విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. రాయ్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ కోహ్లి శతక్కొట్టాడు. కింగ్ కోహ్లి 90 బంతుల్లోనే తన 53వ వన్డే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా విరాట్కు ఇది 84వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. మొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 7 ఫోర్లు, 2 సిక్స్లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు.ఆరంభంలోనే రోహిత్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లి జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ నాలుగో మూడో వికెట్కు 195 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్..వన్డేల్లో అత్యధిక సార్లు 150కు పైగా పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్న ఆటగాడిగా కోహ్లి రికార్డులెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు 32 సార్లు 150కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని మరొక ఆటగాడితో కలిసి నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (31) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సచిన్ వరల్డ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.టీమిండియా భారీ స్కోరుఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 358 పరుగులు సాధించింది. తద్వారా సఫారీ జట్టుకు 359 పరుగుల భారీ లక్ష్యం విధించింది. కాగా భారత బ్యాటర్లలో కోహ్లి, రుతురాజ్ సెంచరీలు కొట్టగా.. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ మెరుపు అర్ధ శతకం (43 బంతుల్లో 66 నాటౌట్) సాధించాడు.Play it on loop ➿Just like Virat Kohli 😎💯Yet another masterful knock! 🫡 Updates ▶️ https://t.co/oBs0Ns6SqR#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/WYbSDLEQRo— BCCI (@BCCI) December 3, 2025
సిల్వర్ షాక్.. బంగారం ధరలు ఒక్క రోజులోనే రివర్స్..
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. క్రితం రోజున కాస్త ఉపశమనం ఇచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలలో మార్పలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు (Today Gold Price) ఎగిశాయి. వెండి ధరలు అమాంతం దూసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
బాబ్రీ మసీదు.. నాడు నెహ్రూ ప్రయత్నాన్ని ఆపిన పటేల్!
బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. దేశ తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ ప్రజా ధనంతో బాబ్రీ మసీదు నిర్మించేందుకు చూశారని.. కానీ, గుజరాతీ బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని అన్నారు. మంగళవారం గుజరాత్లో జరిగిన యూనిటీ మార్చ్లో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ.. ‘‘నాడు దేశ తొలి ప్రధానిగా ఉన్న నెహ్రూ ప్రజా ధనంతో బాబ్రీ మసీదు కట్టాలనుకున్నారు. ఆ ప్రయత్నాన్ని ఎవరైనా అడ్డుకున్నారు అంటే అది గుజరాత్ అమ్మ కడుపున పుట్టిన సర్దార్ వల్లభాయ్పటేలే. నెహ్రూ నిర్ణయానికి ఆయన ఏమాత్రం అంగీకరించలేదు. ఆ సమయంలో సోమనాథ్ ఆలయ(గుజరాత్) ప్రస్తావనను నెహ్రూ తీసుకొచ్చారు. అయితే.. సోమనాథ్ ఆలయ అంశం పూర్తిగా వేరు అని.. అది పూర్తిగా ప్రజల విరాళంతో(ట్రస్ట్ ఏర్పాటు చేసి) నిర్మించిందని.. ఒక్క పైసా ప్రభుత్వం ఖర్చు చేయలేదని పటేల్ నెహ్రూకు గుర్తు చేశారు. సరిగ్గా ఇదే ఇప్పుడు అయోధ్య రామమందిర విషయంలో జరిగింది. రాముడి ఆలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజలే స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. ఇది నిజమైన సెక్యులరిజం అంటే’’ అని రాజ్నాథ్ అన్నారు. అదే సమయంలో.. 1946లో కాంగ్రెస్ అధ్యక్షుడయ్యే అవకాశం సర్దార్ పటేల్కు వచ్చిందని.. మహత్మా గాంధీ సూచన మేరకే పటేల్ తన నామినేషన్ను వెనక్కి తీసుకున్నారని.. అలా నెహ్రూ ఆ టైంలో అధ్యక్షుడు అయ్యారని రాజ్నాథ్ అన్నారు. కొన్ని రాజకీయ దుష్టశక్తులు చరిత్ర నుంచి పటేల్ లెగసీని చెరిపేసే ప్రయత్నం చేశాయని.. కానీ, ప్రధాని మోదీ మాత్రం పటేల్ గొప్పదనం ఏంటో ప్రపంచానికి చాటి చెబుతున్నారని రాజ్నాథ్ అన్నారు.
కంటెంట్ క్రియేటర్ అవ్వడం కోసం..రూ. 15 కోట్ల కంపెనీని అమ్మేశాడు..!
వెల్సెటిల్ అయ్యాక మళ్లీ మొదటి నుంచి ప్రారంభించడం అంత ఈజీ కాదు. కానీ ఈ వ్యక్తి మంచి పొజిషన్లో సెటిల్ అయ్యి..చక్కగా ఆర్జింగ్, సత్కారాలు, రివార్డులు పొంది కూడా మళ్లీ నచ్చిన కెరీర్ కోసం మొదటి నుంచి ప్రస్థానం మొదలుపెడుతున్నానని చెబుతున్నాడు. వామ్మో అందుకు ఎంత ఓపిక కావలిరా బాబు అనిపిస్తోంద కదూ..!. మరి ఇంతకీ ఈ వ్యక్తి దేని కోసం ఇలా అంటే..హైదరాబాద్కు చెందిన రాజీవ్ ధావన్ సక్సెస్కి సరికొత్త అర్థమిచ్చేలా తన కథను నెట్టింట పంచుకున్నాడు. “ఇదిగో నా కథ“ అనే క్యాప్షన్తో షేర్ చేశాడు. తనది సాధారణ విజయగాధ కాదంటూ తన ప్రస్థానం మొదలైన విధానం గురించి వివరించాడు. తాను చిన్నప్పుడూ బేకరీలకు సాస్లను అమ్మడం ప్రారంభించానని, పెద్దయ్యాక రిటైల్ స్టోర్లో పనిచేశానని చెప్పుకొచ్చాడు. అక్కడ తాను రాక్లలో చొక్కాలను మడతపెట్టి శుభ్రం చేసేవాడనని చెప్పుకొచ్చాడు. తర్వాత జీఈలో తన తొలి కార్పొరేట్ జీతం చూడగానే..ప్రపంచంపైన ఉన్నట్లు ఫీలయ్యానంటూ తాను సాధించిన తొలి విజయాన్ని గుర్తు చేసుకున్నాడు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదని, సరిగ్గా ఆ సమయంలోనే తల్లిని కోల్పోయానని తెలిపాడు. అలా 18 ఏళ్లు వచ్చేటప్పటికీ ఎంఎన్సీలో పనిచేశానిట్లు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రూ. 40 వేల రుణంతో హైదరాబాద్లో వాట్స్ ఇన్ ఏ నేమ్ను ప్రారంభించి..ఏకంగా 15 కోట్ల కంపెనీగా మార్చాడు. దాదాపు వంద ప్లస్ బ్రాండ్లు, అవార్డులు మంచి గుర్తింపు అందుకున్నానంటూ తన కథను చెప్పుకొచ్చాడు. అంతేగాదు 30 ఏళ్లకే మెర్సిడేజ్ కారు కొని తన కలను సాకారం చేసుకున్నానని, అయితే ప్రస్తుతం దాన్ని అమ్మేసి మారుతి కారుతో ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపాడు. ప్రస్తుతం తాను ప్రారంభించిన అన్ని కంపెనీలను అమ్మేశానని కూడా వెల్లడించాడు. అయితే తాను ఫెయిల్యూర్స్ రావడం వల్ల ఇలా చేయలేదని, కెరీర్ని మళ్లీ కొత్తగా ప్రారంభించాలనిపించి ఇలా చేశానని చెబుతున్నాడు. 39 ఏళ్ల వయసులో ఉన్న తాను కంటెంట్ క్రియేటర్గా కొత్తగా తన కెరీర్ని మొదలు పెట్టాలనుకుంటున్నా అందుకే ఇలా చేశానంటూ తన సక్సెస్ స్టోరీని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. అయితే నెటిజన్లు గ్రేట్ ఎచివ్మెంట్స్ అని ప్రశంసించారు. అంతేగాదు మీ మళ్లీ కెరీర్ని కొత్తగా ప్రారంభించాలనుకుంటున్న మీ ధైర్యం అసామాన్యమైనదని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.ఎవరీ రాజీవ్ ధావన్?ధావన్ తన పోస్ట్లో ఎనిమిదవ తరగతి ఫెయిల్యూర్, పది తర్వాత చదువు మానేసినట్లు చెప్పుకొచ్చాడు. కొంతకాలం తర్వాత తన చదువుని తిరిగి పూర్తిచేసినట్లు తెలిపాడు. అతని లింక్డ్ఇన్ ప్రకారం.. యూసుఫ్గూడలోని సెయింట్ మేరీస్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు.(చదవండి: అద్భుతమైన కెరీర్ ట్రాక్ రికార్డు..! ఒకరు యుద్ధ భూమిలో, మరొకరు ఇన్విస్టిగేషన్లో..)
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డు
రేపు వైఎస్ జగన్ ప్రెస్మీట్
GHMC: 27 మునిసిపాలిటీల విలీనానికి ‘డ్రాఫ్ట్’
యాపిల్ సేవలు నిలిపేస్తున్న మోడళ్లు ఇవే..
కోకాపేట నియోపోలీస్ భూముల వేలం.. హెచ్ఎండీఏకు కాసుల పంట
కాంతార చాప్టర్-1 సూపర్ హిట్.. రిషబ్ శెట్టి నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
యంగ్ హీరో సినిమా.. క్లైమాక్స్ కోసమే రూ. 20 కోట్లతో భారీ సెట్!
అందంగా ఉన్నారని నలుగుర్ని..చివరికి కన్నకొడుకుని కూడా
బాలికకు దేశంలో మొట్టమొదటి పాంక్రియాస్ శస్త్రచికిత్స
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డు
రేపు వైఎస్ జగన్ ప్రెస్మీట్
GHMC: 27 మునిసిపాలిటీల విలీనానికి ‘డ్రాఫ్ట్’
యాపిల్ సేవలు నిలిపేస్తున్న మోడళ్లు ఇవే..
కోకాపేట నియోపోలీస్ భూముల వేలం.. హెచ్ఎండీఏకు కాసుల పంట
కాంతార చాప్టర్-1 సూపర్ హిట్.. రిషబ్ శెట్టి నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
యంగ్ హీరో సినిమా.. క్లైమాక్స్ కోసమే రూ. 20 కోట్లతో భారీ సెట్!
అందంగా ఉన్నారని నలుగుర్ని..చివరికి కన్నకొడుకుని కూడా
బాలికకు దేశంలో మొట్టమొదటి పాంక్రియాస్ శస్త్రచికిత్స
BCCI: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటన
..చిన్న పిల్లాడు.. ఎక్కవ మంది వస్తే సక్సెస్ అనుకుంటున్నాడు మనమే పవర్లో ఉన్నామని చెప్పండి సార్!
విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్
ఇమ్రాన్ ఖాన్కు జైల్లో ప్రత్యక్ష నరకం!
రూ.2 వేల ప్రొజెక్టర్ : అమెజాన్కు రూ. 35వేల షాక్
సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?
హీరోయిన్తో విడాకులు.. రూ.100 కోట్ల ఆస్తి ఎవరికంటే?
IND vs SA: ప్రపంచ రికార్డు సమం చేసిన కోహ్లి
సౌతాఫ్రికాకు భారీ షాక్
సుమన్ చేతిలో ఓటమి.. తనూజకు ఏడుపే దిక్కు!
రాయికి రంగేసి రూ.5 వేలకు అమ్మాడు.. కానీ..
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డు
పుతిన్ సెక్యూరిటీ: ల్యాబ్, టాయిలెట్.. అంతా రహస్యమే!
యాపిల్ సేవలు నిలిపేస్తున్న మోడళ్లు ఇవే..
దేశవ్యాప్తంగా 70కిపైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు
అరడజను సినిమాలు.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
Delhi: మళ్లీ బీజేపీదే విజయం.. మిన్నంటుతున్న సంబరాలు
బాబ్రీ మసీదు.. నాడు నెహ్రూ ప్రయత్నాన్ని ఆపిన పటేల్!
వేలమంది సమక్షంలో, 13 ఏళ్ల బాలుడితో బహిరంగ మరణశిక్ష
'మనశంకర వరప్రసాద్గారు.. నా రోల్ ముగిసింది..' వెంకటేశ్ ట్వీట్
ఫొటోలు
బీచ్లో కుమారుడితో ఎంజాయ్ చేస్తోన్న అగ్ర నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)
ఐఎండీబీ 2025 పాపులర్ స్టార్స్ వీళ్లే (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో జయం రవి.. ఆమె కూడా (ఫొటోలు)
రంగురంగుల సీతాకోకచిలుకలా సారా అర్జున్ (ఫొటోలు)
మేం సాధించాం..అగ్నివీర్ 6వ బ్యాచ్ అవుట్ పరేడ్ (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియం: ఇదేం అభిమానం?.. ఉలిక్కిపడ్డ హార్దిక్, అభిషేక్ (చిత్రాలు)
చీరలో కుందనపు బొమ్మలా నభా నటేష్ (ఫొటోలు)
హైదరాబాద్ గోల్కొండలో అగ్నివీర్ అవుట్ పరేడ్ (ఫొటోలు)
'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ థాంక్స్ మీట్ (ఫొటోలు)
సుడిగాలి సుధీర్ ‘గోట్(GOAT)’ సినిమా టీజర్ రిలీజ్ (ఫొటోలు)
సినిమా
సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?
హీరోయిన్ సమంత రీసెంట్గానే మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్లో లింగభైరవి సన్నిధిలో చాలా సింపుల్గా ఈ వివాహ వేడుక జరిగింది. అయితే పెళ్లికి ముందే సమంతకు రాజ్ ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడని అంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?దర్శకుడు రాజ్తో సమంతకు గత నాలుగైదేళ్లుగా పరిచయం. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ రెండో సీజన్ చేసే టైంలో ఏర్పడిన పరిచయం కాస్త తర్వాత ప్రేమగా మారింది. ఇన్నాళ్లకు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లినే. నాగచైతన్యకు సమంత విడాకులు ఇవ్వగా.. రాజ్ కూడా తన తొలి భార్య శ్యామోలికి 2022లో విడాకులు ఇచ్చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి పోలీస్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్) ప్రస్తుతం రాజ్.. దర్శకుడు, నిర్మాతగా ఉన్నారు. సమంత కూడా ప్రస్తుతం తన నిర్మాణ సంస్థలోనే 'మా ఇంటి బంగారం' అనే మూవీ చేస్తోంది. ఈ సంస్థలోనే సమంతతో పాటు రాజ్ కూడా భాగస్వామిగా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. అయితే అక్టోబరులో సమంత.. కొన్ని ఫొటోలని పోస్ట్ చేసింది. వాటిలో కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ లగ్జరీ హౌస్ని రాజ్.. సమంతకు పెళ్లి గిఫ్ట్గా ముందే ఇచ్చాడని అంటున్నారు. పెళ్లిరోజు సామ్ వేలికి ఉన్న రింగ్ కూడా రాజ్ బహుమతిగా ఇచ్చాడని అంటున్నారు. దీని విలువ కూడా లక్షల్లోనే ఉంటుందట.ప్రస్తుతం సమంత-రాజ్.. గోవాకు హనీమూన్కి వెళ్లారని, తిరిగి వచ్చిన తర్వాత ఎవరి ప్రాజెక్ట్లతో వారు బిజీ కానున్నారని తెలుస్తోంది. రాజ్ కూడా 'ద ఫ్యామిలీ మ్యాన్' నాలుగో సీజన్ తీయాల్సి ఉంది.(ఇదీ చదవండి: రోజుకు 500 కాల్స్.. తలనొప్పిపడలేక వీడియో చేశా: హేమ) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)
'అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి'.. రష్మిక స్ట్రాంగ్ వార్నింగ్..!
టెక్నాలజీ వచ్చాక ప్రతి పని మరింత సులభతరమైపోయింది. ఇప్పుడు మనం పూర్తిస్థాయి డిజిటల్ ఇండియాగా మారిపోయాం. దీంతో సాంకేతికత పెరిగే కొద్ది సవాళ్లు కూడా అదే స్థాయిలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతే వేగంగా సమస్యలు కూడా తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగాలపై ప్రభావం మాత్రమే కాదు.. వ్యక్తిగత గోప్యతకు కూడా సవాల్గా మారింది.సినీతారలు ఫోటోలను ఇష్టమొచ్చినట్లుగా ఏఐతో ఏడిట్ చేసి నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. వీటిలో మంచికంటే ఎక్కువగా అసభ్యకరమైన కంటెంట్ ఉంటోంది. వీటి బారిన ఇప్పటికే పలువురు అగ్ర సినీతారలు పడ్డారు. ఏఐని మంచి పనుల కోసం ఉపయోగించాలి కానీ.. ఎక్కువ శాతం దుర్వినియోగం చేయడానికే మొగ్గు చూపుతున్నారు. అలా చాలామంది సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.ఇలా దుర్వినియోగానికి ఏఐని వాడుకోవడంపై రష్మిక మందన్నా రియాక్ట్ అయింది. ఏఐ అనే మన అభివృద్ధికి కోసమని.. అంతేకానీ అసభ్యతను సృష్టించడానికి కాదని ట్వీట్ చేసింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్న కొంతమందికి నైతికత లేదని మండిపడింది. మనం నిజాన్ని సృష్టించినప్పుడు.. వివేచన అనేది గొప్ప రక్షణగా మారుతుందని పోస్ట్లో రాసుకొచ్చింది.రష్మిక తన ట్వీట్లో రాస్తూ..' ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి.. ఇంటర్నెట్ అనేది నిజానికి అద్దం లాంటిది కాదు.. అది ఏదైనా సృష్టించగలిగే ఓ కాన్వాస్. ఇకపై ఏఐ టెక్నాలజీని దుర్వినియోగానికి కాకుండా.. గౌరవప్రదమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగించుకుందాం. ఇక్కడ మనం నిర్లక్ష్యం కంటే బాధ్యతగా వ్యవహరిద్దాం.. ప్రజలు మనుషుల్లా వ్యవహరించకపోతే.. అలాంటి వారికి కఠినమైన, క్షమించరాని శిక్షలు విధించాలి' అంటూ పోస్ట్ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో కొందరు నెటిజన్స్ రష్మికకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. “When truth can be manufactured, discernment becomes our greatest defence.”AI is a force for progress, but its misuse to create vulgarity and target women signals a deep moral decline in certain people.Remember, the internet is no longer a mirror of truth. It is a canvas where…— Rashmika Mandanna (@iamRashmika) December 3, 2025
ఓటీటీలోకి పోలీస్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో చాలావరకు థ్రిల్లర్ కంటెంట్ని ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకు తగ్గట్లే దర్శకనిర్మాతలు కూడా ఇదే జానర్లో సినిమాలు, సిరీస్లు తీస్తుంటారు. అలా ఇప్పుడు తెలుగు, తమిళంలో రాబోతున్న మర్డర్ మిస్టరీ సిరీస్ 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్'. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. దీంతో స్టోరీ ఏంటో చూచాయిగా తెలిసింది.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చిన రష్మిక దెయ్యం సినిమా)తమిళ నటులు అశ్విన్, శ్రీతు కృష్ణన్, గురు ఈ సిరీస్లో ప్రధాన పాత్రలు చేశారు. జస్విని దర్శకత్వం వహించారు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్.. ఈ శుక్రవారం నుంచి తెలుగు, తమిళంలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అలానే ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది.ట్రైలర్ బట్టి చూస్తే.. ధూల్ పేట్ అనే ఊరిలో ఓ రోజు రాత్రి మూడు హత్యలు జరుగుతాయి. వీటిని దర్యాప్తు చేసేందుకు ఓ ఏసీపీని అపాయింట్ చేస్తారు. అయినా సరే నిందితుల్ని కనుగొనలేకపోతాడు. దీంతో మరో ఏసీపీని కూడా కేసుని దర్యాప్తు చేసేందుకు నియమిస్తారు. తర్వాత ఏమైంది? ఇంతకీ హత్యలు చేసింది ఎవరనేది పోలీసులు కనుగొన్నారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: రోజుకు 500 కాల్స్.. తలనొప్పిపడలేక వీడియో చేశా: హేమ)
రోజుకు 500 కాల్స్.. తలనొప్పిపడలేక వీడియో చేశా: హేమ
సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమపై గతేడాది డ్రగ్స్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో హేమ జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఇటీవల కర్ణాటక హైకోర్టు ఆ కేసును పూర్తిగా కొట్టివేసింది. అయితే తనపై కేసు నమోదైనప్పుడు మీడియాలో చాలా వార్తలు వచ్చాయని.. అదే కేసును కొట్టివేసినప్పుడు మాత్రం తక్కువమంది మాత్రమే రాశారని హేమ అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ ఈ కేసుపై స్పందిస్తూ.. డ్రగ్స్ తీసుకున్నట్లు తనపై ఆరోపణలు చేయడం ఎంతగానో బాధించిందన్నారు.‘నేను డ్రగ్స్ తీసుకున్నానని చెప్పడం వందశాతం అబద్దం. కానీ బర్త్డే పార్టీకి వెళ్లింది నిజం. నా తమ్ముడి లాంటి వ్యక్తి పుట్టినరోజు పార్టీకి పిలిస్తే వెళ్లాను. అక్కడ నేను డ్రగ్స్ తీసుకోలేదు. ఆ పార్టీకి అందరూ ఫ్యామిలీతో వచ్చారు. అది రేవ్ పార్టీ కాదు.. వందశాతం బర్త్డే పార్టీనే. నేను పార్టీ నుంచి వచ్చిన తర్వాత అక్కడ డ్రగ్స్ దొరికింది. కానీ మీడియా మొత్తం రెడ్హ్యాండెడ్గా దొరికిన హేమ రాసేసింది. ఇది చూసి నాకు తెలిసివాళ్లంతా ఫోన్ చేసి ఆరా తీశారు. ఆ సమయంలో నాకు రోజుకు 500 పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. అందరికి సమాధానం చెప్పాను. ఇక ఫోన్ కాల్స్ వల్ల వచ్చే తలనొప్పి భరించలేక.. ఓ వీడియో తీసి పెట్టాను. దాన్ని కూడా కొంతమంది తప్పుగా ప్రచారం చేశారు’ అని హేమ ఆవేదన వ్యక్తం చేసింది.
క్రీడలు
సౌతాఫ్రికాకు భారీ షాక్
రాయ్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఈ మ్యాచ్లో ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ నాండ్రే బర్గర్ గాయపడ్డాడు. భారత ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసే క్రమంలో బర్గర్ తొడ కండరాలు పట్టేశాయి. ఆ ఓవర్లో తొలి బంతిని కాస్త ఇబ్బంది పడుతూనే సంధించిన బర్గర్.. రెండో బంతిని మాత్రం బౌల్ చేయలేకపోయాడు. బంతిని వేసే క్రమంలో అతడు రెండు సార్లు తన రన్ అప్ను కోల్పోయాడు. బర్గర్ ఆసౌకర్యంగా కన్పించాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించాడు. అయినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. ఆ సమయంలో బర్గర్ నడిచేందుకు ఇబ్బంది పడినట్లు కన్పించింది. అతడు తిరిగి మైదానంలో రాలేదు. ఓవరాల్గా 6.1 ఓవర్లు బౌలింగ్ చేసిన బర్గర్ 43 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.అయితే టీ20 సిరీస్కు ముందు బర్గర్ గాయపడడం సౌతాఫ్రికా టీమ్మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. ఇప్పటికే స్టార్ పేసర్ కగిసో రబాడ కూడా గాయం కారణంగా జట్టు బయట ఉన్నాడు. టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఆ సమయానికి బర్గర్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి.భారత్ భారీ స్కోర్..ఇక రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(102), రుతురాజ్ గైక్వాడ్(105) సెంచరీలతో సత్తాచాటగా.. కేఎల్ రాహుల్(66) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ప్రోటీస్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, ఎంగిడీ, బర్గర్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs SA 2nd Odi: విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్
శతక్కొట్టిన రుతురాజ్, కోహ్లి.. రాహుల్ మెరుపు ఇన్నింగ్స్
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. రాయ్పూర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగులు సాధించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (22), రోహిత్ శర్మ (14) విఫలం కాగా.. విరాట్ కోహ్లి (102), రుతురాజ్ (105) సెంచరీలతో చెలరేగారు.Firsts are always special! 💪#RuturajGaikwad lights up Raipur with an epic knock to bring up his first ODI ton. 👏🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/uDZZ6h8ulN— Star Sports (@StarSportsIndia) December 3, 2025 రాహుల్ మెరుపు అర్ధ శతకంతాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) అజేయ అర్ధ శతకం (43 బంతుల్లోనే 66)తో అదరగొట్టగా.. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (1) రనౌట్ అయ్యాడు. మిగిలిన వారిలో మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 24 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్ రెండు, నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి తలా ఒక వికెట్ పడగొట్టారు.A sight you never get tired of. Another ODI, another Virat Kohli century. 💯👑The nation roars. The blockbuster rolls on. 🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/YvZyupUqYa— Star Sports (@StarSportsIndia) December 3, 2025కాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ (IND vs SA ODIs)లో భాగంగా టీమిండియా రాంచిలో గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో 349 పరుగులు చేసిన భారత్.. ప్రొటిస్పై 17 పరుగుల తేడాతో నెగ్గింది. తాజాగా మరోసారి 358 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన టీమిండియా.. సఫారీలకు 359 పరుగుల టార్గెట్ విధించింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాపై వన్డేల్లో భారత్కు ఇది రెండో అత్యధిక స్కోరు.వన్డేల్లో సౌతాఫ్రికాపై టీమిండియా అత్యధిక స్కోర్లు టాప్-5 జాబితా🏏గ్వాలియర్ వేదికగా 2010లో 401/3🏏రాయ్పూర్ వేదికగా 2025లో 358/5🏏రాంచి వేదికగా 2025లో 349/8🏏కార్డిఫ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ 2013లో 331/7🏏కోల్కతా వేదికగా వన్డే వరల్డ్కప్ 2023లో 326/5.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
IND vs SA: ప్రపంచ రికార్డు సమం చేసిన కోహ్లి
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు. సౌతాఫ్రికాతో రాంచి వేదికగా తొలి వన్డేల్లో శతక్కొట్టిన కోహ్లి.. రాయ్పూర్లో రెండో వన్డేలోనూ సెంచరీతో కదం తొక్కాడు. తద్వారా చాన్నాళ్ల తర్వాత ‘విన్టేజ్’ కోహ్లిని గుర్తు చేస్తూ వరుసగా రెండు శతకాల (Back to Back Centuries)తో సత్తా చాటాడు.ఈ క్రమంలో న్యూజిలాండ్ దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (Kane Williamsion) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోహ్లి సమం చేశాడు. ఇంతకీ అదేమిటి అంటారా?... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కోహ్లి (Virat Kohli) పునరాగమనం చేశాడు. కానీ, ఆసీస్ గడ్డపై తొలి రెండు వన్డేల్లో అనూహ్య రీతిలో అతడు డకౌట్ అయ్యాడు.అయితే, మూడో వన్డేలో అజేయ అర్ధ శతకం (74) బాది ఫామ్లోకి వచ్చిన కోహ్లి.. స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్లో (IND vs SA ODIs)నూ దుమ్ములేపుతున్నాడు. సఫారీలతో తొలి వన్డేలో 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... రెండో వన్డేలో తొంభై బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కోహ్లి శతక ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్లు ఉన్నాయి.A sight you never get tired of. Another ODI, another Virat Kohli century. 💯👑The nation roars. The blockbuster rolls on. 🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/YvZyupUqYa— Star Sports (@StarSportsIndia) December 3, 2025మొత్తంగా రాయ్పూర్లో 93 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 102 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లుంగి ఎంగిడి బౌలింగ్లో.. ఐడెన్ మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్తో కలిసి రెండో వికెట్కు 22 పరుగులు జోడించిన కోహ్లి.. నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (105)తో కలిసి 195 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు.అనంతరం తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్తో కలిసి 27 పరుగులు జోడించి కోహ్లి నిష్క్రమించాడు. కాగా సౌతాఫ్రికాపై వన్డేల్లో కోహ్లికి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. అంతకు ముందు కివీస్ స్టార్ కేన్ విలియమ్సన్.. సౌతాఫ్రికాపై ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్గా ఉండగా.. కోహ్లి తాజాగా కేన్ మామ ప్రపంచ రికార్డును సమం చేశాడు.సౌతాఫ్రికాపై వన్డేల్లో కోహ్లి సెంచరీలు🏏కోల్కతా వేదికగా వన్డే వరల్డ్కప్ 2023లో 101 నాటౌట్🏏రాంచి వేదికగా 2025లో 135 పరుగులు🏏రాయ్పూర్ వేదికగా 2025లో 102 పరుగులుచదవండి: IND vs SA: గంభీర్ నమ్మకమే నిజమైంది.. శతక్కొట్టిన రుతురాజ్
విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. రాయ్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ కోహ్లి శతక్కొట్టాడు. కింగ్ కోహ్లి 90 బంతుల్లోనే తన 53వ వన్డే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా విరాట్కు ఇది 84వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. మొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 7 ఫోర్లు, 2 సిక్స్లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు.ఆరంభంలోనే రోహిత్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లి జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ నాలుగో మూడో వికెట్కు 195 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్..వన్డేల్లో అత్యధిక సార్లు 150కు పైగా పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్న ఆటగాడిగా కోహ్లి రికార్డులెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు 32 సార్లు 150కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని మరొక ఆటగాడితో కలిసి నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (31) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సచిన్ వరల్డ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.టీమిండియా భారీ స్కోరుఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 358 పరుగులు సాధించింది. తద్వారా సఫారీ జట్టుకు 359 పరుగుల భారీ లక్ష్యం విధించింది. కాగా భారత బ్యాటర్లలో కోహ్లి, రుతురాజ్ సెంచరీలు కొట్టగా.. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ మెరుపు అర్ధ శతకం (43 బంతుల్లో 66 నాటౌట్) సాధించాడు.Play it on loop ➿Just like Virat Kohli 😎💯Yet another masterful knock! 🫡 Updates ▶️ https://t.co/oBs0Ns6SqR#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/WYbSDLEQRo— BCCI (@BCCI) December 3, 2025
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు ఆ కాలేజీలకు రాష్ట్ర ఖజానా నుంచి వంద కోట్ల రూపాయలు దోచిపెట్టే కుతంత్రం
హలో ఇండియా... ఓసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి.
ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తాలి.... వైఎస్సార్సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధి మాటున భూ దోపిడీ...
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అంతులేని భూదాహం... రాజధానిలో రెండో విడత కింద ఏడు గ్రామాల్లో 20 వేల 494 ఎకరాలకుపైగా భూ సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో వరి రైతుల పరిస్థితి దయనీయం... ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం... దళారుల కనుసన్నల్లోనే ధాన్యం సేకరణ వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్లో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరం, దళారులతో కుమ్మక్కై రైతుల నోట్లో మట్టికొడుతున్నారు... సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
తెలంగాణలో వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు. షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
ఆంధ్రప్రదేశ్లో ఐటీ ముసుగులో రియల్ దందా...
ఈ 18 నెలల కాలంలో రైతుల కోసం నిలిచిందెక్కడ?... ఏపీ సీఎం చంద్రబాబుపై ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
బిజినెస్
రూపాయి తగ్గితే ఏమౌతుంది?
భారత కరెన్సీ రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పడిపోయి రూ.90 మార్క్ను దాటి 90.02 వద్ద ముగిసింది. బ్యాంకులు అధిక స్థాయిలో యూఎస్ డాలర్లను కొనుగోలు చేయడం, విదేశీ సంస్థాగత పెట్టుబడుల అవుట్ ఫ్లోలు కొనసాగుతుండటం వంటివి రూపాయి పతనానికి కారణాలుగా నిలుస్తున్నప్పటికీ రూపాయి విలువ తగ్గడం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ఈ కథనంలో చూద్దాం..దిగుమతులు ఖరీదవుతాయి క్రూడ్ ఆయిల్, బంగారం, ఎలక్ట్రానిక్స్, మెడికల్ పరికరాలు వంటి దిగుమతి వస్తువుల ధరలు పెరుగుతాయి. దీని ఫలితంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుతాయి. ఇతర ఉత్పత్తుల రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి.ద్రవ్యోల్బణం పెరిగే అవకాశందిగుమతులు ఖరీదవడం వల్ల, ఆ ఖర్చులు వినియోగదారులపై పడతాయి. దీని కారణంగా సాధారణ ప్రజలు కొనుగోలు చేసే వస్తువుల ధరలు పెరుగుతాయి.ప్రయాణ ఖర్చులు పెరుగుతాయివిదేశాలకు వెళ్ళేవారికి ఖర్చులు అధికమవుతాయి. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు, జీవన వ్యయం ఇంకా ఖరీదవుతుంది.ఇంధనం ధరలు పెరిగి, ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిభారత్ మొత్తం క్రూడ్ ఆయిల్లో ఎక్కువ భాగం దిగుమతి చేసుకుంటుంది. ఆయిల్ ధర పెరగడంతో రవాణా, తయారీ, వ్యవసాయ ఖర్చులు కూడా పెరుగుతాయి.విదేశీ రుణాల వ్యయం పెరుగుతుందిసంస్థలు లేదా ప్రభుత్వం విదేశాల్లో తీసుకున్న రుణాలు రూపాయి బలహీనత వల్ల ఖరీదవుతాయి. వడ్డీ చెల్లింపులు పెరిగి, ఆర్థిక భారంగా మారుతాయి.విదేశీ పెట్టుబడులపై ప్రభావంరూపాయి పడిపోతే కొందరు విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లు కూడా కొంత ఒడిదుడుకులకు గురవుతాయి.పెట్టుబడిదారుల విశ్వాసంపై ప్రభావంఒక దేశ కరెన్సీ చాలా బలహీనపడితే, గ్లోబల్ మార్కెట్లలో దేశ ఆర్థిక స్థిరత్వంపై సందేహాలు వచ్చి పెట్టుబడులు తగ్గవచ్చు.ఎగుమతిదారులకు కొంత లాభంరూపాయి బలహీనపడితే, భారతదేశం నుండి వస్తువులు కొనుగోలు చేసే విదేశీ క్లయింట్లకు అవి తక్కువ ఖర్చుతో అందుతాయి.టెక్స్టైల్, ఐటీ సేవలు, ఔషధాలు వంటి రంగాలకు కొంత ప్రయోజనం.
లిస్టెడ్ కంపెనీల్లో అంతా మిస్టర్లేనా!
కంపెనీల సిబ్బందిలో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా లిస్టెడ్ సంస్థల్లో వారి వాటా అంతంత మాత్రంగానే ఉంటోంది. ఎన్ఎస్ఈలో లిస్టయిన దాదాపు సగం కంపెనీల్లో (52 శాతం) ఉద్యోగినుల సంఖ్య 10 శాతం లోపే ఉంది. స్వచ్ఛంద సంస్థ ఉదైతీ విడుదల చేసిన ’సీజీజీ డ్యాష్బోర్డ్ 2024–25’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.ఎన్ఎస్ఈలో లిస్టయిన 1,386 కంపెనీల బాధ్యతాయుత వ్యాపారం, పర్యావరణహిత కార్యకలాపాల నివేదికలు (బీఆర్ఎస్ఆర్), సంస్థల వార్షిక నివేదికల ఆధారంగా ఈ రిపోర్ట్ రూపొందింది. వివిధ రంగాలవ్యాప్తంగా మహిళలు .. పురుషుల ప్రాతినిధ్యం, జీతాల్లో అంతరాలు, నాయకత్వ స్థానాల్లో సమ్మిళితత్వం, అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) తదితర అంశాలను ఇందులో పరిశీలించారు.‘సిబ్బందిలో మహిళల ప్రాతినిధ్యం గత అయిదేళ్లుగా స్థిరంగా పెరుగుతోంది. అయినప్పటికీ ఈ ఏడాది గణాంకాలు చూస్తుంటే అది అంత వేగంగా పెరగడం లేదని తెలుస్తంది. ఎన్ఎస్ఈలో లిస్టయిన 2,615 సంస్థల్లో కేవలం సగం మాత్రమే లింగ ప్రాతినిధ్య డేటాను ఇస్తున్నాయి కాబట్టి మన ముందు ప్రస్తుతం ఉన్నది పాక్షిక ముఖ చిత్రమే‘ అని ఉదైతీ వ్యవస్థాపక సీఈవో పూజా శర్మ గోయల్ తెలిపారు. రిపోర్ట్లో మరిన్ని విశేషాలు.. మొత్తం ఉద్యోగుల సంఖ్య 6 శాతం పెరగ్గా, మహిళా ఉద్యోగుల సంఖ్య 7 శాతం పెరిగింది. మరింత మంది మహిళలు ఉద్యోగాల్లో చేరుతున్నప్పటికీ నిర్దేశిత లక్ష్యాల స్థాయిలో వారి వాటా పెరగడం లేదు. ఆసుపత్రులు, ప్రయోగశాలల్లో మహిళల ప్రాతినిధ్యం 45 శాతం నుంచి 48 శాతానికి, వినియోగదారుల సర్వీసుల్లో 30 % నుంచి 34 శాతానికి పెరగ్గా, ఐటీ (34 శాతం), బ్యాంకింగ్ (26 శాతం)లో పెద్దగా మార్పు నమోదు కాలేదు. మహిళలు, పురషుల జీతాల మధ్య వ్యత్యాసం 2024, 2025 ఆర్థిక సంవత్సరాల్లో 6.7 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గింది. అయితే, మహిళల ప్రాతినిధ్యం ఎక్కువే ఉన్నప్పటికీ టెక్స్టైల్స్ (30.4 శాతం), డైవర్సిఫైడ్ (28.5 శాతం), మెటల్స్ .. మైనింగ్ (17 శాతం)లో మాత్రం వ్యత్యాసరం ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు పురుషాధిక్యం ఎక్కువగా ఉండే కొన్ని రంగాల్లో జీతాల మధ్య వ్యత్యాసం రివర్స్లో ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ఆర్జిస్తున్న రంగాల్లో ఫార్మా (8 శాతం), కన్జూమర్ డ్యూరబుల్స్ (7 శాతం) ఉన్నాయి. లైంగిక వేధింపుల నివారణ నిబంధనలు (పీవోఎస్హెచ్) గురించి అవగాహన పెరుగుతోంది. పని ప్రదేశాల్లో సహోద్యోగుల తప్పుడు ప్రవర్తనపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు ధైర్యంగా ముందుకొస్తున్నారు. లైంగిక వేధింపు ఫిర్యాదులు 16 శాతం పెరగడం ఇందుకు నిదర్శనం. అయితే, ఫిర్యాదుల స్థాయిలో పరిష్కారాల వేగం ఉండటం లేదు. పెండింగ్ కేసులు 28 శాతం దీన్ని సూచిస్తంది. ఈ నేపథ్యంలో భద్రత, సమాన అవకాశాలు, వర్క్ప్లేస్ డిజైన్ విషయాల్లో వ్యవస్థాగతంగా ఉన్న అవరోధాలను అధిగమించే దిశగా ఇటీవలి లేబర్ కోడ్ ముందడుగులాంటిది. వీటిని మార్చుకోగలిగి, స్మార్ట్ విధానాలను అమలు చేస్తే, ప్రభుత్వం..కంపెనీలు చొరవ చూపితే మరింత మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాల్లో పాలుపంచుకునే ప్రక్రియ వేగవంతం అవుతుంది.
రూపాయి టపా.. భారీగా పడిపోయిన భారత కరెన్సీ
భారత కరెన్సీ రూపాయి విలువ రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయింది. అమెరికా డాలర్ తో పోలిస్తే ఎన్నడూ లేనంతగా రూ.90 స్థాయిని దాటింది. బుధవారం ప్రారంభ ట్రేడింగ్ లో 6 పైసలు పడిపోయి 90.02 వద్ద ముగిసింది.బ్యాంకులు అధిక స్థాయిలో యూఎస్ డాలర్లను కొనుగోలు చేస్తూనే ఉండటంతోపాటు కరెన్సీలో మరింత బలహీనపడేలోపు బయటపడేందుకు కంపెనీల హడావిడి మధ్య విదేశీ సంస్థాగత పెట్టుబడుల అవుట్ ఫ్లోలు కొనసాగుతుండటం రూపాయి ఈ స్థాయిలో పతనం కావడానికి కారణాలుగా నిలుస్తున్నాయి.
సిల్వర్ షాక్.. బంగారం ధరలు ఒక్క రోజులోనే రివర్స్..
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. క్రితం రోజున కాస్త ఉపశమనం ఇచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలలో మార్పలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు (Today Gold Price) ఎగిశాయి. వెండి ధరలు అమాంతం దూసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ
నో జిమ్ నో ఫ్యాన్సీ డైట్..! 22 కిలోలు తగ్గిన వెయిట్లాస్ కోచ్
సాధారణంగా బరువు తగ్గడం అంటే సరైన డైట్ ప్లాన్, ఖరీదైన సప్లిమెంట్లు, జిమ్లో ఎక్కువ గంటలు గడపడం అని అనుకుంటుంటారు. సత్వరమే మంచి ఫలితం రావాలంటే మొత్తం లైఫ్స్టైల్నే మార్చితే చాలని కొందరు అనుకుంటారు. కానీ అసలైన వాస్తవం ఏంటంటే..రోజువారి అలవాట్ల నుంచి వస్తుందనేది విస్మరిస్తారని చెబుతోంది కంటెంట్ క్రియేటర్, వెయిట్ లాస్ కోచ్ అయిన నేహా పరిహార్. మనం అంతగా పట్టించుకోని చాలా చిన్న చిన్న బేసిక్ విషయాలతోనే అద్భుతం చేయొచ్చని అంటోందామె. మరి అదెలాగో సవివరంగా తెలుసుకుందామా..!వెయిట్లాస్ కోచ్ నవంబ్కి సుమారు 22 కిలోలు బరువు తగ్గినట్లు నెట్టింట షేర్ చేశారు. అంతేగాదు తన వెయిట్ లాస్ జర్నీని కూడా షేర్ చేసుకుంది. తాను బరువు తగ్గడం కోసం ఎలాంటి కొలెస్ట్రాల్ బర్నర్లు, డీటాక్స్ పానీయాలను ఉపయోగించలేదని, అలాగే కఠినమైన కేలరీల లెక్కింపు వంటివి ఏమిలేవని స్పష్టం చేసింది. జస్ట్ కామెన్సెన్స్తో స్థిరమైన అలవాట్లతో బరువు తగ్గే ప్రయంత్నం చేశానని పేర్కొంది. అదెలాగంటే..ఎక్కువ లాగిస్తూనే..నేహా తనను తాను ఆకలితో అలమటించే ప్రయత్నం చేయలేదని వెల్లడించింది. తాను అక్షరాల రోజుకు 3 ఫుల్ మీల్స్ + 1 స్నాక్ తినడం ప్రారంభించానని తెలిపింది. భోజనం దాటవేయడం వల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది. అందుకు బదులుగా ఆమె తన ప్లేట్లో ప్రోటీన్, ఫైబర్ ఉండేలా కేర్ తీసుకుంది.ప్రతిరోజూ వాకింగ్పదివేల అడుగులు నవడవ లేదు, అలాగే ట్రెడ్మిల్ సెషన్లు కూడా చేయలేదు. జస్ట్ రాత్రి భోజనం తర్వాత 30 నిమిషాల వాక్ మాత్రమే. దీంతోనే నేహ జీర్ణక్రియను, బొడ్డుకొవ్వుని మెరుగుపరిచింది. ఇది ఒకరకంగా వ్యాయామ ఒత్తిడిని దూరం చేసింది.నూటికి నూరు శాతం హెల్దీగా తినడం మానేసింది..ఎల్లప్పుడూ హెల్దీకి ప్రాధాన్యత ఇస్తే వారాంతంలో నచ్చిన ఐటెమ్స్ లాగించాలనే కోరిక కలుగుతుందట. అందుకు నేహా 80:20 రూల్ని పాటించిందట. అంటే 80% నిజమైన ఆహారం, 20% స్మార్ట్గా తినటం. అంటే అప్పడప్పుడు నచ్చిన రిలాక్స్డ్ భోజనం అది కూడా పరిమితంగా తీసుకునేదాన్ని అంటోందితేలికపాటి విందులురాత్రి 7:30 గంటలకు చీలా, క్వినోవా దోస, పప్పు-సబ్జీ వంటివి తీసుకునేది. ఇలా తేలికగా తినడం వల్ల ఆమె జీర్ణక్రియ, నిద్ర, మానసిక స్థితి మెరుగుపడటమే కాకుండా బొడ్డు కొవ్వు కూడా తగ్గింది.బరువు తగ్గే ఖరీదైన సప్లిమెంట్లు, సంక్లిష్ట ఆహారాలను తీసుకోవాల్సిన పనిలేదని నేహా వెయిట్ లాస్ స్టోరీ చెబుతోంది. చాలా చిన్న చిన్న విషయాల్లో కేర్ తీసుకుంటే చాలు. ముఖ్యంగా వేళకు భోజనం, నిద్ర, కాస్త కదలిక ఉంటే చాలు. దీంతో పాటు టెన్షన్ లేని ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేసుకుంటే బరువు తగ్గడం సులభమని చాలా సింపుల్గా చేసి చూపించారామె. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆనంద్ మహీంద్రా మెచ్చిన గ్రామం..! ఐక్యతతో ఏదైనా సాధ్యం..!)
ఆనంద్ మహీంద్రా మెచ్చిన గ్రామం..!
పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో స్ఫూర్తిదాయకమైన కథలను పంచుకుంటూ తన అభిమానులను చైతన్యపరుస్తుంటారు. ఈసారి అలానే సరికొత్త ప్రేరణాత్మక స్టోరీతో ముందుకొచ్చారు. ఈసారి గ్రామాలకు స్ఫూర్తిని కలిగించే కథను షేర్ చేశారు. ఆ గ్రామం స్మార్ట్ డెవలప్మెంట్కి ఫిదా అవ్వతూ నెట్టింట ఎలా ఆ గ్రామం అభ్యున్నతి వైపుకి అడుగులు వేస్తూ సరికొత్త మార్పుకి బీజం వేసిందో వివరించారు. డెవలప్మెంట్ అనగానే డబ్బు, మౌలిక సదుపాయాలు ఉంటేనే సాధ్యం అనుకుంటే పొరపాటే అంటున్నారు మహీంద్రా. మరీ ఈ గ్రామం ఎలా ఆదర్శవంతమైన గ్రామంగా నిలిచిందో తెలుసుకుందామా..!మహారాష్ట్రలోని టాడోబో నేషనల్ పార్క్ సమీపంలోని సతారా నెవార్ అనే గ్రామం ఆనంద్ మహాంద్రా మనసుని దోచుకుంది. క్రమశిక్షణకు, స్థిరమైన జీవన విధానానికి ఈ గ్రామం చక్కని రోల్ మోడల్ అంటూ ఆ గ్రామం విశిష్టత గురించి పోస్ట్లో రాసుకొచ్చారు. అంతేగాదు అర్థవంతమైన మార్పు అనేది గొప్ప నాయకత్వం, సాముహిక శక్తి నుంచి వస్తుందనేందుకు ఈ గ్రామమే ఒక ఉదాహరణ అని నొక్కి చెప్పారు.ఒకప్పుడూ ఈ సతారా నెవార్ గ్రామం ఇతర గ్రామాల మాదిరిగానే పరిశభ్రంగా లేక, వనరుల కొరతతో అధ్వాన్నంగా ఉండేది. అయితే స్థానిక నాయకుడు గజానన్ ఐదేళ్ల పాటు ఆచరణాత్మకమైన సంస్కరణల ప్రణాళికలు అమలయ్యేలా ప్రజలందర్నీ ఒప్పించి.. ఆ మార్గంలో ముందుండి నడిపించారు. ఈ గ్రామంలో మొత్తం ప్రజలకు అవసరమయ్యే ఉచిత వేడి నీటి వ్యవస్థ ఉంది. అది కూడా సౌరశక్తితో. అంతేగాదు నీటి ఏటీఎం కార్డుతో యాక్సెస్ అయ్యే కమ్యూనిటీ ఆర్ఓ వ్యవస్థ ఉంది. దీని సాయంతో శుద్ధి చేసిన తాగునీరు, అలాగే ప్రతి ఇంట్లో మీటర్తో కనెక్ట్ అయిన నీటి కుళాయిలు ఉన్నాయి. అలాగే ఓపెన్ డ్రెయిన్ వ్యవస్థను తొలగించారు. ప్రతి సాయంత్రం వీధులు చెత్తచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంటాయి. అలాగే వీధి దీపాలు సైతం సౌరశక్తితో వెలుగుతాయి. అంతేగాదు ఎవ్వరైనా అసభ్యకరమైన మాటలు మాట్లాడితే గనుక రూ. 500ల దాక జరిమాన విధించబుడుతుంది. ఇది అన్ని వయసులన వారికి వర్తిస్తుందట. ఇక్కడి పిల్లలు సైతం పరిశుభ్రత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారట. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత మాత్రమే కాదు అది మన గర్వానికి కారణమని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తారట. గ్రామస్తులు ప్రతి సౌకర్యాన్ని అందరూ కలిసి నిర్వహిస్తారు, అందుకు కావాల్సిన నిధులను వారే సమకూర్చుకుంటారట. అలా సమాజ అభివృద్ధిలో పాలుపంచుకునేవారికే ఇక్కడి సౌకర్యాలను వినియోగించుకునే హక్కుని కలిగి ఉంటారట. ఇది వాళ్లంతా ఏర్పరుచుకున్న నియమం అట. ఇక్కడ పిల్లల కోసం చిన్న లైబ్రరీ కూడా ఉంది. ఈ గ్రంథాలయంలోనే పెద్దలు కూడా సమావేశమై టీవి చూస్తూ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకునే వెసులుబాటు కూడా ఉండటం విశేషంమార్పుకు సరైన పాఠం ఇది..ఇంతింత బడ్జెట్ కేటాయింపులతో గొప్ప మార్పు రాదని ఈ గ్రామం ప్రూ చేసిందంటూ ఆనంద్ మహీంద్రా ప్రశంసలు జల్లు కురిపించారు. సరైన నాయకత్వం, ఐక్యత, క్రమశిక్షణతో అసలైన అభివృద్ధి సాధ్యమని ఈ గ్రామం చెబుతోంది పైగా మోడల్ గ్రామీణ అభివృద్ధికి కార్యచరణ ఇలా ఉండాలని తన చేతలతో చెప్పకనే చెప్పింది ఈ గ్రామం. సాముహిక బాధ్యత, క్రమశిక్షణా గొప్ప ఆవిష్కరణలకు మూలస్థంభమవ్వడమే గాక జీవితాలను సైతం మారుస్తుందని ఈ గ్రామాన్ని చూస్తే తెలుస్తుందంటూ పోస్ట్లో రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్రాThis clip has been doing the rounds.I paused to check if it was too good to be true.It isn’t.What it captures is a quiet success story in our own backyard.A village that has become a role model, not just for cleanliness or sustainability or shared amenities, but for an… pic.twitter.com/PK0HHRwBam— anand mahindra (@anandmahindra) December 1, 2025చదవండి: ‘జయ హో’..! ప్రతికూల పరిస్థితుల్లో ఆనందాన్ని వెతుక్కోవడం అంటే ఇదే..!
చలి... చర్మ సమస్యలూ, జాగ్రత్తలు..!
శీతకాలంలోని చల్లటి వాతావరణంలో చలి ప్రభావం నేరుగా చర్మం మీదే పడుతుంది. అందుకే ఆ చలి బాధను మొదట అనుభవించేది చర్మమే. పైగా ఈ సీజన్లో వాతావరణంలో తేమ బాగా తగ్గి΄ోవడంతో... దాన్ని మళ్లీ భర్తీ చేయడానికి మన చర్మం నుంచే తేమను అప్పుడున్న వాతావరణం లాగేస్తుంటుంది. ఈ కారణంగానే ఈ సీజన్లో చర్మం పొడిబారిపోయి కనిపిస్తుంటుంది. ఫలితంగా ఈ సీజన్లో చర్మంపై గోటితో గీరగానే గీతలు పడుతుంటాయి. అంతేకాదు.. ఈ సీజన్లో ఇతర అలర్జీలతో పాటు చర్మ–అలర్జీలూ పెరుగుతాయి. ఫలితంగా చర్మం పగలడం, కాళ్లు పగుళ్లు ప్రస్ఫుటంగా కనిపించే ఎగ్జిమా వంటి కేసులు పెరుగుతాయి. అందువల్ల మరీ ముఖ్యంగా మడమలు పగలడం కూడా ఈ సీజన్లోనే చాలా ఎక్కువ. ఇలా మడమల పగుళ్లు కనిపించడమన్నది యువతులు, మహిళల్లో మరికాస్త ఎక్కువ.ఎగ్జిమా : కాళ్లూ, చేతులు పగుళ్లబారి కనిపించడం ఎగ్జిమా తాలూకు ప్రధాన లక్షణం. ఈ సీజన్లో చలి కారణంగా పెరిగి΄ోయి కనిపించే కేసుల్లో ఎగ్జిమానే ఎక్కువ. అందుకే దాని నివారణ, చికిత్సల గురించి తెలుసుకుందాం.నివారణ, చికిత్స : ఎగ్జిమా నివారణ/చికిత్సలు ఇవి... ∙దురద అంతగా లేనివారు సువాసన లేని, మామూలు హై΄ో అలర్జిక్ మాయిశ్చరైజర్స్ రాసుకుంటూ చర్మాన్ని సంరక్షించుకోవాలి. ∙ఒకవేళ దురద ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు వాటిని తగ్గించే పూత మందులు (టాపికల్ మెడిసిన్స్) వాడాలి.హౌజ్వైఫ్ డర్మటైటిస్ : పేరునుబట్టి ఇది గృహిణులకు మాత్రమే వచ్చే సమస్యగా అనిపించవచ్చు గానీ అది నిజం కాదు. కొన్నిసార్లు మధ్యవయస్కులతో ΄ాటు, యువతుల్లోనూ కనిపిస్తుంది. అంటే ఇరవై నుంచి నలభై ఏళ్ల వయసులో ఉన్న మహిళలకు ‘హౌజ్వైఫ్ డర్మటైటిస్’ ముప్పు ఎక్కువ. ఈ వయసు మహిళలు... తాము ముఖం కడుక్కోవడానికి వాడే సబ్బులు, బట్టలు ఉతకడం కోసం వాడే డిటర్జెంటు సబ్బులు, ΄ûడర్లు; అలాగే కొన్ని సందర్భాల్లో వారు ముఖానికి పసుపు, కుంకుమ రాసుకోవడం కారణంగా ముఖం బాగా ΄÷డిబారి΄ోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఫలితంగా చర్మంపై పగుళ్లు, దురదలు వస్తాయి. ఈ సమస్యనే ‘హౌజ్వైఫ్ డర్మటైటిస్’ అంటారు. నివారణ : ∙తమకు అలర్జీ కలిగించే అన్ని రకాల పదార్థాలను గుర్తించి, వాటి నుంచి దూరంగా ఉండటం. ∙మడమలు పగలినవారు శాల్సిలిక్ యాసిడ్ ఉండే కాంబినేషన్ క్రీములు వాడటం వల్ల ఉపశమనం కలుగుతుంది. కాళ్లు పగిలిన వారు రాత్రి వేళ సాక్స్ ధరించి పడుకోవడం వల్ల మడమల పగుళ్లు చాలావరకు తగ్గుతాయి.చలికాలంలో పూర్తిస్థాయి చర్మ సంరక్షణ కోసం... చలికాలంలో బాగా పొగలుగక్కే వేణ్ణీళ్లు మంచివి అని కొందరు పొరబడుతుంటారు. ఇది కేవలం అ΄ోహ మాత్రమే. నిజానికి ఈ సీజన్లోని వాతావరణం మన చర్మం నుంచి తేమను లాగేస్తుంటుంది. ఫలితంగా వేడినీళ్లతో స్నానం చర్మాన్ని మరింత పొడిబార్చే ప్రమాదం ఉంది. అందుకే స్నానానికి గోరువెచ్చని నీళ్లు వాడటమే మేలు స్నానానికి అరగంట ముందు ఒంటికి ఆలివ్ లేదా కొబ్బరి నూనె పట్టించాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్ సబ్బు వాడటం కూడా మంచిదే చల్లటి వాతావరణంలో దాహం వేయక΄ోవడంతో నీరు తాగడం తగ్గించడం సరికాదు. రోజూ కనీసం రెండు లీటర్ల నీటిని తాగడమే మంచిది అరచేతులు, పాదాలు పగిలినవాళ్లు పాదాలకూ సాక్స్, చేతులకూ కాటన్ గ్లౌజ్ ధరించడం మంచిది పెదవులు పగలకుండా పెట్రోలియమ్ జెల్లీగానీ లేదా లిప్ బామ్గానీ పెదవులపై తరచూ రాసుకుంటూ ఉండటం మంచిది చలికాలమే అయినప్పటికీ తగినంత ఎస్పీఎఫ్ ఉండే సన్స్క్రీన్ లోషన్ను రాసుకుంటూ ఉండటం మంచిది. (చదవండి:
హెల్త్ మాట 'వింటరు' కదా..?
చలికాలంలో కొన్ని ఆరోగ్య సమస్యలు సాధారణంగా కాస్తంత ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఉదాహరణకు ఈ సీజన్లో కీళ్లకు సంబంధించిన నొప్పులు పెరుగుతుంటాయి. కండరాల నొప్పులు కనిపిస్తుంటాయి. ఇక ఒళ్లంతా పగుళ్లతో, ముఖం, పెదవులూ, మడమలపై పగుళ్లు కనిపిస్తూ బాధిస్తుంటాయి. ఇలా చర్మసంబంధిత సమస్యలూ వస్తాయి. ఇక వైరస్ల వ్యాప్తికి అనువైన కాలం కావడంతో జలుబుతో ముక్కుకారడం, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు పెరగడమూ కనిపిస్తుంది. ఈ చలికాలంలో కనిపించే సాధారణసమస్యలూ, వాటి పరిష్కారాలకుఅనుసరించాల్సిన సూచనలేమిటో చూద్దాం...చలికాలంలో అన్నిటికంటే ఎక్కువగా బాధించే సమస్య కండరాలూ, కీళ్లనొప్పులు. పైగామామూలుగానే ఈ సమస్యతో బాధపడేవాళ్లలో ఈ సీజన్లో ఆ బాధలు కాస్తంత ఎక్కువగా బాధిస్తూ వేధిస్తాయి. అందుకు కారణాలేమిటో తెలుసుకుందాం.చలికాలంలో కండరాలూ, కీళ్లనొప్పులు పెరగడం ఎందుకంటే... ఈ సీజన్లో చలివల్ల చర్మం చాలా త్వరగా తన వేడిని కోల్పోతుంది. దాంతో చర్మం పైభాగంలో ఉండే రక్తనాళాలు కొద్దిగా కుంచించుకు΄ోతాయి. ఇలా కుంచించుకుపోవడాన్ని ‘వాసో కన్స్ట్రిక్షన్’ అంటారు. ఇలా కుంచించుకు΄ోవడంతో ఆ ప్రాంతాలకు రక్తప్రసరణ కూడా కాస్త తగ్గుతుంది. దాంతో చర్మంలోని నొప్పిని గ్రహించే భాగాలైన ‘పెయిన్ సెన్సార్స్’ మరింత ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఈ పెయిన్ సెన్సర్స్ ఈ సీజన్లో ఇంకాస్త చురుగ్గా పనిచేయాల్సిరావడంతో చిన్న దెబ్బకే ఎక్కువ నొప్పి తెలుస్తుంటుంది. అందుకే చలికాలంలో ఒంటికి గాయాలైతే... దెబ్బ చిన్నదే అయినా, నొప్పి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ సీజన్లో కండరాలూ, కీళ్ల నొప్పులు పెరగడానికి దోహదం చేసే ఒక అంశం. ఇక మరో అంశమేమిటంటే... చాలామందిలో ఈ సీజన్లో నొప్పిని భరించే సామర్థ్యం (పెయిన్ టాలరెన్స్) తగ్గుతుంది. అందుకే బాధితులు మామూలు రోజుల్లోని నొప్పులూ కూడా ఈ కాలంలో మరింత పెరిగినట్లుగా అనిపిస్తాయి. ఈ సీజన్లో చలికి కీళ్లు బిగుసుకు΄ోతుంటాయి. దాంతో వాటిలో మామూలుగా ఉండాల్సిన కదలికలు కూడా బాగా తగ్గిపోతాయి. కీళ్లలో ఈ కదలికల తగ్గుదల కారణంగా మన రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా చేసే ఒళ్లు కదల్చడం, నడక వంటివి తగ్గిపోవడంతో దేహానికి ఒనగూరే వ్యాయామమూ, శారీరక శ్రమ కూడా తగ్గుతాయి. ఈ కారణం చేత కూడా కీళ్ల నొప్పులు బాగా పెరిగిపోతాయి. సాధారణంగా ఎముకలకు అందాల్సిన పోషకాలు దేహపు కదలికల వల్లనే వాటికి అందుతుంటాయి. ఈ కదలికలు తగినంతగా లేక΄ోవడంతో కీళ్లూ, ఎముకలకు అందాల్సిన పోషకాలూ సరిగా అందవు. మామూలుగా ఇతర సీజన్లలో కంటే... వింటర్ సీజన్లో సూర్యుడు చాలా తక్కువ సేపు మాత్రమే ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే చలికాలంలో పగటి నిడివి బాగా తక్కువగా ఉండటం మనందరికీ తెలిసిన విషయమే. ఫలితంగా మన దేహాలు, చర్మం సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యే వ్యవధి కూడా తగ్గుతుంది. అందుకే ఈ సీజన్లో మన ఎముకలకు అవసరమైన విటమిన్–డి పాళ్లూ తగ్గుతాయి. అంతేకాదు... ఈ కారణం వల్ల మరో అనర్థమూ పొంచి ఉంటుంది. అదేమిటంటే... ఏవైనా కారణాలతో ఈ సీజన్లో ఎముకలు ఫ్రాక్చర్ అయితే అవి అతుక్కోడానికి పట్టే వ్యవధి మిగతా కాలాలలో ΄ోలిస్తే ఈ సీజన్లో మరింత ఎక్కువగా ఉంటుంది.ఒళ్లూ, కండరాల నొప్పులు తగ్గుదల కోసం ఇవీ కొన్ని పరిష్కారాలూ, సూచనలుఈ సీజన్లో వీలైనంత మేరకు గాయాల΄ాలు కాకుండా అలాగే వాహనాలు నడిపేటప్పుడు లేదా వ్యాయామాల సమయంలో దెబ్బలు తగలకుండా తమను తాము జాగ్రత్తగా రక్షించుకోవాలి. ఆరుబయట నడుస్తున్నప్పుడు తాకుడురాళ్లు / ఎదుర్రాళ్లు తగలకుండా పాదం అంతా కప్పి ఉంచేలా మంచి షూస్ ధరించాలి. వేళ్లు బయటకు కనపడేలా ఉండే పూర్తిగా కవర్ చేయని చెప్పులూ, స్లిప్పర్స్ ధరించినప్పుడు కాలివేళ్లకు ఎదుర్రాయి తగిలి, చిన్న దెబ్బ తగిలినా, జివ్వుమనడం, చాలా బాధగా అనిపించడం, నొప్పి బాగా తెలుస్తుండటం జరుగుతుంది. షూస్ వల్ల కాళ్ల నుంచి వేడిమి కోల్పోకుండా ఉండటంతోపాటు, పాదాలకూ, కాలివేళ్ల చివరలకు పూర్తి రక్షణ కలుగుతుంది. అలాగే... వ్యాయామం చేస్తున్నప్పుడు మోకాళ్లకు ధరించే నీ–ప్యాడ్స్, నీ క్యాప్స్ వంటివి ధరించడం వల్ల గాయాలను / దెబ్బలను వీలైనంతగా నివారించుకోవచ్చు. ఆరుబయట చలిగా ఉన్నప్పుడు దేహానికి తగినంత వేడిని ఇచ్చేలా ఫుల్ స్లీవ్స్ ఉండే దుస్తులూ, ఊలు దుస్తులూ, ఉన్ని దుస్తుల వంటివి ధరించాలి. ఇవి దేహం నుంచి ఉష్ణోగ్రత బయటకు వెళ్లనివ్వకుండా దేహం వెచ్చగా ఉండేలా చూస్తాయి. అలాగే చేతులకు గ్లౌవ్స్ వేసుకోవడం, కాళ్లకు సాక్స్ ధరించడం వంటి జాగ్రత్తలూ మేలు చేస్తాయి. ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడేవారు మోకాళ్లు, మోచేతుల వద్ద మరింత మందంగా ఉండే దుస్తులు వేసుకోవడం మంచిది. ఈ సీజన్లో ఆరుబయట కాకుండా వీలైనంత మేరకు ఇన్డోర్ ఎక్సర్సైజ్లు చేయాలి. ఈ వ్యాయామాల ఫలితంగా ఈ సీజన్లో మామూలుగానే కాస్తంత మందకొడిగా జరిగే రక్త సరఫరా ఉత్తేజితమై నార్మల్ స్థాయికి వస్తుంది. దాంతో నొప్పిని తెలిపే సెన్సర్స్ కూడా మామూలుగానే పనిచేస్తాయి. ఫలితంగా నొప్పి తగ్గుతుంది. చాలామంది చలి కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుంటారు. కాఫీ, టీ వంటి పానియాలను ఎక్కువగా తాగుతారు. దళసరిగా ఉండే మందపాటి దుస్తులు, స్వెటర్లు ధరిస్తారు. దాంతో మనకు తెలియకుండానే చెమట రూపంలో నీటిని కోల్పోతాం. వాటిని భర్తీ చేసేంతగా నీళ్లు తాగం. ఇలా నీరు తక్కువ తాగడం, చెమట కారణంగా మనకు తెలియకుండానే దేహం డీహైడ్రేషన్కు లోనయ్యే ముప్పు పొంచి ఉంటుంది. ఈ కారణాలన్నింటి వల్ల శరీరంలో నీళ్లు, లవణాల మోతాదులు బాగా తగ్గి΄ోతాయి. అందుకే ఈ సీజన్లో తరచూ నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్కు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. డాక్టర్లు విటమిన్–డి సప్లిమెంట్స్ వాడాలని సూచించినవారు ఆ మేరకు వాటిని వాడాలి. సాధారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ బాధితులకు ఈ సీజన్లో వారి నొప్పుల బాధలు మరింత పెరుగుతాయి. అందుకే ఆస్టియో ఆర్థరైటిస్ బాధితులు ఈ సీజన్లో తమ డాక్టర్ సలహా మేరకు విటమిన్–డి సప్లిమెంట్లు తప్పక వాడాల్సిందే. చలికాలంలో ఈ సూచనలూ, జాగ్రత్తలతో కీళ్ల, కండరాల నొప్పులను చాలావరకు నివారించుకోవచ్చు. తమ ఒళ్లునొప్పుల వంటి బాధల నుంచి చాలావరకు రక్షణ పొందవచ్చు. ఈ సూచనలు పాటించాక కూడా కండరాల నొప్పులూ, కీళ్ల నొప్పులూ, ఒళ్లునొప్పులూ తగ్గకపోతే ఒకసారి డాక్టర్ను కలిసి తగిన పరీక్షలు, వాటి ఫలితాలను బట్టి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.జలుబులూ... ఇతర వైరల్ జ్వరాలు మనలో జలుబు రావడానికి రెండువందల రకాలకు వైరస్లు కారణమవుతాయి. ఈ రెండు వందలకు పైగా వైరస్లనూ, వాటిలో కనిపించే కొన్ని సమాన లక్షణాలను బట్టి గ్రూపులుగా విభజిస్తే... అందులో ఆరు రకాల గ్రూపులతో జలుబు వస్తుంటుందన్నది వైద్య నిపుణుల మాట. ఆ వైరస్లు ఏమిటంటే... 1) ఇన్ఫ్లుయెంజా, 2) పారాఇన్ఫ్లుయెంజా, 3) రైనోవైరస్, 4) ఎడినో వైరస్, 5) హ్యూమన్ రెస్పిరేటరీ నిన్సీషియల్ వైరస్ 6) బీఎఫ్–7 వేరియెంట్ అనేవి. గత కొన్నేళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ బాధించిన కరోనా వైరస్ కూడా ఈ బీఎఫ్ వేరియెంట్ కిందకే వస్తుంది. కాక΄ోతే ఇప్పుడు కరోనా వైరస్ మునపటి తీవ్రత కోల్పోయిన కారణంగా అప్పుడప్పుడు అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ జలుబులో ఉండే మామూలు లక్షణాలనే ప్రదర్శిస్తోంది. లక్షణాలు... జలుబు వచ్చినప్పుడు కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి, గొంతునొప్పి, గొంతులో గరగర, ముక్కు నుంచి లేదా ముక్కుతోపాటు కళ్ల నుంచి నీరు కారుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా వైరస్ సోకిన 5 నుంచి 7 రోజుల్లో ఈ లక్షణాలన్నీ తగ్గి΄ోతాయి. అయితే అరుదుగా కొన్ని సార్లు మాత్రం ఈ వైరస్లు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి నిమోనియా అనే ప్రమాకరమైన కండిషన్కు కారణమవుతాయి. మామూలు నిమోనియాతో పోలిస్తే... ఇలా ఒక వైరస్ కారణంగా వచ్చే సెకండరీ నిమోనియా మరింత ప్రమాదకారిగా పరిణమిస్తుంది. జలుబుగానీ లేదా ఇతరత్రా వైరస్ల వల్లగానీ సమస్య శ్వాసవ్యవస్థలోని పైభాగంలో అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఉంటే... అది చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. కానీ ఒకవేళ పైన పేర్కొన్న వైరస్లు శ్వాస వ్యవస్థలో మరికాస్త లోతుకు వెళ్లి... అక్కడి కింది భాగాలకు అంటే... లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వరకు వ్యాపిస్తే అది నిమోనియాకు దారితీస్తుంది. అప్పుడు సమస్య ఇంకాస్త తీవ్రమవుతుంది. కొన్నిసార్లు ముక్కు, శ్వాసకోశ వ్యవస్థల్లోని సన్నని ఎపిథీలియల్ పొర దెబ్బతినడం వల్ల అక్కడికి బ్యాక్టీరియా చేరి సైనుసైటిస్, ఫ్యారింజైటిస్ వంటి ఇతర సమస్యలూ వచ్చే అవకాశాలూ ఉంటాయి. నివారణ... మంచి పుష్టికరమైన సమతుల ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ సీజన్లో ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తల వల్ల వ్యాధి నిరోధకశక్తి పెరిగి ఇమ్యూన్ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. దీనివల్ల జలుబుతోపాటు... ఇతరత్రా జబ్బులనుంచీ దేహానికి మంచి రక్షణ దొరుకుతుంది జలుబు వచ్చినవారు నేరుగా ఇతర వ్యక్తులపై తుమ్మడం, దగ్గడం చేయకూడదు. తుమ్మే సమయంలో లేదా దగ్గేటప్పుడు చేతిరుమాళ్లు, టిష్యుపేపర్లు వంటివాటిని అడ్డు పెట్టుకోవడం అవసరం. అవి లేనప్పుడు కనీసం మోచేతి మడతలో తుమ్మడం, దగ్గడం చేయాలి. ఇక తరచూ చేతులు కడుక్కోవడం లేదా శానిటైజ్ చేసుకోవడం, ఇతరులనుంచి భౌతిక దూరాన్ని పాటించడం, గుంపుల్లోకి (క్రౌడ్స్లోకి) వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ సీజన్లో జలుబు మాత్రమే కాకుండా అనేక ఇతర వైరస్ల కారణంగా వచ్చే వైరస్ జబ్బులను నివారించుకోవచ్చు. ఆస్తమా వంటి సీజనల్ సమస్యలు...ఇక ఈ సీజన్లోని చలి వాతావరణంలో ఆస్తమా వంటి సీజనల్ సమస్యలూ పెచ్చరిల్లుతాయి. మందకొడి వాతావరణంలోని అలర్జెన్స్ వల్ల ఊపిరితిత్తుల్లోకి గాలి తీసుకుపోయే గాలిగొట్టాలు కుంచించుకుపోవడం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది. అందుకే ఈ సీజన్లో మనకు సరిపడని అలర్జెన్స్నుంచి దూరంగా ఉంటూ ఆస్తమా వంటి ఊపిరితిత్తుల సమస్యను నివారించుకోవాలి. తమకు ఈ సమస్య ఉందని తెలిసినవారు ఇన్హేలర్స్ వంటి ఫస్ట్లైన్ చికిత్సలతో సమస్య తీవ్రతరం కాకుండా నివారించుకోవాలి. అప్పటికీ తగ్గక΄ోతే డాక్టర్ను సంప్రదించి... ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలను వెడల్పు చేసే బ్రాంకోడయలేటర్ల వంటి మందులు, ఇన్హేలర్లు వాడటం మంచిది.చికిత్స:జలుబు లేదా జలుబు వంటి వైరస్లతో వచ్చే సమస్యలన్నీ తమంతట తామే (సెల్ఫ్ లిమిటింగ్) సమస్యలు. వీటికి చికిత్స అందుబాటులో లేదు. కేవలం ఉపశమనం కోసమే లక్షణాలను బట్టి (సింప్టమ్యాటిక్ ట్రీట్మెంట్గా) కొన్ని మందులు ఇస్తుంటారు. లక్షణాలను తగ్గించడం కోసం జ్వరానికి పారాసిటమాల్, ముక్కులు పట్టేసినప్పుడు నాసల్ డీ–కంజెస్టెంట్స్ వంటి వాటిని డాక్టర్లు సూచిస్తారు. వాటితో తగినంత ఉపశమనం కలుగుతుంది.గొంతునొప్పి, గొంతులో గరగర ఉన్నవారు లోజెంజెస్ వాడవచ్చు. అలాగే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి గరగరా పుక్కిలించడం (థ్రోట్ గార్గలింగ్) చేయవచ్చు.జలుబు, దాని వల్ల వచ్చే జ్వరం తగ్గిపోయాక కూడా చాలామందిలో నీరసం, నిస్సత్తువ, అలసట వంటివి కనిపిస్తూ ఉంటాయి. దాన్నే పోస్ట్ పైరెక్సియల్ డెబిలిటీ’ అంటారు. ఇది తగ్గడానికి అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉండే పుష్టికరమైన సమతులాహారం; జింక్ వంటి న్యూట్రియెంట్స్తోపాటు విటమిన్–సి పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.చల్లగా ఉండే వాతావరణం కారణంగా చాలామంది చలికాలంలో ఎక్కువగా నీళ్లు తాగరు. జలుబు చేసినప్పుడు నీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. దాంతో వ్యాధినిరోధక శక్తి పెరిగి... దేహానికి జలుబును ఎదుర్కొనే సామర్థ్యం కలుగుతుంది.డాక్టర్ వెంకట్ నాని కుమార్ .బి, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ (చదవండి: పెళ్లిపై నటి జయ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు..! అది పాతబడిన వ్యవస్థ)
అంతర్జాతీయం
ఖాన్ సాబ్ సేఫేనా.. మరికొద్ది గంటల్లో సస్పెన్స్కు తెర
పాకిస్తాన్ మాజీ ప్రధాని, దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగానే ఉన్నారా?.. పాక్ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుందా?. జైల్లో ఉన్న ఖాన్ను ఆయన్ని కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. దీంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అడియాలా జైలు అధికారులు అనుమతించారు. దీంతో ఆయన సోదరి ఉజ్మాతో పాటు లాయర్ కూడా ఖాన్ను కలిసే అవకాశం ఉంది. అయితే ఈ ములాఖాత్ ముగిశాక సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయొద్దని ఆమెకు పాక్ ప్రభుత్వం షరతు విధించినట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కినా.. రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండడతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంతో రావల్పిండిలో 144 సెక్షన్ విధించారు. బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రదర్శనలపై నిషేధం విధించారు. అయినా కూడా భారీ ర్యాలీ చేపట్టాలని పీటీఐ వర్గాలు భావిస్తున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం చేరింది. ఈ నేపథ్యంలో నిర్బంధాలు.. హౌజ్ అరెస్టులతో రావల్పిండిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారని.. ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. ఇలా రకరకాల ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. అయితే జైలు అధికారులు, ప్రభుత్వం వాటిని తోసిపుచ్చింది. మరోవైపు ఆయన సురక్షితంగానే ఉన్నారా? అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తనయుడు ఒకవేళ తన తండ్రి బతికే ఉన్నా.. హింసించి చంపే అవకాశం ఉందంటూ సంచలన ఆరోపణలకు దిగారు.గత నెల మొదట్లో ఆయన నుంచి ట్వీట్ తర్వాత ఎలాంటి సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ సురక్షితంగా ఉన్నారా? అనేది బయటి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ పెరిగిపోయింది. తెహ్రీక్ ఈ ఇన్షాఫ్ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాలు, ఇటు ప్రజలు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించాలని నిర్ణయించారు. ఇమ్రాన్ ఖాన్ భద్రతపై.. ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు మరికొన్ని గంట్లలో అనే ఉత్కంఠకు తెర పడే అవకాశం కనిపిస్తోంది.
ట్రంప్ ఎనర్జీ లెవల్స్ ఏమాత్రం తగ్గలేదా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేయడం సాధారణంగా మారిపోయింది. ఆయన మునుపటిలా లేరని.. ఎనర్జీ లెవల్ దారుణంగా పడిపోయిందని.. బహుశా వయోభారమే అందుకు కారణమై ఉండొచ్చని తాజాగా న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఇది సాధారణంగానే ఆయనకు కోపం తెప్పించింది.ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న కథనాలను వైట్హౌజ్ కొట్టిపారేసింది. తాజాగా ఆయన తీయించుకున్న ఎమ్మారై స్కాన్తో ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ మీడియా ముందుకు వచ్చారు. సాధారణంగా ఆయన వయసు ఉన్నవాళ్లకు ఇమేజింగ్ పరీక్షలు చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. అలా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి ఆందోళనకరమైన అంశాలు కనిపించలేవు. ఆయన గుండె సాధారణంగానే ఉంది. రక్తనాళాల్లో ఎలాంటి బ్లాకులు లేవు. రక్తప్రవాహానికి ఆటంకం.. గుండె, ప్రధాన రక్తనాళాల్లో ఎలాంటి అసాధారణతలు కనిపించలేదు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు’’ అని మీడియా కథనాలను ఖండించారామె. మరోవైపు న్యూయార్క్ టైమ్స్ కథనం మీద ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.🇺🇸 WHITE HOUSE: TRUMP’S MRI SHOWS “EXCELLENT OVERALL HEALTH”The White House released Trump’s MRI today, confirming everything came back normal. His physician, Capt. Sean Barbarella of the U.S. Navy, said the MRI showed no heart or abdominal issues, with “all major organs… pic.twitter.com/FWHpfHMSoQ— Mario Nawfal (@MarioNawfal) December 2, 2025‘‘ఇప్పటిదాకా నా జీవితంలో ఏనాడూ ఇంతలా కష్టపడలేదు. అంతగా పని చేస్తూ.. పర్ఫెక్ట్గా ఫలితాలు రాబట్టగలుగుతున్నా. శారీరకంగా, మానసికంగా నేను ఫిట్గా ఉన్నా. నా స్టామినా విషయంలో సందేహమే అక్కర్లేదు’’ అని మొన్నీమధ్యే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. న్యూయార్క్ టైమ్స్ను తిట్టిపోసిన ఆయన.. ఆ కథనం వెనుక రాజకీయాల ప్రభావం ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే.. ఎప్పటిలాగే దానిని అమెరికన్ల శత్రువుగా అభివర్ణించారు. అలాగే ఆ కథనం రాసిన కేటీ రోగర్స్కు నానాశాపనార్థాలు పెట్టారు.28 ఏళ్ల కరోలైన్ లెవిట్ అమెరికా చరిత్రలో అత్యంత యువ ప్రెస్ సెక్రటరీ ఘనత దక్కించుకుంది. 2022లో న్యూ హాంప్షైర్ 1వ కాంగ్రెస్ జిల్లా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చాక ఆమెకు వైట్హౌజ్లో బాధ్యతలు అప్పగించారు. అందగత్తె మాత్రమే కాదు.. తెలివైంది కూడా అంటూ ఆయన తరచూ ఆమెపై ప్రశంసలు గుప్పిస్తుంటారు. ఈ ఏడాదిలోనే ఆమె వివాహం జరిగింది కూడా.
షేక్ హసీనాకు మరో బిగ్ షాక్..
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు జైలు శిక్షల పర్వం కొనసాగుతోంది. మరో భూ కుంభకోణం కేసులో ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష, ఆమె సోదరి షేక్ రెహనాకు ఏడేళ్ల జైలు శిక్ష, రెహనా కూతురు, బ్రిటిష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్ధిక్కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢాకాలోని అవినీతి నిరోధక ప్రత్యేక న్యాయస్థానం కోర్టు తీర్పు ఇచ్చింది. భూకేటాయింపుల వ్యవహారంలో అధికార దుర్వినియోగం జరిగిందని, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని పేర్కొంది.ఈ నేపథ్యంలో 17 మందిపై కేసు నమోదైంది. మిగిలిన 14 మంది నిందితులకు ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు.. 17 మంది జరిమానాగా లక్ష రూపాయలు చెల్లించాలని, లేని పక్షంలో ఒక్కొక్కరు మరో ఆరు నెలలపాటు అదనంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. కేసు తీర్పు సందర్భంగా ముగ్గురు నిందితుల్లో ఏ ఒక్కరూ కోర్టు గదిలో లేకపోవడం గమనార్హం. అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన అవినీతి కేసుల్లో 78 ఏళ్ల హసీనాకు సంబంధించిన నాలుగో తీర్పు ఇది. వరుస కేసులు.. ఇదిలా ఉండగా.. వరుస కేసులతో.. కఠిన శిక్షలతో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాకు ఊపిరి సలపనివ్వడం లేదు. తాజాగా భారత్పైనా సంచలన ఆరోపణలు చేస్తూ ఆమెపై మరో అభియోగం మోపే దిశగా అడుగులు వేస్తోంది. 2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు షేక్ హసీనానే కారణమని.. ఇందులో భారత్ ప్రమేయం కూడా ఉందని ఆరోపిస్తోంది. హసీనా హయాంలో జరిగిన హింసాకాండపై సమగ్ర దర్యాప్తునకు యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త కమిటీ ఈ మేరకు నివేదికను సమర్పించింది. ఈ కమిషన్ ప్యానెల్కు రిటైర్డ్ మేజర్ ఏఎల్ఎం ఫజ్లుర్ రెహ్మాన్ నేతృత్వం వహిస్తున్నారు.2009లో షేక్ హసీనా అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే.. బంగ్లాదేశ్ రైఫిల్స్ (BDR) తిరుగుబాటు జరిగింది. ఈ ఘటనలో సీనియర్ ఆర్మీ అధికారులతో సహా 74 మంది మరణించారు. ఫజ్లుర్ కమిషన్ ఆదివారం సమర్పించిన నివేదికలో ఇలా ఉంది.. మాజీ ప్రధాని షేక్ హసీనా తిరుగుబాటుకు "గ్రీన్ సిగ్నల్" ఇచ్చారు. ఆనాడు అవామీ లీగ్ ఎంపీగా ఉన్న ఫజ్లే నూర్ టాపోష్ నేతృత్వంలోనే ఈ దమనకాండ జరిగింది. పైగా ఈ తిరుగుబాటులో "విదేశీ శక్తి" ప్రమేయం స్పష్టంగా కనిపించింది. అది భారతదేశమే. ఆ సమయంలో 921 మంది భారతీయులు బంగ్లాదేశ్లోకి చొరబడ్డారు. వాళ్లలో 67 మంది ఎక్కడ ఉన్నారో ఇప్పటికీ తెలియదు అని పేర్కొంది.హసీనా ప్రభుత్వ హయాంలో బీడీఆర్ తిరుగుబాటుకు సైనిక వేతనాలు, గత ప్రభుత్వంలో వాళ్ల దీనావస్థలే కారణమని ప్రకటించుకుంది. అయితే ఫజ్లుర్ కమిషన్ మాత్రం దానిని అంతర్గత కుట్రగా అభివర్ణించింది. హసీనా ప్రభుత్వం సైన్యాన్ని బలహీనపరచి తన అధికారాన్ని మరింత కాలం కొనసాగించాలనే ఉద్దేశంతో తిరుగుబాటును ప్రోత్సహించిందని పేర్కొంది. ఆమెకు మద్దతుగా భారతదేశం బంగ్లాదేశ్లో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించిందని ఆరోపించింది.
కొనసాగుతున్న వరద సహాయక చర్యలు..
జకార్తా/న్యూఢిల్లీ: ఇండోనేసియా, థాయ్లాండ్, శ్రీలంకల్లో ఇటీవల సంభవించిన వర్షాలు, వరదలకు సంభవించిన ఘటనల్లో మరణాలు వెయ్యి దాటేశాయి. గల్లంతైన వారి సంఖ్య వందల్లో ఉంది. ఆయా దేశాల్లో వరద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో కనీసం 708 మంది చనిపోయారని అధ్యక్షుడు ప్రబోవోసుబియాంతో తెలిపారు. వేలాది మంది నిరాశ్రయులుగా మారారని, ఇంకా 504 మంది జాడ తెలియాల్సి ఉందని వెల్లడించారు. గత వారం వరదలు సంభవించిన కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ సహాయక బృందాలు చేరుకునేందుకు వీలు కావడం లేదన్నారు. రోడ్లు, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. తీవ్రంగా దెబ్బతిన్న నార్త్ సుమత్ర, వెస్ట్ సుమత్ర, ఆసెహ్ ప్రావిన్స్లను ఆయన సోమవారం పర్యటించి, బాధితులను పరామర్శించారు. అదేవిధంగా, థాయ్లాండ్లో సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో 181మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1.5 లక్షల కుటుంబాలపై వర్షాల ప్రభావం పడింది. దీంతో, ప్రభుత్వం మొదటి విడతలో తీవ్రంగా నష్టపోయిన 26 వేల మందికి 74 లక్షల డాలర్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు, శ్రీలంకలో దిత్వా తుపాను సంబంధిత ఘటనల్లో 410 మంది చనిపోగా 336 మంది గల్లంతయ్యారని అధికారులు సోమవారం ప్రకటించారు. సుమారు 2.18 లక్షల మందికి ప్రభుత్వం తుఫాను షెల్టర్లలో ఆశ్రయం కలి్పంచింది. తేయాకు తోటలు ఎక్కువగా ఉండే కొండప్రాంతాల్లో నష్టం ఎక్కువగా ఉంది. భారత ప్రధాని మోదీ సోమవారం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకెతో ఫోన్లో మాట్లాడారు. దిత్వా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలకు అవసరమైన సాయం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. భారత ప్రభుత్వం శ్రీలంకకు ఇప్పటికే రెండు విడతలుగా ఆహారం, అత్యవసర వస్తు సామగ్రితోపాటు సిబ్బందిని కూడా పంపించడం తెల్సిందే.
జాతీయం
పులిమేడు రూట్లో భక్తుల రద్దీ
సాక్షి శబరిమల: శబరిమలకు వెళ్ళే భక్తులకు ప్రత్యామ్నాయ మార్గం అయిన అటవీ మార్గం పులిమేడులో యాత్రికుల రద్దీ బాగా పెరిగింది. ఈ మార్గంలో ప్రతిరోజూ సుమారు 1,500 మంది నుంచి రెండు వేల మంది దాక యాత్రికులు తరలివస్తున్నట్లు అటవీశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పెరియార్ పులుల అభయారణ్యం మీదుగా వెళ్లేఈ అటవీమార్గంలో భక్తుల సంరక్షణార్థం ముమ్మరంగా అన్ని ఏర్పాట్లు చేసింది. సత్రం నుంచి సన్నిధానం వరకు సుమారు 12 కి.మీ దూరం ఉంటుంది. అయితే అక్కడి వాతావరణాన్ని అనుసరించి యాత్రికులకు ఈ అటవీ మార్గం గుండా ప్రయాణించేందుకు అనమతి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు యాత్రికులకు సత్రం నుంచి సన్నిధానం చేరుకోవడానికి అనుమతి ఉంది. అలాగే ఉదయం 8 నుంచి 11 గంటలలోపు యాత్రికులు తిరిగి సత్రానికి ప్రయాణించటానికి అనుమతి ఉంది. అలాగే దేవస్వం బోర్డు సత్రంలో కూడా స్పాట్ బుకింగ్ కోసం ఏర్పాట్లు చేసింది. ఇక్కడ నుంచి ఉన్న అనుమతిని ఆధారం ప్రయాణానికి అనుమతి ఉంటుంది. సత్రాన్ని వదిలి సన్నిధానం వరకు వెళ్లే యాత్రికుల బృందాలతో తమ శాఖ అధికారులు వెళ్తారని అటవీ శాఖ వెల్లడించింది. దీంతో పాటు యాత్రికులు భద్రతా, ఇతర ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు సుమారు 35 మంది అటవీ శాఖ అధికారులు 35 మంది ఎకో గార్డులు ఉన్నారని పేర్నొంది. అలాగే అదనంగా ఈ మార్గంలో ఎలిఫెంట్ స్క్వాడ్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏనుగులు, గేదెలు, అడవి జంతువులు లేవని నిర్థారించడానికి అటవీగార్డు బృందం సదా అప్రమత్తమై ఉండటమే గాక, జంతువులు లేవని నిర్ధారణ అయితేనే యాత్రికులను ప్రయాణించడానికి అనుమతిస్తామని అఝుతా రేంజ్ ఆఫీసర్ డి. బన్నీ తెలిపారు. వర్షం పడితే ఈ అటవీ మార్గం గుండా ప్రయాణించడం చాలా కష్టం. ఎందుకంటే కఝుతాకుళి నుంచి కొన్ని మైళ్ల తర్వాత అంతా బురదమయంగా ఉంటుంది. అందువల్ల ఈ మార్గం గుండా వెళ్లడం చాలా కష్టం. సత్రాన్ని సందర్శించే యాత్రికుల పత్రాలను ఉప్పుపారలోని పోలీసు అవుట్పోస్ట్లో తనిఖీ చేస్తారు. అలాగే ఈ అటవీ గార్డుల తోపాటు పోలీసు, ఆరోగ్య శాఖల సేవలను కూడా ఈ మార్గంలో ఏర్పాటు చేశారు. ఇవేగాక ఈ అటవీ మార్గంలో ఇరికప్పర, సీతకులం, జీరో పాయింట్ వద్ద పరిశుభ్రమైన నీరు , ఉప్పుపార బేస్ వద్ద టీ , స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ అటవీ మార్గం గుండా వచ్చే యాత్రికుల వివరాలను సన్నిధానం పక్కన ఉన్న అటవీ శాఖ, పోలీసు చెక్పోస్టులలో కూడా నమోదు చేస్తారు. (చదవండి: 16 రోజుల్లో శబరిమలకు 13.5 లక్షల మంది.. ఆదాయం ఎంతంటే..)
‘20 ఏళ్లుగా చావులే లేవు’..‘సర్’ డేటాలో భారీ గోల్మాల్!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంలో గందరగోళం చోటుచేసుకుంది. ఎన్నికల డేటాలో కనిపించిన ఒక ఆశ్చర్యకర అంశం రాష్ట్ర రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘సర్’ తొలి నివేదికల్లో 2,208 పోలింగ్ బూత్లలో మరణాలు, తప్పిపోయిన, పునరావాసం పొందిన లేదా నకిలీ ఓటర్లు లేరని తేలింది. ఆయా బూత్లలోని ఓటర్ల జాబితా గత రెండు దశాబ్దాలుగా ‘పరిశుభ్రంగా’ ఉందని జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓ)లు నివేదించడం అందరినీ కంగుతినేలా చేస్తోంది. అయితే ఈ డేటాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్ (ఈసీ) జిల్లాల నుండి వివరణాత్మక నివేదికలు కోరింది. ఆ విచారణ తర్వాత కేవలం 24 గంటల్లోనే ఈ 'క్లీన్ బూత్ల' సంఖ్య 2,208 నుంచి కేవలం 480కి భారీగా తగ్గింది.ఈ డేటా మార్పుపై తలెత్తిన ప్రశ్నలు రాష్ట్ర ఎన్నికల నిర్వహణ విశ్వసనీయతపై సందేహాలను లేవనెత్తుతున్నాయి. కేవలం ఒకే రోజులో 1,728 బూత్ల డేటాలో మార్పు రావడాన్ని బీజేపీ కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ తీవ్రంగా ఖండించారు. ‘2,200కు పైగా బూత్లలో ఎవరూ చనిపోలేదని చెప్పడం మాయాజాలమా? ఈసీ నివేదిక కోరగానే అకస్మాత్తుగా 480 బూత్లకు తగ్గించడం బెంగాల్లో మాత్రమే జరుగుతుంది’ అంటూ ఆయన పదునైన వ్యాఖ్యలు చేశారు. పరిపాలనా వర్గాలు నిరంతర డేటా నవీకరణల వల్లే ఈ తేడా వచ్చిందని చెబుతున్నా, ఈ అసాధారణ తగ్గింపు వెనుక వాస్తవ కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కొత్త జాబితాలో అత్యధిక సంఖ్యలో దక్షిణ 24 పరగణాల జిల్లాలోని రేదిఘి (66), కుల్పి (58), మాగ్రహత్ (15), పథర్ప్రతిమ (20) బూత్లు ఉన్నట్టు ఈసీవర్గాలు తెలిపాయి.మరోవైపు ఎన్నికల కమిషన్ ఈ తరహా ధృవీకరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఒక ప్రత్యేక జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో పెండింగ్లో ఉన్న అత్యధిక కేసులు ‘సంతాన మ్యాపింగ్’కు సంబంధించినవి. అంటే తల్లిదండ్రులు లేదా తాతామామల ద్వారా ఓటరు ధృవీకరణ జరగాల్సి ఉంది. ప్రత్యేకించి 2002 ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోని ఓటర్లు తిరిగి ధృవీకరణ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇది ఓటర్ల జాబితాలో తప్పులను తగ్గించడానికి కమిషన్ తీసుకుంటున్న కఠిన చర్యలలో భాగమని తెలుస్తోంది.మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి, మొత్తం 46.20 లక్షల గణన ఫారమ్లు దాఖలయ్యాయి. కేటగిరీల వారీగా చూస్తే, 22.28 లక్షల మంది మరణించిన ఓటర్లు కాగా, 6.41 లక్షల మంది తప్పిపోయిన ఓటర్లు, 16.22 లక్షల మందిని తరలించడం జరిగింది. 1.05 లక్షల డబుల్ ఎంట్రీలు గుర్తించారు. జిల్లాల వారీగా మరణించిన ఓటర్ల శాతంపై నివేదిక కూడా ఆసక్తికరంగా ఉంది: కోల్కతా నార్త్ 6.91%తో అత్యధికంగా ఉండగా, తూర్పు మెదినీపూర్ 1.4%తో అత్యల్పంగా ఉంది. ఈ లెక్కలు ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో అవకతవకలు పేరుకుపోయాయని సూచిస్తున్నాయి.ఇది కూడా చదవండి: పుతిన్ సెక్యూరిటీ: ల్యాబ్, టాయిలెట్.. అంతా రహస్యమే!
మూడేళ్లలో 2 లక్షల తీవ్ర కేసులు : ప్రభుత్వ షాకింగ్ డేటా
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం కాలుష్య కాసారంగా మారిపోతుంది. విషపూరితమైన వాయు కాలుష్యంపై ప్రభుత్వం షాకింగ్ డేటాను కేవలం 3 సంవత్సరాలలో 6 ప్రధాన ఆసుపత్రులలో 2 లక్షలకు పైగా తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత కేసులు నమోదైనట్టు పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం వెల్లడించింది. దీర్ఘకాలిక వాయు కాలుష్య సంక్షోభ తీవ్రత, ఢిల్లీ వాసుల ఆరోగ్యంపై చూపిస్తున్నప్రభావాన్ని ఈ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) బహుళ-నగర అధ్యయనంలో శ్వాసకోశ వ్యాధుల సంఖ్య చాలా తీవ్రంగా ఉందని పేర్కొంది. ఐదు ప్రదాన ఆసుపత్రుల్లలో కేవలం 3 సంవత్సరాలలో 6 ప్రధాన ఆసుపత్రులలో 2 లక్షలకు పైగా తీవ్రమైన శ్వాసకోశ కేసులు నమోదైనట్టు తెలిపింది. ఢిల్లీలోని ఆరు ప్రధాన కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు 2022 మరియు 2024 మధ్య అత్యవసర విభాగాలకు 2,04,758 తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం (ARI) కేసులను నమోదు చేశాయని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో, 30,420 మంది రోగులు - దాదాపు 15శాతం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడింది. రాజ్యసభ ఎంపీ డాక్టర్ విక్రమ్జిత్ సింగ్ సాహ్నే (నామినేట్ చేయబడిన) లేవనెత్తిన ప్రశ్న నం. 274 కు సమాధానంగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ ఈ డేటాను సమర్పించారు. సాహ్నే అడిగిన ప్రశ్నలు పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం మరియు శ్వాసకోశ వ్యాధుల మధ్య సంబంధాన్ని మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసిందా?శ్వాసకోశ వ్యాధులలో వాయు కాలుష్యం పాత్రను బాగా అర్థం చేసుకోవడానికి మంత్రిత్వ శాఖ విధాన జోక్యాలను ప్లాన్ చేస్తుందా? సంవత్సరం వారీగా 6 ఆసుపత్రుల్లో AIIMS, సఫ్దర్జంగ్, LHMC గ్రూప్, RML, NITRD, VPCI) నమోదవుతున్న కేసులు, 2022-2025 నుండి మెట్రో నగరాల్లో, ముఖ్యంగా ఢిల్లీలో ఉబ్బసం, COPD , ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల కారణంగా అవుట్ పేషెంట్ మరియు ఆసుపత్రిలో చేరేవారి పెరుగుదల వివరాలు? ప్రభుత్వం అందించిన డేటా2022: 67,054 అత్యవసర కేసులు. 9,874 అడ్మిషన్లు2023: 69,293 అత్యవసర కేసులు. 9,727 అడ్మిషన్లు2024: 68,411 అత్యవసర కేసులు. 10,819 మంది అడ్మిషన్లు2024లో మొత్తం ఎమర్జన్సీ కేసుల సంఖ్య స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, అడ్మిషన్ అవసరమైన రోగుల సంఖ్య బాగా పెరిగింది, ఇది ఆసుపత్రులకు వచ్చే కేసులు, తీవ్రంగా పరిణమిస్తున్న వైనాన్నిసూచిస్తుంది. అయితే వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యాధులు, సంబంధిత వ్యాధులకు ప్రేరేపించే కారకాల్లో ఒకటి అయినప్పటికీ, అని ఆహారం, వృత్తి, సామాజిక-ఆర్థిక స్థితి మరియు ముందుగా ఉన్న పరిస్థితులతో సహా బహుళ కారకాలు ఆరోగ్య ప్రభావాలను ప్రభావితం చేస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
బాబ్రీ మసీదు.. నాడు నెహ్రూ ప్రయత్నాన్ని ఆపిన పటేల్!
బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. దేశ తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ ప్రజా ధనంతో బాబ్రీ మసీదు నిర్మించేందుకు చూశారని.. కానీ, గుజరాతీ బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని అన్నారు. మంగళవారం గుజరాత్లో జరిగిన యూనిటీ మార్చ్లో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ.. ‘‘నాడు దేశ తొలి ప్రధానిగా ఉన్న నెహ్రూ ప్రజా ధనంతో బాబ్రీ మసీదు కట్టాలనుకున్నారు. ఆ ప్రయత్నాన్ని ఎవరైనా అడ్డుకున్నారు అంటే అది గుజరాత్ అమ్మ కడుపున పుట్టిన సర్దార్ వల్లభాయ్పటేలే. నెహ్రూ నిర్ణయానికి ఆయన ఏమాత్రం అంగీకరించలేదు. ఆ సమయంలో సోమనాథ్ ఆలయ(గుజరాత్) ప్రస్తావనను నెహ్రూ తీసుకొచ్చారు. అయితే.. సోమనాథ్ ఆలయ అంశం పూర్తిగా వేరు అని.. అది పూర్తిగా ప్రజల విరాళంతో(ట్రస్ట్ ఏర్పాటు చేసి) నిర్మించిందని.. ఒక్క పైసా ప్రభుత్వం ఖర్చు చేయలేదని పటేల్ నెహ్రూకు గుర్తు చేశారు. సరిగ్గా ఇదే ఇప్పుడు అయోధ్య రామమందిర విషయంలో జరిగింది. రాముడి ఆలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజలే స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. ఇది నిజమైన సెక్యులరిజం అంటే’’ అని రాజ్నాథ్ అన్నారు. అదే సమయంలో.. 1946లో కాంగ్రెస్ అధ్యక్షుడయ్యే అవకాశం సర్దార్ పటేల్కు వచ్చిందని.. మహత్మా గాంధీ సూచన మేరకే పటేల్ తన నామినేషన్ను వెనక్కి తీసుకున్నారని.. అలా నెహ్రూ ఆ టైంలో అధ్యక్షుడు అయ్యారని రాజ్నాథ్ అన్నారు. కొన్ని రాజకీయ దుష్టశక్తులు చరిత్ర నుంచి పటేల్ లెగసీని చెరిపేసే ప్రయత్నం చేశాయని.. కానీ, ప్రధాని మోదీ మాత్రం పటేల్ గొప్పదనం ఏంటో ప్రపంచానికి చాటి చెబుతున్నారని రాజ్నాథ్ అన్నారు.
ఎన్ఆర్ఐ
మా అమ్మ రష్యాలో సెలబ్రిటీ..! మురిసిపోతున్న కుమారుడు..
ఒక వ్యక్తి నెట్టింట షేర్ చేసిన వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించింది. అలాంటి క్షణం అత ఈజీగా మర్చిపోలేం కదూ..ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదూ అని కామెంట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. అసలేం జరిగిందింటే..శుభం గౌతమ్ అనే వ్యక్తి ఒక వీడియోని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. "నా అమ్మ రష్యాలో సెలబ్రిటీ" అనే క్యాప్షన్తో షేర్ చేయడంతో మరింత వైరల్గా మారింది. ఆ వీడియోలో అతడు తన తల్లితో రష్యా వీధుల్లోకి రాగానే.. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆ తల్లిని చూసి రష్యన్ ప్రజలు ఆశ్చర్యపోవడమే కాదు..ఒక్క సెల్ఫీ అంటూ ఎగబెట్టారు. ఏదో సెలబ్రిటీ మాదిరిగా అంతా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగుతుంటే..మా అమ్మకు ఒక్కసారిగా ఎంత క్రేజ్ పెరిగిపోయిందో అంటూ మురిసిపోయాడు ఆమె కుమారుడు. విదేశాల్లో మన సంప్రదాయ దుస్తులో గనుక మనం కనిపిస్తే కచ్చితంగా ప్రత్యేకంగా నిలబడటమే గాక, అందరి దృష్టిని ఆకర్షిస్తాం..అందుకు ఈ తల్లే నిదర్శనం. అంతేగాదు ఆమె కొడుకు నా తల్లి రష్యాకు ఇష్టమైన సెలబ్రిటీ అని వీడియోలో చెబుతుండటం స్పష్టంగా వినిపిస్తుంది. ఆమె కూడా అక్కడి వాళ్ల రియాక్షన్కు సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ వారితో సెల్ఫీలు దిగడం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. భారతదేశం వెలుపల మన దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా దుస్తులు దరిస్తే..అవి మనల్ని ప్రత్యేకంగా నిలబడేల చేయడమే గాక, రియల్ సెలబ్రిటీకి అర్థం చెప్పేలా మనల్ని నిలబెడతాయి కూడా. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ రావడమే కాదు..ఆ తల్లి నిజంగా భారతదేశ బ్రాండ్ అంబాసిడర్ అని ప్రేమగా పిలుస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Shubham Gautam (@samboyvlogs) (చదవండి: సాత్విక ఆహారంతో బరువు తగ్గగలమా..? నటి, గాయని షెహ్నాజ్ సైతం..)
జపాన్లో 'తాజ్' ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజనాలు
తెలుగువారు ఏ దేశంలో ఉన్న వారి సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పడంలో ఎపుడు ముందుంటారు. అందుకు నిదర్శనం జపాన్లో టోక్యో నగరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్ (తాజ్) అధ్వర్యంలో జరిగిన కార్తీక మాసం వనభోజనాలు. నవంబర్ 8న ఈ వేడుక స్థానిక కొమట్సుగవ పార్కులో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు అందరు పాల్గొని ఆట పాటలతో సరదాగా గడిపారు. ఒక్కో కుటుంబం నుంచి ఒక్క తినుబండారం తెచ్చి వనభోజన కార్యక్రమం నిర్వహించడం విశేషం. ప్రతి ఏటా ఇలాగే వేడుక జరుపుకోవాలని వారంతా ఆకాంక్షించారు. (చదవండి: ఆటా, ఎస్ఏఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్)
ఫీనిక్స్లో సాంస్కృతిక వేడుకలు.. శంకర నేత్రాలయ యూఎస్ఏకు భారీ విరాళం
మెసా(అరిజోనా): ఫీనిక్స్లోని భారతీయ యువత ఆధ్వర్యంలో మెసా ఆర్ట్స్ సెంటర్లోని వర్జీనియా జి. పైపర్ రిపర్టరీ థియేటర్ వేదికగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం, హాస్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. సేవా సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుక ద్వారా శంకర నేత్రాలయ యూఎస్ఏ నిర్వహించే గ్రామ దత్తత కార్యక్రమం కోసం 1,45,000 డాలర్లు విరాళంగా సమీకరించబడ్డాయి.“డాన్స్ ఫర్ విజన్” కార్యక్రమంలో 160 మంది యువ కళాకారులు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల నృత్య రూపకాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. యువ నాయకులు యోగాంశ్, విశాల్, జోషిత, ఆదిత్య తదితరులు సమర్థంగా కార్యక్రమాన్ని నడిపారు. మహిళా కమిటీ సమన్వయంతో నిర్వహణ విజయవంతమైంది. నృత్య గురువులకు సన్మాన పతకాలు, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.దాతలకు సన్మానంగ్రామ దత్తత కార్యక్రమానికి ముఖ్యంగా పది మంది దాతలు తమ విరాళాలతో మద్దతు అందించారు. వీరిని వేదికపై ఘనంగా సన్మానించారు. వారి సేవా దృక్పథం, అరిజోనా బృందం సమిష్టి కృషికి పలువురు అభినందనలు తెలిపారు.హాస్యంతో హృదయాల హరివిల్లు“విజన్ కోసం నవ్వులు” పేరుతో రామ్కుమార్ నిర్వహించిన తమిళ స్టాండ్అప్ హాస్య ప్రదర్శన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. కార్యక్రమం అనంతరం ఆయన అభిమానులతో ఫొటోలు దిగారు, శాలువా, సత్కార పతకంతో సన్మానితులయ్యారు.శంకర నేత్రాలయ సేవా లక్ష్యం1978లో ప్రారంభమైన శంకర నేత్రాలయం, గ్రామీణ భారతదేశంలో కంటి చికిత్స అందించడంలో అగ్రగామిగా నిలుస్తోంది. 1988లో స్థాపితమైన శంకర నేత్రాలయ యూఎస్ఏ, మెసు ద్వారా మొబైల్ నేత్ర శిబిరాలు నిర్వహిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది.నిర్వాహకుల కృషివంశీ కృష్ణ ఇరువారం, ఆది మోర్రెడ్డి, శ్రీని గుప్తా, డాక్టర్ రూపేష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమ విజయానికి కీలకంగా వ్యవహరించారు. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సేవకులు, కళాకారులు, గాయకులు, నృత్య పాఠశాలలు అందరూ తమదైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా.. టికెటింగ్, ప్రచారం, ఫోటోగ్రఫీ, ఫ్లయర్ రూపకల్పన వంటి విభాగాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చివరగా, పాల్గొన్నవారందరికీ భోజన పెట్టెలు అందజేయడం ద్వారా కార్యక్రమాన్ని ముగించారు.
శ్రీ శ్రీ రవిశంకర్కు వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు
బోస్టన్ గ్లోబల్ ఫోరం (The Boston Global Forum (BGF) , AI వరల్డ్ సొసైటీ (AIWS) నుంచి 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును శ్రీ శ్రీ రవిశంకర్ ప్రదానం చేశారు.. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన, వివాదాల పరిష్కారం, మానవతా సేవలలో ఆయన చేసిన అసామాన్య సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం లభించింది. ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్తలు, విశిష్ట అతిథుల సమక్షంలో జరిగింది.గత సంవత్సరం ఈ అవార్డు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్కు యూరప్ లోను , ప్రపంచవ్యాప్తం గాను శాంతి మరియు భద్రతను ప్రోత్సహించే దిశగా చేసిన నాయకత్వ కృషికి గుర్తింపుగా ప్రదానం చేశారు. ఇంతకుముందు ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నవారు:జర్మనీ ఛాన్సలర్ ఆంగెలా మెర్కెల్ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబేఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్టోఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోడిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రజలతోఈ అవార్డు ప్రపంచ శాంతి కోసం కృషి చేసే అత్యున్నత గ్లోబల్ నాయకులకు అందించే అరుదైన గౌరవాల్లో ఒకటి.
క్రైమ్
ఇందిరమ్మ చీరతో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
చిన్నశంకరంపేట (మెదక్): బిడ్డను తన నుంచి వేరు చేస్తారనే ఆందోళనతో రెండేళ్ల బిడ్డకు ఉరివేసి.. తాను ఉరివేసుకుని ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. నార్సింగి మండలం సంకాపూర్ గ్రామానికి చెందిన తాళ్ల ఆఖిల చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరం కాగా, మేనమామ సిద్దాగౌడ్ వద్ద పెరిగింది. రెండేళ్ల క్రితం ఖాజాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్గౌడ్కు ఇచ్చి వివాహం చేశారు. ఆరు నెలల క్రితం ప్రవీణ్గౌడ్ నిద్రలో హఠాన్మరణం చెందాడు. అప్పటికే వారికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. భర్త దశదిన కర్మ నుంచే బిడ్డను మాకు ఇచ్చేసి మరో పెళ్లి చేసుకోవాలంటూ అఖిలకు అత్తింటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. తన బిడ్డను వదిలేదిలేదన్న అఖిల.. మేనమామ ఇంటి వద్దనే ఆరు నెలలుగా జీవిస్తుంది. అత్తింటి వారు మరోసారి సంకాపూర్లో ఉన్న కోడలు వద్దకు వెళ్లి ఇందిరమ్మ చీర వచ్చింది తీసుకెళ్లాలంటూ ఆదివారం అత్తింటికి తీసుకువచ్చారు. ఏమైందో ఏమో కానీ మంగళవారం ఉదయం అత్త ఇంటి ముందు బట్టలు ఉతుకుతున్న సమయంలో తన రెండేళ్ల కుమారుడు రియన్స్కు ఉరివేసి, అదే చీరతో తాను ఉరివేసుకుని అఖిల ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న మృతురాలి మేనమామ సిద్దాగౌడ్ అత్తింటి వేధింపులే తన మేనకోడలు, మనవడి మృతికి కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బిడ్డను వేరుచేయాలనే అత్తింటి వేధింపులు తట్టుకోలేకనే తన మేనకోడలు మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రామాయంపేట సీఐ వెంకటరాజంగౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించి అత్తమామలపై కేసు నమోదు చేశారు.
తల్లితో వివాహేతర బంధం పెట్టుకొని.. బిడ్డను గర్భవతిని చేసి..
మహబూబాబాద్ జిల్లా: తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమె కుమార్తెను కూడా లైంగికంగా వాడుకొని గర్భవతిని చేశాడు. మళ్లీ ఆ తల్లి సాయంతోనే అబార్షన్ చేయించాడు. ఈ ఘటన ఆలస్యంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో మంగళవారం వెలుగు చూసింది. బయ్యారం మండల కేంద్రంలోని ముస్తాఫానగర్కు చెందిన సైదులుబాబు స్థానికంగా ఉన్న మరో కాలనీకి చెందిన ఓ వివాహితతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లి లేని సమయంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఆమె కుమార్తెను కూడా లైంగికంగా వాడుకున్నాడు. దీంతో ఆ బాలిక గర్భవతి కావటంతో రెండు నెలల కిందట తల్లి సహాయంతో బాలికను జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. ఇటీవల బాలికకు వివాహం చేసే ప్రయత్నం చేయటంతో సఖి కేంద్ర నిర్వాహకులకు విషయం తెలిసింది. బాలికను జిల్లా కేంద్రానికి తీసుకెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించారు. బాలిక.. తనకు అబార్షన్ చేయించిన విషయం చెప్పడంతో వారు బయ్యారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక ఫిర్యాదు మేరకు లైంగికదాడికి పాల్పడిన సైదులుబాబుపై పోక్సో కేసు నమోదు చేయగా, అబార్షన్కు సహకరించిన బాలిక తల్లిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు గార్ల బయ్యారం సీఐ రవికుమార్ తెలిపారు.
భార్య కొత్త చీర కట్టిందని కోపంతో భర్త ఏం చేసాడంటే
టేక్మాల్ (మెదక్): వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను చంపి, ఆపై భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బరి్ధపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... బర్దిపూర్ గ్రామానికి చెందిన గంగారం శ్రీశైలం (37), మంజుల (35) దంపతుల కుమారుడు ప్రవీణ్ మధుమేహ వ్యాధిగ్రస్తుడు కావడంతో చికిత్స కోసం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్కు వెళ్లారు. అక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగించారు. అయితే భార్య మంజుల ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న శ్రీశైలం ఈ ఏడాది దసరా పండుగ సమయంలో సొంత గ్రామమైన బర్దిపూర్కు మకాం మార్చాడు. ఈ విషయమై తరచుగా గొడవపడుతుండగా గత నెల టేక్మాల్ పోలీసులు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. భార్యపై అనుమానంతో శ్రీశైలం మద్యానికి బానిసయ్యాడు. తన భార్యను చంపేస్తానని, తనను తలెత్తుకోలేకుండా చేస్తోందని తన స్నేహితులు, గ్రామస్తులతో తరచూ అంటుండేవాడు. ఈ క్రమంలో కుమారుడు ప్రవీణ్ అమ్మమ్మ ఊరికి వెళ్లడంతో సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న మంజుల ముఖంపై దిండు పెట్టి శ్వాసఆడకుండా చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం దూలానికి తాడుతో శ్రీశైలం కూడా ఉరివేసుకున్నాడు. సంఘటన స్థలంలో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, టేక్మాల్ ఎస్ఐ అరవింద్, అల్లాదుర్గం ఎస్ఐ శంకర్, ఏఎస్ఐ కృష్ణ ఆధారాలను సేకరించారు.
తప్పు తెలిసీ మౌనం... నేరంగా మారిన ఇద్దరు మహిళలు
సాక్షి,హైదరాబాద్: నేరుగా తప్పు చేయడమే కాదు... తప్పు జరుగుతోందని, జరిగిందని తెలిసీ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమూ నేరమే. ఈ కారణంగానే జూబ్లీహిల్స్ ఠాణాలో నమోదైన పోక్సో, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ఇరువురు మహిళలు నిందితులుగా మారారు. గత ఏడాది చోటు చేసుకున్న ఈ ఘటనపై దర్యాప్తు అధికారులు ఇటీవల కోర్టులో చార్జ్షిట్ దాఖలు చేశారు. ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) లైంగికదాడి చేసిన వ్యక్తి మాత్రమే నిందితుడిగా ఉండగా... అభియోగపత్రాల్లో మాత్రం ఆ విషయం తెలిసీ మిన్నకుండిపోయిన మహిళలూ నిందితులుగా మారారు.ఐదు రోజులు నిర్భంధించి ఘాతుకం..జూబ్లీహిల్స్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న మహిళ వద్ద ఆర్. రాజిరెడ్డి అనే వ్యక్తి డ్రైవర్గా పని చేసేవాడు. అదే అపార్ట్మెంట్లో మరో మహిళ సెక్యూరిటీ గార్డుగా పని చేసేది. అదే ప్రాంతానికి చెందిన బాలికతో రాజిరెడ్డికి పరిచయం ఉండేది. అతను గత ఏడాది అక్టోబర్ 31న ఓ శుభకార్యానికి తీసుకువెళ్తానంటూ బాలికను కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో అతడి యజమాని సైతం వారితో ఉంది. వీరు సదరు బాలికను షాపింగ్కు తీసుకెళ్లి వ్రస్తాలు కొనిపెట్టారు. ఆపై అపార్ట్మెంట్కు తీసుకువచి్చన రాజిరెడ్డి రెండో అంతస్తులోని తన గదిలో నిర్భంధించి నవంబర్ 5 వరకు సదరు బాలికపై పలు మార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. విచారణలో చెప్పని ఆ ఇరువురూ..ఇదిలా ఉండగా... బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి గత ఏడాది అక్టోబర్ 31న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆ అపార్ట్మెంట్ వద్దకు వెళ్లి పలువురిని విచారించగా ఎవరి నుంచి సరైన సమాచారం లభించలేదు. సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్న మహిళతో పాటు రాజిరెడ్డి యజమాని సైతం తనకు ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. ఐదు రోజుల నిర్భంధం తర్వాత ఇంటికి వెళ్లిన బాలిక తన తల్లితో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు.అక్కడ అన్నీ చెప్పిన బాలిక..భరోసా కేంద్రంలో ఉన్న కౌన్సిలర్లు, అధికారులు బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ ఐదు రోజుల్లో ఏం జరిగిందో చెప్పాల్సిందిగా కోరారు. దీంతో రాజిరెడ్డి తనను నిర్భంధించడంతో పాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. తాను నిర్భంధంలో ఉండగా రాజిరెడ్డి యజమాని ఆహారం అందించిందని, ఆ అపార్ట్మెంట్కు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న మహిళకూ తన విషయం తెలుసని వెల్లడించింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి నేరం జరిగినట్లు నిర్థారించారు. బాలిక మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా వీరు ఇరువురినీ ప్రశి్నంచినా నోరు విప్పకపోకపోవడాన్నీ సీరియస్గా తీసుకున్నారు. ఆ ఇద్దరినీ నిందితులుగా చేరుస్తూ..దీంతో బాలిక అదృశ్యం కావడంపై నమోదైన మిస్సింగ్ కేసులో పోక్సో యాక్ట్తో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని సెక్షన్లనూ చేర్చారు. ఈ కేసులో రాజిరెడ్డి ఒక్కడే కాకుండా ఇద్దరు మహిళల్నీ నిందితులుగా చేర్చారు. బాలికపై దారుణం జరుగుతున్నా అడ్డుకోకపోవడం, జరిగిందని తెలిసీ బయటకు చెప్పకపోవడం నేరాలేనని దర్యాప్తు అధికారులు తేల్చారు. భారతీయ న్యాయ సంహితలోని (బీఎన్ఎస్) సెక్షన్ 211 (ఓ నేరానికి సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచి పెట్టడం), భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 33 (నేరం జరిగినట్లు తెలిసినా వెంటనే పోలీసు లేదా మేజిస్ట్రేట్కు చెప్పకపోవడం) కింద అభియోగాలు మోపారు.దర్యాప్తునకు సహకరించకున్నా దండనేఏదైనా నేరం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులు లేదా మేజి్రస్టేట్కు సమాచారం ఇవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. నేరాల నిరోధంతో పాటు చట్టాల అమలుకు పాటుపడాలి. ఏదైనా నేరం జరిగిందని తెలిసీ మిన్నకుండిపోవడం నేరమే అవుతుంది. తమ కళ్ల ముందు నేరం జరిగితే నిందితుడిని అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించే అధికారమూ పౌరులకు ఉంటుంది. వివిధ నేరాలకు సంబంధించి కేసులు నమోదైనప్పుడు పోలీసులు కోరితే దర్యాప్తునకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. బీఎన్ఎస్ఎస్లోని 31, 33, 40 సెక్షన్లు ఇవే అంశాలను స్పష్టం చేస్తున్నాయి. అలా చేయకపోవడం కూడా నేరమే అవుతుంది. బీఎన్ఎస్లోని 211, 239లతో పాటు పోక్సో యాక్ట్లోని 19 సెక్షన్ ప్రకారం అభియోగాలు ఎదుర్కోవాల్సిందే.– పి.వెంకటగిరి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్
వీడియోలు
New Rules: ఇకపై ఇళ్ళకు రెండు నెలల అద్దెనే డిపాజిట్ గా తీసుకోవాలి
అన్నను టిప్పర్ టైర్ల కింద పెట్టి.. తమ్ముడు ఎలా చంపాడంటే..
రిపోర్టర్ ప్రశ్నకు భౌ భౌ అంటూ రేణుకా సమాధానం
Visakha: మొహం చాటేసిన చంద్రబాబు
రఘురామపై రెచ్చిపోయిన దళిత సంఘాలు
Anantapur: తన సంతకం కావాలంటే రూ.38 ఇవ్వాల్సిందేనన్న VRO
విజయవాడ భవానీపురంలో 42 నిర్మాణాల కూల్చివేత
ఖమ్మం చుట్టూ ఉన్న హైవేలపై పోకిరీల ఆగడాలు
BJP జ్యేష్ఠ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో అపశృతి
Kothagudem: రైల్వే స్టేషన్లో బాంబు కలకలం

