ప్రధాన వార్తలు

వైఎస్ జగన్కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిని గురువారం కలిశారు. కూటమి ప్రభుత్వ కక్షరాజకీయాలకుగానూ వంశీ సుమారు నాలుగున్నర నెలలపాటు విజయవాడ జైల్లో గడిపిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాల్లో ఊరట లభించడంతో బుధవారమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. సాక్షి, గుంటూరు: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన వంశీ.. కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో వంశీ ఆరోగ్య స్థితి గురించి జగన్ ఆరా తీశారు. వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు పెట్టి వేధింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఆయన 140 రోజులపాటు జైల్లో గడిపారు. ఆ సమయంలోనే అనారోగ్యం బారిన పడ్డారు కూడా. చివరకు వంశీకి బెయిల్ వచ్చినా తర్వాత కూడా విడుదలను అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేశారు. అందులో భాగంగానే సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ కూడా వేశారు. అయితే సుప్రీం కోర్టు వంశీకి ఊరట ఇవ్వడంతో.. బుధవారం ఉదయం విజయవాడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.

‘నిజం చెప్పినందుకు లోకేష్ మనుషులు బెదిరిస్తారా?’
తాడేపల్లి: సత్తెనపల్లిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన దళితుడు సింగయ్యను చంద్రబాబు కుక్కతో పోల్చడం దారుణమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మృతిపై అనుమానం ఉందని ఆయన భార్య వెల్లడించడం ద్వారా చంద్రబాబు పన్నిన కుట్రలను బద్దలు చేశారని అన్నారు. నిజం చెప్పినందుకు సింగయ్య భార్యను లోకేష్ మనుషులు బెదిరిస్తారా? ఇంతకన్నా నీచ రాజకీయం ఇంకైమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. వికృత రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా చంద్రబాబు భాషలో మార్పు రావడం లేదు. దళితులు, అణగారిన వర్గాల పట్ల తన అసహనాన్ని ప్రదర్శించకుండా ఉండలేకపోతున్నారు. సత్తెనపల్లి లో జరిగిన సింగయ్య మరణంపై చంద్రబాబు నీచంగా మాట్లాడటం ద్వారా తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు. కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడితే కుక్క పిల్లలా లాగిపడేశారని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చనిపోయిన వ్యక్తిని కుక్కతో పోల్చడం వెనుక దళితులపై చంద్రబాబు తనకు ఉన్న చులకలభావాన్ని చాటుకున్నారు. సింగయ్య మరణాన్ని అడ్డం పెట్టుకుని, వైఎస్ జగన్పై పన్నిన కుతంత్రంను సింగయ్య భార్య ధైర్యంగా మాట్లాడి పటాపంచలు చేశారు.దళితులంటే అంత చులకనా బాబూసింగయ్య భార్య లూర్దు మేరి వైఎస్ జగన్ని కలిశారు. తమ కుటుంబానికి వైఎస్ జగన్ అంటే అభిమానమని, ఆయన్ను చూడటానికి తాను, తన భర్త సింగయ్య బయటకు వచ్చామని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు తన భర్తే స్వయంగా మా పేర్లు, ఫోన్ నెంబర్లు చెప్పారని, అంబులెన్స్ లోకి చేరేవరకు బాగానే ఉన్నారని, బాగానే మాట్లాడుతున్నారని, తనకు కొద్దిపాటి దెబ్బలే తగిలాయని చెప్పిన విషయం ఆమె గుర్తు చేశారు. ఆటోలో తీసుకెళ్తామని చెప్పినా వినకుండా అంబులెన్స్లో తరలించారు. బాగా మాట్లాడుతున్న వ్యక్తి ఎలా చనిపోయాడని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఎస్పీ సైతం ప్రమాదం జరిగిన్పపుడు ఒకలా, ఆ తర్వాత మరోలా మాట్లాడారు. నారా లోకేష్ 50 మందిని తన ఇంటికి పంపించి బెదరించారని బాధితురాలు మేరీ చెబుతోంది. ఇవన్నీ సింగయ్య మరణంపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దళితుల పట్ల చంద్రబాబు ఎంత ప్రేమ ఉందనేది మా అందరికీ తెలుసు. మొన్న తెనాలిలో దళిత యువకులను పోలీసులు లాఠీలు విరిగేలా కొడితే వారిపై చర్యలు తీసుకోకుండా గంజాయి బ్యాచ్ అని విషప్రచారం చేశారు. గత చంద్రబాబు పాలనను పక్కన పెడితే, ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. నిన్ననే చంద్రగిరిలో దళిత మహిళను బట్టలు చించి కొట్టారు. జేమ్స్ అనే యువకుడితే మూత్రం తాగించారు. దళితుల మీద సాంఘిక బహిష్కరణలు ఎక్కువైపోయాయి. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళితులను సాంఘిక బహిష్కరణ చేసినా కనీసం దానిపై ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా? మంగళగిరి నియోజకవర్గంలో దళితులు నడిచారని రోడ్డు మైలపడిందని పసుపు నీళ్లతో కడిగిన దారుణం ఇప్పటికీ మా కళ్లలో కదులుతూనే ఉంది. సత్యసాయి జిల్లా ఏడుగుర్రాలపల్లెలో ఒక దళిత బాలికపై టీడీపీ యువకులు 16 మంది రెండేళ్లుగా అత్యాచారం చేస్తే వారి కుటుంబానికి న్యాయం చేశారా? ఆ బాలిక తండ్రి మీ పార్టీ కార్యకర్త అని, మీ పార్టీ విజయోత్సవ సంబరాల్లో ప్రమాదవశాత్తు చనిపోతే ఆ వారి కుటుంబాన్ని ఆదుకోకపోగా ఇంత దారుణంగా మృతుడి కుమార్తెకి అన్యాయం చేస్తారా? ఇలా ఏ ఒక్క ఘటనలోనూ నిందితులపై చర్యలు తీసుకున్నారా? ఒక దళితుడిని కారులో పక్కన కూర్చోబెట్టుకుని ఇంటికి వెళ్లినంత మాత్రాన దళితులను ఉద్దరించినట్టు ప్రజలకు అనుకుంటారనే భ్రమల్లో నుంచి బయటకు రండి. మైకులు పెట్టి ఇచ్చిన స్ర్కిప్టు చదివితే మేం నమ్మేస్తామని ఎలా అనుకుంటారు? మీ హయాంలో జరిగిన వాటికి ఏం సమాధానం చెబుతారు?నాడు సీఎం చంద్రబాబు పుష్కర ఘాట్లో ఉండగా గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట జరిగి 29 మంది అమాయక భక్తులు చనిపోయారు. చంద్రబాబు నిర్వహించిన కందుకూరు రోడ్ షోలో 7 మంది చనిపోయారు. గుంటూరులో చంద్రబాబు బహిరంగ సభ తర్వాత చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కనీస జాగ్రత్తలు పాటించని కారణంగా ముగ్గురు మహిళలు చనిపోయారు. ఈ ప్రమాదాలు జరిగిన అన్ని సందర్భాల్లో అక్కడ చంద్రబాబు ఉన్నారు. వీటన్నింటికీ ఆయన ఏం సమాధానం చెబుతారు. అన్ని వర్గాల్లోనూ కూటమి ప్రభుత్వంపై రోజురోజుకీ వ్యతిరేకత పెరిగిపోతోంది. వైఎస్ జగన్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుని, ఆయన పర్యటనలకు బ్రహ్మరథం పడుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. వైఎస్ జగన్కి ఉన్న ప్రజాభిమానాన్ని తక్కువ చూసి చూపించడానికి వ్యక్తిత్వ హననం చేయాలని చూస్తున్నారు. ఆయన బయటకు రాకుండా చేయాలనే కుట్రతో ఆయన పర్యటనలకు అనుమతులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలపై చర్చ జరిగితేనే పాలన మెరుగువుతుందన్న కీలక విషయాన్ని చంద్రబాబు మర్చిపోతున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారు. సూపర్ సిక్స్ గురించి ప్రశ్నిస్తే నాలుక మందం అనడం దేనికి సంకేతం? పోలీసులను కూడా పార్టీల వారీగా విభజించి వేధిస్తున్న ఘనత చంద్రబాబుది.ఇంత వికృతమైన రాజకీయాలు చేయటం చంద్రబాబుకే చెల్లింది. ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఏం మేలు చేశారో చర్చించటానికి మేము సిద్ధం. మా హయాంలో జరిగిన అప్పుల గురించి తప్పుడు ప్రచారం చేశారు. లోకేష్ మనుషులు వచ్చి బెదిరించారని సింగయ్య భార్య చెప్పింది. దీనిపై లోకేష్ ఎందుకు సమాధానం చెప్పటం లేదు?, ఏడుగుర్రాలపల్లెలో ఒక దళిత బాలికపై లైంగిక దాడి జరిగితే చంద్రబాబు ఏం చేశారు?, ఆ బాలిక తండ్రి టీడీపీ కార్యకర్త. చంద్రబాబు మీటింగుకి వెళ్లి ఆయన చనిపోయారు. అలాంటి కుటుంబానికి చంద్రబాబు ఎందుకు న్యాయం చేయలేదు?, చంద్రబాబు గానీ ఆయన మంత్రులుగానీ కనీసం పరామర్శించకపోవటానికి కారణం ఏంటి?, లైంగికదాడి కేసులో ప్రధాన నిందితుడిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు?’ అని శైలజానాత్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: లోకేష్ మనుషులు మా ఇంటికొచ్చారు: సింగయ్య భార్య

'రామాయణ' సినిమా నుంచి ఫస్ట్ వీడియో విడుదల
'రామాయణ' సినిమా నుంచి పాత్రల పేర్లను పరిచయం చేస్తూ ఒక వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రాజక్ట్ నుంచి విడుదలైన తొలి వీడియో ఇదే కావడం విశేషం. మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామాయణ' పేరుతో అత్యంత భారీ బడ్జెట్ పేరుతో సినిమా వస్తుంది.దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రాముడిగా రణ్బీర్కపూర్ , సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్ పనిచేస్తున్నారు. ఆయన గ్లాడియేటర్, ఇంటర్ స్టెల్లర్, ది లయన్ కింగ్, డ్యూన్ వంటి టాప్ చిత్రాలకు సంగీతం అందించారు. ఏఆర్ రెహమాన్ కూడా రామయణ చిత్రానికి సంగీతంలో భాగం పంచుకోవడం విశేషం. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. 2026 దీపావళీ సందర్భంగా రామాయణ-1 విడుదల కానుంది. 2027 దీపావళీకి పార్ట్-2 రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

ఇదేం తీరు?.. గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు
ఇంగ్లండ్తో రెండో టెస్టుకు భారత్ ఎంచుకున్న తుదిజట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. కీలక మ్యాచ్లో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు విశ్రాంతినివ్వడంతో పాటు.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను జట్టులోకి తీసుకోకపోవడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే.తప్పని ఓటమిలీడ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఐదు శతకాలు సాధించినా.. లోయర్ ఆర్డర్, బౌలర్లు, ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా పరాభవం తప్పలేదు. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో గిల్ సేన 0-1తో వెనుకబడింది. అయితే, రెండో టెస్టులోనైనా పొరపాట్లు సరిచేసుకుంటుందని భావిస్తే.. తుదిజట్టు కూర్పే సరిగ్గా లేదనే విమర్శలు వస్తున్నాయి.తొలి టెస్టులో ఆడిన బుమ్రాకు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్లపై వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్లను ఎడ్జ్బాస్టన్ టెస్టుకు తీసుకుంది.ఇద్దరు బెస్ట్ స్పిన్నర్లు ఉన్నారా?ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. ‘‘ఈ మ్యాచ్లో టీమిండియా తమ ఇద్దరు అత్యుత్తమ స్పిన్నర్లతో ఆడుతుందని నాకు అనిపించడం లేదు. ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించింది.టీమిండియాకు ఇదే మంచి అవకాశం. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే సానుకూల ఫలితం రాబట్టగలము’’ అని పేర్కొన్నాడు ఇక భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ మాత్రం మేనేజ్మెంట్ తీరుపై ఘాటు విమర్శలు చేశాడు. ‘‘కుల్దీప్ యాదవ్ను తుదిజట్టుకు ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఎడ్జ్బాస్టన్ లాంటి పిచ్పై బంతి కాస్త టర్న్ అవుతుందనీ తెలిసి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా?’’ అని ప్రశ్నించాడు.గిల్పై గావస్కర్ ఆగ్రహం!అంతేకాదు.. బ్యాటింగ్లో డెప్త్ కోసం ఆల్రౌండర్లు నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లను తీసుకున్నామన్న కెప్టెన్ శుబ్మన్ గిల్ సమర్థనను కూడా గావస్కర్ తప్పుబట్టాడు. ‘‘మీ జట్టులోని టాపార్డర్ విఫలమవుతుంటే.. వాషింగ్టన్ ఏడో స్థానంలో వచ్చి.. నితీశ్ రెడ్డి ఎనిమిదో స్థానంలో వచ్చి ఏం చేయగలరు?వాళ్లేమీ తొలి టెస్టులో విఫలమైన బ్యాటర్ల మాదిరి కాదు కదా!.. మీరు మొత్తంగా 830కి పైగా పరుగులు చేశారు. కానీ రెండో ఇన్నింగ్స్లో కనీసం 380 స్కోరు చేయలేక ప్రత్యర్థికి అవకాశం ఇచ్చారు. బ్యాటింగ్ ఆర్డర్ను పటిష్టం చేస్తున్నామని చెప్పడం కాదు.. వికెట్లు తీసే బౌలింగ్ విభాగాన్ని ఎంచుకోండి’’ అని గావస్క కెప్టెన్ గిల్, హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఇంగ్లండ్తో బుధవారం మొదలైన ఎడ్జ్బాస్టన్ టెస్టులో స్పిన్ విభాగంలో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు ఆడుతున్నారు. వీరిలో ఒకరికి బదులు స్పెషలిస్టు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేయాల్సిందని గావస్కర్ వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక రెండో టెస్టు తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87), కెప్టెన్ శుబ్మన్ గిల్ (114 నాటౌట్)లతో పాటు రవీంద్ర జడేజా (41 నాటౌట్) రాణించాడు.ఇంగ్లండ్తో రెండో టెస్టుకు భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్

ఈసీతో వైఎస్సార్సీపీ నేతల భేటీ.. చివరి గంటలో పోలింగ్ శాతంపై చర్చ..
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ నేతల బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఈ సందర్భంగా గతంలో ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్కు వైఎస్సార్సీపీ బృందం ఫిర్యాదు చేసింది. దీంతో, ఈ అంశాలపై వివరణ ఇచ్చేందకు వైఎస్సార్సీపీని ఈసీ ఆహ్వానించింది. దీంతో, ఈసీ దృష్టికి పలు కీలక అంశాలను తీసుకెళ్లినట్టు పార్టీ నేతలు తెలిపారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన్న చంద్రశేఖర్, పార్టీ నేత లోకేష్ రెడ్డిల బృందం గురువారం ఉదయం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో చివరి గంటల్లో అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం, అసాధారణంగా ఓటర్లు పెరగడం తదితర అంశాలను ఈసీ దృష్టికి నేతల బృందం తీసుకెళ్లింది. అనంతరం, వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల్లో అసాధారణంగా ఓటర్లు పెరగడంపై ఈసీకి ఫిర్యాదు చేశాం. ఈవీఎంలపై ఉన్న టెక్నికల్ అనుమానాలపై ఈసీకి వివరించాం. గత ఎన్నికల్లో చివరి గంటలో పోలింగ్ శాతంపై వివరణ కోరాం. కేంద్ర ఎన్నికల సంఘం మమ్మల్ని ఆహ్వానించింది. ఓటర్ లిస్టు, పోలింగ్ సరళి తదితరంశాలపై చర్చలు జరిగాయి. 2024 ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్లకు, వీవీప్యాట్లను పోల్చి చూడాలని చెప్పాం. ఈవీఎంలలో బ్యాటరీలపైన కూడా సందేహాలు ఉన్నాయి. ఏపీలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కువ నియోజకవర్గాలలో పోలింగ్ శాతం పెరిగింది. ఆరు తర్వాత జరిగిన పోలింగ్లో దాదాపు 50 లక్షలు ఓట్లు పోలయ్యాయి. దీనిపై ఎంక్వైరీ చేయాలి.విజయనగరం పార్లమెంట్ ఎన్నికలలో ఈవీఎం ఓట్లు, వీవీప్యాట్ కంపారిజన్ చేయమని కోరాము. కానీ, వీవీప్యాట్ల కంపారిజన్ చేయమని ఈసీ తెగేసి చెప్పింది. సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేయాలని అడిగితే నిరాకరించారు. ఈ వ్యవహారంలో పారదర్శకత లేదు. అందుకే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలి. రాయచోటిలో ఓటర్ల సంఖ్య చాలా పెరిగింది. బీహార్ తరహాలో ఏపీలో కూడా స్పెషల్ ఇంటెన్సిఫై రివిజన్ చేయాలని కోరాము. దానికి ఈసీ ఒప్పుకుంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం 38వ పోలింగ్ బూత్లో అసెంబ్లీ, పార్లమెంట్కు భిన్నమైన పోలింగ్ నమోదు అయ్యింది. వచ్చే ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానం అమల్లో ఉంది. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరగాలి’ అని చెప్పుకొచ్చారు.

కేరళలో విషాదం.. కూలిన ప్రభుత్వ ఆసుపత్రి భవనం
కేరళలో విషాదం చోటు చేసుకుంది. కొట్టాయంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలోని ఒక భాగం కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పలువురు గాయపడ్డారు. అధికారులు వెల్లడించిన వివరాలు ప్రకారం ఆసుపత్రిలోని 14వ వార్డుకు ఆనుకుని ఉన్న భవనం ఉదయం 11 గంటల ప్రాంతంలో కూలిపోయింది.తక్షణమే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా దాదాపు వంద మంది రోగులను అక్కడి నుంచి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పరిశీలించారు.అధికారులు ఈ భవనం వాడుకలో లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, భవనం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు కూడా ఆసుపత్రిలో రోగులు ఆ టాయిలెట్లను ఉపయోగించారంటూ కొందరు తెలిపారు.

భారత్లో ‘యాపిల్’కు చెక్ పెట్టేలా చైనా కుతంత్రాలు
భారతదేశం గ్లోబల్ ఐఫోన్ తయారీ కేంద్రంగా ఎదగడాన్ని డ్రాగన్ దేశం జీర్ణించుకోలేకపోతుంది. ఎలాగైనా భారత్ వృద్ధి ఆపాలనే వక్రబుద్ధితో ఇండియాలో పని చేస్తున్న నైపుణ్యాలు కలిగిన టెక్నీషియన్లను తిరిగి చైనా వెనక్కి పిలిపించుకుంటోంది. యాపిల్ తర్వలో ఐఫోన్ 17ను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈమేరకు ఫోన్ల తయారీలో భారత్ గ్లోబల్ హబ్గా మారకుండా చైనా కుంతంత్రాలు చేస్తోంది.గత రెండు నెలల్లో భారత్లో యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తున్న ఫాక్స్కాన్ తన భారతీయ ప్లాంట్ల నుంచి 300 మందికి పైగా చైనా ఇంజినీర్లను, సాంకేతిక నిపుణులను వెనక్కి పిలిపించింది. ఈ చర్యలకు చైనా కారణమని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నారు. యాపిల్ సరఫరా గొలుసుపై ప్రభావం చూపేందుకు, భారత్ ఎగుమతులకు చెక్ పెట్టేలా బీజింగ్ చేసిన రహస్య వ్యూహాత్మక చర్యగా దీన్ని పరిగణిస్తున్నారు.అసలేం జరిగిందంటే..యాపిల్ అతిపెద్ద తయారీ భాగస్వామి ఫాక్స్కాన్ దక్షిణ భారతదేశంలో కొత్త ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ను నిర్మిస్తోంది. ఇందులో చైనీస్ ఇంజినీర్లు ప్రొడక్షన్ లైన్లను ఏర్పాటు చేయడానికి, భారతీయ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు, యాపిల్ కఠినమైన నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు. త్వరలో యాపిల్ ఐఫోన్ 17ను లాంచ్ చేయనుంది. ఈమేరకు భారత్లో ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. ఈ సమయంలో చైనా ఫాక్స్కాన్పై ఒత్తిడి తెచ్చి రెండు నెలల వ్యవధిలో ఇక్కడి ప్లాంట్లలో పని చేస్తున్న 300 చైనా నిపుణులను వెనక్కి పిలిపించింది. కేవలం సహాయక సిబ్బందిని మాత్రమే భారత్ సైట్ల్లో ఉంచుతుంది.ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’ఈమేరకు ఆగ్నేయాసియా దేశాలకు అత్యాధునిక పరికరాలు, నైపుణ్యం కలిగిన కార్మికుల ఎగుమతులను పరిమితం చేయాలని చైనా కంపెనీలకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య 2026 నాటికి చాలా వరకు అమెరికాకు చెందిన ఐఫోన్ ఉత్పత్తిని భారతదేశానికి తరలించాలన్న యాపిల్ లక్ష్యానికి సవాలుగా మారుతుంది.

‘భాగస్వామ్యమే కాదు.. సహ ప్రయాణం’.. ఘనాలో ప్రధాని మోదీ
అక్రా: ఘనా అభివృద్ధి ప్రయాణంలో భారత్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని, సహ ప్రయాణం సాగిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘనాలో ప్రధాని మోదీకి ఆ దేశ ప్రతినిధుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆ తరువాత ఆయన ఘనా అధ్యక్షుడు జాన్ ద్రామానీ మహామాతో పలు భాగస్వామ్య అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాను ఉద్దేశించి ప్రకటన చేశారు. రాబోయే ఐదు సంవత్సరాలలో ఇరు దేశాలు ద్విమార్గ వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని, భారత్.. ఘనాకు కేవలం భాగస్వామి మాత్రమే కాదని, ఘనా అభివృద్ధి ప్రయాణంలో సహ ప్రయాణం చేస్తున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత కంపెనీలు ఘనాలో దాదాపు 900 ప్రాజెక్టులలో రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాయన్నారు. రాబోయే ఐదేళ్లలో పరస్పర వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. I thank the people and Government of Ghana for conferring ‘The Officer of the Order of the Star of Ghana’ upon me. This honour is dedicated to the bright future of our youth, their aspirations, our rich cultural diversity and the historical ties between India and Ghana.This… pic.twitter.com/coqwU04RZi— Narendra Modi (@narendramodi) July 2, 2025ఫిన్టెక్ రంగంలో, భారతదేశం ఘనాతో యూపీఐ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని.. ఇరు దేశాలు స్పష్టం చేశాయని, ఆ ముప్పును ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు. రక్షణ, భద్రతా రంగంలో తాము సంఘీభావం ద్వారా భద్రత అనే సూత్రంతో ముందుకు సాగుతామన్నారు. సాయుధ దళాల శిక్షణ, సముద్ర భద్రత, రక్షణ సరఫరా, సైబర్ భద్రత తదితర రంగాల్లో భారత్-ఘనా దేశాల మధ్య పరస్పర సహకారం పెరుగనున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా సంస్కృతి, సాంప్రదాయ వైద్యంతోపాటు పలు రంగాల్లో సహకారాన్ని అందించే నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి.ఇది కూడా చదవండి: కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా?

అందుకే ట్రంప్ నన్ను టార్గెట్ చేశారు
ట్రంప్-మామ్దానీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మమ్దానీని అరెస్ట్ చేయాలని, ఆయన్ని దేశం నుంచి వెళ్లగొట్టాలని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్లో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో ట్రంప్ వ్యాఖ్యలపై మమ్దానీ ఘాటుగానే స్పందించారు. వాషింగ్టన్: న్యూయార్క్ నగర మేయర్ పదవికి భారతీయ మూలాలున్న అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ.. తనను అరెస్ట్ చేసి, దేశం నుండి పంపించాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన ఈ వ్యాఖ్యలు అమెరికాలో వర్గ విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నమేనని అన్నారాయన. 33 ఏళ్ల ఈ డెమొక్రటిక్ సోషలిస్ట్ ట్రంప్పై తీవ్ర విమర్శలే గుప్పించారు. వర్కింగ్ క్లాస్ పీపుల్ను ట్రంప్ మోసం చేశారు. ఆ విషయం నుంచి అమెరికన్ల దృష్టిని మరల్చేందుకు ఆయన తనను లక్ష్యంగా చేసుకున్నారని మమ్దానీ అన్నారు. ‘‘నిన్న ట్రంప్ నన్ను అరెస్ట్ చేయాలని, దేశం నుండి పంపించాలని, పౌరసత్వం తీసేయాలని అన్నారు. నేను ఈ నగరానికి తరాలుగా మొదటి వలసదారుడిగా, మొదటి ముస్లిం, దక్షిణాసియా మూలాలున్న మేయర్గా నిలవబోతున్నాను. ఇది నేను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో అనే దానికంటే, నేను ఏం కోసం పోరాడుతున్నానో దాన్ని దృష్టి మళ్లించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నమే అని మమ్దానీ అన్నారు. రిపబ్లికన్లపై తన పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారాయన. Donald Trump is attacking me because he is desperate to distract from his war on working people. We must and we will fight back. pic.twitter.com/pKEwnijJaG— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) July 2, 2025న్యూయార్క్ నగర మేయర్ పదవీ రేసులో.. డెమొక్రటిక్ ప్రైమరీలో మాజీ గవర్నర్ ఆండ్రూ కువోమోపై జోహ్రాన్ మమ్దానీ సంచలన విజయం సాధించారు. ఆపై ట్రంప్ సహా రిపబ్లికన్లు మమ్దానీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మమ్దానీ పెద్ద కమ్యూనిస్టు పిచ్చోడని.. న్యూయార్క్ను నాశనం చేయకుండా తానే కాపాడతానని ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈలోపు.. ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్పై మమ్దానీ తీవ్రంగా విమర్శించారు. ఈ బిల్లు అమెరికన్ల ఆరోగ్యాన్ని హరించివేస్తుందని, ఆకలితో ఉన్నవారి నుంచి ఆహారాన్ని లాక్కుంటుందని, ధనవంతులకే మళ్లీ లాభాలు చేకూర్చే విధంగా ఉంది అని మమ్దానీ విమర్శించారు.

‘స్కామర్..’: భారతీయ టెకీపై అమెరికా సీఈవోలు ధ్వజం
అమెరికాకు చెందిన అయిదు కంపెనీల సీఈవోలను మోసం చేశాడంటూ భారత్కు చెందిన టెకీపై ఆరోపణలు గుప్పుమన్నాయి.'స్కామర్' అంటూ ఐదుగురు సీఈవోలు భారతీయ టెక్కీపై ఆరోపణలు గుప్పించారు. అతనితో జాగ్రత్త అంటూ బహిరంగంగా స్టార్టప్లను హెచ్చరించడం టెక్ సర్కిల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తీవ్ర చర్చలకు దారితీసింది. ఇంతకీ ఎవరీ టెకీ, అసలు వివాదం ఏమిటిభారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోహమ్ పరేఖ్ బహుళ స్టార్టప్లలో ఒకేసారి మూన్లైట్ (ఒకేసారి వివిధ కంపెనీల్లో పనిచేయడం) చేసినట్లు, యజమానులను మోసం చేసి, స్టార్టప్ కంపెనీలకు మోసగించాడు అనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని తొలుత మిక్స్ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ CEO సుహైల్ దోషి వెలుగులోకి తెచ్చారు. పరేఖ్ తప్పుడు సాకులతో ఒకేసారి బహుళ స్టార్టప్లను మోసం చేస్తున్నాడన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. పరేఖ్ తన కంపెనీ ప్లేగ్రౌండ్ AIలో కొంతకాలం ఉద్యోగంలో ఉన్నాడని, కానీ అతని నిజాయితీ లేని ప్రవర్తన కారణంగా వారంలోనే అతనిని తొలగించామని వెల్లడించారు.Guys we found Soham Parekh! pic.twitter.com/bWnODxbM8l— Satwik Singh (@itsmesatwik_) July 3, 2025 పరేఖ్ను బహుళ కంపెనీలలో మూన్లైటింగ్ ఆపమని తాను హెచ్చరించానని, కానీ అతని పట్టించుకోలేదు, అబద్ధాలు, మోసాలు ఆపమని చెస్పినా, ఏడాది తర్వాత కూడా అదే కొనసాగించాడు. అందుకే తీసి వేశామన్నారు. ఒకేసారి 3-4 స్టార్టప్లలో ఉద్యోగాలు చేశాడని ఆరోపించారు. తన వాదనలకు బలం చేకూర్చేలా పరేఖ్ CVని పోస్ట్ చేశాడు. PSA: there’s a guy named Soham Parekh (in India) who works at 3-4 startups at the same time. He’s been preying on YC companies and more. Beware.I fired this guy in his first week and told him to stop lying / scamming people. He hasn’t stopped a year later. No more excuses.— Suhail (@Suhail) July 2, 2025 ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 1.28 కోట్ల వ్యూస్ వచ్చాయి. అనేకమంది కంపెనీ యజమానులు ఆయనకు మద్దుతుగా నిలిచారు. ముఖ్యంగా ఫ్లీట్ AI సహ వ్యవస్థాపకుడు , CEO నికోలాయ్ ఔపోరోవ్ ఇవే ఆరోపణలు గుప్పించారు. ఇంకా AIVideo సహ వ్యవస్థాపకుడు జస్టిన్ హార్వే, అని మరొక స్టార్టప్, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మొజాయిక్ వ్యవస్థాపకుడు ఆదిష్ జైన్ ఇదే ఆరోపణలను ధృవీకరించారు, ఇంటర్వ్యూలలో బాగానే ఉన్నాడు కానీ అతను అబద్ధాలకోరు అని వ్యాఖ్యానించడం గమనార్హం. యాంటిమెటల్ CEO మాథ్యూ పార్క్హర్స్ట్ ఏమంటారంటే.. సోహామ్ 2022లో కంపెనీలో ఇంజనీర్గా చేరాడు. తెలివైన వాడే.. కానీ బహుళ కంపెనీలలో పనిచేస్తున్నాడని చాలా తొందరగానే గమనించాం. అందుకే అతణ్ని తొలగించామన్నారు. అంతేకాదు పరేఖ్ ముంబై విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ జార్జియా టెక్ నుండి మాస్టర్స్ డిగ్రీ బహుశా 90 శాతం నకిలీదేమో అన్ని అనుమానాల్ని కూడా వ్యక్తం చేశారు. నేను ఉద్యోగం లేక బాధపడుతోంటే, సోహమ్ పరేఖ్ను 79 సార్లు హైర్ చేసుకున్నారా అంటూ విచారం వ్యక్తం చేశాడో నిరుద్యోగ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే సోహమ్ పరేఖ్ ఈ ఆరోపణలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.అయితే తప్పేంటి?మూన్లైటింగ్ తప్పు అని మీరు ఎందుకనుకుంటున్నారు. అతను ఇంటర్వ్యూలలో పాస్ అయ్యాడు. బెస్ట్ అనే కదా మీరు అతణ్ని తీసుకున్నారు. అతను సరైన వైఖరితో సమయానికి అన్ని పనులను పూర్తి చేసినంత కాలంతప్పేంటి అంటూ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మరో టెక్నిపుణురాలు ట్వీట్ చేశారు.
Doddi Komaraiah తెలంగాణ వేగు చుక్క
‘నిజం చెప్పినందుకు లోకేష్ మనుషులు బెదిరిస్తారా?’
ENG VS IND 2nd Test Day 2: ప్రమాదంలో కోహ్లి రికార్డు
విశాఖలో తీగ లాగితే.. బెంగళూరులో కదిలిన డొంక
‘ఖరీదైన బెంజ్ కారు.. రెండున్నర లక్షలకే అమ్ముకున్నా’
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుందాం.. లేకపోతే చంపేస్తా!
హీరో చెంప చెళ్లుమనిపించింది.. ఆ దెబ్బతో ఇమేజ్ డ్యామేజ్!
హైదరాబాద్లో సినిమా పైరసీ రాకెట్ గుట్టురట్టు
బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి కాదు
అప్పుడు రూ.60, ఇపుడు రూ. 6 లే : సిద్దూ సైకిల్ భళా..!
ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్బై..!
వరుసగా మూడో మ్యాచ్లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఈసారి ఊచకోత
గేమ్ ఛేంజర్తో భారీ నష్టాలు.. 'చరణ్' కనీసం ఫోన్ కూడా చేయలేదు: నిర్మాత
గుడ్న్యూస్! బయటి రాష్ట్రాల్లో మన ప్రత్యర్థులు కూడా బాగానే ఉన్నార్సార్!
‘ప్రభుత్వ నియమాలకు దండం.. కారు చౌకగా అమ్ముతున్నా!’
రైల్వే ఎస్సై భార్య బలవన్మరణం
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. పలుకుబడి పెరుగుతుంది
వాళ్లు ‘జగనన్న గోరుముద్ద’ పెట్టారు.. మనం ‘బాబు బొద్దింక భోజనం’ అని పెట్టేద్దాం మేడమ్!!
చైనా అధ్యక్షుడిగా వాంగ్ యాంగ్?
ఒక్కసారిగా షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఏకంగా..
సెంచరీ, 6 వికెట్ల ప్రదర్శన.. ఇంగ్లండ్లో టీమిండియా యువ సంచలనం ఆల్రౌండ్ షో
ఆ విషయంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం : దిల్ రాజు
‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’
రూ.లక్షల్లో క్రెడిట్కార్డు బాకీ ఇలా తీరిపోయింది..
ఈ మధ్య అలానే కూర్చుంటున్నారు!
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
హోం మంత్రి అనితకు చేదు అనుభవం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
వైఎస్ జగన్కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు
అనిల్ అంబానీ మరో భారీ అడుగు..
Doddi Komaraiah తెలంగాణ వేగు చుక్క
‘నిజం చెప్పినందుకు లోకేష్ మనుషులు బెదిరిస్తారా?’
ENG VS IND 2nd Test Day 2: ప్రమాదంలో కోహ్లి రికార్డు
విశాఖలో తీగ లాగితే.. బెంగళూరులో కదిలిన డొంక
‘ఖరీదైన బెంజ్ కారు.. రెండున్నర లక్షలకే అమ్ముకున్నా’
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుందాం.. లేకపోతే చంపేస్తా!
హీరో చెంప చెళ్లుమనిపించింది.. ఆ దెబ్బతో ఇమేజ్ డ్యామేజ్!
హైదరాబాద్లో సినిమా పైరసీ రాకెట్ గుట్టురట్టు
బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి కాదు
అప్పుడు రూ.60, ఇపుడు రూ. 6 లే : సిద్దూ సైకిల్ భళా..!
ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్బై..!
వరుసగా మూడో మ్యాచ్లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఈసారి ఊచకోత
గేమ్ ఛేంజర్తో భారీ నష్టాలు.. 'చరణ్' కనీసం ఫోన్ కూడా చేయలేదు: నిర్మాత
గుడ్న్యూస్! బయటి రాష్ట్రాల్లో మన ప్రత్యర్థులు కూడా బాగానే ఉన్నార్సార్!
‘ప్రభుత్వ నియమాలకు దండం.. కారు చౌకగా అమ్ముతున్నా!’
రైల్వే ఎస్సై భార్య బలవన్మరణం
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. పలుకుబడి పెరుగుతుంది
వాళ్లు ‘జగనన్న గోరుముద్ద’ పెట్టారు.. మనం ‘బాబు బొద్దింక భోజనం’ అని పెట్టేద్దాం మేడమ్!!
చైనా అధ్యక్షుడిగా వాంగ్ యాంగ్?
ఒక్కసారిగా షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఏకంగా..
సెంచరీ, 6 వికెట్ల ప్రదర్శన.. ఇంగ్లండ్లో టీమిండియా యువ సంచలనం ఆల్రౌండ్ షో
ఆ విషయంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం : దిల్ రాజు
‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’
రూ.లక్షల్లో క్రెడిట్కార్డు బాకీ ఇలా తీరిపోయింది..
ఈ మధ్య అలానే కూర్చుంటున్నారు!
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
వైఎస్ జగన్కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
హోం మంత్రి అనితకు చేదు అనుభవం
అనిల్ అంబానీ మరో భారీ అడుగు..
సినిమా

సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి
సినిమా అవకాశాల కోసం వెళ్తే చేదు అనుభవాలు ఎదుర్కొన్న నటీనటులు ఎందరో! అయితే సినిమాలే కాదని ఓటీటీలో ఛాన్సులు కావాలంటే కూడా పిచ్చి కండీషన్లు పెడుతున్నారని చెప్తున్నారు నటి హెల్లీ షా (Helly Shah). తనకు ఓ వెబ్ సిరీస్లో ఆఫర్ వచ్చిందట.. కానీ వాళ్లు చెప్పిన కండీషన్కు ఓకే అంటేనే ఎంపిక చేస్తామని మెలిక పెట్టారట! ఈ విషయం గురించి హెల్లీ షా మాట్లాడుతూ.. గతంలో నాకు పెద్ద వెబ్ సిరీస్లో భాగమయ్యే ఛాన్స్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదిస్తూ ఓ మెసేజ్ వచ్చింది. కండీషన్కు ఒప్పుకుంటే..అది చూడగానే.. నేను మీ ప్రాజెక్టులో భాగం కావాలనుకుంటున్నారా? అని కన్ఫర్మేషన్ కోసం అడిగాను. అందుకు అవతలివైపు నుంచి అవును, అందుకోసమే మీకు మెసేజ్ చేశాం అని రిప్లై వచ్చింది. నేను చాలా సంతోషించాను. కానీ అంతలోనే.. ఓ కండీషన్.. మేము చెప్పిన ప్రదేశానికి వచ్చి చెప్పినట్లు చేయాలి. అందుకు ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ మీ మీ సొంతం అన్నారు. నా వల్ల కాదు, మీరు వేరే ఎవర్నైనా చూసుకోండి అని రిప్లై ఇచ్చాను.ఆన్లైన్లో అయినా ఓకేఅప్పటికీ అవతలి వ్యక్తి ఊరుకోలేదు. పర్లేదు, మీరు రాకపోయినా సరే, ఫోన్లోనే నేను చెప్పింది చేయండి. ఆన్లైన్లో అయినా నాకేం పర్లేదని బదులిచ్చాడు. అతడు అన్న మాటల్ని నా నోటితో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఆన్లైన్లో కాంప్రమైజ్ అడిగాడు. ఈ సోదంతా నాకెందుకు అని అతడి నెంబర్ బ్లాక్లిస్ట్లో పెట్టాను. ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సిగ్గులేని జనాలు మారరు. కొంచెమైనా పద్ధతిగా ప్రవర్తించరు. ఇలాంటి మనుషులతో నాకెందుకు అని ఆ వెబ్ సిరీస్ను వదిలేసుకున్నాను అని చెప్పుకొచ్చారు.సీరియల్స్- సినిమాహెల్లీ షా ప్రస్తుతం గుజరాతీ మూవీ దేడ చేస్తున్నారు. ఇందులో హెల్లీ గర్భవతిగా కనిపించనున్నారు. ఈ మూవీ జూలై 4న విడుదలవుతోంది. ఇకపోతే హెల్లీ షా.. అలక్ష్మి: హమారీ సూపర్ బహు, ఖేల్తీ హై జిందగీ ఆంఖ్ మిచోలి, దేవాన్షి, స్వరాగిని- జోడైన్ రిష్తో కే సుర్, ఇష్క్ మే మర్జవాన్ 2: నయా సఫర్ వంటి పలు సీరియల్స్ చేశారు. గుల్లక్, పిరమిడ్ వంటి వెబ్ సిరీస్లలోనూ మెరిశారు.చదవండి: ఓటీటీలోకి సడన్గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే?

సినిమానే వదిలేస్తా కానీ..తెరపై ఆ పని చేయలేను : రష్మిక
రష్మిక మందన్నా(Rashmika Mandanna).. ఈ పేరు ఇప్పుడు కుర్రకారుకు తారక మంత్రంగా మారింది. కన్నడంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈ భామ ఇప్పుడు జాతీయ స్థాయి క్రష్ హీరోయిన్గా మారారు. కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా పయనాన్ని మొదలెట్టినా, ఈమెను క్రేజీ హీరోయిన్ను చేసింది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమనే అనేది ఎవరూ కాదనలేని నిజం. అక్కడ ఛలో చిత్రంతో కెరీర్ను ప్రారంభించి ఇటీవల విడుదలయిన కుబేర వరకూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. అదే విధంగా తమిళంలోనూ సుల్తాన్, వారిసు చిత్రాల్లో మెరిశారు. ఇకపోతే గుడ్బై అంటూ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా అక్కడ తొలి చిత్రం యావరేజ్ అనిపించుకున్నా, ఆ తరువాత నటించిన యానిమల్ చిత్రం సూపర్హిట్ అయ్యింది. రణ్బీర్ కపూర్కు జంటగా నటించిన యానిమల్ చిత్రం గత 2023 డిశంబర్ నెలలో తెరపైకి వచ్చి రక రకాల విమర్శనలను ఎదుర్కొంది.ముఖ్యంగా నటుడు రణ్బీర్ కపూర్ పాత్రపై మాత్రం ఘోరంగా విమర్శలు ట్రోల్ అయ్యాయి. ఆయన ఎక్కువగా సిగరెట్స్ కాల్చే సన్నివేశాలపై తీవ్ర విమర్శలు దొర్లాయి. అయితే వసూళ్లను మాత్రం రికార్డు స్థాయిలో రాబట్టుకుంది. దీని గురించి ఇటీవల ఒక భేటీలో స్పందించిన నటి రష్మిక మందన్నా తాను ఆ చిత్రాన్ని చిత్రంగానే చూశానన్నారు. చిత్రంలో హీరో సిగరెట్టు తాగితే అది ఇతరులను సిగరెట్లు తాగే విధంగా ప్రేరేపిస్తున్నాయి అని అంటున్నారని, సమాజంలో ప్రజలు సిగరెట్స్ తాగడం అనేది సర్వ సాధారణం అని పేర్కొన్నారు. అయితే తాను మాత్రం సినిమాల్లో కూడా సిగరెట్స్ తాగే విధంగా నటించనని చెప్పారు. ఒకవేళ అలాంటి పాత్రలు వస్తే.. సినిమానే వదిలేస్తానని అన్నారు. ఇకపోతే చిత్రాన్ని చిత్రంగానే చూడమని, ఇతరులను చిత్రం చూడమని ఎవరినీ చిత్రం చూడమని వత్తిడి చేయడం లేదని అన్నారు. ఇక్కొక్కరికి ఒక్కో చెడ్డ అలవాటు ఉంటుందని దాన్ని యానిమల్ చిత్రంలో దర్శకుడు చూపించారు అంతే అని నటి రష్మిక మందన్నా పేర్కొన్నారు. అయితే చిత్రం విడుదలై ఏడాదిన్నర పైగా అయినా యానిమల్ చిత్రం విమర్శల నుంచి తప్పించుకోలేకపోతోంది.

'హరి హర వీరమల్లు' ట్రైలర్ ఎట్టకేలకు విడుదల
పవన్ కల్యాణ్ (Pawan kalyan) నటించిన 'హరి హర వీరమల్లు'( Hari Hara Veera Mallu) మూవీ ట్రైలర్ వచ్చేసింది. సినిమా విడుదల తేదీతో పాటు ట్రైలర్ రిలీజ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన 'వీరమల్లు' ఎట్టకేలకు వచ్చేశాడు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సుమారు 5ఏళ్లకు పైగా ఈ చిత్రాన్ని మేకర్స్ నిర్మించారు. దీంతో బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోయిందని నిర్మాత ఎ.ఎం రత్నం చెప్పారు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్రావు నిర్మిస్తున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పకులు. సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో జులై 24న విడుదల కానుంది.

దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. తొలి ఇండియన్గా రికార్డు
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’కు ఆమె ఎంపికయ్యారు. ఈ విషయాన్ని తాజాగా హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా వెల్లడించింది. వినోదరంగంలో గణనీయంగా కృషి చేసినందుకుగాను ప్రతి ఏటా హాలీవుడ్ ఫిల్మ్ చాంబర్ ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ ’ జాబితాను వెల్లడిస్తుంది. ఈ ఏడాది మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపికను ఎంపిక చేసినట్లు హాలీవుడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. ఈ జాబితాలో డెమి మూర్, రాచెల్ మెక్ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ వంటి హాలీవుడ్ తారలతో పాటు మొత్తం 35 మంది ఉన్నారు. భారత్ నుంచి ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్’ గౌరవం దక్కించుకున్న తొలి నటిగా దీపిక చరిత్ర సృష్టించింది. బాలీవుడ్ అగ్రతారలు అయిన షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా ఈ జాబితాలో స్థానం పొందలేకపోవడం గమనార్హం.2006లో ఉపేంద్ర హీరోగా నటించిన కన్నడ సినిమా ఐశ్వర్యతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది దీపిక. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ ఓం శాంతి ఓం తో మంచి గుర్తింపు సంపాదించుంది. 2017లో త్రిబుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ సినిమాలో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కల్కి 2898 ఏడీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ -అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

ఇంగ్లండ్ గడ్డపై సరికొత్త చరిత్ర.. 51 ఏళ్ల రికార్డు బద్దలు
ఇంగ్లండ్ టూర్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఎడ్జ్బాస్టన్ మైదానంలో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. వన్డే తరహాలో ప్రత్యర్ధి బౌలర్లను యశస్వి ఉతికారేశాడు.తన మెరుపు బ్యాటింగ్తో భారత్కు ఘనమైన ఆరంభాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్లో 107 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.51 ఏళ్ల రికార్డు బద్దలుఎడ్జ్బాస్టన్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఓపెనర్గా జైశ్వాల్ రికార్డులెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ ఓపెనర్ సుధీర్ నాయక్ పేరిట ఉండేది. సుదీర్ నాయక్ 1974లో ఇదే మైదానంలో 77 పరుగులు చేశారు.ఇప్పుడు తాజా మ్యాచ్తో నాయక్ పేరిట ఉన్న 51 ఏళ్ల రికార్డును జైశ్వాల్ బ్రేక్ చేశాడు. జైశ్వాల్, సుదీర్ తర్వాతి స్ధానాల్లో సునీల్ గవాస్కర్ (68), చేతేశ్వర్ పుజారా (66), చేతన్ చౌహాన్ (56) వంటి భారత ఓపెనర్లు ఉన్నారు.సునీల్ గవాస్కర్ రికార్డుపై కన్ను..భారత టెస్టు జట్టులో యశస్వి కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. 2023లో టెస్ట్ అరంగేట్రం చేసినప్పటి నుంచి దాదాపు ప్రతీ మ్యాచ్లోనూ బ్యాటింగ్లో రాణిస్తూ వస్తున్నాడు. కేవలం 21 టెస్ట్ మ్యాచ్ల్లోనే యశస్వి.. ఐదు సెంచరీలు, పన్నెండు అర్ధ సెంచరీలతో సహా 1,990 పరుగులు చేశాడు.ఈ ముంబై ఆటగాడు టెస్ట్ క్రికెట్లో 2000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 10 పరుగుల దూరంలో ఉన్నాడు. రెండవ ఇన్నింగ్స్లో అతడు 10 పరుగులు సాధిస్తే.. టెస్టుల్లో అత్యంతవేగంగా రెండు వేల పరుగులు చేసిన భారత ఆటగాడిగా గవాస్కర్ రికార్డును బ్రేక్ చేస్తాడు.సునీల్ గవాస్కర్ ఈ ఫీట్ను తన 23వ టెస్ట్లో నమోదు చేశారు. 1976 ఏప్రిల్ 7 నుండి 12 వరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించారు.చదవండి: SL vs BAN: 5 పరుగులు, 7 వికెట్లు: వన్డేల్లో శ్రీలంక ప్రపంచ రికార్డు

SL vs BAN: 5 పరుగులు, 7 వికెట్లు: వన్డేల్లో శ్రీలంక ప్రపంచ రికార్డు
29 పరుగుల వద్ద తొలి వికెట్... సరిగ్గా 100 పరుగులు పూర్తి చేసిన తర్వాత రెండో వికెట్.. మరో రెండు పరుగులు జతచేసి రెండు వికెట్లు (102/4).. ఆ తర్వాత వైడ్ రూపంలో ఒక పరుగు అంటే అప్పటికి స్కోరు 103/4.. అదే స్కోరు వద్ద ఐదో వికెట్ కూడా డౌన్.. ఒక్క పరుగు జతచేర్చిన వెంటనే ఆరో వికెట్ కూడా పడింది (104/6)..మళ్లీ ఆలస్యం చేయకూడదు అనుకున్నారేమో బ్యాటర్లు.. అదే స్కోరు వద్ద ఏడో వికెట్ కూడా డౌన్.. వైడ్ రూపంలో మరో పరుగు రాగానే ఎనిమిదో వికెట్ కూడా పడిపోయింది.. అప్పటికి స్కోరు 105/8.. మరో పందొమ్మిది పరుగులు రాగానే తొమ్మిదో వికెట్ కూడా పడింది.. 167 పరుగులకు ఆలౌట్..ఐదు పరుగులు, ఏడు వికెట్లుశ్రీలంకతో తొలి వన్డే సందర్భంగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిన విధానం ఇది.. 100-1తో పటిష్టంగా కనిపించిన బంగ్లా.. కేవలం ఐదు పరుగుల వ్యవధిలోనే మరో ఏడు వికెట్లు కోల్పోయింది. తమ స్కోరుకు కేవలం ఐదు పరుగులు జతచేసి ఏడు వికెట్ల నష్టాన్ని చవిచూసింది. లంక బౌలర్ల ధాటికి తాళలేక 167 పరుగులకే కుప్పకూలి.. 77 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.ఈ మేరకు బంగ్లాదేశ్కు చుక్కలు చూపించిన శ్రీలంక ఖాతాలో ఓ ప్రపంచ రికార్డు నమోదైంది. వన్డే క్రికెట్ చరిత్రలో.. అత్యధికసార్లు ప్రత్యర్థి జట్టు మీద ఏడు లేదా అంతకంటే తక్కువ పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కూల్చిన తొలి జట్టుగా లంక నిలిచింది. లంక ఇలా ప్రత్యర్థిని కుదేలు చేయడం ఇది మూడోసారి.2008లో జింబాబ్వే మీద మూడు పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కూల్చిన లంక.. 2024లో అఫ్గనిస్తాన్ మీద. ఏడు పరుగుల వ్యవధిలో ఈ ఘనత సాధించింది. తాజాగా బంగ్లాదేశ్ మీద ఐదు పరుగుల వ్యవధిలో ఈ ఫీట్ నమోదు చేసింది.వన్డే క్రికెట్ చరిత్రలో తక్కువ పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కూల్చిన జట్లు🏏శ్రీలంక- 2008లో హరారే వేదికగా- జింబాబ్వేను 124-3 నుంచి 127-10కి పడగొట్టింది.🏏శ్రీలంక- 2025లో కొలంబో వేదికగా- బంగ్లాదేశ్ను 100-1 నుంచి 105-8కు పడగొట్టింది.🏏వెస్టిండీస్- 1986లో షార్జా వేదికగా- శ్రీలంకను 45-2 నుంచి 51-9కు పడగొట్టింది.🏏శ్రీలంక- 2024లో పల్లెకెలె వేదికగా- అఫ్గనిస్తాన్ను 146-3 నుంచి 153-10కు పడగొట్టింది.🏏నేపాల్- 2020లో కీర్తిపూర్ వేదికగా- యూఎస్ఏను 27-2 నుంచి 35-9కి పడగొట్టింది.🏏భారత్- 2014లో మిర్పూర్ వేదికగా- బంగ్లాదేశ్ను 50-3 నుంచి 58-10కు పడగొట్టింది.వన్డేల్లోనూ శుభారంభంసొంతగడ్డపై బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ నెగ్గిన శ్రీలంక జట్టు... వన్డేల్లోనూ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 77 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ చరిత అసలంక (123 బంతుల్లో 106; 6 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (43 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.టెస్టు సిరీస్లో దంచికొట్టిన పాథుమ్ నిసాంక (0), నిశాన్ మధుషనక (6), కమిందు మెండిస్ (0) ఈసారి విఫలమయ్యారు. జనిత్ లియాంగె (29), మిలాన్ రత్ననాయకె (22), వనిందు హసరంగ (22) ఫర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 4, తన్జీమ్ హసన్ మూడు వికెట్లు పడగొట్టారు.అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 35.5 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. తన్జీద్ హసన్ (61 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్), జాకీర్ అలీ (64 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధశతకాలతో పోరాడగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. లంక బౌలర్ల ధాటికి కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ (0), లిటన్ దాస్ (0), పర్వేజ్ (13), నజు్మల్ షంటో (23), తౌహిద్ హృదయ్ (1) పెవిలియన్కు వరుస కట్టారు. లంక బౌలర్లలో హసరంగ 4, కమిందు మెండిస్ 3 వికెట్లు పడగొట్టారు. అసలంకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరగనుంది. సంక్లిప్త స్కోర్లు🏏శ్రీలంక- 244 (49.2)🏏బంగ్లాదేశ్- 167 (35.5).చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగాBangladesh’s batting: now you see it, now you don’t 🎩The visitors went off a cliff in Colombo losing 7 wickets for just 5 runs in a stunning meltdown 😳#SLvBAN pic.twitter.com/8ea1xiXjOz— FanCode (@FanCode) July 2, 2025

మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ లోకి పాము.. ఉలిక్కిపడిన ఆటగాళ్లు! వీడియో
కొలంబో వేదికగా తొలి వన్డేలో శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ను వీక్షించడానికి అనుకోని అతిథి స్టేడియం వచ్చింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా సుమారు 6 అడుగుల పొడవున్న పాము మైదానంలో ప్రత్యక్షమైంది. బిగ్ స్క్రీన్లో పామ్ను చూసిన అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేశారు.ఆటగాళ్లు సైతం కాస్త గందరగోళానికి గురయ్యారు. వెంటనే మైదాన సిబ్బంది దాన్ని అక్కడినుంచి బయటకి పంపించారు. దీంతో తిరిగి మళ్లీ ఆట ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా శ్రీలంక మైదానాల్లో సరృసృపాలు ప్రత్యక్షం కావడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది శ్రీలంక ప్రీమియర్ లీగ్ సందర్భంగా వరుసగా రెండు మ్యాచ్లకు పాము హాజరై కలకలం రేపింది. అదేవిధంగా బంగ్లా-శ్రీలంక టెస్టు సిరీస్ సందర్భంగా పాములు పట్టుకుని స్నేక్ క్యాచర్ కూడా కెమెరాకు చిక్కాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ను 77 పరుగుల తేడాతో శ్రీలంక చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక(106) సెంచరీతో మెరిశాడు.బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 4, తన్జీమ్ హసన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 35.5 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో సునాయసంగా గెలిపించేలా కన్పించిన బంగ్లాదేశ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. లంక బౌలర్లలో హసరంగ 4, కమిందు మెండిస్ 3 వికెట్లు పడగొట్టారు. అసలంకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.చదవండి: గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్Bangladesh’s batting: now you see it, now you don’t 🎩The visitors went off a cliff in Colombo losing 7 wickets for just 5 runs in a stunning meltdown 😳#SLvBAN pic.twitter.com/8ea1xiXjOz— FanCode (@FanCode) July 2, 2025#snake #Cricket pic.twitter.com/Y5KMfE94aZ— ABHISHEK PANDEY (@anupandey29) July 3, 2025

సౌతాఫ్రికా ఆటగాడి సునామీ ఇన్నింగ్స్.. కేవలం 9 బంతుల్లోనే! వీడియో
మేజర్ లీగ్ క్రికెట్-2025లో టెక్సాస్ సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం వాషింగ్టన్ ఫ్రీడమ్తో జరిగిన మ్యాచ్లో 43 పరుగుల తేడాతో సూపర్ కింగ్స్ విజయభేరి మ్రోగించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 5 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 87 పరుగుల భారీ స్కోర్ చేసింది.సూపర్ కింగ్స్ ఓపెనర్లు స్టోయినిష్(2), డార్లీ మిచెల్(6 రిటైర్డ్ హార్ట్) నిరాశపరిచినప్పటికి.. శుభమ్ రంజనే( 14 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 39 నాటౌట్), డోనోవన్ ఫెరీరా(9 బంతుల్లో 5 సిక్స్లతో 37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు.సౌతాఫ్రికాకు చెందిన ఫెరీరా.. ఆఖరి ఓవర్ వేసిన మిచెల్ ఓవెన్ బౌలింగ్లో నాలుగు సిక్సర్లు, రెండు డబుల్స్ సాయంతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. అతడి విధ్వంసకర బ్యాటింగ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా వాషింగ్టన్ బౌలర్లలో నేట్రావల్కర్ ఓ వికెట్ సాధించాడు. అనంతరం 88 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిదిగిన వాషింగ్టన్ జట్టు నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులకే పరిమితమైంది. వాషింగ్టన్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(18) టాప్ స్కోరర్గా నిలిచాడు. కెప్టెన్ మాక్స్వెల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో బర్గర్ రెండు, అకిల్ హోసేన్, నూర్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. కాగా టెక్సాస్, వాషింగ్టన్ రెండు జట్లు ఇప్పటికే తమ ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకున్నాయి.DONOVAN FERREIRA - THE SUPERSTAR OF TEXAS SUPER KINGS.!!!- 6, 6, 6, 2, 2, 6 vs Mitchell Owen in the final over to finish 37* (9) .!!!pic.twitter.com/hbmUUZAWwC— MANU. (@IMManu_18) July 3, 2025
బిజినెస్

‘ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎస్బీఐ తీరు’
దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) రుణ ఖాతాను ‘ఫ్రాడ్’ అకౌంట్గా ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వర్గీకరించనుంది. అలాగే రిజర్వ్ బ్యాంకుకి ఇచ్చే నివేదికలో సంస్థ మాజీ డైరెక్టర్ అనిల్ అంబానీ పేరును కూడా చేర్చాలని నిర్ణయించింది. జూన్ 23వ తేదీతో ఎస్బీఐ నుంచి ఈ మేరకు లేఖ అందినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఆర్కామ్ తెలిపింది. దీని ప్రకారం ఆర్కామ్, దాని అనుబంధ సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి రూ.31,580 కోట్ల రుణం తీసుకున్నాయి.ఆర్కామ్కి పంపిన లేఖ ప్రకారం.. రుణంగా తీసుకున్న నిధులను సంక్లిష్టమైన విధంగా వివిధ గ్రూప్ సంస్థలు మళ్లించినట్లు గుర్తించామని ఎస్బీఐ పేర్కొంది. దీనిపై జారీ చేసిన షోకాజ్ నోటీసుకి కంపెనీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆర్కామ్ ఖాతాను ‘ఫ్రాడ్’గా వర్గీకరించాలని ఫ్రాడ్ ఐడెంటిఫికేషన్ కమిటీ నిర్ణయించినట్లు వివరించింది. ‘ఫ్రాడ్’గా మారిస్తే..ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఏదైనా ఖాతాను ‘ఫ్రాడ్’గా వర్గీకరించినప్పటి నుంచి 21 రోజుల్లోగా ఆ విషయాన్ని ఆర్బీఐకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సీబీఐ/ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. మోసం చేసిన రుణగ్రహీతపై (ప్రమోటర్ డైరెక్టర్, ఇతరత్రా హోల్టైమ్ డైరెక్టర్లు సహా) కఠినచర్యలు ఉంటాయి. డిఫాల్ట్ అయిన రుణగ్రహీతలు, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించిన అయిదేళ్ల వరకు మరే ఇతర బ్యాంకులు, డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థలు, ప్రభుత్వ రంగ ఎన్బీఎఫ్సీల నుంచి రుణాలు తీసుకోవడానికి ఉండదు.ఇదీ చదవండి: ‘యాపిల్ రహస్యాలు దొంగతనం’ఆర్కామ్ స్పందన ఇదే..ఎస్బీఐ నిర్ణయంపై ఆర్కామ్ స్పందించింది. తమ రుణ ఖాతాలను మోసపూరితమైనవిగా వర్గీకరించడమనేది ఆర్బీఐ మార్గదర్శకాలు, కోర్టు ఆదేశాలకు కూడా విరుద్ధమని స్పష్టం చేసింది. జులై 2న బ్యాంకుకు ఆర్కామ్ లాయర్లు ఈ మేరకు లేఖ రాశారు. ఆరోపణలపై వ్యక్తిగతంగా వివరణనిచ్చేందుకు అనిల్ అంబానీకి కనీసం అవకాశం ఇవ్వకుండా, ఏకపక్షంగా ఎస్బీఐ నిర్ణయం తీసుకోవడం షాక్కు గురి చేసిందని, సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఆర్కామ్లోని ఇతర నాన్–ఎగ్జిక్యూటివ్, స్వతంత్ర డైరెక్టర్లకు ఇచ్చిన షోకాజ్ నోటీసును విత్డ్రా చేసుకున్న ఎస్బీఐ, అంబానీ కూడా నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టరే అయినప్పటికీ ఆయన్ను మాత్రం వేరుగా చేసి చూడటం సరికాదని లాయర్లు వివరించారు. షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన దాదాపు ఏడాది వరకు బ్యాంకు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తమ వివరణ సంతృప్తికరంగానే ఉందని భావించినట్లు తెలిపారు.

ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:32 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు తగ్గి 25,442కు చేరింది. సెన్సెక్స్(Sensex) 48 ప్లాయింట్లు నష్టపోయి 83,383 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

యస్ బ్యాంక్లో వాటాపై సీసీఐకి దరఖాస్తు
ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్లో 20 శాతం వాటా కొనుగోలుకి క్లియరెన్స్ను కోరుతూ కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)కు జపనీస్ దిగ్గజం సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్ఎంబీసీ) దరఖాస్తు చేసింది. యస్ బ్యాంక్లో 20 శాతం వాటా విక్రయించేందుకు గత నెలలో పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ)తోపాటు ఇతర 7 బ్యాంకింగ్ సంస్థలు నిర్ణయించాయి. రూ.13,483 కోట్ల విలువలో వాటా విక్రయానికి ప్రతిపాదించాయి.ఇదీ చదవండి: ‘యాపిల్ రహస్యాలు దొంగతనం’దీని ప్రకారం యస్ బ్యాంక్లో వాటా మూలధనంతోపాటు.. ఓటింగ్ హక్కులను సైతం ఎస్ఎంబీసీ సొంతం చేసుకోనుంది. వెరసి దేశీ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా ఈ డీల్ రికార్డ్ సృష్టించనుంది. జపాన్లో రెండో పెద్ద బ్యాంకింగ్ గ్రూప్ అయిన సుమితోమో మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్(ఎస్ఎంఎఫ్జీ)నకు సొంత అనుబంధ సంస్థగా ఎస్ఎంబీసీ వ్యవహరిస్తోంది.

టీవీఎస్ ఐక్యూబ్ కొత్త వేరియంట్.. ధర ఎంతంటే..
టీవీఎస్ మోటార్ తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ కొత్త వేరియంట్ను లాంచ్ చేసింది. ఎక్స్–షోరూం ధర రూ.1.03 లక్షలుగా ప్రకటించింది. ఇందులో అమర్చిన 3.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వల్ల సింగిల్ ఛార్జింగ్తో 123 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్, బ్యాక్రెస్ట్ ఈ స్కూటర్ ప్రత్యేకతలు.‘ఇప్పటికే ఆరు లక్షలకు పైగా ఐక్యూబ్ యూనిట్లు విక్రయించాం. డ్యూయల్ టోన్ కలర్స్తో రోజు వారీ అనువైన ప్రయాణాలకు అనుగుణంగా తాజా ఐక్యూబ్ను తీర్చిదిద్దాం. కొత్త వేరియంట్ విడుదల ద్వారా విద్యుత్ వాహన విభాగాన్ని బలోపేతం చేయాలనుకుంటున్నాం’ అని టీవీఎస్ కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: పుట్టకతో చెవిటివారా? ‘ఫర్వాలేదు శబ్దాలు వినవచ్చు’టఫే, ఏజీసీవో వివాదం సెటిల్మెంట్మాసే ఫెర్గూసన్ బ్రాండ్ వివాదాన్ని టఫే, ఏజీసీవో కార్పొరేషన్ సంస్థలు కోర్టు వెలుపల పరిష్కరించుకున్నాయి. సెటిల్మెంట్ ప్రకారం ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ (టఫే) సంస్థ రూ.2,225 కోట్లు చెల్లించి మాసే ఫెర్గూసన్లో ఏజీసీవో వాటాలను కొనుగోలు చేయనుంది. భారత్, నేపాల్, భూటాన్లో ఈ బ్రాండు పూర్తి యాజమాన్య హక్కు లు టఫేకు దక్కుతాయి. ఏజీసీవో కార్పొరేషన్ గత సెపె్టంబర్లో మాసే ఫెర్గూసన్ బ్రాండ్ లైసెన్స్ సహా టఫేతో ఉన్న పలు ఒప్పందాలను రద్దు చేసుకుంది.
ఫ్యామిలీ

Toli Ekadashi 2025: తొలి ఏకాదశికి ఆ పేరెందుకు వచ్చింది?
ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని, తొలి ఏకాదశి అనీ పిలుస్తారు. తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుచుకుంటారు. ఈ రోజు నుంచి నాలుగు నెలలపాటు విష్ణుమూర్తి పాలకడలి మీద నిద్రిస్తాడట. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలోనూ ఈ రోజు మొదటిది. అందుకే ఈ రోజు ఉపవాసం ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇందుకోసం దశమి రాత్రి నుంచే నిరాహారంగా ఉండాలి. ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తులసీదళాలతో పూజించాలి. ఆ రోజు పాలు, పళ్లులాంటి వండని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. రాత్రి అంతా జాగరణ చేస్తూ భాగవతం లేదా విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి. మర్నాడు... అంటే ద్వాదశి రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. దీనినే తొలి ఏకాదశి వ్రతం అంటారు. ఈ వ్రతం చేసినందుకే కుచేలుడికి దరిద్రం వదిలి సకల సంపదలూ కలిగాయని పురాణోక్తి. చదవండి: హనుమకు ఆకు పూజ ఎందుకు ఇష్టం? సీతమ్మ సత్కారం

పదేపదే చెవుల్లో మ్యూజిక్ వినిపించడం మానసిక సమస్య..?
నేను ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాను. కుటుంబపోషణ కోసం చిన్నప్పటినుంచే మా నాన్న గారి సెలూన్లో పని చేసేవాణ్ణి. పెళ్లిళ్లలో సన్నాయి వాయించడం కోసం కూడా వెళ్ళేవాణ్ణి. ఇప్పుడు నాకు 60 ఏళ్లు. నా పిల్లలు బాగా చదువుకొని సెటిల్ అయ్యారు. నేను సెలూన్ పని మానేసి పదేళ్లవుతోంది. సన్నాయి వాయించడం కూడా ఆపేశాను. కాలక్షేపం కోసం ఇంటి దగ్గర చిన్న షాపు పెట్టుకున్నాను. నాకు ఒక సంవత్సర కాలం నుండి నేను గతంలో పెళ్లిళ్లలో వాయించిన సంగీతం, పాటలు చెవిలో మళ్లీ మళ్లీ వినపడుతున్నాయి, ముందు ఇంటి దగ్గర్లో ఏదైనా పెళ్లి అవుతుంటే అక్కడ నుండి వచ్చే శబ్దాలు, పాటలు అనుకున్నాను కానీ అని పగలు, రాత్రి, రోజంతా వినపడుతూనే ఉంటాయి. ఆ శబ్దాల వల్ల నాకు విపరీతంగా తలనొప్పి వస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మాకే శబ్దాలూ వినపడట్లేదు. నువ్వు ఊహించుకుంటున్నావు అంటున్నారు. నాకే ఎందుకు ఇలా అవుతోంది... ఈ బాధ నుంచి నన్ను బయట పడేయండి డాక్టరు గారూ!– గురునాథం, కరీంనగర్ మీరు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని మీ పిల్లల్ని మంచి స్థితికి తీసుకెళ్లినందుకు ముందుగా మీకు నా అభినందనలు. ఇక మీ సమస్య విషయానికి వస్తే మీకు ఉన్న కండిషన్ని ‘మ్యూజికల్ హెలూసినోసిస్’ అంటారు. మనం గతంలో విన్న పాటలు, శబ్దాలు అప్పుడుప్పుడు వినపడటం అందరికీ జరుగుతుంటుంది. ఉదాహరణకు పొద్దున మనకు నచ్చిన పాట వింటే అది కాసేపు అలాగే ‘మైండ్లో’ ప్లే అవడం, దాన్ని మనం ఎంజాయ్ చేయడం సర్వసాధారణం! కాసేపటికి వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ మీ విషయంలో ఎప్పుడో విన్న పాటలు, సంగీతం పదే పదే వినిపించడం, అవి మిగిలిన వాళ్ళకి వినపడకపోవడం, దానివల్ల డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు రావడం ఇవన్నీ ఖచ్చితంగా ఒక మానసిక సమస్యను సూచిస్తున్నాయి. ‘మ్యూజికల్ హెలూసినోసిస్’ అనేది అరుదుగా కనబడే ఒక లక్షణం. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ముందుగా మీకు వినికిడి సమస్య లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చెయించుకోండి. అలాంటిది ఏదైనా ఉంటే హియరింగ్ మెషిన్ వాడితే మీ సమస్య చాలావరకు తగ్గిపోతుంది. మీ వయస్సు 60 సంవత్సరాలు కాబట్టి పెద్ద వయసులో వచ్చే డిమెన్షియా, మెదడులో ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా పరిశీలించాలి. ఇవేమీ లేవని నిర్ధారణ అయితే అప్పుడు మీకు దగ్గర్లో ఉన్న సైకియాట్రిస్ట్ని కలిస్తే మీకు పరీక్షలు చేసి ‘యాంటీ సైకోటిక్’ మందులు, అలాగే మీ డిప్రెషన్ తగ్గడానికి మందులు, కౌన్సెలింగ్ ఇస్తారు. వాటిని కొంతకాలం వాడితే మీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ధైర్యంగా ఉండండి. (డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్ విజయవాడమీ సమస్యలు, సందేహాలు sakshifamily3@gmail.com)(చదవండి: దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి స్కైడైవింగ్కి సై)

Hanuman హనుమకు ఆకు పూజ ఎందుకు ఇష్టం?
తమిళనాడు రాష్ట్రం, కరూర్కి చెందిన ఒక బ్యాంకు ఉద్యోగి వేంకటేశ్వర స్వామి దర్శనార్థం కారులో తిరుమల బయలుదేరాడు.ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చేసరికి కొంచెం సేద తీర్చుకోవాలనుకున్నాడు. ఓ ఆంజనేయస్వామి గుడి వద్ద కారు ఆపాడు.ఆ పక్కనే ఓ భార్యాభర్తల జంట కొబ్బరికాయల కొట్టు పెట్టుకుని ఉన్నారు. భార్య అంగడిలో కూర్చుని ఉంది. భర్త అంగడి ముందర ఉన్న పూల మొక్కలకు నీళ్ళుపోస్తూ ఉన్నాడు. అతడి దగ్గరికి వెళ్ళాడు బ్యాంకు ఉద్యోగి. ఇక్కడ స్వామికి తమల΄ాకులతో పూజ చేస్తారా?’’ అని ప్రశ్నించాడు. ‘‘అవును’’ అని బదులిచ్చాడు వ్యాపారి.‘‘నేనెప్పుడూ చూడలేదు. దీని విశేషం ఏమిటి?’’ అని ఆసక్తిగా అడిగాడు బ్యాంకు ఉద్యోగి. ‘‘నేను పెద్దగా చదువుకున్న వాణ్ని కాదు. పెద్దలెవరైనా రామాయణం, మహా భారతం లాంటివి చెబుతూ ఉంటే కనీసం వినను కూడా వినలేదు. అయితే మా ఊరిలో ఈ ఆకు పూజ గురించి చెప్పుకునే కథ గురించి మాత్రం మీకు చెప్పగలను’’ అన్నాడు.‘‘నువ్వు విన్నదే చెప్పు. నాకెందుకో కుతూహలంగా ఉంది’’ అన్నాడు బ్యాంకు ఉద్యోగి.భక్తి భావంతో ఆ వ్యా΄ారి తను వేసుకున్న చెప్పులు తీసివేశాడు. తలకి చుట్టిన తువ్వాలును తీసి భుజాన వేసుకున్నాడు. చక్కగా నిలబడి ఆంజనేయ స్వామిని మనసులోనే ప్రార్థించి ఇలా చెప్పసాగాడు.‘‘అది లంకానగరంలో అశోక వనం. ఎక్కడ చూసినా కురూపులైన రాక్షస స్త్రీలు. వారి మధ్యలో సీతమ్మ.ఆమె ముఖం కళ తప్పి ఉంది. పది తలల రాక్షసుడు పెట్టే బాధలు సహించలేకపోతోంది. సరిగ్గా ఆ సమయంలో పిల్ల గాలి వీచింది. చెట్టు మీది పక్షుల రెక్కలు రెపరెపలాడాయి. ‘ఏమిటా’ అని సీతమ్మ చుట్టూ కలయచూసింది. ఎదురుగా ఒక కాంతి పుంజం. కళ్ళు వెడల్పు చేసి చూస్తే ఎదురుగా వినయ విధేయతలతో చేతులు జోడించిన ఆకారం. అది మానవాకారం కాదు, వానరాకారం. సీతమ్మ జడుసుకుంది. ‘ఇది రావణ మాయ ఏమో...’ అని అనుమానపడింది.అయితే ఆ వానరాకారం గౌరవంగా ‘అమ్మా’ అని సంబోధిస్తే ఉలిక్కిపడింది. ‘‘అనుమానం వలదు, నేను రామదూతను’’ అని హనుమంతుడు వినమ్రంగా విషయమంతా వివరించాడు. అంతా ఆసక్తిగా విన్నది సీతమ్మ. హనుమంతుడు చెప్పటం ఆ΄ాక సుగుణాభిరాముని క్షేమ సమాచారాలు అడిగింది. వాలి సుగ్రీవుల గురించి వాకబు చేసింది. శ్రీ రాముడు కపిసైన్యంతో రానున్నాడనే చల్లని కబురు తెలుసుకుని ఆనందపడింది. శ్రీరాముల వారు ఆనవాలుగా పంపిన ఉంగరం చూసి పరవశించిపోయింది.ఆ సంతోషంలో హనుమంతుడిని గౌరవించాలని అనుకుంది సీతమ్మ. చుట్టూ చూసింది. పూల చెట్లు ఏవీ కనిపించలేదు. కనీసం తులసీ బృందావనమైనా అక్కడ లేదు. పరిసరాలను మరింత సూక్ష్మంగా చూసింది. కంచెను అల్లుకుని ఉన్న తమలపాకు తీగలను చూసింది. వాటిని చిన్నగా గిల్లి దండగా మార్చింది. చిరునవ్వుల మోముతో హనుమ మెడలో వేసింది. ఈ హఠాత్పరిణామానికి హనుమ ఆశ్చర్యచకితుడయ్యాడు. హనుమ కంట ఆనందాశ్రువులు. ‘‘అంజన తనయా.. లోకంలో ఎవరు ఏ శుభ వార్త అందించినా బహుమతులివ్వడం మా ఆనవాయితీ. నువ్వు శ్రీ రాములవారి ఉంగరాన్ని నాకు చేరవేశావు. శ్రీరాముడు వస్తున్నాడన్న మంచి విషయం తెలియ జేశావు. ఈ దేశం కాని దేశంలో నీకు ఈ తమల పాకుల దండ తప్ప మరేమీ ఇవ్వలేను’’ అని చెప్పింది.ఊహించని సత్కారానికి హనుమంతుని ఒళ్లంతా పులకరించింది. ‘‘లోకమాత అయిన నీవు నా మెడలో తమలపాకుల మాల వేశావు, నా జన్మ చరితార్థమయ్యింది తల్లీ’’ అని రెండు చేతులూ జోడించి తల వంచాడు. ఇదే రానురాను ఆకు పూజకు నాంది పలికిందని ఇక్కడ చెప్పుకుంటారు. శివునికి బిల్వపత్రం, విష్ణువుకు తులసి లాగా హనుమంతునికి తమలపాకు ప్రియ మయిందని భావిస్తారు. హనుమంతునికి ఆకుపూజ చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చని ఇక్కడి వారి నమ్మకం’’ అని వివరించాడు. అప్పటికే ఆ బ్యాంకు ఉద్యోగి తమలపాకుల మాల, ఇతర పూజా సామగ్రి కొనుక్కుని గుడిలోకి వడివడిగా వెళ్తూ ఉన్నాడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు

దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి..
ఎనభై సంవత్సరాల వయసులో కొద్ది దూరం నడిచినా అలసటగా అనిపిస్తుంది. ‘సాహసం’ అనే మాట ఊహకు అందదు. అయితే డా. శ్రద్దా చౌహాన్ మాత్రం ‘తగ్గేదే ల్యా’ అని డిసైడై పోయింది. సాహసానికి సై అంది. స్కైడైవింగ్తో తన 80వ పుట్టిన రోజు జరుపుకున్న శ్రద్ధ చరిత్ర సృష్టించింది. ‘స్కైడైవింగ్’ అనే మాట తల్లి నోటి నుంచి వినిపించిన క్షణమే ‘ఓకే’ అన్నాడు ఆమె కుమారుడు సౌరభ్ సింగ్ షెకావత్. శ్రద్ధ భర్తతోపాటు, రెండవ కుమారుడు మాత్రం... ‘ఈ వయసులో చాలా కష్టం. వద్దు’ అన్నారు. వారిని ఒప్పించి రంగంలోకి దిగారు తల్లీకొడుకులు. స్కైడైవర్ అయిన షెకావత్ ‘స్కై హై ఇండియా’ చీఫ్ ఇన్స్ట్రక్టర్. పర్వతారోహణలో, గుర్రపు స్వారీలో దిట్ట అయిన షెకావత్కు సాహసాలు కొత్త కాదు. వర్టిగో, సర్వికల్ స్పాండిలైటిస్లాంటి సమస్యలతో బాధ పడుతున్నప్పటికీ 10,000 అడుగుల ఎత్తు నుంచి కుమారుడితో కలిసి జంప్ చేసింది శ్రద్ధ. ‘ఏ మదర్: ఏ మైల్స్టోన్’ కాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. వీడియో విషయానికి వస్తే...షెకావత్ మొదట తన తల్లిని పరిచయం చేస్తాడు. ‘మా అమ్మతో కలిసి ఈ సాహసంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నాడు షెకావత్. స్కైడైవింగ్ చేయాలనేది శ్రద్ధ చౌహాన్ చిన్నప్పటి కల. ఎట్టకేలకు కుమారుడి సహకారంతో తన కల నెరవేర్చుకుంది. ‘ఇది నేను గర్వించే సందర్భం’ అని సంతోషం నిండిన కళ్లతో అంటుంది డా.శ్రద్ధా చౌహాన్. ఈ ఇన్స్టాగ్రామ్ వైరల్ వీడియో సాహసానికి మాత్రమే కాదు తల్లీకొడుకుల అనుబంధానికి కూడా అద్దం పడుతుంది. View this post on Instagram A post shared by Skyhigh (@skyhighindia) (చదవండి: Shubhanshu Shuklas mission: మధుమేహం ఉన్నవాళ్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చా..? )
ఫొటోలు
అంతర్జాతీయం

విద్యార్థి వీసాలపై ‘కాల పరిమితి’ కత్తి!
వాషింగ్టన్: విదేశీ వలసదారులపై బహిష్కరణ వేటు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా విదేశీ విద్యార్థులపై ‘కాల పరిమితి’ కత్తి దూసేందుకు సాహసించారు. విదేశీ విద్యార్థులకు కాలపరిమితితో సంబంధం లేకుండా ఇన్నాళ్లూ ఎఫ్–1 స్టూడెంట్ వీసాలు జారీచేస్తుండగా ఇకపై స్పష్టమైన తుదిగడువుతో విద్యార్థి వీసాలు జారీచేయాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది. గడువు దాటాక అమెరికా గడ్డపై ఉంటే మళ్లీ స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత ప్రతిపాదనలో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్(ఓఎంబీ) వద్ద పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడితే ఇకపై విద్యార్థి అమెరికాలో చేయబోయే కోర్సు పూర్తయినా, పూర్తికాకపోయినా వీసాపై ముద్రించిన గడువుతేదీలోపు అమెరికాను వీడాల్సి ఉంటుంది. ఇన్నాళ్లూ ఇలాంటి గడువు అనేదే లేదు. అమెరికాలోకి అడుగుపెట్టినప్పుడు ఎంచుకున్న విద్యా కోర్సు సంపూర్ణంగా పూర్తయ్యేదాకా ఆ స్టూడెంట్ వీసా చెల్లుబాటులోనే ఉండేది. దీనినే ‘ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’గా పిలుస్తారు. ఈ స్టేటస్లో ఇకపై గడువు తేదీని ముద్రించాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. గతంలో కోర్సు ఆలస్యమైతే వీసా గడువు పొడిగింపు వంటి వెసులుబాట్లు ఉండేవి. ఇకపై అలాంటివి ఒప్పుకోబోమని ట్రంప్ సర్కార్ కరాఖండీగా చెబుతోంది. దీంతో ఎఫ్–1 వీసాలతో అమెరికా విద్యాభ్యాసం కోసం వచ్చే భారతీయ విద్యార్థులపై మరింత ఆర్థిక భారం పడనుంది. అనివార్య కారణాలతో కోర్సు ఆలస్యమైనాసరే వీసా గడువు మాత్రం పాత తేదీకే పూర్తవుతుంది. అలాంటి సందర్భాల్లో కోర్సు పూర్తికాకముందే అమెరికాను వీడాల్సి ఉంటుంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకే మరోసారి వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం, ఆ దరఖాస్తు ఆమోదం కోసం వేచి ఉండటం, దరఖాస్తు, తదితరాల ఖర్చులు తడిసిమోపెడై విద్యార్థులకు ఖర్చు మరింత పెరగనుంది. ఎక్స్చేంజ్ విజిటర్లకూ కష్టాలే జే–1 వీసా సాధించి ఎక్స్చేంజ్ విజిటర్లుగా వచ్చే వాళ్లకూ ఇదే నిబంధనను వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చిన్నారులకు ఇంట్లో సేవచేయడం అందుకు ప్రతిఫలంగా భోజన, వసతి, స్వల్ప భత్యం వంటి సదుపాయాలు పొందే ‘ఆపెయిర్’ యువతకు ఇదే గడువు విధించాలని చూస్తున్నారు. కొత్త ప్రతిపాదలు అమల్లోకి వస్తే విదేశీ విద్యార్థులతోపాటు ఎక్స్చేంజ్ విజిటర్ల విభాగంలోకి వచ్చే అధ్యాపకులు, విదేశీ మీడియా ప్రతినిధులు, విద్యావేత్తలు, కళాకారులు, ఉపాధ్యాయులు, ట్రైనీలు, ఇంటర్న్లు, వైద్యులు సైతం వీసా కాలపరిమితి కష్టాలను ఎదుర్కోనున్నారు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ ప్రతిపాదనలు చేసింది. ప్రతిపాదనలు ప్రస్తుతం ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ విభాగం పరిశీలిస్తోంది. వీటిని ఫెడరల్ రిజిస్ట్రీలో ప్రచురించాక 30 లేదా 60 రోజుల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించి తుది నిర్ణయం తీసుకుంటారు. అత్యవసరమైతే దొడ్డిదారిన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి కూడా ట్రంప్ ప్రభుత్వం ఈ నిబంధనను అమల్లోకి తెచ్చే ప్రమాదముందని తెలుస్తోంది. పలు వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు ఇప్పటికే వీసా దరఖాస్తుదారుల ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టా గ్రామ్, లింక్డి్డన్ వంటి సామాజిక మాధ్యమ ఖాతాలను అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఇన్ఫోర్స్మెంట్ అధికారులు జల్లెడ పడుతున్నారు. అమెరికా వ్యతిరేక, హమాస్ అనుకూల పోస్ట్లు, ట్వీట్లు, వీడియోలు ఉన్నాయో లేదోనని పరిశీలించి ఆ మేరకు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇన్ని అడ్డంకులను దాటుకుని సంపాదించిన వీసాను కేవలం గడువు ప్రాతిపదికన మంజూరుచేయడం తగదని పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడువు విధింపు కారణంగా లక్షలాది మంది విద్యార్థులపై అదనపు ఒత్తిడి, ఆర్థికభారం తప్పదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అకడమిక్ కోర్సుల విధానం అస్తవ్యస్తమవుతుందని పలువురు పేర్కొన్నారు. గడువుదాటి అమెరికాలో ఉంటే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ మే 14వ తేదీన హెచ్చరించడం తెల్సిందే.

విదేశీయులకు ట్రంప్ మరో బిగ్ షాక్
వాషింగ్టన్: విదేశీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. విద్యార్ధులు,విజిటర్ల వీసాలపై నిర్ధిష్ట సమయాన్ని విధించనున్నారు. ఆ గడువు పూర్తయిన విద్యార్థులు, విజిటర్లు వారి వీసాల్ని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ కాకపోతే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలో విదేశీయులపై ఆంక్షల కత్తి వేలాడుతున్నట్లైందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అక్రమ వలస దారులు అరికట్టేలా అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులు, టూరిస్టులు దేశంలో ఉండే సమయాన్ని నిర్ధేశించనుంది. ఆ సమయం గడువు దాటిన తర్వాత దేశంలో ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త వీసా ప్రతిపాదనలు తెచ్చింది.ఇప్పటి వరకు ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని రద్దు చేసి, ప్రతి వీసాకు నిర్దిష్ట గడువు విధించాలని ట్రంప్ సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం F-1 (విద్యార్థులు), J-1 (ఎక్స్చేంజ్ విజిటర్లు) వీసాలపై ఉన్నవారు తమ విద్యను కొనసాగిస్తున్నంత వరకు అమెరికాలో ఉండే హక్కు ఉంది. కొత్త ప్రతిపాదన అమలైతే, వారు పూర్తిగా గడువు ముగిసేలోపు దేశాన్ని విడిచి వెళ్లాలి లేదా వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేయాలి.త్వరలోనే అమలుప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదనను హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ సిద్ధం చేసి, ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (OMB) సమీక్షకు పంపింది. ప్రజల అభిప్రాయాల కోసం 30–60 రోజుల గడువు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఆ తరువాత ఈ కొత్త వీసా రూల్స్ అమల్లోకి రానున్నాయి. విదేశీ విద్యార్థులపై ట్రంప్ చర్యలు:ట్రంప్ పాలనలో అక్రమ వలసదారుల తొలగింపు, యూనివర్సిటీలపై నియంత్రణ పెరిగింది. హార్వర్డ్ యూనివర్సిటీపై 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ ఫండింగ్ను నిలిపివేశారు. ట్రంప్ విధించిన షరతులను హార్వర్డ్ తిరస్కరించడంతో విదేశీ విద్యార్థులకు ప్రవేశాన్ని నిషేధించారు. అయితే, ఇటీవల ఓ ఫెడరల్ న్యాయమూర్తి ఈ నిర్ణయాన్ని నిలిపివేశారు. అయినప్పటికీ విదేశీయులపై ట్రంప్ మరిన్ని కఠిన ఆంక్షలు విధించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానంపై దృష్టిసారించినట్లు సమాచారం.

అదేదో మీ ముద్దుల భార్యతోనే మొదలుపెట్టండి!
వలసదారుల బహిష్కరణ విషయంలో దూకుడు పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కౌంటర్ పడింది. అమెరికా పౌరసత్వం పొందిన వారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సంతకాల సేకరణ జరుగుతోంది. అదేదో.. తన ముద్దుల భార్య మెలానియా నుంచే మొదలుపెట్టాలంటూ డిమాండ్ చేస్తూ ఏకంగా సంతకాల సేకరణ చేపట్టారు. ‘‘Deport Melania" అనే పేరుతో అమెరికాలో ఆన్లైన్లో సంతకాల సేకరణ ప్రారంభమైంది. ఈ పిటిషన్లో మెలానియా ట్రంప్, ఆమె తల్లిదండ్రులు, కుమారుడు బారన్ అమెరికా నుంచి బహిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ ఏమన్నారంటే.. అమెరికన్ పౌరసత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న విదేశీ మూలాలవారు దేశం నుంచి వెళ్లిపోవాలి అని. ట్రంప్ చెప్పిన దానిప్రకారం.. విదేశాల నుంచి వచ్చి పౌరసత్వం పొందిన వారిని బహిష్కరించాలంటే, ముందుగా ఆయన కుటుంబం నుంచే ఆ ప్రక్రియ ప్రారంభించాలి అనేది ఈ పిటిషన్ ఉద్దేశం. మెలానియా పౌరసత్వంపై వివాదం ఏంటంటే.. మెలానియా ట్రంప్ అసలు పేరు మెలనియా క్నావ్స్. స్లోవేనియాలో జన్మించారు. 1970 ఏప్రిల్ 26న అప్పటి యుగోస్లావియాలోని నోవో మెస్టో (Novo Mesto) అనే పట్టణంలో జన్మించారు. ప్రస్తుతం ఇది స్లోవేనియా దేశంలో భాగంగా ఉంది. బాల్యంలో ఆమె సెవ్నికా అనే గ్రామంలో గడిపారు. ఆమె తండ్రి కార్లు అమ్మేవారు. తల్లి బట్టల పరిశ్రమలో పని చేసేది. తన 16వ ఏట మోడలింగ్ కెరీర్ను ప్రారంభించిన మెలానియా.. తర్వాత పారిస్, మిలాన్లకు వెళ్లి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఆపై మోడలింగ్ కోసం వీసా ద్వారా 1996లో అమెరికాకు వచ్చారు. మెలానియా 2000లో EB-1 వీసా (Einstein Visa) కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2001లో ఆమెకు ఈ వీసా మంజూరు అయ్యింది. అయితే అప్పటికి ఆమె సాధారణ ఫ్యాషన్ మోడల్ మాత్రమే. ఆమెకు అంత స్థాయి అంతర్జాతీయ గుర్తింపు కూడా లేదు అనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2005లో ట్రంప్ను వివాహం చేసుకున్న ఆమె.. 2006లో అమెరికా పౌరసత్వం పొందారు.EB-1 వీసా అంటే.. ఇది అమెరికా ప్రభుత్వం ఇచ్చే ఉన్నత ప్రతిభ కలిగిన వ్యక్తుల కోసం ప్రత్యేక వీసా. సాధారణంగా నోబెల్ బహుమతి విజేతలు, ఒలింపిక్ పతకాలు, పులిట్జర్, అకాడమీ అవార్డులు వంటి అంతర్జాతీయ గుర్తింపు ఉన్నవారికి మాత్రమే ఈ వీసా లభిస్తుంది. అయితే, మెలానియా నిజంగానే ఆ గుర్తింపునకు అర్హత ఉన్న వ్యక్తేనా? అనే విషయంపై వివాదం నడుస్తోందక్కడ. 2025 జూన్లో జరిగిన అమెరికా కాంగ్రెస్ విచారణలో డెమొక్రాటిక్ ప్రతినిధి జాస్మిన్ క్రాకెట్ వ్యాఖ్యానిస్తూ.. మెలానియా పొందింది Einstein వీసా అయితే లెక్క సరిపోవడం లేదంటూ విమర్శించారు.ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై తీసుకుంటున్న కఠిన చర్యలు, వీసా రద్దులు, చైన్ మైగ్రేషన్((పౌరులు తమ కుటుంబ సభ్యులకు గ్రీన్ కార్డులు పొందించే విధానం) వ్యతిరేకత వంటి విధానాలను ప్రోత్సహిస్తోంది. అదే సమయంలో.. ఆమె పొందిన పౌరసత్వం చట్టబద్ధమైనదే. కానీ, తన పౌరసత్వం ద్వారా ట్రంప్ భార్య మెలానియా తన తల్లిదండ్రులకు గ్రీన్ కార్డులు ఇప్పించారు. అంటే.. ఏ రకంగా చూసుకున్నా ట్రంప్ పాలసీకి ఈ చర్యగా విరుద్ధంగా ఉంది. అందుకే.. ఆ మొదలుపెట్టేదోదో మెలానియాతోనే మొదలుపెట్టండి అని అమెరికన్లు సంతకాల పిటిషన్ చేపట్టారు.

షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్ష
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు బుధవారం ఆరు నెలల జైలు శిక్షపడింది. ఆడియో లీక్ వ్యవహారంలో.. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) కోర్టు ధిక్కరణ కింద ఆమెకు ఈ శిక్ష విధించిందని సమాచారం. ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్షపడింది. కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లా న్యాయస్థానం ఆమెకు ఈ శిక్ష విధించిందని బుధవారం(జులై 2న) అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయి, దేశం వీడిన షేక్ హసీనా.. భారత్లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. గత ఏడాది అక్టోబర్లో షేక్ హసీనా.. రాజకీయ నాయకుడు షకీల్ అకాండ్ బుల్బుల్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ అయ్యింది. అందులో న్యాయవ్యవస్థను బెదిరించేలా ఉన్న వ్యాఖ్యలపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఈ వ్యాఖ్యలకుగానూ హసీనాకు ఆరు నెలలు, షకీల్ బుల్బుల్కు 2 నెలల జైలు శిక్ష విధిస్తూ జస్టిస్ ఎం.డి. గోలం మోర్టుజా మొజుందర్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తీర్పు ప్రకటించింది.ఇదిలా ఉంటే.. ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు 30 శాతం కోటా కొనసాగించాలన్న ప్రభుత్వం నిర్ణయంపై నిరుద్యోగులు కిందటి ఏడాది జూన్లో ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఈ కోటాను సమర్థిస్తూ తీర్పు ఇవ్వడంతో.. నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ, నిరసనలు తగ్గలేదు. క్రమంగా ఆ ఆందోళన హింసాత్మకంగా మారింది. ఘర్షణల్లో 300 మందికి పైగా మరణించగా.. వేలాది మందికి గాయాలయ్యాయి. కర్ఫ్యూ, ఇంటర్నెట్ షట్డౌన్, సైన్యం మోహరింపు వంటి కఠిన చర్యలు తీసుకున్నా.. పరిస్థితి అదుపులోకి రాలేదు. చివరకు.. షేక్ హసీనా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనలు ప్రధాని నివాసాన్ని తాకడంతో.. ఆమె అక్కడి నుంచి భారత్కు వచ్చేశారు. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆమె రాజీనామా అనంతరం, తాత్కాలిక ప్రధానిగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు.
జాతీయం

SpiceJet: గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్
ముంబై: గోవా నుంచి పుణెకు ప్రయాణిస్తున్న స్పైస్జెట్ క్యూ400 విమానం కిటికీ ఫ్రేమ్ హఠాత్తుగా ఊడిపోయింది. అయితే ప్రయాణికుల భద్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని తెలుస్తోంది. పుణెలో విమానం ల్యాండవగానే ఊడిన కాస్మెటిక్ ఇంటీరియర్ కిటికీ ఫ్రేమ్ను బిగించామని స్పైస్జెట్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ఘటనను ఆ విమాన ప్రయాణికులు తీవ్రంగా తప్పుబట్టారు. సరైన ముందుస్తు తనిఖీలు చేయకుండా విమానాలను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ కిటికీ అసెంబ్లీ యూనిట్ మొత్తం ఊడిపోయింది. అయినాసరే విమానాన్ని అలాగే పోనిచ్చారు. అసలీ విమానాన్ని ఎగిరే అర్హత ఉందా?’’ అంటూ ఒక ప్రయాణికుడు సంబంధిత కిటికీ ఫొటోను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు ట్యాగ్చేస్తూ ‘ఎక్స్’లో పోస్ట్చేశారు. #SpiceJet from Goa to Pune today. The whole interior window assembly just fell off mid flight. And this flight is now supposed to take off and head to Jaipur. Wonder if it’s air worthy @ShivAroor @VishnuNDTV @DGCAIndia pic.twitter.com/x5YV3Qj2vu— Aatish Mishra (@whatesh) July 1, 2025

విమాన ప్రమాద పరిస్థితులపై ‘రీక్రియేషన్’.. ఏం తేలిందంటే..
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో జూన్ 12న ఘోర విమాన ప్రమాదం జరిగిన దరిమిలా అందుకు గల కారణాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ముగ్గురు శిక్షణ పొందిన పైలట్లు ఎయిర్లైన్స్ బోయింగ్ 787 విమాన ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ పైలట్లు విద్యుత్ వైఫల్యాలను తిరిగి సృష్టించారు. ఫలితంగా డ్యూయల్-ఇంజిన్ నిలిచిపోయంది. దీంతో విమానం టేకాఫ్ తర్వాత పైకి వెళ్లలేకపోయింది.ప్రమాద ఘటన అనంతరం జెట్లైనర్ బ్లాక్ బాక్స్ల నుండి ఇప్పటికే డేటాను డౌన్లోడ్ చేసుకున్న పరిశోధకులు, 787లోని ఇంధన స్విచ్ల స్థానాన్ని కూడా పరిశీలించనున్నారు. ఇంధన స్విచ్ల శిధిలాలతో ఈ డేటాను ధృవీకరించనున్నారు. విమానం క్లిష్టమైన దశకు చేరుకున్నప్పుడు టేకాఫ్ రన్ సమయంలో పైలట్లు అనుకోకుండా ఏదైనా స్విచ్ ఆఫ్ చేశారా? అనేదానిని నిర్ధారించడానికి రీక్రియేషన్ ఉపకరించనుంది.రీక్రియేషన్ చేసిన పైలెట్లు ఘటన జరిగిన నాటి పరిస్థితులను తిరిగి సృష్టించారు. ఈ ఫలితాలతో ట్రిమ్ షీట్ డేటాను రూపొందించారు. ట్రిమ్ షీట్ అనేది విమానం సమతుల్యతను లెక్కించడానికి, రికార్డ్ చేయడానికి ఏవియేషన్లో ఉపయోగించే విధానం. ఇది విమానపు టేకాఫ్, ల్యాండింగ్ కోసం గురుత్వాకర్షణ కేంద్రం సురక్షిత పరిమితుల్లో ఉందని నిర్ధారిస్తుంది. శిక్షణ పైలట్లు ఒకే ఇంజిన్ వైఫల్యాన్ని రీక్రియేట్ చేసి, పలు వివరాలను సేకరించారు. కాగా ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానంలోని పైలట్లకు 400 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు డ్యూయల్-ఇంజిన్ వైఫల్యం తలెత్తితే, దానిని ఎదుర్కొనేందుకు శిక్షణ అందించలేదని సమాచారం. ఇది కూడా చదవండి: బాలునిపై ఏడాదిగా మహిళా టీచర్ దారుణం

విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం.. జీపీఎస్ స్పూఫింగ్?
సాక్షి, నేషనల్ డెస్క్: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారించలేదు. దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. దీని వెనుక కుట్రకోణం లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా దర్యాప్తు సాగుతున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్మ మొహోల్ సైతం చెప్పారు. గ్లోబల్ పోజీషనింగ్ సిస్టమ్(జీపీఎస్) సంకేతాలను తారుమారు చేసి ఎయిర్ ఇండియా విమానం కూలిపోయేలా ఎవరైనా కుట్రలు సాగించారా? అనేది చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే 2023 నవంబర్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు దేశ సరిహద్దుల్లో 465 జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. అమృత్సర్, జమ్మూ ప్రాంతాల్లో అధికంగా జరిగాయి. గత నెలలో ఢిల్లీ నుంచి జమ్మూకు బయలుదేరిన ఎయిర్ విమానం కొద్దిసేపటికే తిరిగివచ్చింది. జీపీఎస్ సంకేతాల్లో ఏదో తారుమారు జరుగుతున్నట్లు అనుమానాలు రావడంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. పైలట్కు తప్పుడు సంకేతాలు భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన సి–130జే విమానం ఏప్రిల్లో మయన్మార్ గగనతలంపై ప్రయాణిస్తుండగా జీపీఎస్ స్పూఫింగ్ జరిగింది. దాంతో అప్రమత్తమై సురక్షితంగా ల్యాండ్చేశారు. జీపీఎస్ సిగ్నళ్లలోకి అపరిచితులు, విద్రోహులు చొరబడుతున్న ఘటనలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. స్పూఫింగ్ లేదా జామింగ్ అనేది పెనువిపత్తుగా మారుతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్పోర్ట్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2023–2024 మధ్య జీపీఎస్లో ఇంటర్ఫియరెన్స్ రేటు 175 శాతం, జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు 500 శాతం పెరిగాయి. స్ఫూపింగ్ లేదా జామింగ్ చేస్తే విమానం కాక్పిట్లోని పైలట్కు తప్పుడు మార్గం, తప్పుడు గమ్యస్థానం కన్పిస్తాయి. నిర్దేశిత మార్గంలో వెళ్లాల్సిన విమానం మరో మార్గంలో వెళుతుంది. విమానం ప్రయాణించాల్సిన ఎత్తులోనూ మార్పులు వస్తాయి. దాంతో గగతలంలో విమానాలు పరస్పరం ఢీకొనే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎత్తయిన భవనాలు, కొండలను ఢీకొట్టొచ్చు. అలాగే రన్వే కిందికి దూసుకెళ్లడం కూడా జరగొచ్చు. కల్లోలిత ప్రాంతాల్లో అధికం.. యుద్ధాలు జరిగే కల్లోలిత ప్రాంతాల్లో జీపీఎస్ స్పూఫింగ్ సమస్య అధికంగా ఉంది. 2024లో ఆయా ప్రాంతాల్లో శాటిలైట్ సిగ్నల్ జామింగ్ లేదా స్పూఫింగ్ ఘటనలు 4.3 లక్షలు నమోదయ్యాయి. 2023లో 2.6 లక్షలు నమోదయ్యాయి. అంటే ఏడాది కాలంలో 62 శాతం పెరిగాయి. ఈజిప్టు, లెబనాన్, నల్ల సముద్రం, రష్యా–ఎస్తోనియా, రష్యా–లాతి్వయా, రష్యా–బెలారస్ సరిహద్దుల్లో స్ఫూపింగ్ బెడద ఎక్కువగా ఉందని ఎయిర్లైన్స్ సంస్థలు చెబుతున్నాయి. మయన్మార్తోపాటు భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అంతర్జాతీయ వైమానిక పరిశ్రమ ఎదుర్కొంటున్న సైబర్ దాడుల్లో జీపీఎస్ స్ఫూపింగ్, జామింగ్ కూడా ఒకటి. ఇలాంటి ఘటనలు తెలియపర్చడానికి అమెరికాలో ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్ ఒక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఫస్ట్టైమర్లే విన్నర్లు!
బిహార్లో త్వరలో జరుగనున్న 18వ శాసనసభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు అస్త్రశ్రస్తాలతో సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై దృష్టి పెట్టాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. సిట్టింగ్లతో పోలిస్తే ఓటర్లు కొత్త అభ్యర్థులకే పట్టం కట్టడం బిహార్లో ఆనవాయితీగా వస్తోంది. 2010, 2015, 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. గత మూడు పర్యాయాలు అసెంబ్లీలో అడుగు పెట్టినవారిలో సగానికి పైగా ఎమ్మెల్యేలు మొదటిసారి పోటీ చేసి గెలిచినవారే కావడం విశేషం. విజేతల్లో ఫస్ట్టైమ్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండడం బిహార్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. అభ్యర్థులను వరుసగా రెండోసారి గెలిపించడానికి ఓటర్లు ఇష్టపడడం లేదు. కొత్త ముఖాలు 50 శాతానికి పైగానే.. బిహార్లో శాసనసభ స్థానాల సంఖ్య 243. 2010 ఎన్నికల్లో ఏకంగా 150 మంది మొదటిసారి విజయం సాధించారు. అంటే 61.7 శాతం మంది తొలిసారి అసెంబ్లీలో ప్రవేశించారు. 2015లో వీరి సంఖ్య కొంత తగ్గింది. 243 మందికి గాను 131 మంది తొలిసారి గెలిచారు. 53.9 శాతం మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయినవారు ఉన్నారు. 2020 ఎన్నికల్లో 127 మంది ఫస్ట్టైమ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీ వీరి వాటా 52.3 శాతం. మొత్తానికి కొత్త ముఖాల సంఖ్య 50 శాతానికిపైగానే ఉండడం గమనార్హం. రెండోసారి కంటే మూడోసారి గెలిచిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఈసారి ఎన్నికల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతుందా? లేక ఓటర్లు మనసు మార్చు కుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్లకు కష్టకాలమే రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరోసారి పోటీచేసి నెగ్గడం గగనకుసుమంగా మారుతోంది. గత 20 ఏళ్లుగా వారి సక్సెస్ రేటు క్రమంగా పడిపోతోంది. 2005లో పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 71.4 శాతం మంది మళ్లీ గెలిచారు. 2010లో పోటీచేసినవారిలో కేవలం 55 శాతం మంది రెండోసారి ఎన్నికయ్యారు. 2015లో వీరి సంఖ్య 53.1 శాతానికి పడిపోయింది. 2020 ఎన్నికల్లో 48.6 శాతం మంది మరోసారి గెలిచారు. పాత ఎమ్మెల్యేలను పక్కనపెట్టి కొత్త నేతలకు ఓటర్లు పట్టం కడుతుండడం అశావహులకు వరం లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా యువత ఈ అవకాశం సది్వనియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
ఎన్ఆర్ఐ

జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మ స్మారక సిరికోన నవలారచన పోటీ తుది ఫలితాలు
తెలుగులో గుణాత్మకమైన నవలారచనలను ప్రో త్సహించడానికి సిరికోన సాహితీ అకాడెమీ ( వాట్సప్) తరపున, స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మ నవలా రచన పోటీ 2024కు సంబంధించిన తుది ఫలితాలను సంస్థ ప్రకటించింది. గత నాలుగు సంవత్సరాల నుంచి, ప్రతి ఏడాదీ ఉత్తమ నవలారచన పోటీల్లో భాగంగా ఉత్తమ రచనకు ముప్ఫై వేల నగదు బహుమతితో కూడిన పురస్కారాన్ని అందిస్తుంది., ఇతర రచయితలకు ప్రోత్సాహకంగా ఒకటి రెండు ప్రత్యేక బహుమతులను కూడా ప్రకటిస్తుంది. 2024 వ సంవత్సరానికి అనూహ్యమైన స్పందన లభించింది.. ఎక్కువమంది ప్రేమను కేంద్రవస్తువుగా తీసుకుని రాసినా, గణనీయ సంఖ్యలో ఆధునిక జీవన వైవిధ్యాన్ని చిత్రించే నవలలు రచించి పోటీకి సమర్పించారు.. ప్రాథమిక వడబోత పిమ్మట 26 నవలలు పోటీకి నిలిచాయి. తర్వాత వాటిని మరొక నిర్ణేత పరిశీలించి ఎంపిక చేసిన 7 నవలలను ముగ్గురు న్యాయనిర్ణేతలకు పంపడం జరిగింది. a. కథావవస్తువు, b. ఇతివృత్త నిర్మాణం- వాస్తవికత/ తార్కికతలు, c. శైలి- శిల్పం, d. సామాజిక ప్రయోజనం అంశాల ఆధారంగా గుణ పరిశీలన జరిగిందని సంస్థ ప్రతినిధి జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఉత్తమ నవల: 'కిలారి': డా.బి.నాగశేషుప్రత్యేక బహుమతులు: 1. “కావేరికి అటూ ఇటూ”: రెంటాల కల్పన 2. “ లింగాల కంఠంలో” : రంజిత్ గన్నోజుఅసాధారణ నిర్మాణచాతురితో, అద్భుత మాండలిక భాషా కథనంతో, సమగ్ర గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరిస్తున్న నవల 'కిలారి, మూడుతరాల నారీచేతనకు అద్దం పడుతున్న రచన 'కావేరికి అటూ ఇటూ..', నల్లమల అడవుల్లోని చెంచుల జీవితాన్ని అత్యంత సన్నిహితంగా పరిచయం చేస్తున్న రచన 'లింగాలకంఠంలో నవలలు నిస్సందేహంగా సిరికోనకు గర్వకారణంగా నిలిచే రచనలని పేర్కొంది. విజేతలకు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం అభినందనలు తెలిపారు.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు
తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా విశాఖలో దివ్యాంగుల కోసం నాట్స్ ఉచిత బస్సును ఏర్పాటు చేసింది. నాట్స్ స్థానిక స్వచ్చంద సంస్థ గ్లోతో కలిసి విశాఖలోని దివ్యాంగుల పాఠశాల సన్ ప్లవర్ స్కూల్ కోసం ఈ బస్సు కోనుగోలుకు కావాల్సిన ఆర్ధిక సహాకారాన్ని అందించింది. విశాఖ ఎంపీ భరత్ ఈ బస్సును లాంఛనంగా ప్రారంభించారు. నాట్స్ తెలుగు వారి కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ఎంపీ ప్రశంసించారు. నాట్స్ సంబరాల్లో భాగంగా సంబరంలో సేవ.. సంబరంతో సేవ అనే కార్యక్రమం కింద సంబరాల్లో వచ్చిన మొత్తంలో 10శాతం ఇలా సేవ కార్యక్రమాలకు వెచ్చిస్తోంది. దానిలో భాగంగానే న్యూజెర్సీలో జరిగిన సంబరాల్లో ఇచ్చిన మాట ప్రకారం విశాఖలో దివ్యాంగుల పాఠశాల సన్ ప్లవర్ స్కూల్కి తన చేయూత అందిస్తోంది. నాట్స్ బోర్డ్ మాజీ డైరెక్టర్, ఎవల్యూజ్ సంస్థ అధినేత శ్రీనివాస్ అరసాడ కూడా ఈ దివ్యాంగ పాఠశాలకు కావాల్సిన ఆర్థిక చేయూత అందించారు.

షాకిచ్చిన ట్రంప్.. సోషల్ మీడియా వివరాలు ఇవ్వకపోతే వీసా రద్దు!
వాషింగ్టన్: వీసా అభ్యర్థులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాకిచ్చారు. వీసా అప్లయి దారులు వారి సోషల్ మీడియా అకౌంట్ల వివరాల్ని బహిర్ఘతం చేయాల్సి ఉంటుంది. లేదంటే సదరు అభ్యర్థుల వీసా క్యాన్సిల్ చేసే దిశగా చర్యలకు ఉపక్రమించారు. తద్వారా సోషల్ మీడియా అకౌంట్లలో వీసా అప్లయి దారులు ఏ మాత్రం నెగిటీవ్ అనిపించినా అలాంటి వారు అమెరికాలోకి అడుగు పెటట్టడం అసాధ్యం అవుతుంది.ఉదాహారణకు నార్వేకు చెందిన 21ఏళ్ల మాడ్స్ మికెల్సెన్ అమెరికాలో పర్యాటించాలని అనుకున్నాడు. కానీ మాడ్స్ ఫోన్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బట్టతలతో ఉన్న మీమ్ ఫొటో ఉంది. అంతే ఆ ఫొటొ దెబ్బకు అమెరికాలో పర్యటించే అవకాశాన్ని కోల్పోయాడు. మాడ్స్ తరహాలో భారతీయులు సైతం అమెరికాలో అడుగుపెట్టేందుకు రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోనున్నారు. అందుకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తీసుకున్న నిర్ణయమే కారణం. ఇంతకి ఆ నిర్ణయం ఏంటని అనుకుంటున్నారా?.అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాల మంజూరుపై ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. వీసాల మంజూరులో పారదర్శకతను పాటిస్తూ వీసా అభ్యర్థుల గుణగణాల్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కొత్త వీసా నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.Visa applicants are required to list all social media usernames or handles of every platform they have used from the last 5 years on the DS-160 visa application form. Applicants certify that the information in their visa application is true and correct before they sign and… pic.twitter.com/ZiSewKYNbt— U.S. Embassy India (@USAndIndia) June 26, 2025 సోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త.. లేదంటే నో వీసాఅమెరికా వెళ్లేందుకు వీసా అప్లయి చేసుకునే అభ్యర్థులు వారి ఐదేళ్లకు సంబంధించిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్ల (సోషల్ మీడియా వెట్టింగ్) వివరాల్ని డీఎస్-160ఫారమ్లో బహిర్ఘతం చేయాల్సి ఉంటుంది. ఆ ఫారమ్లో వీసా కోసం ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్స్ వివరాల్ని ఎవరైతే మీరు పొందే కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్ తీసుకుని వీసా ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే ఫారమ్లో అభ్యర్థులు వారి సోషల్ మీడియా వివరాల్ని పొందుపరచాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు మీ సోషల్ మీడియా అకౌంట్స్ను చెక్ చేస్తారు. అందులో ఏ మాత్రం తేడా అనిపించినా వీసా ఇవ్వరు.అంతర్జాతీయ విద్యార్థులపై ఆంక్షలు విధించేలాఇక తాజా చర్య ట్రంప్ అంతర్జాతీయ విద్యార్థుల్ని నియంత్రించే ప్రయత్నాల్లో భాగమేనని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా గతేడాది అమెరికాలోని పలు కాలేజీ క్యాంపస్లలో పాలస్తీనాకు అనుకూలంగా పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నాటి నుంచి అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు దిగింది. కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం వీసా ప్రక్రియ సమయంలో సోషల్ మీడియా సమాచారాన్ని విశ్లేషించడం జాతీయ భద్రతా చర్యలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది.భారత్లో అమెరికా రాయబార కార్యాలయం ప్రకటన అందుకు అనుగుణంగా గత సోమవారం భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ కీలక ప్రకటన చేసింది. అందులో 2019 నుండి, యునైటెడ్ స్టేట్స్ వీసా దరఖాస్తుదారులు వలసదారుల, వలసేతర వీసా దరఖాస్తు ఫారమ్లపై సోషల్ మీడియా ఐడెంటిఫైయర్లను అందించాలని కోరింది. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారితో సహా, యునైటెడ్ స్టేట్స్కు అనుమతించబడని వీసా దరఖాస్తుదారులను గుర్తించడానికి మేము మా వీసా స్క్రీనింగ్, వెట్టింగ్లో అందుబాటులో సమాచారాన్ని ఉపయోగిస్తాము’ అని రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా 33 ఏళ్ల భారత సంతతి వ్యక్తి
అమెరికాలోని న్యూయార్క్ మేయర్ (New York Mayor) అభ్యర్థిగా భారత సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. న్యూయార్క్లో డెమోక్రటిక్ అభ్యర్థిత్వానికి జరిగిన పోరులో భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మమదానీ (Zohran Mamdani) గెలుపొందారు. మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై ఆయన విజయం సాధించారు. ప్రైమరీ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థులెవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో ర్యాంక్డ్ ఛాయిస్ కౌంట్ ద్వారా అభ్యర్థిత్వ రేసు ఫలితాన్ని వెల్లడించగా జోహ్రాన్ మమదానీ గెలుపొందారు. ప్రస్తుత న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయనున్నారు. ఇంతకు ముందు.. డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆయన పలు అవినీతి కుంభకోణాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో న్యూయార్క్ ప్రజల నుంచి ఎరిక్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. నవంబర్లో జరగనున్న న్యూయార్క్ మేయర్ ఎన్నికల రేసులో జోహ్రాన్ మమదానీ ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్తో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ జోహ్రాన్ మేయర్గా ఎన్నికైతే.. న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన మొదటి ముస్లిం, భారతీయ-అమెరికన్గా చరిత్ర సృష్టిస్తారు.మేయర్ ఎన్నిక ప్రధాన అభ్యర్థులు(ఇప్పటివరకు)జోహ్రాన్ మమదానీ (Zohran Mamdani) – డెమోక్రటిక్ సోషలిస్ట్, డెమోక్రటిక్ ప్రైమరీలో విజయంకర్టిస్ స్లివా (Curtis Sliwa) – రిపబ్లికన్ అభ్యర్థిజిమ్ వాల్డెన్ (Jim Walden) – స్వతంత్ర అభ్యర్థిఎరిక్ అడమ్స్ – ప్రస్తుత మేయర్, స్వతంత్ర అభ్యర్థిజోహ్రాన్ మమదానీ గురించి.. 33 ఏళ్ల రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య రమా దువాజీ(rama duwaji). ఓ డేటింగ్ యాప్తో పరిచయమై.. ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడీయన. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో ఏడాదిగా దూసుకుపోతున్నాడు. బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. జోహ్రాన్ మమదానీకి జనాల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా యువతలో. సోషల్ మీడియాను ఏడాది కాలంగా బాగా ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. మద్దతుదారులతో డ్యాన్స్ చేస్తూ, మజ్జిగ పంచుతూ సంబరాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నారై కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు బాలీవుడ్ సాంగ్స్, డైలాగులతో షార్ట్ వీడియోలతో సైతం ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు.Billionaires ke paas already sab kuchh hai. Ab, aapka time aageya.Billionaires already have everything. Now, your time has come. pic.twitter.com/bJcgxzt37S— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) June 4, 2025
క్రైమ్

భర్త వద్దు.. మామే కావాలి.. పెళ్లైన 45 రోజులకే..
పాట్నా: దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో భర్తలను అత్యంత దారుణంగా చంపేస్తున్న ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మరో భర్త.. పెళ్లి అయిన 45 రోజులకు హత్యకు గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే, తన మామతో జీవించేందుకే.. అడ్డుగా ఉన్న భర్తను భార్యే హత్య చేయించింది. ఈ విషాదకర ఘటన బీహార్లో చోటుచేసుకుంది. దీంతో, పెళ్లి అంటేనే పురుషులు వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన ప్రియాంశు (25), గుంజాదేవి (20)లకు రెండు కుటుంబాల పెద్దలు వివాహం జరిపించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య 45 రోజుల క్రితమే వీరిద్దరికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే, గుంజాదేవికి తన మామ అంటే(భర్త తండ్రి కాదు) ఎంతో ఇష్టం. పెళ్లికి ముందు నుంచే గుంజాదేవీ, ఆమె మామ జీవన్సింగ్ (55)లు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. శారీరకంగా కూడా కలిసినట్టు తెలిసింది. ఈ క్రమంలో తన మామనే పెళ్లిచేసుకుంటానని.. గుంజాదేవీ తన పేరెంట్స్కు చెప్పింది. ఇందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు.అనంతరం, ప్రియాంశుతో దేవీకి బలవంతంగా వివాహం చేశారు. తర్వాత.. తన మామను మరిచిపోలేక గుంజాదేవీ.. భర్తను దూరం పెడుతూ వస్తోంది. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకుని తన మామను పెళ్లి చేసుకోవాలని ఆమె భావించింది. దీంతో, తన భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఇందుకు సుపారీ గ్యాంగ్తో డీల్ కుదుర్చుకుంది. గత నెల 25న ప్రియాంశు తన సోదరిని కలిసేందుకు వెళ్లి రైలులో తిరిగి పయనమయ్యాడు. ఈ క్రమంలో నవీనగర్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో గుంజాదేవీ గ్రామం నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది.ఇది గమనించిన ప్రియాంశు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె కాల్ రికార్డులను పరిశీలించగా.. జీవన్సింగ్తో తరచూ టచ్లో ఉన్నట్లు వెల్లడైంది. అతడి కాల్ డేటా కూడా పరిశీలిస్తే సుపారీ గ్యాంగ్తో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. ఇక, ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు సుపారీ గ్యాంగ్ సభ్యులతో పాటు నిందితురాలిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జీవన్సింగ్ పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లి అయిన నెలన్నరకే తమ కొడుకు ఇలా చనిపోయవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

సర్ప్రైజ్ చేస్తానంటూ.. చంపేశాడు
హైదరాబాద్: తండ్రిని సర్ప్రైజ్ చేస్తానని చెప్పిన ఓ కుమారుడు.. కళ్లకు గంతలు కట్టి.. ఆపై కత్తితో పొడిచి హతమార్చిన వైనం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆన్లైన్ బెట్టింగ్లో పోగొట్టిన డబ్బుల గురించి తండ్రి అడగడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ హృదయ విదారక ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా ఘన్పూర్ మండలం కోతులకుంటకు చెందిన కెతావత్ హన్మంత్ (37) బతుకుదెరువు కోసం గోపన్పల్లి ఎన్టీఆర్ నగర్కు వలస వచ్చి మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య జములమ్మ, కొడుకులు రవీందర్ (19), సంతోషిలు ఉన్నారు. హన్మంత్ ఇటీవల తన భూమిని కుదువబెట్టి రూ.6 లక్షల అప్పు తీసుకొని ఇంట్లో పెట్టాడు. ఇంటర్ పూర్తి చేసిన పెద్ద కొడుకు కెతావత్ రవీందర్ యాప్లో ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి రెండున్నర లక్షలు తీసుకెళ్లి బెట్టింగ్లో పోగొట్టాడు. తండ్రి పదేపదే డబ్బుల గురించి అడగగా.. అవసరానికి స్నేహితునికి ఇచ్చానని త్వరలోనే తిరిగిస్తాడని నమ్మబలికాడు. దీంతో రోజూ ఇంట్లో డబ్బు గురించి గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో రవీందర్ తన స్నేహితుడు డబ్బులు ఇచ్చేందుకు వస్తున్నాడని మంగళవారం తండ్రిని ఎన్టీఆర్ నగర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తానని నమ్మించి తండ్రి కళ్లకు గంతలు కట్టాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన కత్తితో గొంతులో బలంగా పొడిచాడు. దాదాపు 100 మీటర్ల వరకు పరిగెత్తి కింద పడిపోయి హన్మంత్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. అనంతరం రవీందర్ బాబాయ్ రమేశ్కు ఫోన్ చేసి నాన్న కత్తితో పొడుచుకొని చనిపోయాడని చెప్పాడు. ఆత్మహత్యగా కుటుంబ సభ్యులను, బంధువులను నమ్మించి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కోతులకుంటకు తరలించారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘనపూర్ పీఎస్కు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలు నిర్వహిస్తే అందరిపై కేసు నమోదవుతుందని హెచ్చరించి, మంగళవారం రాత్రి హన్మంత్ మృతదేహాన్ని తిరిగి గచ్చిబౌలి పీఎస్కు తీసుకొచ్చారు. మృతదేహంతో పాటు వచ్చిన రవీందర్ను విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. భర్త, పిల్లలను వదిలేసి రా'
జనగాం: ఒక పక్క భర్త.. మరోపక్క ప్రేమపేరుతో తరచూ ఫోన్ చేస్తున్న ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెందిన ఏదుల సతీశ్కుమార్తో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన శైలజ(24)కు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి కాపురం 5 సంవత్సరాలు సజావుగానే సాగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో 3 సంవత్సరాల నుంచి పిండిప్రోలు గ్రామానికి చెందిన యువకుడు కంపటి శ్రీరామ్.. తరచూ శైలజకు ఫోన్ చేసి ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. మనమిద్దరం కలిసి ఉందాం.. పిల్లలు, భర్తను వదిలిపెట్టి రా’అని వేధిస్తున్నాడు. ఈ విషయం భర్త సతీశ్కుమార్కు రెండు సంవత్సరాల క్రితం తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఎన్నాళ్ల నుంచి కొనసాగుతుందని ప్రశ్నిస్తూ.. నువ్వు ఎందుకు బతుకుతున్నావు, చావరాదు అని తరచూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. దీంతో భర్త సతీశ్కుమార్, యువకుడు శ్రీరామ్ వేధింపులు తాళలేక శైలజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగింది. గమనించిన భర్త సతీశ్కుమార్ హుటాహుటిన మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శైలజ మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి కవిత ఫిర్యాదు మేరకు భర్త సతీశ్కుమార్, యువకుడు శ్రీరామ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్కె. రియాజ్పాషా తెలిపారు.

కామపిశాచులకు అడ్డాగా..
వరస ఘటనలు బెంగళూరులో మహిళలను బెంబేలెత్తిస్తున్నాయి. తమకు భద్రత కరువైందని వాపోయేలా చేస్తున్నాయి. తాజాగా ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సహోద్యోగిణి పట్ల ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఈ ఘటనతో ఐటీ క్యాపిల్ ఆఫ్ ఇండియా.. ఇప్పుడు కామపిశాచులకు అడ్డాగా మారుతోందన్న చర్చ నెట్టింట నడుస్తోంది. అసలేం జరిగిందంటే.. బెంగళూరు: నగరంలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో మహిళా సహోద్యోగిని టాయిలెట్లో రహస్యంగా వీడియో తీసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్లో ఈ దారుణం జరిగింది. ఓ మహిళా ఉద్యోగి టాయిలెట్లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తన ఫోన్లో చిత్రీకరించాడు. అయితే.. పక్కనున్న క్యూబికల్ ద్వారా ఏవో కదలికలు గమనించిన ఆమె అప్రమత్తమై గట్టిగా అరిచింది. దీంతో ఆమె కొలీగ్స్ అప్రమత్తమై అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని పట్టుకున్నారు. సదరు వ్యక్తిని సీనియర్ అసోసియేట్గా పనిచేస్తున్న స్వప్నిల్ నాగేశ్ మాలి (28)గా గుర్తించారు. ఈ ఘటనపై బాధితురాలు తొలుత హెచ్ఆర్ విభాగంలో ఫిర్యాదు చేసింది. స్వప్నిల్ ఫోన్ పరిశీలించగా.. 30కి పైగా మహిళల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఆపై ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై ఫిర్యాదు నమోదు అయిన నేపథ్యంలో.. ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. నిందితుడిపై బీఎన్ఎస్, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఇన్ఫోసిస్ స్పందించింది. సదరు ఉద్యోగిని కంపెనీ నుంచి తొలగించినట్లు తెలిపింది. ఇటీవల బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే నడిరోడ్డు మీద, మెట్రో రైళ్లలో జరిగిన ఉదంతాలు సీసీఫుటేజీల ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా ఆఫీసుల్లో.. అదీ ప్రముఖ ఐటీ కంపెనీల్లోనూ చోటు చేసుకోవడం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. బెంగళూరులో ప్రధానంగా జరిగిన కొన్ని ఘటనలు.. 2023 నవంబర్ 22 – మెట్రో స్టేషన్లో వేధింపులుమెజెస్టిక్ మెట్రో స్టేషన్.. రద్దీ సమయంలో ఓ యువతిని వెనుక నుంచి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి. బాధితురాలు సహాయం కోరినా ప్రయాణికులు స్పందించలేదు. 2024 జనవరి 27 – క్యాబ్లో వేధింపులుకమ్మనహళ్లి వద్ద.. ఓ యువతి బుక్ చేసిన క్యాబ్లోకి ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ప్రవేశించి వేధించారు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు. Woman molested in Bengaluru while she was out on a morning walk. The man fled the spot soon after and a case against him was registered. Efforts are on to nab him.#Bengaluru pic.twitter.com/k8xlSOvXK7— Vani Mehrotra (@vani_mehrotra) August 5, 2024 కిందటి ఏడాది ఆగష్టులో.. మరో ఒంటరి మహిళపై చోటు చేసుకున్న వేధింపుల తాలుకా వీడియో ఇది.. Video Credits: Vani Mehrotra2025 ఏప్రిల్ 4 – వీధిలో వేధింపులు (BTM లేఅవుట్)సుద్దగుంటెపాళ్య, BTM లేఅవుట్ వద్ద తెల్లవారుజామున ఇద్దరు మహిళలు నడుస్తుండగా, ఓ వ్యక్తి వారిలో ఒకరిని వెనుక నుంచి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. సీసీ కెమెరాలో రికార్డు, వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. అయితే, కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర ఈ ఘటనపై స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు నగరాల్లో సాధారణమే అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు, ఇది వేధింపులను ప్రోత్సహించేలా ఉందని విమర్శించారు. 2025 మే 23న.. బెంగళూరు మెట్రో రైలులో మహిళలను అసభ్యరీతిలో రహస్యంగా చిత్రీకరించి.. ఆ ఫొటోలను సోషల్ మీడియా(ఇన్స్టా)లో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్. ఫోన్లో ఫొటోలు, వీడియోలు లభ్యం. 2025 జూన్ 22 మైలసంద్ర, బెంగళూరు శివారులో.. కిరాణా దుకాణానికి వెళ్తున్న మహిళపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను రక్షించిన స్నేహితుడిపై కూడా దాడి జరిగింది.