారు. అందులో నలుగురు ఎప్పుడైనా ఇచ్చిపోవచ్చు, మరో నలుగురు ఆపరేషన్ చేసే రోజే ఇవ్వాలి. ఇది సాధారణ విషయం కాదు. మనిషి శరీరం నుంచి రక్తం తియ్యడమంటేనే భయమున్న రోజులవి. రక్తదానం మీద ఆనాడు అవగాహనే లేదు. మిత్రులు, తమ్ముని సహాయంతో కుటుంబ భారాన్ని భార్యకు, ఒక చెల్లె కుటుంబానికి అప్పజెప్పి 8 మంది రక్తదాతలతో వెల్లూరు వెళ్ళాడు. కట్టయ్యకు స్టాన్లీ జాన్ ఆపరేషన్ విజయవంతంగా చేశాడు. డాక్టర్ చరియన్ ఆయనకు అతి జాగ్రత్తగా జీవరక్షణ డ్రగ్స్, ముఖ్యంగా అసిట్రోమ్ 0.5 ఎం.జి. సెట్ చేశాడు. ఇది అటువంటి కృత్రిమ వాల్వ్తో బతికే పేషంటుకు ప్రతిదినం చావో బతుకో నిర్ణయించే ట్యాబ్లెట్. అది ప్రతిదినం నిర్ణీత సమయానికి వేసుకోకపోతే రక్తం గడ్డ కడుతుంది. డోసు ఎక్కువైతే రక్తం పలచనై ప్రాణాపాయానికి దారితీస్తుంది.1984లో కట్టయ్యకు మళ్ళీ రక్తం పల్చదనం తగ్గి, బ్రెయిన్ క్లాట్స్ ఏర్పడి ఫిట్స్ రావడం మొదలైంది. భార్య భారతి హైదరాబాదు ఉస్మానియాకు తెచ్చి అడ్మిట్ చేసింది. నెల రోజులు కోమాలో ఉన్నాడు. 50 రోజులకు బతికి బయటపడ్డాడు. అప్పటినుంచి హైదరాబాదులో పిల్లలతోనే జీవించడం, హాస్పిటల్ అవసరాలు, పిల్లల చదువులు, 2010లో మళ్ళీ నిమ్స్లో అడ్మిషన్, 18 రోజులు వెంటిలేటర్పై చావుతో పోరాడాడు. ఆయనకు 1979లో అమర్చిన ఎడ్వర్డ్ స్టీల్ వాల్వ్ చక్కగా పనిచేయడం, అప్పుడు నిమ్స్ డైరెక్టర్గా వున్న డాక్టర్ ప్రసాదరావును ఆశ్చర్యపరిచింది. ఆయన పర్యవేక్షణలో మళ్ళీ బతికి బయటపడ్డాడు. పడిపోవడాలు, దినాల తరబడి ఎక్కిళ్ళు, హాస్పిటల్ అడ్మిషన్లు నిరంతరం సాగాయి. అయినా బతుకు కొనసాగించాడు.ఈ కట్టయ్య అకస్మాత్తుగా బాత్రూమ్లో కమోడ్పై కూర్చుని ఉండగా, ఆయన గుండెలో అమర్చిన ఫస్ట్ జనరేషన్ స్టీల్ వాల్వ్ పనిచేయడం ఆగిపోయి జూన్ 7న సైలెంట్గా 77వ ఏట కన్నుమూశాడు. ఆయన పుట్టిన గ్రామం పాపయ్యపేటలో అదే నెల 26వ తేదీన ఏర్పాటు చేసిన ‘సైన్సు మనిషి కంచె కట్టయ్య’ యాదిలో జరిగిన సభలో ఉమ్మడి రాష్ట్రంలో నిమ్స్లో గుండె ఆపరేషన్లు మొదటగా ప్రారంభించిన ‘పద్మశ్రీ’ దాసరి ప్రసాదరావు 46 ఏళ్లు ఆయన గుండెలో అమర్చిన వాల్వ్ గురించి గుండె మోడల్ తెచ్చి 40 నిమిషాలు వివరించారు. వందలాది గ్రామస్థులు అది తమ సొంత గుండెకు సంబంధించిన సమస్యగా విన్నారు. 46 ఏళ్లు ఏకైక – అదీ మొట్టమొదట ప్రపంచంలో తయారైన వాల్వ్తో ఈయన బతకడం ప్రపంచ రికార్డ్ అని ప్రకటించారు. ప్రస్తుతం నిమ్స్ డైరెక్టర్గా ఉన్న డా‘‘ నగరి బీరప్ప– ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంట్రాలజీ సర్జన్, లండన్ ఎఫ్ఆర్సిఎస్ బోర్డ్ మెంబర్ ‘కట్టయ్య జీవితం ఒక మెడికల్ మిరాకిల్’ అని పోస్ట్ చేశాడు.కట్టయ్య పూర్తిగా మూఢ నమ్మకాల వ్యతిరేకి. మందులు, ఆపరేషన్ల వల్ల మాత్రమే వ్యాధులు తగ్గుతాయి కాని, మూఢ నమ్మకాల వల్ల కాదని జీవితాంతం నమ్మాడు. అలానే జీవించాడు. ఈయన జీవిత ఉదాహరణ ప్రజలను సైన్సు, మానవత్వం వైపు మళ్లిస్తుందని ఆశిద్దాం!కంచ ఐలయ్య షెఫర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు

Ind vs Eng: పట్టుబిగించిన భారత్.. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబాటు!
ఇంగ్లండ్తో రెండో టెస్టులో భారత్ సంపూర్ణ ఆధిపత్యం సాధించింది. ఆది నుంచి పట్టుబిగించిన గిల్ సేన.. ఆతిథ్య జట్టుకు కొండంత లక్ష్యాన్ని విధించింది. బ్యాటింగ్లో దుమ్ములేపిన టీమిండియా.. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 427/6 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.తద్వారా ఇంగ్లండ్ ముందు ఏకంగా 608 పరుగుల టార్గెట్ ఉంచింది. 64/1 ఓవర్ నైట్ స్కోరుతో టీమిండియా శనివారం తమ ఆట మొదలుపెట్టింది. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ (269)తో చెలరేగిన భారత కెప్టెన్ శుబ్మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్లోనూ ధనాధన్ దంచికొట్టాడు. 162 బంతుల్లో 161 పరుగులతో భారీ శతకం సాధించాడు.మిగతా వారిలో ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (55), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (65) అర్ధ శతకాలతో రాణించగా.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (69 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఆరు వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, షోయబ్ బషీర్ రెండేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, జో రూట్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు మహ్మద్ సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ జాక్ క్రాలే (0)ను డకౌట్గా వెనక్కి పంపాడు.ఇక మరో భారత పేసర్ ఆకాశ్ దీప్ మరో ఓపెనర్ బెన్ డకెట్ (25), జో రూట్ (6) వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 15, ఓలీ పోప్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆఖరిదైన ఐదో రోజు భారత్ మిగిలిన ఏడు వికెట్లు కూల్చి గెలుపొందాలని పట్టుదలగా ఉండగా.. విజయానికి 536 పరుగుల దూరంలో ఉన్న ఇంగ్లండ్ కనీసం డ్రా కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు-2025 (బుధవారం (జూలై 2)- ఆదివారం (జూలై 6))👉వేదిక: ఎడ్జ్బాస్టన్ స్టేడియం, బర్మింగ్హామ్👉టాస్: ఇంగ్లండ్- మొదట బౌలింగ్👉భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు- 587 ఆలౌట్👉ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు- 407 ఆలౌట్ 👉భారత్కు తొలి ఇన్నింగ్స్లో 180 పరుగుల ఆధిక్యం👉భారత్ రెండో ఇన్నింగ్స్- 427/6 డిక్లేర్డ్- తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని మొత్తం 607👉ఇంగ్లండ్ లక్ష్యం- 608👉శనివారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 72/3 (16).

హమ్మయ్యా.. ఊపిరి పీల్చుకున్న జపాన్
క్యాలెండర్లో తేదీ మారింది. ఎట్టకేలకు జపాన్ ఊపిరి పీల్చుకుంది. ఏదో విపత్తు ముంచేస్తోందని ‘జపాన్ బాబా వాంగా’ ర్యో తత్సుకి చెప్పిన కాలజ్ఞానం ఉత్తదేనని తేలిపోయింది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా జపాన్ డూమ్స్ డే.. చివరకు హుళక్కే అని తేలింది. జులై 5, 2025న మెగా సునామీ జపాన్ను ముంచెత్తబోతోందన్న ప్రచారం.. ఉత్తి ఉత్కంఠగానే తేలిపోయింది. భారీ భూకంపంగానీ.. సునామీగానీ సంభవించలేదు. కొన్ని స్వల్ప ప్రకంపనలు, అగ్నిపర్వతం బద్దలు మినహా ఓ మోస్తరు ప్రకృతి వైపరిత్యాలు సంభవించలేదు. తేదీ మారినా.. ఏం జరగకపోవడంతో ఆ దేశ ప్రజలు హమ్మయ్యా.. అనుకుంటున్నారు. 1999లో ప్రచురించబడిన ఓ మాంగా (The Future I Saw) రచయిత ర్యో తత్సుకి.. జులై 5వ తేదీన విపరీతమైన భూకంపం, యుగాంతం తరహాలో సునామీ ముంచెత్తవచ్చని తన చిత్రాలతో బొమ్మలు గీసింది. మీడియాతో పాటు సోషల్మీడియాలోనూ జపాన్ డూమ్స్ డే అంటూ హడావిడి నడిచింది. #JapanTsunami, #July5, #TheFutureISaw వంటివి ట్రెండింగ్ అయ్యాయి. కొంతమంది పర్యాటకులు పర్యటనలు రద్దు చేసుకున్నారు. అందులో భారత్ నుంచి కూడా చాలామంది ఉన్నారు. జపాన్ లోని ఆకుసెకిజిమా వాసులను అప్రమత్తంగా తరలించాల్సి వచ్చింది.అయితే.. మేధావులు, సైంటిస్టులు.. ఆ భవిష్యవాణి నిరాధారమైనదిగా చెబుతూనే వస్తున్నారు. మరోవైపు అక్కడి వాతావరణ విభాగం కూడా.. భూకంపాలను అంచనా వేయలేమని మొత్తుకుంటూ వచ్చింది. చివరకు అదే నిజమని తేలింది.

రెండేళ్లు ఎస్సైగా ట్రైనింగ్.. కట్ చేస్తే కటకటాల్లోకి!
రెండేళ్లు పోలీస్ అకాడమీలో ఎస్సైగా శిక్షణ తీసుకుంది. అకాడమీకి వచ్చే ఉన్నతాధికారులతో సరదాగా మాటలు కలిపింది. డైనమిక్ యంగ్ ఆఫీసర్ అంటూ వాళ్లు కూడా ఆమెను అభినందించేవాళ్లు. అంతేకాదు.. యూనిఫారమ్లో రీల్స్ చేసి సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసుకుని సంబురపడిపోయేది. కట్ చేస్తే.. ఇప్పుడు కటకటాల్లో ఊచలు లెక్కపెడుతోంది. జైపూర్లోని రాజస్థాన్ పోలీస్ అకాడమీ(RPA)లో ఎస్ఐగా రెండేళ్లు శిక్షణ పొందిన మోనా అలియాస్ మూలీ దేవి(Mooli Devi) ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మోనా బుగాలియా 2021లో ఎస్సై ఎగ్జామ్స్ రాసింది. క్వాలిఫై కాలేకపోయింది. దీంతో దొడ్డిదోవ ఎంచుకుంది. మూలీ దేవి అనే పేరుతో ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు సృష్టించి అకాడమీలో ప్రవేశించింది. స్పోర్ట్స్ కోటా క్యాండిడేట్గా తనను తాను అందరికి పరిచయం చేసుకుంది. అలా అకాడమీ పెద్దలనే బోల్తా కొట్టించి.. రెండేళ్లపాటు అధికారికంగా శిక్షణ పొందింది. ఈ రెండేళ్లలో.. అక్కడికి వచ్చే ఉన్నతాధికారులతో టెన్నిస్ ఆడుతూ ఫొటోలు దిగడమే కాకుండా.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రైనింగ్ గ్రూప్లలో యాక్టివ్ మెంబర్గా ఉంటూ వచ్చింది. యూనిఫామ్లో రీల్స్ చేయడమే కాకుండా.. మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చేది. అయితే.. ఆమె ఎప్పుడూ ప్రధాన గేట్ ద్వారా కాకుండా.. అధికారుల కుటుంబాలకు ప్రత్యేకంగా ఉన్న గేట్ ద్వారా అకాడమీకి ప్రవేశించేది. ఈ వీఐపీ వేషాలపై 2023లో కొంతమంది ట్రైనీలకు అనుమానం వచ్చింది. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లగా.. విచారణలో అసలు విషయం బయటపడింది. రెండేళ్లపాటు పరారీలో ఉన్న ఆమెను.. ఇవాళ(జూలై 5న) సికర్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఆమె నుంచి మూడు యూనిఫామ్లతో పాటు నకిలీ గుర్తింపు పత్రాలు, పోలీస్ అకాడమీకి సంబంధించిన పరీక్షా పత్రాలు స్వాధీనపర్చుకున్నారు. మోనా బుగాలియా స్వస్థలం నాగౌర్ జిల్లా అని, ఆమె తండ్రి లారీ డ్రైవర్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుగా తన గౌరవాన్ని పెంచుకునేందుకు, తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకునేందుకే తాను ఇలా నాటకం ఆడాల్సి వచ్చిందని ఆమె అంటోంది. మరోవైపు ఈ ఘటనతో పోలీస్ అకాడమీ నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా ఎలా శిక్షణకు అనుమతించారని మండిపడుతున్నారు పలువురు. అయితే అత్యంత భద్రత కలిగిన అకాడమీలో ఇలా నకిలీ పత్రాలతో ప్రవేశించడం అంత సులువైన పని కాదని.. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని అధికారులు అంటున్నారు.

9 రోజులు మంచినీళ్లు తాగే బతుకుతా.. అన్నం ముట్టను: హీరోయిన్
చాలామంది వారానికోసారి లేదా ఏదైనా పండగ ఉన్నప్పుడు ఉపవాసం చేస్తుంటారు. అలా బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రి (Nargis Fakhri)కి కూడా ఉపవాసం చేసే అలవాటుందట! కాకపోతే ఎప్పుడో ఒకసారి కాదు.. ఏకధాటిగా 9 రోజులు ఏమీ తినకుండా ఉంటుందట! ఇలా ఏడాదికి రెండుసార్లు దీన్ని కఠిన దీక్షలా పాటిస్తానని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నర్గీస్ ఫక్రి మాట్లాడుతూ.. నేను ఏడాదికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను. ఆ సమయంలో ఏమీ తినను. 9 రోజులు తిండి లేకుండా..తొమ్మిదిరోజులపాటు కేవలం నీళ్లు తాగే బతుకుతాను. ఇది చాలా కష్టంగా ఉంటుంది. 9 రోజులయిపోయేసరికి ముఖం వికృతంగా మారుతుంది. కళ్లు, బుగ్గలు లోపలకు వెళ్లిపోయి, దవడ బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. ముఖంలో మాత్రం కాస్త గ్లో ఉంటుంది. అయితే ఇది పాటించమని నేనెవరికీ సలహా ఇవ్వను. చాలామంది ఏదైనా త్వరగా జరిగిపోవాలనుకుంటారు. కానీ దేనికైనా సమయం పడుతుంది. ఉదాహరణకు మంచి నిద్ర కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. నేనైతే రోజూ ఎనిమిది గంటలు నిద్రపోతాను. సినిమాఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉంటాను. విటమిన్స్, మినరల్స్ వంటి మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది. నర్గీస్ ఫక్రి.. రాక్స్టార్ (2011) మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మే తేరా హీరో, హౌస్ఫుల్ 3, టొర్బాజ్, అజర్, మద్రాస్ కేఫ్, అమవాస్ వంటి పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల హౌస్ఫుల్ 5 సినిమాతో అలరించింది.చదవండి: పాపం.. ఏదో నోరు జారింది.. రష్మికను వదిలేయండి: నటి
జిన్పింగ్ (చైనా అధ్యక్షుడు) రాయని డైరీ
సారస్వత్ బ్యాంక్లో న్యూ ఇండియా కోపరేటివ్ విలీనం
కెమికల్స్ దిగ్గజంగా భారత్!!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
సైన్స్నే నమ్మాడు... మిరాకిల్గా నిలిచాడు!
చెట్టునే నరకనా... మెడ కోసుకోనా?
సునామీ శతకంతో విరుచుకుపడ్డ వైభవ్.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
Ind vs Eng: పట్టుబిగించిన భారత్.. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబాటు!
ఎంతో హెచ్చరించా.. వినలేదు.. చివరకు..
'మా అమ్మ ప్రెగ్నెన్సీ'.. వీడియో షేర్ చేసిన బిగ్బాస్ బ్యూటీ
900 భూకంపాలు.. మరికొన్ని గంటల్లో సునామీ...!?
సాయం కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఫిష్ వెంకట్ కూతురు.. 'ప్రభాస్' టీమ్ నుంచి కాల్
చదివింది ఇంటర్, ఫస్ట్ సినిమానే హిట్.. లగ్జరీ కారు కొన్న నటి
ఉద్యోగులకు త్వరలో తీపికబురు
బ్రాత్వైట్ వరల్డ్ రికార్డు.. ఇక ముందు కూడా ఎవరికీ సాధ్యం కాదు!
IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ!
భారత్లో అత్యంత ఖరీదైన చిత్రం ఇదే.. ఆ తర్వాతే ప్రభాస్ 'కల్కి'
భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా యువరాజ్ సింగ్
బీజేపీ రాజకీయ వ్యూహం.. మహిళకు అధ్యక్ష పదవి!.. రేసులో ముగ్గురు!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
సార్ చెప్పేదంతా జ్యోతిష్యమే కదా!
ఆ మహానుభావుల విలువ తగ్గించకండి సార్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్
చైనా జిన్పింగ్కు ఏమైందో తెలియడం లేదస్సార్!
తమ్ముడు మూవీ రివ్యూ
అదేదో ట్రంప్కు చెపితే బెటరనుకుంటా కామ్రేడ్!
ఈ రాశి వారికి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు.. పనులు విజయవంతంగా సాగుతాయి.
HYD: నగరంలో ఇవాళ నరకం!
‘తమ్ముడు’ మూవీ ట్విటర్ రివ్యూ
రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు
జిన్పింగ్ (చైనా అధ్యక్షుడు) రాయని డైరీ
సారస్వత్ బ్యాంక్లో న్యూ ఇండియా కోపరేటివ్ విలీనం
కెమికల్స్ దిగ్గజంగా భారత్!!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
సైన్స్నే నమ్మాడు... మిరాకిల్గా నిలిచాడు!
చెట్టునే నరకనా... మెడ కోసుకోనా?
సునామీ శతకంతో విరుచుకుపడ్డ వైభవ్.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
Ind vs Eng: పట్టుబిగించిన భారత్.. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబాటు!
ఎంతో హెచ్చరించా.. వినలేదు.. చివరకు..
'మా అమ్మ ప్రెగ్నెన్సీ'.. వీడియో షేర్ చేసిన బిగ్బాస్ బ్యూటీ
సాయం కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఫిష్ వెంకట్ కూతురు.. 'ప్రభాస్' టీమ్ నుంచి కాల్
చదివింది ఇంటర్, ఫస్ట్ సినిమానే హిట్.. లగ్జరీ కారు కొన్న నటి
ఉద్యోగులకు త్వరలో తీపికబురు
బ్రాత్వైట్ వరల్డ్ రికార్డు.. ఇక ముందు కూడా ఎవరికీ సాధ్యం కాదు!
IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ!
భారత్లో అత్యంత ఖరీదైన చిత్రం ఇదే.. ఆ తర్వాతే ప్రభాస్ 'కల్కి'
భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా యువరాజ్ సింగ్
బీజేపీ రాజకీయ వ్యూహం.. మహిళకు అధ్యక్ష పదవి!.. రేసులో ముగ్గురు!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
సార్ చెప్పేదంతా జ్యోతిష్యమే కదా!
ఆ మహానుభావుల విలువ తగ్గించకండి సార్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్
చైనా జిన్పింగ్కు ఏమైందో తెలియడం లేదస్సార్!
తమ్ముడు మూవీ రివ్యూ
అదేదో ట్రంప్కు చెపితే బెటరనుకుంటా కామ్రేడ్!
ఈ రాశి వారికి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు.. పనులు విజయవంతంగా సాగుతాయి.
HYD: నగరంలో ఇవాళ నరకం!
‘తమ్ముడు’ మూవీ ట్విటర్ రివ్యూ
రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు
యంగ్ హీరోను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని స్టార్ సెలబ్రిటీల ప్లానింగ్
సినిమా

సుడిగాలి సుధీర్పై కోపం? అనిల్ రావిపూడి ఏమన్నారంటే?
మ్యాజిక్ షోలు చేసుకునే స్థాయి నుంచి కమెడియన్గా, యాంకర్గా, హీరోగా ఎదిగాడు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). యాంకర్ రష్మీతో లవ్ ట్రాక్తో మరింత పాపులర్ అయ్యాడు. మొదట్లో సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు చేసిన సుధీర్ ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్, గాలోడు, కాలింగ్ సహస్ర, వాంటెడ్ పండుగాడ్ వంటి చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం G.O.A.T. మూవీ చేస్తున్నాడు.సుధీర్పై మితిమీరిన రోస్టింగ్మరోవైపు టీవీ షోలలో యాంకర్గానూ పని చేస్తున్నాడు. అయితే బుల్లితెరపై ఆయన్ను విపరీతంగా రోస్ట్ చేస్తుంటారు. షో ఏదైనా సుధీర్ను ఆడుకోవడం మాత్రం గ్యారెంటీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. కొన్నిసార్లు నటుడిపై మితిమీరిన పంచ్లు వేస్తుండటం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. అంతేకాదు, సుధీర్ కూడా తనపై వేసే పంచ్లకు హర్టవడా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అందరూ ఆడుకునేవారేడ్రామా జూనియర్స్లో పిల్లల నుంచి జడ్జి అనిల్ రావిపూడి (Anil Ravipudi) వరకు అందరూ సుధీర్ను ఆడుకునేవారే! అనిల్ రావిపూడి.. గతంలో కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ షోలోనూ సుధీర్ను రోస్ట్ చేసేవాడు. దీంతో ఈ డైరెక్టర్కు తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. సుధీర్పై ఎందుకంత కోపం? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకు అనిల్ రావిపూడి స్పందిస్తూ.. సుధీర్ను పంచులతో ఫ్రై చేస్తుంటే నాకు జాలేస్తుంటుంది. పాపం, అతడు హీరోగా కూడా సినిమాలు చేశాడు.. ఆయన్ని అంతలా ఫ్రై చేయాలా? అని అడిగితే సుధీర్ను రోస్ట్ చేయడమే కాన్సెప్ట్ అనేవారు.అందుకే తప్పడం లేదుషో నిర్వాహకులే అలా అన్నాక మేమేం చేస్తాం. మాకు ఇష్టం లేకపోయినా సుధీర్ను ఏదో ఒకటి అనాల్సి వస్తుంది. ఎందుకంటే సుధీర్ను ఫ్రై చేస్తేనే జనం నవ్వుతారు, చప్పట్లు కొడతారని చెప్పారు. ప్రేక్షకులు అదంతా ఎంజాయ్ చేస్తున్నారని తెలిశాక మేమూ ఇంకాస్త ఎక్కువ రోస్ట్ చేస్తున్నాం. సుధీర్ చాలా స్పోర్టివ్. ఎలాంటి జోకులు వేసినా ఫీలవ్వడు. కొన్ని పంచులు వేయడానికి నేను మొహమాటపడితే కూడా.. ఏం పర్లేదు సర్, జనాలు నవ్వడమే కావాలి.. మీరు ఫ్లోలో వెళ్లిపోండి అని చెప్తాడు.నేనే కట్ చేస్తుంటా..అయినా సరే, కొన్నిసార్లు నేనే తటపటాయిస్తుంటాను. కొన్ని పంచులు ఓవర్ అయిపోతుందన్నప్పుడు వాటిని కట్ చేస్తుంటాను. సరదా కోసమే తప్ప వ్యక్తిగతంగా మాత్రం ఎవరినీ ఏదీ అనుకోము అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. మనల్ని నవ్వించడం కోసం సుధీర్ అడిగి మరీ తిట్టించుకుంటాడా? అని అతడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.చదవండి: ప్రభాస్ రూ.50 లక్షల సాయం? ఒక్క రూపాయి అందలేదు: ఫిష్ వెంకట్ ఫ్యామిలీ

ప్రభాస్ రూ.50 లక్షల సాయం? ఒక్క రూపాయి అందలేదు: ఫిష్ వెంకట్ ఫ్యామిలీ
టాలీవుడ్లో విలన్గా, కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ (Fish Venkat) చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. బోడుప్పల్లోని ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నాడు. చాలా ఏళ్ల క్రితమే వెంకట్ రెండు కిడ్నీలు చెడిపోయాయి. అప్పటినుంచి డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణాలు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి క్లిష్టంగా మారడంతో కనీసం ఒక్క కిడ్నీ అయినా మార్చాలని వైద్యులు చెప్తున్నారు.ప్రభాస్ టీమ్ ఫోన్ కాల్అందుకోసం రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. దీంతో అతడి భార్య, కూతురు సాయం కోసం అర్థిస్తూ మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో నటుడి పరిస్థితి తెలుసుకున్న హీరో ప్రభాస్ (Prabhas).. ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారని ప్రచారం జరిగింది. కిడ్నీ దాత ఉంటే ఆపరేషన్కు ఏర్పాట్లు చేసుకోమని, అందుకు అవసరమైన డబ్బు ఇస్తామని ప్రభాస్ టీమ్ ఫోన్ చేశారని ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి మీడియాతో చెప్పింది.ఇల్లు అమ్మేసినా సరిపోదుకట్ చేస్తే అదంతా ఫేక్ కాల్ అని తెలుస్తోంది. ఆపదలో ఉన్నవారికి ప్రభాస్ పేరు చెప్పి లేనిపోని ఆశలు కల్పించి మరింత దుఃఖంలోకి నెట్టేశారని తెలుస్తోంది. ఈ విషయం గురించి నటుడి భార్య మాట్లాడుతూ.. ప్రభాస్ అసిస్టెంట్ అని చెప్పి మాకు ఓ ఫోన్ కాల్ వచ్చిన మాట వాస్తవమే.. కావాల్సినంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు మేము ఫోన్ చేస్తే కలవడం లేదు. ప్రభాస్ నిజంగా డబ్బు ఇస్తే ఇచ్చామనే చెప్తాం. కానీ ఆయన మాకు ఏ సాయం చేయలేదు. ఇదంతా ఫేక్ న్యూస్. హీరోలు సాయం చేస్తే బాగుండు. మా ఇల్లు అమ్మి ఆపరేషన్ చేద్దామన్నా ఆ డబ్బు దేనికీ సరిపోదు అని ఆవేదన వ్యక్తం చేసింది.ప్రభాస్ పేరిట మోసం!నటుడి కూతురు స్రవంతి సైతం స్పందిస్తూ.. ప్రభాస్ పీఏ అంటూ ఐదురోజుల కిందట నాకు ఫోన్ కాల్ వచ్చింది. మీకు సాయం కావాలంటే చెప్పండి, తప్పకుండా చేస్తామని మాటిచ్చాడు. నేను మా నాన్న పరిస్థితిని వివరించాను. అందుకాయన.. ప్రభాస్ సర్ షూటింగ్లో ఉన్నాడు.. కాసేపయ్యాక తిరిగి కాల్ చేస్తానన్నాడు. నేను నిజమేనని నమ్మాను. సినిమాకానీ, రెండురోజుల నుంచి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. మాకు ప్రభాస్ వైపు నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు అని క్లారిటీ ఇచ్చింది. కాగా ఫిష్ వెంకట్.. బలుపు, ఒక లైలా కోసం, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, దరువు, అదుర్స్, దిల్, సూపర్స్టార్ కిడ్నాప్, ఈడో రకం, ఆడో రకం, గద్దలకొండ గణేశ్, ఖైదీ నెం.150 ఇలా అనేక సినిమాలు చేశాడు.ప్రభాస్ పీఏ అని ఒకరు ఫేక్ కాల్ చేశారుమా నాన్న ఫిష్ వెంకట్ గురించి వివరాలు తెలుసుకొని సాయం చేస్తా అన్నారు కానీ, ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సాయం అందలేదుతమకు వచ్చిన నెంబర్కు కాల్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఫిష్ వెంకట్ కూతురుఇలా ఫేక్ కాల్స్తో… https://t.co/DEv0J843Ks pic.twitter.com/0sxOU9TpF3— Telugu Scribe (@TeluguScribe) July 5, 2025చదవండి: 'హరి హర వీరమల్లు' రికార్డ్ వ్యూస్.. అంతా ఫేక్!

సైఫ్ అలీ ఖాన్కు చుక్కెదురు.. చేజారిన రూ.15 వేల కోట్లు
భోపాల్లోని పూర్వీకుల ఆస్తులకు సంబంధించి సైఫ్ అలీ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. తన ముత్తాత పాకిస్తాన్కు వలస వెళ్లిన కారణంగా రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులను "శత్రువుల ఆస్తి"గా న్యాయస్థానం గుర్తించింది. సైఫ్ అలీ ఖాన్, ఆయన సోదరీమణులు సోహా, సబా, తల్లి షర్మిలా ఠాగూర్ తమ పూర్వీకుల ఆస్తులకు వారసులుగా గుర్తించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో వారు రూ. 15 వేల కోట్ల ఆస్తులపై హక్కులను కోల్పోయారు.సైఫ్ అలీ ఖాన్ ఆస్తి వారసత్వ వివాదాన్ని కొత్తగా విచారించాలని, ఒక సంవత్సరం కాలపరిమితిని నిర్ణయించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. 1947లో విభజన తర్వాత పాకిస్తాన్కు వలస వెళ్లిన వ్యక్తులకు సంబంధించిన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకోవడానికి 1968 నాటి శత్రు ఆస్తి చట్టం అనుమతిస్తుందని హైకోర్టు గుర్తుచేసింది.రూ. 15 వేల కోట్ల ఆస్తి స్టోరీ ఎంటి..?బ్రిటిషర్లకాలంలో ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రాంతాల్లో పటౌడీ సంస్థానాన్ని పాలించిన హమీదుల్లాహ్ రాజకుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులు ఎవరి పరం కానున్నాయనే ప్రశ్న తలెత్తింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులకు చెందిన ఈ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనే అంశం మరోసారి తెరమీదకొచ్చింది. సైఫ్ వాళ్ల నానమ్మ.. పటౌడీ సంస్థానానికి అసలైన వారసురాలని సీనియర్ న్యాయవాది జగదీశ్ ఛవానీ వాదిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన దీనికి భిన్నంగా ఉంది.స్వాతంత్య్రం వచ్చేనాటికి భోపాల్ కేంద్రంగా పాలిస్తున్న పటౌడీ సంస్థానానికి ముహమ్మద్ హమీదుల్లాహ్ చివరి నవాబ్గా ఉన్నారు. ఆయన తదనంతరం ఆయన పెద్దకుమార్తె అబీదా సుల్తాన్ బేగమ్కు ఈ ఆస్తులు దక్కుతాయి. అయితే స్వాతంత్య్రం వచ్చాక విభజన సమయంలో ఆమె పాకిస్తాన్కు వలసవెళ్లారు. ఈ లెక్కన ఇప్పుడు వారసులు భారత్లో లేరు. అందుకే శత్రు ఆస్తుల చట్టం కింద ఆ ఆస్తులన్నీ ఇప్పుడు కేంద్ర హోం శాఖ పరిధిలోని భారత శత్రు ఆస్తుల సంరక్షణ సంస్థ(సీఈపీఐ) పర్యవేక్షణలోకి వస్తాయి’’ అని మోదీ సర్కార్ చెబుతోంది.ప్రభుత్వ వాదనను సైఫ్కు సంబంధించిన లాయర్ ఛవానీ కొట్టిపారేశారు. ‘‘ పెద్దకుమార్తె అబీదా పాకిస్తాన్కు వెళ్లిన తర్వాత 1960లో హమీదుల్లాహ్ మరణించారు. దాంతో ఆస్తి వారసత్వంగా తనకే వస్తుందని రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ బేగమ్ భారత ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సమ్మతిస్తూ 1962 జనవరి 10న కేంద్రం ఒక ఉత్తర్వు జారీచేసింది. ఈ లెక్కన సాజిదా అసలైన వారసురాలు. ఆమె నుంచి వారసత్వంగా సాజిదా కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ(టైగర్ పటౌడీ) ఆయన తదనంతరం సైఫ్ అలీ ఖాన్ ఆ ఆస్తులకు హక్కుదారు అవు తారు’’ అని ఛవానీ వాదించారు.తమ ఆస్తులను శత్రు ఆస్తులుగా లెక్కకట్టొద్దని, మోదీ ప్రభుత్వం తెచ్చిన శత్రు ఆస్తుల(సవరణ, ధృవీకరణ) చట్టాన్ని సవాల్ చేస్తూ టైగర్ పటౌడీ భార్య, అలనాటి బాలీవుడ్ నటి షర్మిలా ఠాకూర్ 2015లో మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గత ఏడాది డిసెంబర్ 13న జస్టిస్ వివేక్ ఆగ్రావాల్ విచారణ చేపట్టారు. సైఫ్ తల్లి షర్మిలా వేసిన పిటిషన్ను ప్రభుత్వ న్యాయవాది తప్పుబట్టారు. ఇప్పుడు శత్రు ఆస్తుల చట్టం,1968 లేదు. దాని స్థానంలో 2017లో కొత్త చట్టమొచ్చిందని న్యాయస్థానం తెలిపింది. ఏమైనా ఫిర్యాదులుంటే సంబంధిత అప్పీలేట్ అథారిటీ ముందు గోడు వెళ్లబోసుకోండి’’ అని సూచించారు. అయితే, తాజాగా పూర్తి విచారణ తర్వాత ఆ రూ. 15 వేల కోట్ల ఆస్తలు 'శత్రువుల ఆస్తి'గానే గుర్తించాలని కోర్టు పేర్కొంది. కానీ, ఒక సంవత్సరంలోపు మళ్లీ పూర్తి విచారణ జరపాలని న్యాయస్థానం సూచించింది.

మందు తాగను,గుడ్డు కూడా తినను మరి ఆ పని ఎలా చేస్తా? : హీరో భార్య
మద్యపానం, లేదా ఇంకేదైనా చెడు అలవాట్లపై వాటి ప్రచారాలపై ఇదేందయ్యా మీరు ప్రముఖులు కదా ఇలా చేయవచ్చా? అని ప్రస్తుతం సెలబ్రిటీలు ఎవరిని ప్రశ్నించినా, వ్యక్తిగతం వేరే, వృత్తిగతం వేరే వ్యాపకాలు వేరే వ్యాపారం వేరే అంటూ దేనికి దాన్ని విడదీసి చూడాలంటూ చిలకపలుకులు వల్లిస్తున్నారు. మద్యం తదితర హానికారక పదార్ధాల ప్రకటనల్లో నటించడం దగ్గర నుంచి పబ్స్, క్లబ్స్ వంటి వ్యాపారాల్లో సెలబ్రిటీలు లేదా వారి సంబంధీకుల పేర్లతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాలుపంచుకుంటున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్లో ఓ టాప్ హీరో భార్య తనకు ఇష్టం లేని పనులు చేయబోనని అంతేకాక మరొకరి చేత చేయించబోనని ఖండితంగా చెప్పడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ‘‘కొన్ని వ్యాపారాలు నా నమ్మకాలకు విరుద్ధం’’ అంటున్న ఆమె ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ భార్య మిరా రాజ్పుత్(Mira Rajput ) ఫోర్బ్స్ ఇండియా నిర్వహించిన ఓ ప్యానల్ చర్చలో మాట్లాడుతూ, ‘‘నేను సంపూర్ణ శాకాహారిని, కనీసం గుడ్లు కూడా తినను. అలాగే ఇంతవరకూ చేయలేదు భవిష్యత్తులో కూడా మద్యపానం చేయను. అలాంటప్పుడు మాంసాహారం మద్యం అందించే వ్యాపారంలో పెట్టుబడి ఎలా పెడతాను? అది నా నమ్మకాలకు పూర్తి విరుద్ధం కదా’’ అని చెప్పింది.ఇటీవల ఓ ప్రముఖ బ్రాండ్ నుంచి రెస్టారెంట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని వచ్చిన అవకాశాన్ని ఆమె తిరస్కరించారు. దీనికి కారణాలను గురించి ఆమె మాట్లాడుతూ ఆ కారణాలు తన జీవనశైలితో మాత్రమే కాదని వ్యక్తిగత నైతిక విలువలతో ముడిపడి ఉన్నవని అంటోంది.‘‘నిజమే వ్యాపారంలో లాభం ముఖ్యం అయినా, అది వ్యక్తిగత విలువలకు భంగం కలిగించకూడదు. నాపై నమ్మకం ఉంచినవారికి, నా కుటుంబానికి సమాజంతో సత్సంబంధాలు ఉండాలంటే, నేను నమ్మే విషయాలలో నాకు స్పష్టత ఉండాలి’’ అంటూ ఎంతో స్వఛ్చంగా స్పష్టంగా ఆమె చెప్పిన మాటలు సినీ వర్గాలను ఆకట్టుకున్నాయి.ఒక పబ్లిక్ ఫిగర్గా తన నిర్ణయాలు సమాజంపై ప్రభావం చూపుతాయన్న అంటూ అంగీకరించిన మీరా. ‘‘బయట ఎంతో మంది ఎన్నో మంచి మాటలు ఎప్పుడూ చెబుతుంటారు, కానీ మన స్వంతమైన చైతన్యం మనకు మార్గం చూపాలి. మనం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, అది మన అంతరాత్మ అంగీకరించేలా దానికి నచ్చేలా ఉండాలి’’ అని స్పష్టం చేశారు. మిరా రాజ్పుత్ ప్రస్తుతం హోలిస్టిక్ హెల్త్, నేచురల్ లివింగ్, స్కిన్ కేర్ రంగాల్లో వ్యాపారాల్ని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు ఆమె సోషల్ మీడియా ద్వారా కూడా ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రోత్సహిస్తున్నారు.ప్రస్తుతం సినీరంగానికి అవతల.. రెస్టారెంట్ లతో సహా అనేకానేక వ్యాపారాల్లో సెలబ్రిటీలు పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటిదాకా ఏ పెద్ద సెలబ్రిటీ కి సాధ్యం కాని విధంగా మీరా రాజ్పుత్ వ్యక్తం చేసిన నైతిక విలువలు... అభినందనీయం మాత్రమే కాదు...రూ.వందల కోట్లు ఉన్నా ఇంకా డబ్బు పిచ్చితో సమాజాన్ని భ్రష్టు పట్టించే వ్యాపారాలకు వెన్ను దన్నుగా నిలుస్తున్న సెలబ్రిటీలకు. ఇకనైనా అనుసరణీయం కూడా.
న్యూస్ పాడ్కాస్ట్

పాకిస్తాన్పై యుద్ధం ఎందుకు ఆపేశారో మోదీ ప్రభుత్వం చెప్పాలి... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్

ఏపీలో గత ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యలో పెరుగుదలపై కేంద్ర ఎన్నికల సంఘానికి రుజువులు అందజేసిన వైఎస్సార్సీపీ... తమ విజ్ఞప్తులపై సీఈసీ సానుకూలంగా స్పందించిందన్న పార్టీ నేతలు

ఘటన జరిగిన రెండేళ్లకు కేసు నమోదు చేయడం ఏమిటి?... వల్లభనేని వంశీపై కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య... బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టేసిన ధర్మాసనం

ప్రజలకు అండగా నిలబడాలి, నిత్యం వారికి అందుబాటులో ఉండాలి... వైఎస్సార్సీపీ యువజన విభాగం ప్రతినిధులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం

ఏపీలో ధాన్యం బకాయిలు వేయి కోట్లు. రెండు నెలలు దాటినా రైతులకు చెల్లింపు లేదు. పట్టించుకోని కూటమి ప్రభుత్వం

ఏపీలో ఈసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారు? ఫలితాలొచ్చి 45 రోజులైనా ప్రారంభించకపోవడం ఏమిటి?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

ఆంధ్రప్రదేశ్లో బాలికల విద్యను భ్రష్టు పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం.. ‘హైస్కూల్ ప్లస్’లు వ్యూహాత్మకంగా నిర్వీర్యం

ప్రమాదానికి ప్రయాణికులు బాధ్యులవుతారా? సింగయ్య మృతి ఘటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై ఎలాంటి కఠిన చర్యలొద్దు... నల్లపాడు పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం

హైకోర్టులో విచారణ జరుగుతున్నా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అప్పులా?... టీడీపీ కూటమి సర్కారుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

ఇంటింటికీ వంచన. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీపై గ్రామగ్రామాన.. ఇంటింటా ప్రచారం. పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు
క్రీడలు

శెభాష్!.. మరోసారి శతక్కొట్టిన గిల్.. అరుదైన రికార్డు
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) తన కెరీర్లోనే అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ గడ్డ మీద వరుస శతకాలతో దుమ్ములేపుతున్నాడు. ఆతిథ్య జట్టుతో లీడ్స్ వేదికగా తొలి టెస్టులో గిల్ భారీ శతకం (147) బాదిన విషయం తెలిసిందే.అనంతరం బర్మింగ్హామ్లో బుధవారం మొదలైన రెండో టెస్టులోనూ శతక్కొట్టిన శుబ్మన్ గిల్.. దానిని డబుల్ సెంచరీగా మార్చాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 387 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 30 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 269 పరుగులు సాధించాడు. అయితే, కెరీర్లో సాధించిన తొలి ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మార్చడంలో గిల్ విఫలమయ్యాడు.జోష్ టంగ్ బౌలింగ్లో ఓలీ పోప్నకు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరడంతో.. అతడి భారీ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్కు తెరపడింది. ఇక శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా గిల్ మరోసారి బ్యాట్ ఝులిపించాడు. యాభై ఏడు బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న కెప్టెన్ సాబ్.. 129 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకున్నాడు.భారీ ఆధిక్యంలో భారత్ఇదిలా ఉంటే.. 64/1 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కాసేపటికే వన్డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (26) వికెట్ కోల్పోయింది. అయితే, ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం(55)తో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీ (58 బంతుల్లో 65) సాధించాడు. ఇక గిల్ మరోసారి శతక్కొట్టగా.. 68 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. గిల్ సెంచరీ పూర్తి చేసుకునేసరికి, టీ బ్రేక్ సమయానికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (180)తో కలుపుకొని భారత్.. 484 పరుగుల భారీ లీడ్ సాధించింది.భారత రెండో బ్యాటర్గా..కాగా టెస్టు మ్యాచ్లో ఓ ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ.. మరో ఇన్నింగ్స్లో సెంచరీ బాదిన భారత రెండో బ్యాటర్గా గిల్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు భారత మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ 1971లొ పోర్ట్ ఆఫ్ స్పెయిన్వేదికగా వెస్టిండీస్పై ఈ ఘనత సాధించాడు. ఇక ఓవరాల్గా ఈ జాబితాలో గిల్ తొమ్మిదో ఆటగాడు.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టుషెడ్యూల్: బుధవారం (జూలై 2)- ఆదివారం (జూలై 6)వేదిక: ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్టాస్: ఇంగ్లండ్- తొలుత బౌలింగ్టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 587 ఆలౌట్ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 407 ఆలౌట్ టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో 180 పరుగుల ఆధిక్యం.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్

వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. విహాన్ శతకం.. భారత్ భారీ స్కోరు
ఇంగ్లండ్ గడ్డ మీద భారత యువ జట్టు అదరగొడుతోంది. ఆతిథ్య అండర్-19 జట్టుతో ఐదు యూత్ వన్డేల సిరీస్లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. నాలుగో మ్యాచ్లో భారీ స్కోరు సాధించింది.వోర్సెస్టర్ వేదికగా శనివారం యూత్ వన్డేలో టాస్ ఓడిన భారత అండర్-19 జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది. అయితే, ఆదిలోనే భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే 14 బంతులు ఎదుర్కొన్ని కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.దీంతో ఆదిలోనే వికెట్ తీసినందుకు ఇంగ్లండ్ సంబరాలు చేసుకోగా.. ఆ ఆనందాన్ని భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కాసేపట్లోనే ఆవిరి చేశాడు. మరోసారి బ్యాట్తో వీర విహారం చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.ఆ తర్వాత కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీని తన పేరిట నమోదు చేసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో 78 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ బౌలింగ్ను చితక్కొడుతూ 143 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ బౌలింగ్లో పదమూడు ఫోర్లతో పాటు ఏకంగా పది సిక్సర్లు ఉండటం విశేషం.ఇక వైభవ్ వరుసగా ఇలా నాలుగో మ్యాచ్లో సునామీ ఇన్నింగ్స్తో విరుచుకుపడితే.. వన్డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా కూడా శతకంతో చెలరేగాడు. 121 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 129 పరుగులు సాధించాడు. అయితే, వీరిద్దరు అవుటైన తర్వాత భారత ఇన్నింగ్స్ నెమ్మదించింది.మిగతా వారిలో కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. రాహుల్ కుమార్ (0), హర్వన్ష్ పంగాలియా (0), కనిష్క్ చౌహాన్ (2) పూర్తిగా విఫలమయ్యారు. ఇక ఆర్ఎస్ అంబరీష్ (9), దీపేశ్ దేవేంద్రన్ (3) కూడా చేతులెత్తేయగా.. యుధాజిత్ గుహ 15, నమన్ పుష్పక్ రెండు పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు.ఫలితంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 363 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ అండర్-19 బౌలర్లలో జాక్ హోమ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. సెబాస్టియన్ మోర్గాన్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇతరులలో బెన్ మేయ్స్, జేమ్స్ మింటో ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇదిలా ఉంటే.. తొలి యూత్ వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ ఒక వికెట్ తేడాతో గట్టెక్కింది. ఈ క్రమంలో మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించి సిరీస్లో 2-1తో ముందంజలో ఉంది. కీలకమైన నాలుగో మ్యాచ్లో గెలిచి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా భారత్ విజయాల్లో వైభవ్ సూర్యవంశీ ( 48 (19) - 45 (34)- 86 (31))దే కీలక పాత్ర.వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు..యూత్ వన్డే చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. 14 ఏళ్ల 100 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించాడు. ప్రపంచంలో ఈ ఫీట్ అందుకున్న తొలి ఆటగాడు వైభవ్. అంతేకాదు.. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ నజ్ముల్ షాంటో (2009లో 14 ఏళ్ల 241 రోజుల వయసులో శతకం) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కూడా ఈ సందర్భంగా బద్దలు కొట్టాడు.

వాటే ఫామ్!.. ధనాధన్ దంచికొట్టి.. గిల్, పంత్ హాఫ్ సెంచరీలు
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ (Ind vs Eng)తో తొలి టెస్టులో శతకం (147) బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి (Virat Kohli) లేని లోటు పూడుస్తూ.. ఇంగ్లండ్ గడ్డ మీద అతడి రికార్డునే బద్దలు కొట్టాడు.భారీ ద్విశతకం (269)తో ఆకట్టుకుని.. ఎడ్జ్బాస్టన్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా క్రికెటర్, కెప్టెన్గా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ శుబ్మన్ గిల్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. యాభై ఏడు బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. జోష్ టంగ్ బౌలింగ్లో ఫోర్ బాది 51 పరుగులు సాధించాడు.𝐅𝐥𝐮𝐞𝐧𝐭. 𝐅𝐞𝐚𝐫𝐥𝐞𝐬𝐬. 𝐅𝐨𝐜𝐮𝐬𝐞𝐝. 🔥Leading with intent, #ShubmanGill crafts a classy fifty, setting the stage for a commanding team effort 🫡#ENGvIND 👉 2nd TEST, Day 4 | LIVE NOW on JioHotstar ➡ https://t.co/2wT1UwEcdi pic.twitter.com/ftaIUA9YIy— Star Sports (@StarSportsIndia) July 5, 2025మరోవైపు.. గిల్కు తోడుగా వైస్ కెప్టెన్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 51 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో 44 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసిన టీమిండియా ఆధిక్యం.. 400కు చేరింది.పంత్ అవుటైన తర్వాత స్కోరు ఇలాకాగా ఎడ్జ్బాస్టన్ టెస్టులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 587 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీ (269)తో అదరగొట్టగా.. రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్వోక్స్, జోష్ టంగ్ రెండేసి వికెట్లు కూల్చారు. బ్రైడన్ కార్స్, కెప్టెన్ బెన్స్టోక్స్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ ఆరు, ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్తో కలుపుకొని భారత్కు 180 పరుగుల ఆధిక్యం లభించింది.ఈ క్రమంలో 64/1 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కేఎల్ రాహుల్ (55), రిషభ్ పంత్ (65) అర్ధ శతకాలు.. గిల్ అజేయ హాఫ్ సెంచరీ (ప్రస్తుతానికి 58) కారణంగా 46.2 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసి.. 416 పరుగుల ఆధిక్యంలో ఉంది. పంత్ 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షోయబ్ బషీర్ బౌలింగ్లో డకెట్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్

చరిత్ర సృష్టించిన పంత్.. ఆల్టైమ్ వరల్డ్ రికార్డు బద్దలు
భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై ధనాధన్ ఆటతో అలరిస్తున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. రెండో టెస్టు సందర్భంగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా అవతరించాడు.ఈ క్రమంలో బెన్ స్టోక్స్ (Ben Stokes) పేరిట ఉన్న ఆల్టైమ్ వరల్డ్ రికార్డు (World Record)ను పంత్ బద్దలు కొట్టాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్ వేదికగా తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లోనూ రిషభ్ పంత్ శతకాలతో చెలరేగాడు.వరుసగా రెండు శతకాలుతొలి ఇన్నింగ్స్లో 178 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 140 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు. అయితే, ఎడ్జ్బాస్టన్ వేదికగా బుధవారం మొదలైన రెండో టెస్టులో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆరంభంలో విఫలమయ్యాడు.దూకుడుగా ఆడుతూరెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 42 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ బాది 25 పరుగులు చేసిన పంత్.. షోయబ్ బషీర్ బౌలింగ్లో జాక్ క్రాలేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం తనలోని దూకుడైన ఆటను మరోసారి వెలికితీశాడు. శనివారం నాటి నాలుగో రోజు ఆట భోజన విరామ సమయానికి పంత్ 35 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 41 పరుగులతో అజేయంగా ఉన్నాడు.ఈ క్రమంలోనే పంత్ స్టోక్స్ ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. ఇంగ్లండ్లో టెస్టు ఫార్మాట్లో మొత్తంగా 23 సిక్సర్లు పూర్తి చేసుకున్న పంత్.. విదేశీ గడ్డ(ఒకే దేశం)పై అత్యధిక సిక్స్లు నమోదు చేసిన క్రికెటర్గా నిలిచాడు. అంతకుముందు బెన్ స్టోక్స్ సౌతాఫ్రికాలో 21 సిక్సర్లు బాదాడు. ఇక ఇంగ్లండ్పై పంత్ తర్వాత అత్యధిక సిక్స్లు కొట్టిన రెండో పర్యాటక బ్యాటర్గా.. వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ (16 సిక్సర్లు) నిలిచాడు.విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు🏏రిషభ్ పంత్ (ఇండియా)- ఇంగ్లండ్పై 23 సిక్సర్లు🏏బెన్ స్టోక్స్ (ఇండియా)- సౌతాఫ్రికాపై 21 సిక్సర్లు🏏మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా)- టీమిండియాపై 19 సిక్సర్లు🏏వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- ఇంగ్లండ్పై 16 సిక్సర్లు🏏హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్)- న్యూజిలాండ్పై 16 సిక్సర్లు.భారత్ 177/3 @ లంచ్ బ్రేక్ఇక ఓవర్నైట్ స్కోరు 64/1తో శనివారం నాటి ఆట మొదలుపెట్టిన టీమిండియా.. భోజన విరామ సమయానికి 38 ఓవర్ల ఆటలో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం (55) చేయగా.. వన్డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (26) మరోసారి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. కెప్టెన్ శుబ్మన్ గిల్ 24, పంత్ 41 పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (180) కలుపుకొని భారత జట్టుకు ఇంగ్లండ్పై 357 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా తొలి టెస్టులో ఐదు వికెట్ల తేడాతో ఓడిన గిల్ సేన.. ఎడ్జ్బాస్టన్ టెస్టులో గెలిచి సిరీస్ 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది.పంత్ 65 పరుగులు చేసి...కాగా 51 బంతుల్లోనే 50 పరుగులు చేసిన పంత్.. 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. షోయబ్ బషీర్ బౌలింగ్లో బెన్ డకెట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడిన చిచ్చరపిడుగుIt’s Rishabh’s world and we’re just living in it! 😌#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/d1V9UBz17b— Sony Sports Network (@SonySportsNetwk) July 5, 2025
బిజినెస్

లేదని బాధపడకు.. వశం చేసుకోవాలని ఆరాటపడు!
డబ్బు లేదని బాధపడడం కంటే దాన్ని ఎలా వశం చేసుకోవాలనే దాని గురించి ఆలోచించేవారి సంఖ్య తగ్గుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తమ ఆర్థిక పరిమితులు ఇంతేనని.. తమ జీవితాలు ఏం చేసినా బాగోవు..అనే ధోరణికి వచ్చేస్తున్నారు. ఇందుకు బదులుగా పాజిటివ్ దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యతరగతివారు ఆర్థిక అంశాలపట్ల తమ నమ్మకాలను పరిమితంగా ఉంచుకుంటారని ఇన్వెస్టర్, పోర్ట్ఫోలియో స్ట్రాటజిస్ట్ శ్యామ్ శేఖర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ మనస్తత్వం నుంచి ఎలా బయటపడాలో కనీసం ఆలోచించేందుకు సైతం వారు నిరాకరిస్తున్నారని చెప్పారు.శ్యామ్ శేఖర్ ఎక్స్లో తెలిపిన వివరాల ప్రకారం..‘మధ్యతరగతి కుటుంబాలు తమ మనస్తత్వం మర్చుకోవు. అందుకే ఆర్థికంగా ఎదగలేవు. కనీసం ఆ దిశగా ఆలోచించడానికిసైతం నిరాకరిస్తారు. ఇంట్లో ఎయిర్ కండీషనర్, కారు ఉండాలని కలలు కనే మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి. అయితే ఈ అవసరాలు నిజంగా తమ సామర్థ్యాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఉన్న పరిధిలో ఆర్థికంగా పుంజుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయరు. కాబట్టి ఈ అవసరాలే వారికి పెద్ద లక్ష్యాలుగా తోస్తాయి’ అన్నారు.Why do middle class families stay middle class? It is because they refuse to think of what will make them break out of the middle class mindset.What is the middle class mindset?It is something which stops you from dreaming of what you feel is beyond your present reach. You…— Shyam Sekhar (@shyamsek) July 4, 2025ఇదీ చదవండి: ఉద్యోగుల్లో వేతన సంక్షోభం‘డబ్బు సంపాదనను కాంపౌండింగ్ దృష్టితో చూడాలి. దీర్ఘకాలంలో భారీ సంపద చేకూర్చే మార్గాలను కనుగొనాలి. ఇలాంటి ఆలోచనలతో మీరు జీవితాన్ని చాలా భిన్నంగా చూడటం ప్రారంభిస్తారు. రూ.కోటి చేరువలో ఉన్న వ్యక్తి రూ.20 కోట్లకు సులువుగా చేరుకోవచ్చు. కాంపౌండింగ్తో ఇది సాధ్యమే. దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే సంపదను సృష్టిస్తే తరాలు అది కొనసాగుతోంది. పర్సనల్ ఫైనాన్స్పై పరిమిత ఆలోచనల నుంచి బయటకురావాలి’ అన్నారు.

ఉద్యోగుల్లో వేతన సంక్షోభం
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జీడీపీల్లో భారత్ ఒకటిగా నిలవడం ఆశావాదానికి అద్దం పడుతోంది. అయితే దేశంలోని కార్పొరేట్ కంపెనీల లాభాలు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నప్పుడు అందులో పని చేసే ఉద్యోగుల జీవితాలు, జీతాల్లో మాత్రం మార్పు ఉండడంలేదు. కార్పొరేట్ లాభాలను ఆయా యాజమాన్యాలు వ్యక్తిగతంగా ఎదగడానికి మాత్రమే ఖర్చు చేస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీన్ని ‘ది గ్రేట్ ఇండియన్ శాలరీ క్రైసిస్’ అని పిలుస్తున్నారు. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని చంకలు చరిచేలోపే.. శ్రామిక శక్తి ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు నివ్వెర పరుస్తున్నాయి.దేశంలో ఆర్థిక పురోభివృద్ధి ఉన్నప్పటికీ సగటు కార్మికుడి పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా, వేతనాలు స్తబ్దుగా ఉన్నాయి. వారి సంపాదనకు, ఖర్చులకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. ఉద్యోగుల శ్రమకు తగిన ప్రతిఫలం ఉండకపోవడంతో వారి ఆర్థిక ప్రణాళికలు అస్తవ్యస్తంగా మారి ప్రధాన నగరాల్లోని నిపుణులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.స్తబ్దుగా వేతనాలుభారత జీడీపీ విస్తరిస్తున్నప్పటికీ జీతాల వృద్ధి మాత్రం గణనీయంగా మందగించింది. 2023 లో సగటు వేతన పెరుగుదల కేవలం 9.2% మాత్రమే ఉండడం దీనికి నిదర్శనం. ఈ పెంపు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా లేదు. ద్రవ్యోల్బణం రేట్లు ముఖ్యంగా ఆహారం, ఇంధనం, ఇతర నిత్యావసరాల ధరలు వేతనాల పెరుగుదలను మించిపోయాయి. కంపెనీలు రికార్డు లాభాలను నమోదు చేసేందుకు దోహదపడే ఉద్యోగుల వేతన పెంపుపై యాజమాన్యాలు మొండి వైఖరి అనుసరిస్తున్నాయి. సంపన్నులు, సగటు కార్మికుడి మధ్య ఆర్థిక అంతరం విస్తృతంగా పెరుగుతోంది. అధిక వేతనం పొందే రంగాల్లో కొంతమంది ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. తక్కువ ఆదాయ వర్గాల్లో ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఇదీ చదవండి: పాకిస్థాన్లో మైక్రోసాఫ్ట్ కార్యాలయం మూసివేతపట్టణాల్లో మరింత ఖర్చులునోయిడా, ఢిల్లీ, చెన్నై, పుణె, బెంగళూరు, హైదరాబాద్.. వంటి ప్రధాన పట్టణ కేంద్రాల్లో నివసిస్తున్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జీవన వ్యయం అదుపు తప్పడంతో నగరంలోని ఉద్యోగులు అధిక అద్దెలు, ఈఎంఐలు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులతో సతమతమవుతున్నారు. ఓ పాతికేళ్ల కిందట మోస్తారు ఖర్చులతో కాలం వెళ్లదీసుకొచ్చినవారికి ఇప్పుడు అవే ఖర్చులు ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేస్తున్నాయి.

రోబో ఇసుక.. ఇప్పుడిదే ప్రత్యామ్నాయం
సాక్షి, సిటీబ్యూరో: నది ఇసుక కొరత, అధిక ధరల కారణంగా గ్రేటర్ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇసుక రవాణా దారులు రేట్లు పెంచడం నిర్మాణ రంగానికి మరింత భారంగా పరిణమించింది. మహానగరంలో ఇసుక దొరకడం గగనమవడంతో బిల్డర్లు ప్రత్యామ్నాయంగా రోబో ఇసుక వినియోగాన్ని పెంచారు.ధర తక్కువే.. ఇప్పటికే కాంక్రీట్ మిక్సింగ్ యూనిట్లలో రోబో ఇసుక (క్రష్డ్ రాక్ సాండ్)ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇసుక రేట్లతో పోలిస్తే దీని ధర ఎంతో తక్కువ. అయితే రోబో ఇసుక విరివిరిగా దొరక్కపోవడం.. ప్రత్యేకంగా కొన్ని క్రషర్లలోనే ఇలాంటి ఇసుకను ఉత్పత్తి చేస్తుండటంతో సాధారణ గృహ నిర్మాణాల్లో దీని వినియోగం తక్కువగా ఉంది. అలాగే రోబో ఇసులాగే మెటల్ క్రషింగ్ స్టోన్ డస్ట్ కూడా ఉండటం వీటిలో నాణ్యమైన ఇసుకను గుర్తించడం కష్టంగా మారుతోంది.రోబో తయారీ ఈజీ.. నగర శివార్లలో విరివిగా లభ్యమయ్యే గ్రనైట్ శిలలతో రోబోశాండ్ను ఉత్పత్తి చేయవచ్చు. మెటల్ క్రషర్స్లో మిగిలిన వ్యర్థ శిలలను 2ఎంఎం, 1ఎంఎం పరిమాణంలో క్రష్ చేసి జల్లెడ పడితే ఈ ఇసుక తయారవుతుంది. తక్కువ సమయంలో నాణ్యత కలిగిన ఇసుకను తయారు చేయవచ్చన్నది నిపుణుల మాట. ఈ ఇసుకను నగరంలో రెడీమిక్స్ యూనిట్ల ద్వారా భారీ నిర్మాణాలకు వినియోగిస్తున్నారు.

పాకిస్థాన్లో మైక్రోసాఫ్ట్ కార్యాలయం మూసివేత
ప్రపంచ టాప్ టెక్ కంపెనీలో ఒకటైన మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ కార్యాలయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్లో తన కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ దేశంలో 25 సంవత్సరాలుగా సర్వీసులు అందిస్తున్న కంపెనీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో స్థానికంగా తన సర్వీసులను ముగించినట్లయింది. కంపెనీ గ్లోబల్ వర్క్ఫోర్స్ తగ్గింపు వ్యూహంలో భాగంగా పాకిస్థాన్లో ఈమేరకు మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఇప్పటికే స్థానికంగా ఉన్న క్లయింట్లకు క్షేత్రస్థాయిలో సర్వీసులు అందించేందుకు కంపెనీ ప్రాంతీయ కేంద్రాలు, అధీకృత రీసెల్లర్ల ద్వారా రిమోట్ సేవలు అందిస్తామని పేర్కొంది. ప్రస్తుత కస్టమర్ ఒప్పందాలు, సేవలు ప్రభావితం కాకుండా కొనసాగుతాయని తెలిపింది. ఆయా కంపెనీలకు నిత్యం మద్దతుగా నిలుస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. పాకిస్థాన్లో కంపెనీ తీసుకున్న నిర్ణయం వల్ల స్థానికంగా కేవలం కొద్దిమంది ఉద్యోగులు మాత్రమే ప్రభావితం చెందినప్పటికీ అక్కడి వ్యాపార, సాంకేతిక వర్గాల్లో ఆందోళనలు మొదలయ్యాయి.భారతదేశంలో మాదిరిగా కాకుండా మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్లో అభివృద్ధి లేదా ఇంజినీరింగ్ సర్వీసులు స్థాపించేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపలేదు. కేవలం అక్కడి యూనిట్ ద్వారా తన ప్రోడక్ట్లను ఇతర కంపెనీలతో అనుసంధానం చేసేందుకు, అమ్మకాల కార్యకలాపాలకే పరిమితం చేసింది. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఉద్యోగాల కోతకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇటీవల మొత్తంగా కంపెనీలో పని చేస్తున్న 9,000 పైగా ఉద్యోగాలను తగ్గించింది. ఈ విస్తృత సంస్థాగత పునర్నిర్మాణమే సంస్థ పాకిస్థాన్ నుంచి నిష్క్రమించేందుకు కారణమని ఆ దేశ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాస్తవానికి మైక్రోసాఫ్ట్ ఇప్పటికే పాక్ లైసెన్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ వంటి ప్రధాన విధులను కొన్ని సంవత్సరాలుగా ఐర్లాండ్లోని తన యూరోపియన్ హబ్కు మారుస్తోంది.ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపికబురుఅంతర్జాతీయంగా చాలాదేశాల్లో పాకిస్థాన్ ఉగ్రవాదానికి సంబంధించి వ్యతిరేకత ఉంది. స్థానికంగా పేదరికం పెరుగుతోంది. పాక్ ఆర్థిక వ్యవస్థ ఏటా దారుణంగా క్షీణిస్తోంది. దాంతో చాలా కంపెనీలు తమ కార్యకలాపాలను పరిమితం చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీ ఇలా మొత్తంగా తన కార్యాలయాన్ని షట్డౌన్ చేయడం అక్కడి టెక్ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది.
ఫ్యామిలీ

రెండే రెండు టిప్స్: 120 కిలోల నుంచి స్మార్ట్ అండ్ స్లిమ్గా
తమిళ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ వచ్చి అరంగేట్రంలోనే మంచి మార్కులు కొట్టేశాడు. స్పోర్ట్స్ ఆధారిత యాక్షన్ డ్రామా ఫీనిక్స్లో సూర్య ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఈ సందర్బంగా తన వెయిల్లాస్కు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు సూర్య. ‘ఫీనిక్స్’ సినిమా మొదలుకాకముందు నా బరువు దాదాపు 120 కిలోలు ఉండేవాడినని. ఈ బరువును తగ్గించుకోవడానికి నాకు ఒకటిన్నర సంవత్సరం పట్టిందట. మరి సూర్య వెయిట్లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం.120 కిలోల బరువుతో బాధపడుతున్న సూర్య ఉన్నట్టుండి అంత బరువు ఎలా తగ్గాడు అనేది నెట్టింట ఆసక్తికరంగా మారింది. ‘ఫీనిక్స్’ సినిమా మొదలుకాకముందు తన బరువు దాదాపు 120 కిలోలు ఉండేదని గుర్తు చేసుకున్న సూర్య దాదాపు సగం బరువు తగ్గించుకోవడం విశేషం. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్లో సూర్య ఫిట్నెస్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా కష్టపడి బరువు తగ్గానని తెలిపాడు. ఇందుకోసం తనకు ఒకటిన్నర సంవత్సరం పట్టిందన్నాడు. బరువు తగ్గే క్రమంలోనే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) నేర్చుకున్నానని, ఇదే సినిమాకు కూడా ప్రధానాంశం అని సూర్య వెల్లడించాడు.చదవండి: ఆరోగ్యానికి వెరీ ‘గుడ్డూ’.. ఎగ్స్ట్రా వెరైటీస్ ట్రై చేశారా?నుమ్ రౌడీ ధాన్లో తన తండ్రి చిన్నపటి వెర్షన్ను పోషించిన సూర్య ఫీనిక్స్లో తన ప్రధాన పాత్ర కోసం సిద్ధమయ్యేందుకు అనేక కసరత్తు చేశాడట. చాలా కఠినమైన శిక్షణ తీసుకున్నాడట. అలాగే తన ఆహార ప్రణాళికలలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సి వచ్చిందని, ఈ క్రమంలో మొదటి ఆరునెలలు, ఆయిల్, షుగర్ ఫుడ్స్కు పూర్తిగా దూరంగా ఉన్నానని, నిజంగా ఇది చాలా ఛాలెంజింగ్ పీరియడ్ అని చెప్పు కొచ్చాడు. మొత్తానికి హీరో అవ్వాలనే డ్రీమ్ను నెరవేర్చుకునేందుకు, స్లిమ్ అండ్ ట్రిమ్గా కనిపించేందుకు బరువు తగ్గాలని నిర్ణయించాడు. పట్టుదల, కఠినమైన శిక్షణతో చాలా ఓపిగ్గా తాను అనుకున్నది సాధించాడు.ఇదీ చదవండి: 7 నెలల్లో 35 కిలోలు..వాటికి దూరం: ఇదే నా సక్సెస్ అంటున్న నేహా

ఐపీఎస్కి ప్రిపేరవ్వుతున్న అమ్మాయికి రూ. 9 లక్షల ఇంటర్న్షిప్..!
ఆమె లక్ష్యం ఐపీఎస్..కానీ ఊహించని విధంగా రూ. 9 లక్షల ఇంటర్న్షిప్ని అదుకుని స్ఫూర్తిగా నిలిచింది. పైగా ఈ ఏడాది స్లీప్ ఆఫ్ది ఇయర్గా టైటిల్ని దక్కించుకుంది. ఎవరామె అంటే..పూణేకి చెందిన మాధవ్ వావల్ ఐపీఎస్ పోటీపరీక్షలకి సన్నద్ధమవుతోంది. ఆమె ఈ ఏడాది జరగుతున్న నాల్గో సీజన్ స్లీప్ ఇంటర్న్షిప్ పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది. మొత్తం 60 రోజుల నిద్ర ఛాలెంజ్ని స్వీకరించి రూ. 9.1 లక్ష ఇంటర్న్షిప్ని గెలుచుకుని స్లీప్ ఛాంపియన్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. దీంతో ఈ ఏడాది స్లీప్ ఇంటర్న్షిప్ నాల్గవ సీజన్ విజేతగా స్థానం కైవసం చేసుకుంది మాధవ్ వావల్. ఈ పోటీ భారతదేశంలో పెరుగుతన్న నిద్రలేమి సమస్యను నివారించడమే ముఖ్యోద్దేశంగా రూపొందించిన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇది. ఈ నిద్ర వర్క్షాప్లో మంచి నిద్ర అలవాటుని మెరుపరచడానికి ఉద్దేశించిన సవాళ్లను ఫేస్చేయాలి ఉంటుంది. పోటీలో పాల్గొనే వాళ్లు కళ్లకు గంతలు కట్టుకుని బెడ్ మేకింగ్ అలారం క్లాక్ల సాయంతో వారి నిద్ర నాణ్యతను అంచనా వేస్తారు వేక్ఫిట్ నిర్వాహకులు. ఇక్కడ మాధవ వావల్ ఈ పోటీలో 91.36 మార్కులు స్కోర్ చేసి తొలి స్థానంలో నిలిచింది. అలాగే ఆమె తోపాటు పాల్గొన్న మిగతా 15 మంది ఈ ఇంటర్న్షిప్ని పూర్తి చేసినందుకు గానూ ఒక్కొక్కరికి ఒక లక్ష్క చోప్పున నగదుని బహుమతిగా అందించారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?కనీస వయసు: దరఖాస్తు చేసుకునే సమయంలో 22 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. ఎంట్రీ: ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలిచేయు విధానం: దరఖాస్తు ఫామ్ని పూర్తిగి ఫిల్ చేయాల్సిందే అసంపూర్ణంగా సమర్పించిన దరఖాస్తులను పరగణించబడవుపోటీ జరుగు విధానం: తమ ఇళ్ల నుంచి ఎస్ఎంస్, ఇమెయిల్, వాట్సాప్ లేదా ఫోన్ కాల్ భాగస్వామ్యంతోఅలాగే పోటీదారుడి వివరాలను గోప్యంగానే ఉంచుతారు. ఆన్లైన్ ఫారమ్లు, వీడియో రెజ్యూమ్లు, ఇంటర్వ్యూల ద్వారా ఫైనలిస్ట్లను ఎంపిక చేస్తారు. కాగా, ఈస్లీప్ ఇంటర్న్షిప్ 2019 నుంచి ప్రారంభమైంది. ఇప్పటివరకు మొత్తం నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రతి సీజన్లో లక్షలాది మంది ఈ ఇంటర్న్షిప్కి దరఖాస్తు చేసుకోవడం విశేషం. 60 రోజులు రాత్రుళ్లలలో కనీసం 9 గంటలు నిద్రపోవడాని ప్రయత్నించినవారే పెద్దమొత్తంలో నగదుని గెలుచుకుంటారు. ఇక ఈ ఏడాది గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్కార్డ్ ప్రకారం సుమారు 58% మంది భారతీయులు రాత్రి 11 గంటల తర్వాతే పడుకుంటారని, అందువల్ల ఉదయం అలసటను ఎదుర్కొటున్నట్లు పేర్కొంది. (చదవండి: నాన్నా నా పెళ్లిలో డ్యాన్స్ చేస్తావా..? ఆ మాటలే ఊపిరి పోశాయి..)

పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష నవమి భక్తులకు నిరుత్సాహం
భువనేశ్వర్: పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష నవమి రోజున గుండిచా ఆలయంలో నవమి సంధ్యా దర్శనం ప్రాప్తిస్తుంది. అడపా మండపంపై ఒక రోజు దర్శనం శ్రీ మందిరం నీలాద్రి మండపంపై జగతినాథుడు శ్రీ జగన్నాథ స్వామి ( Lord Jagannath ) పది సంవత్సరాల దర్శనం పుణ్యఫలం ప్రసాదిస్తుందని పౌరాణిక కథనాలు సూచిస్తున్నాయి. స్వామి జన్మస్థలం అడపా మండపంపై పగటి పూట దర్శనం కంటే సంధ్య వేళ దర్శనం పుణ్యం పది రెట్లు అధికంగా లభిస్తుంది. అందుచేత నవమి సంధ్యా దర్శనం ప్రాధాన్యత సంతరించుకుంది. అడపా మండపంపై శ్రీ నవమి సంధ్యా దర్శనం సాయంత్రం 6 గంటల వరకే పరిమితం చేశారు. స్వామి మారు రథ యాత్ర బహుడా యాత్రకు ముందస్తు సన్నాహాలు, బహుళ సేవల ఆచరణ ఒత్తిళ్ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీ మందిరం పాలక వర్గం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ గుండిచా ఆలయ సింహ ద్వారం గుండా ప్రవేశం నివారించారు. దీంతో భక్తులకు నవమి నాడు సంధ్య వేళలో దర్శనం ప్రాప్తి లేకుండా పోయింది. సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇదీ చదవండి: జగన్నాథుడి కల్కి అవతారం : మారు రథయాత్రశ్రీ గుండిచా ఆలయ శుద్ధి తర్వాత తర్వాత అడప మండపంపై అనేక ముఖ్యమైన సేవలను నిర్వహించాల్సి ఉంటుంది. బహుడా యాత్ర రోజున రథంపై మూల విరాటులను దర్శించుకునే అవకాశం భక్తులు పొందుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు భక్తజన వర్గం జగతి నాథుని పట్ల భక్తి పూర్వక సేవ, అంకితభావంతో సహకరించాలని అభ్యర్థించారు.. అనుబంధ వర్గాల సేవకుల సహకారం, సమన్వయంతో బహుడా సంబంధిత సేవల్ని సకాలంలో పూర్తి చేయాలని అభ్యర్థించారు.

Jagannath Rath Yatra: కల్కి అవతారం : నేడు మారు రథయాత్ర
భువనేశ్వర్: శ్రీ గుండిచా ఆలయంలో భక్తులు శ్రీ జగన్నాథుని సంధ్యా దర్శనం కోసం తండోపతండాలుగా తరలి వచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు పరిమితం చేశారు. అడప మండపంపై ఇది చివరి దర్శనం. ఈ సందర్భంగా శారదా బాలి జనసముద్రంగా మారింది. మహా ప్రభువు దర్శనం కోసం బొడొశొంఖొ వరకు బారులు తీరారు. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వైబీ ఖురానియా శుక్రవారం శ్రీ గుండిచా ఆలయం ప్రత్యక్షంగా సందర్శించారు. ఈ సందర్భంగా శారదా బాలి ప్రాంగణంలో భక్తుల రద్దీ నియంత్రణ, మారు రథ యాత్ర భద్రతా సన్నాహాల్ని ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఇదీ చదవండి: Antidepressants మహిళల మెదడు సేఫే, బట్ పురుషులకే!బహుడా యాత్ర పురస్కరించుకుని పోలీసులు వాహనాల రవాణా వ్యవస్థ కట్టుదిట్టం చేశారు. అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ దయాళ్ గంగ్వార్ ప్రత్యక్షంగా ఈ బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి ప్రజలకు బల్క్ సందేశాలు పంపిస్తారు. జన సందోహం ఉన్న చోట డ్రోన్, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అన్ని ఫోన్లకు సందేశాలు పంపిస్తారు. అదనంగా జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఎల్ఈడీల ద్వారా కూడా వాహన చోదకులకు సమాచారం ప్రసారం చేస్తారు. నవమి సంధ్యా దర్శనం, మారు రథ యాత్ర బహుడా భద్రత, రక్షణల సమగ్ర వ్యవస్థని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వైబీ ఖురానియా పర్యవేక్షించారు. జన్మ వేదికపై శ్రీ జగన్నాథుని చివరి దర్శనం క్రమబదీ్ధకరణ కార్యాచరణని పరిశీలించారు. శాంతిభద్రతల ఏర్పాట్లపై ఆయన దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఇతర సీనియర్ అధికారులతో పోలీస్ డైరెక్టర్ జనరల్ సమావేశమయ్యారు. కల్కి అవతారంలో జగన్నాథుడు పర్లాకిమిడి: స్థానిక గుండిచా మందిరంలో జగన్నాథ స్వామి శుక్రవారం కల్కి అవతారంలో భక్తులకు దర్శనం కల్పించారు ఈ రోజుతో దశవతారాలు పూర్తయ్యాయి. శనివారం బహుడా యాత్ర సందర్భంగా శ్రీజగన్నాథరథాలు తిరుగుముఖం పెట్టారు. గుండిచా మందిరం వెలుపల ఆనందబజార్లో శుక్రవారం భక్తులకు ఉచితంగా ఓబ్బడా (అన్న ప్రసాదం) రథాయాత్ర కమిటీ అందజేసింది
ఫొటోలు


ఆద్యంతం ఉత్కంఠను రేపే మిస్టరీ పర్యాటక ప్రదేశాలివే..! (ఫోటోలు)


విజయవాడ : రైలు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణపై మెగా మాక్ డ్రిల్ (ఫొటోలు)


అనంతపురం : గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)


జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)


హైదరాబాద్ : సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్లో చుక్కలు (ఫొటోలు)


ఆషాడమాసం.. విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ (ఫోటోలు)


ఆరునెలల జ్ఞాపకాలు పంచుకున్న ప్రభాస్ సోదరి (ఫోటోలు)


'అఖండ' కోసం తెలుగులో ఎంట్రీ ఇచ్చేసిన నటి హర్షాలీ మల్హోత్రా (ఫోటోలు)


గర్భాలయంలో ఏడడుగుల విగ్రహం.. ఏపీలో ఈ పురాతన ఆలయం గురించి విన్నారా? (చిత్రాలు)


నలుగురు టాప్ హీరోయిన్లతో ధనుష్ పార్టీ.. ఎందుకో తెలుసా (ఫోటోలు)
అంతర్జాతీయం

షుగర్ డ్రింక్స్, మద్యం, పొగాకుపై... పన్నుల మోత మోగించండి!
నానాటికి మారుతున్న జీవన శైలి ప్రజలను రోగాల బారిన పడేస్తోంది. డయాబెటిస్, కేన్సర్వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరిగిపోతున్నాయి. వీటికి చెక్ పెట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొత్తరకం ప్రతిపాదన చేసింది. ‘‘చక్కెర పానీయాలు, మద్యం, పొగాకు ధరలు రాబోయే పదేళ్లలో కనీసం 50 శాతం పెరగాలి. వాటిపై ఆ మేరకు పన్నులు పెంచండి’’ అని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. స్పెయిన్లోని సెవిల్లెలో జరిగిన ఫైనాన్స్ ఫర్æ డెవలప్మెంట్ సమావేశం ఈ మేరకు సిఫార్సు చేసింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. వాటిపై పన్నులను మరింతగా పెంచితే మధుమేహం, కేన్సర్ తదితర వ్యాధులకు కారణమయ్యే హానికరమైన ఉత్పత్తుల వాడకాన్ని బాగా తగ్గించవచ్చని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది. ‘‘దేశాల దగ్గరున్న అత్యంత సమర్థమైన నియంత్రణ సాధనాల్లో పన్నులు ముఖ్యమైనవి. ప్రజారోగ్యమే లక్ష్యంగా చక్కెర పానీయాలు, మద్యం, పొగాకు వంటివాటి వాడకాన్ని పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది’’ అని డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ప్రమోషన్, వ్యాధి నివారణ విభాగం అసిస్టెంట్ డెరెక్టర్ జనరల్ జెరెమీ ఫర్రార్ అన్నారు. ఆ దేశాల్లో సత్ఫలితం కొలంబియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఈ దిశగా చేసిన ప్రయోగం మంచి ఫలితాలిచ్చింది. అదనపు పన్నులతో పొగాకు తదితరాల ధరలు విపరీతంగా పెరగడంతో వాటి వాడకం బాగా తగ్గింది. అయితే డబ్ల్యూహెచ్ఓ సిఫార్సులను పొగాకు తదితర పరిశ్రమలు వ్యతిరేకిస్తున్నాయి. ‘‘చక్కెర, తీపి పానీయాలపై పన్నుల వల్ల ఏ దేశంలోనూ ఆరోగ్య ఫలితాలు మెరుగుపడలేదు. ఊబకాయం వంటివి తగ్గలేదు. ఇలాంటి స్పష్టమైన ఆధారాలను డబ్ల్యూహెచ్ఓ విస్మరించడం ఆందోళనకరం’’ అని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆ‹ఫ్ బెవరేజెస్ అసోసియేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేట్ లోట్మాన్ విమర్శించారు. మరోవైపు, ఇది ప్రజారోగ్యం సాకుతో పన్నుల భారం పెంచే యత్నమని కూడా విమర్శలొస్తున్నాయి. పన్నులు పెంచడం ఆల్కహాల్ సంబంధిత హానిని నివారిస్తుందనడం పక్కదారి పట్టించడమేనని డిస్టిల్డ్ స్పిరిట్స్ కౌన్సిల్లో సైన్స్ అండ్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమండా బెర్గర్ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ బ్లూంబర్గ్, ప్రపంచ బ్యాంకు, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ మాత్రం పన్ను పెంపు ప్రతిపాదనను సమరి్థంచాయి. ఇందుకు ముందుకొచ్చే దేశాలకు తోడ్పడతామని చెప్పుకొచ్చాయి. 2012–22 మధ్య దాదాపు 140 దేశాలు పొగాకు ఉత్పత్తులపై పన్నులను 50 శాతం పైగా పెంచాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాలపైనా పన్ను పెంచే యోచనలో ఉన్నాయి. భారత్లో ఇలా... భారత్లో కూడా కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలపై ఆరోగ్య పన్ను విధించాలని వైద్య నిపుణుల నేతృత్వంలోని జాతీయ కన్సారి్టయం సూచించింది. అంతేగాక పిల్లల ఆహార పదార్థాల మార్కెటింగ్పై కఠినమైన నియమాలు విధించాలని కోరింది. భారత్లో కౌమార దశలో ఉన్నవారిలో ఊబకాయం బాగా పెరుగుతుండటంపై ఇండియన్ కౌన్సిల్ ఆ‹ఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆ‹ఫ్ న్యూట్రిషన్ ఆందోళన వ్యక్తం చేశాయి. యువత ఆహారపు అలవాట్లను మార్చడానికి, మెరుగుపరచడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. క్యాంటీన్లలో, విద్యా సంస్థల సమీపంలో కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా ఉన్న ఆహార పదార్థాల విక్రయాన్ని నిషేధించాలని డిమాండ్ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్

7 గంటలు.. 550 డ్రోన్లు
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా మరోసారి భీకర దాడులకు తెరతీసింది. గురువారం రాత్రి కేవలం 7 గంటల వ్యవధిలో 550 వరకు డ్రోన్లు, 11 క్షిపణులను ప్రయోగించింది. రష్యా మూడేళ్ల క్రితం ఉక్రెయిన్పై దురాక్రమణ ప్రారంభించాక చేపట్టిన అతిపెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు. షహీద్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల పేలుళ్ల మోతలతో కీవ్ దద్దరిల్లింది. సైరన్లు రాత్రంగా మోగుతూనే ఉన్నాయి. కీవ్లో ఐదంతస్తుల నివాస భవనం పాక్షికంగా ధ్వంసం కాగా, ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఒక గోదాము, ఒక గ్యారేజీ, ఆటో రిపేర్ కేంద్రం సైతం మంటల్లో చిక్కుకున్నాయి. కీవ్లోని రైల్వే వ్యవస్థ దెబ్బతిందని అధికారులు తెలిపారు. తెల్లారేసరికి కీవ్ రోడ్లన్నీ ధ్వంసమైన, కాలిపోయిన వాహనాలు, భవనాల వ్యర్థాలతో నిండిపోయాయి. ఈ దాడుల్లో 23 మంది గాయపడినట్లు సమాచారం. ‘మా ప్రజలు కఠినమైన, నిద్ర లేని రాత్రి గడిపారు’అని అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. ప్రజలు మెట్రో స్టేషన్లు, బేస్మెంట్లు, భూగర్భ పార్కింగ్ గ్యారేజీల్లోకి పరుగులు తీశారని ఉక్రెయిన్ మంత్రి యూలియా తెలిపారు. కీవ్తోపాటు మరో ఐదు ప్రాంతాలపైకి రష్యా దాడులు చేసిందని జెలెన్స్కీ చెప్పారు. తాము 270 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషణ జరిపిన రోజే తాజా దాడి జరగడం గమనార్హం.యుద్ధం ఆపుతాడని అనుకోవడం లేదు:ట్రంప్రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్ సంభాషణ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణపై పుతిన్ సానుకూలంగా స్పందించారా అన్న ప్రశ్నకు ఆయన.. లేదు. ఈ విషయంలో ఎలాంటి పురోగతి సాధించలేదు. ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న దాడులపై నాకు సంతోషంగా లేదు. ఈ యుద్ధాన్ని పుతిన్ ఆపుతారని నేను అనుకోవడం లేదు’అని వ్యాఖ్యానించారు.

భూమిపైకి కుసుమ ఖడ్గం
వాషింగ్టన్: అంతరిక్షంలో పుట్టుకొచ్చిన ఎర్రని కాంతి మొలకలా, అప్పుడే విచ్చుకుంటున్న కలువ పువ్వులా ఉంది కదూ! కానీ నిజానికది భూమిపైకి అమాంతంగా దూసుకొస్తున్న కాంతి ఖడ్గం! ఉరుములు మెరుపులతో కూడిన తుఫానుకు కారణమయ్యే మేఘాల పై ఆవరణలో, అంటే మిసోస్ఫియర్లో పిడుగుపాట్లు సంభవిస్తే ఇలాంటి కాంతిపుంజాలు ఏర్పడుతుంటాయి. వీటిని ట్రాన్సియెంట్ ల్యూమినస్ ఈవెంట్ (టీఎల్ఈ) చెబుతుంటారు. సాధారణంగా వీటిని భూమిపై నుంచి చూడడం కష్టం. అంతరిక్షం నుంచి మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఫొటోను వ్యోమగామి నికోల్ వేపర్ అయెర్స్ శుక్రవారం ఉదయం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి తీశారు. మెక్సికో, అమెరికా మీదుగా ఐఎస్ఎస్ ప్రయాణిస్తున్న సమయంలో ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘భూమిపై కాంతి స్తంభం’’గా దీన్ని అభివర్ణించారు. ఇదిప్పుడు శాస్త్ర, సాంకేతిక ప్రపంచాన్ని ఎంతగానో అబ్బురపరుస్తోంది. వీటిని సాంకేతిక భాషలో స్ప్రైట్ లైట్నింగ్ బోల్డ్ (ఎస్ఎల్బీ) అంటారు. సాధారణ పిడుగుపాట్లు మేఘాల నడుమ, లేదంటే మేఘాలకు, నేలకు నడుమ పడుతుంటాయి. ఈ ఎస్ఎల్బీలు మాత్రం మెసోస్పియర్లోని పలుచని ఆవరణలోనే పేలిపోతాయి. తద్వారా ఇలాంటి ఎర్రని ‘మొలకలు’ పుట్టుకొస్తుంటాయి.

ఆకాశం సైతం హద్దు కాదు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్ త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం తథ్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంచేశారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలంగా ఉందని పేర్కొన్నారు. కృత్రిమ మేధ(ఏఐ), సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో ఇండియా శరవేగంగా దూసుకెళ్తోందని, అవి సరికొత్త గ్రోత్ ఇంజన్లుగా మారాయని వెల్లడించారు. ఆయన స్థానిక కాలమానం ప్రకారం గురువారం కరీబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలోని కౌవా పట్టణంలో ప్రవాస భారతీయుల కార్యక్రమంలో ప్రసంగించారు. ఇండియా నేడు అవకాశాల గనిగా మారిందని, అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. నవ భారతదేశానికి ఆకాశం సైతం హద్దు కాదని వ్యాఖ్యానించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని భారతీయులు వారి సొంత భూమిని వదిలేసి వచ్చినప్పటికీ భారతీయ ఆత్మను మాత్రం వదులుకోలేని చెప్పారు. గంగా, యమున నుంచి దూరంగా వచ్చారు గానీ రామాయణాన్ని హృదయంలోనే నిలుపుకున్నారని ప్రశంసించారు. ప్రవాస భారతీయులు కేవలం వలసదారులు కాదని.. గొప్ప నాగరికతకు దూతలు అని తెలి పారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... ‘‘ప్రవాస భారతీయుల సేవలు ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ ప్రగతికి తోడ్పడుతున్నాయి. సాంస్కృతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా వారు ఎంతో సేవ చేస్తున్నారు. ఇక్కడ ప్రవాస భారతీయుల ప్రభావం ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. అయోధ్య రామమందిర నమూనా, సరయూ నది జలాలను, మహాకుంభమేళా జరిగిన త్రివేణి సంగమం నీటిని ఇక్కడికి నాతోపాటు తీసుకొచ్చా. అందుకు ఎంతగానో గర్విస్తున్నా. ఈ పవిత్ర జలా లను ఇక్కడి గంగాధారలో చల్లాలని ప్రధానమంత్రి కమలకు విజ్ఞప్తి చేశా. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రజలకు ఇదొక ఆశీర్వచనం అవుతుంది. భారత్ ప్రగతికి యువతే చోదక శక్తి పేదల అభివృద్ధి, సాధికారతకు పెద్దపీట వేయడం ద్వారా పేదరికాన్ని ఓడించవచ్చని భారత్ నిరూపించింది. పేదరికం నుంచి దేశానికి పూర్తిగా విముక్తి కల్పించవచ్చన్న విశ్వాసాన్ని పెంచాం. ఇండియా ప్రగతికి శక్తిసామర్థ్యాలు కలిగిన యువతే చోదక శక్తిగా నిలుస్తోంది. నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ ఇండియాలోనే ఉంది. ఇందులో సగం స్టార్టప్లకు మహిళలే డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. 120 స్టార్టప్లు యూనికార్న్ స్థాయికి ఎదిగాయి. ప్రపంచంలోని మొత్త యూపీఐ చెల్లింపుల్లో 50 శాతం ఇండియాలోనే జరుగుతున్నాయి. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో కొత్తగా యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ప్రారంభించినందుకు అభినందనలు తెలియజేస్తున్నా. గుడ్ మారి్నంగ్ అని మెసేజ్ పంపించుకున్నంత సులువుగా డబ్బులు పంపించుకోవచ్చు. వెస్టిండీస్ బౌలింగ్ కంటే కూడా ఇది స్పీడ్గా ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నా’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇవ్వద్దుపోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఉగ్రవాదానికి మానవాళికి శత్రువుగా మారిందని, దానికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరూ ఆశ్రయం ఇవ్వొద్దని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదిరించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశమని వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము సాగిస్తున్న పోరాటానికి ఈ దేశం మద్దతిస్తోందని, అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం తమ అత్యున్నత పురస్కారం ‘ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’తో నరేంద్ర మోదీని సత్కరించింది.బిహార్ వారసత్వం గర్వకారణం ట్రినిడాడ్ అండ్ టొబాగోకు ఇండియాలోని బిహార్ రాష్ట్రంతో చక్కటి అనుబంధం ఉందని నరేంద్ర మోదీ చెప్పారు. బిహార్ వారసత్వం భారతదేశానికి, ప్రపంచానికి గర్వకారణమని అన్నారు. ఇక్కడున్న చాలామంది భారత సంతతి ప్రజల పూర్వీకులు బిహార్ నుంచి వచ్చినవారేనని తెలిపారు. బిహార్కు ఘనమైన వారసత్వం ఉందని పేర్కొన్నారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమలా పెర్సాద్ బిసెసార్ పూర్వీకులు సైతం బిహార్కు చెందినవారేనని చెప్పారు. ఆమె బిహార్ను సందర్శించారని, భారతీయులు ఆమెను ‘బిహార్ బిడ్డ’గా పిలుస్తుంటారని అన్నారు. భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. బిహార్కు చెందిన భోజ్పురి భాషను ట్రినిడాడ్ అండ్ టొబాగోలో కూడా చాలామంది మాట్లాడుతుంటారని వివరించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు.మోదీకి సంప్రదాయ స్వాగతం ఘనా నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగో చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. దేశ ప్రధానమంత్రి కమలా పెర్సాద్ బిసెసార్తోపాటు మంత్రులు, అధికారులు ఆయనకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. భారత సంతతికి చెందిన కమలా పెర్సాద్ బిసెసార్ ఈ సందర్భంగా భారతీయ సంప్రదాయ చీర ధరించారు. అనంతరం ప్రవాస భారతీయుల సమావేశంలో మోదీతోపాటు ఆమె పాల్గొన్నారు. ‘బిహార్ కీ బేటీ’ అంటూ కమలపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ రాసిన పుస్తకంలోని ‘ఆంఖ్ కా ధన్యా చే’ పద్యాన్ని కమల ఆలపించి అందరినీ ఆశ్చర్యపర్చారు. భారత్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలాన్ని ఆమెకు మోదీ బహూకరించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా కమలా పెర్సాద్ బిసెసార్ రికార్డుకెక్కారు.
జాతీయం

శానిటరీ నేప్కిన్స్ ప్యాకెట్లపై రాహుల్ బొమ్మ
పట్నా: బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మహిళలను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం విమర్శలపాలైంది. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళలకు ఉచితంగా శానిటరీ నేప్కిన్స్ను పంపిణీ చేయాలని పార్టీ తలపెట్టింది. అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2,500 అందజేయడంతోపాటు ఉచితంగా నేప్కిన్లు అందజేస్తామని ప్రకటించింది. ఆ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ బొమ్మను ముద్రించడం వివాదం రేపింది. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు ఇదో ఉదాహరణ అంటూ అధికార జేడీ(యూ) మండిపడింది

బీహార్లో ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ నేత దారుణ హత్య
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ బీహార్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడు గోపాల్ ఖేమ్కాపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో గోపాల్ అక్కడిక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన బీజేపీ నాయకుడు గోపాల్ ఖేమ్కా శుక్రవారం రాత్రి పాట్నాలోని తన ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇంటి వద్ద కొందరు దుండగులు.. ఆయనపై కాల్పులు జరిపారు. గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పనాచే హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. గోపాల్.. హోటల్కు ఆనుకుని ఉన్న ట్విన్ టవర్ సొసైటీలో నివాసం ఉంటున్నారు. నిందితుడు ఆయనపై కాల్పులు జరిపిన వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కాల్పుల్లో గోపాల్ ఖేమ్కా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఒక బుల్లెట్, షెల్ కేసింగ్ను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా సిటీ ఎస్పీ దీక్ష మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గోపాల్ ఖేమ్కాపై కాల్పులు జరిగినట్టు మాకు సమాచారం అందించింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆయనను ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందారు. నిందితుడిని గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం. ఈ హత్య వెనుక కారణం ఇంకా తెలియలేదు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.VIDEO | Patna, Bihar: Businessman Gopal Khemka shot dead near his house. Visuals from his residence. Police investigation on.#BiharNews #PatnaNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/ZkHIzWJbnE— Press Trust of India (@PTI_News) July 5, 2025ఇదిలా ఉండగా.. ఆయన కుమారుడు గుంజన్ ఖేమ్కా మూడేళ్ల క్రితం హత్యకు గురయ్యారు. మరోవైపు.. పూర్నియాకు చెందిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ అలియాస్ రాజేష్ రంజన్ నిన్న రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్లో ఎవరూ సురక్షితంగా లేరు. బీహార్ నేరస్థులకు స్వర్గధామంగా మారింది. నితీష్ జీ.. దయచేసి బీహార్ను విడిచిపెట్టండి. గుంజన్ ఖేమ్కా హత్యకు గురైనప్పుడే నేరస్థులపై చర్యలు తీసుకుని ఉంటే.. ఈరోజు గోపాల్ ఖేమ్కాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు.#WATCH | Patna, Bihar | On businessman Gopal Khemka being shot dead, SP Patna Diksha says, "On the night of July 4, at around 11 pm, we received information that businessman Gopal Khemka has been shot dead in the south area of the Gandhi Maidan... The crime scene has been… pic.twitter.com/o8C0gVoz7B— ANI (@ANI) July 5, 2025

క్షమాపణ చెప్పండి.. పరిహారం చెల్లించండి
ముంబై: సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న కొల్హాపురి చెప్పుల డిజైన్ను అనుమతి లేకుండా వాడుకున్న ఫ్యాషన్ బ్రాండ్ ప్రాడాపై పిల్ దాఖలైంది. మేధో సంపత్తి హక్కుల రంగంలో పనిచేసే ముంబై, పూణేలకు చెందిన న్యాయవాదుల బృందం ఈ పిటిషన్ను దాఖలు చేసింది.ఈ సందర్భంగా ‘కొల్హాపురి చప్పల్’ ఏఐ ఉత్పత్తిని అనధికారికంగా ఉపయోగించడాన్ని అంగీకరిస్తూ, ప్రాడా గ్రూప్, ప్రాడా ఇండియా ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఏఐలను అనధికారికంగా ఉపయోగించకుండా ఉండేలా చూడాలని పిటిషన్ కోరింది. భారతీయ కళాకారుల హక్కులను గుర్తించాలని డిమాండ్ చేసింది. కళాకారుల ప్రతిష్ట, ఆర్థిక నష్టానికి పరిహారం చెల్లించాలని కూడా పిటిషన్ కోరింది.జూన్ 22న ఇటలీలోని మిలన్లో జరిగిన అంతర్జాతీయ ఫ్యాషన్ ఈవెంట్.. స్ప్రింగ్ సమ్మర్ మెన్స్ కలెక్షన్–2026 సందర్భంగా ‘కొల్హాపురి చప్పల్’ను ప్రాడా బ్రాండ్ ఉపయోగించింది. ఫ్యాషన్ షో వీడియోలు వైరల్ కావడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ప్రదర్శనలో ప్రాడా మోడల్స్ ధరించిన పాదరక్షలు అచ్చం సంప్రదాయ కొల్హాపురి చెప్పుల మాదిరిగానే ఉన్నాయి. వాటి డిజైన్లకు శతాబ్దాల వారసత్వం కలిగిన సంప్రదాయ పాదరక్షల నుంచి ప్రేరణ పొందినట్టు ప్రాడా కూడా అంగీకరించింది.

6న దలైలామా 90వ జన్మదిన వేడుక
ధర్మశాల: టిబెటన్ల బౌద్ధ గురువు దలై లామా 90వ పుట్టిన రోజు వేడుకకు భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. హిమాలయాల్లోని మెక్లియోడ్గంజ్ పట్టణంలోగల ప్రధాన దలై లామా ఆలయం ట్సుగ్లంగ్ఖంగ్కు కాషాయ వ్రస్తాలు ధరించిన బౌద్ధ భిక్షువుల తాకిడి పెరుగుతోంది. టిబెటన్ ప్రవాస ప్రభుత్వం ఇక్కడే కొలువై ఉన్నందున ఈ పట్టణాన్ని లిటిల్ లాసా అని కూడా పేర్కొంటారు. లామా పుట్టినరోజు వేడుకలతోపాటు ఇక్కడ పలు కార్యక్రమాలు జరగనున్నాయి. దలై లామా తదుపరి వారసుడిని సైతం ప్రకటించనున్నారు. దీంతో, ఇక్కడ జరిగే పరిణామాలను ప్రపంచమే ఆసక్తిగా గమనిస్తోంది. జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభమైన వారోత్సవాల్లో మత సదస్సులు, యువజన వేదికలు, సామూహిక ప్రార్థనలు జరుగనున్నాయి. ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు జరిగిన 15వ టిబెటన్ మత సదస్సుకు 100 మందికి పైగా టిబెటన్ బౌద్ధ నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. అదేవిధంగా, 3– 5వ తేదీల్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టిబెటన్ యూత్ ఫోరం సదస్సుకు 15 దేశాలకు చెందిన 100 మందికి పైగా తరలివచ్చారు. దలై లామా పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 5న ప్రవాసంలోని టిబెటన్ ప్రభుత్వ కేబినెట్ ‘కషగ్’ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలు జరగనున్నాయి. ప్రధాన టిబెటన్ ఆలయంలో జరిగే ఈ కార్యక్రమానికి టిబెటన్ల తరఫున దలై లామా సైతం హాజరై ప్రార్థనల్లో పాల్గొంటారని సెంట్రల్ టిబెటన్ యంత్రాంగం తెలిపింది. టిబెటన్ల స్వాతంత్య్ర పోరాటాన్ని వివరించే షెన్పెన్ ఖిమ్సార్ దర్శకత్వం వహించిన ‘4 రివర్స్ 6 రేంజెస్’సినిమా ప్రదర్శన 5న సాయంత్రం ఉంటుందని పేర్కొంది. ప్రముఖులు హాజరు జూలై 6న 14వ దలై లామా 90వ పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి. ప్రత్యేకంగా జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, అరుణాచల్ సీఎం పెమా ఖండూ, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాల్, హాలీవుడ్ స్టార్ రిచర్డ్ గెరె తదితర ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా తదుపరి దలై లామాను సైతం ప్రకటిస్తారు. జూలై 7–9వ తేదీల్లో టిబెటన్ కళలు, వైద్యం, సాహిత్యం, మతం, విద్య సంబంధిత ప్రదర్శనలుంటాయి. వైద్య శిబిరం సైతం నిర్వహిస్తారు. టిబెటన్ బౌద్ధులు దలై లామాను బుద్ధుని సజీవ రూపంగా ఆరాధిస్తారు. దలై లామా వారసత్వం కొనసాగుతుందని, గడెన్ ఫొడ్రంగ్ ట్రస్ట్కు మాత్రమే భవిష్యత్తు లామాను నిర్ణయించే అధికారం ఉందని, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరాదని దలై లామా బుధవారం స్పష్టం చేయడం తెల్సిందే. అయితే, వారసుడి నిర్ణయంపై తమ అనుమతి తప్పక ఉండాల్సిందేనని చైనా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా పాలక కమ్యూనిస్ట్ పారీ్టతో టిబెటన్ బౌద్ధమతం దశాబ్దాలుగా సాగిస్తున్న పోరాటంలో నూతన అధ్యాయం మొదలుకానుంది.
ఎన్ఆర్ఐ

చిన్న జీయర్ స్వామి తొలిసారి స్కాట్లాండ్ సందర్శన
బోనెస్: భువన విజయం సంస్థ, జెట్ యుకే నిర్వహించిన కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి పాల్గొన్నారు. ఆయనకు బోనెస్లో ఘన స్వాగతం లభించింది. జూన్ 29న బోనెస్లో జరిగిన ఉపన్యాస కార్యక్రమానికి దాదాపు 500 మంది భక్తజనం హాజరయ్యారు. స్వాగత ఊరేగింపు కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు పర్రి స్వామీజీకి పూలమాలతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన తనయుడు అద్వితీయ్ అర్జున్ రాజు పర్రి స్కాటిష్ కళైన బ్యాగ్పైప్ను స్థానిక కళాకారులతో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రసాద్ మంగళంపల్లి, ముఖ్య అతిథి డా. శ్రీహరి వల్లభజౌస్యుల సంయుక్తంగా పూర్ణకుంభ స్వాగతం నిర్వహించారు. సాయి దొడ్డ వారి సమూహం సాంప్రదాయ బద్దంగా కోలాటం ప్రదర్శించారు. పిల్లలు సంయుక్త నృత్యం పుష్పమాల సమర్పణ. శైలజ గంటి, హిమబిందు జయంతి, మమత వుసికల నిర్వహించిన మంగళ ఆరతి వరకు అన్ని క్షణాలు ఉత్సాహభరితంగా సాగాయి. రంజిత్ నాగుబండి సమన్వయం చేయగా, మిథిలేష్ వద్దిపర్తి కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఈ కార్యక్రమానికి రాజశేఖర్ జాల జెట్ యూకేతో సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. వేదికపై ప్రదర్శింపబడిన కుచిపూడి నృత్యం, ఆరాధనామయ రామ సంకీర్తనం, వీణా వాయిద్య ప్రదర్శన, శ్రీ విష్ణు సహస్రనామ పఠనం, ప్రజ్ఞ పిల్లల శ్లోక పఠన కార్యక్రమాలు ఆహూతులను అలరిస్తూ సాగాయి.ఆ పిదప స్వామీజీ “Ego, Equality & Eternity — A Journey from Self to Supreme” అనే ఉపన్యాసంలో నిత్యవేదాంతసారాన్ని ఆధునిక జ్ఞానంతో మేళవిస్తూ, “అహంకారాన్ని అధిగమించిన ప్రతి హృదయంలో సమానత్వాన్ని, ప్రతి శ్వాసలో శాశ్వతత్వాన్ని కనుగొంటాం” అని ఉత్సాహపూరితంగా పేర్కొన్నారు. ఆయన "భువన విజయం" అనే పేరు వింటే రోమాలు నిక్కబొడుస్తున్నట్లు అనిపిస్తోందన్నారు, ఐదున్నర శతాబ్దాల తరువాత భువన విజయం సభ ప్రాభవాన్ని పునరుజ్జీవింపజేసినందుకు సంస్థను అద్భుతంగా భావించారు.కోర్ బృందం పర్యవేక్షణలో, 30 మంది వాలంటీర్లు అవిశ్రాంతంగా పనిచేశారు. ఈ కార్యక్రమం విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. "పుష్ప స్వాగతం నుండి ప్రసాదం చివరి పంపిణీ వరకు, ఈ కార్యక్రమం స్కాటిష్-తెలుగు సంప్రదాయాలను భక్తి, ఐక్యతతో మిళితం చేసింది" అని వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు ప్యారీ అభిప్రాయపడ్డారు. జీయర్ స్వామి మీద కోదండరావు అయ్యగారి వ్రాసిన పద్యాలను ప్రశంస పత్ర రూపంలో భువన విజయం సభ్యులు స్వామి వారికి బహూకరించారు.
NASA astronaut Anil Menon to embark on historic first Space Mission aboard Soyuz MS-29
భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి అనిల్ మీనన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి తొలి మిషన్ను ప్రారంభించబోతున్నారు. ఫ్లైట్ ఇంజనీర్గా , ఎక్స్పెడిషన్ 75 సభ్యుడిగా రోస్కోస్మోస్ సోయుజ్ MS-29 అంతరిక్ష నౌకలో ప్రయాణిస్తారు. అనిల్తోపాటు రోస్కోస్మోస్ వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్ ,అన్నా కికినా కూడా పాలు పంచుకుంటారు.2026న జూన్లో ఎనిమిది నెలల పాటు ఈ చారిత్మాత్మక యాత్ర సాగనుంది.

భారత సంతతి నాసా వ్యోమగామి అనిల్ మీనన్ మరో ఘనత
భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి అనిల్ మీనన్ (Anil Menon) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి తన మొదటి మిషన్ను ప్రారంభించబోతున్నారు. ఫ్లైట్ ఇంజనీర్గా, ఎక్స్పెడిషన్ 75వ సభ్యుడిగా2026 జూన్లో జరిగే చారిత్రాత్మకమైన రోస్కోస్మోస్ సోయుజ్ MS-29 అంతరిక్ష యాత్రలో భాగం కానున్నారు. భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో పనిచుస్తున్న కారణంగా నాసా 2026లో అంతరిక్ష యాత్రకు వ్యోమగామి అనిల్ మీనన్ను ఎంపిక చేసింది. సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న తదుపరి భారతీయ-అమెరికన్ అనిల్ మీనన్ కావడం విశేషం. అనిల్తోపాటు రోస్కోస్మోస్ వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్ ,అన్నా కికినా (Pyotr Dubrov and Anna Kikina)కూడా ఈ ప్రయాణంలో పాలు పంచుకుంటారు. ఈ ముగ్గురూ కజకిస్తాన్లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుండి బయలుదేరి, కక్ష్యలో తిరిగే ప్రయోగశాలలో దాదాపు ఎనిమిది నెలలు గడుపుతారు. జూన్ 2026 లో ప్రయోగించనున్న తన ఎక్స్పెడిషన్ 75 అంతరిక్ష మిషన్లో మీనన్ పాల్గొంటారని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒక ప్రకటనలో తెలిపింది.చదవండి: Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్ తప్పవు మరి!నాసాలో ఫ్లైట్ ఇంజనీర్గా పనిచేస్తున్న మీనన్ ఉక్రెయిన్-భారత సంతతికి చెందిన దంపతులకు జన్మించారు. ఆయన పుట్టి పెరిగింది మిన్నియా పొలిస్ (మిన్నెసోటా)లో. 1999లో హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి న్యూరోబయాలజీలో డిగ్రీని, పట్టా పుచ్చుకున్నారు. 2021లో అంతరిక్ష సంస్థ వ్యోమగామి కార్యక్రమానికి ఎంపికయ్యారు. 3 సంవత్సరాల కఠినమైన శిక్షణ తర్వాత, 23 వ వ్యోమగామి పట్టభద్రుడయ్యాడు. నాసా ఫ్లయిట్ సర్జన్గా 2014 నుంచి సేవలు అందిస్తున్నారు .ISSలో సోయుజ్ మిషన్లు సోయుజ్ 39 - సోయుజ్ 43 లకు డిప్యూటీ క్రూ సర్జన్గా, సోయుజ్ 52 కోసం ప్రైమ్ క్రూ సర్జన్గా పనిచేశారు. ఈ యాత్రలో, అనిల్ మీనన్ "భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలకు మానవులను సిద్ధం చేసేలా, మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా శాస్త్రీయ పరిశోధనలు, టెక్నాలజీ ఆవిష్కరణను నిర్వహిస్తారని నాసా వివరించింది.ఇదీ చదవండి: ఎంత కష్టపడినా వెయిట్ తగ్గడం లేదా? ఇవిగో టాప్ సీక్రెట్స్!

అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్తో..
మన భారతీయులు అమెరికాలో పనిచేసేటప్పుడు విచిత్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. రానురాను అక్కడి పద్ధతులకు అలవాటు పడిపోతుంటారు. అది కామన్. అయితే కొన్ని విషయాల్లో ఎవ్వరైనా రాజీపడలేం. ఇక్కడ అలానే ఓ భారతీయ మహిళ తన వ్యక్తిగత అలవాటు రీత్యా ఆఫీసులో ఊహించిన విధంగా ఇబ్బంది పడింది. అయితే పాపం ఆమె అలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదంటూ ఇన్స్టాగ్రాం పోస్ట్లో తన అనుభవాన్ని పేర్కొనడంతో నెట్టింట ఈ విషయం వైరల్గా మారింది.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన రుంజున్ అనే భారతీయ మహిళ తన ఆహారపు అవాట్ల రీత్యా ఆఫీస్ ఈవెంట్లో పాల్గొనలేకపోతుంది. మిగతా ఉద్యోగుల్లా ఆమె తన కార్యలయం ఇచ్చిన విందు కార్యక్రమానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అస్సలు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వుతుందని ఆమె భావించలేదు. నెట్టింట ‘ది వికెడ్ వెజిటేరియన్’ మహిళగా పేరుగాంచిన ఆమె ఆఫీస్లో ఊహించని విధంగా ఇబ్బందిని ఎదుర్కొంటుంది. తన వర్క్ప్లేస్లో యజమాన్యం తన సిబ్బందినందరిని మరుసటి రోజుకి భోజనాలు తెచ్చుకోవద్దని బహిరంగ ప్రకటన ఇచ్చింది. దాంతో అంతా మరుసటి రోజు ఇచ్చే విందు కోసం ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. వారిలానే ఈమహిళ కూడా కుతుహలంగా ఉంది. అయితే అక్కడ ఉద్యోగులంతా తమ కంపెనీ ఇచ్చే విందులో పాల్గొని ఖుషి చేస్తుంటే.. ఈ భారతీయ మహిళా ఉద్యోగి మాత్రం అక్కడ నుచి నిశబ్దంగా నిష్క్రమించాల్సి వస్తుంది. ఎందుకుంటే ఆ విందులో అక్కడ రకరకాల ప్లేవర్ల శాండ్విచ్లు సుమారు 60 రకాలు పైనే ఉన్నాయి. వాటిలో అత్యంత ఆరోగ్యకరమైనవి కూడా ఉన్నాయి. అయితే అన్నీ నాన్వెజ్ శాండ్విచ్లే గానీ ఒక్క వెజ్ శాండ్విచ్ కూడా లేకపోవడంతో కంగుతింటుంది ఆమె. అక్కడకి వెజ్ శాండ్విచ్ కావాలని సదరు ఫుడ్ కేటరింగ్కి చెప్పినా..తినాలనుకుంటే..వాటి మధ్యలో ఉండే మాంసాన్ని తీసేసి తినవచ్చేనే ఉచిత సలహ ఇవ్వడంతో మరింత షాక్ అవుతుంది. అస్సలు అలా ఎలా తినగలను చాలా బాధపడింది. తనలాంటి ప్యూర్ వెజిటేరియన్లకు అది మరింత ఇబ్బందని, తింటే వాంతులు వస్తాయని వాపోయింది. తనకోసం వెజ్ శాండ్విచ్ ప్రిపేరవ్వదని భావించి ఆ ఈవెంట్ నుంచి నెమ్మదిగా నిష్క్రమించింది. అయితే అక్కడున్న వారంతా గిల్టీగా ఫీల్ అయ్యి..సదరు భారతీయ మహిళ రింజూన్కు మరేదైనా తెప్పిస్తామని రిక్వెస్ట్ చేశారు. కానీ ఆమెకు అప్పటికే ఆకలిగా ఉండటంతో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్లు ఇన్స్టా పోస్ట్లో పేర్కొంది. ఆ పోస్ట్ని చూసిన నెటిజన్లు తాము కూడా అలాంటి సమస్యనే ఫేస్ చేశామంటూ ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ.. పోస్టులు పెట్టారు.(చదవండి: ఆ ఊళ్లో నెమళ్ల బెడద..)
క్రైమ్

అమ్మా వెళ్లొస్తా..!
కర్నూలు: ‘అమ్మా.. బాయ్.. బాయ్..’ అంటూ ఉదయం స్కూల్ బస్సులో వెళ్లిన చిన్నారి సాయంత్రం అదే బస్సులో తిరిగి వచ్చింది. బస్సులో బిడ్డను చూసి ఆ తల్లి కళ్లలో ఆనందం మెరిసింది. అయితే ఆ ఆనందం క్షణాల్లోనే మాయమైంది. కళ్ల ముందే బిడ్డపై బస్సు చక్రాలు వెళ్లడంతో ఆ తల్లి తల్లడిల్లింది. ఉదయం బడికెళ్తూ తన బిడ్డ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ గుండెలు బాదుకుంది. రక్తపుమడుగులో తడిసి విగతజీవిగా మారిన కుమార్తెను చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. బడి బస్సు ఆ చిన్నారి పాలిట మృత్యుశకటమైంది. ఈ విషాద ఘటన ఆళ్లగడ్డలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఎంవీనగర్కు చెందిన శ్రీధర్, వనజ దంపతుల కూతురు హరిప్రియ (4) స్థానిక కీర్తన స్కూల్లో యూకేజీ చదువుతోంది. సోమవారం నుంచి స్కూల్కు వెళ్తుండగా రోజూ తండ్రి శ్రీధర్ వదిలి, తిరిగి తీసుకొచ్చేవారు. అయితే శుక్ర వారం నుంచి స్కూల్ బస్సులో పంపడం మొదలు పెట్టారు. స్కూల్ ముగించుకుని మొదటిసారిగా బస్సులో వస్తున్న కూతురుని దించుకుని ఇంటికి తీసుకెళ్లేందుకు సాయిబాబా గుడిదగ్గర తల్లి వనజ వేచి ఉంది. బస్సులో నుంచి అమ్మను చూసిన ఆ చిన్నారి ‘అమ్మా నేను దిగుతున్నా.. అని చెయ్యి ఊపుతూ’ ఇవతలి వైపున దిగింది. ఆ తర్వాత అవలి వైపున ఉన్న తల్లి దగ్గరకు వెళ్లేందుకు అడుగు ముందుకు వేసింది. అంతలోనే డ్రైవర్ బస్సు కదిలించడంతో చిన్నారి బస్సు చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. బిడ్డ మృతితో ఆ తల్లి రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పట్టణ సీఐ యుగంధర్, ఎస్ఐ నగీన ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చెల్లెలితో మాట్లాడుతున్నాడని హత్య
కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి.వేమవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అనుమానంతో అదే గ్రామానికి చెందిన మరో యువకుడిని హత్య చేసి జగనన్న లే అవుట్లో కప్పి పెట్టేశారు. సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను సీఐ ఎ.కృష్ణభగవాన్ వివరించారు. పి.వేమవరానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన నొక్కు కిరణ్కార్తిక్ (19) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్లో ఉంటున్న ఆ యువతి అన్నయ్య నూతలకట్టు కృష్ణ ప్రసాద్ అడపాదడపా గ్రామానికి వచ్చినపుడు తన చెల్లి ఎవరితోనో మాట్లాడుతున్న విషయం తెలుసుకుని కార్తిక్ను మందలించాడు. తన చెల్లెలని బాగా చదివించాలనుకుంటున్నానని ఈ వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరించాడు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో గత నెల 24వ తేదీ రాత్రి కృష్ణ ప్రసాద్ తన స్నేహితుడు దూలపల్లి వినోద్ సాయంతో కార్తిక్ను పిలిచి పని ఉంది మాట్లాడదాం రమ్మని తీసుకువెళ్లారు. అతడిని అచ్చంపేట శివారు బ్రహ్మానందపురంలోని జగనన్న లేఅవుట్కు తీసుకువెళ్లి అతడితో ఘర్షణపడి కొట్టి హత్య చేసి గోతిలో కప్పిపెట్టేశారు. అనంతరం కృష్ణప్రసాద్ హైదరాబాద్కు వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా గతనెల 24వ తేదీనే ఉప్పాడలోని వెల్డింగ్ దుకాణంలో పనిచేస్తున్న కార్తిక్, అతని తండ్రి వెంకటరమణల మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. కూలీలకు సొమ్ములిచ్చే విషయంలో తేడా రావడంతో కార్తిక్ను అతని తండ్రి మందలించాడు. దీంతో కార్తిక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ ఆ రోజు రాత్రి అతడు ఇంటికి రాకపోవడం, రాత్రి పది గంటల తరువాత ఫోన్ పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి ఇళ్లలో గాలించారు. ఏ ప్రయత్నమూ ఫలించకపోవడంతో 27వ తేదీన తండ్రి వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు విషయంలో తేడా రావడంతో మందలించడంతో తమ కుమారుడు అలిగి వెళ్లి ఉంటాడని తాము భావించామని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీఐ ఎ కృష్ణభగవాన్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కృష్ణప్రసాద్ తన స్నేహితుడు వినోద్కు తరుచూ పోన్ చేసి ఇక్కడి పరిస్థితిని తెలుసుకునేవాడు. పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని తెలిసి, వారు తమను గుర్తిస్తే కేసు తీవ్రంగా ఉంటుందని భావించి గురువారం రాత్రి కృష్ణప్రసాద్, వినోద్ పోలీసులకు లొంగిపోయినట్లు సీఐ వివరించారు. ముద్దుగా చదివించుకుంటున్న తన చెల్లిని మోసం చేస్తాడనే అనుమానంతో హత్య చేసినట్లు కృష్ణప్రసాద్ చెప్పాడని సీఐ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిందితులను ఘటనా ప్రదేశానికి తీసుకువెళ్లి మండల మెజిస్ట్రేట్, తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు జి.నాగేశ్వరరావు, వై.ముసలయ్య, ఎం.పృథ్వి, సీహెచ్ ప్రసాద్, బాబీ, రాజేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అదృశ్యం కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

రౌడీషిటర్తో కౌన్సిలర్ వివాహేతర సంబంధం
తమిళనాడు: వీసీకే మహిళా కౌన్సిలర్ దారుణ హత్యకు గురైంది. రౌడీషిటర్తో ఇన్స్ట్రాగామ్లో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడంతో భర్త, పిల్లలను వదిలి రౌడీషిటర్తో సహజీవనం కొనసాగించడానికి సిద్ధమైన మహిళా కౌన్సిలర్ను భర్త దారుణంగా హతమా ర్చాడు. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్ పెద్దకాలనీకి చెందిన కోమది(28) తిరునిండ్రవూర్ 26వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా పని చేస్తున్నారు. ఈమె భర్త స్టీఫెన్రాజ్(38) తిరునిండ్రవూర్ పట్టణ వీసీకే కార్యదర్శిగా కొనసాగు తున్నారు. వీరిద్దరు 2015లో ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు. కాగా స్టీఫెన్రాజ్, భార్య కోమది, అతని సోదరుడు అజిత్, తల్లిదండ్రులు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కోమదికి తిరునిండ్రవూర్ రామదాస్పురం ప్రాంతానికి చెందిన రౌడీషిటర్ మోసస్దేవతో ఇన్స్ట్రాగామ్లో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే రెండు నెలల క్రితం మోసస్దేవాతో కోమది సన్నిహితంగా ఉన్న ఫొటోలను అజిత్ సెల్ఫోన్కు పంపినట్టు తెలిసింది. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు మొదలయ్యా యి. ఈ విషయమై కోమదిని భర్త స్టీఫెన్రాజ్ ప లుమార్లు మందలించినా మరింత సన్నిహితంగా ఉండడం ప్రారంభించింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి ఆటోలో కోమ ది బయలుదేరింది. అజిత్, స్టీఫెన్రాజ్ ఆమెను వెంబడించారు. కోమది ఆవడి సమీపంలోని నడుకుత్తగై ప్రాంతంలో మోసస్దేవాతో సన్నిహితంగా ఉన్నట్టు స్టీఫెన్రాజ్ గుర్తించి ఆగ్రహించి కత్తితో కోమదిని దారుణంగా నరికి పరారయ్యారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసి రౌడీ షీటర్ పరారయ్యాడు. విషయం తెలిసి అసిస్టెంట్ కమిషనర్ గిరి, పోలీసులు మృతదేహాన్ని ప్రభు త్వాస్పత్రికి తరలించారు. స్టీఫెన్రాజ్, అజిత్, తల్లిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇంటికి వెళితే.. పరువు పోతుంది..!
నారాయణపేట రూరల్: ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు.. కట్టుకున్న భర్త గొంతునులిమి భార్య హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట మండలం కోటకొండకు చెందిన కంపిలి అంజిలప్ప (32)కు పదేళ్ల క్రితం ధన్వాడ మండలం రామకిష్టయ్యపల్లికి చెందిన రాధతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. బతుకుదెరువు కోసం రెండు నెలల క్రితం ముంబైకి వలస వెళ్లి కూలి పనులు చేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న ధన్వాడ మండలానికి చెందిన ఓ యువకుడితో రాధకు పరిచయం ఉండేది. తనకంటే చిన్నవాడైనా అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త.. భార్యను మందలించాడు. ఆపై స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో తాండూరుకు చేరుకున్నాక ఇంటికి వెళితే.. పరువు పోతుందని, వేరేచోట పని చూసుకుందామని రాధ పట్టుబట్టడంతో హైదరాబాద్ వెళ్లారు. బాచుపల్లిలోని ఓ అపార్ట్మెంట్ వద్ద పనిచేస్తూ గుడిసెలో ఉంటున్నారు. అయితే రాధ తిరిగి ఆ యువకుడితో మాట్లాడటం అంజిలప్ప గమనించాడు. దీంతో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. హత్యచేసి.. పక్కింట్లో నిద్రించి ఈ క్రమంలోనే గత నెల 23న రాత్రి అంజిలప్ప మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తా గిన మైకంలో భర్త పడుకొని ఉండగా.. భార్య గొంతు నులిమి హత్య చేసింది. ఏమీ తెలియ నట్టు పక్కనే ఉన్న గుడిసెలోకి వెళ్లి భర్త తనను ఇబ్బంది పెడు తున్నాడని చెప్పి అక్కడే పడుకుంది. తెల్లవారుజామున లేచి గుడిసెలోకి వెళ్లి భర్త చనిపోయాడని రోదిస్తూ మృతదేహాన్ని అంబులెన్స్లో కోటకొండకు తీసుకొచ్చింది. కుటుంబ సభ్యుల అనుమానంతో.. మృతుడి సోదరుడు, ఇతర కుటుంబసభ్యులు అంజిలప్ప మృతిపై అనుమానాలు ఉన్నాయని అదేరోజు నారాయణపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దీంతో వారు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో రాజకీయ ఒత్తిడులు ఎక్కువ కావడంతో స్థానిక పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాచుపల్లి పీఎస్కు కేసును బదిలీ చేశా రు. సైబరాబాద్ కమిషనర్, డీసీపీ ఆదేశాలతో బాచుపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. గతనెల 26న కుటుంబసభ్యులను విచారించారు. రాధను అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం అంగీకరించడంతో కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలు పాలు కావడంతో ఇద్దరు పిల్లలు అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఘటనపై బాచుపల్లి సీఐ ఉపేందర్ మాట్లాడుతూ.. పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే హత్యకు సంబంధించిన విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. సీసీ కెమెరాలు పరిశీలిచంగా, హత్య ఘటనలో ఒక్కరే ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని సీఐ చెప్పారు.
వీడియోలు


ఈడీ విచారణపై అల్లు అరవింద్ క్లారిటీ


ఈ ఘటన చూసి నా కళ్ళలో నీళ్లు వచ్చాయి.. ఎంపీ తనుజారాణి ఎమోషనల్


వైఎస్ జగన్ ను కలవొద్దని మామిడి రైతులను కూటమి నేతలు బెదిరిస్తున్నారు


మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: రాంచందర్రావు


ఈనెల 9న చిత్తూరు జిల్లాలో YS జగన్ పర్యటన: పెద్దిరెడ్డి


20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి ఠాక్రే వారసులు


గంటాపై ఫిర్యాదు చేసిన భీమిలి నియోజకవర్గ నేతలు


వల్లభనేని వంశితో అభిమానుల ఫోటోలు


ఏపీలో నరకాసుర పాలన: పేర్ని నాని


మధ్యప్రదేశ్ హైకోర్టులో సైఫ్ అలీఖాను కు షాక్