బీసీసీఐ సంచలన నిర్ణయం..! సూర్యకుమార్కు ఊహించని షాక్?
టీ20 ప్రపంచకప్-2026కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ క్రమంలో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్పై బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. అతడి స్ధానంలో ఆల్రౌండర్ అక్షర్పటేల్ను తిరిగి వైస్ కెప్టెన్గా నియమించారు. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్ను మాత్రం కెప్టెన్గా సెలక్టర్లు కొనసాగించారు. కానీ వచ్చే ఏడాది ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ను తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది.పేలవ ఫామ్లో సూర్య..స్కై కెప్టెన్గా జట్టును విజయపథంలో నడిపిస్తున్నప్పటికీ.. బ్యాటర్గా మాత్రం అట్టర్ప్లాప్ అయ్యాడు. ఒకప్పుడు టీ20 వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగిన ఈ ముంబై ఆటగాడు.. ఇప్పుడు రెండెంకెల స్కోర్ చేయడానికి కూడా కష్టపడుతున్నాడు. గత 14 నెలల్లో 24 టీ20 మ్యాచ్లు ఆడి ఒక్క హాఫ్ సెంచరీ కూడా సూర్య సాధించలేకపోయాడు. కెప్టెన్సీ భారం అతడి బ్యాటింగ్పై పడుతున్నట్లు బీసీసీఐ భావిస్తోంది.దీంతో అతడి స్దానంలో మరో ఆటగాడికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు ఇండియా టూడే తమ కథనంలోపేర్కొంది. వాస్తవానికి సూర్యను కెప్టెన్సీ నుంచి ముందే తొలగించాలని భావించినప్పటికీ.. మరికొద్ది రోజుల్లోనే టీ20 ప్రపంచకప్ ఉండడంతో సెలక్టర్లు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మెగా టోర్నీ ముందు ప్రయోగాలు చేయడం ఇష్టం లేక సూర్యనే కెప్టెన్గా ఎంపిక చేశారు. సూర్యకు కెప్టెన్గా ఇదే చివరి ప్రపంచకప్ కావచ్చు.కెప్టెన్సీ రికార్డు అదర్స్..సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇప్పటివరకు 35 మ్యాచ్లు ఆడిన భారత్.. ఏకంగా 28 విజయాలు సాధించింది. 5 మ్యాచ్ ఓడిపోగా.. మరో రెండింట ఫలితం రాలేదు. అతడి విజయశాతం 84.9%గా ఉంది. కానీ అతడి పేలవ ఫామ్ను టీమ్ మెనెజ్మెంట్ను ఆందోళన కలిగిస్తోంది.కెప్టెన్సీ రేసులో అక్షర్, హార్దిక్..!అయితే మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా శుభ్మన్ గిల్ను ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అతడు ఏకంగా జట్టులోనే చోటు కోల్పోయాడు. అటువంటిది గిల్ను టీ20 కెప్టెన్గా చేస్తారంటే నమ్మశక్యం కావడం లేదు. టీ20 కెప్టెన్సీ రేసులో స్టార్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అక్షర్ను తిరిగి వైస్ కెప్టెన్గా నియమించారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది హార్దిక్కు కెప్టెన్గా అనుభవం ఉందని, తిరిగి అతడికి జట్టు ప్గాలు అప్పగిస్తారని అంచనా వేస్తున్నారు. భారత జట్టుకు తదుపరి టీ20 కెప్టెన్ ఎవరో తెలియాలంటే ప్రపంచకప్ ముగిసే వరకు అగాల్సిందే.చదవండి: అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్
సృజనాత్మకత, గోప్యతకు పెద్దపీట.. యూజర్ నియంత్రణకే ప్రాధాన్యం
డిజిటల్ ప్లాట్ఫామ్స్ క్రియేటర్ల సంక్షేమాన్ని, వినియోగదారుల గోప్యతను పరిగణించకపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో వీరీల్స్(Vreels) క్రియేటర్లకు ప్రాధాన్యమిస్తూ, విశ్వసనీయమైన, సృజనాత్మకమైన ప్లాట్ఫామ్గా రూపొందుతోంది. భారత్లోని క్రియేటర్ ఎకానమీని అభివృద్ధి చేయడం, సురక్షిత వాతావరణం, ఆదాయం అవకాశాలు, క్రియేటర్ల కోసం సమగ్ర మద్దతు అందించడం వీరీల్స్(Vreels) ప్రత్యేకత.క్రియేటర్లతో నేరుగా చర్చలుసోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సాధారణంగా ఫీచర్లను రూపొందించిన తర్వాతే వినియోగదారుల అభిప్రాయాన్ని తీసుకుంటాయి, కానీ Vreels (www.vreels.com) టీం భారత్లోని క్రియేటర్లను నేరుగా కలిసి మీటప్స్, కమ్యూనిటీ చర్చలు నిర్వహిస్తోంది. క్రియేటర్లు కోరుకునేది ఏమిటో గ్రహించడం.. సృజనాత్మక స్వేచ్ఛ, గుర్తింపు, నైతిక విలువలు, ఆదాయం, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే టూల్స్ వంటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్లాట్ఫామ్ను రూపొందించినట్లు చెప్పింది.కళాశాలల్లో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంకళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ప్రతిభను కనుగొనడంలో Vreels ముందడుగు వేస్తోంది. కంటెంట్ పోటీలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను, సృజనాత్మకతను ఎలాంటి భయం లేకుండా వ్యక్తపరిచే అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా, Vreels గోప్యత, భద్రతపై అత్యంత దృష్టి పెట్టడం వల్ల యూజర్లు తాము సృష్టించిన కంటెంట్పై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. ఇది ఇతర పెద్ద ప్లాట్ఫామ్స్లో సాధ్యం కాని విషయమని వీరీల్స్ చెప్పింది. యూజర్లు తమ ప్రొఫైల్లో వారి విశ్వవిద్యాలయం లేదా కళాశాల పేరును అప్డేట్ చేస్తే భవిష్యత్తులో వీరీల్స్ ద్వారా వారు తమ కళాశాల లేదా ఇతర కళాశాలల విద్యార్థులతో సులభంగా కనెక్ట్ కావొచ్చు. తమ నెట్వర్క్ను విస్తరించుకోవచ్చు.సులభమైన ఆదాయ అవకాశాలుVreels ప్లాట్ఫామ్లో 10,000 ఫాలోవర్స్ను చేరిన యూజర్లు తమ ఖాతాను మోనిటైజ్ చేయడానికి అర్హత పొందుతారు. ముఖ్యంగా, ఎవరైతే 10,000 ఫాలోవర్స్ చేరుకుంటారో వారికి రూ.10,000 చెక్కు అందిస్తామని వీరీల్స్ తెలిపింది. దీనికి ఎలాంటి పరిమితి లేదని చెప్పింది. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న ఈ విధానంలో భవిష్యత్తులో మార్పులు చేయవచ్చని తెలిపింది.Vreels షాప్.. 2026 క్యూ1లో ప్రారంభంVreels షాప్ 2026లో ప్రారంభం కానుంది. ప్రారంభ విక్రేతలు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ పొందగలుగుతారు. ఇది చిన్న వ్యాపారాలు, బ్రాండ్లకు కొత్త ఆదాయ అవకాశాలను తెరుస్తుంది.వీడియోలు వీక్షిస్తూ దీని ద్వారా ప్రోడక్ట్స్ కొనవచ్చు లేదా మెరుగైన ధరల కోసం బిడ్డింగ్ వేయవచ్చు.వ్యాపారవేత్తలు తమ రీల్స్, ఫోటోలు, కథల ద్వారా బ్రాండ్ను ప్రోత్సహించి, ఆదాయాన్ని పొందవచ్చని వీరీల్స్ చెప్పింది.నమ్మకమైన ఈ సిస్టమ్ ద్వారా వెండర్లు తమ ఉత్పత్తులను భద్రంగా విక్రయించవచ్చని పేర్కొంది. వినోదం, వాణిజ్యం కలిసే కొత్తదనాన్ని అనుభూతి చెందవచ్చని తెలిపింది.దీనిపై మరిన్ని విశేషాలు త్వరలో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.మెమొరీ క్యాప్సుల్.. ప్రత్యేకమైన, వ్యక్తిగత డిజిటల్ అనుభవంVreels లోని మెమొరీ క్యాప్సుల్ ఫీచర్ ఏ ఇతర ప్లాట్ఫామ్లో లేని ప్రత్యేకమైన ఫీచర్. యూజర్లు ప్రత్యేక కంటెంట్ను రహస్యంగా భద్రపరిచి, నచ్చిన వారికి తీపిగుర్తుగా సర్ప్రైజ్ అందించవచ్చు. ఇది కేవలం మీరు ఎంపిక చేసిన వ్యక్తికి మాత్రమే కనిపిస్తుంది. దీని కారణంగా Vreels కేవలం సాధారణ సోషల్ మీడియా వేదిక లాగా కాకుండా వినియోగదారులకు ప్రత్యేకమైన వ్యక్తిగత అనుభవాలను అందించే వేదికగా కూడా ఉంటుంది.ఈ ఫీచర్ ద్వారా మీరు మీ జ్ఞాపకాలను భద్రంగా ఉంచి, కావలసిన సమయానికి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ప్రత్యేక సందర్భాల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేయవచ్చు. వర్చువల్ టైమ్ లాక్ సిస్టమ్ వల్ల మీరు సృష్టించిన జ్ఞాపకాలు సరైన సమయంలో మాత్రమే బయటకు వస్తాయి.Reels, చాట్, కాల్స్, PixPouch..వీరీల్స్ Reels, చాట్, కాల్స్, PixPouch.. అన్ని అనుభవాలను ఒకే వేదికలో అందిస్తోంది. ఇందులో షార్ట్ వీడియోలు, రియల్ టైం చాట్, వాయిస్/వీడియో కాల్స్, PixPouch ద్వారా ఫోటోలు సులభంగా సేకరించటం వంటి ఫీచర్లున్నాయి. ఇది వినియోగదారులకు సృజనాత్మక స్వేచ్ఛ, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.గోప్యత, డేటా భద్రతకు మొదటి ప్రాధాన్యతVreelsలో డేటా భద్రత, గోప్యత ముఖ్య ప్రమాణాలు. ఇతర ప్లాట్ఫామ్లు వినియోగదారుల డేటాపై సరైన జాగ్రత్త చూపడంలో విఫలమవుతున్నాయి. కానీ Vreels వినియోగదారులకు వారి కంటెంట్పై పూర్తి నియంత్రణ, రక్షణ, భద్రతా సౌలభ్యాలను ప్రధానంగా అందిస్తుంది. యూజర్ల డేటాను ఎవరు చూడాలో అనే పూర్తి నియంత్రణ కూడా తమ చేతుల్లోనే ఉంటుంది.డేటా లీక్ భయం అనవసరంఈ రోజుల్లో AI ఆధారిత డేటా లీక్ భయం పెరుగుతోంది. కానీ Vreelsలో ఎన్క్రిప్షన్ ద్వారా ప్రతి చాట్, వీడియో, ఫోటో, డేటా భద్రంగా ఉంటుందని కంపెనీ చెప్పింది. యూజర్ల వీడియోలు, ఫోటోలు, పోస్ట్లు.. ఎవరు చూడాలో, ఎవరు చూడకూడదో స్వయంగా పూర్తిగా నియంత్రించవచ్చు.స్థానిక ప్రతిభ నుంచి ప్రపంచ స్థాయి ప్రతిభ వరకుVreels ఇప్పటికే 22 దేశాల్లో బీటా వర్షన్ యాప్ను రిలీజ్ చేసింది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. క్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికులైనా.. మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒకే వేదికలో అందిస్తుంది.Vreels మీ డిజిటల్ జీవితానికి కొత్త అధ్యాయంక్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికుడైనా.. మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒకే వేదికలో అందిస్తుంది.ఇప్పుడే ప్రయత్నించండిVreels: భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.వెబ్సైట్: www.vreels.comకింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్ల్లో ఈరోజే Vreels డౌన్లోడ్ చేసుకోండి.Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsApple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098లేదాడౌన్లోడ్ కోసం కింద ఉన్న QR కోడ్ను స్కాన్ చేయండి.
ఈసారి రికార్డులు బద్ధలు.. ఆ కంటెస్టెంట్దే గెలుపు!
బిగ్బాస్ షో.. వంద రోజుల యుద్ధానికి తెర దించే సమయం ఆసన్నమైంది. ఫైనల్ ఓటింగ్స్ నిన్నటితో ముగిశాయి. ఈసారి కామనర్ గెలుస్తాడా? లేదా తనూజ గెలిచి లేడీ విన్నర్గా చరిత్ర సృష్టించనుందా? ఆన్లైన్ పోల్స్ ఏమని చెప్తున్నాయి? ఓటింగ్ ట్రెండ్ ఎటువైపు బలంగా ఉంది ఓసారి చూసేద్దాం..టాప్ 5 ఫైనలిస్టులుతెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ మొదలైనప్పుడు విన్నర్ మెటీరియల్లా ఒక్కరూ కనిపించడం లేదని జనాలే అనుకున్నారు. అలాంటి సమయంలో తనూజ తన రియల్ ఎమోషన్స్ చూపిస్తూ.. కసిగా గేమ్ ఆడుతూ విన్నర్ రేసులో ముందుకొచ్చింది. కమెడియన్గా నవ్విస్తూనే, టాస్కుల్లో దులిపేస్తూ నేనున్నానంటూ ముందుకు దూసుకొచ్చాడు ఇమ్మాన్యుయేల్. కామనర్గా వచ్చిన కల్యాణ్ గెలిస్తే ఆ కిక్కే వేరని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అది సరిపోదుమొన్నటిదాకా రీతూతో గొడవ వల్ల కనిపించకుండా పోయిన డిమాన్ పవన్ ఫైనల్ వీక్లో మాత్రం తన టాలెంట్ అంతా చూపిస్తున్నాడు. కానీ కప్పు గెలిచేందుకు ఇది సరిపోదు. గేమ్స్ అందరూ ఆడతారు.. కానీ ఆడించడం తెలిసుండాలి... స్కోప్ లేని దగ్గర కూడా కంటెంట్ క్రియేట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది సంజనా. అలా ఫైనల్స్లో చోటు దక్కించుకున్న ఆమె టాప్ 5లో చివరి స్థానంతోనే సరిపెట్టుకోనుంది.ఓట్లు గుద్దిపడేసిన అభిమానులుటాప్ 5లో ఉన్న ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్లుగా హౌస్లో కష్టపడ్డారు. వారికోసం బయట అభిమానులు కూడా బీభత్సంగానే కష్టపడ్డారు. మిస్డ్ కాల్స్, హాట్స్టార్లో ఓటింగ్తో దుమ్ము లేపారు. గత సీజన్స్ కంటే కూడా ఈసారి ఎక్కువ ఓటింగ్ నమోదైనట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. వారం ప్రారంభం నుంచి శుక్రవారం వరకు కూడా సంజనా చివరి స్థానంలోనే ఉంది. పవన్కు పెరిగిన ఓటింగ్మూడు, నాలుగు స్థానాలు మాత్రం మారుతూ వచ్చాయి. పవన్లో హుషారు చూసి అతడికి ఓట్లు గుద్దిపడేశారు. దీంతో అప్పటిదాకా మూడో స్థానంలో ఉన్న ఇమ్మూ సడన్గా నాలుగో స్థానానికి పడిపోయాడు. కానీ వీకెండ్ వచ్చేసరికి ఇమ్మూ మళ్లీ ఒక మెట్టు పైకి ఎగబాకినట్లు వినికిడి. అసలు సిసలైన విన్నర్ పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే జరుగుతోంది. వీళ్లిద్దరికీ హోరాహోరీగా ఓట్లు నమోదయ్యాయి.ఈ ఇద్దరి మధ్యే పోటీఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా స్పల్పంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో తనూజకు భారీగా ఓట్లు పడగా.. తర్వాత కల్యాణ్కు సడన్గా ఓటింగ్ రేంజ్ పెరిగిందంటున్నారు. దీంతో ఈ ఇద్దరిలోనే ఒకరు విన్నర్, మరొకరు రన్నర్గా నిలవనున్నారు. ప్రతి సీజన్లో విన్నర్, రన్నర్ మధ్య గొడవలు జరిగాయి. కానీ, ఈ సీజన్లో మాత్రమే ఇద్దరూ కలిసికట్టుగా ఆడుకుంటూ, పాడుకుంటూ ఉన్నారు. వైరం పెట్టుకోకుండా ముందుకు సాగారు.తనూజపై అక్కసువాళ్లిద్దరూ బాగానే ఉన్నా.. వారి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో బద్ధ శత్రువుల్లా కొట్టుకున్నారు. ఇక ఆడవారికి ఆడవాళ్లే శత్రువు అన్నట్లు తనూజపై చివరి వారంలో కొందరు సెలబ్రిటీలు విషం కక్కారు. అది కూడా ఆమెకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా పోల్స్లో కల్యాణ్ గెలిచే ఆస్కారం ఉందంటున్నారు. కొన్ని పోల్స్ మాత్రమే తనూజ గెలుపు తథ్యమని చెప్తున్నాయి. ఎవరు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు!ఓటింగ్లో కూడా కల్యాణ్ బుల్లెట్ స్పీడ్లో దూసుకెళ్లాడని టాక్! మరి ఇదే నిజమై కల్యాణ్ కప్పు గెలుస్తాడా? లేదా తనూజ కోరుకున్నట్లుగా టైటిల్ ఆమె వశమవుతుందా? అనేది రేపటి గ్రాండ్ ఫినాలేలో చూడాలి! ఇది బిగ్బాస్ హౌస్.. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. కొన్నిసార్లు లెక్కలు తారుమారు కూడా అవొచ్చు!
అధికబరువుతో బాధపడేవారికి గుడ్ న్యూస్
అధిక బరువు ఊబకాయంతో నానాబాధలు పడుతున్నవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. బరువు తగ్గడానికి, జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడే ఒక కొత్త గట్ బాక్టీరియాను పరిశోధకులు కనుగొన్నారు. ఈ స్పెషల్ బాక్టీరియాను అమెరికాలోని ఉటా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకలపై చేసిన అధ్యయనాలలో, టురిసిబాక్టర్ అని పిలువబడే ఒక నిర్దిష్ట రకం గట్ బాక్టీరియా జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని, బరువు పెరగడాన్ని తగ్గిస్తుందని ఉటా విశ్వవిద్యాలయం బృందం కనుగొంది. ప్రస్తుతం మార్కెట్లో బరువు తగ్గించే ఇంజెక్షన్లు, మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజసిద్ధంగా ఈ సమస్యను అధిగమించేందుకు ఈ పరిశోధన మార్గం సుగమం చేయగలదని భావిస్తున్నారు.ట్యూరిసిబాక్టర్ (Turicibacter) అనే పేగు బాక్టీరియా బరువు పెరుగుదలను నియంత్రించడంలో సమర్థవంతంగా పని చేస్తున్నట్టు గుర్తించారు. ఊబకాయం ఉన్నవారిలో టురిసిబాక్టర్ తక్కువగా ఉంటుంది. ఇది మానవులలో కూడా ఆరోగ్యకరమైన బరువుకు తోడ్పడుతుంది. గట్ బాక్టీరియాను సర్దుబాటు చేయడం ద్వారా బరువును నియంత్రించడానికి కొత్త మార్గాల అన్వేషణకు ఈ ఫలితాలు దారితీయవచ్చని సెల్ మెటబాలిజం జర్నల్లో ప్రచురించిన అధ్యయనంలో పరిశోధకులు జూన్ రౌండ్, కేంద్ర క్లాగ్ తెలిపారు. రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిని, హైఫ్యాట్ డైట్లోని సెరామైడ్ స్థాయిలను రాడ్ ఆకారంలోని టురిసిబాక్టర్ సింగిల్ హ్యాండెడ్గా తగ్గిస్తుందని కను గొన్నామన్నారు. అయితే టురిసిబాక్టర్ ప్రభావాలు ప్రత్యేకంగా ఉండే అవకాశం లేదు; విభిన్నమైన గట్ బాక్టీరియా బహుశా జీవక్రియ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. అలాగే జంతు నమూనాల ఆధారంగా ఈ ఫలితాలు ప్రజలకు వర్తించకపోవచ్చని కూడా చెప్పారు.అధిక కొవ్వు ఆహారంతో సెరామైడ్ స్థాయిలు పెరుగుతాయి. అధిక స్థాయి సిరామైడ్లు టైప్ 2 డయాబెటిస్ మరియు గుండె జబ్బులతో సహా అనేక జీవక్రియ రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటాయి. కానీ టురిసిబాక్టర్ ఉత్పత్తి చేసే కొవ్వులు అధిక కొవ్వు ఆహారం మీద ఎలుకలకు కూడా సిరామైడ్ స్థాయిలను తక్కువగా ఉంచుతాయి. ట్యూరిసిబాక్టర్ చిన్న ప్రేగు ద్వారా గ్రహించబడే కొవ్వు అణువులను ఉత్పత్తి చేయడం ద్వారా జీవక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఎలుకలలో బరువు తగ్గడాన్ని గమనించినప్పటికీ, ఇది మానవులలో ఎంతవరకు సాధ్యపడుతుందని అనేది చూడాలన్నారు. కానీ ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహించేందుకు, అధిక బరువు పెరగకుండా నిరోధించే చికిత్సలను అభివృద్ధి చేయడానికి టురిసిబాక్టర్, ఈ ప్రభావాన్ని చూపే లిపిడ్ను గుర్తించడం భవిష్యత్తులో ఇది తొలి ఫ్యాక్టర్ కాగాలదని పరిశోధకులు తెలిపారు. అలాగే వ్యక్తిగత సూక్ష్మజీవులను మరింత పరిశోధించడం ద్వారా, భవిష్యత్తులో సూక్ష్మ జీవులను ఔషధంగా తయారు చేయగలమనీ, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో వివిధ కీటకాల కన్సార్టియంను సృష్టించడానికి సురక్షితమైన బ్యాక్టీరియాను గుర్తించే అవకాశం ఉందని అని వర్సిటీ పరిశోధకుడు క్లాగ్ అన్నారు.గట్ మైక్రోబయోమ్లోని తేడాలు - గట్లోని బ్యాక్టీరియా, శిలీంధ్రాలు - ఊబకాయం మరియు బరువు పెరుగుదలతో సంబంధం కలిగి ఉంటాయి, మైక్రోబయోమ్ను మార్చడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపడే అవకాశాన్ని పెంచుతుంది. కానీ వ్యక్తి ప్రేగులో వందలాది విభిన్న సూక్ష్మజీవుల జాతులు ఉంటాయి, ఏ జాతి సహాయపడుతుందో చెప్పడం కష్టతరం. అయితే ఈ ఫలితాలు మానవులకి కూడా వర్తిస్తే, ట్యూరిసిబాక్టర్-ఉత్పన్న సమ్మేళనాలు జీవక్రియ ఆరోగ్యం, ఆరోగ్యకరమైన బరువును ప్రోత్సహించడానికి ప్రభావవంతమైన చికిత్సా విధానాలుగా ఉంటాయనడంలో సందేహం లేదు.
YS Jagan Birthday Special: జనం కోసం జగన్.. జగన్ కోసం జనం
YS Jagan Birthday Special: ఐక్యరాజ్య సమితి లక్ష్యాలు.. జగనన్న నవరత్నాలు
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'బొమ్మ హిట్'
రైడింగ్ సమయంలో పెట్రోల్ అదా ఇలా: టిప్స్
క్రికెట్ నుంచి ఎన్బీఏ వరకు.. ఈ ఏడాది క్రీడా రంగాన్ని కుదిపేసిన వివాదాలు ఇవే
రైలు నుంచి పడి నవ దంపతులు మృతిచెందిన ఘటనలో ట్విస్ట్
దమ్ముంటే ఉప ఎన్నికకు రావాలి: కేటీఆర్
'భర్త మహాశయుల..' కోసం రవితేజ భారీ త్యాగాలు
ఫేక్ యాడ్స్ మోసం.. వివాదంలో మెటా!
ఆత్మసాక్షాత్కారానికి ప్రాథమిక మార్గం క్రియాయోగం
ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!
అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్
ఈ రాశి వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది
దిగొచ్చిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
అక్క సర్పంచ్.. చెల్లె కలెక్టర్ !
అమెరికాకు విశ్వసనీయ భాగస్వామిగా ఏపీ కొనసాగుతుంది-చంద్రబాబు
ఈ రాశి వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు
మళ్లీ కాటేసిన ఉగ్రవాదం
మరో 20 దేశాలపై ప్రయాణ నిషేధం విధించిన అమెరికా- గతంలో 12 దేశాలపై నిషేధం
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్..
బిజినెస్ రీఫార్మర్ అవార్డు లాంటివి ఇంకా ఎన్నో వస్తాయ్!
'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'
సినిమాల చెట్టు.. మళ్లీ చిగురించింది.. వంశీ భావోద్వేగం
చతికిలపడుతున్న తమిళ సీనియర్ హీరోలు..
ధురంధర్.. బాలీవుడ్కి ఓ ప్రమాద హెచ్చరిక!
ప్రైవేట్ జెట్లలోనే ప్రభాస్ ప్రయాణం.. ఎందుకో తెలుసా..?
విరాట్ కోహ్లి వచ్చేశాడు.. కెప్టెన్గా రిషభ్ పంత్
మా తాతగారు తన కష్టాన్ని ఎప్పుడూ చెప్పలేదు: శోభన్బాబు మనవడు డా. సురక్షిత్
8 ఏళ్ల తర్వాత 'పార్టీ' ఇవ్వనున్న రెజీనా, రమ్యకృష్ణ
YS Jagan Birthday Special: జనం కోసం జగన్.. జగన్ కోసం జనం
YS Jagan Birthday Special: ఐక్యరాజ్య సమితి లక్ష్యాలు.. జగనన్న నవరత్నాలు
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'బొమ్మ హిట్'
రైడింగ్ సమయంలో పెట్రోల్ అదా ఇలా: టిప్స్
క్రికెట్ నుంచి ఎన్బీఏ వరకు.. ఈ ఏడాది క్రీడా రంగాన్ని కుదిపేసిన వివాదాలు ఇవే
రైలు నుంచి పడి నవ దంపతులు మృతిచెందిన ఘటనలో ట్విస్ట్
దమ్ముంటే ఉప ఎన్నికకు రావాలి: కేటీఆర్
'భర్త మహాశయుల..' కోసం రవితేజ భారీ త్యాగాలు
ఫేక్ యాడ్స్ మోసం.. వివాదంలో మెటా!
ఆత్మసాక్షాత్కారానికి ప్రాథమిక మార్గం క్రియాయోగం
ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!
అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్
ఈ రాశి వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది
దిగొచ్చిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
అక్క సర్పంచ్.. చెల్లె కలెక్టర్ !
అమెరికాకు విశ్వసనీయ భాగస్వామిగా ఏపీ కొనసాగుతుంది-చంద్రబాబు
ఈ రాశి వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు
మళ్లీ కాటేసిన ఉగ్రవాదం
మరో 20 దేశాలపై ప్రయాణ నిషేధం విధించిన అమెరికా- గతంలో 12 దేశాలపై నిషేధం
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్..
బిజినెస్ రీఫార్మర్ అవార్డు లాంటివి ఇంకా ఎన్నో వస్తాయ్!
'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'
సినిమాల చెట్టు.. మళ్లీ చిగురించింది.. వంశీ భావోద్వేగం
చతికిలపడుతున్న తమిళ సీనియర్ హీరోలు..
ధురంధర్.. బాలీవుడ్కి ఓ ప్రమాద హెచ్చరిక!
ప్రైవేట్ జెట్లలోనే ప్రభాస్ ప్రయాణం.. ఎందుకో తెలుసా..?
విరాట్ కోహ్లి వచ్చేశాడు.. కెప్టెన్గా రిషభ్ పంత్
మా తాతగారు తన కష్టాన్ని ఎప్పుడూ చెప్పలేదు: శోభన్బాబు మనవడు డా. సురక్షిత్
8 ఏళ్ల తర్వాత 'పార్టీ' ఇవ్వనున్న రెజీనా, రమ్యకృష్ణ
ఫొటోలు
ఏపీవ్యాప్తంగా వైఎస్ జగన్ ముందస్తు బర్త్ డే వేడుకలు (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 20-27)
శ్రీలంక ట్రిప్లో ధనశ్రీ వర్మ.. ఫుల్ చిల్ అయిపోతూ (ఫొటోలు)
హ్యాపీ బర్త్ డే జగనన్న: జనం మెచ్చిన జననేత.. (ఫొటోలు)
రెడ్ రోజ్లా 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫొటోలు)
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శనివారం చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు (ఫొటోలు)
క్రిస్మస్ వేళ.. ఏపీలోని ఈ ప్రసిద్ధ చర్చి గురించి తెలుసా? (ఫొటోలు)
కలర్ఫుల్ చీరలో కృతి శెట్టి.. ఫ్యాన్స్ కోసం ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ
ముచ్చట గొలిపే ముత్యాల ముగ్గులు.. మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)
‘మోగ్లీ 2025’ థ్యాంక్స్ మీట్..ముఖ్య అతిథిగా హీరో సాయిదుర్గా తేజ్ (ఫొటోలు)
సినిమా
రేసులో 'అవతార్'.. కానీ 'ధురంధర్' కలెక్షనే ఎక్కువ!
విడుదలై రెండు వారాలు దాటిపోయినా సరే 'ధురంధర్' జోరు అస్సలు తగ్గట్లేదు. పేరుకే హిందీ మూవీ అయినప్పటికీ దేశవ్యాప్తంగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రూ.600-700 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా థియేటర్లలోకి వచ్చిన హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీని కూడా వసూళ్లలో ఈ చిత్రం దాటేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం?జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన 'అవతార్' ఫ్రాంచైజీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2009లో తొలి పార్ట్ రిలీజైనప్పుడు మూవీ లవర్స్ ఆశ్చర్యపోయారు. మన దేశంలోనూ వేల కోట్ల వసూళ్లు వచ్చాయి. 2022లో రెండు పార్ట్ విడుదలైతే ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే దక్కింది. రూ.400-500 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి. కానీ నిన్న(డిసెంబరు 19) థియేటర్లలోకి మూడో పార్ట్కి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు. అదే స్టోరీ అదే విజువల్స్ ఉన్నాయని చూసొచ్చిన ఆడియెన్స్ అనుకుంటున్నారు. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.20 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.అదే టైంలో 'ధురంధర్'కి నిన్న(డిసెంబరు 19) రూ.22.50 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అంటే రేసులో ఉన్న హాలీవుడ్ మూవీ 'అవతార్ 3'ని కూడా హిందీ మూవీ దాటేసిందనమాట. చూస్తుంటే ఈ వీకెండ్లోనూ 'ధురంధర్' హవా కనిపించేలా ఉంది. ఈ మూవీ దెబ్బకు ఇటు తెలుగులో రిలీజైన 'అఖండ 2'పై గట్టిగానే ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే తెలుగు తప్ప మిగతా ఏ భాషలోనూ బాలకృష్ణ చిత్రం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అలా 'ధురంధర్' ఎఫెక్ట్.. తెలుగు, ఇంగ్లీష్ మూవీస్పై గట్టిగానే పడినట్లు తెలుస్తోంది.
ఓటీటీలో 'ఆంధ్రకింగ్ తాలుకా'.. ప్రకటన వచ్చేసింది
రామ్ పోతినేని, ఉపేంద్ర కలిసి నటించిన మూవీ 'ఆంధ్రకింగ్ తాలుకా'.. నవంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. వరుస పరాజయాల తర్వాత రామ్ భారీ అంచనాలతో ఈ మూవీని చేశారు. సినిమా బాగుందని టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు పి.మహేశ్బాబు తెరకెక్కించారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే, రావు రమేశ్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు నటించారు‘ఆంధ్రకింగ్ తాలుకా’ నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 25న స్ట్రీమింగ్కు రానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ,మలయాళం, తమిళ్లో విడుదల అవుతుందని ఒక పోస్టర్ను షేర్ చేశారు. ఈ మూవీ కోసం సుమారు రూ. 60 కోట్లు బడ్జెట్ పెట్టినట్లు సమాచారం. అయితే, ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2000-2003 మధ్యకాలంలో సాగుతుంది. సూర్య(ఉపేంద్ర) ఓ స్టార్ హీరో. ప్లాప్ సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్ తెప్పించే అభిమానులు ఉన్నారు. అయితే వరుసగా తొమ్మిది సినిమాలు డిజాస్టర్ కావడంతో.. తన కెరీర్లో 100వ మూవీతో ఎలాగైన భారీ హిట్ కొట్టాలనే కసితో ఉంటాడు. అయితే 100వ సినిమా షూటింగ్ మొదలైన కొన్నాళ్లకే ఆగిపోతుంది. ఇక సినిమా చేయలేనంటూ నిర్మాత చేతులెత్తేస్తాడు. ఆ సినిమా పూర్తి చేయాలంటే మూడు కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఆ డబ్బు కోసం మరో నిర్మాతకు ఫోన్ చేస్తే.. తన కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో తండ్రి పాత్ర చేయమని అడుగుతాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా..తర్వాత ఆ పాత్ర చేసేందుకు ఒప్పుకుంటాడు.ఈ విషయం నిర్మాతకు చెప్పేలోపే.. సూర్య అకౌంట్లో రూ. 3 కోట్లు వచ్చి చేరుతాయి. ఆ డబ్బు ఎవరేశారని ఆరా తీయగా..తన వీరాభిమాని సాగర్(రామ్ పోతినేని) గురించి తెలుస్తుంది. రాజమండ్రి సమీపంలోని గోడపల్లిలంక అనే ఒక చిన్న పల్లెటూరికి చెందిన సాగర్కు అంత డబ్బు ఎలా వచ్చింది? అసలు సాగర్కి హీరో సూర్య అంటే ఎందుకు అంత పిచ్చి? ప్రియురాలు మహాలక్ష్మీ(భాగ్యశ్రీ బోర్సె)ని దక్కించుకోవడం సాగర్ చేసిన చాలెంజ్ ఏంటి? ఆ చాలెంజ్లో సాగర్ గెలిచాలడా ఓడాడా? హీరోపై ఉన్న అభిమానం..సాగర్ని, తన ఊరిని ఎలా మార్చేసింది? అభిమానిని వెతుక్కుంటూ వచ్చిన హీరో సూర్యకి.. తెలిసొచ్చిన విషయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
రాజకీయాల్లోకి సినీ నటి ఆమని.. పార్టీలో చేరిక
ప్రముఖ సినీనటి ఆమని భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు మేకప్ ఆర్టిస్ట్ శోభలత పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడ ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆమని తమిళ సినిమా నిర్మాతను పెళ్లి చేసుకుని సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే, రీఎంట్రీలో పలు చిత్రాలతో బిజీగానే ఉన్నారు. ఈ ఏడాదిలో ఏకంగా 5 చిన్న సినిమాల్లో ఆమె నటించారు.తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న ఆమని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. సినీ రంగం నుంచి చాలామంది తమకు నచ్చిన రాజకీయ పార్టీలో చేరడం సహజమే.. కానీ, ఆమని బీజేపీలో చేరడం ప్రాధాన్యత ఉంది. సోషల్మీడియా వేదికగా ఇప్పటికే పలు సామాజిక అంశాల గురించి ఆమె మాట్లాడుతూనే ఉన్నారు. ఆమె వాయిస్ బీజేపీకి ఉపయోగపడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.ఆమని తెలుగు, తమిళ సినిమాల్లో రాణించారు. శుభలగ్నం, శుభసంకల్పం, శుభమస్తు, మావిచిగురు, ఘరానా బుల్లోడు, అమ్మ దొంగా వంటి భారీ హిట్ సినిమాల్లో నటించారు. ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ (1993) సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేశారు. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో ఆమెకు ఆఫర్స్ వరించాయి. బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి ఉత్తమ నటిగా నంది బహుమతిని అందుకున్నారు. ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది. తమిళ సినీ నిర్మాత ఖాజా మొహియుద్దీన్ను పెళ్ళి చేసుకొని సినిమా రంగానికి దూరమైన ఆమని తిరిగి 2003లో రాంగోపాల్ వర్మ చిత్రం మధ్యాహాన్నం హత్యతో సినీ రంగప్రవేశం చేశారు. ఈమె భర్త నిర్మించిన చిత్రాలు విజయవంతము కాక ఆర్థిక ఇబ్బందులలో పడి 2005 జూలై 14న అత్మహత్యాప్రయత్నం చేశాడు. ఆర్థిక ఇబ్బందులే ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి కొంత కారణమని భావిస్తారు.
బిగ్బాస్ 9కి ప్రాణం పోసింది.. సంజనా రియల్ గేమర్!
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్పై ఎటువంటి బజ్ లేనప్పుడు షోకి ప్రాణం పోసింది సంజన గల్రానీ. గప్చుప్గా గుడ్డు దొంగతనం చేసి అందదరూ గొడవపడేలా చేసింది. ఒక్కక్కరి నిజస్వరూపాలు బయటపడేలా చేసింది. తనను తాను మోటివేట్ చేసుకుంటూ ఫినాలేలో అడుగుపెట్టింది. అన్నింటికీ ధైర్యంగా నిలబడే సంజనా.. గార్డెన్ ఏరియాలో కొడుకు ఫోటోను చూడగానే ఏడ్చేసింది. కన్నీళ్లు పెట్టుకున్న సంజనాఅరగంటలో వస్తానని అబద్ధం చెప్పి బిగ్బాస్ హౌస్లో 100 రోజులు ఉన్నానని సారీ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తనకు మరో జీవితాన్నిచ్చిన బిగ్బాస్ను గాడ్ ఫాదర్గా అభివర్ణించింది. తర్వాత బిగ్బాస్ మాట్లాడుతూ.. టాప్ గేర్లో ఆట మొదలుపెట్టి టాప్ 5 వరకు చేరిన మీ ప్రయాణంలో మీలో ఉన్నంత డ్రామా ఉంది. దాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. మీ ధైర్యమే..సీజన్ 9 మొదటి కెప్టెన్గా నిలిచి ఆరంభం నుంచి ఆటను మీ చేతుల్లోకి తీసుకున్నారు. మొదటి వారం నుంచి 15వ వారం వరకు ఇంట్లో ఏది జరిగినా అది మీ వల్ల జరగాలి లేదా మీకోసం జరగాలి అనేలా ఆడారు. గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకు(ఇమ్మాన్యుయేల్)తో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది. ఇంట్లో అందరికీ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. మీ ప్రతి ఎమోషన్ ఎలాంటి పరదా లేకుండా ప్రేక్షకులకు చూపాలన్న మీ నిర్ణయం, ధైర్యం వారిని మీకు మరింత చేరువ చేసింది. ఎవరికీ అర్థం కాని గేమర్అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది? ఎవరి గుర్తింపు వారి చేతుల్లోనే ఉందని బలంగా నమ్మారు. టాస్కులో పోటీపడ్డా, సంచాలక్గా ఉన్నా, వంటగదిలో ఉన్నా, బెడ్ రూమ్లో కబుర్లు చెప్తున్నా.. సంజనా ఎక్కడుంటే అక్కడేదో జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించారు. సంజనా సైలైన్సర్గా, సంజూ బాబాగా, మమ్మీగా ఎవరికీ అర్థం కాని గేమర్గా వివిధ పాత్రల్లో ప్రతి నిమిషం వినోదాన్ని పంచేందుకు ప్రయత్నించారు. మొండిధైర్యం మీ సొంతంఆటలో మిగతావారు మీకన్నా బలంగా ఉన్నా, వారికి మిగతావారి మద్దతు ఉన్నా మీరెప్పుడూ అధైర్యపడలేదు. ఎవరి మీద ఆధారపడి ఆడటానికి ఈ ఇంట్లోకి రాలేదు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్నిక్కడి వరకు తీసుకొచ్చింది. ఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలివైపు ఎవరున్నా వెనక్కు తగ్గని మొండిధైర్యం మీ సొంతం. అదే మీ కన్నీళ్లకు కారణంమీ దూకుడు మనస్తత్వం, మీ కత్తుల్లాంటి మాటలే మిమ్మల్ని చిక్కుల్లో పడేశాయి. అప్పుడు మీ మనసుకు దగ్గరైనవారితో అభిప్రాయభేదాలు వచ్చాయి. అది మీ మనసును ఎంతో బాధపెట్టింది. మీ కన్నీటికి కారణమైంది. కష్టాలెన్నో ఓర్చుకుని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని ఏదో ఒకరోజు మీ బాబు, ఐదు నెలల పాప చూసి ఎంతో గర్వపడతారు అని పొగిడాడు. తర్వాత జర్నీ వీడియో చూపించగా సంజనా ఉప్పొంగిపోయింది. అందులో తన అల్లరి, ప్రాంక్స్.. సీక్రెట్ రూమ్కు వెళ్లిరావడం.. గొడవలు.. ఇలా అన్నీ చూపించారు.
క్రీడలు
సెలక్టర్ల కీలక నిర్ణయం.. మహ్మద్ షమీకి ఛాన్స్
జాతీయ జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి దేశవాళీ క్రికెట్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ- 2025 వన్డే టోర్నీ కోసం బెంగాల్ జట్టుకు షమీ ఎంపికయ్యాడు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కనబరిచిన ఫామ్ను.. ఈ దేశవాళీ వన్డే టోర్నీలో కూడా కొనసాగించాలని షమీ భావిస్తున్నాడు. ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. డొమాస్టిక్ క్రికెట్లో అద్భుతాలు చేస్తున్నాడు. ప్రస్తుత దేశవాళీ సీజన్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 36 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలో నాలుగు మ్యాచ్లు ఆడి 20 వికెట్లు పడగొట్టిన షమీ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 16 వికెట్లు తీసి బెంగాల్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు.బెంగాల్ జట్టులో షమీతో పాటు భారత పేసర్లు ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్ సైతం చోటు దక్కించుకున్నారు. ఈ జట్టు కెప్టెన్గా వెటనర్ అభిమన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. బెంగాల్ ఎలైట్ గ్రూప్-బిలో ఉంది. బెంగాల్ తమ తొలి మ్యాచ్లో 24న రాజ్కోట్ వేదికగా తలపడనుంది.షమీ విషయానికి వస్తే.. చివరగా భారత్ తరపున ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడాడు. అప్పటి నుంచి ఫిట్నెస్ సమస్యలు అంటూ అతడిని తీసుకోవడం లేదు. కానీ షమీ మాత్రం దేశవాళీ క్రికెట్లో క్రమం తప్పకుండా ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత జట్టులో సీనియర్ ఫాస్ట్ బౌలర్లు లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది.విజయ్ హజారే ట్రోఫీకి బెంగాల్ జట్టుఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), అనుస్తుప్ మజుందార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుదీప్ ఘరామి, సుమంత్ గుప్తా, సుమిత్ నాగ్ (వికెట్ కీపర్), చంద్రహాస్ డాష్, షాబాజ్ అహ్మద్, కరణ్ లాల్, మహ్మద్ షమీ, ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్, సయన్ ఘోష్, రవి కుమార్, అమీర్ ఘనీ, విశాల్ భాటి, అంకిత్ మిశ్రా.చదవండి: అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్
అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్
టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ వరల్డ్కప్ జట్టులో ఊహించని మార్పులు చేసింది. ఏకంగా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్పైనే వేటు వేశారు. ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో గిల్కు చోటు దక్కలేదు.అతడి స్దానంలో అక్షర్ పటేల్ను తిరిగి వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. అదేవిధంగా సెలక్టర్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రెండేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు పిలిపునిచ్చారు. దీంతో నిన్నటివరకు జట్టులో ఉన్న వికెట్ కీపర్ జితీష్ శర్మను పక్కన పెట్టేశారు.తను ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన జితీష్పై వేటు వేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే జితేష్ శర్మను ఎంపిక చేయకపోవడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జట్టు కాంబినేషన్ల కోసమే జితీష్ను పక్కన పెట్టినట్లు అజిత్ తెలిపాడు."టీ20ల్లో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు జట్టు కాంబినేషన్ల దృష్ట్యా అతడికి వరల్డ్కప్ జట్టులో చోటు దక్కలేదు. అదేవిధంగా టాప్ ఆర్డర్లో ఆడే వికెట్ కీపర్ మాకు కావాలి. సంజూ శాంసన్ మాకు ప్రధాన వికెట్ కీపర్, ఓపెనర్గా ఉన్నాడు. సంజూకు బ్యాకప్ ఓపెనర్, వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ సరైనోడు అని భావించాము.అతడికి ఓపెనర్గా అనుభవం ఉంది. అందుకే జితేష్కు బదులుగా కిషన్ను జట్టులో తీసుకున్నాడు. అలాగే లోయార్డర్లో రింకూ సింగ్ ఫినిషర్గా ఉంటాడు. బ్యాటింగ్ ఆర్డర్లో జితీష్ స్ధానాన్ని రింకూ భర్తీ చేస్తాడు. జితీష్ అద్బుతమైన ప్లేయర్ అయినప్పటికి జట్టు కాంబినేషన్ కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు" అని ప్రెస్ కాన్ఫరెన్స్లో అగార్కర్ పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్కు రింకూ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.అతడి స్ధానంలో జితీష్ ఫినిషర్గా కొనసాగాడు. ఇప్పుడు వరల్డ్కప్లో రింకూ ఫినిషర్గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఇక కిషన్ కూడా ప్రస్తుతం అద్భతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) కిషన్ దుమ్ములేపాడుఏ. 10 మ్యాచ్లలో 57.44 సగటుతో 571 పరుగులు చేశాడు. ఫైనల్లో సంచలన సెంచరీతో చెలరేగిన కిషన్.. జార్ఖండ్కు తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్.
అందుకే గిల్ను సెలక్ట్ చేయలేదు: అజిత్ అగార్కర్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస మ్యాచ్లలో విఫలమవుతున్నా ఇన్నాళ్లు టీ20 జట్టు ఓపెనర్గా కొనసాగించిన శుబ్మన్ గిల్ (Shubman Gill)పై ఎట్టకేలకు వేటు వేసింది. ఊహించని రీతిలో ప్రపంచకప్-2026 జట్టు నుంచి అతడిని తప్పించింది.వైస్ కెప్టెన్గా రీఎంట్రీటీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్గా.. టీ20 జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న గిల్ విషయంలో బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. కాగా ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్తో వైస్ కెప్టెన్గా భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చాడు గిల్.దీంతో దాదాపు ఏడాది కాలంపాటు అభిషేక్ శర్మ (Abhishek Sharma)తో కలిసి ఓపెనర్గా సత్తా చాటిన సంజూ శాంసన్కు కష్టాలు మొదలయ్యాయి. గిల్ను అభిషేక్ జోడీగా ఆడించిన యాజమాన్యం.. సంజూను తొలుత వన్డౌన్లో.. ఆ తర్వాత మిడిలార్డర్కు పంపింది. క్రమక్రమంగా తుదిజట్టు నుంచే తప్పించింది.వరుస మ్యాచ్లలో విఫలం వికెట్ కీపర్గానూ సంజూకు బదులు ఫినిషర్గా ఉపయోగపడే జితేశ్ శర్మకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే, సంజూ స్థానంలో ఓపెనర్గా తిరిగి వచ్చిన గిల్ వరుస మ్యాచ్లలో విఫలమయ్యాడు. అంతకు ముందు కూడా అతడి ప్రదర్శన అంతంత మా త్రమే.గత ఇరవై ఒక్క ఇన్నింగ్స్లో గిల్ సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).చివరగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో తీవ్రంగా నిరాశపరిచిన గిల్ (4(2), 0(1)).. మూడో టీ20లో 28 బంతుల్లో 28 పరుగులు చేయగలిగాడు. అయితే, పాదానికి గాయమైన కారణంగా ఆఖరి రెండు టీ20ల నుంచి అతడు తప్పుకొన్నాడు. ఈ క్రమంలో నాలుగో టీ20 పొగమంచు వల్ల రద్దు కాగా.. ఐదో టీ20తో సంజూ తుదిజట్టులోకి వచ్చాడు.నిరూపించుకున్న సంజూఅహ్మదాబాద్ వేదికగా ధనాధన్ ఇన్నింగ్స్ (22 బంతుల్లో 37) ఆడి తన సత్తాను మరోసారి నిరూపించుకున్నాడు సంజూ. గిల్ మూడు మ్యాచ్లలో కలిపి చేసిన పరుగుల కంటే ఒక్క ఇన్నింగ్స్లోనే సంజూనే ఎక్కువ పరుగులు చేయడం విశేషం.ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి మేనేజ్మెంట్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. గిల్ కోసం ఇంకెన్నాళ్లు సంజూను బలిచేస్తారని రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏకంగా ప్రపంచకప్ జట్టు నుంచే గిల్ను తప్పించడం సంచలనంగా మారింది.అందుకే గిల్ను సెలక్ట్ చేయలేదుఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ... ‘‘శుబ్మన్ గిల్ పరుగులు రాబట్టడంలో వెనుకబడ్డాడు. 2024 వరల్డ్కప్ జట్టులోనూ అతడు లేడు.మీ, నా అభిప్రాయాలు వేర్వేరుగా ఉండవచ్చు. కొన్నిసార్లు జట్టు ఎంపిక అత్యంత క్లిష్టంగా ఉంటుంది. గిల్ ఇప్పటకీ నాణ్యమైన ఆటగాడే అని మేము నమ్ముతున్నాం. ఫామ్ విషయంలో ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపళ్లాలు సహజమే.అయితే, జట్టు కూర్పునకు అనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అలాంటపుడు కొందరికి స్థానం దక్కదు. అతడు మెరుగైన ఆటగాడు కాదు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని అనుకోకూడదు. అదృష్టవశాత్తూ భారత క్రికెట్లో మనకెన్నో మంచి మంచి ఆప్షన్లు ఉన్నాయి’’ అని అగార్కర్ స్పష్టం చేశాడు. చదవండి: రోహిత్ శర్మ యూటర్న్!
గిల్కు భారీ షాక్.. వరల్డ్ కప్ జట్టులోకి ఎవరూ ఊహించని ప్లేయర్
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్కు బీసీసీఐ భారీ షాకిచ్చింది. టీ20 ప్రపంచకప్-2026కు ప్రకటించిన భారత జట్టులో గిల్కు చోటు దక్కలేదు. అతడి స్ధానంలో తిరిగి ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్గా బీసీసీఐ సెలక్షన్ కమిటీ నియమించింది.ఈ ఏడాది ఆసియాకప్తో తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన గిల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్లో కూడా గిల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. తొలి మూడు మ్యాచ్లలో ఘోరంగా విఫలమైన గిల్ను ఆఖరి రెండు టీ20లకు గాయం పేరిట టీమ్ మెనెజ్మెంట్ పక్కన పెట్టింది. దీంతో అతడి స్దానంలో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో ఇకపై సంజూను ఓపెనర్గా కొనసాగించాలని మెనెజ్మెంట్ నిర్ణయించారు. ఈ కారణంతోనే గిల్ను వరల్డ్కప్ జట్టు నుంచి పక్కన పెట్టారు. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సైతం ధ్రువీకరించాడు. గిల్ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడని, గత టీ20 వరల్డ్కప్లో కూడా అతడు ఆడలేదని అగార్కర్ వెల్లడించాడు.కిషన్కు ఛాన్స్..!ఇక వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ రెండేళ్ల తర్వాత భారత జట్టుకు ఎంపికయ్యాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కిషన్ను వరల్డ్కప్ జట్టులోకి తీసుకుంది. అయితే నిన్నటి వరకు టీ20 జట్టులో భాగంగా ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ జితీష్ శర్మపై సెలక్టర్లు వేటు వేశారు. అతడి స్ధానంలోనే సెకెండ్ వికెట్ కీపర్గా కిషన్ను సెలక్ట్ చేశారు. అదేవిధంగా సౌతాఫ్రికా సిరీస్కు దూరంగా ఉన్న ఫినిషర్ రింకూ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ రెండు మార్పులు మినహా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిన జట్టునే వరల్డ్కప్ టోర్నీకి ఎంపిక చేశారు. ఇదే జట్టు న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో తలపడనుంది.కిషన్ చివరగా భారత్ తరపున 2023లో ఆడాడు. దేశవాళీ టోర్నీల్లో అద్భుతప్రదర్శన కనబరుస్తుండడంతో సెలక్టర్లు తిరిగి జట్టులోకి తీసుకున్నారు. కాగా టీ20 వరల్డ్కప్-2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్.
న్యూస్ పాడ్కాస్ట్
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్లో విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్కు అందజేత
ఆంధ్రప్రదేశ్లో కోటి సంతకాల సమరం... కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ మహా ఉద్యమం.. నేడు గవర్నర్కు కోటి సంతకాల ప్రతులు అందజేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఫేక్ సొసైటీతో భూములు కబ్జా చేయడానికి కుట్ర... విజయవాడలో 42 మంది పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో పోటెత్తిన కోటి సంతకాల ర్యాలీ. కోటి మంది చేసిన సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టే్ట్ రివర్స్... భారీగా క్షీణించిన స్థిరాస్తుల క్రయవిక్రయాలు, అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలు
ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు... కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రివర్గం
విద్యార్థులకు నాసిరకం స్కూల్ బ్యాగులు, బూట్లు... ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర ఇక్కట్లు
బిజినెస్
2026లో బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే?
2025 ఇంకొన్ని రోజుల్లో ముగుస్తుంది. బంగార ధరలు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది (2025) ప్రారంభంలో రూ.78,000 ఉన్న గోల్డ్ రేటు.. ప్రస్తుతం రూ.1.3 లక్షలకు చేరుకుంది. దీంతో 2026లో పసిడి ధరలు ఇంకెలా ఉండబోతున్నాయో అని చాలామంది ఆందోళన చెందుతున్నారు.2026 డిసెంబర్ నాటికి బంగారం ధర ఔన్సుకు 14% పెరిగి 4,900 డాలర్లకు చేరుకుంటుందని.. గోల్డ్మన్ సాచ్స్ (Goldman Sachs) అంచనా వేసింది. సెంట్రల్ బ్యాంక్ డిమాండ్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతలు వంటివి గోల్డ్ రేటు పెరగడానికి కారణమవుతున్నాయి. వచ్చే ఏడాది కూడా బంగారం ధర భారీగా పెరుగుతుందని నివేదికలో గోల్డ్మన్ సాచ్స్ వెల్లడించింది.భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. గ్లోబల్ మార్కెట్లో కూడా గోల్డ్ రేటు 61 శాతం పెరిగింది. ఈ విధంగా ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. ట్రంప్ టారిఫ్స్ ప్రకటనలు. స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిన సమయంలో చాలామంది పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇది కూడా గోల్డ్ రేటు గణనీయంగా పెరగడానికి ఓ కారణమైంది.ప్రస్తుతం బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. ఎందుకంటే అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చితులు, ద్రవ్యోల్బణం సమయంలో పెట్టుబడిదారులకు గోల్డ్ సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఉపయోగపడుతుంది. రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు సైతం బంగారంపై పెట్టే పెట్టుబడి.. మిమ్మల్ని ఆర్ధిక సమస్యల నుంచి బయటపడేస్తుందని చెబుతున్నారు. కాబట్టి చాలామంది పసిడిపై పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. కాబట్టి రేటు కూడా పెరుగుతుందని స్పష్టంగా అవగతం అవుతోంది.నేటి ధరలువరుస హెచ్చుతగ్గుల మధ్య ఈ రోజు (డిసెంబర్ 20) బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,34,180 వద్ద.. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,23,000 వద్ద నిలిచాయి. చెన్నైలో మాత్రమే ఈ ధరలు కొంత ఎక్కువగా ఉన్నాయి.ఇదీ చదవండి: మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్
Real Estate: రిటైల్ పెట్టుబడులకు క్యూ..
పొద్దున లేస్తే ఆన్లైన్లో ఒక్కసారైనా క్లిక్మనిపించాల్సిందే. షాపింగ్, ఫుడ్, లైఫ్స్టైల్.. ప్రతీది ఈ–కామర్స్లో కొనేందుకే నేటి యువత మొగ్గు చూపిస్తోంది. అయితే ఈ–కామర్స్ ఎంత పెరుగుతున్నా.. నేటికీ షాపింగ్ మాల్స్కు ఆదరణ మాత్రం అస్సలు తగ్గడం లేదు. పాశ్చాత్య దేశాల్లో రిటైల్ స్థలం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే.. మన దేశంలో మాత్రం జోరు కొనసాగిస్తోంది. ఇండియాలో మాల్స్ కేవలం షాపింగ్ కేంద్రాలే కాదు వినోదం, ఆహారం వంటి సామాజిక అవసరాలను కూడా తీర్చే కేంద్రాలుగా మారాయి. దీంతో మన దేశంలో ఏటేటా రిటైల్ స్పేస్కు ఆదరణ పెరుగుతోంది. ఇండియాలో రిటైల్ రంగం వృద్ధిని సాధిస్తుంటే.. అమెరికాలో పతనం అవుతున్నాయి.మన దేశంలో 600 కంటే ఎక్కువ ఆపరేషనల్ మాల్స్ ఉన్నాయి. అయితే ఇందులో వంద కంటే తక్కువ మాల్స్ మాత్రమే గ్లోబల్ ఫండ్స్ను ఆకర్షించే సంస్థాగత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ కొరతే ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు దేశీయ మాల్స్లో పెట్టుబడులకు ప్రధాన కారణం. అధిక రాబడి, యువ వినియోగదారుల డిమాండ్, సంస్థాగత పెట్టుబడిదారుల్లో విశ్వాసం కారణంగా భారత రిటైల్ రంగంలో జోరు పెరిగింది. పరిమిత స్థాయిలో వ్యవస్థీకృత రిటైల్ మార్కెట్, సరళమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) విధానాలు, విదేశీ బ్రాండ్లు, పెట్టుబడిదారులు రిటైల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో దేశీయ రిటైల్ రంగం 3.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తోందని అనరాక్ గ్రూప్ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది.పాశ్చాత్య దేశాల్లో పతనం.. పాశ్చాత్య దేశాలలో మాల్స్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కొత్త మాల్స్ స్టోర్లలో 78 శాతం పెరుగుదల ఉన్నప్పటికీ.. 2020 నుంచి నికర మాల్ స్టోర్ మూసివేతలు పెరుగుతున్నాయి. అమెరికాలో రికార్డ్ స్థాయిలో 1,200 మాల్స్ మూతపడ్డాయి. ఉన్న మాల్స్లో దాదాపు 40 శాతం ఖాళీలు ఉన్నాయి. అదే మన దేశంలో 2021 నుంచి ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల మధ్యకాలంలో 88కు పైగా విదేశీ బ్రాండ్లు భారత రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించాయి. గ్రేడ్–ఏ మాల్స్ కోసం మరిన్ని అన్వేషణలో ఉన్నాయి. దాదాపు పూర్తి ఆక్యుపెన్సీలో ఉన్న గ్రేడ్–ఏ మాల్స్లో 95–100 శాతం లీజులు పూర్తయ్యాయి. కీలక జోన్లో రిటైల్ స్థలం కోసం దుకాణదారులు ఎదురుచూస్తున్నారు.తలసరి రిటైల్ స్పేస్.. మన దేశంలో తలసరి రిటైల్ స్టాక్ ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. భారత తలసరి రిటైల్ స్టాక్ ప్రథమ శ్రేణి నగరాల్లో కేవలం 4–6 చదరపు అడుగులుగా ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 2–3 చ.అ.లుగా ఉంది. ఇక, గ్రేడ్–ఏ మాల్స్లో తలసరి స్థలం కేవలం 0.6 చ.అ.గా ఉంది. అదే అమెరికాలో సగటు తలసరి రిటైల్ స్థలం 23 చ.అ., చైనాలో 6 చ.అ.లుగా ఉన్నాయి.రిటైల్లో రాబడి.. యువ జనాభా, పెరుగుతున్న ఆదాయాలు, వేగవంతమైన పట్టణ విస్తరణ కారణంగా భారతదేశం 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్ల వినియోగ స్థాయిని చేరుకునే దిశగా పయనిస్తోంది. దేశంలో గ్రేడ్–ఏ రిటైల్ ప్రాపర్టీలు ఏటా 14–18 శాతం రాబడి అందిస్తాయి. అదే పాశ్చాత్య దేశాలలో ఈ రాబడి దాదాపు రెట్టింపు స్థాయిలో ఉంటుంది. మన దేశంలో నాణ్యమైన రిటైల్ స్థలం కొరతే డిమాండ్కు ప్రధాన కారణం. మన దేశంలో రోజుకు మాల్స్ ఫుట్ఫాల్స్ సగటున 20 వేలకంటే ఎక్కువగా ఉంటాయి. వీకెండ్లో అయితే 40 వేల కంటే అధికంగా ఉంటాయి. ఫుడ్ అండ్ బేవరేజెస్, ఎంటర్టైన్మెంట్ స్పేస్లలో ఫుట్ ఫాల్స్ 30–35 శాతం వాటాలను కలిగి ఉంటాయి. దీంతో ఆన్లైన్ రిటైల్ ప్రభావం భౌతిక మాల్స్పై ప్రభావం లేదు.ఫిజికల్ స్టోర్లు.. మన దేశంలో రిటైల్ స్టోర్లు ‘ఫిజికల్’గా మారుతున్నాయి. ఆఫ్లైన్ స్టోర్లు కస్టమర్లకు అనుభూతిని, విశ్వాసాన్ని పెంచే కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆన్లైన్ ఫ్లాట్ఫామ్లు డిమాండ్ను పెంచుతున్నాయి. మన దేశంలో ప్రముఖ డైరెక్ట్ టు కన్జ్యూమర్(డీ టూ సీ) బ్రాండ్లు ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ విక్రయాలను అధికంగా చేస్తుండటమే ఇందుకు ఉదాహరణ. అయితే మన దేశంలో ఈ–కామర్స్ వాటా 8 శాతంగా ఉంది. అదే చైనా, అమెరికాలో 20 శాతం కంటే అధికం.
క్రూడాయిల్ ధరలు తగ్గినా.. తగ్గని పెట్రోల్, డీజిల్ రేట్లు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆశించిన స్థాయిలో తగ్గకపోవడం అనేది సామాన్యుడికి ఎప్పుడూ ఒక మిస్టరీగానే ఉంటుంది. ప్రస్తుత (2025) అధికారిక గణాంకాలు, గత దశాబ్ద కాలపు విశ్లేషణను పరిశీలిస్తే దీని వెనుక ఉన్న ఆర్థిక, రాజకీయ కారణాలు స్పష్టమవుతాయి.ప్రస్తుతం (డిసెంబర్ 2025 నాటికి) అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర సుమారు 60 - 70 డాలర్ల మధ్య ఊగిసలాడుతోంది. అయినప్పటికీ దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.103-రూ.110 మధ్య, డీజిల్ రూ.90 నుంచి రూ.98 మధ్య ఉంది.ధరలు తగ్గకపోవడానికి కారణాలుమన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు 50% నుంచి 55% వరకు పన్నులే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ను విధిస్తున్నాయి. చమురు ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి లేదా ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి పన్నులను పెంచుతోంది తప్ప, ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయడం లేదు.రూపాయి విలువ పతనంపదేళ్ల కిందట డాలర్తో పోలిస్తే రూపాయి విలువ సుమారు రూ.45-50 ఉంటే ప్రస్తుతం అది రూ.90కి చేరుకుంది. ముడి చమురును డాలర్లలోనే కొనుగోలు కాబట్టి, అంతర్జాతీయంగా ధరలు తగ్గినా బలహీనపడిన రూపాయి వల్ల మనం చెల్లించే మొత్తం తగ్గడం లేదు.చమురు కంపెనీల నష్టాల భర్తీగతంలో చమురు ధరలు విపరీతంగా పెరిగినప్పుడు, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (IOCL, BPCL, HPCL) ప్రజలపై భారం పడకుండా ధరలను స్థిరంగా ఉంచుతాయి. అప్పుడు వాటికి కలిగిన నష్టాలను ఇలాంటి సమయాల్లో అంటే క్రూడ్ ధరలు తగ్గిన సమయంలో లాభాల రూపంలో భర్తీ చేసుకుంటున్నాయి.సెస్, సర్ఛార్జ్కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీలో అధిక భాగం సెస్ రూపంలో ఉంటోంది. దీని వల్ల వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది కేంద్ర ఖజానాకు అదనపు ఆదాయంగా మారుతోంది.10-15 ఏళ్ల కిందటి ధరలతో పోలికసుమారు 2010-2014 మధ్య కాలంలో ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, అప్పటి రిటైల్ ధరలు ఇప్పటికంటే తక్కువగా ఉండేవి. 2010లో పెట్రోల్ ధరలను, 2014లో డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రించింది (Deregulation). అంతకుముందు ప్రభుత్వం రిఫైనరీ కంపెనీలకు భారీగా సబ్సిడీలు ఇచ్చేది. అందుకే అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఎక్కువగా ఉన్నా దేశీయంగా ధరలు తక్కువగా ఉండేవి. ప్రభుత్వం సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన (రోడ్లు, హైవేలు) కోసం అవసరమైన నిధులను చమురుపై పన్నుల ద్వారా సేకరించడం ప్రారంభించింది.అంశం2011-2012 (సుమారు)2024-2025 (ప్రస్తుతం)ముడి చమురు ధర (బ్యారెల్)డాలర్లు 105 - 115డాలర్లు 65 - 75డాలర్తో రూపాయి విలువరూ.45 - రూ.50రూ.88 - రూ.89పెట్రోల్ ధర (లీటర్)రూ.63 - రూ.68రూ.103 - రూ.107డీజిల్ ధర (లీటర్)రూ.40 - రూ.45రూ.89 - రూ.94కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ (పెట్రోల్)సుమారు రూ.9.48సుమారు రూ.19 - రూ.21 క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా సామాన్యుడికి ఉపశమనం లభించకపోవడానికి ప్రధాన అడ్డంకి ప్రభుత్వాల పన్ను విధానం, రూపాయి బలహీనపడటం. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ (GST) పరిధిలోకి తీసుకువస్తే ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఆదాయాన్ని కోల్పోవడానికి ఇటు కేంద్రం, అటు రాష్ట్రాలు సిద్ధంగా లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి మూలకారణం.ఇదీ చదవండి: పొగమంచు గుప్పిట్లో విమానయానం
చైనా కంపెనీ సరికొత్త రికార్డ్: 1.5 కోట్ల కారు విడుదల
భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో బీవైడీ కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. ఈ వాహన తయారీ సంస్థ చైనాలోని జినాన్ ఫ్యాక్టరీలో 15 మిలియన్ల (1.5 కోట్లు) కారును విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఉత్పత్తి మాత్రమే కాకుండా.. బీవైడీ అమ్మకాలు ఎక్కువగానే ఉన్నాయి. 2025 జనవరి నుంచి నవంబర్ వరకు కంపెనీ 4.182 మిలియన్ యూనిట్లను విక్రయించింది. ఈ అమ్మకాలు అంతకు ముందు ఏడాది కంటే 11.3 శాతం ఎక్కువ. చైనాలో మాత్రమే కాకుండా.. సంస్థ ఇతర దేశాల్లో కూడా లక్షల కార్లను విక్రయించినట్లు వెల్లడించింది. మొత్తం మీద బీవైడీ ఆరు ఖండాల్లో.. 119 దేశాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తోంది.BYD అభివృద్ధికి టెక్నాలజీ ఆవిష్కరణలు ప్రధాన కారణం. 2025 మొదటి మూడు త్రైమాసికాలలో.. కంపెనీ పరిశోధన, అభివృద్ధి వ్యయం 43.75 బిలియన్ యువాన్లకు చేరుకుంది, ఇది అంతకు ముందు ఏడాది కంటే 31% ఎక్కువ. "ఎలిగాన్స్, ఇన్నోవేషన్, టెక్నాలజీ" వంటి వాటితో.. డెంజా మోడల్ ద్వారా సింగపూర్, థాయిలాండ్, మలేషియాతో సహా బహుళ ఆసియా మార్కెట్లలో కంపెనీ విజయవంతంగా ప్రవేశించింది.భారతదేశంలో బీవైడీ కార్లుఆట్టో 3 ఎలక్ట్రిక్ కారుతో.. భారతదేశంలో అడుగు పెట్టిన బీవైడీ కంపెనీ.. ఆ తరువాత సీల్, ఈమ్యాక్స్ 7, సీలియన్ 7 వంటి కార్లను లాంచ్ చేసింది. ఈ కార్లు దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతున్నాయి. ప్రత్యర్ధ కంపెనీలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి.
ఫ్యామిలీ
శబరిమలకు ఆధునిక సాంకేతికత.!
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించేలా శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయనున్నారు. యాత్రికులు నీలక్కల్కు చేరుకున్నప్పటి నుండి వారు తిరిగి వచ్చే సమయం, సన్నిధానంలో అభిషేకం, ప్రసాదాలు , బుకింగ్ గదులు వరకు అన్ని ఏర్పాట్లను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా ఈ సమగ్ర ప్రణాళిక. ప్రస్తుతం, వర్చువల్ క్యూలు మరియు ప్రసాదాల బుకింగ్ మాత్రమే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా జరుగుతాయి. సాంకేతిక వ్యవస్థలు ఏయే ప్రాంతాల్లో అవసరమో, వాటిని ఏ విధంగా అమలు చేయాలో తెలుసుకోవడానికి RFPని సిద్ధం చేయనున్నారు. విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థల సహాయంతో దీనిని తయారు చేస్తారు. దీంతోపాటు దేవస్వం బోర్డు అన్ని కార్యాలయాలను డిజిటల్గా మార్చనున్నారు. కాగా, శబరిమల వద్ద రద్దీని నియంత్రించడానికి శాస్త్రీయ చర్యలు తీసుకోవాలని, తదుపరి తీర్థయాత్ర నిమిత్తం మౌలిక సదుపాయాలు, జనసమూహ నిర్వహణ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అధ్యక్షుడు కె. జయకుమార్ అధ్యక్షతన జరిగిన దేవస్వం బోర్డు సమావేశం తదనంతరం ఈ సాంకేతిక మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.(చదవండి: శబరిమలకు రికార్డు స్థాయిలో ఆదాయం)
ఎరుపు చీర, బాస్రా ముత్యాల నెక్లెస్లో నీతా అంబానీ మెస్మరైజ్ లుక్..!
ధీరూభాయ్ ఇంటర్నెషనల్ స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకల్లో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ అద్భుతమైన లుక్లో కనిపించారు. కార్యక్రమానికి తగ్గట్టుగా ఆమె ఫ్యాషన్ శైలి ఉండటం నీతా స్పెషాలిటీగా పేర్కొనవచ్చు. ఈవెంట్ని బట్టి తన డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. ఇక ఈ స్కూల్ వార్షికోత్సవంలో సంప్రదాయ ఎరుపు ఎంబ్రాయిడరీ చీర విత్ అరుదైన బాస్రా ముత్యాల ఆభరణాలతో తుళ్కుమన్నారు. ఈ లుక్ ఆమె ఫ్యాషన్ అభిరుచిని ప్రతిబింబిస్తోంది. స్టైలిష్గా ఉండటం కాదు..ఆ వేడుకకు పూర్తి న్యాయం చేసేలా మన ఆహార్యం ఉంటేనే ఆ కార్యక్రమం అత్యంత జయప్రదంగానూ ఆకర్షణీయంగా ఉంటుందని తన వేషధారణతో చెప్పకనే చెప్పారు నీతా అంబానీ. ఈసారి ఆమె స్టన్నింగ్ లుక్ దటీజ్ నీతా.. ఏ వేడుకైనా ఆమెదే ప్రధాన ఆకర్షణ అని మరోసారి ప్రూవ్ చేశారామె. చేతులుకు ఎర్ర గాజులు, ముత్యాల గాజులు కలిపి ధరించి ఆధునికత, నాటి సంప్రదాయన్ని కలగలిపి తన లుక్ని ప్రజెంట్ని చేశారు నీతా. ఈ కార్యక్రమంలో ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ అయిన నీతా అంబానీ అందరికీ చేతులు జోడించి "జై శ్రీ కృష్ణ" అని పలకరిస్తూ కనిపించడం విశేషం. ఈ వార్షిక దినోత్సవ వేడుకల్లో బాలీవుడ్ ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కరీనా కపూర్ ఖాన్, క్రికెటర్ రోహిత్ శర్మ తదితరులు పాల్గొనన్నారు. బాస్రా ముత్యాల ప్రత్యేకత..హైదరాబాద్ నిజాంలచే ప్రాచుర్యం పొందిన బాస్రా ముత్యాలను మనకు అందుబాటులో ఉన్న ముత్యాలకెల్లా అత్యంత అరుదైనవి, విలువైనవి కూడా. చారిత్రాత్మకంగా, అరేబియా గల్ఫ్ దక్షిణ భాగం, ప్రస్తుత ఖతార్, బహ్రెయిన్లోని నుంచి వీటిని సేకరిస్తారట. ఈ తీరం వెంబడి శతాబ్దాలుగా ముత్యాల పెంపకం ఒక సాంప్రదాయ వృత్తిగా ఉంది. అలాగే ఆర్థిక వ్యవస్థ ప్రధాన కేంద్రం కూడా. ప్రస్తుత ఇరాక్ బాస్రా ఓడరేవు నుంచే ఆసియా, యూరప్ కొనుగోలుదారులకు ఈ ముత్యాలను విక్రయిస్తారట. భారత్ కూడా ఈ ముత్యాలను అధికంగా కొనుగోలు చేస్తుందట. మనదేశంలోని రాజకుటుంబాల కారణంగా ఈ ఆభరణాల కొనుగోళ్లు ఎక్కువట. ఇక ఈ బాస్రా ముత్యాలు తరుచుగా తెలుపు, క్రీమ్, గులాబీ, వెండి రంగుల కలయికలో లభిస్తాయట. అయితే ప్రస్తుత కాలుష్య కారణాల రీత్యా వీటి సంఖ్య తక్కువ అవ్వడంతో ఈ ముత్యాలు అరుదైనవి, అమూల్యమైనవిగా మారాయని చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Zoom TV (@zoomtv) (చదవండి: ఆర్మీ లెఫ్టినెంట్గా మిడ్ డే మీల్ వర్కర్ కుమారుడు..! ఏకంగా ఎనిమిది సార్లు ఓటమి)
ఆర్మీ లెఫ్టినెంట్గా ఆయమ్మ కొడుకు!..!
కొన్ని సక్సెస్లు సంవత్సరాల తరబడి నిరీక్షణ, అంకితభావం, ఓపికతో సాకారం అవుతాయి. అలాంటి కథలు ఎప్పటికీ చిరస్మరణీయం, స్ఫూర్తిదాయకం.చిన్ననాటినుంచి కష్టాలు, తగినన్ని వనరుల కొరత ఇన్ని ఉన్నా..ఎలాగైన అద్భుతమైన విజయం అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగి గెలుపు తీరాలకు చేరుకున్నవారని జగజ్జేతలు అనొచ్చు. కలను నిజం చేసుకోవడంలో మార్గదర్శకులు కూడా. అలాంటి ప్రేరణాత్మక సక్సెస్ స్టోరీ ఈ లెఫ్టినెంట్ హర్దీప్ గిల్. హర్యానా రాష్ట్రం జింద్ జిల్లాకు చెందిన హర్దీప్గిల్ చిన్ననాటి నుంచి ఆర్మీలో సేవ చేయాలనేది డ్రీమ్. బాల్యంలో స్కూల్లో మాస్టర్ల వల్ల మదిలో పురుడుపోసుకున్న డ్రీమ్ అతడితోపాటు పెరిగిందే కానీ కనుమరగవ్వలేదు. అయితే హర్దీప్ రెండేళ్ల వయసు నుంచి కన్నీళ్ల కష్టాల కడలిని ఎదుర్కొనాల్సి వచ్చింది. ఎందుకంటే చిన్నతనంలోనే తండ్రిన పోగొట్టుకున్నాడు. కుటుంబ భారం అంతా అమ్మమీదే పడింది. ఆమె మధ్యాహ్నా భోజన పథకం వంటమనిషిగా పనిచేసి కుటుంబాన్ని పోషించుకునేది. అలాగే కొంత ఆదాయం కోసం చిన్నపాటి వ్యవసాయం కూడా చేస్తుండేది అప్పడప్పుడూ. ఇంట్లో ఉన్నత చదువుకు తగినన్ని వనరులేమి లేవు. కానీ ఆ వాతావరణమే గిల్కి నిలకడను, క్రమశిక్షణ, బాధ్యతలను అలవర్చాయి. తనచుట్టూ ఇన్ని సవాళ్లు ఉన్న గిల్ తన ఆశయాన్ని కొనసాగించాడమే కాకుండా, ఎలాగైన ఆర్మీలో చేరి సేవ చేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. ఆనేపథ్యంలో తన గ్రామంలోనే పాఠశాల విద్య, ఇగ్నో ద్వారా బీఏ పూర్తి చేసి చదవు తోపాటు ఇతర రక్షన పరీక్షలకు సిద్ధమవ్వడం కొనసాగించాడు. సుమారు నాలుగేళ్ల క్రితం గిల్ భారత వైమానిక దళంలో ఎయిర్మెన్గా ఎంపికయ్యాడు. అతని విజయం కుటుంబంలో కొండంత ఆశను నెప్పింది. శిక్షణా ప్రక్రియ పూర్తి అయ్యి సర్వీస్లో చేరతాడు అనగా అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టి..మునుపటి నియమాకాలను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. మళ్లీ తన ప్రస్థానం మొదట నుంచి మొదలుపెట్టాల్సి వచ్చినందుకు నిరాశ పడలేదు. ఈసారి ఏకంగా కమిషన్డ్ అధికారి అవ్వడమే లక్ష్యంగా ఎస్ఎస్సీ పరీక్షలపై ఫోకస్ పెట్టాడు. పదేపదే ఓటములు..గిల్ సర్వీస్ సెలక్షన్ బోర్డుకు అనేకసార్లు హాజరవ్వుతూనే ఉండేవాడు. ప్రతి ప్రయత్నం విఫలమవుతూనే ఉండేది. రాతపూర్వక పరీక్షలోనే విజయవంతమవ్వలేక నానా తిప్పలు పడ్డాడు. పాపం అది తన ఆత్మవిశ్వాసానికి, సహనానికి పరీక్షలా మారింది. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాన్నికొనసాగించాడు. చివరికి తొమ్మిదో ప్రయత్నంలో సక్సెస్ అందుకుని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్లో 54వ ర్యాంక్ను సాధించాడు.ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణగిల్ 2024లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరాడు. కఠినమైన శిక్షణా షెడ్యూల్ ఉండేది. ఆ దినచర్య చాలా సవాలుతో కూడినది. ముందుకుసాగడం అంత సులభం కాదు. కానీ అందుకు తగ్గట్టుగా తనను తాను రాటుదేల్చుకుని మరి నిలబడ్డాడు. అనుకున్నట్లుగా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని భారత సైన్యంలో లెఫ్టినెంట్ కమిషన్డ్ అధికారిగా నియమించబడ్డాడు. గిల్ని సిక్కు లైట్ ఇన్ఫాంట్రీ 14వ బెటాలియన్కు అదికారిగా నియమించారు. ఇది క్రమశిక్షణ, కార్యచరణ సింసిద్ధతలకు పేరుగాంచిన యూనిట్. ఈ దృఢ సంక్పలం తన తల్లిన నుంచి వచ్చిందని చెబుతున్నాడు గిల్. ముఖ్యంగా ఎయిర్మ్యాన్ అవకాశాన్ని కోల్పోవడాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు. అలాగే కొండంత ఆశతో మొదటి నుంచి మొదలుపెడుతే..తీరా పదేపదే పలకరించే వైఫల్యాలను అధిగమించి సక్సెస్ అందుకోవడం అనేది మాటల్లో చెప్పగలిగేంత సులభం కాదు అని అంటాడు గిల్. ఇది అలాంటి ఇలాంటి సక్సెస్ స్టోరీ కాదుకదూ..!(చదవండి: ఇండియన్ మిలిటరీ అకాడమీ తొలిమహిళా ఆఫీసర్! 93 ఏళ్ల రికార్డు బ్రేక్
పుస్తకాలు ఎందుకు చదవాలి?
38వ హైదరాబాద్ బుక్ఫెయిర్ డిసెంబర్ 19 నుంచి 29 వరకు 11 రోజుల పాటు ఇందిరా పార్కు వద్ద ఉన్న ఎన్టీఆర్ స్టేడియం (కళాభారతి)లో జరగనుంది. రోజూ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9వరకు ప్రవేశవేళలు. విద్యార్థులకు ఉచిత ప్రవేశం. ఈసారి మొత్తం 365 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. దాదాపు 12 లక్షల మంది సందర్శిస్తారని అంచనా. పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చలు చోటు చేసుకుంటాయి.‘పుస్తకం చదివితే వేయి జీవితాలు జీవించవచ్చు. చదవకుంటే ఒక్కటే’...అన్నాడో మహానుభావుడు. పుస్తకం చదవడమంటే మనకోమెదడు ఉందని గుర్తు చేసుకోవడం. పుస్తకం చదవడమంటే మనకో కుతూహలం ఉందని తెలుసుకోవడం. ఫో¯Œ ... మనకు అక్కర్లేని వినోదాలను ఇస్తోంది. పుస్తకం... కచ్చితమైన దిశను సూచిస్తుంది. దిశాబద్ధులై ఉండేందుకు బుక్ఫెయిర్ బాట పట్టండి.‘పుస్తకాలు అపరిచిత మిత్రులకు స్వాగత ద్వారాలు’.మనిషికి ఏం కావాలి? తనను తాను వ్యక్తపరుచుకోవడం కావాలి. అందుకే మాట్లాడాడు. పాడాడు. ఆడాడు. బొమ్మలు గీశాడు. రాశాడు. వాటి ద్వారా తనేమిటో చె΄్పాడు. ఇదే మనిషికి సాటి మనిషి ఎలా వ్యక్తమవుతాడో కూడా కావాలి. అతని జీవితం ఎలా ఉంది... ఆలోచనలు ఏమిటి... సమస్యలు ఏమిటి... వాటిని ఎలా ఎదుర్కొన్నాడు.... అందుకే ఆట, పాట, బొమ్మ, కథల్లో సాటి మనిషి గురించి తెలుసుకోవడానికి ఉబలాట పడ్డాడు.ఈ ఇచ్చి పుచ్చుకోవడాలు సజీవంగా ఉన్నంత కాలం మనిషి సజీవంగా ఉన్నట్టే లెక్క. లేకుంటే పాకుడు నీళ్లతో సమానం. అందుకే పుస్తకాలు చదవాలి. తనను తాను తెలుసుకునేందుకు, ఇతరుల గురించి తెలుసుకునేందుకూ. ఈ విశాల సృష్టిలో మనుషులంతా ఒక్కలాంటి వాళ్లే... రకరకాల పద్ధతుల్లో జీవిస్తూ ఒకేరకమైన ఉద్వేగాలను అనుభవిస్తుంటారని తెలుసుకుని... అందరి నుంచి ఉమ్మడి శక్తిని పొంది వ్యక్తిగత జీవితాన్ని ఒడ్డున చేర్చుకునేందుకు పుస్తకాలు చదవాలి.పెద్దబాలశిక్షతో మొదలుపుస్తకం ప్రాథమిక కర్తవ్యం జ్ఞానాన్ని ఇవ్వడమే. అందుకే పుస్తకం విద్యాసాధనం అయ్యింది. అయితే విద్యతో మనిషి ఆగడు. కడుపు నిండిన మనిషి కళ కోసం చూసినట్టే విద్య నేర్చిన మనిషి వికాసం వైపు చూశాడు. వికాసానికి పుస్తకం దారి చూపింది. భాష, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర... ఇవన్నీ పుస్తకంలో నిక్షిప్తమయ్యి తరం నుంచి తరానికి అందాయి. అయితే వికాసంతో కూడా మనిషి ఆగడు. వినోదం కావాలి, ఆహ్లాదం కావాలి, అనుభూతి కావాలి, ఉద్వేగం కావాలి, కల్పిత గాథలు... పుక్కిటి పురాణాలు కావాలి... ఫ్యాంటసీ ప్రపంచాలు కావాలి... అవన్నీ పుస్తకమే ఇచ్చింది. పుస్తకం ఇచ్చేలా చేసుకున్నాడు. పుస్తకాలను నిచ్చెనమెట్లుగా చేసుకుని మనిషి దినదిన ప్రవర్థమానమయ్యాడు. అయితే పుస్తకాన్ని వదిలిపెట్టిన, నిర్లక్ష్యం చేసిన జాతి చీకటిలో ప్రయాణిస్తుంది. కొనసాగింపు ముఖ్యం. అందుకే యూరోపియన్ దేశాలలో పుస్తకాన్ని వదిలిపెట్టడం అనేది అక్కడివాళ్లు కల్లో కూడా ఊహించరు. మనవాళ్లు పుస్తకం విలువ కనిపెట్టారు కాబట్టి ప్రతి ఇంట్లో కనీసం పెద బాలశిక్ష అయినా ఉండాలని తలిచారు. నేడు మన ఇళ్లల్లో పెద బాలశిక్షకు బదులు ఫోన్లు చేరాయి.జీవితాన్ని మార్చే పుస్తకాలుపుస్తకాలు జీవితాలను మార్చేస్తాయి. ఒక్క పుస్తకం చదివి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నవాళ్లు, ఒక్క పుస్తకం చదివి జీవితాన్ని మార్చుకున్నవారు, ఒక్కపుస్తకం చదివి శాసనంగా మలుచుకున్నవారు ఉన్నారు. ‘విద్య లేని వాడు వింత పశువు’ అన్నారు పెద్దలు గానీ ‘పుస్తకం చదవని వాడే వింత పశువు’ అనుకోక తప్పదు. ‘తిని తొంగుంటే మనిషికీ గొడ్డుకీ తేడా ఏం ఉంటుంది’ అన్నట్టుగా పుస్తకం చదవకపోతే వివేచన, వివేకం ఎలా జాగృతమవుతాయి? ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎలా తెలుస్తుంది? మనిషిగా పుట్టినందుకు మంచివైపు నిలబడాలన్న బాధ్యత ఎక్కడినుంచి వస్తుంది?పుస్తకం చిరంజీవిపుస్తకాన్ని చంపే మారణాయుధాలు ఎన్నో వచ్చాయి. సినిమాలు, టీవీలు, వీడియో కేసెట్లు, వీడియో గేమ్స్, ఓటీటీలు, రీల్సు... ఎన్నో. కాని పుస్తకం చిరంజీవిగానే ఉంది. పుస్తకం వేయి పుటలతో లక్ష కన్నులతో లోకాన్ని చూపుతుంది. సినిమా ఆ పని చేయదు. పుస్తకం ఒక గాథను వాస్తవ పరిథిలో చూపి కొంత ఊహకు వదిలిపెడుతుంది. అది వీడియో చేయదు. పుస్తకం ప్రశ్నను లేవనెత్తుతుంది. వెంటాడుతుంది. ప్రశ్న లేని మనిషి, ప్రశ్నించని మనిషి శిథిలమయ్యి మానసిక సంపద కోల్పోతాడు. అందుకే ‘మనీప్లాంట్ సరే. పుస్తకం ఉంచుకోవడం కూడా సంపదతో సమానమే’ అని గ్రహించాలి. మనుషులకు పండగ ఉన్నట్టు పుస్తకాలకు కూడా పండగ ఉంటుంది. ప్రతి సంవత్సరం ‘హైదరాబాద్ బుక్ఫెయిర్’లో పుస్తకాలన్నీ కూడబలుక్కుని ఒకచోటకు చేరుతాయి. వాటిని చూడటానికి వెళ్లాలి. చేతుల్లోకి తీసుకోవాలి. వాటితో స్నేహం చేయాలి. ఇంటికి పిల్చుకోవాలి. పుస్తకాలు ఇంటికి వచ్చాక దీపాలుగా మారడం మీరే గమనిస్తారు. ఆ కాంతులు ఇంటిని వెలిగించడం చూస్తారు. ఆ కాంతుల్లో వర్థిల్లడం ఎంతటి భాగ్యమో తప్పక తెలుసుకుంటారు.అందరికీ తల ఊపడం మానేలా చేస్తాయిపుస్తకాలు ఎందుకు చదవాలి? నా చిన్నప్పుడు నన్నెవరన్నా ఈ ప్రశ్న అడిగి ఉంటే ఆశ్చర్యపోయి ఉండేవాడిని. ఎందుకంటే పుస్తకాలు చదవడం వల్లనే నాకు లోకం తెలిసింది. ప్రపంచపు పోకడ తెలిసింది. మానవజాతి గతం గురించీ, వర్తమానం గురించీ తెలిసింది. మానవుడి భవిష్యత్తు ఎలా ఉండాలన్న దాని మీద కవులూ, రచయితలూ, తత్త్వవేత్తలూ శాస్త్రవేత్తలూ ఎటువంటి కలలుగన్నారో తెలిసింది. నేను పుట్టి పెరిగిన మారుమూల కొండ కింద పల్లెలో ఆ రోజుల్లో నాకు దొరికిన ఆ కొద్దిపాటి పుస్తకాలు ఆ రోజు దొరకకపోయి ఉంటే నా జీవితం గురించి నాకు ఎప్పటికీ అర్థమయ్యే దారి దొరికి ఉండేది కాదు. ఇప్పుడు ఇన్ని మాధ్యమాలు మన అరచేతుల్లోకి అందుబాటుకొచ్చాక పుస్తకాలు ఎందుకు చదవాలి అన్న ప్రశ్న తలెత్తుతున్నదేమో! ఇన్ని మాధ్యమాలున్నా, పుస్తకాలు చదవకపోతే మనం ఎప్పటికీ పక్కవాడి అభి్రపాయాలకే తలూపుతూ బతుకుతుంటాం. కాబట్టి ఈ మాధ్యమాలన్నింటిలోనూ అత్యంత విశ్వసనీయమైన మాధ్యమం పుస్తకాలు మాత్రమే.– వాడ్రేవు చినవీరభద్రుడు,సుప్రసిద్ధ రచయితపుస్తకాలు అందరినీ మనవాళ్లను చేస్తాయిపుస్తకాలు అనేక మానవ జీవిత అనుభవాల సారాన్ని నింపుకున్న పాత్రలు. అమూల్యమైన జ్ఞానాన్ని పొందడానికి మన కళ్లను తెరిపించే వెలుతురు కిరణాలు. బలహీనులకు బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చే టానిక్లు. ప్రపంచాన్నంతా మనకు పరిచయం చేస్తాయి. మన జీవితాలను అర్థం చేసుకోవడం ఎలాగో నేర్పుతాయి. పుస్తకాలు నవ్విస్తాయి, ఏడిపిస్తాయి, దయ, జాలి, కరుణ, ప్రేమ, సహోదర భావనలను మన హృదయాల్లో నింపుతాయి. వాట్సప్, యూట్యూబ్ల వంటివి మనల్ని మనం పరాయివారిగా చేస్తే పుస్తకాలు అందరినీ మనవాళ్ళుగా చేసుకోవటం నేర్పుతాయి. పుస్తకాలు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కాదు. అసలైన వివేకం. పుస్తక స్పర్శ కోసం, ప్రపంచాన్ని ఆలింగనం చేసుకోవడం కోసం పుస్తక ప్రదర్శనలకు వెళ్ళాలి. మనం స్వయంగా ఎంచుకుని స్వంతం చేసుకొన్న పుస్తక పఠన అనుభూతికి సాటివచ్చేది లేదు. పుస్తకం కోసం తహతహలాడటమంత అందమైన అనుభూతి మరొకటి లేదు.– ఓల్గా, సుప్రసిద్ధ రచయిత్రి
అంతర్జాతీయం
రైతన్నకు కోపం వచ్చింది.. రాజధాని తగలబడింది!
బ్రస్సెల్స్: యూరప్ రాజధాని బ్రస్సెల్స్ రైతుల ఆందోళనలతో అట్టుడికి పోతుంది. యూరోపియన్ యూనియన్ కొత్త ప్రతిపాదనలు తమ జీవనోపాదిని దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులు పదివేలకు పైగా ట్రాక్టర్లతో నిరసనలు చేపట్టారు. ఆ నిరసన తారా స్థాయికి చేరుకున్నాయి.ఇటీవల యురేపియన్ యూనియన్ బ్రెజిల్, దక్షిణ అమెరికా దేశాలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం తమ జీవనోపాధిని దెబ్బతీస్తోందని ఆందోళన చేస్తున్న రైతులు ట్రాక్టర్లతో యూరోపియన్ పార్లమెంట్ భవనం వెలుపల, యూరోపియన్ యూనియన్ నాయకుల సమావేశం జరుగుతున్న ప్రాంతంలో మొహరించారు. కొత్త ప్రతిపాదనలు తమ జీవనోపాధిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతాయోనని తెలిపేలా.. రైతులు టైర్లు కాల్చి, రహదారులను బ్లాక్ చేసి, బంగాళాదుంపలు, గుడ్లు,సాసేజ్లు విసిరారు. ట్రాక్టర్లతో రాజధాని బ్రస్సెల్స్ను అష్టదిగ్భందనం చేశారు. అయితే, రైతుల ఆందోళనల్ని నిలువరించేందుకు పోలీసు దళాలు వారిపై టియర్ గ్యాస్, వాటర్ కానన్లను ప్రయోగించారు. రైతుల సమూహాన్ని చెదరగొట్టారు. ఎక్కడికక్కడే అరెస్టులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. రైతుల తిరుగుబాటుకు కారణంయురేపియన్ యూనియన్ బ్రెజిల్, దక్షిణ అమెరికా దేశాలతో వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంతో ఇరు దేశాల నుంచి చౌకగా మాంసం, పంటలు దిగుమతి అవుతాయని.. ఇది స్థానిక మార్కెట్లను దెబ్బతీస్తుందని రైతులు భయపడుతున్నారు. దీనికి తోడు సబ్సిడీలను తగ్గించడమే కాకుండా కఠినమైన పర్యావరణ నియమాలను అమలు చేస్తాయి. తద్వారా యూరోపియన్ రైతులను ప్రపంచ మార్కెట్లో పోటీ చేయలేని స్థితి నెలకొంటుందని ఆరోపిస్తున్నారు.FARMERS BLOCK ROADS, BURN TIRES IN BRUSSELS to protest EU free trade deal and CARBON TAXESCritics say the deeply-unpopular policies will damage food security and farmer livelihoods in markets#BrusselsFarmersProtest #Brussels pic.twitter.com/X1kricxwBn— Mjrocksss (@Mritunjayrocks) December 19, 2025 రణరంగంగా గ్రీస్మరోవైపు, ఆగ్నేయ ఐరోపా దేశమైన గ్రీస్ రణరంగంగా మారింది. డిసెంబర్ 16–17న గ్రీక్ పార్లమెంట్ 2026 బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్పై ప్రజలు ఆందోళనకు దిగారు. కార్మిక సంఘాలు 24 గంటల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఉద్యోగులు మున్సిపాలిటీ కార్యాలయాల్ని మూసివేశారు. ఉపాధ్యాయులు అథెన్స్లో కొనసాగుతున్న నిరసనల్లో పాల్గొన్నారు. ఈ నిరసనలకు రైతులు సైతం మద్దతు తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారి బారికేడ్లను ఏర్పాటు చేశారు. తక్కువ వేతనాలు, పెరుగుతున్న ఆహారం ధరలు, ఇంటి వ్యయంపై ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. రైతులు, ప్రజా రంగ కార్మికులు కలిసి నిరసన చేయడం వల్ల ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు, గ్రీస్ 2025లో 23.5 బిలియన్ రికార్డు స్థాయి పర్యాటక ఆదాయాన్ని గడించింది. ప్రపంచంలోని టాప్ 10 పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిచింది. పర్యాటక రంగం బలంగా ఉన్నప్పటికీ సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయంటూ అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.Streets of Brussels woke up to a spud storm after farmers protested the EU -literally lining the streets with potatoes.#EuropeanUnion #Brussels #EuropeanParliament #farmers #BrusselsFarmersProtest#farming #NoFarmersNoFood pic.twitter.com/8ZbTkmcusR— MidnightVisions (@MidnightVision5) December 19, 2025
పాక్ పరువు తీస్తున్న అరబ్ కంట్రీస్
అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఇమేజ్ మరోసారి దెబ్బ తింది. ఆ దేశ పౌరులను అరబ్ దేశాలు బలవంతంగా వెనక్కి పంపించేస్తున్నాయి. పైగా వాళ్ల మీద బిచ్చగాళ్లు.. నేరగాళ్లు అనే ముద్ర వేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది ఇప్పుడు.. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు కొత్త తలనొప్పి వచ్చి పడుతోంది. వలస వెళ్లిన తమ పౌరులను ఆ దేశాలు వెనక్కి పంపించేస్తున్నాయి. పాక్ పౌరుల వల్ల తమ దేశాల్లో నేరాలు పెరుగుతున్నాయని.. పైగా భిక్షాటనతో తమ దేశ పర్యాటక రంగాన్ని దెబ్బ తీస్తున్నారని ఆయా దేశాలు భావిస్తున్నాయి. దీంతో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల నుంచి పెద్ద సంఖ్యలో పాక్ పౌరులను వెనక్కి పంపించేస్తున్నారు. యూరప్-ఆసియా సరిహద్దులోని.. కాకేసస్ దేశం అజర్ బైజాన్ కూడా ఇలాంటి చర్యలే చేపట్టింది. ఇందులో సౌదీ అరేబియా నుంచి వచ్చిన 24,000 మంది ఉన్నారు. దుబాయ్ నుంచి 6,000 మంది, అజర్బైజాన్ నుంచి వచ్చిన 2,500 మందిని పాక్కు తిప్పి పంపించారు. ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ మాఫియాలో భాగంగా ఆయా దేశాలకు వెళ్లినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే వీళ్ల వల్ల విద్య, ఉద్యోగాల నిమిత్తం ఆయా దేశాలకు వెళ్లిన వాళ్లను కూడా వెనక్కి పంపుతున్నారని పాక్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.హెచ్చరించినా కూడా.. 2024లో సౌదీ అరేబియా పాక్కు ఓ ప్రకటన జారీ చేసింది. ఉమ్రా వీసాలను భిక్షాటన కోసం దుర్వినియోగం చేయొద్దని తమ పౌరులకు గట్టిగా చెప్పాలని పాకిస్తాన్ను హెచ్చరించింది. నియంత్రించకపోతే హజ్, ఉమ్రా యాత్రికులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిపింది. అయినా కూడా ఆ వ్యవహారం కొనసాగుతూ వస్తోంది. ఇక యూఏఈ ఏమో అదనంగా ఇంకో వాదనను తెరపైకి తెచ్చింది. తమ దేశంలో జరుగుతున్న నేరాల్లో పాక్ పౌరుల వాటా కూడా ఉంటోందని.. వివిధ ఉద్దేశాలతో వచ్చి చాలామంది నేరాలకు పాలపడుతున్నారని యూఏఈ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో కిందటి ఏడాది ఆ పాక్ పౌరులపై వీసా పరిమితులు విధించింది. అరబ్ దేశాలు మాత్రమే కాదు.. ఆఫ్రికా, యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో.. ఆసియాలో కాంబోడియా, థాయ్లాండ్ వంటి దేశాల్లో కూడా పాక్ పౌరులు బిచ్చగాళ్లుగా అక్కడి ప్రభుత్వాలకు తలనొప్పులుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఆర్గనైజ్డ్ భిక్షాటన గ్యాంగ్లను అడ్డుకోవడం, అక్రమ వలసలను నిరోధించడం కోసం వాళ్లను వెనక్కి పంపించేస్తున్నాయని ఆయా దేశాలు. అయితే.. పశ్చిమాసియాలో పట్టుబడ్డ ముఠాల్లో 90 శాతం బిచ్చగాళ్లు పాక్కు చెందిన వాళ్లే ఉన్నారని ఆ దేశ విదేశాంగ అధికారి జీషాన్ ఖంజాదా చెబుతుండడం గమనార్హం. వేల మంది ముఠాగా..ఈ ఏడాదిలో ఇప్పటిదాకా పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(FIA) విమానాశ్రయాల్లో 66,154 మందిని విదేశాలకు వెళ్లకుండా ఆపగలిగింది. మక్కా, మదీనా పవిత్ర స్థలాల వద్ద కూడా పాకిస్తానీ భిక్షాటనకారులు యాత్రికులను వేధిస్తున్నారని పాక్కు చెందిన డాన్ పత్రిక ఈ మధ్యే ఓ కథనం ప్రచురించడం గమనార్హం. ఈ పరిణామాలపై ఎఫ్ఐఏ డీజీ స్పందిస్తూ.. ఈ నెట్వర్క్ల వల్ల పాక్ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సైన్యం సాయంతో ఇలాంటి ముఠాలను అడ్డుకోవాలని షెహబాజ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు.
దుబాయ్లో భారీ వర్షం.. బుర్జ్ ఖలీఫా పరిస్థితి ఇది..
దుబాయ్ (Dubai)ని భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపిలేని కుండపోత వర్షం కారణంగా దుబాయ్ వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి కాలనీలు నీట మునిగాయి. పలుచోట్ల పిడుగులతో (Lightning strikes) కూడిన వర్షం కురిసింది. వర్షం సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా (Burj Khalifa)ను పిడుగు తాకింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. దుబాయ్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వర్షం సమయంలోనే దుబాయ్లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడిన దృశ్యాన్ని స్వయంగా ఆ దేశ యువరాజు (Dubai crown prince) షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. భారీ వర్షం కురుస్తుండగా, ఉరుముల గర్జనల మధ్య ఆకాశం నుంచి వచ్చిన పిడుగు నేరుగా బుర్జ్ ఖలీఫా పైభాగాన్ని తాకింది. ఈ వీడియోకి ‘దుబాయ్’ అనే చిన్న క్యాప్షన్ మాత్రమే జోడించారు యువరాజు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా, తరచూ పిడుగులు పడుతున్నా, భవనానికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు.Heavy rain early this morning led to localized flooding across parts of Dubai and other UAE areas. Waterlogging was reported on several roads as authorities issued weather warnings and urged residents to stay cautious and avoid unnecessary travel.Emergency teams are monitoring… pic.twitter.com/dwSYOXuT4Y— Mazhar Khan (@Mazhar4justice) December 19, 2025ఇక, ప్రస్తుతం యూఏఈలో వాతావరణం అస్థిరంగా ఉంది. 'అల్ బషాయర్' అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు.. ఎడతెరిపిలేని వర్షం కారణంగా రాస్ అల్ ఖైమాలో గోడ కూలిపోవడంతో భారత్కు చెందిన 27 ఏళ్ల సల్మాన్ ఫరీజ్ మృతి చెందినట్టు స్థానిక అధికారులు తెలిపారు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా విమానాలు, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. First Rain in Dubai this year. Thank you, God, for this life-giving rain! We praise You for replenishing the earth, and bringing relief and new life, Thank you for every drop that nourishes our plants, fills our rivers, and refreshes our souls, making us remember our dependence… pic.twitter.com/AVCtSWysVg— Dolly_Pizzle of Chelsea💙🦅 (@harbyhorlar2) December 19, 2025Shaikh Hamdan posts video of lightning strike on Burj KhalifaShaikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum, Crown Prince of Dubai, posted a video of lightning striking the tip of the world's tallest building, Burj Khalifa, as heavy rain hit parts of Dubai and the rest of the… pic.twitter.com/wHZpC49W3I— GDN Online (@GDNonline) December 18, 2025
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు బిగ్ అలర్ట్
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ కొత్తరూల్ను తీసుకొచ్చింది. హ్యాష్ట్యాగ్ల వినియోగంపై పరిమితి విధిస్తున్నట్లు తన ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ఇక మీద వాటిని పోస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్స్టాగ్రామ్ వాడేవాళ్లకు సూచిస్తోంది.ఇన్స్టాగ్రామ్లో చేసే పోస్ట్ లేదంటే రీల్కు ఇక నుంచి గరిష్ఠంగా ఐదు మాత్రమే హ్యష్ట్యాగ్లు పెట్టుకునే అవకాశముందని ఆ ప్రకటనలో పేర్కొంది. తక్కువ యాష్ ట్యాగ్ల వల్ల పోస్టు బలంగా యూజర్లలోకి వెళ్తుందని.. తద్వారా రీచ్ బాగా అవుతుందని చెబుతోంది. ఇంతకుముందు ఇన్స్టాలో 30 హ్యాష్ట్యాగ్లు పెట్టుకోవడానికి అవకాశముండేది. అయితే.. ఎక్కువ, అసాధారణమైన హ్యాష్ట్యాగ్లు (#reels, #explore) వాడటం వల్ల కంటెంట్ పనితీరు తగ్గుతుంది. అదే తక్కువగా.. అదీ నిర్దేశిత హ్యాష్ట్యాగ్లు వాడడం వల్ల కంటెంట్ డిస్కవరీకి ఎక్కువ అవకాశం ఉంటుందని ఇటు నిపుణులూ సూచిస్తున్నారు. ఉదాహరణ: బ్యూటీ క్రియేటర్లు తమ కంటెంట్కు సంబంధించిన బ్యూటీ హ్యాష్ట్యాగ్లు వాడితే.. ఆ కంటెంట్ను ఆసక్తి ఉన్నవారు సులభంగా కనుగొంటారు. వంట చానెల్స్ నడిపే వాళ్లు.. వాళ్లు చేసే వంటకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ మాత్రమే ఉపయోగించడం బెటర్. ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఏ హ్యాష్ ట్యాగ్ను పడితే ఆ హ్యాష్ట్యాగ్తో పోస్ట్ చేస్తే మొదటికే మోసం రావొచ్చు. ఈ నెల ప్రారంభంలో కేవలం 3 హ్యాష్ట్యాగ్లే ఉపయోగించాలని ఇన్స్టాగ్రామ్ తన యూజర్లను అలర్ట్ చేయాలనుకుంది. కానీ, ఇప్పుడు అధికారికంగా 5 హ్యాష్ట్యాగ్ల పరిమితి అమలు చేయాలని నిర్ణయించింది.హ్యాష్ట్యాగ్లంటే(#).. కంటెంట్ డిస్కవరీకి ఉపయోగపడేవి. సంబంధిత టాపిక్ సెర్చ్లలో, ట్రెండింగ్ లిస్టుల్లో, సెర్చ్ (Explore) ఫీడ్లో కనిపించే అవకాశం ఉంటుంది. సరైన హ్యాష్ట్యాగ్లు వాడితే మీ కంటెంట్ను నిజంగా ఆసక్తి ఉన్నవారు చూసే అవకాశం పెరుగుతుంది. కానీ సంబంధం లేనివి.. అడ్డగోలుగా ఎక్కువ వాడితే కంటెంట్ పనితీరు తగ్గి.. ఎవరికి పడితే వాళ్లకు వెళ్తుంది. అలాగే ఇన్స్టా ఆల్గారిథమ్ ప్రకారమూ స్పామ్గా పరిగణించి రీచ్ తగ్గుతుంది. కాబట్టి ఇన్స్టాలో మాత్రమే కాదు.. ఇతర సోషల్మీడియా ప్లాట్ఫారమ్లోనూ తక్కువగా, సంబంధిత హ్యాష్ట్యాగ్లు వాడటం ఉత్తమని నిపుణులు చెబుతుంటారు.
జాతీయం
అంతటా జింగిల్ బెల్స్..
భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడి ప్రజలు ప్రతి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు, వీధులన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో, చర్చిలు ప్రార్థనలతో, బేకరీలు ఘుమఘుమలాడే కేకులతో కళకళలాడుతుంటాయి. దేశ రాజధాని ఢిల్లీ నుండి సముద్ర తీర ప్రాంతమైన గోవా వరకు, ప్రతి నగరం తనదైన శైలిలో క్రిస్మస్ వేడుకలకు స్వాగతం పలుకుతుంది.ఢిల్లీ, ముంబై మహానగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా కన్నాట్ ప్లేస్ ప్రాంతం పెద్ద క్రిస్మస్ చెట్లు, మెరిసే లైట్లతో పండుగ ధగధగలాడుతోంది. ఇక్కడ షాపింగ్ చేయడంతో పాటు, సేక్రెడ్ హార్ట్ కేథడ్రల్లో జరిగే అర్ధరాత్రి ప్రార్థనల్లో పాల్గొనడం ఒక అద్భుత ఆధ్యాత్మిక అనుభవం అందిస్తుందని అంటారు. ముంబై నగరంలో బాంద్రా వీధులు పండుగ శోభను సంతరించుకున్నాయి. మౌంట్ మేరీ బసిలికా చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మందిని పాల్గొంటారు. మెరైన్ డ్రైవ్ వెంబడి చల్లని గాలిలో నడుస్తూ, క్వీన్స్ నెక్లెస్ కాంతులను వీక్షించడం పర్యాటకులకు మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.గోవా,పాండిచ్చేరి తీరాల్లో..దేశంలో క్రిస్మస్ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది గోవా. ఇక్కడి పురాతన చర్చిలైన బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్, సే కేథడ్రల్లు పండుగ వేళ అద్భుతమైన అలంకరణలతో మెరిసిపోతాయి. బీచ్లలో జరిగే రాత్రి పార్టీలు, సంగీత కచేరీలు, బాణసంచా వేడుకలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటాయి. ఫ్రెంచ్ సంస్కృతి మమేకమై ఉండే పాండిచ్చేరిలో క్రిస్మస్ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. వైట్ టౌన్లోని ఫ్రెంచ్ వాస్తుశిల్ప భవనాలు, 'చర్చి ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఏంజిల్స్'లో జరిగే ప్రార్థనలు.. యూరప్లో ఉన్న అనుభూతిని కలిగిస్తాయని పలువురు చెబుతుంటారు.కోల్కతా,బెంగళూరులలో..కోల్కతాలో క్రిస్మస్ను అత్యంత వేడుకగా జరుపుకుంటారు. పార్క్ స్ట్రీట్ ఒక పెద్ద కార్నివాల్లా మారుతుంది. ఎక్కడ చూసినా సంగీతం, లైట్లు, రకరకాల ఆహార స్టాళ్లు కనిపిస్తాయి. సెయింట్ పాల్స్ కేథడ్రల్లో జరిగే కరోల్ గానం వినడానికి రెండు చెవులూ చాలవు. ఇక గార్డెన్ సిటీ బెంగళూరులో బ్రిగేడ్ రోడ్, ఎంజీ రోడ్లు విద్యుత్ దీపాల వెలుగులతో మెరిసిపోతాయి. చర్చి స్ట్రీట్లోని కేఫ్లు ప్రత్యేకమైన క్రిస్మస్ మెనూలతో పర్యాటకులను ఆహ్వానిస్తాయి. పురాతన సెయింట్ మేరీస్ బసిలికాలో జరిగే వేడుకలు నగరపు పాత కాలపు వైభవాన్ని గుర్తుచేస్తాయి. ఇది కూడా చదవండి: ఈసీఐ ‘ఆపరేషన్ క్లీన్’: ఆ రాష్ట్రాల్లో గగ్గోలు!
70 ఏళ్లొచ్చినా.. రోజూ లైంగిక వేధింపులే
కర్ణాటక: 70 ఏళ్ల వయసు వచ్చింది, రోజూ సతాయిస్తూ నరకం చూపుతున్నాడు అని భర్త మీద 65 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ప్రిన్సిపాల్ గోవిందరాజనగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చెప్పిన మాట వినడం లేదని నేను, నా ఇద్దరు కుమారులు 8 రోజుల్లోగా ఇంటి నుంచి బయటికి వెళ్లాలని భర్త లీగల్ నోటీస్ ఇచ్చాడని తెలిపింది.హత్య బెదిరింపులు..వివరాలు.. బాధితురాలు ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ పనిచేసి రిటైరయ్యారు. ఆమె మంచి హోదాలో ఉండడం భర్తకు నచ్చేది కాదు. జీతం, గ్రాట్యూటీ, పింఛన్, ఆస్తులను తన పేర మార్చాలని ఒత్తిడి చేసేవాడు. అతడు 1993లో కుద్రేముఖ్లో గనులలో ఉద్యోగం చేస్తూ మానేశాడు. అప్పటి నుంచి భార్యను లైంగిక క్రియ కోసం రోజూ వేధిస్తున్నాడు. అయినా సహిస్తూ వచ్చింది. నవంబరు 22 తేదీన బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు, ప్రతిఘటిస్తే గొంతునులిమి, కొట్టి, దూషించాడు. అంతేగాక తన ఇద్దరు కుమారులను హత్యచేస్తానని బెదిరించాడని మహిళ ఫిర్యాదులో తెలిపింది. ఇంటి సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయినట్లు తెలిపింది. తనకు గుండెకు బైపాస్ సర్జరీ అయ్యిందని, శ్వాసకోశ జబ్బుతో చికిత్స పొందుతున్నానని, భర్తకు ఏమాత్రం జాలి, దయ లేదని వాపోయింది. పోలీసులు విచారణకు హాజరుకావాలని సదరు శాడిస్టు భర్తకు నోటీస్ జారీచేశారు.
ఈసీఐ ‘ఆపరేషన్ క్లీన్’: ఆ రాష్ట్రాల్లో గగ్గోలు!
వచ్చే ఏడాది(2026) జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్)ప్రక్రియ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఓటర్ల తొలగింపు జరగడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లో కోట్ల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించడం.. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.తమిళనాడులో 97 లక్షల పేర్లు తొలగింపు తమిళనాడులో మొదటి దశ సవరణ తర్వాత ఏకంగా 97 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఈ ప్రక్రియకు ముందు 6.41 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య, ఇప్పుడు 5.43 కోట్లకు పడిపోయింది. తొలగించిన వారిలో 27 లక్షల మంది మరణించిన వారు కాగా, 66 లక్షల మంది రాష్ట్రం విడిచి వెళ్లిన వలసదారులు, మరో 3.4 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లుగా ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాజధాని చెన్నైలోనే అత్యధికంగా 14.25 లక్షల ఓట్లు తొలగించడం గమనార్హం.కోయంబత్తూరులో భారీ మార్పులు ప్రతిపక్ష పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కోయంబత్తూరు జిల్లాలో 6.5 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఇక్కడ ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఐదు ఏఐడీఎంకే, ఒకటి బీజేపీ చేతిలో ఉన్నాయి. అలాగే దిండిగల్లో 2.34 లక్షలు, కాంచీపురంలో 2.74 లక్షల పేర్లను తొలగించారు. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తొలిసారి పోటీ చేస్తున్న కరూర్ జిల్లాలో కూడా 80 వేల ఓట్లు తొలగింపునకు గురయ్యాయి.బెంగాల్లో 58 లక్షల ఓట్లపై వేటు పశ్చిమ బెంగాల్లో కూడా పరిస్థితి ఇదేవిధంగా ఉంది. అక్కడ విడుదలైన ముసాయిదా జాబితా ప్రకారం 58.20 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. ఇందులో 24.16 లక్షల మంది మరణించిన వారు, 19.88 లక్షల మంది వలస వెళ్లిన వారు కాగా, 12.20 లక్షల మంది గల్లంతైనట్లు గుర్తించారు. దాదాపు 1.38 లక్షల పేర్లను బోగస్ ఎంట్రీలుగా ఈసీఐ నిర్ధారించింది. ఫిబ్రవరి 2026 వరకు ఇక్కడ ప్రక్రియ కొనసాగనుంది.మమతా బెనర్జీ ఆగ్రహంపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ప్రక్రియను ‘బీజేపీ-ఈసీ కుట్ర’గా అభివర్ణించారు. ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారని, తమ రాష్ట్రం నుండి ఎవరినీ బయటకు పంపనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో 40 మంది అధికారులు మరణించారని ఆమె ఆరోపించారు. అయితే, మమతా బెనర్జీ తమ రాష్ట్రంలోని అక్రమ వలసదారుల ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే ఇలా మాట్లాడుతున్నారని బీజేపీ ఎదురుదాడికి దిగింది.తమిళనాడులో భిన్న స్వరాలుతమిళనాడులో అధికార డీఎంకే, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఈ సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ప్రధాన ప్రతిపక్షం ఏఐడీఎంకే మాత్రం ఈ ప్రక్రియకు మద్దతు తెలపడం విశేషం. నకిలీ ఓటర్ల తొలగింపు అవసరమని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) పేర్కొన్నారు. డీఎంకే ఈ విషయంలో అనవసర నాటకం ఆడుతోందని ఆయన విమర్శించారు.గుజరాత్లో 73.73 లక్షల పేర్లు తొలగింపుగుజరాత్ రాష్ట్రంలో 2025 అక్టోబర్ 27న ప్రారంభమైన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ముగిసింది. ప్రధాన ఎన్నికల అధికారి హరిత్ శుక్లా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 73.73 లక్షల పేర్లను తొలగించారు. ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందు 508 లక్షలుగా ఉన్న ఓటర్ల సంఖ్య, సవరణల అనంతరం ప్రస్తుతం 434 లక్షలకు చేరింది. తొలగించిన పేర్లలో అత్యధికంగా 40.25 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్లిన వారు కాగా, 18.07 లక్షల మంది మరణించిన వారు, 9.69 లక్షల మంది గైర్హాజరైన వారు, 3.81 లక్షల నకిలీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 85.50 శాతం మంది ఓటర్ల నుండి (4.34 కోట్ల మంది) గణన ఫారాలను సేకరించి ఈ ప్రక్షాళన చేపట్టారు. ఓటర్లు తమ పేర్ల నమోదు లేదా సవరణల కోసం 2026 జనవరి 18 వరకు అభ్యంతరాలు దాఖలు చేయవచ్చు.తుది ఓటర్ల జాబితా 2026 ఫిబ్రవరి 17న ప్రచురితమవుతుంది.బీహార్లో ‘సర్’ సాగిందిలా..బీహార్లో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక విస్తృత సవరణ (సర్) ప్రక్రియ 2025 జూన్ 24న ప్రారంభమై, 2025 సెప్టెంబర్ 30 నాడు తుది జాబితా ప్రచురణతో ముగిసింది. ఈ ప్రక్రియలో మొత్తం 69 లక్షల మంది పేర్లను జాబితా నుండి తొలగించగా, 21.5 లక్షల మందిని కొత్తగా ఓటర్లుగా చేర్చారు. దీనివల్ల నికరంగా ఓటర్ల సంఖ్య సుమారు 47.5 లక్షలు తగ్గి, తుది జాబితా 742 లక్షలుగా ఉంది. ముఖ్యంగా ఆగస్టు 1న విడుదల చేసిన ముసాయిదాలోనే 65.6 లక్షల పేర్లను తొలగించగా, ఆ తర్వాత జరిగిన రెండు నెలల క్షేత్రస్థాయి పరిశీలనలో మరో 3.66 లక్షల పేర్లను తొలగించి, కొత్త దరఖాస్తులను ఆమోదించారు. ఈ ప్రక్రియలో మహిళా ఓటర్ల పేర్లు అత్యధికంగా తొలగించబడటం, సరిహద్దు జిల్లా అయిన గోపాల్గంజ్లో గరిష్టంగా కోత పడటం చర్చనీయాంశంగా మారింది.ఈసీఐ క్లారిటీ.. కోర్టు సమర్థనఓటర్ల జాబితాను కాలానుగుణంగా సవరించే రాజ్యాంగబద్ధమైన అధికారం తమకు ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బీహార్లో కూడా ఇదే తరహా వివాదం తలెత్తగా, సుప్రీంకోర్టు ఈసీఐ నిర్ణయాన్ని సమర్థించింది. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరును కూడా అన్యాయంగా తొలగించబోమని, ఫిర్యాదులు చేసేందుకు జనవరి 18 వరకు గడువు ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తమిళనాడు, బెంగాల్తో పాటు యూపీ, కేరళ, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తమిళనాడు ఓటర్లకు అభ్యంతరాల కోసం జనవరి 18 వరకు సమయం ఇవ్వగా, బెంగాల్లో తుది జాబితా ఫిబ్రవరి 14, 2026న విడుదల కానుంది. ఎన్నికల వేళ ఈ ‘ఓట్ల వేట’ ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందో, ఎవరి అవకాశాలను దెబ్బతీస్తుందో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: ‘బీజింగ్కు సాధ్యం.. ఢిల్లీకి అసాధ్యమా?’.. చైనా ‘మాస్టర్ క్లాస్’
కాలితో తన్నడంతో గాల్లోకి లేచి పడిన చిన్నారి
కర్ణాటక: రోడ్డు మీద ఆడుకుంటున్న చిన్నారిని ఒక వ్యక్తి ఫుట్బాల్ తరహాలో కాలితో తన్నాడు. దీంతో బాలిక గాల్లోకి లేచి కిందపడి గాయపడింది. ఈ అమానుష సంఘటన బెంగళూరు త్యాగరాజగనర్లో చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారి తన తల్లితో కలిసి ఇంటి బయట బ్యాడ్మింటన్ ఆడుతుండగా వెనుక నుంచి వచ్చిన రంజన్ అనే వ్యక్తి కాలితో తన్నాడు. దీంతో ఆ చిన్నారి గాల్లోకి లేచి కిందపడింది. చిన్నారి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఎందుకు అలా తన్నాడో తెలియరాలేదు. ఈ దృశ్యం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఘటనకు సంబంధించి రంజన్(35)ను బనశంకరి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి మానసిక పరిస్థితి బాగాలేదని తెలిసింది. What’s wrong??https://t.co/pbux7NWQ0T— Divya Gandotra Tandon (@divya_gandotra) December 19, 2025
ఎన్ఆర్ఐ
డిసెంబర్ 9 నుంచి 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రారంభం
తెలుగు కళల తోట.. తెలంగాణ సేవల కోట.. అంటూ తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలో ఘనంగా నిలబెడుతున్న 'తెలంగాణ అమెరికా తెలుగు సంఘం' (TTA) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో “సేవాడేస్ 2025” కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ఈ TTA సేవాడేస్ 2025 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు తెలంగాణ జిల్లాల్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 14న గచ్చిబౌలిలో “10K రన్”తో డ్రగ్స్పై భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. డిసెంబర్ 25న TTA 10వ వార్షికోత్సవ వేడుకలు జరుపుతారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీఏ నాయకులు 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రకటించి, కార్యక్రమాల వివరాలు తెలిపారు.TTA ఏటా నిర్వహించే ఈ సేవాడేస్లో భాగంగా ఆరోగ్యం, విద్య, సమాజ అభివృద్ధి, యువత అవగాహనా కార్యక్రమాలు, మాదకద్రవ్యాల నివారణపై చైతన్యం, రక్తదానం, ఆహార పంపిణీ, గిరిజన ప్రాంతాలకు మద్దతు.. వంటి 40కి పైగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. TTA సేవాడేస్లో భాగంగా సేవ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, నల్లగొండ, యాదాద్రితో పాటు మరిన్ని జిల్లాల్లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలను TTA నాయకత్వ బృందం రూపొందించింది. TTA ఫౌండర్ పైల మల్లారెడ్డి, ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది, ఏసీ-చైర్ విజయపాల్ రెడ్డి, ఏసీ కో చైర్ మోహన్ రెడ్డి పటలోళ్ల,సేవాడేస్ సలహాదారు డా. ద్వారకానాథ్ రెడ్డి, TTA కన్వెన్షన్ 2026 చైర్ ప్రవీణ్ చింతా, 10వ వార్షికోత్సవ చైర్ DLN రెడ్డి, జాయింట్ ట్రెజరర్ స్వాతి చెన్నూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ - ఇంటర్నేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ జ్యోతి రెడ్డి దూదిపాల, EX BOD రమా కుమారి వనమా, అంతర్జాతీయ VP నర్సింహ పెరుక, సేవాడేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, 10వ వార్షికోత్సవ వేడుక కల్చరల్ చైర్ డా. వాణి గడ్డం.. అమెరికా నుంచి TTA నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు, వాలంటీర్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.TTA 10వ వార్షికోత్సవం2025 డిసెంబర్ 25న TTA తన 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతోంది. గడిచిన దశాబ్ద కాలంలో TTA చేసిన సేవా కార్యక్రమాలు, సామాజిక సేవ, తెలంగాణతో ఉన్న అనుబంధం వంటి అంశాలు ఈ వేడుకలో ప్రధానంగా చోటు చేసుకుంటాయి. పదేళ్లుగా తెలంగాణతో తమ బంధం మరింత బలపడుతోందని టీటీఏ నాయకులు తెలిపారు.“10K రన్”తో డ్రగ్స్పై అవగాహనటీటీఏ సేవాడేస్ 2025లో భాగంగా డిసెంబర్ 14న గచ్చిబౌలిలో Say No To Drugs సందేశంతో “10K రన్” నిర్వహించబోతున్నారు. ఈ ఏడాది సేవాడేస్ ప్రధాన థీమ్ “Say No To Drugs” అని టీటీఏ నాయకులు తెలిపారు. ఈ రన్లో విద్యార్థులు, యువత, స్పోర్ట్స్ కమ్యూనిటీ, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఫిట్నెస్ను ప్రోత్సహించడంతో పాటు డ్రగ్స్ అవగాహన కోసం సమాజానికి బలమైన సందేశం ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యమని, యువత భవిష్యత్తును కాపాడేందుకు ఇటువంటి కార్యక్రమాలు కీలకమని TTA నాయకత్వం తెలిపింది. 2014లో అమెరికాలో స్థాపించిన TTA సంస్థ విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ రంగాల్లో వేలాది మందికి సేవలు అందిస్తూ అమెరికాలో ఉన్న అతిపెద్ద తెలంగాణ సంఘాలలో ఒకటిగా నిలిచింది. (చదవండి: యూకేలో ప్రోస్టేట్ కాన్సర్పై అవగాహన)
ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్
జర్మనీలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యవస్థాపకుడు ,పరిశోధకుడు, మయూఖ్ పంజా దాదాపు దశాబ్ద కాలంగా విదేశాల్లో ఇక్కడి పౌరసత్వాన్ని తీసుకునేందుకు నిరాకరించాడు. తన భారతీయ పాస్పోర్ట్ను వదులుకోవడానికి సిద్ధంగా లేనని ప్రకటించాడు. తాను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కూడా వివరించాడు. దీంతో ఇది నెట్టింట సందడిగా మారింది.మయూఖ్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం తొమ్మిది సంవత్సరాలకు పైగా జర్మనీలో నివసిస్తున్న అతనికి గత ఏడాది పౌరసత్వానికి అర్హత సాధించాడు. కానీ దరఖాస్తు చేయ కూడదని నిర్ణయించుకున్నాడు.తాను జర్మన్ పౌరుడిగా గాకుండా, ఎప్పటికీ భారతీయుడి గానే ఉంటాని ఆయన వివరించాడు. మయూఖ్ పంజా తొమ్మిదేళ్ల క్రితం జర్మనీ వెళ్లాడు.. డాక్టోరల్ రీసెర్చ్ కోసం వెళ్లిన మయూఖ్ అక్కడే పాపులేషన్స్ అనే ఏఐ సంస్థను స్థాపించాడు. గతేడాదే జర్మన్ పౌరసత్వం పొందేందుకు అర్హుత సాధించాడు. అయినా సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేయలేదట. పాస్ పోర్ట్ అంటే తన దృష్టిలో కేవలం అదొక డాక్యుమెంట్ కాదని, అది వ్యక్తిత్వ గుర్తింపని చెప్పుకొచ్చాడు. భారతీయతను వదులుకోలేక పోతున్నానని వెల్లడించారు.జర్మనీ కథలు, చరిత్ర, భాష,సంస్కృతిని అర్థం చేసుకున్నాడు. వాటితో తాను మమేకం కాలేక పోతున్నానని, బెర్లిన్ వాతావరణం, సాంకేతిక శాస్త్రీయ పరిస్థితులలో తాను సుఖంగా ఉన్నప్పటికీ, అది తన సొంతఇంట్లో ఉన్నట్లు భావించడం లేదని ఆయన అన్నారు. ఫుట్బాల్ మ్యాచ్లో జర్మనీ గెలుపు లేదా ఓటమి తనకు పెద్దగా తేడాను కలిగించదని, భారతదేశం ప్రపంచ కప్ గెలిచినప్పుడు తన ఆనందమే వేరు అంటూ ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. తాను జర్మనీ స్నేహితుడినే తప్ప ఆ దేశంలో భాగమని భావించే వ్యక్తిని కాదన్నాడుపంజా ప్రకారం, జర్మన్ పౌరుడిగా మారడం అంటే జర్మన్ విలువలు మరియు ఆదర్శాలతో తనను తాను సమలేఖనం చేసుకోవడం. కానీ కొత్త పౌరుడిగా, శతాబ్దాల నాటి సంస్కృతి తన ఇష్టానికి అనుగుణంగా ఉంటుందని ఆయన భావించడలేదు. పైగా భారత పౌరసత్వాన్ని కాపాడుకోవడం అనేది ఏదైనా చట్టపరమైన ప్రయోజనానికి సంబంధించిందికాదు,కానీ తన నిజమైన గుర్తింపుతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం అని మయూఖ్ పంజా తెలిపారు. I have been here 9 + years and I became eligible for the German passport a year back. I could have applied for citizenship a year ago, but I did not. I have thought about this a lot and I am increasingly coming to the conclusion that I can’t do this. Because I don’t feel German.… https://t.co/amUbrxgObK— Mayukh (@mayukh_panja) December 5, 2025 సోషల్ మీడియా మయూఖ్ నిర్ణయానికి సానుకూలంగా స్పందించింది. ఆయన నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
ఓవర్సీస్ మొబిలిటీ బిల్లులో ప్రవాసీల హక్కులు కాపాడాలి
భారతదేశం నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే ఓవర్సీస్ మొబిలిటీ (విదేశీ వలస) బిల్లు–2025 లో ప్రవాసీల హక్కులు రక్షించబడేలా చూడాలని, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావులతో కూడిన ప్రతినిధి బృందం తమ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో తెలంగాణకు చెందిన ఏడుగురు పార్లమెంటు సభ్యులను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో నివసించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.42 ఏళ్లుగా అమలులో ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్–1983 స్థానంలో భారత ప్రభుత్వం కొత్త చట్టం చేయనున్న నేపథ్యంలో... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థాండింగ్ కమిటీ సభ్యులు, బీజేపీ ఎంపీ డీకే అరుణ (మహబూబ్ నగర్), బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రేస్ ఎంపీలు మల్లు రవి (నాగర్ కర్నూల్), సురేష్ షెట్కార్ (జహీరాబాద్), డా. కడియం కావ్య (వరంగల్), గడ్డం వంశీక్రిష్ణ (పెద్దపల్లి), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), మాజీ ఎంపీ మధు యాష్కీలతో వారు చర్చించారు. 2021 ముసాయిదాలో ప్రవాసీ కార్మికులకు ప్రతిపాదించిన అనేక రక్షణలు కొత్త బిల్లులో లేవు. అధికారాలు కేంద్రీకృతమవడం ద్వారా దోపిడీ ప్రమాదం పెరుగుతుందని భీంరెడ్డి, శ్రీనివాస రావులు ఎంపీలకు వివరించారు.ప్రవాసుల హక్కులు బలహీనం కావద్దుబాధిత ప్రవాసీ కార్మికులు నేరుగా కోర్టులను ఆశ్రయించే హక్కు తొలగింపు.. మహిళలు, పిల్లల రక్షణలను ‘సున్నిత వర్గాలు’ అనే అస్పష్ట వర్గంలో విలీనం. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు వసూలు చేసే ఫీజుల వివరాల వెల్లడి నిబంధన రద్దు వలన రుణ బానిసత్వానికి దారి తీస్తుంది. విదేశాలకు పంపిన అనంతరం కార్మికులపై ఏజెన్సీల బాధ్యత లేకపోవడం, విదేశాల నుంచి తిరిగివచ్చిన వారికి పునరేకీకరణ నిబంధనలు బలహీనపడ్డాయి. 182 రోజుల (ఆరు నెలల) లోపు విదేశాల నుండి వాపస్ పంపబడ్డ (డిపోర్ట్) అయిన వారిని ‘రిటర్నీలు’గా పరిగణించకపోవడం లాంటి విషయాలను భారత ప్రభుత్వ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసికెళ్లాలని వారు కోరారు.‘ఎమిగ్రంట్’, ‘ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్’, ‘లేబర్’ వంటి పదాల నిర్వచనాల్లో విద్యార్థులు, ఆధారితులు, డిజిటల్ కార్మికులు వంటి వర్గాల వెలివేత. ‘మానవ అక్రమ రవాణా’ (హ్యూమన్ ట్రాఫికింగ్) కు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం. కేంద్రీకృత పాలన – రాష్ట్రాలకు, కార్మిక సంఘాలకు చోటు లేదు. ప్రతిపాదిత 'ఓవర్సీస్ మొబిలిటీ & వెల్ఫేర్ కౌన్సిల్' లో వలస కార్మికులను విదేశాలకు పంపే రాష్ట్రాలు, కార్మిక సంఘాలు, హక్కుల సంస్థలకు ప్రాతినిధ్యం లేదు. రాష్ట్ర స్థాయి నోడల్ కమిటీలు తొలగించబడటం వల్ల స్థానిక సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడుతుందని మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావులు ఆందోళన వ్యక్తం చేశారు.డిమాండ్లుబిల్లుపై లోతుగా అధ్యయనం చేయాలిఎమిగ్రేషన్ చెక్ పోస్టులు రద్దు అయినప్పటికీ ప్రత్యామ్నాయ నియంత్రణ వ్యవస్థ లేదు.ప్రయాణానికి ముందు శిక్షణ, విదేశాల్లో సహాయక సేవల ప్రమాణాలు స్పష్టంగా లేవు.ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ — హక్కుల కంటే పర్యవేక్షణపైనే దృష్టి.24/7 హెల్ప్లైన్లు, విమానాశ్రయ–ఎంబసీ సహాయం తప్పనిసరి కాదని ముసాయిదా చెబుతోంది.శిక్షలు కేవలం రిక్రూట్మెంట్ ఏజెంట్లపైనే; విదేశీ యాజమాన్యాలపై చర్యలు లేవు.ట్రాఫికింగ్, చట్ట విరుద్ధ ఆన్లైన్ రిక్రూట్మెంట్పై ప్రత్యేక నిబంధనలు లేకపోవడం.విధించే జరిమానాల్లో బాధితులకు పరిహారం కేటాయింపు లేదు.
'నైటా' కొత్త అధ్యక్షుడిగా రవీందర్ కోడెల
ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్లో నివసిస్తున్న తెలుగువారు ఏర్పాటు చేసుకున్న సంస్థ న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా). రానున్న ఏడాది (2026) కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కొత్త అధ్యక్షుడుగా ప్రముఖ ఫార్మసిస్ట్ రవీందర్ కోడెల ఎంపికయ్యారు. ఏడాది పాటు ఆయన న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ కు నాయకత్వం వహించనున్నారు.అమెరికా ప్రధాన నగరమైన న్యూయార్క్ లో వేల సంఖ్యలో తెలుగు, తెలంగాణ ఎన్నారైలు కుటుంబాలతో సహా స్థిరపడ్డారు. వీరందరూ వివిధ వృత్తుల్లో పనిచేస్తూ ఒక సామాజిక సమూహంగా కలిసి ఉండేందుకు నైటాను ఆరేళ్లకిందట ఏర్పాటుచేసుకున్నారు. ఇప్పటివరకూ ఆరు సార్లు ఏర్పాటైన కార్యవర్గాలు తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను పాటించటంతో పాటు, అమెరికాలోనే పుట్టిపెరిగిన తమ పిల్లలకు తెలుగు, తెలంగాణ పండగల ప్రాధాన్యత తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే అమెరికా సమాజంలో భాగమై వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రానున్న ఏడాదిలో కొత్త కార్యవర్గం సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతన అధ్యక్షుడు రవీందర్ కోడెల (Ravinder Kodela) వెల్లడించారు. ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీకి నైటా సభ్యులు సంతాపం ప్రకటించారు. వాణి అనుగు నేతృత్వంలోని తాజా మాజీ కార్యవర్గానికి వీడ్కోలు విందును ఏర్పాటుచేశారు.కార్యక్రమంలో న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్, ప్రముఖ ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, నైటా (NYTTA) సభ్యులు కుటుంబాలతో సహా పాల్గొన్నారు.రవీందర్ కోడెల ప్రస్థానంఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలం వాస్తవ్యులు. బాల్యం నుంచి పదవ తరగతిదాకా అక్కడే గడిచింది. ఆతర్వాత హన్మకొండలో ఇంటర్, డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ చదివారు. ఆ తర్వాత ఫెలోషిప్ (CSIR)తో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్డీ చేశారు. చదవండి: ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే.. వచ్చేస్తున్నా!తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ వివిధ వేదికల ద్వారా తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత డాక్టర్ రెడ్డీస్ తో పాటు పలు ప్రముఖ సంస్థల్లో పనిచేస్తూ అమెరికా వెళ్లి అక్కడే న్యూయార్క్లో స్థిరపడ్డారు. సిటీ కాలేజీ ఆఫ్ న్యూయార్క్ (మెడికల్ స్కూల్)తో పాటు సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్లలో ప్రముఖ ఫార్మాసిస్టుగా క్యాన్సర్ నివారణ ఔషధాల తయారీలో గుర్తింపు పొందారు.
క్రైమ్
లవ్ మ్యారేజ్ చేసుకుని..కొట్టి చంపేశాడు
తాండూరు టౌన్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా కొట్టి చంపిన కేసులో ముగ్గురికి రిమాండ్ విధించినట్లు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. పట్టణంలోని సాయిపూర్కు చెందిన పరమేశ్, తన భార్య అనూష (20)ను వరకట్నం తీసుకురావాలంటూ గురువారం కర్రతో కొట్టి దారుణంగా హత్య చేసి పరారైన విషయం విదితమే. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతురాలి భర్త పరమేశ్, అతని తల్లిదండ్రులు లాలమ్మ, మొగులప్పను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కీలకంగా మారిన సీసీ పుటేజీ.. ఈ హత్య కేసులో నిందితుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయిన పుటేజీ కీలకంగా మారింది. ఈ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం లావుపాటి కర్రతో అనూష తలపై విచక్షణా రహితంగా దాడి చేస్తున్నట్లు నిక్షిప్తమైంది. Sensitive Content సీసీ ఫుటేజ్.. ప్రేమించి పెళ్లాడిన యువతిని కిరాతకంగా కొట్టి చంపిన భర్తతాండూరులోని సాయాపూర్లో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు..కట్నం తేవాలని దూషిస్తూ, కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అనూష.. చికిత్స మృతియువకుడి… https://t.co/ujX5RCu0jI pic.twitter.com/gnlmskOTnv— Telugu Scribe (@TeluguScribe) December 19, 2025 ప్రేమించి.. పెళ్లి చేసుకుని..
70 ఏళ్లొచ్చినా.. రోజూ లైంగిక వేధింపులే
కర్ణాటక: 70 ఏళ్ల వయసు వచ్చింది, రోజూ సతాయిస్తూ నరకం చూపుతున్నాడు అని భర్త మీద 65 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ప్రిన్సిపాల్ గోవిందరాజనగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చెప్పిన మాట వినడం లేదని నేను, నా ఇద్దరు కుమారులు 8 రోజుల్లోగా ఇంటి నుంచి బయటికి వెళ్లాలని భర్త లీగల్ నోటీస్ ఇచ్చాడని తెలిపింది.హత్య బెదిరింపులు..వివరాలు.. బాధితురాలు ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ పనిచేసి రిటైరయ్యారు. ఆమె మంచి హోదాలో ఉండడం భర్తకు నచ్చేది కాదు. జీతం, గ్రాట్యూటీ, పింఛన్, ఆస్తులను తన పేర మార్చాలని ఒత్తిడి చేసేవాడు. అతడు 1993లో కుద్రేముఖ్లో గనులలో ఉద్యోగం చేస్తూ మానేశాడు. అప్పటి నుంచి భార్యను లైంగిక క్రియ కోసం రోజూ వేధిస్తున్నాడు. అయినా సహిస్తూ వచ్చింది. నవంబరు 22 తేదీన బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు, ప్రతిఘటిస్తే గొంతునులిమి, కొట్టి, దూషించాడు. అంతేగాక తన ఇద్దరు కుమారులను హత్యచేస్తానని బెదిరించాడని మహిళ ఫిర్యాదులో తెలిపింది. ఇంటి సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయినట్లు తెలిపింది. తనకు గుండెకు బైపాస్ సర్జరీ అయ్యిందని, శ్వాసకోశ జబ్బుతో చికిత్స పొందుతున్నానని, భర్తకు ఏమాత్రం జాలి, దయ లేదని వాపోయింది. పోలీసులు విచారణకు హాజరుకావాలని సదరు శాడిస్టు భర్తకు నోటీస్ జారీచేశారు.
కాలితో తన్నడంతో గాల్లోకి లేచి పడిన చిన్నారి
కర్ణాటక: రోడ్డు మీద ఆడుకుంటున్న చిన్నారిని ఒక వ్యక్తి ఫుట్బాల్ తరహాలో కాలితో తన్నాడు. దీంతో బాలిక గాల్లోకి లేచి కిందపడి గాయపడింది. ఈ అమానుష సంఘటన బెంగళూరు త్యాగరాజగనర్లో చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారి తన తల్లితో కలిసి ఇంటి బయట బ్యాడ్మింటన్ ఆడుతుండగా వెనుక నుంచి వచ్చిన రంజన్ అనే వ్యక్తి కాలితో తన్నాడు. దీంతో ఆ చిన్నారి గాల్లోకి లేచి కిందపడింది. చిన్నారి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఎందుకు అలా తన్నాడో తెలియరాలేదు. ఈ దృశ్యం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఘటనకు సంబంధించి రంజన్(35)ను బనశంకరి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి మానసిక పరిస్థితి బాగాలేదని తెలిసింది. What’s wrong??https://t.co/pbux7NWQ0T— Divya Gandotra Tandon (@divya_gandotra) December 19, 2025
తండ్రి భయంతో బాల్కనీ దాటే ప్రయత్నం..
రామచంద్రాపురం (పటాన్చెరు): ఇంట్లో స్నేహితుడితో ఉన్న సమయంలో అకస్మాత్తుగా తండ్రి రావడం చూసి భయపడిన కూతురు.. తమ బాల్కనీ నుంచి మరో బాల్కనీకి వెళ్లే ప్రయత్నంలో ఎనిమిదో అంతస్తు పైనుంచి కిందపడి మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పరిధిలోని ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ కేసీఆర్ నగర్లో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. కొల్లూరు సీఐ గణేశ్ పటేల్ కథనం ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీలో నివాసముండే యువతి (20) ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. అక్కడ ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ యువతి కుటుంబానికి తెల్లాపూర్ పరిధిలోని ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఇల్లు ఉంది. కాగా గురువారం స్నేహితుడితో కలిసి కేసీఆర్ నగర్ కాలనీలోని 8వ అంతస్తులో ఉన్న తమ ఇంటికి వచ్చింది. వారిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో రేషన్ బియ్యం తీసుకునేందుకు నగరం నుంచి యువతి తండ్రి అక్కడికి వచ్చాడు. తలుపులకు తాళం తీసి ఉండటంతో.. లోపల ఎవరున్నారని అతను గట్టిగా అరిచాడు. తండ్రి మాటలు విన్న యువతి భయంతో ఎనిమిదో అంతస్తు బాల్కనీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్క బాల్కనీలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే పట్టుతప్పి ఆమె పైనుంచి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు
ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు
సినిమా హీరోలు కూడా సరిపోరు.. ఆరోజుల్లోనే జగన్ క్రేజ్ ఎలా ఉండేదంటే
హైదరాబాదులో ఘనంగా YSRCP అధినేత YS జగన్ జన్మదిన వేడుకలు
బీజేపీలో చేరిన సినీ నటి ఆమని
హాలీవుడ్ హీరోలా రోషన్.. ఛాంపియన్ బ్లాక్ బస్టర్ అంతే..!
జగన్ హయాంలోనే అభివృద్ధి.. ఆ రెండేళ్లు కోవిడ్ లేకపోతే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది
ఇందుకే.. అమిత్ షా చంద్రబాబును ఏకి పారేశాడు
గోదావరి నడి మధ్యలో.. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
కోతుల కోసం చింపాంజీ ఐడియా
3 కార్లు ఢీ.. 6 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్

