Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

YS Jagan Speech At Rentapalla1
చంద్రబాబూ.. నాగమల్లేశ్వరరావు భార్యా, కూతురికి ఏం చెబుతారు?: వైఎస్‌ జగన్‌

సాక్షి, పల్నాడు: రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అనడానికి కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే నిదర్శనమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పర్యటించిన ఆయన.. పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరావు ఘటనను ప్రస్తావించారు. అంతకు ముందు.. నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి.. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఏపీలో అభివృద్ధి, సంక్షేమం ఏదీ లేదు. కేవలం రెడ్‌బుక్‌ రాజ్యాంగం​ మాత్రమే నడుస్తోంది. దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనడానికి ఆంక్షలే నిదర్శనం. తమకు అనుకూలమైన పోలీసులను ఎన్నికల ఫలితాల వేళ నియమించుకున్నారు. కూటమిని గెలిపించుకునేందుకు అన్యాయాలు చేశారు. ఈ విషయం ఈ ప్రాంతం వారందరికీ తెలుసు. నాగమల్లేశ్వరరావు రెంటపాళ్ల ఉపసర్పంచ్‌. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ రోజున టీడీపీ, జనసేన నేతల తప్పుడు ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పీఎస్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఘోరంగా అవమానించారు. టీడీపీకి అనుకూల ఫలితలు రావడంతో నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేశారు. ఊరు విడిచిపోవాలని ఆయన్ని వేధించారు. లేకుంటే రౌడీ షీట్‌ తెరుస్తామని సీఐ ఏకంగా బెదిరించారు. జూన్‌ ఐదో తేదీ రాత్రి పోలీసులు నాగమల్లేశ్వరరావును విడిచిపెట్టారు. ఆయన సరాసరి గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తన తండ్రికి ఫోన్‌ చేసి పోలీసులు బెదిరించిన తీరును నాగమల్లేశ్వరరావు వివరించారు. పోలీసుల తీరుతోనే నాగమల్లేశ్వరావు ఆత్మహత్యయత్నం చేశారు. తనకొడుకును కాపాడుకునేందుకు వెంకటేశ్వర్లు తీవ్రంగా యత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోలేదు. వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నాగమల్లేశ్వరరావును బెదిరించిన ఆ సీఐపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?. నాగమల్లేశ్వరరావుకు భార్యా, కూతురు ఉన్నారు. చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?. ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉంది అని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నియోజక వర్గంలో లక్ష్మీనారాయణ అనే పార్టీ కార్యకర్తపైనా పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని, అది భరించలేక ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని జగన్‌ ప్రస్తావించారు.

YS Jagan Slams Chandrababu Over Target YSRCP Kamma Leaders2
కమ్మవాళ్లు మా పార్టీలో ఉంటే నీకేంటి?: చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

సాక్షి, పల్నాడు: ఏపీలో కొందరు పోలీసులు కుల ఉన్మాదంతో పనిచేస్తున్నారని.. కమ్మవాళ్లు కేవలం చంద్రబాబుకి ఊడిగం చేయడానికే పుట్టారా? అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఇక్కడి డీఎస్పీ హనుమంతరావు కుల ఉన్మాది. కమ్మ పుట్టుక ఎందుకు పుట్టావంటూ లక్ష్మీనారాయణ అనే కార్యకర్తను ఆయన అవమానించారు. అది భరించలేక సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సీఎం, ఆయన కుమారుడు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో ఆ వీడియోలో చెప్పాడు. లక్ష్మీనారాయణ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. చంద్రబాబూ.. మీకు ఊడిగం చేయడానికే కమ్మవారు పుట్టారా?. వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు నాగమల్లేశ్వరరావు, గుత్తా లక్ష్మీనారాయణ.. ఈ ముగ్గురి విషయంలో.. నేను చంద్రబాబును ఒకటే అడుగుతున్నాను. మా పార్టీలో కమ్మ వాళ్లు ఉండొద్దా? మీ పార్టీ కేవలం వారికేనా? అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.ఏం పాపం చేశారని.. వైఎస్సార్‌సీపీలోని కమ్మ సామాజిక వర్గ నేతలను చంద్రబాబు టార్గెట్‌ చేసి వేధిస్తున్నారు. చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే, వెంటాడి వెంటాడి వేధిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. జైలుకు పంపిస్తున్నారు. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును పొట్టన పెట్టుకున్నాడు. ఏం పాపం చేశాడని లక్ష్మీనారాయణ ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేలా చేశారు. చంద్రబాబుకి ఊడిగం చేయడానికి సిద్ధంగా లేడనే దేవినేని అవినాష్‌ను వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని వల్లభనేని వంశీని జైల్లో పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబు శాడిజానికి వల్లభనేని వంశీ బాధపడుతున్నాడు. కొడాలి నాని ఏం పాపం చేశాడని కేసు పెట్టారు. ఏంపాపం చేశాడని.. మా పార్టీ నేత తలశిల రఘురాంపై 3 కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని అబ్బయ్య చౌదరిని వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని దగ్గుబాటి సురేష్‌ వైజాగ్‌ ల్యాండ్‌ క్యాన్సిల్‌ చేశారు. ఏం పాపం చేశాడని నంబూరు శంక్రరావును వేధిస్తున్నారు. నా పక్కనే అన్నాబత్తుని శివకుమార్‌. తెనాలి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయననూ వేధిస్తున్నారు. ఏం పాపం చేసిందని.. మంగళగిరికి చెందిన రాజ్‌కుమార్‌-కృష్ణవేణిలను వేధించారు. రాజ్‌కుమార్‌ను మోకాళ్ల మీద రోడ్డు మీద కూర్చోబెట్టారు. మహిళ అని చూడకుండా కృష్ణవేణిని వేధించారు. ఏం పాపం చేశాడని.. ఇంటూరి రవిపై 19 కేసులు పెట్టి వేధించారు. ఏం పాపం చేశాడని.. ఏం పాపం చేశాడని.. బ్రహ్మనాయుడిని వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని.. పోసానిపై 9 కేసులు పెట్టి వేధించారు. చంద్రబాబును ఎవరైనా కమ్మ వారు వ్యతిరేకిస్తే, వీరు ప్రవర్తిస్తున్న తీరు రాక్షసులకన్నా దారుణం.సినిమా చూపిస్తాంవైఎస్సార్‌సీపీ కమ్మ నేతలను వేధించే కుట్రలో ఎల్లో మీడియా మీడియా భాగమైంది. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఒక ముఠా. రాష్ట్రాన్ని దోచుకోవడం. అదే మీ పని. గజదొంగలుగా దోచుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వారిని అణిచి వేస్తున్నారు. పోలీసులూ.. చంద్రబాబు పాపంలో భాగం కావొద్దు.ఒక విషయం గుర్తుంచుకొండి. కొందరు పోలీసు అధికారులకు చెబుతున్నాను. చంద్రబాబు ఎల్లకాలం ఉండడు. ఇప్పటికే ఏడాది గడిచింది. నాలుగేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. అప్సుడు మీకు సినిమా చూపిస్తాం. ఇప్పుడు తప్పు చేస్తున్న వారందరినీ బోను ఎక్కిస్తాం. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. అందరూ మోసపోయారు. వెన్నుపోటుకు గురయ్యారు. ప్రతి ఒక్కరూ బాధ పడుతున్నారు. ఇది ఎల్లకాలం సాగదు. ప్రజలు, దేవుడు తప్పకుండా మొట్టికాయలు వేస్తారు’’ అని వైఎస్‌ జగన్‌ రెంటపాళ్ల వేదికగా వ్యాఖ్యలు చేశారు.

Not Nair Or Sai: Pant Confirms This Star Will Replace Kohli At Number 43
Ind vs Eng: కోహ్లి స్థానంలో అతడే: క్లారిటీ ఇచ్చిన పంత్‌

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆరంభం నేపథ్యంలో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ కీలక అప్‌డేట్‌ అందించాడు. విరాట్‌ కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి పేరు వెల్లడించాడు. మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సైకిల్‌లో భాగంగా టీమిండియా తమ తొలి సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. లీడ్స్‌ వేదికగా జూన్‌ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది. కాగా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు ముందే రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో రోహిత్‌ స్థానాన్ని శుబ్‌మన్‌ గిల్‌తో భర్తీ చేసిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI).. అతడికి డిప్యూటీగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ను నియమించింది. కాగా కోహ్లి నిష్క్రమణ నేపథ్యంలో టెస్టుల్లో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో ఎవరు దిగుతారన్న అంశంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.కోహ్లి వారసుడిగా కరుణ్‌ నాయర్‌, సాయి సుదర్శన్‌ పేర్లు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రి- మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో భాగంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘శుబ్‌మన్‌ గిల్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడు.అయితే, అతడు ఆడుతున్న మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్‌ చేస్తారన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నేను యథావిధిగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాను’’ అని రిషభ్‌ పంత్‌ వెల్లడించాడు. దీంతో తుదిజట్టుపై మరోసారి సందిగ్దం నెలకొంది. సాయి సుదర్శన్‌ టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడా? లేదంటే ‘ట్రిపుల్‌ సెంచూరియన్‌’ కరుణ్‌ నాయర్‌ ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.ఇంగ్లండ్‌తో టెస్టులకు టీమిండియా:శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌/వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, ఆకాశ్‌ దీప్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌.చదవండి: టీమిండియాకు గేమ్‌ ఛేంజర్లు వీరిద్దరే: ఊహించని పేర్లు చెప్పిన ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌

KTR declines to hand over phone to ACB4
KTR: ఏసీబీకి కేటీఆర్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా–ఈ కేసు విచారణ సందర్భంగా మొబైల్‌ ఫోన్‌లతోపాటు ల్యాప్‌టాప్‌ ఇవ్వాలని ఏసీబీ కోరడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు కేటీఆర్‌ ఏసీబీకి లేఖ రాశారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్‌ ఏసీబీ అధికారుల విచారణను ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం కేటీఆర్‌ ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు 2021 నవంబర్‌ నుంచి 2023 డిసెంబర్‌ వరకు వాడిన ఫోన్లు కావాలని కేటీఆర్‌ను అడిగారు. ఇదే అంశంపై కేటీఆర్‌ ఇవాళ ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. ఆ లేఖలో 2024లో ఫోన్లు మార్చాను. గతంలో వాడిన ఫోన్లు నా దగ్గర లేవు. 2021 నవంబర్‌ నుంచి 2023 డిసెంబర్‌ వరకు వాడిన ఫోన్లు కావాలని అడిగిన ఏసీబీ. ఫోన్లు అడగడం అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని అందులో పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు ఫోన్లను అడగడంపై కేటీఆర్‌ తన న్యాయవాదులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో ‘విచారణ సంస్థలు ఒక పౌరుడి నుంచి సేకరించిన సమాచారాన్ని తిరిగి అదే పౌరునిపై వాడే కుట్ర చేయడం అన్యాయమని గతంలో కోర్టులు పలు తీర్పులు ఇచ్చాయి. వ్యక్తిగతంగా వాడే ఫోన్లను కోర్టు తీర్పు లేకుండా ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21, ఐటీ చట్టం ప్రకారం ఏసీబీ తీరు వ్యక్తిగత హక్కులకు విఘాతం కలిగిస్తుంది. ఈ చట్ట ప్రకారం కేవలం కోర్టు తీర్పుతోనే విచారణ సంస్థలు మొబైల్, ల్యాప్‌టాప్‌ లాంటి వ్యక్తిగత ఉపకరణాలు అడగవచ్చు. ఎలాంటి ప్రజాప్రయోజనం లేని సందర్భంలో విచారణ సంస్థలు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేవన్నారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపుల కోణంలో జరుగుతోంది’ అని కేటీఆర్‌కు న్యాయవాదులు వివరించినట్లు సమాచారం.

DLFs Rs 11000 crore Privana North luxury project sells out in a week5
ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్‌!

దేశంలో హై-ఎండ్ ఇళ్లకు ఏ మాత్రం డిమాండ్‌ తగ్గడం లేదు. ధర ఎన్ని రూ.కోట్లయినా తగ్గేదే లేదంటున్నారు కొనుగోలుదారులు. ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ లిమిటెడ్ తన సరికొత్త లగ్జరీ రెసిడెన్షియల్ వెంచర్ ప్రివానా నార్త్‌లోని ఫ్లాట్లన్నీ కేవలం ఏడు రోజుల్లోనే పూర్తిగా అమ్మేసింది. గురుగ్రామ్‌లో 116 ఎకరాల సువిశాల టౌన్‌షిప్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ రూ .11,000 కోట్లకు పైగా అమ్మకాలను సాధించింది. ఇది దేశంలోని పెద్ద నగరాల్లో ప్రీమియం గృహాలకు ఉన్న బలమైన మార్కెట్ డిమాండ్‌ను తెలియజేస్తోంది.గురుగ్రామ్‌లోని 76, 77 సెక్టార్లలో 17.7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ప్రివానా నార్త్ లో ఆరు ఎత్తైన 50 అంతస్తుల నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు డీఎల్ఎఫ్ అభివృద్ధి చేసిన అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ టవర్లు ఇవే. 1,152 నాలుగు పడక గదుల అపార్ట్‌మెంట్లు, డజను లగ్జరీ పెంట్ హౌస్‌లు ఉన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాట్‌ ధర రూ.9.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఉంది.👉ఇది చదివారా? హైదరాబాద్‌లో పెరుగుతున్న అపార్ట్‌మెంట్‌ లోడింగ్‌డీఎల్ఎఫ్ గత లగ్జరీ లాంచ్‌లలో కనిపించిన విజయాన్ని ప్రతిబింబిస్తూ దేశీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులు ఈ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. డీఎల్ఎఫ్ గతంలో లాంచ్‌ చేసిన ప్రివానా సౌత్‌, ప్రివానా వెస్ట్‌ ప్రాజెక్ట్‌లలో సైతం ఇలాగే వేగంగా అమ్మకాలు నమోదయ్యాయి. హై-ఎండ్ నివాసాలకు ఉన్న డిమాండ్, డీఎల్ఎఫ్ నివాస ప్రాజెక్టులపై కొనుగోలుదారులకు ఉన్న నమ్మకమే ఈ భారీ ప్రతిస్పందనకు కారణమని కంపెనీ నాయకత్వం పేర్కొంది.ప్రివానా నార్త్ వేగవంతమైన అమ్మకాలు హై-ఎండ్ గృహాల పట్ల విస్తృత ధోరణిని హైలైట్ చేస్తాయి. 2025 తొలి త్రైమాసికంలో రూ.4 కోట్లకు పైబడిన ఇళ్ల అమ్మకాలు 28 శాతం పెరిగాయని, ఇందులో ఢిల్లీ-ఎన్‌సీఆర్ వాటా సింహభాగం ఉందని సీబీఆర్ఈ తెలిపింది. 2025 ఆర్థిక సంవత్సరంలో డీఎల్ఎఫ్ రికార్డు స్థాయిలో రూ.21,223 కోట్ల ప్రీ సేల్స్ సాధించింది. భవిష్యత్తులో గురుగ్రామ్, ముంబై, గోవాలలో లాంచ్ చేసే ప్రాజెక్టులకు సైతం ఇలాంటి స్పందనే వస్తుందని కంపెనీ ఆశిస్తోంది.

Comedian Express Hari Shares His Struggles6
తింటుంటే అన్నంలో రక్తం.. రూ.10 ఇస్తే కడుపు నింపుకుందామని.. హరి కష్టాలు

పటాస్‌ షోతో ఫేమస్‌ అయ్యాడు ఎక్స్‌ప్రెస్‌ హరి (Express Hari). పలు టీవీషోలలో పాల్గొంటూ బుల్లితెర ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్నాడు. కమెడియన్‌గా రాణిస్తున్న అతడు ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. పిడికెడంత అన్నం కోసం రక్తాలే చిందించాడు. ఈ విషయాన్ని తాజాగా ఓ షోలో వెల్లడించాడు. తేజస్వి మదివాడ(Tejaswi Madivada) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కాకమ్మ కథలు రెండో సీజన్‌కు ఎక్స్‌ప్రెస్‌ హరి గెస్టుగా వచ్చాడు. ఈ సందర్భంగా తన కష్టాలు ఏకరువు పెట్టాడు.అన్నంలో రక్తపు బొట్లునాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను కష్టాలు చేశాను. మా పాఠశాలలో 250 మంది ఉండేవారు. చేతికి దెబ్బ తగిలి అన్నం తింటుంటే ఆ రక్తం భోజనంలో పడేది. మిగిలిపోయిన ఇడ్లీ కోసం పిలిస్తే ఎలా పరిగెత్తేవాళ్లమో తెలుసా? కిందపడి మోకాళ్లు గీసుకుపోయేవి. ఆ లైన్‌లో ముందు నిలబడితే ఒక ఇడ్లీ వస్తుంది కదా అన్న ఆరాటం!క్యాంటీన్‌లో చపాతీ కొనుక్కోవడానికి..మధ్యాహ్న సమయంలో అందరూ క్యాంటీన్‌కు వెళ్లి తినేవారు. అప్పుడు నాకు ఎవరైనా పది రూపాయలు ఇస్తే ఒక చపాతీ కొనుక్కుని తినాలనుకునేవాడిని అని చెప్పుకొచ్చాడు. ఆ మాటలు విని తేజు ఎమోషనలైంది. వెంటనే లేచి హరికి హగ్‌ ఇచ్చి ఓదార్చింది. నటి తేజస్వి యాంకరింగ్‌ చేస్తున్న కాకమ్మ కథలు టాక్‌ షో ఆహాలో ప్రసారమవుతోంది.చదవండి: చై-శోభితను పట్టించుకోని మహేశ్‌? వీడియోతో ఆన్సర్‌ దొరికేసింది!

Nagamalleshwara Rao passed away, here what happened that day7
నాగమల్లేశ్వరరావు మృతి: నాడు జరిగింది ఇదే..

సాక్షి, పల్నాడు: సత్యం ఊపందుకోకముందే ఒక అబద్ధం ప్రపంచవ్యాప్తంగా సగం దూరం ప్రయాణించగలదు. అలాంటి ప్రచారాలు ఎల్లో బ్యాచ్‌కు వెన్నతో పెట్టిన విద్య. మీడియా సంస్థలను, సోషల్‌ మీడియాను మేనేజ్‌ చేయగలిగే వాళ్లు.. ఇప్పుడు జగన్‌ పల్నాడు పర్యటన నేపథ్యంతోనూ తప్పుడు రాతలు, ప్రచారాలతో చెలరేగిపోతున్నారు. ఏడాది కిందట.. పోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో నాగమల్లేశ్వరరావు అనే వైఎస్సార్‌సీపీ నేత బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. బాధితుడి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వైఎస్‌ జగన్‌ పల్నాడు పర్యటనకు సిద్ధమయ్యారు. అంతే.. పచ్చదండు విషపు రాతలతో రెచ్చిపోసాగింది. బెట్టింగ్‌ యాప్‌ వల్ల చనిపోయాడంటూ సైకో ప్రచారం కొనసాగించింది. ఇది రెంటపాళ్ల గ్రామస్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. అసలు ఆనాడు ఏ జరిగిందంటే.. 2024 జూన్‌ 4న.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నాగమల్లేశ్వరరావు ఇంటిపై కూటమి నేతలు దాడి చేశారు. ఆ కాసేపటికే ఆయన్ని స్థానిక పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అలా.. జూన్‌ 5 రాత్రి 10గంటల వరకు పోలీసులు నిర్భంధించారు. అయితే స్టేషన్‌లో ఏం జరిగిందంటే.. ‘‘మన ఇంటిపై దాడి చేస్తున్నారు నాన్నా’’ అంటూ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నాగమల్లేశ్వరరావుకు ఆయన కుమార్తె ఫోన్‌ చేశారు. కుమార్తెతో మాట్లాడుతుండగా ఫోన్‌ లాక్కుని.. నాగమల్లేశ్వరరావును పోలీసులు దుర్భాషలాడారు. గ్రామంలోకి వెళ్ల కూడదని బెదిరించారు. ఒకవేళ తమను కాదని గ్రామంలోకి వెళ్తే రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. గ్రామంలో ఉండకూడదు’’ అని నాగమల్లేశ్వరరావును పోలీసులు భయపెట్టారు. గ్రామంలో ఉంటే కాల్చేస్తామని బెదిరింపులకు దిగారు. ఆపై జైలు నుంచి బయటకు వచ్చిన నాగమల్లేశ్వరరావు గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. తనను పోలీస్‌ స్టేషన్‌లో తీవ్రంగా అవమానించి.. కొట్టారంటూ తండ్రికి ఫోన్‌ చేసి వాపోయారు. ఇలా రెడ్‌బుక్‌ పాలనలో భాగంగా కూటమి ప్రభుత్వం వేధింపులకు బలైన వైఎస్సార్‌సీపీ తొలి కార్యకర్త నాగమల్లేశ్వరరావు కావడం గమనార్హం. ఇటీవలే ఆయన సంవత్సరీకం పూర్తయింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు వైఎస్‌ జగన్‌ రెంటపాళ్ల గ్రామాన్ని వెళ్లారు. మరోవైపు.. ఈ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగంతో అన్నివిధాల ప్రయత్నించిన కూటమి ప్రభుత్వం.. చివరకు ఇలా ‘బెట్టింగ్‌ యాప్‌ వల్ల చనిపోయాడంటూ’’ ఐటీడీపీ అండ్‌ కో ద్వారా విషప్రచారానికి దిగజారిపోయింది.

Chevireddy Bhaskar Reddy Angry On Police Behavior8
నోటీసు ఇవ్వకుండానే నన్ను అరెస్ట్‌ చేశారు: చెవిరెడ్డి

సాక్షి, విజయవాడ: పోలీసులు తీరుపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిస్‌ ఇవ్వకుండానే తనను అరెస్ట్‌ చేశారంటూ మండిపడ్డారు. నిన్న(మంగళవారం) ఆయన రాసిన లేఖ వైరల్‌గా మారింది.‘‘నిన్నటి వరకు నాపై ఎఫ్‌ఐఆర్‌ కూడా లేదు. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పా. లుకౌట్‌ నోటీసులు ఎందుకిచ్చారో తెలియదు. విచారణలో కనీసం నా అభిప్రాయం కూడా తీసుకోలేదు. తప్పుడు కేసులను ఎదుర్కొంటా’’ అని చెవిరెడ్డి పేర్కొన్నారు.కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. మా అన్నపై మొదట హత్య కేసు పెట్టారు. మా నాన్నపై ఫాక్సో కేసు పెట్టారు. కేసుల పేరుతో లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నారు’’ అని హర్షిత్‌రెడ్డి పేర్కొన్నారు. లిక్కర్ కేసులో ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం...మా వ్యాపార పనుల రీత్యా విదేశాలకు వెళ్తుంటే పారిపోతున్నామని ప్రచారం చేస్తున్నారు. మా పై పెట్టిన అక్రమ కేసులను మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. మా అన్నపై కేసు పెట్టారు.. మా నాన్నపై కేసు పెట్టారు. నేను మా అమ్మ మాత్రమే మిగిలి ఉన్నాం. మాపై కేసులు పెట్టినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం’’ అని హర్షిత్‌రెడ్డి చెప్పారు.కాగా.. నిబద్ధత, నిజాయితీ, పారదర్వకత అంటూ లేఖ రాసిన సిట్‌ అధికారులు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి లేఖ ద్వారా ప్రశ్నించారు. ఒక్క ఏడాది కాలంగా విచారణ చేస్తున్న సిట్‌ అధికారులు.. ఈ 365 రోజుల్లో ఏ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి రాజ్‌ కసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని కానీ ప్రజలకు పంచారని కానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజు చెప్పడంలో అర్థమేంటి?. అది నిజం కాదు కనకే కదా? అంటూ ఆయన ప్రశ్నించారు.

Woman Urges Digital Checks Before Marriage Goes Viral On Socialmedia9
అమ్మాయిలూ.. బహుపరాక్‌!

వివాహం అంటే నూరేళ్ల పంట. తమ పిల్లలు నిండు నూరేళ్లు ఆనందదాయకమైన జీవితం గడపాలని ఇరు కుటుంబాలు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాల గురించి ఆరాలు తీస్తారు. అబ్బాయికి మంచి ఉద్యోగం ఉండి, ఆ కుటుంబానికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నట్లయితే ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఈ ఇంటర్నెట్‌ జమానాలో ఇవి మాత్రమే సరిపోదని అంటోంది ఓ అమ్మాయి. ఆ యువతి పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ వ్యక్తిది మంచి ఉద్యోగం. మంచి కుటుంబ నేపథ్యం. అందుకే ఇంట్లో వాళ్లు నన్ను బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. అయితే అతడి గురించి కుణ్ణంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో.. నా స్నేహితుడి ఐడీతో ఆన్‌లైన్‌లో అతనితో చాట్‌ చేశా. అలా.. సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌ల ద్వారా అతను వ్యవహరించే తీరు బయటపడింది. అతని తీరు నన్ను కంగుతినేలా చేసింది. కాబోయేవాడు మంచి సంపాదనపరుడైతే చాలదు. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి అయినా కూడా సరిపోదు. అంతరంగికంగా అతడి తీరు ఎలా ఉంటుందనే చెప్పి డిజిటల్‌ తనిఖీలు కూడా అత్యంత ముఖ్యమే. నేను ఎదుర్కొన్న అనుభవాన్ని నా కుటుంబ సభ్యులకు వివరించి చెప్పా. అతనితో నా పెళ్లి రద్దు చేయించుకున్నా అని ఆమె ఆ పోస్టులో వివరించింది. అందువల్ల.. అమ్మాయిలూ బహుపరాక్‌. పెద్దలు కుదిర్చిన సంబంధాలపై గౌరవం ఉంటే సరిపోదు. నిండు నూరేళ్ల సంతోషంగా ఉండాలంటే అతని డబ్బు, స్టేటస్‌ కంటే అతడి వ్యక్తిత్వాన్ని బయటపెట్టే డిజిటిల్‌ తనిఖీ అనేది ఈ కాలంలో అత్యంత ముఖ్యం. అంటూ ఆ యువతి పోస్ట్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఈరోజుల్లో అబ్బాయిలు, అమ్మాయిలకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ అయినవాళ్లతోనే, బంధువులతోనో అయిపోతోంది. కానీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఈ తరహా విచారణలోనూ మార్పులు కూడా తప్పనిసరి అని ఓ వ్యక్తి కామెంట్‌ చేశారు. సోషల్‌ మాధ్యమాల పరంగా అబ్బాయి మంచోడు అనుకుంటేనే.. పెళ్లికి సుముఖత చూపాలని, లేదంటే వద్దని సూచిస్తోంది ఆ అమ్మాయి. డిజిటల్‌ తనిఖీలు కూడా ముఖ్యమే అని మరో యువతి వ్యాఖ్యానించింది. (చదవండి: ' పచ్చందనమే పచ్చదనమే..' ఇంట్లోకి తెచ్చేద్దాం ఇలా..!)

Here Is Full Details About Irans Hypersonic Missile Israel Striker Fattah 110
ఇజ్రాయెల్‌-స్ట్రైకర్‌.. ఇరాన్‌ ఫతా ఎంత డేంజరో తెలుసా?

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్‌ ప్రజల పట్ల కనికరం చూపించే ప్రసక్తే లేదని ఇరాన్ ‌సుప్రీం అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. ఈ క్రమంలోనే శక్తివంతమైన హైపర్‌సోనిక్‌ మిస్సైల్స్‌ను ప్రయోగించినట్లు ప్రకటించారాయన. మరోవైపు.. ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ కూడా‌ ‘ఫతా-1 మిస్సైల్స్‌’ను ప్రయోగాన్ని ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఈ క్షిపణి అంత శక్తివంతమైందా? దాని సామర్థ్యం ఏపాటిదో ఓ లుక్కేద్దాం. ఫతా(Fattah) హైపర్‌సోనిక్‌ మిస్సైల్‌.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నట్లు ఇరాన్‌ ప్రకటించుకుంది. అయితే ఈ విషయంలో పలు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే హైపర్‌సోనిక్ క్షిపణి సాంకేతికతను అభివృద్ధి చేయడం చాలా క్లిష్టమైన పని. ఇరాన్‌ గతంలో రష్యా, చైనా వంటి దేశాలతో రక్షణ రంగంలో పరస్పర సహకారం కొనసాగించింది. బహుశా ఈ దేశాల భాగస్వామ్యంతోనే ఫతాను రూపొందించి ఉండొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తుంటారు. అయితే.. ఈ క్షిపణి అభివృద్ధితో అమెరికా, రష్యా, చైనా తర్వాత హైపర్‌సోనిక్ క్షిపణి కలిగిన నాలుగో దేశంగా ఇరాన్‌ నిలిచింది. అలాగని ఇజ్రాయెల్‌ మీదకు ఫతా హైపర్‌సోనిక్‌ మిస్సైల్స్‌ను ఇరాన్‌ ప్రయోగించడం ఇప్పుడే తొలిసారేం కాదు!. కిందటి ఏడాది అక్టోబర్‌ 1వ తేదీన జరూసలేం మీదకు ఈ క్షిపణలను ప్రయోగించినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇటు ఇరాన్‌, అటు ఇజ్రాయెల్‌ ఈ ప్రచారంపై ఇప్పటిదాకా మౌనం వీడలేదు. అయితే తాజాగా మాత్రం ఇరాన్‌ అధికారిక ప్రకటనతో వీటి ప్రయోగం జరిగిందన్న విషయం వెలుగు చూసింది. హైపర్‌సోనిక్‌ అనే పదాన్ని సాధారణంగా అత్యంత వేగమైన రవాణా వ్యవస్థకు ఉపయోగిస్తుంటారు. ఆ తర్వాతి కాలంలో అది యుద్ధ రంగానికి అన్వయించడం మొదలుపెట్టారు. హైపర్‌ సోనిక్‌ మిస్సైల్స్‌ అంటే.. అత్యాధునికమైన క్షిపణులు అని అర్థం. ఇవి శబ్ధ వేగం కంటే అధిక రెట్లతో ప్రయాణిస్తాయి. అత్యంత వేగంతో ప్రయాణించడం వల్ల శత్రుదేశాలు గుర్తించడంగానీ, మార్గంమధ్యలోనే నాశనం చేయడంగానీ చాలా కష్టం. ఫతాను 2003లో ఇరాన్‌ ఆవిష్కరించింది. దీనికి ఆ పేరు పెట్టింది ఇరాన్‌ సుప్రీం ఖమేనీనే. దీని పొడవు 12 మీటర్లు. 1,400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది చేధించగలదు. సుమారు 200 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. శబ్ద వేగం కంటే 13 నుంచి 15 రెట్లు అధికంగా ఇది ప్రయాణించగలదు. అంటే దాదాపు గంటకు 16,000–18,500 కిలోమీటర్లు వేగం ఉంటుందన్నమాట. ఇది హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికిల్ (HGV), హైపర్‌సోనిక్ క్రూజ్ మిసైల్ (HCV) లక్షణాలను కలిగి ఉంది. కానీ, ఫతా సామర్థ్యానికి సంబంధించిన సరైన వివరాలను ఇరాన్‌ ఇప్పటిదాకా వెల్లడించకపోవడం గమనార్హం. కాకుంటే.. ఐరన్‌ డోమ్‌, ఆరో లాంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉన్న ఇజ్రాయెల్‌కు సైతం ఈ క్షిపణి అంతు చిక్కదు. అందుకే ఇరాన్‌ దీనిని ముద్దుగా ఇజ్రాయెల్‌-స్ట్రైకర్‌ అని అభివర్ణిస్తుంటుంది. ఇజ్రాయెల్‌ మాత్రమే కాదు.. హిందూమహాసముద్రంలో సంచరించే అమెరికా యుద్ధ నౌకలను కూడా ఇది ఆనాశనం చేయగలదని ఇరాన్‌ తరచూ ధీమాగా చెబుతుంటుంది. తాజా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇజ్రాయెల్‌ ఆక్రమిత ప్రాంతాల గగన తలాలను పూర్తిగా ఇరాన్‌ తమ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగిందంటే మాత్రం.. అందుకు ఫతాలాంటి హైపర్‌సోనిక్‌ మిస్సైల్‌ కారణం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement