అమెరికా దాడిపై నావికుడి భార్య కన్నీటి ఆవేదన
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల హర్ముజ్ జలసంధిలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై అమెరికా దాడులు జరిపింది. ఆ అటాక్లో ముగ్గురు భారతీయులు మరణించడం భారత్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు రేపింది. తాజాగా ఆ దాడిలో మరణించిన చీఫ్ మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేశ్ సతీమణి తీవ్ర ఆవేదనతో స్పందించారు. ఇప్పటి వరకూ ఈ అంశంలో కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.ఇటీవల హర్ముజ్ ఒమన్ తీరంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న 'ఎంటీ సెట్టెబెల్లో' చమురు ట్యాంకర్పై అమెరికా సైనిక దళాలు దాడులు జరిపాయి. ఈదాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించగా అందులో ఒకరు ఆంధ్రప్రదేశ్కు చెందిన పట్నాల సురేశ్ తెలుగువారున్నారు. ఇరాన్ రేవులపై అమెరికా విధించిన సముద్ర దిగ్బంధనాన్ని (Blockade) ఉల్లంఘించిందనే ఆరోపణలతో యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ అటాక్ చేసింది. అయితే ప్రమాదంలో చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్, డెక్ కాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా అనే ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.కాగా ఈ ఘటనపై మెరైన్ చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్ భార్య భార్గవి ఆవేదన వ్యక్తం చేశారు. "...ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయారు. భారతీయ సిబ్బంది ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఇప్పటివరకు ఎవరూ కనీసం దీనిపై సరైన స్పందన ఇవ్వలేదు. నేను నేరుగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని అడుగుతున్నాను. బాధిత కుటుంబాలకు ఎలాంటి సహాయం అందిస్తారు? అమెరికా ప్రభుత్వాన్ని కూడా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను... మా కుటుంబంలో నా భర్త ఒక్కరే సంపాదించేవారు. ఇక నా పిల్లలను నేను ఎలా పెంచాలి?..." అనే ఆవేదన వ్యక్తం చేశారు.కాగా ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్లోని అమెరికా అత్యున్నత దౌత్యవేత్త (ఛార్జ్ డి అఫైర్స్) జాసన్ మీక్స్కు రెండు సార్లు సమన్లు జారీ చేసింది. మరోవైపు ట్రంప్ సైతం ఈ ఘటనపై స్పందించారు. ఈ దాడులు చేసింది ఇరాన్ అని దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించేది లేదని తెలిపారు.
అయ్యో శ్వేతా.. ఆదుకునేవారే లేరా?
హైదరాబాద్: విధి ఆడిన వింత నాటకంలో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది.. భర్త, కూతురితో ఆనందంగా సాగిపోవాల్సిన ఆమె ఇపుడు అనాథ అయింది.. కన్న కూతురు, కట్టుకున్న భర్త ప్రాణాలు ఆమె కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు.. ఈనెల 13న తెల్లవారుజామున జరిగిన విద్యుత్ ప్రమాదంలో అందరి ముందూ తండ్రి, కూతురు విగతజీవులగా మారిపోయారు.అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానాజీగూడ టెలికాం కాలనీలో జరిగి విద్యుత్ తీగ కారుపై పడటంతో సందీప్(45), అతని కూతురు రుత్విక(16) ప్రాణాలు కోల్పోవడం ఇంకా స్థానికుల కళ్లముందే మెదులుతోంది.మీ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది.. కాదు.. మీ నిర్లక్ష్యం వల్లే అని విద్యుత్ శాఖ అధికారులు, మల్కాజిగిరి మున్సిపల్ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ ప్రమాదం జరిగి ఇప్పటికి ఆరు రోజులవుతోంది. ప్రమాదానికి కారణం ఏ శాఖ అయినా.. ప్రభుత్వ శాఖలే కదా.. మరి బాధితురాలు శ్వేత గురించి ప్రభుత్వం అస్సలు పట్టించుకోకపోతే ఎలా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రభుత్వ అధికారులైనా వచ్చి బాధితురాలికి భరోసా ఇచ్చి పరిహారం గురించి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. ఆ కుటుంబ పరిస్థితి కూడా అంతంత మాత్రమేనని చెబుతున్నారు. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని స్థానికులు పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసినప్పటికీ స్పందన లేదని ఆరోపిస్తున్నారు. సుమారు 45 నిమిషాల పాటు సహాయం కోసం ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో స్పందించి కరెంట్ సరఫరా నిలిపివేసి ఉంటే.. అత్యవసర టీమ్ వెంటనే చేరుకుంటే ఇద్దరి ప్రాణాలు దక్కేవని చెబుతున్నారు. ఇపుడు అధికారులు సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం శ్వేతకు ఆర్థిక సహాయం అందజేసి ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు.ఇలాంటి సమయంలో బాధితురాలికి మానసికంగా, ఆర్థికంగా అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యతని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్వేత అత్త లలిత క్యాన్సర్ బారిన పడింది, మామ చక్రపాణికి ఇటీవల బైపాస్ సర్జరీ జరిగింది. తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కుటుంబ పరిస్థితిని ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకొని అండగా నిలవాలని కోరుతున్నారు.
స్వామీ.. మా అత్త త్వరగా చనిపోయేలా చూడు!..కోడలి వింత లేఖ వైరల్!
సాక్షి, అనంతపురం: సాధారణంగా భక్తులు కోర్టు కేసులు గెలవాలనో, అప్పులు తీరాలనో, ఉద్యోగాలు రావాలనో లేదా కుటుంబాలు చల్లగా ఉండాలనో కోరుకుంటూ హుండీలలో ఉత్తరాలు వేస్తుంటారు. కానీ, ఓ భక్తుడు ఏకంగా తన అత్తగారి మరణాన్ని కాంక్షిస్తూ కరెన్సీ నోటుపై అభ్యర్థనతో రాసిన వింత లేఖ వెలుగులోకి వచ్చింది.ఆలయ అధికారులు,స్థానిక భక్తుల వివరాల మేరకు.. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. గురువారం ఆలయ హుండీని లెక్కించగా, ఓ రూ.20 నోటుపై 'స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. ఆమె త్వరగా చనిపోయేలా చూడు’ అని రాసి ఉన్న వినతి కనిపించింది. ఈ వింత కోరికను చూసి అధికారులు, భక్తులు ముక్కున వేలేసుకున్నారుఅయితే ఆ వింత లేఖ రాసిన సదరు మహిళ ఎవరు అనేది తెలియరాలేదు. ఆమె అత్తగారి నుంచి ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, వేధింపులు ఏ స్థాయికి చేరితే.. చివరికి ఎవరికీ చెప్పుకోలేక ఇలా నేరుగా భగవంతుడికే తన ఆవేదనను నివేదించుకుందనే కోణంలో సామాజిక వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా, హుండీ లెక్కింపులో దొరికిన ఈ రూ. 20 నోటు తాలూకు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని హాస్యాస్పదంగా తీసుకుంటుండగా, మరికొందరు మాత్రం సమాజంలో అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లోపించడానికి ఇది నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో భక్తులు తమ వ్యక్తిగత బాధలను, దేవాలయాల లోపాలను హుండీ లేఖల ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావడం పెరిగిపోతోందని, ఇటీవల కొండగట్టు అంజనేయ స్వామి ఆలయంలోనూ ఇలాంటి వింత లేఖలే బయటపడిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ‘ఆలయంలో భక్తులకు కనీస వసతులు కల్పించే వరకు తాము హుండీలో ఒక్క రూపాయి కూడా వేయం’ అని భక్తులు స్పష్టం చేశారు. ఆలయ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విసిగిపోయి, హుండీని వేదికగా చేసుకుని భక్తులు డిమాండ్లతో కూడిన వినూత్న నిరసన లేఖలు వేయడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
మరోసారి చంద్రబాబు సర్కార్ దగా
సాక్షి, విజయవాడ: మరోసారి కూటమి సర్కార్ దగా చేసింది. ఆక్వా మేత ధర కిలోకి రూ.4 తగ్గిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటన అమలు కాలేదు. కిలోకి రూ.2 మాత్రమే ఫీడ్ కంపెనీలు తగ్గించాయి. చంద్రబాబు ఆదేశాలు అమలు కాకపోవడంతో తమను మళ్లీ మోసం చేశారంటూ ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రొయ్యలు, చేపల సాగుకు వినియోగించే అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయే తప్ప ఆక్వా ఉత్పత్తుల ధరలు మాత్రం పెరగడం లేదని రైతులు వాపోయారు. ముడిసరుకుల ధరలు పెరిగినప్పుడు ఫీడ్ ధర పెంచుతున్న కంపెనీలు.. వాటి ధరలు తగ్గినప్పుడు మాత్రం కూడా తగ్గించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, చంద్రబాబు ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం అన్నదాతల పాలిట దుఃఖీభవ పథకంగా మారింది. రాష్ట్రంలోని రైతులందరికీ కేంద్ర ప్రభుత్వ సాయంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నమ్మబలికారు. అధికారంలోకి వచ్చాక నాలుక మడతేసి, కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ పథకంతో కలిపి రూ.20 వేలు ఇస్తామని చెప్పారు. తొలి ఏడాది అదీ ఇవ్వకుండా పెట్టుబడి సాయాన్ని నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు.రెండో ఏడాది అరకొర సాయం అందించిన చంద్రబాబు.. మూడో ఏడాది కూడా రైతులను వంచించేందుకు యత్నిస్తున్నారు. 2026–27 వ్యవసాయ సీజన్కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు జమ చేయనున్నారు. అది కూడా అరకొరగానే ఇస్తున్నారు. కౌలు రైతులకు ఈసారీ మొండి చేయే చూపించారు.
మళ్లీ పెరగనున్న ధరలు.. కియా కార్లు ప్రియం!
‘సాయికృష్ణ కేసును చంద్రబాబు తొక్కేద్దామనుకున్నారు’
ఇస్కాన్ టెంపుల్కి రోబోటిక్ ఏనుగు..! నటి శ్రియా..
రెండేళ్ల పాటు నరకం చూశా.. తినాలని ఉన్నా తినలేకపోయా
స్వామీ.. మా అత్త త్వరగా చనిపోయేలా చూడు!..కోడలి వింత లేఖ వైరల్!
కర్ణాటకలో క్రాస్ ఓటింగ్.. కాంగ్రెస్ ఘన విజయం
ఆల్టైమ్ టెస్ట్ జట్టు ప్రకటన.. సచిన్ టెండూల్కర్కు నో ఛాన్స్
అత్యంత స్టైలిష్ దుస్తులలో జోహ్రాన్ మమ్దానీ భార్య రామా దువాజీ..!
IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!
'నేను బాబా టిల్లూ : బాబా బైక్ స్టంట్స్ వీడియో వైరల్
రాబోయేది ఆషామాషీ ఎల్ నినో కాదు!
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
రాజీవ్ కనకాల చెప్పాడు.. నా గర్వంతో చాలా కోల్పోయా: చిత్రం శీను
రెండేళ్లలో ఏకంగా 540 మందికి పైగా రైతన్నల ఆత్మహత్య
మళ్లీ యుద్ధం అంటే మన ప్రజలు మీ మీద దాడి చేస్తారేమో జాగ్రత్తగా ఉండండి!
హీరోగా మెగా డైరెక్టర్ కొడుకు.. కూతురు ఇప్పటికే హీరోయిన్
మీకు కూడా రెండో నివాసం అమరావతే కదా సార్! మొదటిది హైదరాబాద్!!
పసిడి రూ.4,800 పతనం
ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 16 సినిమాలు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. పలుకుబడి పెరుగుతుంది
రూ .1,260 కోట్లకు బంగ్లాను అమ్మేసిన మీడియా అధినేత
ఎల్నినోను తట్టుకునే సీ4 పంటలు తెలుసా?
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఉదయాన్నే చికెన్.. వడ్డే నవీన్ షాకింగ్ లైఫ్ స్టైల్..!
మోగుతున్న ఎల్ నినో ఘంటికలు
ఈ రాశి వారికి మిత్రుల నుంచి ధనలాభం
పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోహీరోయిన్
వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ భారీ షాక్
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం
పసిడి ధరల పతనం.. ఒకే రోజులో భారీ తగ్గుదల!
మళ్లీ పెరగనున్న ధరలు.. కియా కార్లు ప్రియం!
‘సాయికృష్ణ కేసును చంద్రబాబు తొక్కేద్దామనుకున్నారు’
ఇస్కాన్ టెంపుల్కి రోబోటిక్ ఏనుగు..! నటి శ్రియా..
రెండేళ్ల పాటు నరకం చూశా.. తినాలని ఉన్నా తినలేకపోయా
స్వామీ.. మా అత్త త్వరగా చనిపోయేలా చూడు!..కోడలి వింత లేఖ వైరల్!
కర్ణాటకలో క్రాస్ ఓటింగ్.. కాంగ్రెస్ ఘన విజయం
ఆల్టైమ్ టెస్ట్ జట్టు ప్రకటన.. సచిన్ టెండూల్కర్కు నో ఛాన్స్
అత్యంత స్టైలిష్ దుస్తులలో జోహ్రాన్ మమ్దానీ భార్య రామా దువాజీ..!
IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!
'నేను బాబా టిల్లూ : బాబా బైక్ స్టంట్స్ వీడియో వైరల్
రాబోయేది ఆషామాషీ ఎల్ నినో కాదు!
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
రాజీవ్ కనకాల చెప్పాడు.. నా గర్వంతో చాలా కోల్పోయా: చిత్రం శీను
రెండేళ్లలో ఏకంగా 540 మందికి పైగా రైతన్నల ఆత్మహత్య
మళ్లీ యుద్ధం అంటే మన ప్రజలు మీ మీద దాడి చేస్తారేమో జాగ్రత్తగా ఉండండి!
హీరోగా మెగా డైరెక్టర్ కొడుకు.. కూతురు ఇప్పటికే హీరోయిన్
మీకు కూడా రెండో నివాసం అమరావతే కదా సార్! మొదటిది హైదరాబాద్!!
పసిడి రూ.4,800 పతనం
ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 16 సినిమాలు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. పలుకుబడి పెరుగుతుంది
రూ .1,260 కోట్లకు బంగ్లాను అమ్మేసిన మీడియా అధినేత
ఎల్నినోను తట్టుకునే సీ4 పంటలు తెలుసా?
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఉదయాన్నే చికెన్.. వడ్డే నవీన్ షాకింగ్ లైఫ్ స్టైల్..!
మోగుతున్న ఎల్ నినో ఘంటికలు
ఈ రాశి వారికి మిత్రుల నుంచి ధనలాభం
పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోహీరోయిన్
వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ భారీ షాక్
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం
పసిడి ధరల పతనం.. ఒకే రోజులో భారీ తగ్గుదల!
ఫొటోలు
హీరోయిన్ సోనమ్ కపూర్ ఫ్యామిలీ మూమెంట్స్ (ఫొటోలు)
సీతాకోక చిలుకలా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్.. ఫోటోలు
ఫిఫా వరల్డ్కప్లో నటి నోరా ఫతేహి సందడి (ఫొటోలు)
రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు)
మొనాకో వేకేషన్లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు
డైమండ్లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు)
కడప గడపలో క్రికెట్ సందడి (ఫొటోలు)
హైదరాబాద్ పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
హాలీడే ట్రిప్లో సినీ ప్రేమజంట (ఫొటోలు)
సినిమా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు షాక్
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీకి నోటీసులు జారీ చేసింది. వచ్చే సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ-11గా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 19 మందికి సమన్లు జారీ చేసిన న్యాయస్థానం.. అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించింది.కాగా.. ఈ కేసులో ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. నిందితుల వ్యక్తి గత హాజరు తరువాత ఈ కేసులో నాంపల్లి కోర్టు ట్రయల్ ప్రారంభించునుంది.అసలేం జరిగిందంటే..అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 రిలీజ్ ముందు రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు తేజ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం రేవతి కుమారుడు తేజ కోలుకుంటున్నారు. ఆ తర్వాత రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ అండగా నిలిచారు. తేజ వైద్య ఖర్చులకు సాయం అందిస్తున్నారు.
సడన్గా ఓటీటీకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ శుక్రవారం ఓటీటీల్లో దృశ్యం-3తో పాటు దురంధర్-2 కూడా మరో ఓటీటీకి వచ్చేసింది. అంతేకాకుండా తెలుగు కామెడీ సిరీస్ సేవ్ ది టైగర్స్-3,రవిబాబు రేజర్ మూవీ కూడా ఓటీటీలో సందడి చేస్తోంది. అంతేకాకుండా పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ ఒక్క రోజే స్ట్రీమింగ్కు వచ్చేశాయి.తాజాగా మరో మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. అనుపమ పరమేశ్వరన్, రెజీనా, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మరీచిక సడన్గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.ఈ ఏడాది మే 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ రోజు నుంచి ఓటీటీ ప్రియులను అలరిస్తోంది. థియేటర్లలో విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీకి వచ్చేసింది. ఈ సినిమాకు సతీశ్ కసెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ మూవీని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజీవ్ చిలక, మేఘా చిలక నిర్మించారు. #Mareechika (Telugu)Now streaming on PrimeVideo in Telugu & Tamil 🍿!!#OTT_Trackers pic.twitter.com/zjxsplI2Kp— OTT Trackers (@OTT_Trackers) June 19, 2026
మా ఇంటి బంగారం రివ్యూ.. సమంత ఖాతాలో హిట్ పడిందా?
టైటిల్: మా ఇంటి బంగారంనటీనటులు: సమంత, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గౌతమి తదితరులుదర్శకత్వం: నందిని రెడ్డినిర్మాణ సంస్థ: ట్రాలాలా పిక్చర్స్మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ నారాయణన్సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్విడుదల తేదీ: 19 జూన్ 2026టాలీవుడ్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో యాంకర్ శ్రీముఖి కీలక పాత్రలో కనిపించింది. అభిమానుల అంచనాల మధ్య జూన్ 19న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. సామ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.కథేంటంటే..స్వర్ణ(సమంత) , అనిరుధ్ ప్రేమ వివాహం చేసుకుంటారు. ఇది అనిరుధ్ ఫ్యామిలీ కి నచ్చకపోవడంతో కొన్నాలపాటు దూరంగా ఉంటారు. అయితే అనిరుద్ చెల్లెలు పెళ్లి ఫిక్స్ అవ్వడంతో స్వర్ణ, అనిరుద్ ఇంటికి తిరిగి వస్తారు. సాంప్రదాయ కుటుంబం కావడంతో వారికి నచ్చేలా ఉండేందుకు స్వర్ణ ప్రయత్నిస్తుంది. అదే సమయంలో స్వర్ణ గురించి జైల్లో ఉన్న కరుణ (గుల్షన్ దేవయ్య) ఆరా తీస్తాడు. ఆమె కోసమే జైలు నుంచి తప్పించుకొని వస్తాడు. అసలు స్వర్ణకు జైల్లో ఉన్న కరుణకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? స్వర్ణ గతం ఏంటి? ఝాన్సీ ఎవరు ? కరుణ నుంచి తన ఫ్యామిలీకి ఆపద ఉందని తెలిసిన తర్వాత స్వర్ణ ఏం చేసింది? చివరకు తన ఫ్యామిలీని ఎలా రక్షించుకుంది? అన్నదే మిగతా కథ.ఎలా ఉందంటే..ఓ బేబీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందిని రెడ్డి , సమంత కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో మా ఇంటి బంగారంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి . అయితే ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేదని చెప్పాలి. అలా అని తీసిపారేసే సినిమా ఏమి కాదు. ఓ బేబీ మాదిరే ఇది కూడా కుటుంబ నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్.సమంత లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక సంప్రదాయ కుటుంబంలోకి కొత్త కోడలిగా అడుగుపెడుతుంది. ఇంట్లో జరిగే రోజువారీ ఫ్యామిలీ డ్రామా, శ్రీముఖితో వచ్చే సరదా సన్నివేశాలు, సున్నితమైన హాస్యంతో ఫస్టాఫ్ సాఫీగా సాగిపోతుంది. అయితే ఇంటర్వెల్ సమయంలో సమంత గతానికి సంబంధించిన వ్యక్తులు ఎంటర్ అవ్వడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.అసలు సమంత ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్తో ఇంటర్వెల్ ట్విస్ట్ పడుతుంది. సెకండాఫ్లో ఆమె ఫ్లాష్బ్యాక్, గుల్షన్ దేవయ్య పాత్రతో ఆమెకు ఉన్న పరిచయం, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె చేసే పోరాటం చుట్టూ కథ నడుస్తుంది. ఫస్టాఫ్ కామెడీ సన్నివేశాలతో సరదాగా సాగిన సెకండాఫ్ మాత్రం కొంతమేర సాగదీసినట్లుగా అనిపిస్తుంది. దానికి తోడు విలన్ ట్రాక్ బలంగా లేకపోవడంతో చాలా సన్నివేశాలు అనవసరంగా పెట్టారన్న ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనం చాలావరకు అతడు సినిమాను గుర్తు చేస్తుంది. సెకండ్ హాఫ్ కథను ఇంకాస్త బలంగా రాసుకుని.. మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే..సమంత వన్ ఉమెన్ షో చూపించింది. ఈ మూవీలో కొత్త కోడలి పాత్రలో.. అలాగే యాక్షన్ సీక్వెన్స్లలో సమంత అద్భుతంగా నటించింది. శ్రీముఖి తన పాత్రలో ఒదిగిపోయింది. గుల్షన్ దేవయ్య మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం బాగుంది. బీజీఎం ఈ సినిమాకు ప్లస్. ఎడిటింగ్పై మరింత దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.
ఓటీటీకి దురంధర్-2.. ఆడియన్స్కు బిగ్ సర్ప్రైజ్
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ స్పై థ్రిల్లర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మొదట జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కొచ్చిన ఈ సినిమా.. నేటి నుంచి నెట్ఫ్లిక్స్లోనూ అందుబాటులోకి వచ్చేసింది.అయితే నెట్ఫ్లిక్స్లో ఓటీటీ ప్రియులకు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటి వరకు మ్యూటెడ్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ రోజు నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా అన్మ్యూటెడ్ వర్షన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం ఓవర్సీస్ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులో ఉంది. నేటి నుంచి ఇండియన్స్ ఆడియన్స్కు కూడా అన్ మ్యూటెడ్ వర్షన్ చూసే అవకాశం దక్కింది. ప్రస్తుతం దురంధర్-2 హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో సంజయ్ దత్, మాధవన్ కీలక పాత్రల్లో నటించారు.
క్రీడలు
భారత క్రికెట్కు గుడ్ బై.. వేరే దేశానికి ఆడనున్న తెలుగు ప్లేయర్
ఇటీవల భారత క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఆంధ్ర ప్లేయర్ కె.ఎస్. భరత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించిన కేవలం 15 రోజుల్లోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు భరత్ సిద్దమయ్యాడు. యూఏఈ క్రికెట్ బోర్డు నిర్వహించనున్న స్థానిక టోర్నమెంట్లో 'టీమ్ స్టాలియన్స్' (Team Stallions) జట్టు తరపున భరత్ ఆడనున్నాడు.అయితే 32 ఏళ్ల శ్రీకర్ భరత్ వెంటనే యూఏఈ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఫుల్ మెంబర్ నేషన్ నుంచి అసోసియేట్ దేశానికి వెళ్లే ఆటగాళ్లు మూడేళ్ల కూలింగ్-ఆఫ్ పీరియడ్ను పూర్తి చేయాలి. అయితే ఫిబ్రవరి 2024లో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్లో భారత్ తరపున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.అంటే అతడు యూఏఈ తరపున ఆడాలంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వేచి ఉండాల్సిందే. ఈ విశాఖ క్రికెటర్ భారత్ తరపున 7 టెస్ట్ మ్యాచ్లు ఆడి 221 పరుగులు చేశాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో మాత్రం భరత్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 113 ఇన్నింగ్స్లలో 36.53 సగటుతో 6102 పరుగులు చేశాడు. అతడి పేరిట ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. లిస్ట్-ఎ క్రికెట్లో కూడా అతడు అద్భుతంగా రాణించాడు. 83 మ్యాచ్లలో 2692 పరుగులు చేశాడు.ఇక తమ జట్టు అగ్రశ్రేణి ఆటగాళ్లలో లాంగ్-ఫార్మాట్ స్కిల్స్ను పెంపొందించే లక్ష్యంతో ఈసీబీ ఈ టూ-డే వైట్-బాల్ ఛాంపియన్షిప్ టోర్నీని నిర్వహించనుంది. ఈ టోర్నీలో టీమ్ స్టాలియన్స్, టీమ్ ఫాల్కన్స్, టీమ్ ఈగల్స్, టీమ్ లెపర్డ్స్ మొత్తం నాలుగు జట్లు పాల్గోనున్నాయి.చదవండి: 41 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. 7 ఫోర్లు, 9 సిక్సర్లతో విధ్వంసం
41 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. 7 ఫోర్లు, 9 సిక్సర్లతో విధ్వంసం
సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తనలో ఏ మాత్రం జోరు తగ్గలేదని మరోసారి నిరూపించాడు. అమెరికా మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ 2026 సీజన్ తొలి మ్యాచ్లో డుప్లెసిస్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ టోర్నీలో టెక్సాస్ సూపర్ కింగ్స్కు సారథ్యం వహిస్తున్న ఫాఫ్.. శుక్రవారం సీటెల్ ఓర్కాస్తో జరిగిన మ్యాచ్లో విధ్వంసం సృష్టించాడు.221 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఈ ప్రోటీస్ ఆటగాడు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. 41 ఏళ్ల డుప్లెసిస్ కేవలం 52 బంతుల్లోనే 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 113 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడితో పాటు రుసో(21 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్స్లతో 49), వియాన్ ముల్డర్(15 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ఫలితంగా సూపర్ కింగ్స్ టార్గెట్ను కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది.సీఫర్ట్ సెంచరీ వృథామొదట బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ భారీ(66 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 104 పరుగులు)సెంచరీతో కదం తొక్కాడు. అతడితో పాటు మరో ఓపెనర్ షాయన్ జహంగీర్ (78 పరుగులు) హాఫ్ సెంచరీతో సాధించాడు. వీరిద్దరూ మొదటి వికెట్కు 191 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టెక్సాస్ బౌలర్లలో మిల్నే, హస్మి డిసిల్వా తలా వికెట్ సాధించారు.ఐపీఎల్కు దూరంకాగా ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్-2026 సీజన్లో పాల్గోనలేదు. వేలానికి ముందే అతడు తప్పుకొన్నాడు. ప్లేయర్గా తప్పకొన్నప్పటికి వ్యాఖ్యతగా మాత్రం తన సేవలను డుప్లెసిస్ అందించాడు. అంతకంటే ముందు గాయం కారణంగా సౌతాఫ్రికా లీగ్ టీ20 టోర్నీలో కేవలం ఐదు ఇన్నింగ్స్లు మాత్రమే ఆడాడు.చదవండి: గంభీర్పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్!
‘బ్యాటింగ్ మా ప్రధాన బలం.. సీక్రెట్ వెపన్ అతడే!’
ఆదివారం నుంచి ఉప్పల్ వేదికగా టీజీ 20 లీగ్ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్వితా ఖమ్మం ఏసెస్ జట్టుతో సాక్షి మీడియా ముచ్చటించింది. ఈ నేపథ్యంలో జట్టు బలాలు, బలహీనతలపై ఖమ్మం ఏసెస్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అన్ని జట్లతో పోలిస్తే బ్యాటింగ్ తమ ప్రధాన బలమని ఖమ్మం కోచ్ అభిజీత్ పేర్కొన్నారు. అయితే జట్టులో ఉన్న ఒక సీక్రెట్ ఆయుధాన్ని గ్రౌండ్లోనే వాడనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆ సీక్రెట్ ప్లేయర్ ఎవరనేది మాత్రం తాము రివీల్ చేయబోవవడం లేదని పేర్కొన్నారు. ఖమ్మం జట్టు కెప్టెన్ సీవీ మిలింద్ మాట్లాడుతూ.. టీ20 20లీగ్ అనేది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆటగాళ్లకు రంజీల్లోకి వెళ్లడానికి ఇదొక మంచి అవకాశంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ఐపీఎల్ సహా ఇతర లీగ్స్కు కూడా ఆడేందుకు ఇలాంటి లీగ్లు తమ లాంటి ఆటగాళ్లకు కీలకంగా మారుతుందని తెలిపాడు. తమ జట్టులో లెగ్ స్పిన్నర్గా వేద్రెడ్డి అత్యంత పిన్న వయస్కుడిగా ఉన్నాడని, అతడు తన స్పిన్తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. కార్యక్రమంలో కెప్టెన్ సీవీ మిలింద్తో పాటు వైస్ కెప్టెన్ హిమతేజ, లెగ్ స్పిన్నర్ వేద్ రెడ్డి, ఓపెనర్ ప్రతీక్రెడ్డి పాటు ఇతర క్రికెటర్లు పాల్గొన్నారు. ఇక ఖమ్మం ఏసెస్ జట్టును అన్వితా గ్రూప్ సొంతం చేసుకుంది. ఇక ఖమ్మం ఏసెస్ జట్టు తన తొలి మ్యాచ్ను జూన్ 21న పాలమూరు స్ట్రైకర్స్తో ఆడనుంది.
మీ వల్ల గందరగోళంలో శుబ్మన్ గిల్: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరును భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విమర్శించాడు. అఫ్గానిస్తాన్తో రెండో వన్డేలో టాపార్డర్లో మార్పులు చేయడాన్ని తప్పుబట్టాడు. కాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.తొలుత ధర్మశాలలో అఫ్గాన్ను చిత్తు చేసిన భారత జట్టు.. లక్నో వేదికగా బుధవారం రెండో వన్డేలో అఫ్గాన్ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ ఘనత సాధించింది. తద్వారా వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఖాతాలో తొలి సిరీస్ విజయం చేరింది.ఇదిలా ఉంటే.. అఫ్గాన్తో రెండో వన్డేలో టీమిండియా తమ ఓపెనింగ్ జోడీని మార్చింది. కెప్టెన్ శుబ్మన్ గిల్కు బదులు.. యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మతో పాటు ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, చాన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జైసూ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు.మరోవైపు.. రోహిత్ 48 పరుగులు చేయగా.. వన్డౌన్లో వచ్చిన గిల్ భారీ శతకం (154)తో దుమ్ములేపాడు. ఇక గత మ్యాచ్లో మూడో స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్.. ఈసారి నాలుగో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగి మెరుపు సెంచరీ (79 బంతుల్లో 125)తో అదరగొట్టాడు. అయితే, ఈ మార్పులతో జట్టు భారీ విజయం సాధించినప్పటికీ మనోజ్ తివారీ మాత్రం నాయకత్వ బృందాన్ని విమర్శించాడు.క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘భవిష్యత్తులో తలనొప్పిగా మారడం తప్ప ఈ ప్రయోగంతో ఎలాంటి ప్రయోజనం లేదు. రోహిత్ శర్మతో యశస్వి జైస్వాల్ను ఓపెనింగ్ చేయించి శుబ్మన్ గిల్ను వన్డౌన్కి డిమోట్ చేశారు. ఆ స్థానంలో గిల్ భారీగా పరుగులు రాబట్టాడు.ఇప్పుడా విషయం గందరగోళానికి కారణం కావొచ్చు. నేను మళ్లీ ఓపెనర్గా వెళ్లాలా? లేదంటే వన్డౌన్లోనే ఆడాలా అని గిల్ కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు యాజమాన్యం ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. ఇక్కడ స్పష్టత లోపించింది.ఏదేమైనా జైస్వాల్ను ఆడించడం మంచి విషయం. ఎందుకంటే అతడు అన్ని ఫార్మాట్లలో ఆడగల సమర్థుడు. అతడికి మళ్లీ అవకాశం రావడం హర్షణీయం. ఇక రోహిత్ శర్మ అఫ్గన్తో రెండో వన్డేలో పెద్దగా దూకుడు ప్రదర్శించలేదు. అతడిపై బయటి నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది’’ అని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు.
న్యూస్ పాడ్కాస్ట్
సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే... గిగ్ వర్కర్ సాయికృష్ణ లాకప్డెత్ ఘటనలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
తలెగరేస్తే మళ్లీ బాంబులేస్తాం... ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
‘సర్’పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. వైఎస్సార్సీపీ నేతలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం
వైఎస్సార్ సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా ‘సర్’ పేరుతో టీడీపీ యాప్
ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి... వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేయడం హేయం... చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్లో హైఅలర్ట్... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
ఏపీలో చంద్రబాబు దగా పాలనపై ప్రజా ఉద్యమం... ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ ర్యాలీల్లో ఉప్పొంగిన జనహోరు
దగా ‘డీఎస్సీ’.. ‘మెగా’ స్కామ్!. చంద్రబాబు సర్కారుపై మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్...
నేడు విశాఖకు వైఎస్ జగన్మోహన్రెడ్డి... స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ
బిజినెస్
బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడంతే.. రూ.5 కోట్లు జాక్పాట్!
సాధారణంగా అందరికీ బ్యాంకు అకౌంట్లు ఉంటాయి. ఒకటో తారీఖున అలా జీతం పడగానే మొత్తం ఖర్చయిపోతుంది.. నెలాఖరుకు వచ్చేసరికి ఖాతా ఖాళీ అవుతుంది. ఇదీ సగటు జీవుడి బ్యాంక్ ఖాతా చిత్రం. నెల చివర్లో తమ ఆర్థిక దుస్థితిని తెలియజేసేందుకు కొందరు ఖాళీ అయిన తమ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ను స్క్రీన్ షాట్లు తీసి సరదాగా స్టేటస్లు కూడా పెట్టుకుంటుంటారు. అయితే ఇలా బ్యాంక్ అకౌంట్తోనే జాక్పాట్ కొట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా?అబుదాబిలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన 34 ఏళ్ల షాజీర్ వెంగా అనూహ్యంగా రూ.5 కోట్లకు పైగా నగదు బహుమతిని గెలుచుకుని వార్తల్లో నిలిచాడు. యూఏఈకి చెందిన షార్జా ఇస్లామిక్ బ్యాంక్ (Sharjah Islamic Bank) నిర్వహిస్తున్న ‘ఎస్ఐబీ మిలియనీర్’ సేవింగ్స్ రివార్డ్స్ ప్రచారంలో ఆయనకు 20 లక్షల దిర్హమ్లు (సుమారు రూ.5.15 కోట్లు) గ్రాండ్ ప్రైజ్గా లభించింది. షాజీర్ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరిచి ఇంకా రెండు నెలలు కూడా పూర్తికాకముందే ఈ భారీ బహుమతి అతని ఖాతాలో పడటం విశేషం.బ్యాంకు వెల్లడించిన వివరాల ప్రకారం.. షాజీర్ ఎస్ఐబీ డిజిటల్ యాప్ ద్వారా సేవింగ్స్ ఖాతా ప్రారంభించాడు. అనంతరం జూన్ 2026 డ్రాలో అతని పేరు గ్రాండ్ ప్రైజ్కు ఎంపికైంది. అదే డ్రాలో యూఏఈకి చెందిన మోజా అల్షంసీ లగ్జరీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం కారును గెలుచుకోగా, మరో 40 మంది నగదు బహుమతులు అందుకున్నారు.దీనిపై స్పందించిన షాజీర్.. “ఎస్ఐబీ మిలియనీర్ ప్రచారం గురించి ముందే తెలుసు. ఏదో ఒకరోజు నేను కూడా విజేతగా నిలుస్తానని ఆశించేవాడిని. కానీ ఇంత త్వరగా అదృష్టం వరిస్తుందని ఊహించలేదు. ఈ 20 లక్షల దిర్హమ్లు నా జీవితాన్నే మార్చేస్తాయి. భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడమే కాకుండా, భారత్లో ఉన్న నా కుటుంబాన్ని యూఏఈకి తీసుకురావాలనే కలను సాకారం చేస్తాయి” అని పేర్కొన్నాడు.కస్టమర్లలో పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు షార్జా ఇస్లామిక్ బ్యాంక్ 2025లో ‘ఎస్ఐబీ మిలియనీర్’ ప్రచారాన్ని ప్రారంభించింది. అర్హత కలిగిన సేవింగ్స్ లేదా డిపాజిట్ ఖాతాల్లో ప్రతి 10,000 దిర్హమ్ల బ్యాలెన్స్కు ఒక డ్రా ఎంట్రీ లభిస్తుంది. ఏడాది పొడవునా కోట్ల రూపాయల విలువైన నగదు బహుమతులు, లగ్జరీ వాహనాలు ఈ పథకం ద్వారా అందజేస్తున్నారు. బ్యాంకు అధికారుల ప్రకారం, రాబోయే డ్రాల్లో కూడా ఒక్కోటి 10 లక్షల దిర్హమ్ల విలువైన రెండు ప్రధాన నగదు బహుమతులు ప్రకటించనున్నారు.Congratulations to the winners of SIB Millionaire Draw!Mr. Shajeer Venga won the Grand Cash Prize of AED 2 Million, and Mrs. Moza Butti won a BMW XM.We also congratulate forty other winners who received valuable cash prizes.Start your journey towards achieving a million… pic.twitter.com/osCjwVraHs— Sharjah Islamic Bank (@shjislamicbank) June 16, 2026
త్వరలో ‘ఇంధన అత్యవసర’ ఆంక్షల ఎత్తివేత!
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ మార్కెట్ రక్షణ కోసం అమలు చేసిన ‘ఇంధన అత్యవసర’ ఆంక్షలను అంతర్జాతీయ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత దశలవారీగా ఉపసంహరించే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి గురువారం వెల్లడించారు. ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య 111 రోజుల యుద్ధానికి ముగింపు పలికే మధ్యంతర ఒప్పందం కుదిరింది. దీంతో వ్యూహాత్మకంగా కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధి ద్వారా నౌకాయాన కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి రానుండటం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటైన భారతదేశానికి భారీ ఊరటనిచ్చే అంశం.ముందస్తు రక్షణ చర్యలుగా ఆంక్షలు ఫిబ్రవరి చివరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి చమురు, సహజ వాయువు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. ముడి చమురు ధరలు, షిప్పింగ్ భీమా ప్రీమియంలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. సంక్షోభం తీవ్రరూపం దాల్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పలు అత్యవసర ప్రత్యామ్నాయ చర్యలను అమలు చేసింది. అందులో భాగంగా... ఎల్పీజీ సరఫరాలపై నిఘా పెంచింది. సిలిండర్ల అక్రమ రవాణా, నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్పై కఠిన నిబంధనలు తెచ్చింది. ఇందులో భాగంగానే పెట్రోకెమికల్స్ ఉత్పత్తికి వాడే గ్యాస్ను ఎల్పీజీ వైపు మళ్లించాలని రిఫైనరీలను ఆదేశించింది.హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాను తగ్గించడంతో పాటు, గృహ వినియోగదారుల సిలిండర్ బుకింగ్ వ్యవధిని పెంచి నిల్వలను నియంత్రించింది. గృహ అవసరాలు, రవాణా (సీఎన్జీ), ఎరువుల రంగానికి ప్రాధాన్యత ఇస్తూ దేశీయ సహజ వాయువు కేటాయింపుల్లో మార్పులు, చేర్పులు చేసింది.‘‘ఈ ఆంక్షలన్నీ కేవలం ముందస్తు నివారణా చర్యలే. అంతర్జాతీయంగా చమురు మార్కెట్ స్థిరపడి, సరఫరా ముప్పు తొలగిపోగానే ఈ ఆంక్షలను దశలవారీగా ఉపసంహరిస్తాం’’ అని అధికారి స్పష్టం చేశారు.చమురు కంపెనీలకు రోజూ రూ.550 కోట్ల నష్టం యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్కు 70–72 ডy్థయి నుంచి గరిష్టంగా 119 డాలర్లకు చేరుకున్నాయి. అయితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం కొంతకాలం పాటు పెరగకుండా నియంత్రించింది. మార్చి 27న పశి్చమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.10 చొప్పున కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అనంతరం ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ.7.50 చొప్పున, సీఎన్జీ ధరలను కిలోకు రూ.6 మేర పెంచింది.గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై రెండు విడతల్లో మొత్తం రూ.89 పెంపు అమలు చేసింది. ఈ ధరల పెంపు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ధరలతో పోలిస్తే దేశీయ రిటైల్ ఇంధన ధరలు ఇంకా తక్కువగానే ఉండటంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఇప్పటికీ రోజుకు సుమారు రూ.550 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయని అధికారి వెల్లడించారు. గత రెండు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మూడు నెలల కనిష్టానికి పతనమమయ్యాయి. గురువారం బ్యారెల్ ధర సుమారు 78 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
కుప్పకూలిన బంగారం, వెండి రేట్లు
దేశంలో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. నాలుగు రోజులుగా తగ్గుదల బాట పట్టిన పసిడి ధరలు నేడు (Today Gold Rate) మరింత భారీగా పతనమయ్యాయి. దీంతో కొనుగోలుదారులకు మరింత ఉత్సాహం కలుగుతోంది. ఇక వెండి ధరలు(Today Silver Rate) కూడా పెద్ద మొత్తంలో క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం..
ఐటీ షేర్లు ఢమాల్.. స్టాక్ మార్కెట్ పతనం
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. భారతీయ బెంచ్ మార్క్ సూచీలు పతనమయ్యాయి. ఈరోజు ఉదయం 9:50 సమయానికి నిఫ్టీ(Nifty) 197.60 పాయింట్లు లేదా 0.82 శాతం క్షీణించి 23,970.40 వద్ద, సెన్సెక్స్(Sensex) 721.13 పాయింట్లు 0.93 పతనంతో 76,688.84 వద్ద ట్రేడవుతోంది.ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.55 శాతం, 0.19 శాతం నష్టపోయాయి.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ దాదాపు 6 శాతం క్షీణతతో అత్యధికంగా నష్టపోయింది. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా భారీగానే నష్టాలనే నమోదు చేశాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి.
ఫ్యామిలీ
హఠ యోగా అంటే..? అమెరికన్లు ఇష్టపడటానికి కారణ ఇదేనా..
ఇవాళ ఉరుకుల పరుగుల కాలంలో యోగా మళ్లీ అందరి జీవితంలో భాగమయ్యేలా క్రేజ్ సంతరించుకుంటుంది. ఆధునికంగా జిమ్, ఏరోబిక్ వంటి ఎన్నో రకాల వర్కౌట్లు ఉన్నా ప్రముఖులు, సెలబ్రిటీల వరకు అంతా యోగాకే ప్రాముఖ్యత ఇవ్వడం విశేషం. అదీగాక మరి కొద్దిరోజుల్లోనే(జూన్ 21)న యోగా దినోత్సవం పురస్కరించుకుని అమెరికన్లు అంతగా మెచ్చే హఠయోగా గురించి సవివరంగా తెలుసుకుందామా.!. గూగుల్స్ ట్రెండ్స్ డేటా ప్రకారం అమెరికన్లు ఎంత ఇష్టపడే సాధాన హఠ యోగా. ఇది శారీరక భంగిమలు, మైండ్ఫుల్నెస్తో చేసే శ్వాస పద్ధతులను మిళితం చేసే సాంప్రదాయ యోగా. ఇది శరీరం, మనస్సు మధ్య బలమైన బంధాన్ని సృష్టించడంపై దష్టిసారించడం వల్లే ప్రజలు అంతగా ఆకర్షితులవ్వుతారని చెబుతున్నారు ప్రముఖ యోగా నిపుణులు. హఠ యోగా అంటే..హఠ యోగా అత్యంత పురాతనమైన..చాలామంది ఆచరించే యోగా రూపాలలో ఒకటి. సాంప్రదాయకంగా, ఇది ఆసనాలు, శ్వాసవ్యాయామాలు, ధ్యానంతో మిళితమయ్యే యోగా ప్రక్రియ. నెమ్మదైన కదలికలతో ఆసనాల్లో ఎక్కువసేపు ఉండాల్సి ఉంటుంది. ఈ పేరులోని 'హా', 'ఠ'లను సూర్యచంద్రులకు ప్రతీకలుగా చెబుతారు యోగా నిపుణులు. అందువల్ల ఇది శరీరం-మనస్సు మధ్య ఘర్షణను శాంతపరిచేలా సమతుల్యత తీసుకురావడాన్ని లక్ష్యంగా చేసుకుంటుందట. అమెరికన్లు ఇష్టపడటానికి రీజన్..ప్రారంభకులు సలుభంగా చేయగలిగేలా ఉండటం తోపాటు అధిక తీవ్రత గల ఫిట్నెస్ తరగతులకు భిన్నంగా నెమ్మదైన కదలిక, శ్వాసపై ఫోకస్ తదితరాల వల్ల ఈజీగా చేయగలమనే నమ్మకంతో ఇష్టపడుతున్నారనేది వాదన. కొందరు కఠినమైన వ్యాయమాల కంటే ఇది శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్గా, హెల్దీగా ఉండేలా చేస్తుందని ప్రగాఢంగా విశ్వసించడం మరొక కారణం. అదీగాక ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడి, నిరాస నిస్ప్రుహలను ఎదుర్కొనడం అధికమవ్వడం వల్లే ఈ హఠ యోగాకి ఆదరణ పెరిగిందని అంటున్నారు యోగా నిపుణులు. కలిగే ఉపయోగాలు..ఏకాగ్రతను పెంచుతుంది. దీనిలోని శ్వాన వ్యాయామాలు భావోద్వేగ పరిస్థితులను హ్యాండిల్ చేసే శక్తిని అందించి ప్రశాంతతను చేకూరుస్తాయి. ఒత్తిడితోకూడని పనివేళలు, డిజిటల్ పరధ్యానంకు చెక్పెట్టే గొప్ప సాధనవర్తమానంలో ఉండగలిగే శక్తిని అందిస్తుంది. ఇది శరీరానికి వ్యాయమానికి మించింది కూడా. ధ్యానానిక పునాదిగా మారుతుంది. ఈ కారణాల వల్లే అమెరికన్లు హఠయోగకి ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు యోగా నిపుణులు. అక్కడ ఇది ఒక ఫిట్నెస్ ట్రెండ్కి మించిందని చెబుతుండటం విశేషం. యోగా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింది లింక్పై క్లిక్ చేయండి
90లలోనే అతిలోక సుందరి శ్రీదేవి ఆ ఫ్యాషన్ సాహసం..! ఇవాళ అదే..
ఇవాళ ఫ్యాషన్ రంగం ఏ రేంజ్లో ట్రెండ్స్ని సృష్టిస్తూ..లేటెస్ట్ డిజైనర్వేర్లను తీసుకోస్తుందో తెలిసిందే. యువత సైతం వాటిని అనుకరిస్తూ..సోషల్ మాధ్యమాల్లో సరికొత్తట్రెండ్ని సృష్టిస్తున్నారు కూడా. ఇవాళ ఫ్యాషన్ ప్రమాణాలు ఏ రేంజ్లో అదరగొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకు అనుగుణంగా టెక్నాలజీ..కుప్పలకొద్ది డిజైనర్లు, క్రియేటివిటీలు అందుబాటులో ఉన్నాయి. కానీ 90వ దశకంలో పరిస్థితి వేరు. అప్పట్లో దేశం తన మూలాలకు కట్టుబడి ఉంటూనే..అంతర్జాతీయ శైలిని అందిపుచ్చుకుని గ్లోబల్ గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. అందువల్ల ఆ సమయంలో గ్లామర్ ప్రపంచం అందర్నీ ఆకర్షించడం అనేది అత్యంత కష్టమైన సవాలుగా ఉండేది. అయితే అప్పటి ఫ్యాషన్ దిగ్గజాలు ఆ సవాలుని చాలా సర్థవంతంగా ఎదుర్కొన్నారు. వారిలో మన టాలీవుడ్ ముద్దుగుమ్మ, అతిలోక సుందరీ శ్రీదేవి ఒకరు. అవును ఆ నాడు ఫ్యాషన్ నెమ్మదిగా పురుడు పోసుకుంటున్న సమయంలోనే ఆమె అతిపెద్ద సాహసం చేశారు. కానీ ఇవాళ ఆ స్టైల్ ట్రెండీగా మారింది. ఆ కాలంలోనే శ్రీదేవి ఆ ట్రెండ్ని సెట్ చేసిన ఘనత అందుకుందామె. ఏంటో ఫ్యాషన్ స్టైల్, దాని విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.అందుకు సంబంధించిన విషయాలను డిజైనర్ నీతా లుల్లా ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. శ్రీదేవి 1993లో వచ్చిన గోవింద మూవీ కోసం మెటాలిక్ హుడెడ్ డ్రెస్ ధరించారు. అది ఇవాళ సర్వసాధారణం. కానీ 90లలో ఫ్యాషన్లో ఓ కొత్త ఒరవడిని సృష్టించిన స్టైల్ ఇది. ఆ దుస్తులను ముంబైకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా రూపొందించారు. దీన్ని మెటల్ మెష్తో (లోహాపు వల వంటి నిర్మాణంతో) ఒకే లైనింగ్ దీనిని తయారు చేయడం విశేషం. దీని డిజైనింగ్లో ఇదే ప్రత్యేకతని అన్నారు. అందువల్లే తాను ఆ మూవీ షూటింగ్ కోసం చిన్నబ్యాగులో హైదరాబాద్కి తీసుకురాగలిగానని అన్నారామె. అయితే ఎయిర్పోర్ట్లో చూడటానికి చిన్న బ్యాగు..కానీ ఏకంగా 25 గ్రాముల బరువు ఎందుకు తూగుతుందని ఎయిర్పోర్టు అధికారులు అడిగారు. అప్పుడు వారికి ఆ డిజైనర్ వేర్ని ఓపెన్ చేసి..మెటల్తో తయారు చేయడం వల్ల ఇంత బరువు తూగుతోందని వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటూ నాటి సంఘటననను గుర్తు చేసుకున్నారు లుల్లా. ఇదొక్కటే కాదు ఆమో మరో మెటాలిక్ దుస్తులను అప్పట్లోనే ధరించి అప్సరసలా కనిపించి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశారని ఆ సంఘటననకు కూడా ప్రస్తావించారు. బాలీవుడ్ మూవీ "మిస్టర్ ఇండియా"లో 'హవా హవాయి' పాటలో ఆమె ధరించిన బంగారు వర్ణపు, దుస్తులు అప్సరసను తలపించేలా లుక్ని అందించింది. కేటీ కట్రాక్ రూపొందించిన ఈ దుస్తులలో ప్రత్యేకమైన ఆకృతినిచ్చే టాజిల్స్, కదలికకు అనుగుణంగా ఉండే పూసల పనితనం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాగే తలపై ధరించిన అలంకారప్రాయమైన, మెరిసే శిరోభూషణం (headpiece) మరింత హైలెట్గా కనిపించింది. ఇప్పుడు అదేస్టైల్ 2022లో అమెరికా బ్యూటీ మొగల్ కైలీ జెన్నర్ అచ్చలం అలానే మెడ, తల చుట్టూ హుడ్లాగా చుట్టుకుని మెరిసే సిల్వర్ మెటాలిక్ దుస్తులను ధరించారు. అక్కడ ఫెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ వింటేజ్ పాకో రబానీ ఈ డిజైనర్వేర్ని డ్యూయల్-టోన్డ్ డెనిమ్స్తో సింపుల్ స్టైలింగ్ను జతచేశారు. ఈ ఇద్దరు అందాల తారల మధ్య అద్భుతమైన పోలిక కనిపిస్తున్నప్పటికీ..ఆమె స్టైలిస్ట్ ఈ లుక్ని శ్రీదేవి లుక్తో పోల్చలేదు కానీ..దశాబ్దాలక్రితమే ఈ స్టైల్ ట్రెండ్ని సెట్ చేశారనేది నమ్మక తప్పని నిజం అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా. View this post on Instagram A post shared by Neeta Lulla (@neeta_lulla) (చదవండి: పీసీఓఎస్తో జస్ట్ రెండు నెలల్లో తొమ్మిది కిలోలు..! కానీ ఆ ఐదు పొరపాట్లు..)
పీసీఓఎస్తో జస్ట్ రెండు నెలల్లో తొమ్మిది కిలోలు..!
సాధారణంగా బరువు తగ్గడం అనేది సవాలుతో కూడుకున్నది. అందులోనూ పీసీఓఎస్ అంటే అంత సులభం కాదు బరువు తగ్గడం. అలాంటిది ఈ కంటెంట్ క్రియేటర్ జస్ట్ రెండు నెల్లలోనే ఏకంగా తొమ్మిది కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకోసం తానే ఏం చేసింది? ఎలాంటి ట్రిక్స్ ఫాలో అయ్యిందో షేర్ చేసుకుంది. మరి అవేంటో చూద్దామా..!.పీసీఓఎస్తో బరువు తగ్గడం అనేది అసంభవం అనిపించే సవాలులా ఉంటుంది. పైగా అందరికీ ఈ సమస్య ఒకేలా ఉండదు. అలాగే అందరికీ సరిపోయే డైటింగ్, వ్యాయామాలు ఉండవు. అలాంటిది కంటెంట్ క్రియేటర్ తాన్య మాత్రం పీసీఎస్ని ఆరోగ్యవంతంగా నిర్వహించుకుంటూనే బరువు తగ్గిందామె. పైగా ఎలాంటి కఠినమైన ఆహార నియామాలు, తీవ్రమైన వ్యాయమాల జోలికి పోకుండా నిలకడగా జీవనశైలి మార్పులను పాటించానని అంటోంది. అంతేగాదు తాను ఎలా బరువు తగ్గిందో కూడా షేర్ చేసుకున్నారామె. ఆమె కేవలం రెండు నెలల్లో 75 కిలోల నుంచి 66 కిలోలు అంటే మొత్తం 9 కిలోలు తగ్గినట్లు పేర్కొంది. అయితే ఇలా పీసీఓఎస్తో బరువు తగ్గే ప్రయత్నంలో తాను ఆ ఐదు తప్పిదాలను చేయకుండా జాగ్రత్తపడ్డానని అంటోంది. అందువల్ల ఇంత సులభంగా బరువు తగ్గానని పంచుకుంది. చేయకూడని తప్పిదాలు..అల్పాహారం మానేయడంతాన్య ప్రకారం, అల్పాహారం మానేయడం తాను చేసిన అతిపెద్ద తప్పులలో ఒకటి. చాలా కాలం పాటు, తక్కువ తినడం వల్ల వేగంగా బరువు తగ్గుతానని నమ్మేదాన్ని అంటోంది. అయితే, ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారంపై దృష్టి పెట్టడం ప్రారంభించాక పరిస్థితులు మారాయని వెల్లడించింది.అంతులేని కార్డియో చేయడంగంటల తరబడి కార్డియో చేయడమే బరువు తగ్గడానికి కీలకం అని చాలా మంది అనుకుంటారు. తాన్య దీనితో ఏకీభవించదు. అంతులేని కార్డియో సెషన్లతో తనను తాను బలవంతం చేసుకోవడం కంటే, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, క్రమం తప్పకుండా నడవడం తనకు చాలా బాగా పనిచేశాయని ఆమె చెప్పింది.ఆహారానికి భయపడటంతాను వదిలేసిన మరో అలవాటు ఆహారాన్ని శత్రువులా చూడటం అని చెబుతోంది తాన్య. PCOS ఉన్నంత మాత్రాన పస్తులుండటం లేదా క్రాష్ డైట్లపై ఆధారపడటం కానేకాదని అంటోందామె. బదులుగా ప్రోటీన్తో కూడిన సరైన భోజనమే ఎంతో మేలు చేస్తుందని చెబుతోంది.పానీయాల ద్వారా కేలరీలు తీసుకోవడంచక్కెర పానీయాలలో దాగి ఉన్న కేలరీల గురించి కూడా తాన్య ప్రస్తావించింది. ఫ్యాన్సీ కాఫీ డ్రింక్స్ నుంచి ప్యాకేజ్డ్ జ్యూస్ల వరకు, ఈ పానీయాలు కడుపు నిండినట్లు అనిపించకుండానే అదనపు కేలరీలను చేర్చగలవు. ఇలాంటి పానీయాలు ఇన్సులిన్ స్థాయిలను కూడా పెంచుతాయని, PCOS ఉన్న చాలా మంది మహిళలు దీన్ని నియంత్రించడానికి ప్రయత్నించరని అన్నారామె.అనారోగ్యకరమైన అలవాట్లను తేలిగ్గా తీసుకోవడంకొందరు అనారోగ్యకరమైన అలవాట్లని తెలిసి కూడా చాలా తేలిగ్గా తీసుకుంటుంటారు. ఏదో అప్పడప్పుడూ అంటూ ఆ అలవాట్లకు దూరంగా ఉండరు. ఇక్కడ కేవలం తన రూపానికి సంబంధించి కాదు బరువు తగ్గడం, ఇది తన మొత్తం ఆరోగ్య శ్రేయస్సుకి సంబంధించింది అని భావించి ఆ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అంటోంది తాన్య. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ని తగ్గించుకునే యత్రం చేయాలి. ఇది కేవలం రూపం కోసం కాదు భవిష్యత్తులో ఆరోగ్య ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి పీసీఓఎస్ని మెరుగ్గా నిర్వహించుకోవడానికి అన్న దృక్పథంతో జాగుకరకతతో బరువు తగ్గే ప్రయత్నం చేస్తే..సత్ఫలితాలను అందుకోగలమని అంటోంది. అందుకోసం తీవ్రమైన ఆహార నియమాలు లేదా కఠినమైన వ్యాయామాలు కంటే నిలకడగా పాటించే అలవాట్లు, సమతుల్య భోజనం, శక్తినిచ్చే శిక్షణ, దీర్ఘకాలిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వంటివి మంచి మార్పుని తీసుకొస్తాయని నమ్మకంగా చెబుతోంది కంటెంట్ క్రియేటర్ తాన్య. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Tanya (@tanyabackstage) (చదవండి: స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్, ఉప్పుతో స్వాగతం..! ఆహారంతో స్వాగతం పలికే దేశాలివే..)
హెల్త్... లీసా రే ఆఫ్ హోప్
లీసారే అనే పేరు వింటే వెంటనే గుర్తు రాక పోవచ్చేమో కానీ టక్కరి దొంగ’లో మహేశ్ బాబు హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొస్తుంది. బోంబే డైయింగ్ బ్రాండ్ మోడల్గా ఒకనాడు ఫ్యాషన్ ప్రపంచపు క్వీన్గా వెలుగొందిన ఈ జన్మతః కెనడియన్ బ్యూటీ... బాలీవుడ్, హాలీవుడ్ నటిగా, టీవీ కార్యక్రమాల హోస్ట్గా, రచయిత్రిగా అనేక పాత్రల్లో నిర్విరామంగా రాణిస్తూనే ఉన్నారు.చాలా చిన్న వయసులోనే బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన లీసా రే దానిని జయించడంతో పాటు ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిగా మారి... రెట్టించిన ఉత్సాహంతో విభిన్న రంగాల్లో దూసుకు పోతున్నారు. వ్యక్తిగత జీవితానుభవాల నుంచి వచ్చిన ఆలోచనలతో ఇటీవలే మధ్య వయసు మహిళల ఆరోగ్య సమస్యలు చికిత్సా కార్యక్రమాల కోసం ‘నూహెర్’ను ప్రారంభించారు. ఈ సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆమె సాక్షితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...నూహెర్’ ఆవిర్భావానికి ప్రేరణ అదే...క్యాన్సర్ చికిత్స సమయంలో కీమోథెరపీ ఫలితంగా, 37 ఏళ్ల వయసులోనే మెనోపాజ్ దశలోకి ప్రవేశించాను. హార్మోన్ల మార్పుల సహా నా శరీరంలోకి చొచ్చుకుని వచ్చే అనారోగ్యాల్ని అర్థం చేసుకునే అవగాహన లేక అలసట, నిద్రలేమి, మతిమరుపు నీరసం వంటివన్నీ బతకడానికి చెల్లించాల్సిన మూల్యంలా మారాయి. అయితే పెరిమెనోపాజ్ను ఎదుర్కొంటున్న స్నేహితులతో సంభాషణల ద్వారా, చాలామంది ఇదే గందరగోళంలో ఉన్నారని గ్రహించాను.అప్పుడే ’నూహెర్’ ఆవిర్భవించింది. మన దగ్గర మధ్యవయస్సు ఆరోగ్యంపై మౌనం తరతరాల వారసత్వంగా మారింది. చర్చించడానికి ఇబ్బందిపడే విషయాలలో మెనోపాజన్ ఒకటి. ఒక మహిళ విలువ ఆమె పునరుత్పత్తి వయస్సుతో ముడిపడి ఉంటుందనే భావన. అందుకే చాలామంది మహిళలు అసౌకర్యాన్ని భరించడానికి అలవాటుపడ్డారు.శరీరంపై అవగాహన మార్చిన క్యాన్సర్...నా శరీరంతో నాకున్న సంబంధాన్ని క్యాన్సర్ సమూలంగా మార్చేసింది. దానికిముందు, నా జీవితంలో ఎక్కువ భాగం బాహ్య రూపానికే ప్రాధాన్యతనిస్తూ గడిచింది. స్త్రీత్వం అనేది యవ్వనం, సంతానోత్పత్తి లేదా రూపంతో నిర్వచించేది కాదని గ్రహించాను. నిజమైన బలంలో భావోద్వేగ, మానసిక శారీరక ఆరోగ్యం ఇమిడి ఉంటాయని నా అనుభవం నాకు నేర్పింది.వృద్ధాప్యం సమస్య కాదు...యవ్వనాన్నే అందానికి ఏకైక కొలమానంగా భావించే సంస్కృతిలో జీవిస్తున్నాం, కానీ అందం కాలక్రమేణా మారుతుందని నేను నమ్ముతాను. మహిళలు... వృద్ధాప్యం అనేది పరిష్కరించాల్సిన సమస్య కాదని గుర్తించడమే మొదటి అడుగు. మీ విలువ ఎప్పటికీ యవ్వనంగా కనిపించడంతోనే ముడిపడి లేదని అర్థం చేసుకోవడం నుంచే ఆత్మవిశ్వాసం వస్తుంది. అందుకే నేను ‘వృద్ధాప్యాన్ని ప్రోత్సహించడం‘ గురించి మాట్లాడుతుంటాను, మనం అసాధ్యమైన ప్రమాణాలను వెంబడించడం కంటే జీవశక్తిని ఆస్వాదించాలని నమ్ముతాను.మహిళలూ మిమ్మల్ని మీరు గుర్తించండి...ఎంతోమంది మహిళలు దశాబ్దాల పాటు ఇతరుల అవసరాలకే ప్రాధాన్యతనిస్తూ, లక్షణాలు విస్మరించలేనంత తీవ్రమయ్యే వరకు తమ ఆరోగ్య సమస్యల్ని వాయిదా వేస్తూ ఉంటారు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడం స్వార్థం కాదు, అది అత్యవసరం. మధ్యవయస్సు అనేది మిమ్మల్ని మీరు పునఃసమీక్షించుకోవడానికి మీపై మీరు పెట్టుబడి పెట్టడానికి వచ్చిన సందర్భం. మీరు ప్రతిరోజూ ఇతరులకు ఇచ్చే అదే శ్రద్ధ, ఆప్యాయత, కరుణ పొందడానికి మీరు కూడా అర్హులని గుర్తించండి.నా మానసిక ఆరోగ్యం... వ్యాపకాల్లోనే...యోగా, ధ్యానం ప్రకృతిలో గడపడం వంటివి నాకు అమూల్యమైన సందర్భాలు. ఇతరుల ఆమోదం కంటే సహజత్వాన్ని ఎంచుకోవడం నాకు అలవాటైంది. బాహ్య గుర్తింపు అశాశ్వతమైనదని జీవితం నాకు నేర్పింది. మిమ్మల్ని నిలబెట్టేది బలమైన అంతర్గత జీవితం, అర్థవంతమైన సంబంధాలు ఒక లక్ష్య స్పృహ.విజయం అంటే?కీర్తి అశాశ్వతమైనది. మనం ఎంచుకున్న విలువలకు అనుగుణంగా జీవిస్తున్నానా? నా పని అర్థవంతమైన మార్పును తీసుకువస్తుందా లేదా?అదే ఇప్పుడు నాకు ముఖ్యం. నేను అనుభవించిన లేదా పంచుకున్న ఏదైనా విషయం మరో మహిళ ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి, మరింత సమాచారం తెలుసుకోవడానికి లేదా మరింత సాధికారత పొందడానికి సహాయపడితే, అది అపారమైన సంతృప్తిని ఇస్తుంది. ప్రపంచానికి ఏదైనా అర్థవంతమైన దానిని అందిస్తూ, యథార్థంగా జీవించే స్వేచ్ఛను కలిగి ఉండటమే విజయం. ప్రస్తుతానికి, నా దృష్టి వినోదానికి అతీతంగా రచన, ‘నూహెర్’ ద్వారా మహిళల ఆరోగ్య పరిరక్షణ, వంటి ప్రాజెక్ట్లపైనే ఉంది. నాకు రచనపై కూడా చాలా ఆసక్తి ఉంది. నా కవితా సంకలనం త్వరలో ప్రచురితం కానుంది.– సత్యబాబు, సాక్షి, హైదరాబాద్
అంతర్జాతీయం
దిగ్బంధం ఎత్తివేత.. హర్మూజ్లో ఊపందుకున్న చమురు రవాణా
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాజా అవగాహన ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇరాన్ పోర్టులపై విధించిన దిగ్బంధాన్ని ఎత్తివేసినట్లు అమెరికా ప్రకటించింది. దీంతో హర్మూజ్లో చమురు రవాణా ఊపందుకుంది. 60 రోజుల చర్చల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు.అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఎలక్ట్రానిక్ విధానంలో యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహన పత్రంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది.అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ అత్యున్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ ఒప్పందంపై తనకు మొదట భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ, ఇరాన్ హక్కులు మరియు రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రయోజనాలను కాపాడుతామని అధ్యక్షుడు హామీ ఇవ్వడంతో అనుమతి ఇచ్చినట్లు ఖమేనీ పేర్కొన్నారు.ఓ పక్క అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందాలు అమల్లోకి వస్తుండగా.. ఇజ్రాయెల్.. దక్షిణ లెబనాన్పై సైనిక చర్యలు కొనసాగిస్తూనే ఉంది. తాజా దాడుల్లో ముగ్గురు హెజ్బోల్లా సైనికులు మరణించినట్లు సమాచారం. ఈ దాడిని పక్కన పెడితే హెజ్బోల్లా నేత నైమ్ ఖాస్సెమ్ అమెరికా–ఇరాన్ ఒప్పందాన్ని అతి పెద్ద విజయంగా అభివర్ణించారు.
విమానాశ్రయంపై దుండగుల దాడి.. 35 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్ రాజధాని నియామేలోని డియోరీ హమానీ అంతర్జాతీయ విమానాశ్రయంపై గురువారం తెల్లవారుజామున సాయుధ దుండగులు దాడికి పాల్పడ్డారు. ఐదు నెలల వ్యవధిలో ఇదే విమానాశ్రయంపై జరిగిన రెండో దాడి కావడం గమనార్హం.ఉదయం ప్రార్థనలు ముగించుకుని వచ్చిన స్థానికులు భారీ పేలుళ్లు, కాల్పుల శబ్దాలు విన్నట్లు తెలిపారు. విమానాశ్రయం సమీపంలో ఉన్న సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు తెలుస్తోంది. కొద్ది గంటల్లో పరిస్థితి అదుపులోకి రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. భద్రతా బలగాలు దుండగుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టాయి.స్థానిక భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, కాల్పుల్లో 35 మంది మరణించినట్లు సమాచారం. కొందరు దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దాడి అనంతరం కొంతమంది దుండగులు స్థానిక జనాల్లో కలిసిపోవడంతో వారిని గుర్తించడం కష్టంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థ బాధ్యత వహించలేదు. అయితే ఇదే విమానాశ్రయంపై జనవరిలో జరిగిన దాడికి ఇస్లామిక్ స్టేట్తో అనుబంధం ఉన్న ఓ సంస్థ బాధ్యత వహించింది.నైజర్, మాలీ, బుర్కినా ఫాసో కలిసి ఏర్పరచుకున్న Alliance of Sahel States భద్రతా వ్యవస్థలకు ఈ విమానాశ్రయం కీలక కేంద్రంగా ఉంది. అందువల్ల ఈ దాడి ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళనలు రేకెత్తిస్తోంది.
ఏఐ వల్ల మరో ముప్పు.. ఈ సారి ఉద్యోగాలు పోవడం కాదు..
చిన్న సందేహం వచ్చినా చాలా మంది కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఆశ్రయిస్తున్నారు. అలా ప్రతిదానికీ కృత్రిమ మేధస్సుపై ఆధారపడితే మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలోచించడం, గుర్తు పెట్టుకోవడం వంటి పనులను మనమే చేయకపోతే మెదడు చురుకుదనం తగ్గవచ్చని చెబుతున్నారు. ఇది వయస్సు పెరిగిన తర్వాత వచ్చే డిమెన్షియా వంటి సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా బలహీనపరచవచ్చని అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని పొసిబిలిటీ ఇన్స్టిట్యూట్ ప్రధాన శాస్త్రవేత్త, సిద్ధాంత న్యూరోసైంటిస్టు వివియెన్ మింగ్ ఈ విషయంపై హెచ్చరిక చేశారు. అయితే కృత్రిమ మేధస్సు వల్ల నేరుగా వ్యాధి రాదని, దాన్ని ఎలా వినియోగిస్తున్నామన్నదే అసలు అంశమని ఆమె స్పష్టం చేశారు.వివియెన్ మింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రతిరోజు చిన్న విషయాల గురించి కూడా కృత్రిమ మేధస్సుపై తరచుగా ఆధారపడటం వల్ల డిమెన్షియాను ఎదుర్కొనే మెదడు సహజ రక్షణ బలహీనపడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనికి కారణం నిపుణులు "కాగ్నిటివ్ రిజర్వ్" అని పిలిచే సామర్థ్యం తగ్గిపోవడమేనని చెప్పారు. కాగ్నిటివ్ రిజర్వ్ అంటే వయస్సు పెరగడం లేదా వ్యాధుల ప్రభావం వచ్చినా మెదడు పనితీరును కొనసాగించే సామర్థ్యం.కృత్రిమ మేధస్సు నేరుగా నాడీ సంబంధిత వ్యాధులను కలిగించదని వివియెన్ మింగ్ చెప్పారు. అయితే, ప్రజలు దాన్ని ఎలా వినియోగిస్తున్నారన్నదే ఆందోళన కలిగించే అంశమని వివరించారు. అసలు సమస్య "క్రానిక్ సబ్స్టిట్యూషన్"లో ఉందని తెలిపారు. అంటే, కృత్రిమ మేధస్సు పని చేస్తోందనే కారణంతో యూజర్లు తమ ఆలోచనా శ్రమను మానేయడమేనని వివరించారు.క్రానిక్ సబ్స్టిట్యూషన్ అంటే మనం స్వయంగా ఆలోచించకుండా ఆ పనిని దీర్ఘకాలం పాటు కృత్రిమ మేధస్సుకు పూర్తిగా అప్పగించే అలవాటు. కాలక్రమంలో ఈ అలవాటు వల్ల కాగ్నిటివ్ రిజర్వ్ను పెంచుకునే, నిలబెట్టుకునే మెదడు సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని చెప్పారు. వయస్సు పెరగడం వల్ల వచ్చే నష్టాన్ని, డిమెన్షియాను ఎదుర్కోవడంలో ఈ సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.కాగ్నిటివ్ రిజర్వ్ అంటే శారీరక మార్పులు లేదా వ్యాధి వచ్చినా మెదడు పరిస్థితులకు అనుగుణంగా తన పనితీరును కొనసాగించే సామర్థ్యం. నిరంతర మానసిక శ్రమ, కొత్త విషయాల అభ్యాసం, చురుకైన మేధో కార్యకలాపాల వల్ల ఇది బలపడుతుంది.కృత్రిమ మేధస్సుపై అధికంగా ఆధారపడటం వల్ల ఈ ప్రక్రియ దెబ్బతినే ప్రమాదం ఉందని వివియెన్ మింగ్ అభిప్రాయపడ్డారు. మానసిక చురుకుదనం తగ్గిపోతే, దీర్ఘకాలంలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరింత కష్టమవుతుందని హెచ్చరించారు.మెక్గిల్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం.. దారి తెలుసుకోవడానికి తరచుగా జీపీఎస్పై ఆధారపడిన వారిలో, స్వయంగా దారి గుర్తించే స్థల అవగాహన జ్ఞాపకశక్తి బలహీనంగా కనిపించింది.అలాగే, ఎంఐటీ మీడియా ల్యాబ్ నిర్వహించిన చిన్న అధ్యయనంలో.. పెద్ద భాషా నమూనాలను ఉపయోగించి రచనలు చేసిన వారిలో, సంప్రదాయ పద్ధతులు ఉపయోగించిన వారితో పోలిస్తే మెదడు నాడీ అనుసంధానం బలహీనంగా కనిపించిందని వెల్లడైంది. అంతేకాదు, తాము ఇప్పుడే రాసిన విషయాన్నే గుర్తు పెట్టుకోవడంలో కూడా వారు ఇబ్బంది పడ్డారని అధ్యయనం తెలిపింది.
మళ్లీ దాడులకు సిద్ధమైన అమెరికా..! లాస్ట్ వార్నింగ్ వచ్చేసింది..
బ్రస్సెల్స్: అమెరికా-ఇరాన్ ఒప్పందంలోని హామీలను ఇరాన్ పాటించకపోతే మళ్లీ సైనిక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ గురువారం తెలిపారు. నాటో రక్షణ మంత్రుల సమావేశం అనంతరం బ్రస్సెల్స్లో ఆయన మీడియాతో మాట్లాడారు.ఒప్పందం అమలు, చర్చల సమయంలో ఇరాన్ నిబంధనలు పాటించకపోతే ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. "ఈ చర్చల గడువులో ఇరాన్ చెప్పినట్టు చేయకపోతే, మేము మళ్లీ చర్యలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంటామని అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇరాన్ నిబంధనలు పాటించకపోతే, అత్యంత కఠినమైన సముద్ర దిగ్బంధనాన్ని మళ్లీ అమలు చేసే సామర్థ్యం మాకు ఉంది" అని పీట్ హెగ్సెత్ అన్నారు.అమెరికా-ఇరాన్ మధ్య 3 నెలలకు పైగా సాగిన ఘర్షణలకు ముగింపు పలికే లక్ష్యంతో ఇటీవల ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఆ ఒప్పందంలో శత్రుత్వానికి ముగింపు, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఆంక్షల సడలింపు, ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తృత స్థాయి ఒప్పందం కోసం 60 రోజుల చర్చల ప్రక్రియ ప్రారంభించడం వంటి అంశాలు ఉన్నాయి.ఇరాన్ బాధ్యతగా వ్యవహరిస్తేనే.. ఇరు పక్షాలు ఈ ఒప్పందాన్ని స్వాగతించినప్పటికీ ఒప్పందం ద్వారా లభించే ఆంక్షల సడలింపు, ఇతర ప్రయోజనాల వంటివి ఇరాన్ తన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చిన తర్వాతే అమల్లోకి వస్తాయని అమెరికా అధికారులు స్పష్టం చేస్తున్నారు.తాజా వ్యాఖ్యలతో, ఒప్పందం అమలు సమయంలో ఇరాన్ చర్యలను ట్రంప్ ప్రభుత్వం నిశితంగా పరిశీలించనున్నట్టు మరోసారి సంకేతాలు ఇచ్చింది. ఈ ఒప్పందాన్ని "పనితీరు ఆధారిత ఒప్పందం"గా పేర్కొంటున్నారు. ఇందులో ఆంక్షల సడలింపు, నిలిపివేసిన నిధుల విడుదల, ఇతర చర్యలు అన్నీ ఇరాన్ తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటాయి.అయితే ఇరాన్ నిధుల విడుదల, సముద్ర ఆంక్షల సడలింపు వంటి హామీలను ఏ క్రమంలో అమలు చేయాలనే విషయంలో రెండు పక్షాల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. ఘర్షణల సమయంలో హార్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడటంతో ఇంధన మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించాయి. అనేక నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వచ్చింది.ఈ ఒప్పందంతో ఆ ప్రాంతంలో సముద్ర రాకపోకలు సాధారణ స్థితికి వస్తాయని వాషింగ్టన్ భావిస్తోంది. అదే సమయంలో ఇరాన్ ఒప్పంద నిబంధనలు పాటించకపోతే, సైనిక, ఆర్థిక ఒత్తిడిని మళ్లీ తీసుకురావచ్చని అమెరికా స్పష్టం చేసింది.
జాతీయం
బుడతడి బిగ్ షాట్.. అమ్మ ఐఫోన్ జలసమాధి
ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం కంటే ఫోన్లతో గడిపే సమయమే ఎక్కువైందని చాలామంది అంటుంటారు. అయితే ఆ మాటను ఓ చిన్నారి చాలా సీరియస్గా తీసుకున్నాడేమో! తన తల్లి చేతిలో ఉన్న ఖరీదైన ఐఫోన్ను ఏకంగా సరస్సులోకి విసిరేసి "డిజిటల్ డిటాక్స్"కు శ్రీకారం చుట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ మహిళ తన కుమారుడితో కలిసి బోట్ రైడ్కు వెళ్లింది. ప్రకృతి అందాలను ఆస్వాదించడం, కొడుకుతో సరదాగా గడపడం పక్కన పెట్టి, ఆ క్షణాలను ఐఫోన్లో బంధించడంలో బిజీగా ఉంది. ఇదంతా గమనించిన చిన్నారి... "అమ్మకు ఈ ఫోన్నే ఎక్కువ ఇష్టమా? లేక నేనా?" అన్నట్లు ఒక్కసారిగా ఫోన్ లాక్కొని నేరుగా సరస్సులోకి విసిరేశాడు.ఫోన్ నీటిలో పడిపోయిన వెంటనే తల్లి ముఖంలో కనిపించిన షాక్ చూస్తే, అది సాధారణ ఫోన్ కాదని, బహుశా ఈఎంఐలు ఇంకా పూర్తికాని ఐఫోన్ అయి ఉంటుందని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. "బాలుడు ఏ తప్పూ చేయలేదు.. కుటుంబ సమయాన్ని కాపాడాడు". "ఆ చిన్నోడికి పర్యావరణ అవార్డు ఇవ్వాలి... కనీసం రెండు గంటలు అయినా అమ్మ సోషల్ మీడియాకు దూరమైంది", "స్టీవ్ జాబ్స్ ఉంటే ఈ వీడియో చూసి ఏడ్చేవాడు" అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.Kid throws his mom’s iPhone into the lake during a boat ride 😂 pic.twitter.com/HJs4z7F6lt— Duniya Ke Kalesh (@yadav_army11902) June 18, 2026మరికొందరు అయితే ఆ బాలుడిని "లేక్ సెక్యూరిటీ ఫోర్స్" చీఫ్గా నియమించాలని సూచిస్తున్నారు. "బోట్లో అందరూ ప్రకృతిని చూస్తుంటే, ఒక్క అమ్మ మాత్రమే స్క్రీన్ను చూస్తోంది. అందుకే అతను కఠిన నిర్ణయం తీసుకున్నాడు" అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ ఘటన తర్వాత ఆ చిన్నారికి ఐస్క్రీమ్ దొరికిందో లేదో తెలియదు గానీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు మాత్రం దొరికిపోయారు. కానీ ఆ తల్లికి మాత్రం ఇప్పటికీ సరస్సు వైపు చూస్తే నీళ్లలో మునిగిపోయిన iPhone, అందులో ఉన్న ఫోటోలు, కాంటాక్టులు గుర్తుకు వస్తుండొచ్చు.
‘అఖిలేశ్ తన ఎంపీలను కాపాడుకోవాలి’
లక్నో: సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన పార్లమెంట్ సభ్యులు కొందరు వేరు కుంపటి పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలపై యూపీ మంత్రి, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్భర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తమ ఎంపీలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసుకోవాలని సూచించారు.అలాగే.. ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. కొందరు తిరుగుబాటు ఎంపీలు బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వీరికి రెబల్ బల్లియా కుమారుడి నాయకత్వంలో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. పార్టీలో బ్రాహ్మణులకు జరుగుతున్న అవమానాలే ఇందుకు కారణమన్నారు. ఎస్పీలో చీలిక తథ్యమంటూ గత రెండు రోజులుగా ఆయన ఇలాంటి ప్రకటనలు చేస్తుండటం గమనార్హం. ఇందులో నేరుగా ఆయన ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ, సనాతన్ పాండేను ఉద్దేశించే అయి ఉండొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ పుకార్లను కొట్టివేసిన అఖిలేశ్ యాదవ్.. రాజ్భర్ను పుకార్ల శాఖ మంత్రిగా అభివర్ణించారు.ఎన్డీఏపై కాంగ్రెస్ ధ్వజం మరోవైపు.. ప్రతిపక్షాల నుంచి అధికార ఎన్డీఏలోకి కొనసాగుతున్న వలసలకు హోం మంత్రి అమిత్ షా కుట్రలే కారణమని కాంగ్రెస్ నిందించింది. ఎన్డీఏను అమిత్ షా నేషనల్ డిఫెక్టర్స్ అలయన్స్ (జాతీయ ఫిరాయింపుదారుల కూటమి)గా మార్చేశారని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ గురువారం మీడియాతో మాట్లాడారు. అధికార ఎన్డీఏ కూటమికి లోక్సభలో మూడింట రెండొంతుల మెజారిటీని సాధించేందుకు అమిత్ షా చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టడానికి తమ పార్టీ మిత్రపక్షాలతో సంప్రదింపులు జరుపుతోందని ఆయన చెప్పారు.
బంగాళాఖాతంలోకి పాక్ జలాంతర్గాములు!
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ విమోచన యుద్ధం వేళ పాకిస్తాన్ నావికాదళాన్ని భారత్ దారుణంగా దెబ్బతీశాక బంగాళాఖాతం జలాల వైపు కన్నెత్తిచూడని పాకిస్తాన్ 55 సంవత్సరాల తర్వాత మళ్లీ బంగాళాఖాతం వైపు దృష్టిసారించింది. చైనా తయారీ హంగోర్ శ్రేణి జలాంతర్గామిని బంగాళాఖాతంలో నిఘా కోసం మొహరించాలని పాక్ యోచిస్తోంది. పీఎన్ఎస్ హంగోర్ జలాంతర్గామి ఇటీవలే కరాచీకి చేరుకుంది. అంతకుముందు చైనా నుంచి వస్తూ అంతర్జాతీయ సముద్రజలాల గుండా పయనిస్తూ ఈ జలాంతర్గామి శ్రీలంక సమీపంగా వచ్చింది.ఈ జలాంతర్గామికి ఎస్కార్ట్గా వస్తున్న నౌకల కాన్వాయ్(ఫ్లోటిల్లా)కు కమాండర్ ఒమర్ ఫరూఖ్ కొలంబో పోర్ట్లో మాట్లాడారు. ‘‘అధునాతన హంగోర్ తరగతి జలాంతర్గామితో పాక్ ఇకపై సముద్రతలంలోనూ తన సత్తా చాటనుంది. బంగాళాఖాతంలో మా కార్యకలాపాలకు ఇది ఎంతో దోహదపడుతుంది. ఇది ఆట తీరును మార్చేసే గేమ్ ఛేంజర్. ఈ రకం ఎనిమిది జలాంతర్గాములను సమకూర్చుకోబోతున్నాం’’అని ఆయన వెల్లడించారు. అరేబియా సముద్రం దాటి బంగాళాఖాతం దాకా తమ నిఘా కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తున్నట్లు కమాండర్ చెప్పడంతో పాక్ కుయుక్తి బహిర్గతమైంది. బంగాళాఖాతం ఎందుకంత కీలకం? భారత్–పాకిస్తాన్ యుద్ధం వేళ డయ్యూ పరిధిలో భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఖుక్రీని పాక్కు చెందిన పీఎన్ఎస్ హంగోర్ జలాంతర్గామి మూడు టార్పెడోలతో దాడిచేసి ముంచేసింది. అయినాసరే యుద్ధంపై దీని ప్రభావం ఏమాత్రం పడలేదు. భీకరంగా దాడిచేసిన భారత్ పాక్ పీచమణిచింది. అప్పట్నుంచి బంగాళాఖాతంలో పాక్ జలాంతర్గాముల సంచారమే లేదు. తాజాగా బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం కూలడం, పాక్ అనుకూల ప్రభుత్వం కొలువుతీరడంతో దశాబ్దాల తర్వాత బంగాళాఖాతంపై పాక్ కన్నుపడింది. భౌగోళికంగా బంగాళాఖాతంపై భారత పట్టు అధికం.అండమాన్ నికోబార్ దీవులు ఉండటంతో అక్కడి నుంచి సముద్రంలోపలికి 370 కిలోమీటర్లదాకా భారత ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ ఉంది. అక్కడిదాకా సముద్రజలాలపై సర్వాధికారం భారత్కే దఖలుపడుతోంది. ఉత్తర తీరం వైపే విశాఖపట్నంలో భారత నావికాదళ తూర్పు కమాండ్ ప్రధాన స్థావరం ఉంది. ఇదే బంగాళాఖాతం బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, మలేసియా, ఇండోనేసియాలకూ తీరప్రాంతంగా ఉంది.అదీకాకుండా బంగాళాఖాతం అనేది భారత వస్తూత్పత్తులు, ఇంధన వాణిజ్యానికి, నౌకల రాకపోకలకు కీలక మార్గంగా మారింది. ఇంతటి కీలకమైన ప్రాంతంలో పాక్ అడుగుపెట్టడం భారత నావికా, నిఘా కార్యకలాపాలకు అవరోధంగా మారే ఆస్కారముంది. పాక్ తన తీర ప్రాంతానికి సుదూరంగా హిందూ మహాసముద్రంలో బంగాళాఖాతంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తే భారత్కు ఎప్పుడూ తలనొప్పేనని యుద్దరంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. సముద్ర జలాల్లో హంగోర్ జలాంతర్గామి
రేపు పీఎం–కిసాన్ నిధుల విడుదల
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 20వ తేదీన 26వ విడత పీఎం–కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లోని హూగ్లీ జిల్లా తారకేశ్వర్లో పర్యటన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,880 కోట్లను జమ చేయనున్నారు. పీఎం–కిసాన్ ద్వారా పశ్చిమబెంగాల్లోని 45.35 లక్షల మంది రైతులు రూ.907 కోట్ల మేర అందుకోనున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.2019లో ఈ పథకం మొదలు కాగా ఇప్పటివరకు మొత్తం రూ.4.46 లక్షల కోట్లను రైతులకు సాగు సాయంగా విడుదల చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమబెంగాల్లో పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఫసల్ బీయో యోజన (పీఎంఎఫ్బీవై)ని, రాష్ట్రంలో పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని కూడా ప్రారంభిస్తారని మంత్రి వివరించారు.
ఎన్ఆర్ఐ
ట్రంప్ బృందం నుంచి తప్పుకున్న ఏఐ సలహాదారు
వైట్హౌస్ ఏఐ సలహాదారు శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా చేశారు. ఈ నెలాఖరున పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ పాలనలో శ్రీరామ్ కీలక పాత్ర పోషించారు. 18 నెలల పాటు ఆయన సేవలందించారు. తాను కొంతకాలం విరామం తీసుకుని,.. ఆ తర్వాత అమెరికా ఎదుర్కొంటున్న ప్రధాన ఏఐ సంబంధిత సవాళ్లపై తిరిగి పని చేస్తానంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కృష్ణన్ ప్రభుత్వంలో తన సేవను జీవితకాలపు ప్రత్యేక హక్కుగా అభివర్ణించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో సేవ చేయడం గౌరవం. ఆయన నాయకత్వం లేకపోతే మనం ఏఐ రేసులో ముందంజలో ఉండేవాళ్లం కాదంటూ ఆయన పేర్కొన్నారు.వైట్ హౌస్ ఏఐ, క్రిప్టో సలహాదారు డేవిడ్ సాక్స్కు కూడా ఆయన ధన్యవాదాలు తెలుపుతూ.. ఏఐ రంగంలో అమెరికా విజయం సాధించాలనే ఆయన నిరంతర మద్దతు ఎంతో కీలకమైందని.. అది కొనసాగుతూనే ఉంటుందన్నారు. తన పదవీకాలంలో తాను అభివృద్ధి చేయడంలో సహాయపడిన పలు కార్యక్రమాలను కృష్ణన్ ప్రధానంగా ప్రస్తావించారు.వీటిలో అమెరికన్ ఏఐ యాక్షన్ ప్లాన్'ను రూపొందించడం, ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ ఏఐ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఏఐ యాక్సిలరేషన్ పార్టనర్షిప్లను ముందుకు తీసుకెళ్లడం, 'నేషనల్ ఏఐ పాలసీ ఫ్రేమ్వర్క్' ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కు సహకారం అందించడం, అంతర్జాతీయంగా ఏఐ సదస్సులు, దౌత్యపరమైన చర్చల ద్వారా అమెరికన్ ఏఐ ప్రయోజనాలను ప్రోత్సహించడంలో తన పాత్రను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. కృత్రిమ మేధస్సు వేగవంతమైన పరిణామంగా కృష్ణన్ పేర్కొన్నారు.చెన్నైలో జన్మించిన కృష్ణన్.. ఎస్ఆర్ఎంఇంజనీరింగ్ కాలేజ్ నుంచి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2005లో అమెరికాకు వెళ్లారు. కృష్ణన్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగారు. ఆయన తండ్రి ఇన్సూరెన్స్ రంగంలో పనిచేశారు. తల్లి గృహిణి. ఆయన 21 సంవత్సరాల వయస్సులో మైక్రోసాఫ్ట్ సంస్థతో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ ఆయన విండోస్ అజూర్ వ్యవస్థకు ఫౌండింగ్ మేనేజర్గా పనిచేశారు.ట్రంప్ ప్రభుత్వంలో చేరడానికి ముందు, కృష్ణన్ 'ఆండ్రీసెన్ హోరోవిట్జ్' వెంచర్ క్యాపిటల్ సంస్థలో జనరల్ పార్ట్నర్గా ఉన్నారు. అంతకుముందు ఫేస్బుక్, ట్విట్టర్లలో కూడా వివిధ హోదాల్లో పనిచేశారు. ముఖ్యంగా ఎలాన్ మస్క్ 'వార్ రూమ్'లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ నుండి 'ఎక్స్ గా మార్చే ప్రక్రియలో ఆయన సహాయం అందించారు.
పిజ్జా డెలివరీ కోసం వెళ్తే కాల్చిచంపారు
మేడ్చల్ రూరల్: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో శుక్రవారం రాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో మేడ్చల్ జిల్లాకు చెందిన అన్షుల్ (28) మృతిచెందారు. ఆయన కుటుంబం గుండ్లపోచంపల్లి డివిజన్లో ఎప్సిలాన్లో ఉంటోంది. శనివారం ఉదయం కుమారుడి మరణవార్త తెలియగానే అన్షుల్ తల్లిదండ్రులు శ్రీనివాస్ గౌడ్, నీలిమ దంపతులు కుప్పకూలిపోయారు. హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేసిన అన్షుల్ ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేశాక కేడబ్ల్యూసీ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తూనే అదనపు సంపాదన కోసం ఖాళీ సమయాల్లో పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఆ విధుల్లో భాగంగా భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఓ అపార్ట్మెంట్లో పిజ్జా డెలివరీ చేసి తిరిగి వెళ్తుండగా మాస్క్ వేసుకున్న ఇద్దరు దుండగులు వెనుక నుంచి అన్షుల్ను కాల్చి చంపారు. అతని తలతోపాటు మరో రెండు చోట్ల తూటా గాయాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన స్థలంలో ఎలాంటి దొంగతనం జరగలేదని.. అన్షుల్ మృతిపై తమకు అనుమానం ఉన్నట్లు చెప్పారు. ఎవరో కావాలని పిజ్జా డెలివరీ పేరుతో ఇంటి వద్దకు రప్పించి కాల్చి చంపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
అమెరికాలో తెలుగు యువకుడి హత్య
హైదరాబాద్: అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. న్యూయార్క్లో తెలుగు యువకుడ్ని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా, గుండ్లపోచంపల్లి నివాసి అయిన అన్షుల్ కుంచ.. జీవనోపాధి వేటలో భాగంగా పిజ్జా డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లి, జీవనోపాధి కోసం పిజ్జా డెలివరీ ఉద్యోగం చేస్తున్నాడు. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పిజ్జా డెలివరీ చేసే క్రమంలోనే ఈ విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాల్పుల బారిన పడ్డ అన్షుల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రస్తుతం న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, ఇంకా ఈ ఘటనలో ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడు
పశ్చిమాసియాలో ఉద్రికత్తల మధ్య కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ చేసిన దాడిలో ఒక భారతీయుడు మరణించిన వైనం విషాదాన్ని నింపింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన మంజూర్ అహ్మద్ (55) దాదాపు 30 ఏళ్లుగా కువైట్లో టైలర్గా పని చేస్తున్నారు. మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.జూన్ 8న రత్లాం జిల్లాలో జరగాల్సిన మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు మంజూర్ ఇంటికి తిరిగి రావాలనుకున్నాడు. బుధవారం ఉదయం 7:30 గంటలకు ముంబైకి విమానంలో వచ్చి, అక్కడి నుండి రైలులో తన సొంత ఊరైన ఉజ్జయినికి వెళ్లాలని అనుకున్నారు. విమానం ఎక్కడానికి ఒక రోజు ముందు, తన కుమారుడు అనస్ అహ్మద్తో మాట్లాడి, రైల్వే స్టేషన్ నుండి తనను తీసుకువెళ్లడానికి రమ్మని చెప్పారు. గత ఏడాది అక్టోబర్ తర్వాత భారత్కు తిరిగి వస్తున్న అతనికి ఎంతో సంతోషంగా పూలమాలలతో స్వాగతం చెప్పేందుకు సిద్ధమవు తుండగా, ఈ విషాద వార్త వారి చెవిని పడిందని అహ్మద్ కుమారుడు అనస్, తండ్రితో జరిగిన ఆ చివరి ఫోన్ సంభాషణను గుర్తు చేసుకున్నారు. నాగదా రైల్లో వస్తానని చెప్పారు.. రిసీవ్ చేసుకోడానికి రమ్మన్నారు.. కానీ అది చివరి కాల్ అవుతుందని అనుకోలేదని కంటతడిపెట్టారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. శుక్రవారం ఆయన మృతదేహాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయానికి తరలించారు, ఆ తర్వాత బంధువులు అంత్యక్రియల కోసం రోడ్డు మార్గంలో ఉజ్జయినికి తీసుకువెళ్లారు.మరోవైపు భారత్ ఈ దాడిని ఖండించింది. దాడులను నిలిపివేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) పిలుపునిచ్చింది.ఆ ప్రాంతంలోని భారతీయ రాయబార కార్యాలయాలు , కేంద్రాలు అప్రమత్తంగా ఉన్నాయని, అక్కడి భారతీయ సమాజానికి చురుకుగా మద్దతునిస్తూనే ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్పై దాడి చేసి, 86 ఏళ్ల సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని హతమార్చడంతో మధ్యప్రాచ్య యుద్ధం చెలరేగింది. దీనికి ప్రతిస్పందనగా, టెహ్రాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్ ఆస్తులపై దాడులు ప్రారంభించింది. మార్చిలో కువైట్లోని ఒక విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ జరిపిన దాడుల్లో ఒకరు , అదే నెలలో యూఏఈ రాజధాని అబుదాబిలో క్షిపణిని అడ్డగించడం వల్ల వెలువడిన శకలాల కింద పడి మరికొరు ఇలా ఈ దాడుల్లో ఇప్పటివరకు 10 మంది భారతీయులు మృతి చెందారు.
క్రైమ్
మెదక్ ఇన్స్టా లవర్ బాయ్ గేమ్ ఓవర్
సోషల్ మీడియా పరిచయాలు కొన్నిసార్లు ఎంత ప్రమాదకరంగా మారతాయో తెలిపే ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడీలతో ప్రేమ నాటకం ఆడిన ఓ కేటుగాడు, ఇద్దరు యువతులను మోసం చేసి మొత్తం రూ.12 లక్షలతో పాటు తులం బంగారం దోచుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.పోలీసులు, బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. టేక్మాల్ మండలం ఎల్లంపల్లి, ఏక్లాస్పూర్ గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులు ఇన్స్టాగ్రామ్ ద్వారా “సాత్విక్ రెడ్డి”, “రిత్విక్ రెడ్డి” అనే పేర్లతో ఉన్న ఖాతాల ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పరుచుకున్నారు. మాటలతో నమ్మకం సంపాదించిన ఆ వ్యక్తి, తనను తాను ప్రేమలో ఉన్నవాడిగా, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.ఈ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి కథలు అల్లుతూ దశలవారీగా వారి వద్ద నుంచి నగదు, బంగారం తీసుకున్నాడు. కొంతకాలానికి అనుమానం రావడంతో బాధితులు కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. అనంతరం ఇది పూర్తిగా మోసమని తేలడంతో టేక్మాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఈ ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడీల వెనుక ఉన్నది ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య అని గుర్తించారు. సోషల్ మీడియాలో హ్యాండ్సమ్ లుక్తో, వేరే పేర్లతో పరిచయాలు పెంచుకుని పలువురిని లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.సోషల్ మీడియా పరిచయాల్లో అజాగ్రత్తగా నమ్మకం పెట్టుకోవద్దని, వ్యక్తిగత సమాచారం లేదా ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ప్రకాశం: కన్నబిడ్డల్ని కాటేసిన కుటుంబ కలహాలు..!
ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి మండలం కేవీ అగ్రహారంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ముగ్గురు చిన్నారులైన కూతుళ్లను హతమార్చి, అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కేవీ అగ్రహారానికి చెందిన సుధాకర్ కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో తన కూతుళ్లు అచ్యుత (11), పూజిత (9), లోహిత (8)లను హతమార్చాడు. తినే తిండిలో విషం పెట్టి చంపినట్లు తెలుస్తోంది. అనంతరం సమీపంలోని పొలంలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న స్థానికులు, బంధువులు వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.కుటుంబ కలహాలే కారణమా?ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబంలో నెలకొన్న విభేదాలు, కలహాల కారణంగానే సుధాకర్ ఈ దారుణానికి పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. అయితే అసలు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.గ్రామంలో విషాద ఛాయలుఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందడంతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. అల్లారుముద్దుగా పెరిగిన ముగ్గురు చిన్నారులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటన గురించి తెలిసినవారంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక మైనింగ్ : బీజేపీ నేత కారుకు నిప్పు, ముగ్గురు సజీవ దహనం
ఛత్తీస్గఢ్లోని కోరియా (Koriya) జిల్లాలో ఇసుక మైనింగ్ వివాదం అత్యంత ఘోరమైన నరమేధానికి దారితీసింది. ఒక ఫార్చ్యూనర్ (Fortuner) కార్ను ట్రక్కుల మధ్య లాక్ చేసి, దానిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో బీజేపీ నేత, నాయకుడు, మాజీ జన్పద్ పంచాయతీ అధ్యక్షుడు భరత్ సింగ్ (లల్లా సింగ్) సహా ముగ్గురు సజీవ దహనమయ్యారు.ఏం జరిగింది?ప్రాథమిక సమాచారం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సోన్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌగైన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇసుక క్వారీ నిర్వహణ వివాదాన్ని పరిష్కరించు కోవడానికి, చర్చల కోసం భరత్ సింగ్ను పిలిచారు ప్రత్యర్థులు. అక్కడికి వెళ్లిన వెంటనే ఆయన ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ కారు చుట్టుముట్టారు. అనంతరం అటూ ఇటూ ట్రక్కులను అడ్డుగా పెట్టి, కారు కదలకుండా లాక్ చేశారు. ఆపై కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో భరత్ సింగ్ కారులోనే సజీవ దహనమయ్యారు. మరణించిన వారిలో భరత్ సింగ్ బంధువులు, వీరేంద్ర సింగ్, నాగేంద్ర సింగ్ ఉన్నారు. వీరేంద్ర సింగ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో బంధువు మయాంక్ సింగ్ తీవ్ర గాయాతో బిలాస్పూర్లోని అపోలో ఆసుపత్రిలో అత్యంత విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. ఇదీ చదవండి: జాతీయ స్థాయి బాడీబిల్డర్ : జిమ్ చేసి వచ్చి అంతే కుప్పకూలిపోయాడుగతంలో కాంగ్రెస్లో ఉండి, భూపేష్ బఘేల్ ప్రభుత్వ హయాంలో బీజేపీలో చేరారు. భరత్ సింగ్కు ఇసుక మైనింగ్లో స్థానికంగా మంచి పట్టు ఉంది. ఆ ప్రాంతంలోని ఇసుక క్వారీ కాంట్రాక్టు భరత్ సింగ్ కుటుంబానికి దక్కింది. ఆ తర్వాత, సోన్హట్, కైలాష్పూర్, తెలిముడ, బెలియా , ఛింగురా ప్రాంతాలలో ఇసుక రవాణా, తవ్వకాలకు సంబంధించిన వసూళ్లపై ఆధిపత్య పోరు జరిగిందని స్థానికులు చెబుతున్నారు. భరత్ సింగ్ వర్గానికి , మరో మనోజ్ త్రిపాఠి కుటుంబానికి మధ్య ఈ వివాదం గత కొన్ని నెలలుగా రగులుతోంది. త్రిపాఠి కుటుంబానికి చెందిన టిప్పర్ ట్రక్కుల ద్వారా ఇసుక రవాణా చేసే విషయంలో పేమెంట్లు, వర్గ ఆధిపత్య పోరు పెరిగి పెద్దదై మంగళవారం రాత్రి ఈ ఘోర కలికి దారి తీసింది. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడి అని, దీనిపై సీబీఐ (CBI) దర్యాప్తు జరిపించాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి : ఎస్ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ కింగ్ అయ్యాడు!ఈ హింసాత్మక ఘటనతో కోరియా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులు ఈ కేసులో నలుగురు ప్రధాన నిందితులను (అక్షత్ త్రిపాఠి, విశాల్ త్రిపాఠి, సత్యప్రకాష్ త్రిపాఠి, మన్ను త్రిపాఠి) అరెస్ట్ చేశారు. మొత్తం తొమ్మిది మందిపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని అడిషనల్ ఎస్పీ సురేషా చౌబే తెలిపారు.
రాధా గాయత్రి మృతిపై మరో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో విశాఖపట్నానికి చెందిన యువతి రాధా గాయత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న గాయత్రి తల్లిదండ్రులు గురువారం విశాఖపట్నం పోలీస్ కమిషనర్ (సీపీ) కార్యాలయానికి చేరుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గాయత్రి మృతి సహజ మరణం కాదని, ఈ ఘటన వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తమ అల్లుడి పాత్రపై అనుమానం ఉందని, పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.మృతిపై అనుమానాలు ఉన్నాయి..ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గాయత్రి తల్లి సత్యవతి.. తమ కుమార్తె మరణానికి సంబంధించి తమకు అనేక సందేహాలు ఉన్నాయని చెప్పారు. ఘటన జరిగిన తీరుపై స్పష్టత లేదని, అందుకే పోలీసుల జోక్యం కోరుతున్నామని తెలిపారు. తన అల్లుడు శ్రీచరణ్పై అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తమకు అందిన సమాచారం, శ్రీచరణ్ చెప్పిన కారణాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంటూ ఈ కేసును అన్ని కోణాల్లో విచారించాలని కోరారు. తన కూతురుతో తమ అల్లుడు సరిగా కలిసి ఉండే వారు కాదని అన్నారు. తమ కూతురికి మద్యం సేవించే అలవాటు లేదు. గాయత్రిపై అనుమానంతోనే హత్య చేసి ఉండొచ్చు. రిషికేశ్, హరిద్వార్ వెళ్తున్నామని చివరి సారిగా నాకు చెప్పింది. విహారయాత్ర ముగించుకొని విశాఖకు వస్తానని చెప్పింది. విశాఖకు రాకుండానే నా కూతుర్ని హతమార్చారు. విశాఖకు వచ్చిన తర్వాత రెండు నెలలు వర్క్ ఫ్రం హోం పెట్టి ఇక్కడే ఉంటాను అని చెప్పింది. మాది సాంప్రదాయమైన కుటుంబం అని ఆవేదన వ్యక్తం చేశారుసీపీ కార్యాలయంలో ఫిర్యాదు..గాయత్రి తల్లిదండ్రులు సీపీ కార్యాలయంలో అధికారులను కలిసి తమ అనుమానాలను వివరించినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి, అవసరమైతే సంబంధిత రాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుని దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ముస్సోరిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. యువతి మృతి వెనుక అసలు కారణాలేమిటి? కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలకు ఆధారాలున్నాయా? అనే అంశాలపై దర్యాప్తు కీలకంగా మారింది.
వీడియోలు
రూ.40 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకోండి అంటూ జనసేన నేతలు బెదిరించారు
రికార్డెన అసలు నిజం, విచారణలో బయటకు రాబోతున్న సంచలన నిజాలు..!
వనజ చితాభస్మంలో సర్జికల్ సీజర్.. నర్సులే డెలివరీ చేశారా?
గుడివాడకు నోటీస్ ఇచ్చిన హోం మంత్రి, సాయికృష్ణ కేసు మీద డీజీపీ, సీపీకి ఎందుకు ఇవ్వలేదు
సచిన్ దరిదాపుల్లోకి కూడా వైభవ్ రాలేడు ఎందుకంటే.. మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు
హోటల్లో రెండు రోజులు చిత్రహింసలు పెట్టి CIకి అప్పగించారు..! అంబటి షాకింగ్ కామెంట్స్
అనితను ఛీ కొడుతున్న టీడీపీ కీలక నేతలు?
సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు.. అసలు ఏం చేశారు?
నా కొడుకు చనిపోయే ముందు చివరి మాటలు.. క్రాంతి కుమార్ తండ్రి షాకింగ్ కామెంట్స్
2026 ఎల్ నినో హెచ్చరిక..ఉన్న భయాలు - అసలు నిజాలు

