Top Stories
ప్రధాన వార్తలు
AP: ఫిరాయింపు ఎమ్మెల్సీ కొత్త డ్రామా?
విజయనగరం, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు కొత్త డ్రామాకు తెర లేపారా?. సరిగ్గా శాసన మండలిలో అనర్హత పిటిషన్పై విచారణ నాడే ఆయన ఆస్పత్రిలో చేరడం ఆ అనుమానాలను బలపరుస్తోంది. ఎమ్మెల్సీ రఘురాజు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి పార్టీ ఫిరాయించారు. దీంతో వైఎస్సార్సీపీ శాసనమండలిలో ఫిర్యాదు చేసింది. మే 27వ తేదీన విచారణకు హాజరు కావాలని మండలి చైర్మన్ మోషేన్ రాజు నోటీసులు పంపారు. అయితే ఆరోజు కారణం ఏంటో చెప్పకుండానే రఘురాజు విచారణకు గైర్హాజరు అయ్యారు. దీంతో విచారణను మే 31(ఇవాళ్టికి) వాయిదా వేశారు చైర్మన్. అయితే విచారణకు రాకుండా విశాఖ నారాయణ ఆస్పత్రిలో చేరారు రఘురాజు. కిడ్నీ సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరారని ఆయన అనుచరులు అంటున్నారు. మరోవైపు ఆయన ఇవాళ కూడా విచారణకు గైర్హాజరు కావడంతో చైర్మన్ మోషేన్ రాజు విచారణ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. తదుపరి విచారణ ఎప్పుడుంటుదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఇటు శాసనమండలిలో.. అటు శాసనసభలోనూ చైర్మన్, స్పీకర్లు ఫిరాయింపులను తీవ్రంగా పరిగణిస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీకి మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. ఇక మండలిలోనూ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపైనా అనర్హత వేటు పడింది.
గులాబీ పార్టీకి వెరీ వెరీ టఫ్ టైం!
తెలంగాణ రాజకీయాలలో పార్లమెంటు ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఒక పెద్ద పరీక్ష కాబోతుండగా, బీజేపీకి ఒక గేమ్గా మారబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. దానికి కారణం తొమ్మిదిన్నరేళ్లపాటు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్ఎస్ తన ఉనికిని నిలబెట్టుకుంటుందా? లేదా? అన్నది ఒకటైతే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను రుజువు చేసుకోలేకపోతే తదనంతర పరిణామాల వల్ల నష్టపోయే అవకాశం ఉందన్న భావన మరొకటి అని చెప్పాలి.బీఆర్ఎస్ విషయం చూద్దాం. రాజకీయాలలో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రుజువు చేసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ది సంగతి ఎలా ఉన్నా, వ్యక్తిగతంగా అహంభావంతో వ్యవహరించారన్న విమర్శ తెలంగాణ వ్యాప్తంగా ఉంది. సొంత పార్టీవారిని కూడా పెద్దగా కలవకపోవడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, శాసనసభ ఎన్నికలలో కొంతమంది అభ్యర్ధులను మార్చవలసి ఉన్నా, మార్చకపోవడం, తనపైనే అంతా నడుస్తుందన్న అభిప్రాయంతో రాజకీయం చేయడం వంటి కారణాల వల్ల ప్రజలలో అసమ్మతి ఏర్పడింది. నిజానికి ఆయన ఓ ఇరవై, ముప్పై మంది అభ్యర్దులను మార్చి ఉంటే తిరిగి అధికారంలోకి వచ్చేవారన్నది ఎక్కువ మంది ఫీలింగ్.సాధారణ ఎన్నికల ముందు వివిధ ఉప ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పుంజుకుని అధికారం చేజిక్కించుకుందంటే ప్రజల అభిప్రాయాలు ఎంత త్వరగా మారతాయో గమనించవచ్చు. ఆ విషయాన్ని కేసీఆర్ పసికట్టలేకపోయారు. అక్కడికీ హైదరాబాద్ ప్రాంతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన వివిధ అభివృద్దిపనులు, విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడడం వంటి కారణాలతో బీఆర్ఎస్ స్వీప్ చేసింది. కానీ ఇతర కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో బాగా దెబ్బతింది. ఫలితంగా అధికారాన్నే వదలుకోవల్సి వచ్చింది. అధికారం పోయిన తర్వాత సొంత పార్టీ నేతల వ్యవహార సరళి ఎలా మారిపోయిందో చూడవచ్చు. అంతవరకు కేసీఆర్ పిలిస్తే చాలు అన్నట్లుగా ఉన్న నేతలు కొందరు ఓటమి తర్వాత మొహం చాటేసేవారు.కేసీఆర్ సొంత పార్టీని పునాదుల నుంచి నిర్మించుకోవడం కన్నా ఇతరపార్టీల నేతలను తీసుకు వచ్చి అందలం ఎక్కించడం ద్వారా బలపడదామని అనుకున్నారు. కానీ అదే బెడిసికొట్టింది. ఉదాహరణకు సీనియర్ నేత కే. కేశవరావు మూడుసార్లు రాజ్యసభ సభ్యుడు అయ్యారంటే అది కేసీఆర్ పుణ్యమే అని చెప్పకతప్పదు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన జారుకున్నారు. కేశవరావుకు ఉన్న ప్రజాబలం పునాది చాలా తక్కువే అయినా, కేవలం నోరు పెట్టుకుని రాజకీయాలలో చెలామణి అయ్యారంటే అతిశయోక్తి కాదు. మరో నేత కడియం శ్రీహరి టీడీపీ నుంచి వచ్చిన నేత అయినా.. ఆయన్ని ఉప ముఖ్యమంత్రిని చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో ప్రాధాన్యత తగ్గించారన్న భావన ఉంది. కడియం శ్రీహరి కోరుకున్నట్లు ఆయన కుమార్తెకు ఎంపీ టిక్కెట్ కూడా ఇచ్చారు. అయినా దానిని వదలుకుని కాంగ్రెస్లోకి వెళ్లడం పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి. దాంతో బీఆర్ఎస్ బలహీనపడుతోందన్న సంకేతం జనంలోకి వెళ్లింది.మరో కాంగ్రెస్ నేత దానం నాగేందర్కు రెండుసార్లు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్లి ఎంపీ అభ్యర్థి అయ్యారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ బాటలోనే ఉన్నారు. కానీ వారంతా పార్లమెంటు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్కు నాలుగు, ఐదు సీట్లు వస్తే వలసలు తగ్గుతాయి. కరీంనగర్, మెదక్, సికింద్రాబాద్, వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం, నాగర్ కర్నూలు సీట్లలో కొన్ని రాకపోతాయా? అని ఆశాభావంగా ఉంది. కానీ ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం ఒకటి లేదా రెండు వస్తే గొప్పేనని అంటున్నారు.మెదక్ సీటుపై కొంత ఆశ ఉంది. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలలో వచ్చే మెజార్టీతో గట్టెక్కవచ్చన్నది వారి ఆలోచనగా ఉంది. ఒకవేళ ఈ సీటు కూడా రాకపోతే పార్టీకి కష్టాలు తప్పవు. కేసీఆర్ జారి గాయపడి కోలుకున్న తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్లకపోవడం కొంత నష్టం చేసిందని చెప్పాలి. ఎమ్మెల్యేలలో విశ్వాసం తగ్గింది. కేటీఆర్, హరీష్రావు వంటివారు ఎంత గట్టిగానే పనిచేసినా, ప్రతిపక్ష నేత అసెంబ్లీలోకి రాకపోవడం బలహీనతగానే చూడాలి. పార్లమెంటు ఎన్నికలలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టిన తర్వాతే పార్టీకి మళ్లీ ఊపిరి పోసినట్లయింది. జనం పెద్ద ఎత్తున తరలిరావడం ఉపశమనం కలిగించింది. అయినా ఓట్లు పడతాయా?లేదా? అనేది చెప్పలేని పరిస్థితి.పార్లమెంటు ఎన్నికలలో ఐదు సీట్లు గెలిచినా, లేకపోయినా కేసీఆర్ వ్యవహరించే శైలిపైనే ఆయన పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ను వ్యతిరేకించే ప్రజలు తమ ఓట్లను ఈ ఎన్నికలలో బీజేపీకి వేశారన్న అభిప్రాయం ప్రబలింది. బీఆర్ఎస్ గెలవలేదన్న భావనతో పలువురు ఇలా చేశారన్నది ఒక వాదన. దీనిని కేసీఆర్ కానీ, ఆయన పార్టీవారు కానీ అంగీకరించకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈ ఐదేళ్లు నిలబడుతుందా? లేక బీజేపీ పుంజుకుని బీఆర్ఎస్ను దెబ్బతీస్తుందా? అన్నది ఫలితాలను బట్టి ఉండవచ్చు.కాంగ్రెస్ పార్టీ కనీసం ఏడెనిమిది సీట్లు తెచ్చుకోగలిగితే ఆ పార్టీవైపు బీఆర్ఎస్ నేతలు చూడవచ్చు. అదే బీజేపీ కనుక ఎనిమిది పైగా సీట్లు తెచ్చుకుంటే బీఆర్ఎస్ పై నమ్మకం కోల్పోయినవారు ఆ పార్టీవైపు వెళ్లే ప్రయత్నం చేయవచ్చు. బీఆర్ఎస్ను పూర్తిగా దెబ్బతీయడం ద్వారా తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ యత్నిస్తోంది. ముందుగా దీనిని నిరోధించడం పెద్ద సవాలు అవుతుంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలనుంచి ఫిరాయింపులపైన అధిక దృష్టి పెట్టారు. ఇతర పార్టీలను బలహీనపర్చడం వేరు. తనపార్టీని క్షేత్ర స్థాయి నుంచి పటిష్టం చేసుకోవడం వేరు. కేసీఆర్ మొదటి నుంచి ఈ విషయంలో అంత గట్టిగా లేరనే చెప్పాలి.తెలంగాణ ఉద్యమం పెరగడానికి కారణం అయనే అయినప్పటికీ 2009లో టీఆర్ఎస్కు పది అసెంబ్లీ సీట్లే రావడం అప్పట్లో అశనిపాతం అయింది. ఆ రోజుల్లో ఆయన ఒక దశలో నిస్పృహలోకి వెళ్లారన్న వార్తలు కూడా వచ్చాయి. అంతలో ఆనాటి సీఎం రాజశేఖరరెడ్డి మరణంతో రాజకీయ పరిణామాలు వేగంగా ఆయనకు అనుకూలంగా మారాయి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడం, కేసీఆర్ సీఎం కావడం, తొమ్మిదిన్నరేళ్లు నిర్విఘ్నంగా కొనసాగడం జరిగాయి. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం, ఇతర రాష్ట్రాలలో పార్టీని విస్తరింప చేయడం కోసం ప్రయత్నించడం వంటివి కూడా జనానికి పెద్దగా నచ్చలేదు. పేరు మార్చడమే చాలా మందికి ఇష్టం లేదు.అప్పట్లో కాంగ్రెస్ను వీక్ చేయడానికి కేసీఆర్ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బట్టి వారు బీఆర్ఎస్లో కొనసాగడమా? లేక కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరడంపై ఆలోచన చేస్తారు. కేసీఆర్ వీటిని పట్టించుకోనవసరం లేదు. ఆయన నిత్యం ప్రజలలో ఉంటూ, ఐదేళ్ల పాటు పార్టీని నిలబెట్టుకుంటే వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ విజయావకాశాలు పెంచుకోవచ్చు. కానీ కేసీఆర్ అంత సహనంతో, ఓపికతో రాజకీయం చేయవలసి ఉంటుంది. గత పార్లమెంటు ఎన్నికలలో నాలుగు సీట్లు బీజేపీ గెలుచుకున్నప్పుడే కేసీఆర్ అప్రమత్తం అయి ఉండవలసింది. బీజేపీతో అనవసర వివాదాలకు వెళ్లి కొంత నష్టపోయారు. తన కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టు అవడం కూడా కొంత అప్రతిష్టగా మారింది.ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆయన బీజేపీవైపు వెళ్లలేరు. అలాగని కాంగ్రెస్తో స్నేహం చేయలేరు. సొంతంగా పార్టీ నిలబడాలంటే కేసీఆర్ చాలా కష్టపడవలసి ఉంటుంది. నిత్యం ప్రజలలోనే సంచరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయగలగాలి. ఈ లోగా తన ప్రభుత్వ హయాంలో జరిగిన స్కాములు ఆయన మెడకు చుట్టుకోకుండా ఉండాలి. ఐదేళ్లపాటు బీఆర్ఎస్ నిలబడగలిగితే, అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏర్పడే అసంతృప్తిని క్యాష్ చేసుకుని మళ్లీ అధికారంలోకి రాగలుగుతారు. అంత వరకు వేచి ఉండే ఓపిక, పోరాడే శక్తి కేసీఆర్కు ఉన్నాయా? అన్నదే ప్రశ్న.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
అంబానీ ఇంట పెళ్లి సందడి: రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ ఖర్చు ఎంతో తెలుసా?
బిలియనీర్ ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి, అందులోనూ ఈ తరంలో చివరి పెళ్లి. అందుకే బోలెడంత సందడి. ఇది చాలదన్నట్టు ఘనంగా నిశ్చితార్థం, అంగరంగ వైభవంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఇపుడు కనీవినీ ఎరుగని రీతిలో రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. దీంతో రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్గా నిలిచింది.ముఖేష నీతా అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్తో జూలై 12న ముంబైలో జరగనుంది. దీనికి ముందుగా దక్షిణ ఫ్రాన్స్లో ఉన్న విల్లాలో దేశ విదేశాలకు చెందిన 800 మంది ముఖ్య అతిథులతో ఇటలీ నుండి ఫ్రాన్స్కు వెళ్లే మార్గంలో విలాసవంతమైన క్రూయిజ్లో రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుక జరుగుతోంది. జూన్ 1, 2024న ఇటలీలోని సుందరమైన పోర్టోఫినో నగరంలో ముగుస్తుంది.తాజా సమాచారం ప్రకారం అనంత్ అంబానీ-రాధిక మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్లో పాపులర్ అమెరికన్ గాయని-గేయరచయిత, కేటీ పెర్రీ ప్రదర్శన ఇవ్వనుంది. ఈ రోజు సాయంత్రం(మే 31) డార్క్ హార్స్, రోర్, ఎలక్ట్రిక్, హార్లేస్ ఇన్ హవాయి పాటలతో ఈ గ్రాండ్ ఈవెంట్లో సందడి చేయనుంది. 'లా విటా ఇ అన్ వియాజియో' (జీవితం ఒక ప్రయాణం) థీమ్తో ఈ గాలా సాగుతుంది. ఇందుకు కోసం పాప్ ఐకాన్కు భారీ మొత్తంలోనే ముట్ట చెప్పారట. ఖర్చు రూ. 7500కోట్లురూ. 424 కోట్ల విలువైన ఎస్టేట్లో నిర్వహించే రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ కోసం అంబానీ కుటుంబం ఏకంగా 7,500 కోట్లు రూపాయలు వెచ్చిస్తోంది. అంతేకాదు క్రూయిజ్లోని ప్రతి సూట్ స్పా, జిమ్, స్విమ్మింగ్ పూల్ మరెన్నో విలాసవంతమైన సౌకర్యాలతో ఉంటుంది. ఒక్కోదానికి ఖర్చు సుమారు రూ. 60 లక్షలు. ఐదు గంటలు పాటు జరిగే మూడో రోజు స్పెషల్ ఈవెంట్లో డీజేలు, బాణా సంచా వెలుగులతో మోత మోగనుంది.కాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జూలై 12, 2024న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోనున్నారు. అతిరథ మహారథుల సమక్షంలో మూడు రోజుల పాటు పెళ్లి సంబరాలు కొనసాగనున్నాయి.
T20 WC 2024: ఇరవై జట్లు.. ఆటగాళ్ల లిస్టు.. పూర్తి వివరాలు
అంతర్జాతీయ క్రికెట్ మండలి నేతృత్వంలో 2007లో మొదలైన టీ20 ప్రపంచకప్ టోర్నీ విజయవంతంగా ఎనిమిది ఎడిషన్లు పూర్తి చేసుకుంది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి తొమ్మిదో ఎడిషన్ మొదలుకానుంది.ఈ మెగా ఈవెంట్ ఆరంభం నుంచి ఇప్పటి దాకా ఇద్దరంటే ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే కొనసాగుతున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ మాజీ సారథి షకీబ్ అల్ హసన్కు మాత్రమే ఈ అరుదైన ఘనత సాధ్యమైంది.పటిష్ట భారత జట్టును మరోసారి పొట్టి ప్రపంచకప్ టోర్నీలో ముందుకు నడిపించే క్రమంలో రోహిత్ నాయకుడిగా బరిలో దిగనుండగా.. నజ్ముల్ షాంటో సారథ్యంలో షకీబ్ ఆల్రౌండర్గా వరల్డ్కప్లో భాగం కానున్నాడు.ఇదిలా ఉంటే.. ఈసారి ఏకంగా 20 జట్లు ఈ ఐసీసీ టోర్నమెంట్లో పాల్గొననున్నాయి. నాలుగు గ్రూపులుగా వీటిని విభజించారు. మరి 20 జట్లలో భాగమైన ఆటగాళ్లు ఎవరో చూద్దామా?👉గ్రూప్- ఏ: ఇండియా, పాకిస్తాన్, యూఎస్ఏ, ఐర్లాండ్, కెనడా👉గ్రూప్- బి: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్👉గ్రూప్- సి: వెస్టిండీస్, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినియా👉గ్రూప్- డి: సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్.ఇండియారోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.. రిజర్వ్ ప్లేయర్లు: శుబ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.పాకిస్తాన్బాబర్ ఆజం(కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్.యునైటెడ్ స్టేట్స్మోనాక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్, కోరె అండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్, నితీష్ కుమార్, నౌష్టుష్ కెంజిగే, సౌరభ్ నెత్రాల్వాకర్, షాడ్లీ వాన్ షాల్క్విక్, స్టీవెన్ టేలర్, షయాన్ జహంగీర్. రిజర్వ్ ప్లేయర్లు: గజానంద్ సింగ్, జువానోయ్ డ్రైస్డేల్, యాసిర్ మొహమ్మద్.ఐర్లాండ్పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బాల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, జోష్ లిటిల్, బారీ మెకార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.కెనడాసాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), ఆరోన్ జాన్సన్, రవీందర్పాల్ సింగ్, నవనీత్ ధాలివాల్, కలీమ్ సనా, దిలోన్ హెయిలీగర్, జెరెమీ గోర్డాన్, నిఖిల్ దత్తా, పర్గత్ సింగ్, నికోలస్ కిర్టన్, రేయాన్ ఖాన్ పఠాన్, జునైద్ సిద్ధిఖీ, దిల్ప్రీత్ బజ్వా, శ్రేయాస్ మొవ్వా, రిషివ్ జోషి.రిజర్వ్ ప్లేయర్లు: తజిందర్ సింగ్, ఆదిత్య వరదరాజన్, అమ్మర్ ఖలీద్, జతిందర్ మథారు, పర్వీన్ కుమార్.ఇంగ్లండ్జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా. ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్-మెగర్క్, మాట్ షార్ట్.నమీబియాగెరార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేన్ గ్రీన్, మైఖేల్ వాన్ లింగెన్, డైలాన్ లీచర్, రూబెన్ ట్రంపెల్మాన్, జాక్ బ్రాసెల్, బెన్ షికోంగో, టాంగెని లుంగామెని, నికో డావిన్, జేజే స్మిత్, జాన్ ఫ్రైలింక్, జేపీ కోట్జ్, డేవిడ్ వీస్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, మలన్ క్రూగర్, పీడీ బ్లిగ్నాట్.స్కాట్లాండ్రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్, బ్రాడ్ క్యూరీ, క్రిస్ గ్రీవ్స్, ఓలీ హెయిర్స్, జాక్ జార్విస్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, బ్రాండన్ మెక్ ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ సోల్, చార్లీ టియర్, మార్క్ వాట్, బ్రాడ్ వీల్.ఒమన్అకిబ్ ఇలియాస్ (కెప్టెన్), జీషాన్ మక్సూద్, కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలే, అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మహ్మద్ నదీమ్, నసీమ్ ఖుషీ, మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్, ఖలీద్ కైల్. రిజర్వు ప్లేయర్లు: జతిందర్ సింగ్, సమయ్ శ్రీవాస్తవ, సుఫ్యాన్ మెహమూద్, జయ్ ఓదెరా.వెస్టిండీస్రోవ్మన్ పావెల్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయిర్, షాయీ హోప్, అకీల్ హొసేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్ఫర్డ్, రొమారియో షెపర్డ్, ఒబెడ్ మెకాయ్.న్యూజిలాండ్కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రాస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సియర్స్.అఫ్గనిస్తాన్రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, కరీం జనత్, నంగ్యాల్ ఖరోతి, ముజీబ్ యువర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. రిజర్వ్ ప్లేయర్లు: సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీం సఫీ.ఉగాండాబ్రియాన్ మసాబా (కెప్టెన్), సైమన్ సెసాజీ, రోజర్ ముకాసా, కాస్మాస్ క్యూవుటా, దినేష్ నక్రానీ, ఫ్రెడ్ అచెలం, కెన్నెత్ వైస్వా, అల్పేశ్ రాంజానీ, ఫ్రాంక్ న్సుబుగా, హెన్రీ స్సెన్యోండో, బిలాల్ హస్సున్, రాబిన్సన్ ఓబుయా, రియాజత్ అలీ షా, జుమా మియాజీ, రోనక్ పటేల్. ట్రావెలింగ్ రిజర్వ్స్: ఇన్నోసెంట్ మ్వెబాజ్, రోనాల్డ్ లుటాయా.పపువా న్యూగినియాఅస్సాడోల్లా వాలా (కెప్టెన్), అలీ నావో, చాడ్ సోపర్, సీజే అమిని, హిలా వరే, హిరి హిరి, జాక్ గార్డనర్, జాన్ కరికో, కబువా వాగి మోరియా, కిప్లింగ్ డోరిగా, లెగా సియాకా, నార్మన్ వనువా, సెమా కామియా, సెసే బావు, టోనీ ఉరా.సౌతాఫ్రికా ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నియల్ బార్ట్మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్చ్యూన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్.శ్రీలంకవనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక, కుశాల్ మెండిస్, పథుమ్ నిస్సాంకా, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, ధనంజయ డిసిల్వా, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, దుష్మంత చమీరా, నువాన్ తుషార, మతీషా పతిరణ, దిల్షాన్ మదుశంక. ట్రావెలింగ్ రిజర్వ్స్: అసితా ఫెర్నాండో, విజయకాంత్ వియాస్కాంత్, భానుకా రాజపక్స, జనిత్ లియానాగే.బంగ్లాదేశ్నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), టస్కిన్ అహ్మద్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తౌహీద్ హ్రిదోయ్, మహ్మద్ ఉల్లా రియాద్, జకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షేక్ మహేది హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజీమ్ హసన్ సకీబ్. ట్రావెలింగ్ రిజర్వ్స్: అఫిఫ్ హుస్సేన్, హసన్ మహమూద్.నెదర్లాండ్స్స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), ఆర్యన్ దత్, బాస్ డి లీడ్, కైల్ క్లెయిన్, లోగాన్ వాన్ బీక్, మ్యాక్స్ ఓ డౌడ్, మైఖేల్ లెవిట్, పాల్ వాన్ మీకెరెన్, ర్యాన్ క్లెయిన్, సాకిబ్ జుల్ఫికర్, సిబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్, తేజ నిడమనూరు, టిమ్ ప్రింగిల్, విక్రమ్ సింగ్, వివ్ కింగ్మా, వెస్లీ బారేసి. ట్రావెలింగ్ రిజర్వ్: ర్యాన్ క్లెయిన్నేపాల్రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సాహ్, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్బన్షి, కరణ్ కేసీ, గుల్షన్ ఝా, సోంపాల్ కామి, ప్రతిస్ జీసీ, సందీప్ జోరా, అవినాష్ బోహరా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ.చదవండి: T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలుT20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్ ఏంటి?.. వివరాలు
Air India: 20 గంటలు ఆలస్యం.. కేంద్ర మంత్రిత్వశాఖ నోటీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియా విమానం గంటల తరబడి ఆలస్యం కావడంపై కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన విమానం దాదాపు 20 గంటలు ఆలస్యంగా కారణంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి విమానంలోనే కూర్చోవాల్సి రావడం, ఏసీ కూడా పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు కొందరైతే స్పృహతప్పి పడిపోయారు. కొన్ని అనివార్య కారణాల వల్ల విమానం ఆలస్యమైందని, ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. అయితే అసలే 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఢిల్లీలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యట్లు ఎందుకు చేపట్టలేదో వివరణ ఇవ్వాలని కేంద్రమంత్రిత్వశాఖ విమానయాన సంస్థను కోరింది.కాగాఎయిరిండియా కు చెందిన బోయింగ్ 777 విమానం 200 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు దిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బయల్దేరాలి.. కానీ దాదాపు ఆరు గంటలు ఆలస్యమైంది. రాత్రి 8 గంటలకు రీ షెడ్యూల్ చేశారు. సాంకేతిక సమస్యలతో విమానం మార్చారు. దీంతో ప్రయాణికులు రాత్రి 7.20 గంటలకు మరో విమానంలో బోర్డింగ్ అయ్యారు. అనంతరం విమానం మళ్లీ ఆలస్యమని ప్రకటన చేశారు.అయితే అప్పటికే ప్రయాణికుల బోర్డింగ్ పూర్తవ్వగా వారిని బయటకు వెళ్లేందుకు సిబ్బంది అనుమతించలేదు.న్ని గంటల పాటు వారు విమానంలోనే కూర్చోవాల్సి వచ్చింది. దీనికితోడు ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. తిరిగి విమానాశ్రయానికి వెళ్లేందుకు గేట్లు కూడా తెరవకపోవడంతో ప్రయాణికులు దాదాపు గంటపాటు ఏరోబ్రిడ్జిలో వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో వృద్ధులు, పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు.
స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి: ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఎట్టకేలకు స్థిరంగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు (మే 31) పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66700 (22 క్యారెట్స్), రూ.72760 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి.ఈ రోజు చెన్నైలో కూడా బంగారం ధరల్లో ఎటువంటి మార్పు కనిపించలేదు. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 67300 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 73420 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరలే ఈ రోజూ ఉన్నట్లు సమిష్టమవుతుంది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు ఎటువంటి మార్పు చెందలేదు. నిన్నటి ధరలే ఈ రోజు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66850, కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72910గా ఉంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి మాత్రం రూ. 1000 తగ్గింది. కాబట్టి కేజీ వెండి ధర రూ. 95500 వద్ద ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా వెండి ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. కానీ వెండి ధర త్వరలోనే రూ. 1 లక్షకు చేరువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
ఎల్లుండి లొంగిపోతున్నా.. మీరంతా జాగ్రత్త: సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంత బెయిల్ గడువు ఎల్లుండి (ఆదివారం)తో ముగుస్తుంది. ఆరోజే కేజ్రీవాల్ తిరిగి తీహార్ జైలులో లొంగిపోనున్నారు.సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో తాను లొంగిపోతున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రజలకు తెలియజేశారు.ఈ క్రమంలో తన కుటుంబానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొగసాగుతుందని కేజ్రీవాల్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘ లోక్ సభ ఎన్నికల కోసం సుప్రీంకోర్టు నాకు 21 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రేపటికి 21 రోజులు పూర్తవుతుంది. ఎల్లుండి నేను తీహార్ జైలులో లొంగిపోతున్నా. ఈసారి నన్ను ఎన్ని రోజులు ఎప్పటి వరకు జైల్లో ఉంచుతారో తెలీదు. దేశాన్ని నిరకుశత్వం నుంచి బయటకు తీసుకెళ్ళేందుకు జైలుకి వెళ్తున్నాను. నన్ను మాట్లాడనియకుండా భయపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. నేను జైలులో ఉన్నప్పుడు నాకు మందులు ఇవ్వలేదు.मुझे परसों सरेंडर करना है। माननीय सुप्रीम कोर्ट का बहुत-बहुत शुक्रिया। https://t.co/1uaCMKWFhV— Arvind Kejriwal (@ArvindKejriwal) May 31, 2024 నేను 20 ఏళ్లుగా డయాబెటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. గడిచిన 10 ఏళ్లుగా నేను ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటున్నా. రోజు నా పొట్ట భాగంలో 4 సార్లు ఇంజక్షన్ తీసుకుంటాను. జైల్లో నాకు ఇన్సులిన్ ఇంజక్షన్ ఇవ్వలేదు. నా షుగర్ లెవల్స్ 300-325 వరకు వెళ్లాయి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే కిడ్నీ, లివర్ దెబ్బతింటాయి. వీళ్లు ఏం కోరుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదు. జైల్లో 50 రోజులు ఉన్నాను. ఆరు కేజీల బరువు తగ్గాను. జైలుకు వెళ్ళినపుడు 70 కేజీల ఉన్నాను. ఇప్పుడు 64 కేజీలు ఉన్నాను. మళ్ళీ బరువు పెరగడం లేదు. శరీరంలో ఇతర వైద్య సమస్యలు ఉండొచ్చు. పరీక్షలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. యూరిన్లో కీటోన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎల్లుండి మూడు గంటలకు నేను తీహార్ జైలులో లొంగిపోతాను. నేను దేనికి వెనక్కి తగ్గను. ఢిల్లీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. జైలులో నా చింత అంతా ఢిల్లీ ప్రజల గురించే. ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉంటే కేజ్రీవాల్ సంతోషంగా ఉంటాడు. నేను మీ మధ్య లేకపోయినా ఢిల్లీ ప్రజల అన్ని పనులు జరుగుతాయి. జైలులో లోపల ఉన్నా బయట ఉన్నా ఢిల్లీ ప్రజల పనులు ఆగవు. ఉచిత విద్యుత్, మోహల్లా క్లినిక్, హాస్పిటళ్లలో వైద్యం, ఉచితంగా మందులు, మహిళలకు ఉచిత బస్సు సర్వీస్, 24 గంటల కరెంట్ సహా త్వరలో మహిళలకు రూ. వెయ్యి ఆర్థిక సహకారం కొసాగుతుంది. ఢిల్లీ ప్రజల కుటుంబ సభ్యుడిలా నా బాధ్యత నెరవేర్చా. నా తల్లిదండ్రుల కోసం దేవుడిని ప్రార్ధించండి. వారి ఆరోగ్యం బాగాలేదు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాలి ’’ అని కేజ్రీవాల్ అన్నారు.
కర్ణాటకలో కొత్త ట్విస్ట్.. ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణకు సిట్ నోటీసులు
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపులు, దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లికి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణను విచారించేందుకు శుక్రవారం ఐపీసీ సెక్షన్లు 64(A), 365, 109, 120(B) కింద సిట్ నోటీసులు ఇచ్చింది. తమ విచారణ కోసం భావానీ రేవణ్ణ హోలెనర్సీపూర్లోని వారి నివాసంలోనే జూన్ 1న సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది. #BreakingS.I.T issues another notice to #PrajwalRevanna's mother #BhavaniRevanna in the kidnapping case.Prajwal Revanna will shortly be taken for a medical examination, and after that, he will be brought to the City Civil Court Complex for further questioning...: @dpkBopanna… pic.twitter.com/G9croxFBP6— TIMES NOW (@TimesNow) May 31, 2024 ఇక.. శుక్రవారం తెల్లవారుజామున జర్మనీ నుంచి భారత్కు వచ్చిన ప్రజ్వల్ రేవణ్ణను సిట్ పోలీసులు బెంగళూరు కెంపెగౌడ ఎయిర్పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. ఇక.. అక్కడి నుంచి ఆయన్ను విచారణ కోసం సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. విచారణలో భాగంగా ప్రజ్వల్కు పొటెన్సీ పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ
టైటిల్: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరినటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, హైపర్ ఆది తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకుడు: కృష్ణ చైతన్యసంగీతం: యువన్ శంకర్ రాజాసినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి విడుదల తేది: మే 31, 2024మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల గామి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రయోగాత్మకంగా చేసిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్టకేలకు నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 90లో సాగుతుంది. గోదావరి జిల్లాలోని లంక గ్రామానికి చెందిన రత్నాకర్ అలియాస్ రత్న(విశ్వక్ సేన్) అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు. అదే గ్రామంలో ఉండే వేశ్య రత్నమాల(అంజలి) అతనికి మంచి స్నేహితురాలు. తన చుట్టూ ఉన్నవారిని వాడుకుంటూ ఎదగాలనుకునే స్వభావం ఉన్న రత్నాకర్కు ఆ ఏరియాలో సాగుతున్న ఇసుక మాఫియా గురించి తెలుస్తుంది. దాని వెనుక స్థానిక ఎమ్మెల్యే దొరస్వామి రాజు(గోపరాజు రమణ) ఉన్నారని తెలుసుకొని అతనికి దగ్గరవుతాడు. కొద్ది రోజుల్లోనే దొరస్వామి కుడిభుజంలా మారతాడు. దొరస్వామి రాజకీయ ప్రత్యర్థి నానాజీ(నాజర్) కూతురు బుజ్జి(నేహా శెట్టి) ప్రేమలో పడి ఆమె కోసం నానాజీకి దగ్గరవుతాడు. ఇలా ఇద్దరి రాజకీయ నాయకులను వాడుకొని రత్నాకర్ ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తనను నమ్మించి మోసం చేసిన రత్నాకర్పై దొరస్వామి ఎలా పగ తీర్చుకున్నాడు? పిల్లను ఇచ్చిన మామ నానాజీని రత్నాకర్ ఎందుకు చంపాల్సి వచ్చింది? సొంత భర్తే తన తండ్రిని చంపాడని తెలిసిన తర్వాత బుజ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రత్నాకర్ ఎదుగుదలకు కారణమైన సొంత మనుషులే అతన్ని చంపేందుకు ఎందుకు కత్తి కట్టారు?(లంకలో ఎవరినైనా చంపాలని ఫిక్స్ అయితే ఆ ఊరి గుహలో ఉన్న అమ్మవారికి మొక్కి చంపాల్సిన వ్యక్తి పేరు అక్కడ రాస్తారు. దాన్నే కత్తి కట్టడం అంటారు) సొంత మనుషులే తనపై కత్తి కట్టారని తెలిసిన తర్వాత రత్నాకర్ ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..విలేజ్ రాజకీయాల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. గోదావరి ప్రాంతానికి చెందిన ఒక స్లమ్ కుర్రాడు.. రాజకీయాలను వాడుకొని ఎలా ఎదిగాడు? ఎదిగిన తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే ఈ సినిమా కథ. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. గత సినిమాల్లో గోదావరి అంటే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉన్నట్లు చూపించేవారు. కానీ ఈ సినిమాలో గోదావరిలో ఉండే మరో కోణాన్ని చూపించారు. విలేజ్ రాజకీయాలు ఎలా ఉంటాయి? నా అనుకునే వాళ్లే ఎలా వెన్నుపోటు పొడుస్తారు? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అయితే రియలిస్టిక్ పేరుతో హింసను ఎక్కువగా చూపించడం ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే సినిమా కథంతా వాస్తవికానికి దూరంగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన తీరు సినిమాటిక్గా అనిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రౌడీలా ప్రవర్తించడం.. ప్రత్యర్థుల దాడి.. హీరోయిన్తో ప్రేమలో పడడం.. ఇవన్నీ ఆసక్తికరంగా సాగవు. కత్తికట్టడం గురించి చెబుతూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. ఎంట్రీ సీన్తో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించాడు. హీరో ఎమ్మెల్యే దొరస్వామి దగ్గరకు వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అయితే కథ పరంగా కాదు కానీ హీరో ఎదిగిన తీరు మాత్రం పుష్ప సినిమాను గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ రొటీన్గానే ఉంటుంది.ఎవరెలా చేశారంటే.. రత్న అలియాస్ రత్నాకర్ పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే భిన్నమైన పాత్ర తనది. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. గోదావరి యాస మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. అక్కడక్కడ ఆయన ఒరిజినల్ (తెలంగాణ) యాస బయటకు వచ్చింది. రత్నమాల అనే పవర్ఫుల్ పాత్రలో అంజలి చక్కగా నటించింది.బుజ్జిగా నేహాశెట్టి తెరపై అందాలను ప్రదర్శిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. ఐటమ్ సాంగ్లో ఆయేషా ఖాన్ అందాలతో ఆకట్టుకుంది. విలన్గా యాదు పాత్రలో గగన్ విహారి ఆకట్టుకున్నాడు. నాజర్, సాయి కుమార్ హైపర్ ఆదితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికత పరంగా సినిమా చాలా బాగుంది. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టి, సాక్షి వెబ్డెస్క్
కృష్ణ జయంతి.. మిస్ అవుతున్నా నాన్నా అంటూ మహేశ్ పోస్ట్
సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనపేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. తన నట ప్రస్థానంతో, సాధించిన అవార్డులతో అభిమానుల మనసు ఉప్పొంగేలా చేశారు. నేడు (మే 31) కృష్ణ 81వ జయంతి. ఈ సందర్భంగా తండ్రిని గుర్తు చేసుకుని మహేశ్బాబు భావోద్వేగానికి లోనయ్యాడు.మిస్ అవుతున్నా..హ్యపీ బర్త్డే నాన్నా.. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను. కానీ నువ్వు నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటావు అంటూ కృష్ణ ఫోటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.అవి గుర్తు చేసుకుంటేమరోవైపు డైరెక్టర్ వివి వినాయక్.. కృష్ణతో కలిసి పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు. అసిస్టెంట్గా, సహ దర్శకుడిగా కృష్ణగారి నాలుగు సినిమాలకు పని చేశాను. ఆయనతో పనిచేసిన రోజులను గుర్తు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటుంది. ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) Forever in our hearts, forever a legend 💫 Today, we honour the eternal legacy of Superstar Krishna Garu 🎬 May his invaluable contributions to Indian cinema continue to inspire generations.#SSKLivesOn pic.twitter.com/kRewKGtp18— AMB Cinemas (@amb_cinemas) May 31, 2024
తప్పక చదవండి
- T20 WC: ఎట్టకేలకు అమెరికాకు బయలు దేరిన విరాట్ కోహ్లి..
- TRUMP: ‘హష్ మనీ’ కేసు.. ట్రంప్ను దోషిగా తేల్చిన కోర్టు
- Delhi water crisis: చేతులు జోడించి కోరుతున్నా.. సీఎం కేజ్రీవాల్
- సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సెఫాలజిస్ట్ యోగేంద్ర ప్రెడిక్షన్... శశిథరూర్ ఆసక్తికర కామెంట్స్
- T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
- HYD: నాంపల్లిలో అర్ధరాత్రి హైడ్రామా.. ఏసీబీ అదుపులో ఈఈ, ఏఈలు..
- నిలిచిపోయిన విమానం.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
- ‘నన్ను టార్గెట్ చేస్తున్నారు’.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
- ఉదయం పరేడ్ గ్రౌండ్స్లో.. సాయంత్రం ట్యాంక్బండ్పై..
సినిమా
'కోటా ఫ్యాక్టరీ' సీజన్ 3 విడుదల ప్రకటన వచ్చేసింది
ఓటీటీలలో కొన్ని వెబ్ సిరీస్లకు భారీ క్రేజ్ ఉంటుంది. ఒక సీజన్ పూర్తి అయిన తర్వాత మరో సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో చాలా రోజులుగా ఎదురుచూస్తున్న 'కోటా ఫ్యాక్టరీ' వెబ్ సిరీస్ సీజన్ 3 జూన్లో స్ట్రీమింగ్ అవుతుందని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది.దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు తమ ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్ కోసం రాజస్థాన్లోని కోటా అనే ప్రాంతానికి వెళ్తుంటారు. ఐఐటీ కోచింగ్ కోసం ఎక్కువగా విద్యార్థులు అక్కడికి చేరుకుంటారు. సీటు సాధించే క్రమంలో వారు ఎక్కువగా ఒత్తిడికి గురికావడం జరుగుతుంది. కొందరైతే దానిని తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అక్కడ ఉన్న విద్యార్థుల జీవితాల ఆధారంగా 2019లోనే 'కోటా ఫ్యాక్టరీ' మొదటి సీజన్ వచ్చింది.. 2021లో రెండో సీజన్ వచ్చింది. ఆ రెండు సీజన్స్ భారీ హిట్ అందుకోవడంతో.. జూన్ 20న మూడో సీజన్ రానుంది. ఈమేరకు చిత్ర యూనిట్ అఫీషియల్గా ప్రకటించింది. కోటా ఫ్యాక్టరీలో అందరినీ మెప్పించే పాత్ర జీతూ భయ్యా.. అందులో జితేంద్ర కుమార్ జీవించేశాడు.సౌరభ్ కన్నా రూపొందించిన ఈ వెబ్ సిరీస్కు రాఘవ్ సుబ్బు దర్శకత్వం వహించారు. అహ్సాస్ చన్నా, మయూర్ మోర్, రేవతి పిళ్లై ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీవీఎఫ్ సంస్థ నిర్మించిన ఈ సీరిస్ జూన్ 20న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)
'భజే వాయువేగం' సినిమా రివ్యూ
ఈ వేసవి అంతా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సరైన సినిమా పడలేదు. అలాంటిది ఈ వారం ఏకంగా మూడు తెలుగు మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో అందరి దృష్టి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' పైనే ఉంది. కానీ యూవీ క్రియేషన్స్ తీసిన 'భజే వాయువేగం' కూడా ఓ మాదిరి అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ)కథేంటి?వెంకట్ (కార్తికేయ) చిన్నప్పుడే తల్లిదండ్రులు అప్పుల బాధతో చనిపోతారు. అనాథగా మారిన ఇతడిని, తండ్రి స్నేహితుడు (తనికెళ్లి భరణి) దత్తత తీసుకుంటాడు. తన సొంత కొడుకు వెంకట్ (రాహుల్ టైసన్)లానే వెంకట్ని కూడా పెంచి పెద్ద చేస్తాడు. సిటీలో అద్దె ఇంట్లో ఉండే అన్నదమ్ములిద్దరూ.. ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పి తండ్రిని మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో డబ్బుల కోసం వెంకట్ బెట్టింగ్ వేస్తాడు. అందులో గెలుస్తాడు. కానీ విలన్ గ్యాంగ్ ఇతడిని మోసం చేస్తారు. దీంతో ఊహించని పరిస్థితుల్లో వాళ్లపై పగ తీర్చుకోవాల్సి వస్తుంది. మరి చివరకు ఏమైంది? వెంకట్ తాను అనుకున్నది సాధించాడా? లేదా? ఇతడితో డేవిడ్ (రవి శంకర్), జార్జ్ (శరత్ లోహిత్స్వ)కి సంబంధమేంటి? అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటే?'భజే వాయు వేగం' గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బెట్టింగ్స్లో గెలుస్తూ బతికేసే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు.. ఊహించని విధంగా కెరీర్, వ్యక్తిగత, రాజకీయ పరంగా సమస్యల్లో ఇరుక్కుని ఎలా గెలిచి నిలబడ్డాడు అనేదే కథ. ఓవరాల్గా చూస్తే డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. కథ పరంగా చూస్తే కొన్ని సీన్స్ ఊహించేలా ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్లే బాగుంది. పెద్దగా ల్యాగ్ చేయకుండా వచ్చిన సీన్స్ టైటిల్కి తగ్గ న్యాయం చేశాయి.ఫస్టాప్ విషయానికొస్తే.. పోలీస్ స్టేషన్లో హీరో అరెస్ట్ అయి ఉండే సీన్తో మూవీ మొదలైంది. ఆ తర్వాత ఏడాది వెనక్కి వెళ్లి.. హీరో గతమేంటి? అతడి చుట్టూ ఉండే వాతావరణం ఏంటనేది చూపించారు. స్టోరీ సెటప్ కోసం ఫస్టాప్ అంతా ఉపయోగించుకున్నారు. కానీ హీరోహీరోయిన్ లవ్ ట్రాక్ పరమ రొటీన్గా అనిపించింది. రెండు పాటలు ఓకే గానీ హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ కాలేదు. ఓ మాదిరిగా వెళ్తున్న మూవీ కాస్త ఇంటర్వెల్ వచ్చేసరికి ఆసక్తికరంగా మారింది. అక్కడి నుంచి చివరివరకు చాలా బాగా తీశారు. కానీ క్లైమాక్స్ మాత్రం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ముగించారు. అది కాస్త అసంతృప్తిగా అనిపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)ఎవరెలా చేశారు?'ఆర్ఎక్స్ 100'తో చాలా ఫేమ్ తెచ్చుకున్న కార్తికేయ.. ఆ తర్వాత మాత్రం సరైన హిట్ పడక ఎదురుచూపులు చూస్తున్నాడు. 'భజే వాయువేగం' అతడికి హిట్ ఇచ్చినట్లే! బాధ, ప్రతీకారం లాంటి ఎమోషన్స్ బాగా పలికించాడు. హీరోయిన్ ఐశ్వర్య మేనన్ యాక్టింగ్ చేసేంత స్కోప్ ఈ మూవీలో దక్కలేదు. కాకపోతే ఈమె పాత్రని కూడా కథలో భాగం చేయడం కొంత ఉపశమనం. ఇక హీరోతో పాటు సరిసమానంగా ఉండే అన్న పాత్ర చేసిన రాహుల్ టైనస్.. న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్లో బాగా ఫెర్ఫార్మ్ చేశాడు. విలన్గా చేసిన రవిశంకర్ యధావిధిగా అదరగొట్టేశాడు. తనికెళ్ల భరణి లాంటి సీనియర్ ఉన్నప్పటికీ ఆయన తగ్గ సీన్స్ పడలేదు. మిగిలిన పాత్రధారులు ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే.. డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి అదరగొట్టేశాడు. తొలి మూవీనే కమర్షియల్గా తీస్తున్నప్పటికీ అనవసర సీన్స్ జోలికి పోకుండా డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ డెలివరీ చేశాడు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 'భజే వాయువేగం'.. మరీ సూపర్గా కాకపోయినా మిమ్మల్ని పక్కాగా థ్రిల్ చేసే మూవీ.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
అభిమాని పెళ్లిలో స్టార్ హీరో సందడి.. ఫోటోలు వైరల్
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఆయన హీరో మాత్రమే కాదు అందరినీ మెప్పించే విలన్ కూడా.. టాలీవుడ్,కోలీవుడ్లో తన నటనతో ఫ్యాన్స్ను సొంతం చేసుకున్నారు. ఆయనకు పాత్ర నచ్చితే చాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. అందుకే విజయ్ సేతుపతికి ఇండస్ట్రీతో సంబంధం లేకుండా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకు మలేషియాలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది.తాజాగా విజయ్ సేతుపతి తన అభిమాని పెళ్లికి హాజరయ్యాడు. ఆయన రాకతో పెళ్లికి వచ్చిన అతిథిలు అందరూ ఆశ్చర్యపోయారు. మదురై జిల్లా ఉసిలంబట్టి మున్సిపాలిటీ పరిధిలోని కీజాపుదూర్కు చెందిన జయబాస్,జయపాల్ ఇద్దరూ విజయ్ సేతుపతికి అభిమానులు. అంతేకాకుండా విజయ్ సేతుపతి జిల్లా అభిమాని సంఘానికి అధ్యక్షుడిగా ఒకరు ఉంటే మరోకరు జిల్లా ఉప కార్యదర్శిగా ఉన్నారు. ఈ అన్నదమ్ములు మే 2న తమకు నచ్చిన యువతులను పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే, విజయ్ సేతుపతికి 2వ తేదీలో సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉండటంతో నేడు వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలో ఆయన ఒక బాలుడిని ఎత్తుకుని ఫోటో దిగడం విశేషం. అనంతరం మెట్టుపాళయంలో షూటింగ్కు బయలుదేరారు.மணமக்கள் ஹாப்பி அண்ணாச்சி...! ரசிகர் மன்ற மாவட்ட தலைவர், துணைச் செயலாளரின் இல்லத் திருமண விழா...நேரில் கலந்து கொண்டு மணமக்களை வாழ்த்திய விஜய் சேதுபதி#Madurai | #VijaySethupathi | #Marriage | #PolimerNews pic.twitter.com/3XrVXk9Pdq— Polimer News (@polimernews) May 30, 2024 విజయ్ సేతుపతి నటించిన కొత్త సినిమా మహారాజ ట్రైలర్ తాజాగా విడుదలైంది. విజయ్ సేతుపతి 50వ సినిమాగా వస్తుండటంతో ఆయన ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. నిథిలన్ సామినాథన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ
టైటిల్: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరినటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, హైపర్ ఆది తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకుడు: కృష్ణ చైతన్యసంగీతం: యువన్ శంకర్ రాజాసినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి విడుదల తేది: మే 31, 2024మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల గామి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రయోగాత్మకంగా చేసిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్టకేలకు నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 90లో సాగుతుంది. గోదావరి జిల్లాలోని లంక గ్రామానికి చెందిన రత్నాకర్ అలియాస్ రత్న(విశ్వక్ సేన్) అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు. అదే గ్రామంలో ఉండే వేశ్య రత్నమాల(అంజలి) అతనికి మంచి స్నేహితురాలు. తన చుట్టూ ఉన్నవారిని వాడుకుంటూ ఎదగాలనుకునే స్వభావం ఉన్న రత్నాకర్కు ఆ ఏరియాలో సాగుతున్న ఇసుక మాఫియా గురించి తెలుస్తుంది. దాని వెనుక స్థానిక ఎమ్మెల్యే దొరస్వామి రాజు(గోపరాజు రమణ) ఉన్నారని తెలుసుకొని అతనికి దగ్గరవుతాడు. కొద్ది రోజుల్లోనే దొరస్వామి కుడిభుజంలా మారతాడు. దొరస్వామి రాజకీయ ప్రత్యర్థి నానాజీ(నాజర్) కూతురు బుజ్జి(నేహా శెట్టి) ప్రేమలో పడి ఆమె కోసం నానాజీకి దగ్గరవుతాడు. ఇలా ఇద్దరి రాజకీయ నాయకులను వాడుకొని రత్నాకర్ ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తనను నమ్మించి మోసం చేసిన రత్నాకర్పై దొరస్వామి ఎలా పగ తీర్చుకున్నాడు? పిల్లను ఇచ్చిన మామ నానాజీని రత్నాకర్ ఎందుకు చంపాల్సి వచ్చింది? సొంత భర్తే తన తండ్రిని చంపాడని తెలిసిన తర్వాత బుజ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రత్నాకర్ ఎదుగుదలకు కారణమైన సొంత మనుషులే అతన్ని చంపేందుకు ఎందుకు కత్తి కట్టారు?(లంకలో ఎవరినైనా చంపాలని ఫిక్స్ అయితే ఆ ఊరి గుహలో ఉన్న అమ్మవారికి మొక్కి చంపాల్సిన వ్యక్తి పేరు అక్కడ రాస్తారు. దాన్నే కత్తి కట్టడం అంటారు) సొంత మనుషులే తనపై కత్తి కట్టారని తెలిసిన తర్వాత రత్నాకర్ ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..విలేజ్ రాజకీయాల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. గోదావరి ప్రాంతానికి చెందిన ఒక స్లమ్ కుర్రాడు.. రాజకీయాలను వాడుకొని ఎలా ఎదిగాడు? ఎదిగిన తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే ఈ సినిమా కథ. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. గత సినిమాల్లో గోదావరి అంటే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉన్నట్లు చూపించేవారు. కానీ ఈ సినిమాలో గోదావరిలో ఉండే మరో కోణాన్ని చూపించారు. విలేజ్ రాజకీయాలు ఎలా ఉంటాయి? నా అనుకునే వాళ్లే ఎలా వెన్నుపోటు పొడుస్తారు? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అయితే రియలిస్టిక్ పేరుతో హింసను ఎక్కువగా చూపించడం ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే సినిమా కథంతా వాస్తవికానికి దూరంగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన తీరు సినిమాటిక్గా అనిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రౌడీలా ప్రవర్తించడం.. ప్రత్యర్థుల దాడి.. హీరోయిన్తో ప్రేమలో పడడం.. ఇవన్నీ ఆసక్తికరంగా సాగవు. కత్తికట్టడం గురించి చెబుతూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. ఎంట్రీ సీన్తో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించాడు. హీరో ఎమ్మెల్యే దొరస్వామి దగ్గరకు వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అయితే కథ పరంగా కాదు కానీ హీరో ఎదిగిన తీరు మాత్రం పుష్ప సినిమాను గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ రొటీన్గానే ఉంటుంది.ఎవరెలా చేశారంటే.. రత్న అలియాస్ రత్నాకర్ పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే భిన్నమైన పాత్ర తనది. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. గోదావరి యాస మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. అక్కడక్కడ ఆయన ఒరిజినల్ (తెలంగాణ) యాస బయటకు వచ్చింది. రత్నమాల అనే పవర్ఫుల్ పాత్రలో అంజలి చక్కగా నటించింది.బుజ్జిగా నేహాశెట్టి తెరపై అందాలను ప్రదర్శిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. ఐటమ్ సాంగ్లో ఆయేషా ఖాన్ అందాలతో ఆకట్టుకుంది. విలన్గా యాదు పాత్రలో గగన్ విహారి ఆకట్టుకున్నాడు. నాజర్, సాయి కుమార్ హైపర్ ఆదితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికత పరంగా సినిమా చాలా బాగుంది. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టి, సాక్షి వెబ్డెస్క్
ఫొటోలు
Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి (ఫొటోలు)
యాంకర్ శ్రీముఖి ఫ్యాషన్ లుక్స్ చూశారా? (ఫోటోలు)
Superstar Krishna: లెజెండరీ యాక్టర్ కృష్ణ జయంతి.. ఈ రేర్ ఫొటోస్ చూశారా?
చీరకట్టులో మత్తెక్కిస్తున్న మాళవిక శర్మ అందాలు.. (ఫొటోలు)
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు..విలవిలాడుతున్న జనం (ఫొటోలు)
క్రీడలు
రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!.. ఆ జట్టులోనూ ఉంటే..
టీ20 ప్రపంచకప్ అరంగేట్ర ఎడిషన్ నుంచి ఇప్పటి దాకా ఆడుతున్న ఇద్దరు క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ రోహిత శర్మ ఒకడు. అతడితో పాటు బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఈ ఫీట్ అందుకోనున్నాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2022 తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు రోహిత్ శర్మ చాలా కాలం దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దాదాపు ఏడాది విరామం తర్వాత అఫ్గనిస్తాన్తో స్వదేశంలో సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన హిట్మ్యాన్.. ఆ తర్వాత ఐపీఎల్-2024లో భాగమయ్యాడు.రోహిత్ తర్వాతఅయితే, ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన రోహిత్ శర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచ్లలో కలిపి కేవలం 417 పరుగులు మాత్రమే సాధించాడు.ఇక టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ పగ్గాలు వదిలేయనున్నాడనే వదంతుల నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్గా శుబ్మన్ గిల్కే అవకాశం ఉందని మెర్గాన్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. టీ20 ప్రపంచకప్-2024లో గిల్ను రిజర్వ్ ప్లేయర్గా మాత్రమే ఎంపిక చేయడాన్ని తప్పుబట్టాడు.ప్రధాన జట్టులో ఉండటం ముఖ్యంయశస్వి జైస్వాల్ బదులు శుబ్మన్ గిల్ను ప్రధాన జట్టుకు సెలక్ట్ చేసి ఉంటే బాగుండేదని ఇయాన్ మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. ‘‘ప్రపంచకప్లో ఆడే టీమిండియాలో ఒకే ఒక్క మార్పు చేసి ఉంటే బాగుండేది. నా వరకైతే యశస్వి జైస్వాల్ కంటే శుబ్మన్ గిల్ ప్రధాన జట్టులో ఉండటం ముఖ్యం.గిల్తో కలిసి ఆడిన అనుభవం నాకుంది. అతడు ఎలా ఆలోచిస్తాడు? షాట్ల ఎంపిక విషయంలో ఎలా ఉంటాడు? అన్న విషయాల గురించి నాకు అవగాహన ఉంది. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ కూడా అతడే అనడంలో సందేహం లేదు’’ అని ఇయాన్ మోర్గాన్ స్కై స్పోర్ట్స్తో వ్యాఖ్యానించాడు.టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.. రిజర్వ్ ప్లేయర్లు: శుబ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: T20 WC 2024: ఇరవై జట్లు.. ఆటగాళ్ల లిస్టు.. పూర్తి వివరాలు
'రోహిత్ అద్భుతమైన కెప్టెన్.. ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించగలడు'
టీ20 వరల్డ్కప్-2024కు టీమిండియా అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఇప్పటికే అమెరికాకు చేరుకున్న భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్లో న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీమిండియా శనివారం(జూన్ 1న) బంగ్లాదేశ్తో వార్మాప్ మ్యాచ్ ఆడనుంది.ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ ఒక అద్భుతమైన కెప్టెన్ అని, ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించే సత్తా ఉందని షకీబ్ కొనియాడాడు. "రోహిత్ శర్మ భారత జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. అతడి కెప్టెన్సీ స్కిల్స్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. కెప్టెన్గా అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. రోహిత్ జట్టులో ఆటగాళ్లందరని సమానంగా చూస్తాడు. తన సహచర ఆటగాళ్లు కూడా రోహిత్ను అంతే గౌరవిస్తారు. రోహిత్ ఒక వరల్డ్ క్లాస్ బ్యాటర్. ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించే సత్తా రోహిత్కు ఉందని" స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీబ్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా రోహిత్కు బంగ్లాదేశ్పై వన్డేలు, టీ20లు రెండింటిలోనూ అద్భుతమైన రికార్డు ఉంది. బంగ్లాపై 12 టీ20 ఇన్నింగ్స్లలో 37.83 సగటుతో 454 పరుగులు చేశాడు. అదే విధంగా 17 వన్డే ఇన్నింగ్స్లలో 56.14 సగటుతో 786 పరుగులు సాధించాడు. కాగా షకీబ్, రోహిత్ ఇద్దరే 2007 అరంగేట్ర టీ20 వరల్డ్కప్ నుంచి కొనసాగుతున్నారు.
T20 WC 2024: ఇరవై జట్లు.. ఆటగాళ్ల లిస్టు.. పూర్తి వివరాలు
అంతర్జాతీయ క్రికెట్ మండలి నేతృత్వంలో 2007లో మొదలైన టీ20 ప్రపంచకప్ టోర్నీ విజయవంతంగా ఎనిమిది ఎడిషన్లు పూర్తి చేసుకుంది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి తొమ్మిదో ఎడిషన్ మొదలుకానుంది.ఈ మెగా ఈవెంట్ ఆరంభం నుంచి ఇప్పటి దాకా ఇద్దరంటే ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే కొనసాగుతున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ మాజీ సారథి షకీబ్ అల్ హసన్కు మాత్రమే ఈ అరుదైన ఘనత సాధ్యమైంది.పటిష్ట భారత జట్టును మరోసారి పొట్టి ప్రపంచకప్ టోర్నీలో ముందుకు నడిపించే క్రమంలో రోహిత్ నాయకుడిగా బరిలో దిగనుండగా.. నజ్ముల్ షాంటో సారథ్యంలో షకీబ్ ఆల్రౌండర్గా వరల్డ్కప్లో భాగం కానున్నాడు.ఇదిలా ఉంటే.. ఈసారి ఏకంగా 20 జట్లు ఈ ఐసీసీ టోర్నమెంట్లో పాల్గొననున్నాయి. నాలుగు గ్రూపులుగా వీటిని విభజించారు. మరి 20 జట్లలో భాగమైన ఆటగాళ్లు ఎవరో చూద్దామా?👉గ్రూప్- ఏ: ఇండియా, పాకిస్తాన్, యూఎస్ఏ, ఐర్లాండ్, కెనడా👉గ్రూప్- బి: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్👉గ్రూప్- సి: వెస్టిండీస్, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినియా👉గ్రూప్- డి: సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్.ఇండియారోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.. రిజర్వ్ ప్లేయర్లు: శుబ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.పాకిస్తాన్బాబర్ ఆజం(కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్.యునైటెడ్ స్టేట్స్మోనాక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్, కోరె అండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్, నితీష్ కుమార్, నౌష్టుష్ కెంజిగే, సౌరభ్ నెత్రాల్వాకర్, షాడ్లీ వాన్ షాల్క్విక్, స్టీవెన్ టేలర్, షయాన్ జహంగీర్. రిజర్వ్ ప్లేయర్లు: గజానంద్ సింగ్, జువానోయ్ డ్రైస్డేల్, యాసిర్ మొహమ్మద్.ఐర్లాండ్పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బాల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, జోష్ లిటిల్, బారీ మెకార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.కెనడాసాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), ఆరోన్ జాన్సన్, రవీందర్పాల్ సింగ్, నవనీత్ ధాలివాల్, కలీమ్ సనా, దిలోన్ హెయిలీగర్, జెరెమీ గోర్డాన్, నిఖిల్ దత్తా, పర్గత్ సింగ్, నికోలస్ కిర్టన్, రేయాన్ ఖాన్ పఠాన్, జునైద్ సిద్ధిఖీ, దిల్ప్రీత్ బజ్వా, శ్రేయాస్ మొవ్వా, రిషివ్ జోషి.రిజర్వ్ ప్లేయర్లు: తజిందర్ సింగ్, ఆదిత్య వరదరాజన్, అమ్మర్ ఖలీద్, జతిందర్ మథారు, పర్వీన్ కుమార్.ఇంగ్లండ్జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా. ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్-మెగర్క్, మాట్ షార్ట్.నమీబియాగెరార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేన్ గ్రీన్, మైఖేల్ వాన్ లింగెన్, డైలాన్ లీచర్, రూబెన్ ట్రంపెల్మాన్, జాక్ బ్రాసెల్, బెన్ షికోంగో, టాంగెని లుంగామెని, నికో డావిన్, జేజే స్మిత్, జాన్ ఫ్రైలింక్, జేపీ కోట్జ్, డేవిడ్ వీస్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, మలన్ క్రూగర్, పీడీ బ్లిగ్నాట్.స్కాట్లాండ్రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్, బ్రాడ్ క్యూరీ, క్రిస్ గ్రీవ్స్, ఓలీ హెయిర్స్, జాక్ జార్విస్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, బ్రాండన్ మెక్ ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ సోల్, చార్లీ టియర్, మార్క్ వాట్, బ్రాడ్ వీల్.ఒమన్అకిబ్ ఇలియాస్ (కెప్టెన్), జీషాన్ మక్సూద్, కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలే, అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మహ్మద్ నదీమ్, నసీమ్ ఖుషీ, మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్, ఖలీద్ కైల్. రిజర్వు ప్లేయర్లు: జతిందర్ సింగ్, సమయ్ శ్రీవాస్తవ, సుఫ్యాన్ మెహమూద్, జయ్ ఓదెరా.వెస్టిండీస్రోవ్మన్ పావెల్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయిర్, షాయీ హోప్, అకీల్ హొసేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్ఫర్డ్, రొమారియో షెపర్డ్, ఒబెడ్ మెకాయ్.న్యూజిలాండ్కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రాస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సియర్స్.అఫ్గనిస్తాన్రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, కరీం జనత్, నంగ్యాల్ ఖరోతి, ముజీబ్ యువర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. రిజర్వ్ ప్లేయర్లు: సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీం సఫీ.ఉగాండాబ్రియాన్ మసాబా (కెప్టెన్), సైమన్ సెసాజీ, రోజర్ ముకాసా, కాస్మాస్ క్యూవుటా, దినేష్ నక్రానీ, ఫ్రెడ్ అచెలం, కెన్నెత్ వైస్వా, అల్పేశ్ రాంజానీ, ఫ్రాంక్ న్సుబుగా, హెన్రీ స్సెన్యోండో, బిలాల్ హస్సున్, రాబిన్సన్ ఓబుయా, రియాజత్ అలీ షా, జుమా మియాజీ, రోనక్ పటేల్. ట్రావెలింగ్ రిజర్వ్స్: ఇన్నోసెంట్ మ్వెబాజ్, రోనాల్డ్ లుటాయా.పపువా న్యూగినియాఅస్సాడోల్లా వాలా (కెప్టెన్), అలీ నావో, చాడ్ సోపర్, సీజే అమిని, హిలా వరే, హిరి హిరి, జాక్ గార్డనర్, జాన్ కరికో, కబువా వాగి మోరియా, కిప్లింగ్ డోరిగా, లెగా సియాకా, నార్మన్ వనువా, సెమా కామియా, సెసే బావు, టోనీ ఉరా.సౌతాఫ్రికా ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నియల్ బార్ట్మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్చ్యూన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్.శ్రీలంకవనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక, కుశాల్ మెండిస్, పథుమ్ నిస్సాంకా, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, ధనంజయ డిసిల్వా, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, దుష్మంత చమీరా, నువాన్ తుషార, మతీషా పతిరణ, దిల్షాన్ మదుశంక. ట్రావెలింగ్ రిజర్వ్స్: అసితా ఫెర్నాండో, విజయకాంత్ వియాస్కాంత్, భానుకా రాజపక్స, జనిత్ లియానాగే.బంగ్లాదేశ్నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), టస్కిన్ అహ్మద్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తౌహీద్ హ్రిదోయ్, మహ్మద్ ఉల్లా రియాద్, జకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షేక్ మహేది హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజీమ్ హసన్ సకీబ్. ట్రావెలింగ్ రిజర్వ్స్: అఫిఫ్ హుస్సేన్, హసన్ మహమూద్.నెదర్లాండ్స్స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), ఆర్యన్ దత్, బాస్ డి లీడ్, కైల్ క్లెయిన్, లోగాన్ వాన్ బీక్, మ్యాక్స్ ఓ డౌడ్, మైఖేల్ లెవిట్, పాల్ వాన్ మీకెరెన్, ర్యాన్ క్లెయిన్, సాకిబ్ జుల్ఫికర్, సిబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్, తేజ నిడమనూరు, టిమ్ ప్రింగిల్, విక్రమ్ సింగ్, వివ్ కింగ్మా, వెస్లీ బారేసి. ట్రావెలింగ్ రిజర్వ్: ర్యాన్ క్లెయిన్నేపాల్రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సాహ్, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్బన్షి, కరణ్ కేసీ, గుల్షన్ ఝా, సోంపాల్ కామి, ప్రతిస్ జీసీ, సందీప్ జోరా, అవినాష్ బోహరా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ.చదవండి: T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలుT20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్ ఏంటి?.. వివరాలు
వారెవ్వా జోసెఫ్.. దెబ్బకు వార్నర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
వెస్టిండీస్ యువ పేస్ సంచలనం షామర్ జోసెఫ్ టీ20 వరల్డ్కప్-2024కు సన్నద్దమవుతున్నాడు. ఈ క్రమంలో ట్రినిడాడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మాప్ మ్యాచ్లో జోసెఫ్ సంచలన బంతితో మెరిశాడు. ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను జోషఫ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. జోషఫ్ వేసిన డెలివరీకి వార్నర్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఆసీస్ ఇన్నింగ్స్ 2వ వేసిన జోషఫ్ తొలి మూడు బంతుల్లో ఏకంగా 14 పరుగులు సమర్పించుకున్నాడు. వార్నర్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. ఈ సమయంలో జోసెఫ్ సూపర్ కమ్బ్యాక్ ఇచ్చాడు. నాలుగో బంతిని జోసెఫ్.. వార్నర్కు బ్యాక్-ఆఫ్-లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అయితే వార్నర్ ఈ డెలివరీని లెగ్ సైట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్కు మిస్ అయ్యి ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ ఏడాది ఆసీస్తో గబ్బా వేదికగా జరిగిన టెస్టులో సంచలన ప్రదర్శన కనబరిచిన జోసెఫ్ ఓవర్నైట్ స్టార్గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇక వార్మాప్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్పై 35 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్లలో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో పూరన్ 75 పరుగులు చేశాడు. జాన్సన్ ఛార్లెస్(40), రూథర్ఫోర్డ్(47) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో ఆసీస్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. View this post on Instagram A post shared by ICC (@icc)
బిజినెస్
మరో మడత ఫోన్ వచ్చేస్తోంది.. రేటు రూ.లక్షకు పైనే!
దేశ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి మరో మడత ఫోన్ వచ్చేస్తోంది. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివొ గ్రేటర్ నోయిడాలోని కర్మాగారంలో తయారైన తన లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను భారత్ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.వివో తన నాలుగో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసిన తర్వాత, ఈ ఫోన్ను భారత్కు తీసుకురానుంది. భారత మార్కెట్లో వివో నుంచి దేశంలోకి వచ్చిన తొలి ఫోల్డబుల్ ఫోన్ ఇదే అవుతుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ తేదీని జూన్ 6గా వివో ధ్రువీకరించింది. తొలి ఫోల్డబుల్ ఫోన్ తో ప్రీమియం సెగ్మెంట్ లో శాంసంగ్, యాపిల్ సరసన చేరాలని వివో భావిస్తోంది.వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)తేలికపాటి డిజైన్ను మన్నికతో సమతుల్యం చేసేలా కార్బన్ హింజ్ ఫైబర్.6.53 అంగుళాల కవర్ డిస్ ప్లే, 8.03 అంగుళాల ఇన్నర్ అమోల్డ్ ఎల్టీపీఓ ఫోల్డింగ్ డిస్ ప్లే2480-2200 రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, హెచ్ డీఆర్ 10+ సపోర్ట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీ, అడ్రినో జీపీయూ16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ యూఎఫ్ఎస్ 4.0 వరకు స్టోరేజ్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టం50 మెగాపిక్సెల్ అల్ట్రా-సెన్సింగ్ మెయిన్ కెమెరా, 64 మెగాపిక్సెల్ 3ఎక్స్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, వీ3 ఇమేజింగ్ చిప్సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాఅంచనా ధరవివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్లైన్ రిటైలర్ల ద్వారా విక్రయించనున్నారు. చైనాలో దీని ధర 9,999 యువాన్లుగా(సుమారు రూ.1.17 లక్షలు) ఉండగా, భారత్లో దీని ధర రూ.1.2 లక్షలుగా ఉండొచ్చని అంచనా.
బ్యాంకుల్లో రూ .78,213 కోట్లు.. ఎవరిదీకానిది ఈ సొమ్ము!
దేశంలోని వివిధ బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు భారీగా పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గురువారం విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. బ్యాంకుల వద్ద ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు 2024 మార్చి చివరి నాటికి 26 శాతం పెరిగి రూ .78,213 కోట్లకు చేరుకున్నాయి.సహకార బ్యాంకులతో సహా వివిధ బ్యాంకుల్లో 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం ఇన్యాక్టివ్గా ఉన్న ఖాతాల్లోని సొమ్మును అన్క్లెయిమ్డ్గా పరిగణించి ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ నిధికి బదిలీ చేస్తాయి. ఇలా 2023 మార్చి నాటికి డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్లో ఉన్న మొత్తం రూ.62,225 కోట్లు.ఖాతాదారులకు సహాయపడటానికి మరియు ఇన్యాక్టివ్ ఖాతాలకు సంబంధించి ఇప్పటికే ఉన్న సూచనలను క్రమబద్ధీకరించడానికి, రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది ప్రారంభంలో సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. ఖాతాలు, డిపాజిట్లను ఇన్ యాక్టివ్ లేదా అన్ క్లెయిమ్డ్ గా వర్గీకరించడంతోపాటు బ్యాంకులు అమలు చేయాల్సిన చర్యలను ఈ మార్గదర్శకాల్లో పొందుపరిచారు.నవీకరించిన మార్గదర్శకాలు అన్ని వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా), సహకార బ్యాంకులకు వర్తిస్తాయి. 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లను కేంద్రీకృత పద్ధతిలో వెతికే ప్రక్రియను సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఉడ్గామ్ (అన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్) అనే వెబ్ పోర్టల్ను రూపొందించింది.
సైలెంట్ లేఆఫ్లు.. 20 వేల మంది టెకీలు ఇంటికి..
ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ గత కొంత కాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. లేఆఫ్ల పేరుతో లక్షలాది మంది ఉద్యోగులను కంపెనీలు అధికారికంగా తొలిగించాయి. అప్రకటింతగానూ వేలాదిగా ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. దేశంలోని ఐటీ పరిశ్రమలో 2023 క్యాలెండర్ సంవత్సరంలో దాదాపు 20 వేల మంది ‘సైలెంట్’గా ఉద్యోగాలు కోల్పోయారు.ఆలిండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐఐటీఈయూ) వెల్లడించిన వివరాల ప్రకారం 2023 క్యాలెండర్ ఇయర్లో దేశ ఐటీ రంగం దాదాపు 20,000 మంది టెకీలను ‘సైలెంట్ లేఆఫ్’ విధానంలో తొలగించింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ తొలగింపులు చిన్నా పెద్ద అన్ని ఐటీ కంపెనీలలో జరిగాయని, వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఏఐటీఈయూ భావిస్తోంది.ఇలా అత్యధికంగా ఉద్యోగులను తొలగించిన ఐటీ కంపెనీల్లో ప్రముఖంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్టీఐ-మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఒక్క హెచ్సీఎల్ టెక్లో మాత్రమే ఉద్యోగుల సంఖ్య పెరిగింది. అప్రకటిత పద్ధతిలో ఉద్యోగులను తొలగించే పరిస్థితిని "సైలెంట్ లేఆఫ్" సూచిస్తుంది. అంటే కాంట్రాక్టులను పునరుద్ధరించకపోవడం, పని గంటలను తగ్గించడం, ముందస్తు పదవీ విరమణకు పురిగొల్పడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం వంటివి.
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 148 పాయింట్లు నష్టపోయి 22,556 వద్దకు చేరింది. సెన్సెక్స్ 408 దిగజారి 73,885 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరాయి.టాటా స్టీల్, టెక్ మహీంద్రా, పవర్గ్రిడ్, విప్రో, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఐటీసీ, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ కంపెనీ షేర్లు నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
వీడియోలు
ఢిల్లీలో నీటి సంక్షోభం.. నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా
నిప్పుల కుంపటిలా తెలంగాణ
ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీ నేతల ధర్నా
తెలంగాణ ఇరిగేషన్శాఖ ఈఈ బన్సీలాల్ అరెస్ట్
చంద్రబాబు జీవితం అంతా వెన్నుపోటు, కుట్రలు,కుతంత్రాలే బాబు ను ఏకిపారేసిన సీఎం జగన్
200 కోట్ల భారీ స్కాంలో దొరికిపోయిన నిమ్మగడ్డ ఫ్యామిలీ
ఎమ్మెల్సీ రఘురాజు కొత్త డ్రామా..
తెలంగాణ రాష్ట్ర గీతం ఖరారు
మళ్లీ జగనే సీఎం..బెజవాడ గడ్డ వైఎస్ఆర్ సీపీ అడ్డా
సజ్జల అరెస్ట్ అంటూ ఎల్లో మీడియా ఓవర్ యాక్షన్...దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన విజయ్ బాబు
ఫ్యామిలీ
వ్యాయామం చేయని మహిళలు తీసుకోవాల్సిన డైట్ ఇదే!
మహిళలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అత్యంత ముఖ్యంగా. అందులోనూ వ్యాయామం చేయని మహిళలు తినే ఆహారం విషయంలో పట్ల శ్రద్ద వహించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెబుతోంది. అలాంటి మహిళలు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదే ఐసీఎంఆర్ కొన్ని మార్గదర్శకాలు కూడా అందించింది. అవేంటో చూద్దామా..!వ్యాయామం చేయని మహిళలు తినే ఫుడ్పై శ్రద్ధ పెట్టడం కీలకం. అతిగా తినకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. తక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లతో ఉండే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ నూనెతో కాల్చినవి, ఆవిరిపై ఉడికించినవి తీసుకోవాలిన చెబుతున్నారు. అలాగే వాటి తోపాటు లీన్ ప్రోటీనఖ కూడా అవసరం. స్కిన్లెస్ చికెన్, చేపలు, అప్పడప్పుడూ రెడ్ మీట్ వంటివి తీసుకోవాలని సూచించారు. అదనప్పు కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులు,లేకుండా చేసుకోవాలి. కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి. హెర్బల్ టీలు వంటివి తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు చక్కెర పానీయాలకు దూరంగా ఉండటమే బెటర్బరువు అదుపులో ఉంచుకునే యత్నం చేయాలి. ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా తృణధాన్యాలు, కాలానుగుణంగా పండ్లకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అనారోగ్యకరమైన చిరుతిండ్లకు దూరంగా ఉండటం మంచిది. భోజనాని కంటే వివిధ రకాల పచ్చి కూరగాయలు తినడానికి యత్నం చేయాలి. మిల్లెట్స్ , బ్రౌన్రైస్కి ప్రాధాన్యత ఇవ్వాలి. బ్రేక్ఫాస్ట్గా కూడా బీన్స్, కాయధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన గింజలను(బాదం పప్పులు, జీడిపప్పులు)కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైనా గానీ తీసుకునే ఆహారాన్ని మనస్పూర్తిగా ఆస్వాదిస్తూ తినాలి, సమతుల్యతకు ప్రాముఖ్యత ఇవ్వడం వంటివి చేస్తే.. మీ చేతుల్లోనే ఆరోగ్యం పదిలంగా ఐసీఎంఆర్ చెబుతోంది. వ్యాయామం చేయని మహిళలు ఈ విషయాలు గుర్తించుకుని మంచి డైట్ పాటిస్తే చాలని చెబుతోంది.(చదవండి: తొలి పోస్టల్ సర్వీస్ నుంచి .. సరికొత్త ట్యూన్ వరకు ఎన్నో ఘటనలకు సాక్షి 'మే 31'!)
పొగాకు అడిక్షన్ నుంచి బయటపడేసి ఆహారపదార్థాలివే..!
యాంకర్ శ్రీముఖి ఫ్యాషన్ లుక్స్ చూశారా? (ఫోటోలు)
అంబానీ ఇంట పెళ్లి సందడి: రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ ఖర్చు ఎంతో తెలుసా?
బిలియనీర్ ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి, అందులోనూ ఈ తరంలో చివరి పెళ్లి. అందుకే బోలెడంత సందడి. ఇది చాలదన్నట్టు ఘనంగా నిశ్చితార్థం, అంగరంగ వైభవంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఇపుడు కనీవినీ ఎరుగని రీతిలో రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. దీంతో రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్గా నిలిచింది.ముఖేష నీతా అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్తో జూలై 12న ముంబైలో జరగనుంది. దీనికి ముందుగా దక్షిణ ఫ్రాన్స్లో ఉన్న విల్లాలో దేశ విదేశాలకు చెందిన 800 మంది ముఖ్య అతిథులతో ఇటలీ నుండి ఫ్రాన్స్కు వెళ్లే మార్గంలో విలాసవంతమైన క్రూయిజ్లో రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుక జరుగుతోంది. జూన్ 1, 2024న ఇటలీలోని సుందరమైన పోర్టోఫినో నగరంలో ముగుస్తుంది.తాజా సమాచారం ప్రకారం అనంత్ అంబానీ-రాధిక మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్లో పాపులర్ అమెరికన్ గాయని-గేయరచయిత, కేటీ పెర్రీ ప్రదర్శన ఇవ్వనుంది. ఈ రోజు సాయంత్రం(మే 31) డార్క్ హార్స్, రోర్, ఎలక్ట్రిక్, హార్లేస్ ఇన్ హవాయి పాటలతో ఈ గ్రాండ్ ఈవెంట్లో సందడి చేయనుంది. 'లా విటా ఇ అన్ వియాజియో' (జీవితం ఒక ప్రయాణం) థీమ్తో ఈ గాలా సాగుతుంది. ఇందుకు కోసం పాప్ ఐకాన్కు భారీ మొత్తంలోనే ముట్ట చెప్పారట. ఖర్చు రూ. 7500కోట్లురూ. 424 కోట్ల విలువైన ఎస్టేట్లో నిర్వహించే రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ కోసం అంబానీ కుటుంబం ఏకంగా 7,500 కోట్లు రూపాయలు వెచ్చిస్తోంది. అంతేకాదు క్రూయిజ్లోని ప్రతి సూట్ స్పా, జిమ్, స్విమ్మింగ్ పూల్ మరెన్నో విలాసవంతమైన సౌకర్యాలతో ఉంటుంది. ఒక్కోదానికి ఖర్చు సుమారు రూ. 60 లక్షలు. ఐదు గంటలు పాటు జరిగే మూడో రోజు స్పెషల్ ఈవెంట్లో డీజేలు, బాణా సంచా వెలుగులతో మోత మోగనుంది.కాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జూలై 12, 2024న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోనున్నారు. అతిరథ మహారథుల సమక్షంలో మూడు రోజుల పాటు పెళ్లి సంబరాలు కొనసాగనున్నాయి.
న్యూస్ పాడ్కాస్ట్
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు కేరళకు నైరుతి రుతుపవనాల రాక.. రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నాయకులు చల్లే బురదలోనే కమలాలు విరగబూస్తాయి.. ప్రధాని మోదీ ధీమా.. ఇంకా ఇతర అప్డేట్స్
మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి గెలిస్తే హిందువులు రెండో తరగతి పౌరులే.. ప్రధాని మోదీ ఆందోళన.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు... ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
విపక్షాలది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి.. ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
రూ. 200 కోట్ల మోసం కేసులో నిమ్మగడ్డ వాణి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్లో (టెస్కాబ్) జనరల్ మేనేజర్గా పనిచేస్తూ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ ముసుగులో రూ.200 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన నిమ్మగడ్డ వాణీబాల, ఆమె భర్త, కుమారుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంస్థ చేతిలో మోసపోయిన 532 మందిలో 147 మంది టెస్కాబ్ ఉద్యోగులేనని డీసీపీ ఎన్.శ్వేత గురువారం తెలిపారు.వాణీబాలతోపాటు ఆమె భర్త మేక నేతాజీ, కుమారుడు మేక శ్రీహర్షలను రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. అధిక వడ్డీ ఆశచూపి..: ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేక నేతాజీ 1985లో హైదరాబాద్లోని తిలక్ రోడ్లో శ్రీ ప్రియాంక ఫైనాన్స్ అండ్ చిట్ఫండ్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. ఇతర వ్యాపారాలు కూడా చేసిన ఆయన.. వాటి నిర్వహణ కోసం ప్రియాంక సంస్థ ద్వారా డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టారు. తమ వద్ద నగదు డిపాజిట్ చేస్తే ఏడాదికి 24% చొప్పున వడ్డీ చెల్లిస్తానంటూ నమ్మబలికాడు.అలాగే ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో మరో సంస్థ ఏర్పాటు చేసి ముద్రణ రంగంలో వినియోగించే ప్లేట్లు, రంగులు తదితరాలను కంపెనీల నుంచి కొని ప్రింటింగ్ ప్రెస్లకు విక్రయించడం మొదలెట్టారు. నేతాజీ భార్య నిమ్మగడ్డ వాణీబాల ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్లో ఉద్యోగంలో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత టెస్కాబ్గా మారిన ఈ సంస్థలో కొనసాగారు. రాష్ట్ర స్థాయి పోస్టు అయిన జనరల్ మేనేజర్ వరకు వెళ్లారు. శ్రీహర్ష తన తండ్రి నిర్వహిస్తున్న సంస్థలోనే డైరెక్టర్గా చేరా రు.వాణీబాల టెస్కాబ్లో పనిచేసే ఉద్యోగులను భర్త సంస్థలో పెట్టుబడులు పెట్టాలని హుకుం జారీ చేసింది. దీంతో 147 మంది రూ. 26 కోట్ల డిపాజి ట్లు చేశారు. అలాగే టెస్కాబ్లో డిపాజిట్ చేయడానికి వచ్చే వారిని సైతం మాయమాటలతో నమ్మించి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయించుకుంది. రశీదులన్నీ వేరే సంస్థ పేరుతో..: తమ వద్ద పె ట్టుబడులు పెట్టిన డిపాజిట్దారులకు ఇవ్వడానికి నేతాజీ, శ్రీహర్షలు ప్రత్యేకంగా శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో రసీదులు తయారు చేయించారు. దీనిపై వివరాలు రాసి రూపాయి విలువైన రెవెన్యూ స్టాంప్ అతికించి సంతకాలు చేసిచ్చారు. కరోనా తర్వాత కాస్త ఒడుదొడుకులు ఎదురైనా గతేడాది నవంబర్, డిసెంబర్ నుంచి వినియోగదారులకు వడ్డీ చెల్లింపులు ఆపేశారు. ఈ నెల 3న సిటీ సివిల్ కోర్టులో ఏకంగా దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేసి ముగ్గురూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీనిపై బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ కేఎం కిరణ్కుమార్ నేతృత్వంలోని బృందం గురువారం ముగ్గురినీ అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించింది. విచారణ నిమిత్తం 14 రోజుల కస్టడీకి కోరాలని నిర్ణయించింది.
‘వాగు’లో గల్లంతైన నలుగురి మృతి
బాపట్లటౌన్: విహారయాత్రలో భాగంగా హైదరాబాద్ నుంచి బాపట్ల ప్రాంతానికి వచ్చిన 12 మందిలో బుధవారం నల్లమడవాగులో నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో సునీల్కుమార్ (36), అతని కొడుకు అనురాజ్ (13) మృతదేహాలు బుధవారం రాత్రి ఏరియా వైద్యశాలకు తరలించారు. మరో ఇద్దరు ఆచూకీ లభించకపోవడంతో జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా, ఎస్పీ వకుల్జిందాల్ ఆదేశాల మేరకు రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, సూర్యలంక తీరంలోని గజ ఈతగాళ్లు, అగ్నిమాపక అధికారులు టీమ్లుగా ఏర్పడి నల్లమడ వాగులో సుమారు 3 కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో భాగంగా వడ్లకొండ కిరణ్గౌడ్ (35) మృతదేహాన్ని గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో గుర్తించి వెలికి తీశారు. అదే సమయంలో బండా నందు (35) మృతదేహం మూలపాలెం గ్రామశివారులోని తుమ్మచెట్ల మధ్యలో ఉన్నట్లు గుర్తించి వెలికి తీశారు. నలుగురు మృతదేహాలకు గురువారం బాపట్ల ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబసభ్యులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. రూరల్ సీఐ శ్రీహరి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
రాజేంద్రనగర్: గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత డ్రగ్స్ను విక్రయిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 270 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాదీనం చేసుకున్నారు. సన్సిటీ బండ్లగూడ జాగీర్లోని ఓ సూపర్ మార్కెట్ సమీపంలో గురువారం మహారాష్ట్రకు చెందిన తృప్తి ప్రభాకర్ హోకం (21), మధ్యప్రదేశ్ శివుపురి గ్వాలియర్ ప్రాంతానికి చెందిన అనుభవ్ సక్సేనా (24)లు బ్యాగ్తో ప్యాసింజర్ ఆటోదిగి అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న శంషాబాద్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం.రాఘవేందర్, కానిస్టేబుళ్లు వారిని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా తెల్లటి పౌడర్ రూపంలో ఉన్న 270 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ లభించింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా.. తాము ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. ఎండీఎం డ్రగ్స్ను ఐటీ, ఈవెంట్ మేనేజర్లకు విక్రయిస్తున్నామని తెలిపా రు. తాము చంద్రపూర్కు చెందిన సాబేర్ అనే వ్యక్తి ద్వారా కొరియర్ తెప్పించుకొని ఎక్కువ ధరలకు హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎండీఎంఏ డ్రగ్ విలువ మార్కెట్లో రూ.20 లక్షలు ఉంటుందన్నారు.
కాసరగోడులో లవ్ జిహాద్?
యశవంతపుర: మంగళూరు వద్ద కేరళ సరిహద్దుల్లో కాసరగోడులోని ప్రైవేట్ స్కూలులో టీచర్ అయిన నేహా, యువకుడు తన్వీర్ మిర్థాద్లు ప్రేమించుకుని కొన్ని రోజుల కిందట వెళ్లిపోయారు. ఇప్పుడు స్థానిక పోలీసుల ముందు హాజరయ్యారు. నేహ ఇష్ట ప్రకారం ప్రేమించి అతనితో వెళ్లిపోయినట్లు చెప్పింది. తాము 25న రిజిస్టర్ పెళ్లి చేసుకున్నట్లు పత్రాలను చూపించారు. ఇది లవ్ జిహాద్ అని, ఒక వర్గం అమ్మాయిలను టార్గెట్ చేశారని హిందూ సంఘాల నేతలు ఆరోపించారు. తమ కూతురిని తమతో పంపాలని తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. కానీ ఆమె ప్రియునితోనే ఉంటానని స్పష్టంచేసింది.