ప్రధాన వార్తలు
కాశీబుగ్గ ప్రమాద బాధితులను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తాడేపల్లి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో YSRCP బృందం పర్యటించింది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో సంఘటన స్థలాన్ని పార్టీ బృందం పరిశీలించింది.అనంతరం తొక్కిసలాట బాధితులను పార్టీ నేతలు పరామర్శించారు. వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందంలో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యన్నారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సహా పలు నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, నాయకులు ఉన్నారు.ఇవాళ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కాశీబుగ్గ చేరుకున్న పార్టీ ప్రతినిధి బృందం.. అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించి.. బాధితులను కూడా పరామర్శించారు.
టిక్టాక్, ఇన్స్టాగ్రామ్కు పోటీగా కొత్త యాప్.. పూర్తి వివరాలు..
డిజిటల్ యుగం మన జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. ప్రతి రోజూ మనం ఎన్నో యాప్లు ఉపయోగిస్తూ ఉంటాం. అందులో కొన్ని చాటింగ్ కోసం, మరికొన్ని వీడియోల కోసం, ఇంకొన్ని షాపింగ్ కోసం.. వాడుతుంటాం. అయితే ఒకే వేదికపై ఇలాంటి సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వీరీల్స్(Vreels-Virtually Relax, Explore, Engage, Live, Share) రూపొందించారు. ప్రపంచానికి కొత్త తరహా డిజిటల్ అనుభవాన్ని అందించడానికి అమెరికాలోని తెలుగు ఇంజినీర్లు దీన్ని తయారు చేశారు.ఇది ఇప్పటికే 22 దేశాల్లో విడుదలై, ప్రస్తుతం బీటా దశలో ఉంది. Play Store, App Storeలో Vreelsను డౌన్లోడ్ చేసుకుని ఈ కొత్త అనుభవాన్ని ఆస్వాదించవచ్చని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.వెబ్సైట్: www.vreels.comసృజనాత్మకతతో..Vreels ఒకే చోట కంటెంట్ సృష్టి, వినోదం, సంభాషణకు డిజిటల్ వేదికగా మారింది. ఇందులో ప్రతి యూజర్ ఒక క్రియేటర్గా మారొచ్చు. చిన్న వీడియోలు, ఫొటోలు, క్రియేటివ్ స్టోరీస్ను వ్యక్తిగతంగా యూజర్ల ఆసక్తులకు సరిపోయేలా రూపొందించుకోవచ్చు. ఇందులోని ఫీడ్ యూజర్లు ఇష్టపడే విషయాలను నేర్చుకుంటూ మరింత పర్సనల్ ఎక్స్పీరియన్స్ను ఇస్తుంది. యాప్లోని కొన్ని ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.Reels, Pixమీ భావాలు, ప్రయాణాలు, ఆలోచనలు.. అన్నీ ఒక క్లిక్లో రికార్డ్ చేసి, ఎడిట్ చేసి ఇతరులతో పంచుకోవచ్చు. వీడియోలు, ఫొటోల రూపంలో ఆకస్తి కరంగా యూజర్లు తమ భావాలను వ్యక్తీకరించవచ్చు. ఫిల్టర్లు, టెక్స్ట్, స్టిక్కర్లు, మ్యూజిక్ సపోర్త్తో Vreels క్రియేటర్లకు మెరుగైన అనుభవం ఇస్తుంది.Pix Pouches.. డిజిటల్ నోట్బుక్Pix Pouches అనేది డిజిటల్ నోట్బుక్. ఇష్టమైన ఫొటోలను లేదా ఆలోచనలను వర్గాల వారీగా స్టోర్ చేసుకోవచ్చు. మిత్రులతో కలిసి కలెక్షన్లు సృష్టించి, మంచి ప్రాజెక్టులను ప్లాన్ చేయవచ్చు.Chats, Calls — కనెక్ట్ అయ్యేందుకు..స్నేహితులతో మాట్లాడటానికి, గ్రూప్లో చాట్ చేయటానికి లేదా వీడియో కాల్ చేసుకోవటానికి వేర్వేరు యాప్లు అవసరం లేదు. Vreelsలోనే ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. వీరీల్స్ క్రియేటివ్ వేదికగా ఉన్నందున ఇది సాధ్యపడింది. మీరు మాట్లాడుతూనే మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవచ్చు.V Map — లొకేషన్ షేరింగ్మీ స్నేహితులు లేదా కమ్యూనిటీ సభ్యులు ఎక్కడ ఉన్నారో V Mapతో సులభంగా తెలుసుకోవచ్చు. లొకేషన్ షేరింగ్ పూర్తిగా మీ నియంత్రణలో ఉంటుంది.V Capsules — మధుర జ్ఞాపకాలుఈ ప్రత్యేక ఫీచర్లో భావోద్వేగ జ్ఞాపకాలను డిజిటల్గా ఒక ‘క్యాప్సూల్’లో ఉంచి ఒక నిర్దిష్ట తేదీన దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. బర్త్డే, యానివర్సరీ, లేదా మైల్స్టోన్.. వంటి ముధుర జ్ఞాపకాలను భద్రపరుచుకొని తిరిగి ఆ మెమొరీని చూసుకోవడం ఆనంద క్షణంగా ఉంటుంది.Vreels Shop/Bid — మీ అవసరాలన్నీ ఒకే చోటVreels షాప్/బిడ్ త్వరలో రాబోతోంది. యూజర్లకు కావాల్సిన ప్రతి ఉత్పత్తిని ఇందులో కొనుగోలు చేయవచ్చు. వెండర్లు తమ ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తారు. యూజర్లు నమ్మకంగా ఇందులో బిడ్ చేయవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు. ఇది అంతా ఒకే సురక్షితమైన, సౌకర్యవంతమైన వేదికలో జరుగుతుంది. నమ్మకం, నాణ్యత, విశ్వాసం ఇవే Vreels షాప్/బిడ్ పునాది సూత్రాలని నిర్వాహకులు చెబుతున్నారు.భద్రత.. యూజర్ విశ్వాసమే ప్రాధాన్యంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో మన డేటా ఎక్కడికి వెళ్తుందో, ఎవరు వాడుతారో అన్న సందేహం సహజం. కానీ Vreelsలో మీరు ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ యూజర్ల డేటాకు అధిక భద్రత ఉంటుంది.టోకెన్ ఆధారిత ప్రామాణీకరణ, ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, యూజర్ నియంత్రిత ప్రైవసీ సెట్టింగులు.. ఇవన్నీ యూజర్ల వ్యక్తిగత డేటాను కాపాడటానికి ఎంతో తోడ్పడుతాయి. ముఖ్యంగా యూజర్ పోస్టులు, ప్రొఫైల్, లొకేషన్.. ఎవరు చూడాలో నిర్ణయించే అధికారం పూర్తిగా యూజర్ పరిధిలోనే ఉంటుంది.Vreels ఆవిష్కరణల వేదికVreels ఒక యాప్ మాత్రమే కాదు. అమెరికన్ వ్యాపార స్పూర్తిని, భారతీయ స్వయం ఆవిష్కరణ శక్తిని ప్రతిబింబించే ఒక వేదిక. ప్రతి అప్డేట్తో కొత్త సాంకేతిక పరిణామాలు, స్థానిక భాషల సపోర్ట్, యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచే మార్పులు తెస్తోంది. ఇది Made for the World అనే స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తుంది. ఇప్పటికే Vreels బృందం వినూత్న సాంకేతిక పేటెంట్లను దాఖలు చేసింది. ఇవి ప్రస్తుతం ఆమోద దశలో ఉండగా, త్వరలోనే మంజూరు అవుతాయని అంచనా. ఈ పేటెంట్లు ఆమోదం పొందిన తర్వాత Vreels సాంకేతిక సామర్థ్యం మరింత బలపడటమే కాక, అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపు లభించనుంది.Vreels యాప్ డౌన్లోడ్ చేసుకోనే లింక్లు కింద ఉన్నాయి.ఆండ్రాయిడ్ యూజర్లుhttps://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsయాపిల్ యూజర్లుhttps://apps.apple.com/us/app/vreels/id6744721098 కింది క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
WC 2025: కళ్లు చెదిరే ప్రైజ్మనీ!.. బీసీసీఐ బంపరాఫర్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. నవీ ముంబై వేదికగా భారత్- సౌతాఫ్రికా (IND W vs SA W) మధ్య ఆదివారం నాటి ఫైనల్తో ఈ టోర్నీలో కొత్త చాంపియన్ అవతరించనుంది.ఈ ఈవెంట్లో ఇప్పటికే రెండుసార్లు రన్నరప్గా నిలిచిన టీమిండియా.. తొలిసారి ఫైనలిస్టు అయిన సౌతాఫ్రికా... ప్రస్తుత బలాబలాల దృష్ట్యా టైటిల్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త చాంపియన్ రాకతో పాటు.. ఈసారి వన్డే వరల్డ్కప్ టోర్నీకి మరో ప్రత్యేకత కూడా ఉంది.కళ్లు చెదిరే ప్రైజ్మనీవిజేతగా నిలిచిన జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కళ్లు చెదిరే ప్రైజ్మనీ ప్రకటించింది. పురుషుల, మహిళల క్రికెట్లో రికార్డు స్థాయిలో చాంపియన్కు ఏకంగా 4.48 మిలియన్ యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 39.78 కోట్లు) ఇవ్వనుంది.123 కోట్ల రూపాయలుఅదే విధంగా.. రన్నరప్ జట్టుకు.. విజేతకు అందించిన నగదులో సగం అంటే 2.24 మిలియన్ యూఎస్ డాలర్లు (దాదాపు రూ. 19 కోట్లకు పైగా) ప్రైజ్మనీగా ప్రకటించింది. భారత్- శ్రీలంక సంయుక్త ఆతిథ్య దేశాలుగా ఉన్న ఈ టోర్నీ ప్రైజ్మనీల మొత్తానికి ఐసీసీ ఏకంగా 13.88 మిలియన్ యూఎస్ డాలర్లు అంటే... దాదాపు 123 కోట్ల రూపాయలు కేటాయించింది.239 శాతం పెంచారువరల్డ్కప్ టోర్నీ చరిత్రలోనే ఇది అత్యధికం. వన్డే వరల్డ్కప్-2022 ఎడిషన్తో పోలిస్తే ఇది ఏకంగా 297 శాతం ఎక్కువ కావడం విశేషం. అంతేకాదు.. నాటి విజేత ఆస్ట్రేలియాకు ఇచ్చిన ప్రైజ్మనీ కంటే తాజా సీజన్ విన్నర్కు ఇచ్చే ప్రైజ్మనీని ఏకంగా 239 శాతం పెంచడం గమనార్హం.రూ. 42 కోట్లకుఇక ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే దాదాపు 3,50,000 యూఎస్ డాలర్ల ప్రైజ్మనీ (సుమారుగా 3.1 కోట్ల రూపాయలు) సొంతం చేసుకుంది. టోర్నీలో పాల్గొన్నందుకు, గ్రూప్ దశలో మూడు విజయాలకు గానూ ఈ మొత్తం టీమిండియాకు లభించింది. అన్నీ సజావుగా సాగి భారత్ చాంపియన్గా అవతరిస్తే మొత్తం ప్రైజ్మనీ రూ. 42 కోట్లకు చేరుకుంటుంది.మరోవైపు.. సౌతాఫ్రికా ఇప్పటికే నాలుగు లక్షల యూఎస్ డాలర్లకుపైగా గెలుచుకుంది. గ్రూప్ దశలో ఐదు విజయాలు సాధించి ఈ మొత్తం సొంతం చేసుకుంది. ఏదేమైనా క్రికెట్ ప్రపంచంలో పురుష జట్ల ఆధిపత్యం కొనసాగుతున్న వేళ.. మహిళా టోర్నీలో రికార్డు స్థాయి ప్రైజ్మనీ అందించడం హర్షించదగ్గ పరిణామం. మహిళా క్రికెట్కు ఆదరణ పెంచడంతో పాటు.. యువ ఆటగాళ్లను ఆకర్షించడానికి ఇలాంటి చర్యలు తోడ్పడతాయి.బీసీసీఐ బంపరాఫర్!ఇదిలా ఉంటే.. ఒకవేళ హర్మన్ సేన గనుక వన్డే వరల్డ్కప్ గెలిస్తే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మహిళా క్రికెటర్లుకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోందని సమాచారం. పురుష క్రికెటర్లతో పాటు మహిళా ప్లేయర్లకు కూడా సమవేతనం చెల్లించాలనే యోచనలో ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి. మరోవైపు.. హర్మన్సేన ట్రోఫీ గెలిస్తే బీసీసీఐ రూ. 125 కోట్ల నజరానా ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. కాగా నవీ ముంబై వేదికగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఫైనల్కు తెరలేస్తుంది.చదవండి: IND vs AUS 3rd T20: సమం చేసేందుకు సమరం
రేసు మొదలైంది: ముగ్గురు నేతలు, ఒక విజేత!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ‘జూబ్లీహిల్స్’ ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పక్షాలకు అగ్ని పరీక్షగా మారింది. అధికార కాంగ్రెస్తో పాటు ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు గెలుపు కోసం అవసరమయ్యే అన్ని అ్రస్తాలను ప్రయోగిస్తూ సర్వశక్తులొడ్డుతున్నాయి. అధికార కాంగ్రెస్ అభివృద్ధి మంత్రం, బీసీ కార్డు, సినీ కార్మికుల సంక్షేమం, మైనారిటీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం వంటివి కాగా.. బీఆర్ఎస్ సానుభూతి, మూడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం, ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారంటీల బాకీ కార్డు, ప్రత్యర్థుల కుటుంబ నేపథ్యం తమకు కలిసి వచ్చే అంశాలుగా భావిస్తోంది. బీజేపీ హిందూత్వ ఎజెండా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మల్చుకుంటోంది. మూడు పక్షాలూ హేమాహేమీలను ఎన్నికల ప్రచారంలో దింపడంతో మాటల తూటాలు రాజకీయ అగ్గి రాజేస్తున్నాయి. ఆయా పారీ్టల గెలుపోటములపై బలాలతో పాటు బలహీనతలు ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్కు అనుకూల అంశాలు రాష్ట్రంలో అధికారంలో ఉండటం, కేవలం రెండు నెలల్లో రూ.150 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులు, రాష్ట్ర మంత్రి వర్గంలో మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన అజహరుద్దీన్కు మంత్రివర్గంలో అవకాశం కల్పించడం, పార్టీ అభ్యరిత్వం ఎంపికలో బీసీ కార్డు ప్రయోగం. ఎన్నికల బరిలో దిగిన యువనేత నవీన్ యాదవ్కు వ్యక్తిగత పరిచయాలు, మజ్లిస్, వాపపక్షాలు, టీజేసీ, సినీ కారి్మకులు, బీసీ సంఘాల మద్దతు, సీఎంతో పాటు ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు ఫోకస్ పెట్టడం. గత 12 ఏళ్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యే వైఫల్యాలు. ప్రతికూల అంశాలు: నియోజకవర్గంలో సంస్థాగత పట్టుతో పాటు స్థానిక ప్రాతినిధ్యం లేకపోవడం, పార్టీలలోని కొత్త, పాత కేడర్లో అంతర్గత కుమ్ములాటలు, కొరవడిన సమన్వయం, నవీన్ యాదవ్ కుటుంబ నేపథ్యం, దివంగత మాగంటి గోపీనాథ్ మూడు పర్యాయాల పాటు ప్రాతినిధ్యం వహించడం. బీఆర్ఎస్కు గట్టి కేడర్, గడిచిన రెండేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యర్థుల ప్రచారం తదితర అంశాలు ప్రభావం చూపనున్నాయి. బీఆర్ఎస్కు కలిసొచ్చే అంశాలు.. సానుభూతి గత మూడు పర్యాయాల పాటు ప్రాతినిధ్యం, సంస్థాగతంగా గట్టి ఓటు బ్యాంక్, స్థానిక ప్రాతినిధ్యం, ముస్లిం మైనారిటీల్లో పట్టున్న సోషల్ వర్కర్ పారీ్టలో చేరడం, ఎన్నికల ప్రచార భారాన్ని మొత్తాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భుజస్కంధాలపై వేసుకోవడం, గత రెండేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారంటీల బాకీ కార్డు. ప్రతికూల అంశాలు: అధికారంలో లేకపోవడం, పలువురు ముఖ్య నేతలు, కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించడం, అధికారంలో ఉన్నప్పుడు మిత్రపక్షమైన మజ్లిస్ కాంగ్రెస్ పంచన చేరడం. తాజాగా అధికార కాంగ్రెస్ అభివృద్ధి మంత్రం, ప్రత్యర్థి యువకుడు కావడంతో పాటు వ్యక్తిగత పరిచయాలు అధికంగా ఉండటం.కమలం పార్టీకి అనుకూల అంశాలు హిందూత్వ ఎజెండా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్మిషా. కేంద్రంలో అధికారంలో ఉండటం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాజీ మజ్లిస్ నేత కావడం, మజ్లిస్ బేషరతుగా మద్దతు ఇవ్వడం, టీడీపీ, జనసేన పారీ్టల మద్దతు. అభ్యర్థి దీపక్ రెడ్డికి విరివిగా వ్యక్తిగత పరిచయాలు ఉండటం ప్రతికూల అంశాలు: సంస్థాగతంగా బలహీనంగా ఉండటం. స్థానిక ప్రాతినిధ్యం లేకపోవడం. బీజేపీ పోటీ చేయడం రెండోసారి కావడం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 14% ఓట్లు లభించడం. కాంగ్రెస్, బీఆర్ఎస్లతో పోలిస్తే పారీ్టకి బలమైన కేడర్ నెట్వర్క్ లేకపోవడం.
బెర్క్షైర్ భారీ నగదు నిల్వలు.. దేనికి సంకేతాలు?
లాభాలు పెరిగినప్పటికీ, మార్కెట్లపై అప్రమత్త ధోరణిని చూపిస్తూ బెర్క్షైర్ (Berkshire) హాతవే సంస్థ రికార్డు స్థాయి నగదు నిల్వలను ప్రకటించింది. కంపెనీ నగదు నిల్వలు మూడవ త్రైమాసికంలో 381.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది బెర్క్షైర్ చరిత్రలో అత్యధికం.వారెన్ బఫెట్ (Warren Buffett) సీఈఓ హోదాలో తన చివరి త్రైమాసిక నివేదికను విడుదల చేసిన సందర్భంలో ఈ ప్రకటన వచ్చింది. 95 ఏళ్ల బఫెట్ ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ చేయనున్నారు.స్టాక్ విక్రయాలు, బైబ్యాక్ నిలిపివేతబెర్క్షైర్ వరుసగా 12వ త్రైమాసికంలో కొనుగోలు కంటే ఎక్కువ స్టాక్స్ను విక్రయించింది. దాని 283.2 బిలియన్ డాలర్ల ఈక్విటీ పోర్ట్ఫోలియోలో యాపిల్, అమెరికన్ ఎక్స్ప్రెస్ వంటి హోల్డింగ్స్ ఉన్నాయి. కంపెనీ ఐదవ వరుస త్రైమాసికంగా తన సొంత స్టాక్ బైబ్యాక్ను నిలిపివేసింది. అయినప్పటికీ దాని షేర్ ధర విస్తృత మార్కెట్ను మించకపోవడం గమనార్హం.లాభాల్లో పెరుగుదల, కానీ వృద్ధి మందగింపుతక్కువ బీమా నష్టాలు మూడవ త్రైమాసిక ఆపరేటింగ్ లాభాన్ని 34% పెంచి 13.49 బిలియన్ డాలర్లకు చేర్చాయి. ఇది విశ్లేషకుల అంచనాలను మించిపోయింది. నికర లాభం 17% పెరిగి 30.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే మొత్తం ఆదాయం కేవలం 2% మాత్రమే పెరిగింది. ఇది అమెరికా ఆర్థిక వృద్ధి రేటుకంటే తక్కువ.కంపెనీ ప్రకారం.. ఆర్థిక అనిశ్చితి, వినియోగదారుల విశ్వాసం తగ్గడం ప్రధాన అవాంతరాలుగా మారాయి. ఈ ప్రభావం క్లేటన్ హోమ్స్, డ్యూరాసెల్, ఫ్రూట్ ఆఫ్ ది లూమ్, స్క్విష్మాలోస్ తయారీదారు జాజ్వేర్స్ వంటి అనుబంధ వ్యాపారాలపై కనిపించింది.నాయకత్వ మార్పు దిశగా..వారెన్ బఫెట్ వైదొలుగుతున్న తరుణంలో, 63 ఏళ్ల గ్రెగ్ అబెల్ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బఫెట్ మాత్రం చైర్మన్గా కొనసాగుతారు. కాగా అబెల్.. బఫెట్ కంటే కూడా “మరింత హ్యాండ్-ఆన్” మేనేజర్గా ప్రసిద్ధి చెందారు. ఈ నేపథ్యంలో బెర్క్షైర్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.👉 ఇది ఇంకా చదవలేదా? అదిగో భారీ క్రాష్.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్!
బాబు డైవర్షన్ డ్రామా.. 18 నెలల్లో ఎన్ని కథలంటే?
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ మరో డైవర్షన్ డ్రామాకు తెరలేపింది. శ్రీకాకుళంలోని కాశీబుగ్గ తొక్కిసలాట డైవర్ట్ కోసం మాజీ మంత్రి జోగి రమేష్ను అక్రమంగా అరెస్ట్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిందని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకునేందుకు కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. గతంలో పలుమార్లు కూటమి సర్కార్పై ప్రజాగ్రహం వచ్చిన ప్రతీసారి బాబు డైవర్షన్ డ్రామాలకు తెరలేపారు. దీంతో, డైవర్షన్ పాలిటిక్స్లో మాస్టర్గా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని సోషల్ మీడియాలో పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు వైఫల్యం చెందినా చంద్రబాబు డైవర్షన్ డ్రామాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీ నేతలపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసిన టీడీపీ నేతలను వదిలేసి వైఎస్సార్సీపీ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారు. నకిలీ మద్యం కేసులో ప్లాన్ ప్రకారం మాజీ మంత్రి జోగి రమేష్ను ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ పెద్దల ప్లాన్ ప్రకారం జోగి రమేష్ అరెస్ట్ జరిగింది. జోగి రమేష్ను అరెస్ట్ చేస్తామని మంత్రులు ఇప్పటికే చాలాసార్లు పలు మీడియా సమావేశాల్లో చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు కాశీబుగ్గ ఘటనను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్ను అరెస్ట్ చేశారు. 18 నెలల కాలంలో బాబు డైవర్షన్లు..2024లో విజయవాడ వరదల్ని డైవర్ట్ చేసేందుకు బ్యారేజీని బోట్లతో ఢీకొట్టబోయారంటూ చంద్రబాబు డ్రామా.వంద రోజుల పాలన పూర్తి అయిన సమయంలో తిరుమల లడ్డు కల్తీ డ్రామా.ఉచిత గ్యాస్పై ప్రజలు ప్రశ్నిస్తున్నారనగానే రూ.14 లక్షల కోట్ల అప్పు అంటూ ప్రచారం.గత డిసెంబర్ తుపాను సమయంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేషన్ తనిఖీల పేరుతో హడావుడి.తిరుపతి తొక్కిసలాటకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో, ఎస్పీని వదిలేసి సంబంధం లేని అధికారులపై చర్యలు.చంద్రబాబు దావోస్ పర్యటన ఫెయిల్యూర్ను డైవర్ట్ చేసేందుకు నీతి ఆయోగ్ రిపోర్టు పేరుతో నాటకాలు.ఫిబ్రవరిలో ఏపీలో రిజిస్ట్రేషన్ల బాదుడు నుంచి డైవర్ట్ కోసం వంశీ అరెస్ట్.కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయంపై దృష్టి మరల్చేందుకు పోసాని అక్రమ అరెస్ట్.ఏపీ బడ్జెట్లో సూపర్ సిక్స్కు గుండుసున్నా పెట్టారు. దాన్ని డైవర్ట్ చేసేందుకు లిక్కర్ కేసును తెర మీదకు తెచ్చారు.సింహాచలం చందనోత్సవం వైఫల్యం నుంచి తప్పించుకునేందుకు మిథున్ రెడ్డిపై కేసు. డైవర్షన్లో భాగంగా కాకాణి గోవర్థన్పై అక్రమ కేసు. ఇప్పుడు కాశీబుగ్గ ఘటనను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్ అరెస్ట్తో డైవర్షన్. కక్ష సాధింపులో భాగంగా..మరోవైపు నకిలీ మద్యం కేసుకు సంబంధించిన ప్రశ్నలు గుప్పిస్తున్న, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని నేతల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. ఇందులో మేడపాటి నాగిరెడ్డితో పాటు బీసీ సెల్ అధ్యక్షుడు కుంచం జయరాజు కూడా ఉన్నారు. వాళ్ల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే.. మంత్రి లోకేష్, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టారని, టీడీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారని, అందుకే విచారణ జరుపుతున్నామని పోలీసులు అంటున్నారు.
చితిలోనుంచి శవాన్ని బయటకులాగి..
మెదక్ జిల్లా (తూప్రాన్): సగం కాలిన శవాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చితి నుంచి బయటపడేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంటలో శనివారం వెలుగు చూసింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. చేగుంటకు చెందిన కర్రె నాగమణి (70) శుక్రవారం మృతి చెందగా అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. రెండో రోజు కార్యక్రమం నిర్వహించేందుకు శనివారం కుటుంబీకులు శ్మశానానికి వెళ్లి చూడగా సగం కాలిన నాగమణి మృతదేహం చల్లార్చి చితి పక్కకు పడేసి కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న మురాడి నర్సమ్మ కుటుంబీకులు సైతం శ్మశానానికి చేరుకొని చూడగా నర్సమ్మ చితికి సంబంధించిన బూడిదను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల మృతి చెందిన పోచమ్మ, మల్లయ్యకు సంబంధించిన పుర్రెతో పాటు ఎముకలను కూడా ఎత్తుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు. అయితే ఎముకలు, పుర్రెలను మృతదేహం నోటిలో ఉంచే బంగారం కోసమా? అసలు ఎందుకు ఎత్తుకెళుతున్నారో తెలియడం లేదు. విచారణ జరుపుతామని ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి పేర్కొన్నారు.
షో ఇమేజ్ ఏం కాను? నాగ్ ఉగ్రరూపం.. మోకాళ్లపై కూర్చుని పవన్ వేడుకోలు
వీకెండ్ వచ్చిందంటే క్లాసులు పీకడమే నాగార్జున చేసే ఏకైక పని. సంజనా, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్, భరణికి పెద్ద లెక్చర్లే ఇచ్చాడు. కానీ పవన్ను మాత్రం ఏకంగా ఏడిపించేశాడు. ఇంతకీ హౌస్లో ఏం జరిగిందో శనివారం (నవంబర్ 1వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..బెస్ట్ కెప్టెన్రేషన్ మేనేజర్ తనూజ (Thanuja Puttaswamy)కే ఆర్డర్ వేస్తావా? అని కల్యాణ్ను, నామినేషన్ చేసిన పాయింటే తప్పని ఇమ్మాన్యుయేల్ను ఏకిపారేశాడు నాగ్. సుమన్ను అసమర్థ కెప్టెన్ అన్న సంజనాని సైతం తప్పుపట్టాడు. ప్రేక్షకులతో సుమన్ బెస్ట్ కెప్టెన్ అనిపించేలా చేశాడు. కెప్టెన్సీ గేమ్లో భరణి గోడమీద పిల్లిలా సేఫ్ గేమ్ ఆడటాన్ని ఖండించాడు. ఇలాగే ఉంటే ఎక్కువరోజులు ఉండలేవని వార్నింగ్ ఇచ్చాడు. ఇక వారమంతా ఎప్పుడుపడితే అప్పుడు గొడవలు పెట్టుకుంటూ, దాన్ని సాగదీస్తూ మహా చిరాకు తెప్పించారు పవన్-రీతూ. డోర్స్ ఓపెన్వీళ్లకు నాగార్జున గట్టి క్లాస్ పీకితేకానీ బుద్ధి రాదని ప్రేక్షకులు ఎదురుచూశారు. తీరా నాగార్జున (Nagarjuna Akkineni) ఊహించినదానికన్నా ఎక్కువ సీరియస్ అవడంతో పవన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆడపిల్లను తోసేస్తావా? మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావా? నీ బ్యాగులు సర్దుకో.. డోర్స్ ఓపెన్ అంటూ తక్షణమే వెళ్లిపోవాలన్నాడు. ఆ మాటకు పవన్ నిలువెల్లా వణికిపోయాడు. ఇంకోసారి ఆ తప్పు రిపీట్ చేయను సార్ అని వేడుకున్నాడు. చేతులు జోడించి వేడుకున్న పవన్అటు రీతూ (Rithu Chowdary) కూడా.. ఇద్దరం గొడవపడుతున్నాం.. నేను వెళ్లిపోతున్నాననే ఆవేశంలో అలా తోశాడు. ఈసారికి వదిలేయండి అని వేడుకుంది. అయినా నాగ్ కనికరించలేదు. బిగ్బాస్ ఇంటి డోర్ తెర్చుకోవడంతో పవన్కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది రీతూ. నువ్వు కోపంలో అలా చేశావ్, నాకు తెలుసు.. స్ట్రాంగ్గా ఉండు.. సార్కు అర్థమయ్యేలా వివరించు.. ఆయనకు సారీ చెప్పు అని బోధించింది. దీంతో అతడు సారీ సర్.. ఇంకోసారి రిపీట్ చేయను, ఈ ఒక్కసారికి క్షమించండి అని దీనంగా చేతులు జోడించి అడిగాడు. క్షమించేది లేదన్న నాగ్ఈసారి నాగార్జున హౌస్మేట్స్ అభిప్రాయాలు అడగ్గా.. ఎవరూ కూడా అతడికి ఎలిమినేట్ అయ్యేంత పెద్ద శిక్ష విధించాలని కోరుకోలేదు. అప్పుడు నాగ్.. ఇది హౌస్కు మాత్రమే సంబంధించిన విషయం కాదు, షో ఇమేజ్కు సంబంధించింది. మీ తరువాత వచ్చేవాళ్లు ఈ సంఘటనను చూసి ఇలాగే ప్రవర్తిస్తే షో పడిపోతుంది. కాబట్టి నేను క్షమించలేను అన్నాడు. ఇంతలో రీతూ మాట్లాడుతూ.. వాడు నన్నేదో చేయాలనే ఉద్దేశం కాదు సార్.. ఇద్దరం గొడవపడుతుంటే మాట వినకుండా వెళ్లిపోతున్నాననే అలా నెట్టాడు. అంత చిన్నదానికి హౌస్లో నుంచి పంపించొద్దు అని బతిమాలింది. మోకాళ్లపై కూర్చుని సారీ అందుకు నాగ్ మాట్లాడుతూ.. మాధురి మీది అన్హెల్దీ బాండ్ అన్నప్పుడు చాలా కోపం వచ్చింది. అలా అనడానికి ఆమెకేం హక్కు ఉందనిపించింది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీది కచ్చితంగా అన్హెల్దీ బాండింగే.. అని స్టేట్మెంట్ ఇచ్చాడు. రీతూకే కాదు, ఆడియన్స్కు కూడా క్షమాపణ చెప్పాలని పవన్ను ఆదేశించాడు. దీంతో పవన్.. రీతూ కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు. మోకాళ్లపై కూర్చుని.. నేనలా చేసి ఉండకూడదంటూ తలవంచుకుని సారీ చెప్పాడు. అప్పటికి శాంతించిన నాగార్జున.. తెరుచున్న బిగ్బాస్ ఇంటి డోర్లను మూయించేశాడు.చదవండి: పవన్కి రెడ్ కార్డ్.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే?
వికారాబాద్లో దారుణం.. భార్యపై అనుమానంతో వదిన, కూతురును..
సాక్షి కులకచర్ల: వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కులకచర్ల మండల కేంద్రంలో భార్య, ఇద్దరు పిల్లలు, వదినను వేపూరి యాదయ్య అనే వ్యక్తి కత్తితో దారుణంగా నరికి చంపాడు. అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం.. యాదయ్య, అలవేలు భార్యాభర్తలు. వారికి అపర్ణ, శ్రావణి ఇద్దరు కుమార్తెలు. రోజువారీ కూలీగా పనిచేసే యాదయ్యకు భార్య అలవేలుపై అనుమానం ఎక్కువ అని కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. ఆమెపై అనుమానంతో ప్రతీరోజు గొడవ పడేవాడని చుట్టుపక్కల వారు తెలిపారు. ఈ క్రమంలోనే వారం రోజులుగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. భార్యను యాదయ్య తీవ్రంగా కొట్టినట్టు కూడా తెలిసింది.దీంతో, ఇద్దరిని రాజీ చేసేందుకు వదిన హన్మమ్మ వారి ఇంటికి వచ్చింది. శనివారం రాత్రి వారి మధ్య చర్చలు జరిగాయి. ఆ తరువాత అందరూ పడుకున్న సమయంలో అర్ధరాత్రి యాదయ్య దారుణానికి ఒడిగట్టాడు. భార్య అలవేలు (32), కూతురు శ్రావణి (13), వదిన హన్మమ్మ (40)ను కోడవలితో గొంతుకోసి హత్య చేశాడు. పెద్దకుమార్తె అపర్ణపై కూడా దాడి చేయబోగా ఆమె తప్పించుకొని పారిపోయింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పడంతో.. వారు వచ్చేలోపే యాదయ్య ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. నలుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
స్క్రోలాటం చిట్టి రీల్స్.. గట్టి ఆదాయం
నవ్వించు, ప్రేరేపించు, షేర్ చేయించు ఇవన్నీ రెండు నిమిషాల్లోనే! ఇక్కడ సమయం తక్కువ, ఐడియాలు ఎక్కువ. కాని, పవర్ మాత్రం మ్యాక్స్! టైమింగ్లో రీల్స్ కంటే ఎక్కువ, షార్ట్ ఫిల్మ్ కంటే తక్కువ. కానీ, ఫుల్ ఎంటర్టైన్ మెంట్, ఫుల్ ఇంపాక్ట్, ఫుల్ మనీ! అవే, ఈ టూ మినిట్స్ వీడియోల చిన్న సినిమాలు! అందుకే, ఇవి రీల్స్నే కాదు, రియల్ లైఫ్లోనూ ఫాస్ట్ ఇంపాక్ట్ ఇస్తున్నాయి.చిన్న వీడియోల పెద్ద హంగామాఒకప్పుడు సినిమా థియేటర్లో మూడు గంటలు కూర్చుని ఒక కథ చూస్తే, ఇప్పుడు అదే ఎమోషన్, అదే మెసేజ్, అదే ఫీల్ను రెండు నిమిషాల వీడియోలోనే చూస్తున్నాం! కారణం? డిజిటల్ ప్రపంచం వేగంగా పరుగులు తీస్తోంది. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు, డేటా ఇవన్నీ కలసి మనకు రీల్స్ స్క్రోలింగ్ అనే ఒక కొత్త అలవాటు తెచ్చాయి. ఇప్పుడు ఆ రీల్సే కాస్త పెద్దవై షార్ట్ స్క్రోలింగ్ సినిమాలుగా మారాయి. అందుకే, ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, జోష్, మోజ్ ఏ యాప్ తెరిచినా ఒక్కో స్క్రోల్లోనే నవ్వు, డ్రామా, పాట, డ్యాన్ ్స, ట్రెండ్, ఎమోషన్ అన్నీ మీ చేతిలోకి వస్తున్నాయి, అది కూడా రెండు నిమిషాల్లోనే! ఇంతలోనే వాటికి మిలియన్ల వ్యూస్, కోట్ల లైక్స్, సూపర్స్టార్ ఫేమ్. ఈ రెండు నిమిషాల ఫేమ్తో లక్షల ఆదాయం కూడా వస్తోంది.ఎందుకు ఈ పిచ్చి?మనిషి మైండ్ ఇప్పుడు ఫాస్ట్ మోడ్లో ఉంది. తక్కువ టైమ్లో ఎక్కువ ఎంటర్టైన్ మెంట్ కావాలని కోరుకుంటోంది. పది నిమిషాల వీడియో ఎవరు చూస్తారు? అదే తొంభై సెకన్లలో నవ్వు, ప్రేమ, డ్యాన్ ్స, డ్రామా అన్నీ ఇస్తే, దాన్ని మిస్సవ్వడం కష్టం! అందుకే మనసు వెంటనే ‘నెక్ట్స్’ అంటుంది. ఇదే డోపమైన్ లూప్. ప్రతి స్క్రోల్లో చిన్న సంతోషం, ప్రతి వీడియోలో కొత్త హిట్. సైకాలజిస్టుల మాట ప్రకారం, చిన్న వీడియోలు మన మెదడులో ‘ఇన్ స్టంట్ రివార్డ్’ ఫీలింగ్ కలిగిస్తాయి. అందుకే మనం ‘ఇంకో వీడియో మాత్రమే’ అని మళ్లీ మళ్లీ స్క్రోల్ చేస్తూనే ఉంటాం! వీటిలో యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్కు ఎక్కువ క్రేజ్ రావడంతో, క్రియేటర్లు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్, వీడియోస్ కంటే రీల్స్లోనే తమ క్రియేటివిటీతో కథలను సృష్టిస్తున్నారు. అలా ‘ఒక్క నిమిషం చాలదు, రెండు నిమిషాలైనా ఇవ్వండి!’ అని క్రియేటర్లు డిమాండ్ చేసినప్పుడు, యూట్యూబ్ ‘సరే! మీకు 180 సెకన్లు!’ అని అంగీకరించింది. ఈ నేపథ్యం వలనే వివిధ రకాల సోషల్ మీడియా యాప్స్ కూడా ఈ రెండు, మూడు నిమిషాల వీడియోలకు ఆసక్తి చూపించడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం, టిక్టాక్, యూట్యూబ్ షార్ట్స్ నిడివి మూడు నిమిషాల వరకు పొడుగవుతుండగా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా పొడవవుతున్నాయి! అలా ఇప్పుడు ప్రపంచం మొత్తం టూ మినిట్స్ రివల్యూషన్ మొదలైంది. క్విక్ కరెన్సీగా!వాణిజ్య ప్రకటనలు అంటే పెద్ద క్యాంపెయిన్, టీవీ యాడ్స్, బిల్బోర్డులను అనుకుంటే, ఇప్పుడు అవి మొబైల్లో ఒక్క స్క్రోల్తో సరిపోతుంది! మార్కెటింగ్ ఇప్పుడు డైలాగ్ కాదు, రెండు నిమిషాల డ్రామాగా మారింది. ఫ్లిప్కార్ట్ రీల్స్లో డిస్కౌంట్ చెబుతుంది, స్విగ్గీ రీల్స్లో కర్రీ చూపిస్తుంది, మీషో రీల్స్లో సేల్స్ పెంచుతుంది! పక్కా మార్కెటింగ్ కన్సల్టెంట్స్ అందరూ ఇదే మంత్రం ‘ప్రోడక్ట్ ఎంత గొప్పదో కాదు, రెండు నిమిషాల్లో ఎవరి మనసు దోచుకుంటామో అదే బ్రాండ్ సక్సెస్!’ అంటున్నారు. వీటికి కంటెంట్ క్రియేటర్స్, ఇన్ ఫ్లుయెన్సర్స్ తోడవటంతో, బ్రాండ్స్కు క్రియేటర్లకు షార్ట్ వీడియోలు ఒక క్విక్ కరెన్సీగా మారాయి. స్టార్టప్స్ కూడా ఈ షార్ట్ వీడియోస్ ఆధారంగా కస్టమర్ను కట్టిపడేస్తున్నాయి. సంక్లిష్టమైన టెక్నాలజీని కేవలం రెండు నిమిషాల్లో అర్థమయ్యేలా చూపించి, మార్కెటింగ్లో కొత్త ఫ్యాషన్ క్రియేట్ చేశారు. మార్కెటింగ్ నిపుణుల ప్రకారం, 2026 నాటికి ప్రపంచం చూసే కంటెంట్లో 70 శాతం షార్ట్ వీడియోలే ఉంటాయి. సినిమా ట్రైలర్లు, యూనివర్సిటీ క్యాంపెయిన్లు, ఏ సందేశాలు అయినా ఇప్పుడు రీల్ రూట్లోనే అందరికీ చేరుతున్నాయి.అంతర్జాతీయ స్థాయిలో..ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘స్క్రోల్, ప్లే, షేర్!’ అనే రిథమ్లో నడుస్తోంది. అందుకే, ప్రపంచ వ్యాప్తంగా టిక్టాక్, యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్, క్వాయ్, మోజ్, జోష్ కలిపి 80 శాతం మొబైల్ డేటా వినియోగానికి కారణం. ఈ కారణంగానే 2020లో యూజర్లు రోజుకు సుమారు 35 నిమిషాలు స్క్రోల్ చేస్తే, ఇప్పుడు 80 నిమిషాలు స్క్రోల్ చేస్తున్నారట! అందులో మన దేశం ముందు వరుసలో ఉంది. రోజుకు సుమారు 65 కోట్ల మంది యూజర్లు ఈ షార్ట్ వీడియోస్ వీక్షిస్తారు. ముఖ్యంగా తెలుగు, తమిళం, హిందీ వంటి ప్రాంతీయ భాషల కంటెంట్కు డిమాండ్ ఎక్కువ. అందుకే, స్థానిక క్రియేటర్లు ఇప్పుడు గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్లుగా ఎదుగుతున్నారు. ఈ నేపథ్యంలో, ‘2025 గ్లోబల్ షార్ట్ వీడియోస్ ట్రెండ్స్’ సర్వే ప్రకారం, వివిధ సంస్థలు పరిశీలించిన ఫలితాలను వెల్లడి చేశారు. వివిధ మొబైల్ యాప్ల డేటా, యూజర్ సర్వేలు, సోషల్ మీడియా విశ్లేషణల ద్వారా, ఒక్కో దేశంలో ప్రత్యేక కంటెంట్, ట్రెండ్స్ స్పష్టమయ్యాయి. ప్రతి చోటా స్థానిక భాషలు, సంస్కృతులు ఆధారంగా షార్ట్ వీడియోలు కొత్త దారులు సృష్టిస్తున్నాయి.డబుల్ లైఫ్!ఉదయం బాస్ ‘మీటింగ్ టైమ్’ అంటాడు, రాత్రి ఫాలోవర్స్ ‘రీల్ టైమ్’ అంటారు! ఇలా రెండు ప్రపంచాల మధ్య బ్రిడ్జ్ వేసుకుని నడుస్తున్నవారే డబుల్ లైఫ్ ఇన్ ఫ్లుయెన్సర్లు! పగలు ఆఫీస్లో ప్రెజెంటేషన్ ్స చేసి, రాత్రి కెమెరా ముందు ప్రెజెన్ ్స ఇస్తున్నారు. ఇలా ఇండియాలో ఇప్పటి వరకు 45 లక్షల షార్ట్ వీడియో క్రియేటర్లు ఉన్నారని, వారిలో దాదాపు 60 శాతం మంది ప్రైవేట్ ఉద్యోగులు లేదా ఫ్రీలాన్సర్లు అని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. ప్రపంచం మొత్తం చూస్తే, సోషల్ మీడియాలోని క్రియేటర్లలో 40 శాతం మంది రెండు ఉద్యోగాలు చేస్తున్నార ని అంచనా. వీరిలో దాదాపు 6 లక్షల మంది క్రమంగా వీడియోల ద్వారా ఆదాయం పొందుతున్నారు. అంటే పగలు జీతం, రాత్రి వైరల్ వీడియోల ఆదాయం! దీంతో చాలామంది ప్రొఫెషనల్ ఉద్యోగం కంటే ఈ సైడ్ ఇన్ కమ్ పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆఫీస్లో ఇంక్రిమెంట్ రాకపోయినా, రీల్లో ఎంగేజ్మెంట్ పెరుగుతుంది! అందుకే, ఒక్క రీల్ సక్సెస్ అయితే నెల జీతం కన్నా ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది. వీరంతా ప్రతిరోజూ ల్యాప్టాప్ బ్యాగ్లో లంచ్ బాక్స్తో పాటు మరో పక్క ట్రైపాడ్తో ఆఫీస్లకు వెళ్తూ, ఒక కొత్త వర్క్ కల్చర్తో పనిచేస్తున్నారు. మరికొందరు ‘వర్క్ ఫ్రమ్ ఆఫీస్’ మాదిరి ‘వర్క్ ఫ్రమ్ రీల్’ అనే కొత్త ఫుల్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారు! ఇలా వచ్చిన పాపులారిటీతో టీవీ షోలు, ఇంటర్వ్యూలు, బ్రాండ్ కొలాబరేషన్లు, సిల్వర్ స్క్రీన్ చాన్ ్సలు కూడా దక్కించుకుంటున్నారు. ఇలా సాధారణ ఉద్యోగుల కంటే వీరి జీవితం ఇప్పుడు మరింత ఆదాయభరితంగా, ఆనందభరితంగా, వైరల్గా మారింది. ఏఐ క్రియేటర్లు! ఇప్పటి క్రియేటర్లకు కెమెరా మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్స కూడా పెద్ద సహాయంగా మారింది. వీడియో తీసేందుకు డైరెక్టర్, ఎడిటర్, మ్యూజిక్ డిజైనర్ అవసరం లేదు. ఏఐ వాయిస్, ఫేస్ ఫిల్టర్, స్మార్ట్ ఎడిటింగ్ యాప్లు ఇవే కొత్త టెక్నాలజీ టీమ్ మెంబర్స్. ఒక క్లిక్తో బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది, వాయిస్ టోన్ అడ్జస్ట్ అవుతుంది, మూడ్కి సరిపోయే మ్యూజిక్ వచ్చేస్తుంది. కెమెరా ముందు ఉన్నది మనిషే కాని, వెనుక ఆలోచిస్తున్నది మొత్తం ఏఐనే. ఇదే కారణంగా ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ల వేగం పెరిగింది. ఒకప్పుడు వీడియోకి రోజులు పట్టేది, ఇప్పుడు నిమిషాల్లో సిద్ధమవుతోంది!రీల్లోనే ఫీల్స్, డ్రీమ్స్! బ్రేక్అప్ అయినా, బర్త్డే అయినా ఇప్పుడు ప్రతి ఒక్క సందర్భానికి రీల్ తప్పనిసరి! ముఖ్యంగా 16 నుంచి 25 ఏళ్ల వయసు వారు ‘రియల్ లైఫ్ కంటే రీల్ లైఫ్ బెటర్!’ అని నమ్ముతున్నారు. సినిమా చూడటానికి ఓపిక లేదు కానీ, రీల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ‘ఒక్క నిమిషం లవ్ స్టోరీ’, ‘30 సెకండ్ల అడ్వెంచర్’, ‘45 సెకండ్ల ట్రాజెడీ’ ఇవే ఇప్పుడు న్యూ ఏజ్ బ్లాక్బస్టర్స్! జెన్ జీ కి రీల్ అంటే భాష కాదు లైఫ్ స్టయిల్. ఇదే కారణంగా ఈ వయసు వారు సోషల్ మీడియాలో అత్యధికంగా యాక్టివ్గా ఉంటున్నారు. ఫ్యాషన్ నుంచి ఫుడ్ వరకూ, ట్రావెల్ నుంచి ట్రెండ్ వరకూ అన్నీ వీళ్ల చేతుల్లోనే! అందుకే, అసలైన వైరల్ పవర్ కూడా వీరివద్దే దాగుంది. ప్రాంతీయ భాషల శక్తిప్రపంచం ఇంగ్లీష్లో మాట్లాడినా, సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రాంతీయ భాషలే రాజ్యం చేస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో ఉన్న కంటెంట్ ఎక్కువగా వైరల్ అవుతోంది.వీక్షకులు తమ భాషలో ఉన్న కంటెంట్కి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ఇందుకే ఇప్పుడు ప్రతి యాప్ కూడా ‘మీ భాషలో రీల్ క్రియేట్ చేయండి’ అని ప్రోత్సహిస్తోంది. తెలుగు క్రియేటర్ల రీల్స్ ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్స్లోకి చేరాయి!రేపటి రియాలిటీ!భవిష్యత్తులో షార్ట్ వీడియోల ప్రపంచం మరింత టెక్ రిచ్గా మారబోతోంది. త్రీడీ వీడియోలు, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ కంటెంట్ ఇవే రేపటి రీల్స్. క్రియేటర్లు ఇప్పుడు కెమెరాతో కాదు, మెటావర్స్లో రికార్డు చేయబోతున్నారు! అప్పుడు ప్రేక్షకులు కేవలం వీడియో చూడరు, దానిలోకి అడుగుపెడతారు. అంటే రేపటి రీల్ కేవలం వినోదం కాదు. ఒక వాస్తవిక అనుభవం అవుతుంది! ఇప్పటికే కొంతమంది క్రియేటర్లు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు కూడా. త్వరలోనే రీల్స్ చూడటం కాదు, అందులో జీవించబోతున్నాం. భవిష్యత్తులో రెజ్యూమేలో డిగ్రీ కాదు. ఫాలోవర్స్ కౌంటే కెరీర్ డిసైడ్ చేస్తుందేమో! హై పెయిడ్ జాబ్స్లో షార్ట్ వీడియో క్రియేటర్ ఒకటిగా మారచ్చు కూడా! అప్పుడు, డాక్టర్ రీల్ మధ్యలో ఆపరేషన్ చేస్తాడు. లాయర్ వాదన మధ్యలో ‘లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్!’ అంటాడు. టీచర్ కూడా కెమెరా ముందు ‘టుడేస్ ట్రెండ్!’ అని క్లాస్ మొదలుపెడుతుంది. ఇలా చాలామంది కంటెంట్ క్రియేటర్నే మెయిన్ జాబ్గా, మిగతా ఉద్యోగాలను పార్ట్టైమ్లా చేస్తారేమో!కిచెన్ నుంచి కెమెరా వరకు!భారతదేశంలో షార్ట్ వీడియోల రంగంలో మహిళల సంఖ్య ఆశ్చర్యకరంగా పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం 40 శాతం పైగా షార్ట్ వీడియో క్రియేటర్లు మహిళలే! వంటింటి కథల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ టిప్స్, ఫ్యాషన్ నుంచి ఫిట్నెస్ వరకు, మహిళలు కంటెంట్ ప్రపంచాన్ని కొత్తగా మలుస్తున్నారు. ఇప్పుడు వాళ్లు కేవలం కంటెంట్ క్రియేటర్లు మాత్రమే కాదు, బ్రాండ్ అంబాసిడర్లు, ఇన్ ఫ్లుయెన్సర్లు, స్టార్టప్ ఫేస్లు కూడా అయ్యారు.లక్షల్లో ఆదాయం!చూస్తున్న వీడియోలు కేవలం రెండు నిమిషాలే అయినా, క్రియేటర్లకు మాత్రం లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతుంది. ఇందులో ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న క్రియేటర్ మార్కెట్. 2019లో షార్ట్ వీడియో మార్కెట్ విలువ 1.3 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2025 నాటికి అది 3 బిలియన్ డాలర్లకు చేరనుందని అంచనా. 2027 నాటికి ఇండియాలో క్రియేటర్ ఎకానమీ 45,000 కోట్ల రూపాయల విలువకు చేరనుంది. అందుకే మార్కెటింగ్ కూడా రీల్ ఫార్మ్లోకి వచ్చేసింది. రెండు నిమిషాల్లో బ్రాండ్ కథ చెప్పగలిగిన వారే గెలుస్తున్నారు. ఒక్క స్క్రోల్కి కోట్ల రూపాయల మార్కెట్– ఇదే కొత్త డిజిటల్ వండర్! ఈ కారణంగానే ఇండియాలో ఇప్పటికే పదకొండు వేలకు పైగా చానెల్స్ మిలియన్ల సబ్స్క్రైబర్లు దాటాయి. రోజూ కోటాను కోట్ల వ్యూస్! అంటే ఒక్కొక్క షార్ట్ వీడియో చూస్తే, మన ఫింగర్స్ స్క్రోల్ చేస్తూ ‘ఓ మై గాడ్!’ అని చెప్పాల్సిందే. మనీకంట్రోల్ సంస్థ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం, ప్రస్తుతం 45 లక్షల ఇండియాలో క్రియేటర్లలో సుమారు 6 లక్షల మంది డబ్బు సంపాదిస్తున్నారు. వారి సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్ ఆధారంగా ఆదాయం వస్తుంది. యూట్యూబ్ గత మూడు సంవత్సరాల్లో 5.8 లక్షల కోట్ల రూపాయలు క్రియేటర్లకు చెల్లించిందట! ఎవరికి తెలుసు? ఈరోజు మీరు చూసిన చిన్న రీల్ రేపటికి లక్షలు తెచ్చే కంటెంట్ కావచ్చు!
బిగ్బాస్ స్టేజీపై రష్మిక.. భరణి సిగ్గు చూస్తే నిజంగా చచ్చిపోవాల్సిందే!
Mexico: సూపర్ మార్కెట్లో పేలుడు.. 23 మంది మృతి
ఊరూ.. పల్లెటూరు..!
రూ.600 కోట్ల కలెక్షన్స్.. ఆ తర్వాత చేతిలో ఒక్క సినిమా లేని దర్శకుడు!
Banke Bihari: ఆ గుప్త నిధులు ఎక్కడ?
ప్రశాంత్ వర్మ రూ.200 కోట్ల వివాదం.. నిర్మాత ఫిర్యాదు
Aadhaar: ఇక ఇంట్లోంచే ఆధార్ అప్డేట్
లోకేష్ కుట్రే.. పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు: జోగి శకుంతల
బీబీనగర్లో కారు బీభత్సం.. చెరువులోకి ఎగిరిపడిన యువతి
కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం
రవితేజ మాస్ జాతర.. బాహుబలి దెబ్బతో వరస్ట్ రికార్డ్!
పసిడి ధరలు రివర్స్.. 22 క్యారెట్ల బంగారం ఏకంగా..
వ్యాపార ప్రకటనలో తొలిసారి నటించిన 'నందమూరి తేజస్విని'
‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ రివ్యూ
ఎప్పటినుంచో ఆ వ్యాధితో బాధపడుతున్నా: రాజశేఖర్
104 మందిని చంపేసి ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాట
ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు.. ధనలాభం పొందుతారు
మోదీ ఫోన్ సార్! తుపాన్ను పాకిస్తాన్కు మళ్లించి పుణ్యం కట్టుకోండని అడుగుతున్నార్సార్!!
హైదరాబాద్కు వచ్చేయండి బ్రో.. ఆధార్ కార్డ్స్ ఇప్పిస్తాం.. నెటిజన్స్ ఫిదా!
ఒకేరోజు రెండుసార్లు.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు
ఆ బ్యాంకు భళా.. ఈ బ్యాంకు డీలా
ఈ రాశి వారికి స్థిరాస్తి లాభం.. వాహనయోగం
Mass Jathara: ‘మాస్ జాతర’ మూవీ రివ్యూ
ఇదేం ‘టెట్’రా బాబు!
వాళ్లందరూ సర్వనాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి శాపనార్థాలు
మా ఓటమికి కారణమదే: సూర్య కుమార్
బంగారం ధర మళ్లీ తగ్గినా..
సాక్షి కార్టూన్ 01-11-2025
ఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు.. రద్దైతే విజేత ఎవరు..?
శివమ్ దూబే వరల్డ్ రికార్డుకు బ్రేక్..
బిగ్బాస్ స్టేజీపై రష్మిక.. భరణి సిగ్గు చూస్తే నిజంగా చచ్చిపోవాల్సిందే!
Mexico: సూపర్ మార్కెట్లో పేలుడు.. 23 మంది మృతి
ఊరూ.. పల్లెటూరు..!
రూ.600 కోట్ల కలెక్షన్స్.. ఆ తర్వాత చేతిలో ఒక్క సినిమా లేని దర్శకుడు!
Banke Bihari: ఆ గుప్త నిధులు ఎక్కడ?
ప్రశాంత్ వర్మ రూ.200 కోట్ల వివాదం.. నిర్మాత ఫిర్యాదు
Aadhaar: ఇక ఇంట్లోంచే ఆధార్ అప్డేట్
లోకేష్ కుట్రే.. పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు: జోగి శకుంతల
బీబీనగర్లో కారు బీభత్సం.. చెరువులోకి ఎగిరిపడిన యువతి
కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం
రవితేజ మాస్ జాతర.. బాహుబలి దెబ్బతో వరస్ట్ రికార్డ్!
పసిడి ధరలు రివర్స్.. 22 క్యారెట్ల బంగారం ఏకంగా..
వ్యాపార ప్రకటనలో తొలిసారి నటించిన 'నందమూరి తేజస్విని'
‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ రివ్యూ
ఎప్పటినుంచో ఆ వ్యాధితో బాధపడుతున్నా: రాజశేఖర్
104 మందిని చంపేసి ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాట
ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు.. ధనలాభం పొందుతారు
మోదీ ఫోన్ సార్! తుపాన్ను పాకిస్తాన్కు మళ్లించి పుణ్యం కట్టుకోండని అడుగుతున్నార్సార్!!
హైదరాబాద్కు వచ్చేయండి బ్రో.. ఆధార్ కార్డ్స్ ఇప్పిస్తాం.. నెటిజన్స్ ఫిదా!
ఒకేరోజు రెండుసార్లు.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు
ఆ బ్యాంకు భళా.. ఈ బ్యాంకు డీలా
ఈ రాశి వారికి స్థిరాస్తి లాభం.. వాహనయోగం
Mass Jathara: ‘మాస్ జాతర’ మూవీ రివ్యూ
ఇదేం ‘టెట్’రా బాబు!
వాళ్లందరూ సర్వనాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి శాపనార్థాలు
మా ఓటమికి కారణమదే: సూర్య కుమార్
బంగారం ధర మళ్లీ తగ్గినా..
సాక్షి కార్టూన్ 01-11-2025
ఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు.. రద్దైతే విజేత ఎవరు..?
శివమ్ దూబే వరల్డ్ రికార్డుకు బ్రేక్..
సినిమా
ఇచ్చిన మాట నిలబెట్టుకోండి.. రాజమౌళితో మహేశ్ బాబు
మహేశ్ బాబు- ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. నవంబర్లో #SSMB29 అప్డేట్ ఇస్తామని గతంలోనే జక్కన్న ఒక పోస్ట్ చేశారు. సినిమా టైటిల్తో పాటు మహేశ్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని చెప్పడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, నవంబర్ మొదలు కావడంతో సోషల్ మీడియాలో #noveMBerwillbehiSStoRic, #noveMBer వంటి హ్యాష్ట్యాగ్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మొదట మహేశ్ ఒక ట్వీట్ వేశారు. ఆ తర్వాత రాజమౌళి నుంచి రిప్లై వచ్చింది. అలా ఇద్దరి మధ్య ట్వీట్ వార్ మొదలైంది.#SSMB29 అప్డేట్ కోసం 'ఆల్రెడీ నవంబర్ వచ్చేసింది' అని మహేశ్బాబు ట్వీట్ వేశారు.. తాను కూడా ఎదురుచూస్తున్నట్లు కళ్ల ఎమోజీ పెట్టారు. దానికి రాజమౌళి కూడా ఫన్నీగా 'అవును, నవంబర్ వచ్చేసింది. ఈ నెలలో ఏ సినిమాకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావ్' అంటూ పంచ్ వేశారు. దీంతో మహేశ్ కూడా 'మీరు ఎప్పటి నుంచో తెరకెక్కిస్తున్న మహాభారతం సినిమాకు ఇద్దాం అనుకుంటున్నాను' అంటూ రిటర్న్ పంచ్ ఇచ్చారు.అయితే, మహేశ్ అసలు విషయానికి వద్దాం అంటూ.. 'ముందుగా నవంబర్లో మీరు మాకు ఒక హామీ ఇచ్చారు. దయచేసి ఆ మాట నిలబెట్టుకోండి' అని కోరారు. దీంతో జక్కన్న కూడా 'సరే మహేశ్.. నవంబర్ మొదలైంది ఇప్పుడే కదా.. మేము తప్పకుండా ఒక్కొక్కటిగా వెల్లడిస్తాం' అని సమాధానం ఇచ్చారు.ఇంకా ఎంత సమయం కావాలి సార్ అంటూ జక్కన్నకు మరో ట్వీట్ వేశారు మహేశ్.. '2030లో స్టార్ట్ చేద్దామా..? మన దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా జనవరి నుంచే హైదరాబాద్లోని ప్రతి స్ట్రీట్లో తనకు నచ్చిన స్టోరీలను ఇన్స్టాలో పోస్ట్ చేస్తోంది' అంటూ ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేసి మహేశ్ బాబు సెటైర్లు వేశారు.బ్లైండ్గా ఏసేస్తా అంటూ ప్రియాంక ఎంట్రీ'హలో హీరో.. సెట్లో నువ్వు నాతో చెప్పిన కథలన్నీ లీక్ చేయాలనుకుంటున్నావా ఏంటి.. నేను ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా ఏసేస్తా..' అంటూ మహేశ్ బాబుకు అతని స్టైల్లోనే ప్రియాంక చోప్రా రిప్లై ఇచ్చింది. ఇంతలో జక్కన్న ఎంట్రీ ఇచ్చేసి 'ప్రియాంక చోప్రా ఇందులో నటిస్తుందనే విషయాన్ని ఎందుకు బయటపెట్టేశావ్ మహేశ్.. మంచి సర్ప్రైజ్ని ఇద్దాం అనుకుంటే నువ్వు నాశనం చేశావ్' అంటూ పంచ్ వేశారు. ఇంతలో మహేశ్ కూడా మరో పంచ్తో తెరపైకి వచ్చారు. 'మీ ఉద్దేశంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక సర్ప్రైజ్ అని చెప్పాలనుకుంటున్నావా..' అని మరో లీక్ ఇచ్చేశారు. అప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక పోస్ట్ ఇలా చేశారు. 'రాజమౌళి సార్.. నేను ఇలాగే తరుచుగా వెకేషన్ కోసం హైదరాబాద్కు వస్తూ ఉంటే.. నా కుటుంబం నన్ను అనుమానించడం స్టార్ట్ చేస్తారు' అని ముగిస్తారు. ఇలా సరదాగా ట్వీట్లతోనే ఈ సినిమాలో నటిస్తున్న వారిని తొలిసారి పరిచయం చేశారు.It’s November already @ssrajamouli 👀— Mahesh Babu (@urstrulyMahesh) November 1, 2025
బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ 'కల్కి'.. ఉత్తమ నటుడిగా ఎవరంటే..
సినీ ప్రపంచంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2025’ ( Dadasaheb Phalke International film festival awards 2025) ముంబైలో ఘనంగా జరిగింది. 2024లో విడుదలైన సినిమాలు, నటీనటులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డ్లు దక్కాయి. ఈ క్రమంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మరోసారి సత్తా చాటింది. ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా ఈ చిత్రం నిలిచింది. బాలీవుడ్ సినిమా ‘స్త్రీ 2’ ఉత్తమ చిత్రంగా అవార్డును అందుకుంది.అవార్డ్ విజేతలు వీరే..బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్- కల్కి 2898 ADఉత్తమ చిత్రం- స్త్రీ 2క్రిటిక్స్ ఉత్తమ చిత్రం: లాపతా లేడీస్ఉత్తమ నటుడు - కార్తీక్ ఆర్యన్ (భూల్ భూలయ్యా 3)క్రిటిక్స్ ఉత్తమ నటుడు - విక్రాంత్ మాస్సే (సెక్టార్ 36)ఉత్తమ నటి- కృతి సనన్ (స్త్రీ 2)బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్- నితాన్షీ గోయెల్ఉత్తమ సంగీత దర్శకుడి- దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2)ఉత్తమ దర్శకుడు- కబీర్ ఖాన్ (చందు ఛాంపియన్)ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్- దినేశ్ విజన్ఎక్స్లెన్స్ ఇన్ ఇండియన్ సినిమా- శిల్పాశెట్టిఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్- ఏఆర్ రెహమాన్ఉత్తమ వెబ్సిరీస్- హీరామండిఉత్తమ నటుడు (వెబ్ సిరీస్)- జితేంద్ర కుమార్ (పంచాయత్- 3)ఉత్తమ నటి (వెబ్ సిరీస్)- హుమా ఖురేషిఉత్తమ దర్శకుడు (వెబ్ సిరీస్)- సంజయ్ లీలా భన్సాలీ (హీరామండి)క్రిటిక్స్ ఉత్తమ నటుడు (వెబ్ సిరీస్)- వరుణ్ ధావన్క్రిటిక్స్ ఉత్తమ నటి (వెబ్ సిరీస్)- సోనాక్షి సిన్హా (హీరామండి)
ఎప్పటినుంచో ఆ వ్యాధితో బాధపడుతున్నా: రాజశేఖర్
గత కొన్నిరోజులుగా 'ఇదేటమ్మా మాయ మాయ' అనే పాత పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. ఇప్పుడు అదే పాటని స్టేజీ మీద స్వయంగా రాజశేఖర్(Rajasekhar) హమ్ చేశారు. అలానే తను ఎప్పటినుంచో ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని కూడా బయటపెట్టారు. ఇంతకీ ఈ వ్యాధి ఏంటి? రాజశేఖర్ ఎక్కడ ఈ విషయాన్ని చెప్పారు.అంకుశం, అల్లరి ప్రియుడు, సింహరాశి లాంటి సినిమాలతో అప్పట్లో హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న రాజశేఖర్.. తర్వాత కాలంలో హిట్స్ లేక పూర్తిగా డీలా పడిపోయారు. 2017లో 'పీఎస్ గరుడ వేగ'తో సక్సెస్ అందుకున్న ఈయన తర్వాత ఒకటి రెండు చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా కనిపించలేదు. లాక్ డౌన్ టైంలో కరోనా కారణంగా అనారోగ్యానికి గురైన ఈయన.. కొన్నాళ్లకు ఇంటికే పరిమితమయ్యారు కూడా.(ఇదీ చదవండి: శర్వానంద్ 'బైకర్' గ్లింప్స్ రిలీజ్)2023లో నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన రాజశేఖర్.. తర్వాత మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు శర్వానంద్ హీరోగా చేస్తున్న 'బైకర్'లో ఈయన కూడా ఉన్నారనే విషయాన్ని ఇప్పుడు తెలిసింది. తాజాగా గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా రాజశేఖర్.. ఈవెంట్లో కనిపించారు. తను కూడా మంచి పాత్రలో కనిపించబోతున్నానని చెప్పారు.మాటల మధ్యలో తాను చాన్నాళ్ల నుంచి 'ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్'(Irritable Bowel Syndrome) అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని రాజశేఖర్ చెప్పారు. ఈవెంట్కి రావాలని, నిన్న తనకు సమాచారం అందించారని.. దీంతో స్పీచ్ ఏం ఇవ్వాలనే యాంగ్జైటీతో నా కడుపు అంతా చెడిపోయిందని అన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాధి గురించి రాజశేఖర్ మాట్లాడారు.ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది దీర్ఘకాలిక జీర్ణశయాంతర సమస్య. కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు,మలబద్ధకం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ సమస్య వల్లనే చాలా ఇబ్బందులు పడుతుంటానని, రాత్రిళ్లు సరిగ్గా నిద్ర కూడా పట్టదని గతంలో రాజశేఖర్ ఓసారి చెప్పారు. ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని, దీనివల్ల చాలా కోపం వస్తుండేదని, నా గురించి తెలిసిన వాళ్లు నేను ఏమన్నా పట్టించుకునేవారు కాదని అప్పట్లో చెప్పారు. మళ్లీ ఇప్పుడు ఈ వ్యాధి గురించి మాట్లాడటంతో మరోసారి ఇది చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: 'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?)
హీరోగా మరో వారసుడు ఎంట్రీ.. జోడీగా రుక్మిణీ వసంత్
చిత్ర రంగంలో ప్రముఖుల వారసులు కథానాయకుడిగా పరిచయం కావడం కొత్త కాదు. అయితే అలాంటి వారు తమ తల్లిదండ్రుల లెగసీని కాపాడుకోవడం, తాము ఎదగడమే ప్రధాన అంశం. అలా ప్రముఖ సంగీత దర్శకుడు విద్యాసాగర్ వారసుడు హర్షవర్ధన్ విద్యాసాగర్ ఇప్పుడు కథానాయకుడిగా అవతారమెత్తడానికి సిద్ధమవుతున్నారని తాజా సమాచారం. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించి పేరు గడించిన సంగీత దర్శకుడు విద్యాసాగర్. ఇప్పటికీ సంగీత దర్శకుడుగా కొనసాగుతున్న ఈయన ఇప్పుడు ఎక్కువగా సంగీత కచేరీలపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు హర్షవర్ధన్ విద్యాసాగర్ కూడా సంగీతాన్ని నేర్చుకుని తండ్రితోపాటు సంగీత కచేరిలో పాల్గొంటూ గుర్తింపు పొందుతున్నారు. ఈయన తాజాగా హీరోగా నటించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం ఈ చిత్రానికి దర్శకుడు లింగస్వామి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిసింది. ఇది రోడ్డు ట్రావెలింగ్ ఇతివృత్తంతో సాగే యాక్షన్ కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. కాగా ఇందులో హర్షవర్ధన్ విద్యాసాగర్ కు జంటగా రుక్మిణీ వసంత్ నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల శివకార్తికేయన్కు జంటగా నటించిన మదరాసీ చిత్రం మంచి పేరును తెచ్చిపెట్టింది. కన్నడంలో నటించిన కాంతార చాప్టర్ 1 చిత్రం మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. దీంతో ఈ అమ్మడికి పలు భాషల్లో అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా వచ్చిన వాటిలో హర్షవర్ధన్ విద్యాసాగర్కు జంటగా నటించే చిత్రం అని, ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ను శ్రీలంకలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. విద్యాసాగర్ విజయనగరం జిల్లా వాసిసంగీత దర్శకుడు విద్యాసాగర్ తెలుగు వారే.. ఆయన విజయనగరం జిల్లా వాసి. కానీ, ఎక్కువగా మలయాళం, తమిళ్ పరిశ్రమలో రాణించారు. ఆయన తాతగారు ఉపద్రష్ణ నరసింహమూర్తి బొబ్బిలి సంస్థానంలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేసేవారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్తో కలసి ధనరాజ్ మాస్టర్ వద్ద గిటార్, పియానోలలో శిక్షణ పొందాడు. చాలా మందికి ఘోస్ట్ సంగీత దర్శకునిగా దాదాపు 600 సినిమాలకు పనిచేసాడు. అలా 16 ఏళ్ళపాటు చేసాక తమిళంలో 'పూమనం' సినిమాకు మొట్టమొదటిగా సంగీత దర్శకత్వం చేశాడు. ఆయనకు తెలుగులో బ్రేక్ తెచ్చిన సినిమాగా తేనెటీగ. తర్వాత టాలీవుడ్లో 100కు పైగా సినిమాలకు పనిచేశాడు.
న్యూస్ పాడ్కాస్ట్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట... తొమ్మిది మంది భక్తులు మృతి... 20 మందికి పైగా గాయాలు
ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకంలో భారీ కోత... ఈ ఏడాది 13 శాతానికిపైగా తగ్గిన పనుల కల్పన
ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్లో ఫైనల్కు దూసుకెళ్లిన టీమిండియా
తెలంగాణలో విధ్వంసం సృష్టించిన ‘మోంథా’... ఉమ్మడి వరంగల్పై తీవ్ర ప్రభావం
ఏపీలో తీరం దాటిన మోంథా తుఫాను
కోస్తాకు ‘మోంథా’ తుపాను గండం..
కాకినాడ తీరానికి ఉప్పెన ముప్పు!
ముంచుకొస్తున్న సూపర్ సైక్లోన్
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం
అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు
క్రీడలు
ఫైనల్లో ఓడిపోతే.. ఎలా ఉంటుందో తెలుసు: భారత కెప్టెన్
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ టోర్నమెంట్లో ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ చేరింది భారత్. 2005, 2017 ఎడిషన్లలో టైటిల్ పోరుకు అర్హత సాధించినా రన్నరప్తోనే సరిపెట్టుకుంది. ఈసారి సొంతగడ్డపై ఈ మెగా ఈవెంట్లో ముచ్చటగా మూడోసారి ఫైనల్కు చేరుకున్న భారత జట్టు.. కలల ‘కప్పు’ను ముద్దాడాలని పట్టుదలగా ఉంది.నవీ ముంబై వేదికగా ఆదివారం సౌతాఫ్రికా (ICC World Cup 2025 Ind W vs SA W)ను చిత్తు చేసి విశ్వవిజేతగా అవతరించాలని హర్మన్ సేన కంకణం కట్టుకుంది. భారత్కు ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ ఆడిన అనుభవం ఉండగా.. సౌతాఫ్రికా టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి. అయితే, ప్రొటిస్ జట్టులో మరిజానే కాప్, కెప్టెన్ లారా వొల్వర్ట్లను నిలువరించగలిగితే భారత్కు తిరుగు ఉండదు.ఫైనల్లో ఓడిపోతే.. ఎలా ఉంటుందో తెలుసుఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్కు ముందు భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వరల్డ్కప్ ఫైనల్లో ఓడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. ఈసారి ఆ భావనను సంతోషకరంగా మార్చుకోవాలని పట్టుదలగా ఉన్నాము.అన్నింటికంటే అదే ముఖ్యంటైటిల్ గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నాం. ఇది మాకెంతో ప్రత్యేకమైన రోజు. కష్టపడి, కఠిన సవాళ్లు అధిగమించి ఇక్కడిదాకా చేరుకున్నాం. ఒత్తిడిని దరిచేరనీయకుండా ఆడటం అన్నింటికంటే ముఖ్యం’’ అని హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొంది.ఇక పటిష్ట ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ గెలిచిన నేపథ్యంలో టీమిండియాతో పాటు దేశమంతా సంబరాలు అంబరాన్నంటిన విషయం తెలిసిందే. ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విషయంపై హర్మన్ప్రీత్ స్పందిస్తూ..గెలిచినా.. ఓడినా ఏడ్చేస్తా‘‘నేను భావోద్వేగాలను నియంత్రించుకోలేను. చాలా ఎమోషనల్గా ఉంటా. మ్యాచ్ గెలవగానే ఏడ్చేశా. ఎంతసేపు ఏడ్చానో గుర్తులేదు. ఓడిన తర్వాత కాదు.. గెలిచిన తర్వాత కూడా ఏడుపు వస్తుంది.టీవీల్లో మీరంతా చూసే ఉంటారు. అయితే, మా వాళ్లకు ఇది అలవాటే. డ్రెసింగ్రూమ్లో నేను ఏడ్వటం వాళ్లు చాలాసార్లు చూశారు. చిన్న చిన్న విషయాలకు కూడా నేను ఉద్వేగానికి లోనవుతా. ముఖ్యంగా జట్టు అనుకున్న ఫలితాన్ని రాబట్టినపుడు అందరికంటే ముందే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి’’ అని హర్మన్ప్రీత్ చెప్పుకొచ్చింది. కాగా ఆదివారం నాటి పోరులో భారత్- సౌతాఫ్రికాల జట్లలో గెలుపు ఎవరిదైనా.. ఈసారి కొత్త చాంపియన్ అవతరిస్తుంది.చదవండి: WC 2025 Final IND vs SA: ఇరుజట్ల బలాలు ఇవే
న్యూజిలాండ్ ‘క్లీన్ స్వీప్’
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పర్యటనలో పేలవ ఆటతీరు కొనసాగించిన ఇంగ్లండ్... మూడో వన్డేలోనూ పరాజయం పాలైంది. ఇటీవలి కాలంలో వన్డే ఫార్మాట్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్న ఇంగ్లండ్... శనివారం కివీస్తో జరిగిన ఆఖరి పోరులో 2 వికెట్ల తేడాతో ఓడింది. ఫలితంగా సొంతగడ్డపై టి20 సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్... వన్డే సిరీస్ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్... 40.2 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. ఈ సిరీస్లో మూడు మ్యాచ్ల్లోనూ ఇంగ్లండ్ పూర్తి ఓవర్లు ఆడకుండానే ఆలౌటైంది. జేమీ ఓవర్టన్ (62 బంతుల్లో 68; 10 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా... జోస్ బట్లర్ (56 బంతుల్లో 38; 7 ఫోర్లు), బ్రైడన్ కార్స్ (30 బంతుల్లో 36; 1 ఫోర్, 4 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. బౌలర్లలో బ్లెయిర్ టిక్నెర్ 4 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో న్యూజిలాండ్ 44.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (46; 7 ఫోర్లు), డారిల్ మిచెల్ (44; 4 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (34; 2 ఫోర్లు, 2 సిక్స్లు) తలా కొన్ని పరుగులు చేశారు. టిక్నెర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, డారిల్ మిచెల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
శ్రీకర్ 93; ఆంధ్ర 222/3
కటక్: ఆంధ్ర ఓపెనర్ శ్రీకర్ భరత్ (129 బంతుల్లో 93; 10 ఫోర్లు, 3 సిక్స్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో మంచి స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 68 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. భరత్తో పాటు అభిషేక్ రెడ్డి (195 బంతుల్లో 76; 9 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్కు 161 పరుగులు జోడించడంతో ఆంధ్ర జట్టుకు శుభారంభం దక్కింది. సెంచరీకి సమీపించిన తర్వాత భరత్ అవుట్ కాగా... కెప్టెన్ రికీ భుయ్ (0) విఫలమయ్యాడు. షేక్ రషీద్ (25 బ్యాటింగ్; 2 ఫోర్లు), కరణ్ షిండే (16 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఒడిశా బౌలర్లలో సంబిత్ బరల్ 2 వికెట్లు పడగొట్టాడు. సత్తాచాటిన రోహిత్ రాయుడు గత రెండు మ్యాచ్లను ‘డ్రా’తో సరిపెట్టుకున్న హైదరాబాద్ జట్టు... మూడో మ్యాచ్లో ఫర్వాలేదనిపించింది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హిమాచల్ ప్రదేశ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. ఆకాశ్ వశిష్ఠ (156 బంతుల్లో 114 బ్యాటింగ్; 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో కదంతొక్కగా... సిద్ధార్థ్ పురోహిత్ (37), అంకుశ్ (30), పుఖ్రాజ్ మాన్ (30), మయాంక్ డాగర్ (36) తలాకొన్ని పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో రోహిత్ రాయుడు 3 వికెట్లు పడగొట్టగా... తనయ్ త్యాగరాజన్ 2 వికెట్లు తీశాడు. చామా మిలింద్, నిశాంత్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
రోహన్ బోపన్న గుడ్బై
డబుల్స్ మిస్సైల్స్ లియాండర్ పేస్, మహేశ్ భూపతిల తర్వాత భారత టెన్నిస్లో ఎవరనే ఎదురుచూపులకు రోహన్ బోపన్న తన ఆటతీరుతో తెరదించాడు. ఆ డబుల్స్ దిగ్గజ ద్వయం గెలిచినన్ని గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలవకపోయినా... వాళ్లిద్దరిలా సుదీర్ఘ అంతర్జాతీయ టెన్నిస్లో భారత జెండాను రెపరెపలాడించిన ఘనత మాత్రం బోపన్నకు దక్కుతుంది. రెండు దశాబ్దాలకుపైబడిన కెరీర్లో రాకెట్తో ప్రత్యర్థి జోడీలను రఫ్పాడించిన రోహన్ తాజాగా టెన్నిస్కు బైబై చెప్పాడు. న్యూఢిల్లీ: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన సుదీర్ఘ కెరీర్కు గుడ్బై చెప్పాడు. గ్రాండ్స్లామ్ డబుల్స్ సాధించిన నలుగురు భారత దిగ్గజాల్లో (పేస్, భూపతి, సానియా మీర్జా) ఒకడిగా ఎదిగిన ఈ ఆరడుగుల రాకెట్... ప్రొఫెషనల్ టెన్నిస్కు శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 45 ఏళ్ల ఈ సీనియర్ ఆటగాడు చివరి సారిగా అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్లో పారిస్ మాస్టర్స్ టోర్నీలో పాల్గొన్నాడు. ఈ వారమే జరిగిన టోర్నీలో కజకిస్తాన్ భాగస్వామి అలెగ్జాండర్ బబ్లిక్తో కలిసి పోటీపడ్డాడు. కానీ తొలి రౌండ్లోనే ఈ జోడీ ఓడిపోయింది. ఇప్పుడు అదే రౌండ్ తన కెరీర్కు ఆఖరి రౌండ్ అయ్యింది. ‘ఎ గుడ్బై... బట్ నాట్ ద ఎండ్’ (ఇక సెలవ్... కానీ ముగింపు మాత్రం కాదు సుమా) అనే టైటిల్తో భావోద్వేగ సందేశాన్ని బోపన్న విడుదల చేశాడు. ‘మీ జీవితానికి సరిపడా సాఫల్యమిచ్చిన దానికి మీరెలా వీడ్కోలు పలుకుతారు చెప్పండి? కానీ ఇరవై వసంతాల మరుపురాని ఈ పయనానికి బైబై చెప్పే సమయం ఆసన్నమైంది. అందుకే ఈ రిటైర్మెంట్. భారత్లోని కూర్గ్లాంటి ఓ చిన్న పట్టణంలో మొదలైన నా ప్రయాణం... కూర్గ్ కాఫీ తోటల్లో పడిన నా అడుగులు అంతర్జాతీయ టెన్నిస్ సర్క్యూట్లో నా కలల్ని సాకారం చేసే దాకా తీసుకొస్తాయని నేనెప్పుడూ అనుకోలేదు. ప్రపంచంలోని పెద్ద పెద్ద టెన్నిస్ ఎరెనా వెలుగుజిలుగుల్లో నా ఏస్లు పడుతుంటే నా జీవితానికి ఇంతకు మించిన సాఫల్యమేముంటుంది’ అని బోపన్న తన రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నాడు. తన విజయవంతమైన కెరీర్కు అన్ని రకాలుగా సహకరించిన కుటుంబానికి, ఇన్నేళ్ల పాటు తనతో జోడీకట్టిన భాగస్వాములకు, కోచింగ్ బృందానికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ‘ముఖ్యంగా తల్లిదండ్రుల తోడ్పాటు మరువలేనిది. సోదరి రష్మీ భుజం తట్టి ప్రోత్సహించింది. నా భార్య సుప్రియా వెన్నంటే నిలిచింది. కోర్టుల్లో విజయాలకు నాతో జతకట్టిన ప్లేయర్లు కారణమైతే, కోర్టు వెలుపల ఉన్న గ్రేటెస్ట్ భాగస్వామి ఎవరైన ఉంటే అది సుప్రియానే. నా కుమార్తె త్రిద నా ఆనందాన్ని రెట్టింపు చేసే ఆయుధం’ అని కుటుంబసభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపాడు. 2023లోనే అతను డేవిస్ కప్ నుంచి తప్పుకున్నాడు. చివరగా లక్నోలో మొరాకోతో జరిగిన డేవిస్ కప్ టైలో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. 2000లో ప్రొఫెషనల్ ఆటగాడిగా మారిన బోపన్న 2003 నుంచి 2025 వరకు 22 ఏళ్లపాటు టెన్నిస్ కోర్టుల్లో టైటిల్స్ కోసం అలుపెరగని పోరాటం చేశాడు. డేవిస్ కప్ ఆసియా ఓసియానియా మ్యాచ్లు, చెప్పలేనన్ని గ్రాండ్స్లామ్ టోర్నీలు, పలు ఒలింపిక్స్లో ఫలితాలతో సంబంధం లేకుండా చెమట చిందించాడు. ఎట్టకేలకు 2017లో ‘ఫ్రెంచ్ ఓపెన్’ మిక్స్డ్ డబుల్స్తో తన గ్రాండ్స్లామ్ కలను నెరవేర్చుకున్నాడు. కెనడాకు చెందిన గాబ్రియెలా దబ్రొస్కీతో విజేతగా నిలిచాడు. ఇక ఏకైక పురుషుల డబుల్స్ గ్రాండ్స్లామ్ టైటిల్ను మాత్రం కెరీర్ చరమాంకంలో గతేడాదే అందుకున్నాడు. మాథ్యూ ఎబ్డెన్ (ఆసీస్)తో కలిసి ఆ్రస్టేలియన్ ఓపెన్–2024లో బోపన్న తన కెరీర్కు లోటుగా ఉన్న పురుషుల డబుల్స్ను సాకారం చేసుకున్నాడు. ఈ టైటిల్తోనే బోపన్న లేటు వయసులో (43) ప్రపంచ నంబర్వన్గా నిలిచిన ఆటగాడిగా ఘనతకెక్కాడు.
బిజినెస్
ఆర్బీఐకి చేరిన 98% రూ. 2 వేల నోట్లు
ముంబై: ప్రస్తుతం రూ. 5,817 కోట్ల విలువ చేసే రూ. 2,000 కరెన్సీ నోట్లు చలామణీలో ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ డేటాలో వెల్లడైంది. ఈ నోట్లను ఉపసంహరిస్తున్నట్లు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటించింది. అప్పట్లో రూ. 3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ. 2,000 బ్యాంక్ నోట్లు ఉండగా.. 2025 అక్టోబర్ 31 నాటికి రూ. 5,817 కోట్లకు తగ్గినట్లు ఆర్బీఐ శనివారం తెలిపింది. 2023 మే 19 నుంచి చూస్తే 98.37 శాతం పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లు పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించినప్పటికీ రూ. 2,000 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతున్నాయి.
మెరుగ్గా రిటైర్మెంట్ సన్నద్ధత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా రిటైర్మెంట్ సన్నద్ధతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ స్కోరు 2022లో 44గా ఉండగా 2025లో 48కి పెరగడం దీనికి నిదర్శనం. భారతీయుల్లో ఆరోగ్యం, ఆర్థికాంశాలపై అవగాహన పెరుగుతుండటం ఇందుకు కారణంగా నిలుస్తోంది. డేటా అనలిటిక్స్ కంపెనీ కాంటార్తో కలిసి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం పట్టణ ప్రాంతాల్లోని సగం మంది ప్రజలు రిటైర్మెంట్ ప్లానింగ్ను సాధ్యమైనంత ముందుగా, 35 ఏళ్ల లోపు నుంచే ప్రారంభించాలని విశ్వసిస్తున్నారు. ఇందుకోసం ఫిట్నెస్ అలవాట్లను పెంపొందించుకోవడం, తరచుగా హెల్త్ చెకప్లు చేయించుకోవడం వంటివి చేస్తున్నారు. సర్వే ప్రకారం ఆరోగ్య బీమాను తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. అయితే, సరిపోయేంత స్థాయిలో ఆర్థికంగా బలంగా ఉండే విషయంలోనే సవాళ్లు ఉంటున్నాయి. తాము దాచుకున్న సొమ్ము రిటైర్మెంట్ తర్వాత పదేళ్ల లోపే అయిపోవచ్చేమోనని 63 శాతం మంది భావిస్తున్నారు. 37 శాతం మంది మాత్రమే రిటైర్మెంట్ పొదుపు లక్ష్యాల్లో కనీసం 25 శాతాన్ని సాధించారు. ముందు వరుసలో మహిళలు.. రిటైర్మెంట్ సన్నద్ధతలో మహిళలు, గిగ్ వర్కర్లు ముందువరుసలో ఉంటున్నారు. అయితే, ఒంటరితనం, కుటుంబంపై ఆర్థికంగా ఆధారపడాల్సి రావడంలాంటి విషయాల్లో ప్రజల్లో ఆందోళన ఉంటోంది. ఈ అంశాలపై వరుసగా 71 శాతం, 72 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయంగా చూస్తే పూర్తి స్థాయి సన్నద్ధతలో తూర్పు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండగా, కోవిడ్ తర్వాత ఆరోగ్యపరమైన రికవరీలో ఉత్తరాది మెరుగ్గా ఉంది. ఆర్థిక విషయాల్లో పశి్చమ రాష్ట్రాలు పటిష్టంగా ఉన్నాయి. అవగాహన పెరుగుతున్నప్పటికీ, సన్నద్ధత విషయంలో మాత్రం వెనుకబాటుతనం ఉంటోందని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్లు, మహిళలు, తిరిగి వచ్చిన వలసదార్లలాంటి వివిధ వర్గాల కోసం తగిన విధమైన రిటైర్మెంట్ సొల్యూషన్స్, సలహా సేవలు అవసరమని సర్వే పేర్కొంది.
టాప్ గేర్లో వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: పండుగ సీజన్కు తోడు జీఎస్టీ 2.0 సంస్కరణలు కలిసిరావడంతో అక్టోబర్లో రిటైల్ వాహన విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, కియా మోటార్స్ ఆటో కంపెనీల విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. స్కోడా ఆటో, టయోటా కిర్లోస్కర్ మోటార్లు సైతం చెప్పుదగ్గ స్థాయిలో వాహనాలను విక్రయించాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ అక్టోబర్లో 1,80,675 వాహనాలు విక్రయించింది. గత ఏడాదిలో అమ్ముడైన 1,63,130 వాహనాలతో పోలిస్తే ఇది 11% అధికం. విదేశాలకు చేసిన ఎగుమతులు(31,304), ఇతర సంస్థలకు అమ్మకాలు(8,915) కలిపి మొత్తం విక్రయాలు 2,20,894 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘‘మునుపెన్నడూ లేనంతగా ఒక్క అక్టోబర్లోనే 2,42,096 యూనిట్లు రిటైల్ అమ్మకాలు జరిపాయి. గతేడాదితో పోలిస్తే ఇవి 20% అధికం. నవరాత్రుల ప్రారంభం నుంచి పండగ సీజన్ 40 రోజుల్లో 5 లక్షల బుకింగ్స్, 4.1 లక్షల రిటైల్ వాహనాలు విక్రయించాము. గతేడాది మొత్తం అమ్మకాలతో పోలిస్తే ఇవి రెట్టింపు. జీఎస్టీ సంస్కరణలకు ముందు తొలిసారిగా కార్లు కొనే కస్టమర్లకు కొన్ని సవాళ్లు ఉండేవి. సంస్కరణల అమలు తర్వాత అధిక సంఖ్యలో వినియోగదారలు షోరూంలను సందర్శిస్తున్నారు’’ అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. → మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయంగా రికార్డు స్థాయిలో 71,624 ఎస్యూవీలను విక్రయించింది. గతేడాది అక్టోబర్లో అమ్మకాలు 54,504 యూనిట్లతో పోలిస్తే ఇవి 31% అధికం. ఎస్యూవీలు ఒక నెలలో ఈ స్థాయిలో అమ్ముడుపోవడం ఇదే తొలిసారి అని కంపెనీ నళినికాంత్ గొల్లగుంట తెలిపారు. → టాటా ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మొత్తం 61,295 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 48,423 యూనిట్లతో పోలిస్తే విక్రయాల్లో 26.6% వృద్ధి నమోదైంది. ఇందులో 47 వేల యూనిట్లు ఎస్యూవీలున్నాయి. → హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం 69,894 వాహనాలను విక్రయించింది. గతేడాది అక్టోబర్లో అమ్మిన 53,792 యూనిట్లతో పోలిస్తే ఇవి 30% అధికం. దేశీయ విక్రయాలు మాత్రం 3% క్షీణించి 55,568 నుంచి 53,792 యూనిట్లకు దిగివచ్చాయి. అయితే మార్కెట్లోని డిమాండ్కు తగ్గట్లు క్రెటా, వెన్యూ విభాగంలో 30,119 ఎస్యూవీలను విక్రయించింది. ‘‘దసరా, ధన్తేరాస్, దీపావళి పండుగలతో డిమాండ్ నెలకొంది. జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలు కూడా వీటికి తోడు కావడంతో అక్టోబర్లో భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ మరింత కాంతులీనింది’’ అని హెచ్ఎంఐఎల్ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. → కియా ఇండియా కూడా మెరుగైన అమ్మకాలను నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే 30 శాతం వృద్ధితో 29,556 పాసింజర్ వాహనాలను విక్రయించింది. సోనెట్, కారెన్స్ క్లావిస్, కారెన్స్ క్లావిస్ ఈవీ, సెల్టోస్ మెరుగైన విక్రయాలకు దోహదపడ్డాయి. ‘‘కియా ఇండియా ప్రయాణంలో 2025 అక్టోబర్ ఒక చారిత్రాత్మక మైలురాయి. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మా ఉత్పత్తుల పోర్ట్ఫోలియో ఉంటుంది’’ అని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సోద్ తెలిపారు. → స్కోడా ఆటో ఇండియా 8,252 యానిట్ల కార్లను విక్రయించింది. ఈ ఏడాది తొలి పదినెలల్లో (జనవరి–అక్టోబర్) 61,607 యూనిట్లను అమ్మింది. కంపెనీ ఒక ఏడాదిలో అత్యధిక అమ్మకాలు (2022లో) 53,721 యూనిట్లను అధిగమించడం విశేషం.
పెళ్లిళ్ల సీజన్: రూ.6.5 లక్షల కోట్ల బిజినెస్!
భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 14 వరకు దేశంలో దాదాపు 48 లక్షల వివాహాలు జరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా. ఈ సీజన్లో సుమారు రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని తన నివేదికలో వెల్లడించింది.కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT).. తన పరిశోధన విభాగం సీఏఐటీ రీసెర్చ్ & ట్రేడ్ డెవలప్మెంట్ సొసైటీ (CRTDS) ద్వారా విడుదల చేసిన నివేదికలో.. పెళ్లిళ్ల సీజన్ భారతదేశ ఆర్ధిక వ్యవస్థకు భారీ ఊరటను ఇవ్వనుంది. బంగారం, రత్నాలు, దుస్తులు, క్యాటరింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్, ట్రావెల్స్ & హాస్పిటాలిటీ, డెకరేషన్ మొదలైన రంగాల వ్యాపారాలు గణనీయంగా పెరుగుతాయని స్పష్టం చేసింది.ఈ సంవత్సరం ఢిల్లీలో మాత్రమే 4.8 లక్షల వివాహాల ద్వారా రూ.1.8 లక్షల కోట్లు వ్యాపారం జరుగుతుందని అంచనా. గత సంవత్సరం ఇదే కాలంలో దేశంలో జరిగిన మొత్తం వివాహాల సంఖ్య సమానంగా ఉన్నప్పటికీ.. ఈసారి ఖర్చు మాత్రం గణనీయంగా పెరుగుతుంది. దీనికి కారణం వస్తువులు, బంగారు ఆభరణాల ధరలు పెరగడమే అని CAIT సెక్రటరీ జనరల్ అండ్ చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు.గతంలో జరిగిన వివాహాలు & వ్యాపారం➤2024: 48 లక్షల వివాహాలు, రూ. 5.9 లక్షల కోట్ల వ్యాపారం➤2023: 38 లక్షల వివాహాలు, రూ. 4.74 లక్షల కోట్ల బిజినెస్➤2022: 32 లక్షల వివాహాలు, రూ. 3.75 లక్షల కోట్ల వ్యాపారంఇదీ చదవండి: తండ్రి మత్స్యకారుడు.. కొడుకు బుర్జ్ ఖలీఫా ఓనర్
ఫ్యామిలీ
వాసా ప్రీవియా ఉంటే సాధారణ ప్రసవం అవ్వడం కష్టమా..?
నేను ఎనిమిది నెలల గర్భవతిని. స్కాన్లో నాకు వాసా ప్రీవియా ఉందని తేలింది. సాధారణ ప్రసవం కాకుండా సిజేరియన్ చేసే అవకాశం ఎక్కువ ఉందని డాక్టర్ చెప్పారు. అయితే, సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఏమైనా ఉందా? చెప్పండి? – రమ్య, నెల్లూరు. వాసా ప్రీవియా అనేది గర్భధారణలో అరుదుగా వచ్చే ఒక పరిస్థితి. ఈ సమయంలో బొడ్డు తాడు లేదా మాయ, శిశువు రక్తనాళాలు రక్షణ లేకుండా గర్భాశయం ముఖద్వారం పైన లేదా దాని దగ్గరగా ఉంటాయి. ప్రసవ సమయంలో ఇవి పగిలితే, తీవ్రమైన రక్తస్రావం జరగవచ్చు, ఇది చాలా ప్రమాదకరం. ఈ రక్తనాళాలు పగిలితే తీవ్ర రక్తస్రావం జరిగి, శిశువు ప్రాణానికి ప్రమాదం ఏర్పడవచ్చు. వాసా ప్రీవియాకు కచ్చితమైన కారణం తెలియదు. కాని, కొన్ని పరిస్థితులు ఈ సమస్య వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. మాయ తాడు గర్భాశయం దిగువలో ఉండటం, బొడ్డు తాడు మధ్యలో కాకుండా పక్కకు మాయ తాకడం, చిన్న అనుబంధ మాయ ఉండటం లేదా కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఉపయోగించడం వలన వాసా ప్రీవియా వచ్చే ప్రమాదం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వాసా ప్రీవియాను సకాలంలో గుర్తించడం చాలా అవసరం. సాధారణంగా దీనిని త్రైమాసికంలో స్కాన్లోనే గుర్తించవచ్చు. ఈ సమయంలో ప్రత్యేక లక్షణాలు కనిపించవు. కాని, ఈ పరిస్థితిని గుర్తించకపోతే, ప్రసవానికి ముందు లేదా ప్రసవ సమయంలో రక్తనాళాలు పగిలి శిశువు వేగంగా రక్తాన్ని కోల్పోవచ్చు. తీవ్రమైన రక్తస్రావం వల్ల శిశువుకు ఆక్సిజన్ తగలకపోవడం, మెదడు దెబ్బతినడం లేదా గర్భంలోనే శిశువు మరణించడం కూడా సంభవించవచ్చు. గర్భధారణ సమయంలో వాసా ప్రీవియా ఉన్నట్లు గుర్తించిన వెంటనే పనులు తగ్గించుకోవాలి. లైంగిక సంబంధానికి దూరంగా ఉండాలి, కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరి, నిశితంగా పర్యవేక్షణలో ఉండటం అవసరం. వాసా ప్రీవియా ఉన్న చాలా సందర్భాల్లో, శిశువుకు రక్తస్రావ ప్రమాదం తగ్గే విధంగా 34 నుంచి 36 వారాల మధ్య నిర్ణీత సిజేరియన్ ప్రసవం చేస్తారు. అవసరమైతే శిశువు ఊపిరి తిత్తులు పూర్తిగా పెరగడానికి స్టెరాయిడ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రసవ సమయంలో కూడా వాసా ప్రీవియా ఉన్నట్లు అనుమానం ఉంటే, శిశువు భద్రత కోసం అత్యవసర సిజేరియన్ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో బిడ్డకు రక్త మార్పిడి అవసరమవుతుంది. వాసా ప్రీవియాను పూర్తిగా నివారించలేరు కాని, నిరంతర చెకప్ ద్వారా దీన్ని ముందుగానే గుర్తించి, ప్రమాదాలను తగ్గించవచ్చు. ఇలా చేయడం ద్వారా శిశువుకు హాని లేకుండా, సురక్షితంగా జన్మించే అవకాశం ఎక్కువ అవుతుంది. కాబట్టి, సాధారణ ప్రసవం లేదా సిజేరియన్ అనే తేడా లేకుండా, ముందే సిజేరియన్కు మానసికంగా సిద్ధంగా ఉండటమే మంచిది. ఆ వ్యాధులు మహిళల్లోనే ఎక్కువశాశ్వత పరిష్కారం లేని వ్యాధుల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధులనే ముందు వరుసలో చెప్పుకోవాలి. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పొరబడి ఆరోగ్యవంతమైన కణాల మీద దాడి చేయడం వల్ల రకరకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు తలెత్తుతుంటాయి. రుమాటాయిడ్ ఆర్థరైటిస్, టైప్–1 డయాబెటిస్, లూపస్, గ్రేవ్స్ డిసీజ్, మల్టిపుల్ స్లె్కరోసిస్, సొరియాసిస్, సొరియాటిక్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులకు లోనైన వారు జీవితాంతం వాటికి మందులు వాడుతూ, చికిత్స కొనసాగించాల్సిందే! ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో పురుషుల కంటే మహిళల సంఖ్యే ఎక్కువని తాజా పరిశోధనల్లో తేలింది. ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 70 శాతం మహిళలేనని ఇండియన్ రుమాటాలజీ అసోసియేషన్ 40వ వార్షికోత్సవ నివేదిక ఇటీవల వెల్లడించింది. వీరిలో 20–50 సంవత్సరాల లోపు వయసులో ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని తెలిపింది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధులు చాలా సర్వసాధారణంగా కనిపిస్తున్నట్లు ఇటీవల స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధన కూడా వెల్లడించింది. జన్యు కారణాలు, పునరుత్పాదక వయసులో ఉన్న మహిళల్లో సంభవించే హార్మోన్ మార్పులు, గర్భధారణ, ప్రసవం వల్ల కలిగే మానసిక ఒత్తిడి, పోషకాహార లోపాలు, స్థూలకాయం వంటివి మహిళల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధులకు కారణం కావచ్చని భావిస్తున్నట్లు ఢిల్లీ ‘ఎయిమ్స్’లోని రుమాటాలజీ విభాగాధిపతి డాక్టర్ ఉమా కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ అంశమై కారణాలను కచ్చితంగా గుర్తించడానికి మరింతగా పరిశోధనలు జరగాల్సి ఉందని ఆమె అన్నారు.డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ‘చుక్క’బీరు.. చుక్కల్లో ధర..)
స్క్రోలాటం చిట్టి రీల్స్.. గట్టి ఆదాయం
నవ్వించు, ప్రేరేపించు, షేర్ చేయించు ఇవన్నీ రెండు నిమిషాల్లోనే! ఇక్కడ సమయం తక్కువ, ఐడియాలు ఎక్కువ. కాని, పవర్ మాత్రం మ్యాక్స్! టైమింగ్లో రీల్స్ కంటే ఎక్కువ, షార్ట్ ఫిల్మ్ కంటే తక్కువ. కానీ, ఫుల్ ఎంటర్టైన్ మెంట్, ఫుల్ ఇంపాక్ట్, ఫుల్ మనీ! అవే, ఈ టూ మినిట్స్ వీడియోల చిన్న సినిమాలు! అందుకే, ఇవి రీల్స్నే కాదు, రియల్ లైఫ్లోనూ ఫాస్ట్ ఇంపాక్ట్ ఇస్తున్నాయి.చిన్న వీడియోల పెద్ద హంగామాఒకప్పుడు సినిమా థియేటర్లో మూడు గంటలు కూర్చుని ఒక కథ చూస్తే, ఇప్పుడు అదే ఎమోషన్, అదే మెసేజ్, అదే ఫీల్ను రెండు నిమిషాల వీడియోలోనే చూస్తున్నాం! కారణం? డిజిటల్ ప్రపంచం వేగంగా పరుగులు తీస్తోంది. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు, డేటా ఇవన్నీ కలసి మనకు రీల్స్ స్క్రోలింగ్ అనే ఒక కొత్త అలవాటు తెచ్చాయి. ఇప్పుడు ఆ రీల్సే కాస్త పెద్దవై షార్ట్ స్క్రోలింగ్ సినిమాలుగా మారాయి. అందుకే, ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, జోష్, మోజ్ ఏ యాప్ తెరిచినా ఒక్కో స్క్రోల్లోనే నవ్వు, డ్రామా, పాట, డ్యాన్ ్స, ట్రెండ్, ఎమోషన్ అన్నీ మీ చేతిలోకి వస్తున్నాయి, అది కూడా రెండు నిమిషాల్లోనే! ఇంతలోనే వాటికి మిలియన్ల వ్యూస్, కోట్ల లైక్స్, సూపర్స్టార్ ఫేమ్. ఈ రెండు నిమిషాల ఫేమ్తో లక్షల ఆదాయం కూడా వస్తోంది.ఎందుకు ఈ పిచ్చి?మనిషి మైండ్ ఇప్పుడు ఫాస్ట్ మోడ్లో ఉంది. తక్కువ టైమ్లో ఎక్కువ ఎంటర్టైన్ మెంట్ కావాలని కోరుకుంటోంది. పది నిమిషాల వీడియో ఎవరు చూస్తారు? అదే తొంభై సెకన్లలో నవ్వు, ప్రేమ, డ్యాన్ ్స, డ్రామా అన్నీ ఇస్తే, దాన్ని మిస్సవ్వడం కష్టం! అందుకే మనసు వెంటనే ‘నెక్ట్స్’ అంటుంది. ఇదే డోపమైన్ లూప్. ప్రతి స్క్రోల్లో చిన్న సంతోషం, ప్రతి వీడియోలో కొత్త హిట్. సైకాలజిస్టుల మాట ప్రకారం, చిన్న వీడియోలు మన మెదడులో ‘ఇన్ స్టంట్ రివార్డ్’ ఫీలింగ్ కలిగిస్తాయి. అందుకే మనం ‘ఇంకో వీడియో మాత్రమే’ అని మళ్లీ మళ్లీ స్క్రోల్ చేస్తూనే ఉంటాం! వీటిలో యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్కు ఎక్కువ క్రేజ్ రావడంతో, క్రియేటర్లు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్, వీడియోస్ కంటే రీల్స్లోనే తమ క్రియేటివిటీతో కథలను సృష్టిస్తున్నారు. అలా ‘ఒక్క నిమిషం చాలదు, రెండు నిమిషాలైనా ఇవ్వండి!’ అని క్రియేటర్లు డిమాండ్ చేసినప్పుడు, యూట్యూబ్ ‘సరే! మీకు 180 సెకన్లు!’ అని అంగీకరించింది. ఈ నేపథ్యం వలనే వివిధ రకాల సోషల్ మీడియా యాప్స్ కూడా ఈ రెండు, మూడు నిమిషాల వీడియోలకు ఆసక్తి చూపించడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం, టిక్టాక్, యూట్యూబ్ షార్ట్స్ నిడివి మూడు నిమిషాల వరకు పొడుగవుతుండగా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా పొడవవుతున్నాయి! అలా ఇప్పుడు ప్రపంచం మొత్తం టూ మినిట్స్ రివల్యూషన్ మొదలైంది. క్విక్ కరెన్సీగా!వాణిజ్య ప్రకటనలు అంటే పెద్ద క్యాంపెయిన్, టీవీ యాడ్స్, బిల్బోర్డులను అనుకుంటే, ఇప్పుడు అవి మొబైల్లో ఒక్క స్క్రోల్తో సరిపోతుంది! మార్కెటింగ్ ఇప్పుడు డైలాగ్ కాదు, రెండు నిమిషాల డ్రామాగా మారింది. ఫ్లిప్కార్ట్ రీల్స్లో డిస్కౌంట్ చెబుతుంది, స్విగ్గీ రీల్స్లో కర్రీ చూపిస్తుంది, మీషో రీల్స్లో సేల్స్ పెంచుతుంది! పక్కా మార్కెటింగ్ కన్సల్టెంట్స్ అందరూ ఇదే మంత్రం ‘ప్రోడక్ట్ ఎంత గొప్పదో కాదు, రెండు నిమిషాల్లో ఎవరి మనసు దోచుకుంటామో అదే బ్రాండ్ సక్సెస్!’ అంటున్నారు. వీటికి కంటెంట్ క్రియేటర్స్, ఇన్ ఫ్లుయెన్సర్స్ తోడవటంతో, బ్రాండ్స్కు క్రియేటర్లకు షార్ట్ వీడియోలు ఒక క్విక్ కరెన్సీగా మారాయి. స్టార్టప్స్ కూడా ఈ షార్ట్ వీడియోస్ ఆధారంగా కస్టమర్ను కట్టిపడేస్తున్నాయి. సంక్లిష్టమైన టెక్నాలజీని కేవలం రెండు నిమిషాల్లో అర్థమయ్యేలా చూపించి, మార్కెటింగ్లో కొత్త ఫ్యాషన్ క్రియేట్ చేశారు. మార్కెటింగ్ నిపుణుల ప్రకారం, 2026 నాటికి ప్రపంచం చూసే కంటెంట్లో 70 శాతం షార్ట్ వీడియోలే ఉంటాయి. సినిమా ట్రైలర్లు, యూనివర్సిటీ క్యాంపెయిన్లు, ఏ సందేశాలు అయినా ఇప్పుడు రీల్ రూట్లోనే అందరికీ చేరుతున్నాయి.అంతర్జాతీయ స్థాయిలో..ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘స్క్రోల్, ప్లే, షేర్!’ అనే రిథమ్లో నడుస్తోంది. అందుకే, ప్రపంచ వ్యాప్తంగా టిక్టాక్, యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్, క్వాయ్, మోజ్, జోష్ కలిపి 80 శాతం మొబైల్ డేటా వినియోగానికి కారణం. ఈ కారణంగానే 2020లో యూజర్లు రోజుకు సుమారు 35 నిమిషాలు స్క్రోల్ చేస్తే, ఇప్పుడు 80 నిమిషాలు స్క్రోల్ చేస్తున్నారట! అందులో మన దేశం ముందు వరుసలో ఉంది. రోజుకు సుమారు 65 కోట్ల మంది యూజర్లు ఈ షార్ట్ వీడియోస్ వీక్షిస్తారు. ముఖ్యంగా తెలుగు, తమిళం, హిందీ వంటి ప్రాంతీయ భాషల కంటెంట్కు డిమాండ్ ఎక్కువ. అందుకే, స్థానిక క్రియేటర్లు ఇప్పుడు గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్లుగా ఎదుగుతున్నారు. ఈ నేపథ్యంలో, ‘2025 గ్లోబల్ షార్ట్ వీడియోస్ ట్రెండ్స్’ సర్వే ప్రకారం, వివిధ సంస్థలు పరిశీలించిన ఫలితాలను వెల్లడి చేశారు. వివిధ మొబైల్ యాప్ల డేటా, యూజర్ సర్వేలు, సోషల్ మీడియా విశ్లేషణల ద్వారా, ఒక్కో దేశంలో ప్రత్యేక కంటెంట్, ట్రెండ్స్ స్పష్టమయ్యాయి. ప్రతి చోటా స్థానిక భాషలు, సంస్కృతులు ఆధారంగా షార్ట్ వీడియోలు కొత్త దారులు సృష్టిస్తున్నాయి.డబుల్ లైఫ్!ఉదయం బాస్ ‘మీటింగ్ టైమ్’ అంటాడు, రాత్రి ఫాలోవర్స్ ‘రీల్ టైమ్’ అంటారు! ఇలా రెండు ప్రపంచాల మధ్య బ్రిడ్జ్ వేసుకుని నడుస్తున్నవారే డబుల్ లైఫ్ ఇన్ ఫ్లుయెన్సర్లు! పగలు ఆఫీస్లో ప్రెజెంటేషన్ ్స చేసి, రాత్రి కెమెరా ముందు ప్రెజెన్ ్స ఇస్తున్నారు. ఇలా ఇండియాలో ఇప్పటి వరకు 45 లక్షల షార్ట్ వీడియో క్రియేటర్లు ఉన్నారని, వారిలో దాదాపు 60 శాతం మంది ప్రైవేట్ ఉద్యోగులు లేదా ఫ్రీలాన్సర్లు అని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. ప్రపంచం మొత్తం చూస్తే, సోషల్ మీడియాలోని క్రియేటర్లలో 40 శాతం మంది రెండు ఉద్యోగాలు చేస్తున్నార ని అంచనా. వీరిలో దాదాపు 6 లక్షల మంది క్రమంగా వీడియోల ద్వారా ఆదాయం పొందుతున్నారు. అంటే పగలు జీతం, రాత్రి వైరల్ వీడియోల ఆదాయం! దీంతో చాలామంది ప్రొఫెషనల్ ఉద్యోగం కంటే ఈ సైడ్ ఇన్ కమ్ పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆఫీస్లో ఇంక్రిమెంట్ రాకపోయినా, రీల్లో ఎంగేజ్మెంట్ పెరుగుతుంది! అందుకే, ఒక్క రీల్ సక్సెస్ అయితే నెల జీతం కన్నా ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది. వీరంతా ప్రతిరోజూ ల్యాప్టాప్ బ్యాగ్లో లంచ్ బాక్స్తో పాటు మరో పక్క ట్రైపాడ్తో ఆఫీస్లకు వెళ్తూ, ఒక కొత్త వర్క్ కల్చర్తో పనిచేస్తున్నారు. మరికొందరు ‘వర్క్ ఫ్రమ్ ఆఫీస్’ మాదిరి ‘వర్క్ ఫ్రమ్ రీల్’ అనే కొత్త ఫుల్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారు! ఇలా వచ్చిన పాపులారిటీతో టీవీ షోలు, ఇంటర్వ్యూలు, బ్రాండ్ కొలాబరేషన్లు, సిల్వర్ స్క్రీన్ చాన్ ్సలు కూడా దక్కించుకుంటున్నారు. ఇలా సాధారణ ఉద్యోగుల కంటే వీరి జీవితం ఇప్పుడు మరింత ఆదాయభరితంగా, ఆనందభరితంగా, వైరల్గా మారింది. ఏఐ క్రియేటర్లు! ఇప్పటి క్రియేటర్లకు కెమెరా మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్స కూడా పెద్ద సహాయంగా మారింది. వీడియో తీసేందుకు డైరెక్టర్, ఎడిటర్, మ్యూజిక్ డిజైనర్ అవసరం లేదు. ఏఐ వాయిస్, ఫేస్ ఫిల్టర్, స్మార్ట్ ఎడిటింగ్ యాప్లు ఇవే కొత్త టెక్నాలజీ టీమ్ మెంబర్స్. ఒక క్లిక్తో బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది, వాయిస్ టోన్ అడ్జస్ట్ అవుతుంది, మూడ్కి సరిపోయే మ్యూజిక్ వచ్చేస్తుంది. కెమెరా ముందు ఉన్నది మనిషే కాని, వెనుక ఆలోచిస్తున్నది మొత్తం ఏఐనే. ఇదే కారణంగా ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ల వేగం పెరిగింది. ఒకప్పుడు వీడియోకి రోజులు పట్టేది, ఇప్పుడు నిమిషాల్లో సిద్ధమవుతోంది!రీల్లోనే ఫీల్స్, డ్రీమ్స్! బ్రేక్అప్ అయినా, బర్త్డే అయినా ఇప్పుడు ప్రతి ఒక్క సందర్భానికి రీల్ తప్పనిసరి! ముఖ్యంగా 16 నుంచి 25 ఏళ్ల వయసు వారు ‘రియల్ లైఫ్ కంటే రీల్ లైఫ్ బెటర్!’ అని నమ్ముతున్నారు. సినిమా చూడటానికి ఓపిక లేదు కానీ, రీల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ‘ఒక్క నిమిషం లవ్ స్టోరీ’, ‘30 సెకండ్ల అడ్వెంచర్’, ‘45 సెకండ్ల ట్రాజెడీ’ ఇవే ఇప్పుడు న్యూ ఏజ్ బ్లాక్బస్టర్స్! జెన్ జీ కి రీల్ అంటే భాష కాదు లైఫ్ స్టయిల్. ఇదే కారణంగా ఈ వయసు వారు సోషల్ మీడియాలో అత్యధికంగా యాక్టివ్గా ఉంటున్నారు. ఫ్యాషన్ నుంచి ఫుడ్ వరకూ, ట్రావెల్ నుంచి ట్రెండ్ వరకూ అన్నీ వీళ్ల చేతుల్లోనే! అందుకే, అసలైన వైరల్ పవర్ కూడా వీరివద్దే దాగుంది. ప్రాంతీయ భాషల శక్తిప్రపంచం ఇంగ్లీష్లో మాట్లాడినా, సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రాంతీయ భాషలే రాజ్యం చేస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో ఉన్న కంటెంట్ ఎక్కువగా వైరల్ అవుతోంది.వీక్షకులు తమ భాషలో ఉన్న కంటెంట్కి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ఇందుకే ఇప్పుడు ప్రతి యాప్ కూడా ‘మీ భాషలో రీల్ క్రియేట్ చేయండి’ అని ప్రోత్సహిస్తోంది. తెలుగు క్రియేటర్ల రీల్స్ ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్స్లోకి చేరాయి!రేపటి రియాలిటీ!భవిష్యత్తులో షార్ట్ వీడియోల ప్రపంచం మరింత టెక్ రిచ్గా మారబోతోంది. త్రీడీ వీడియోలు, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ కంటెంట్ ఇవే రేపటి రీల్స్. క్రియేటర్లు ఇప్పుడు కెమెరాతో కాదు, మెటావర్స్లో రికార్డు చేయబోతున్నారు! అప్పుడు ప్రేక్షకులు కేవలం వీడియో చూడరు, దానిలోకి అడుగుపెడతారు. అంటే రేపటి రీల్ కేవలం వినోదం కాదు. ఒక వాస్తవిక అనుభవం అవుతుంది! ఇప్పటికే కొంతమంది క్రియేటర్లు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు కూడా. త్వరలోనే రీల్స్ చూడటం కాదు, అందులో జీవించబోతున్నాం. భవిష్యత్తులో రెజ్యూమేలో డిగ్రీ కాదు. ఫాలోవర్స్ కౌంటే కెరీర్ డిసైడ్ చేస్తుందేమో! హై పెయిడ్ జాబ్స్లో షార్ట్ వీడియో క్రియేటర్ ఒకటిగా మారచ్చు కూడా! అప్పుడు, డాక్టర్ రీల్ మధ్యలో ఆపరేషన్ చేస్తాడు. లాయర్ వాదన మధ్యలో ‘లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్!’ అంటాడు. టీచర్ కూడా కెమెరా ముందు ‘టుడేస్ ట్రెండ్!’ అని క్లాస్ మొదలుపెడుతుంది. ఇలా చాలామంది కంటెంట్ క్రియేటర్నే మెయిన్ జాబ్గా, మిగతా ఉద్యోగాలను పార్ట్టైమ్లా చేస్తారేమో!కిచెన్ నుంచి కెమెరా వరకు!భారతదేశంలో షార్ట్ వీడియోల రంగంలో మహిళల సంఖ్య ఆశ్చర్యకరంగా పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం 40 శాతం పైగా షార్ట్ వీడియో క్రియేటర్లు మహిళలే! వంటింటి కథల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ టిప్స్, ఫ్యాషన్ నుంచి ఫిట్నెస్ వరకు, మహిళలు కంటెంట్ ప్రపంచాన్ని కొత్తగా మలుస్తున్నారు. ఇప్పుడు వాళ్లు కేవలం కంటెంట్ క్రియేటర్లు మాత్రమే కాదు, బ్రాండ్ అంబాసిడర్లు, ఇన్ ఫ్లుయెన్సర్లు, స్టార్టప్ ఫేస్లు కూడా అయ్యారు.లక్షల్లో ఆదాయం!చూస్తున్న వీడియోలు కేవలం రెండు నిమిషాలే అయినా, క్రియేటర్లకు మాత్రం లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతుంది. ఇందులో ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న క్రియేటర్ మార్కెట్. 2019లో షార్ట్ వీడియో మార్కెట్ విలువ 1.3 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2025 నాటికి అది 3 బిలియన్ డాలర్లకు చేరనుందని అంచనా. 2027 నాటికి ఇండియాలో క్రియేటర్ ఎకానమీ 45,000 కోట్ల రూపాయల విలువకు చేరనుంది. అందుకే మార్కెటింగ్ కూడా రీల్ ఫార్మ్లోకి వచ్చేసింది. రెండు నిమిషాల్లో బ్రాండ్ కథ చెప్పగలిగిన వారే గెలుస్తున్నారు. ఒక్క స్క్రోల్కి కోట్ల రూపాయల మార్కెట్– ఇదే కొత్త డిజిటల్ వండర్! ఈ కారణంగానే ఇండియాలో ఇప్పటికే పదకొండు వేలకు పైగా చానెల్స్ మిలియన్ల సబ్స్క్రైబర్లు దాటాయి. రోజూ కోటాను కోట్ల వ్యూస్! అంటే ఒక్కొక్క షార్ట్ వీడియో చూస్తే, మన ఫింగర్స్ స్క్రోల్ చేస్తూ ‘ఓ మై గాడ్!’ అని చెప్పాల్సిందే. మనీకంట్రోల్ సంస్థ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం, ప్రస్తుతం 45 లక్షల ఇండియాలో క్రియేటర్లలో సుమారు 6 లక్షల మంది డబ్బు సంపాదిస్తున్నారు. వారి సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్ ఆధారంగా ఆదాయం వస్తుంది. యూట్యూబ్ గత మూడు సంవత్సరాల్లో 5.8 లక్షల కోట్ల రూపాయలు క్రియేటర్లకు చెల్లించిందట! ఎవరికి తెలుసు? ఈరోజు మీరు చూసిన చిన్న రీల్ రేపటికి లక్షలు తెచ్చే కంటెంట్ కావచ్చు!
‘చుక్క’బీరు.. చుక్కల్లో ధర..
బీరు బాబులు మగ్గుల్లో బీరు పోసుకుని గుక్కలు గుక్కలుగా తాగుతారు గాని, ఈ సీసాలో ఉన్న బీరును అలా తాగడం కుదరదు గాక కుదరదు. ఎందుకంటే, ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న బీరు సీసా. ఇందులో ఉన్నది కేవలం ఒక చుక్క బీరు మాత్రమే! గొంతు తడుపుకోవడానికైనా చాలని చుక్క బీరుతో ఈ సీసాను అసలు ఎందుకు తయారు చేశారోననేగా మీ అనుమానం? స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లోని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అతి చిన్న బీరు సీసా తయారీలో పోటీ నిర్వహించింది. ఈ పోటీలో గెలుపొందిన వారికి నగదు బహుమతితో పాటు, డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్ కేంద్రంగా పనిచేసే బహుళజాతి బీర్ల తయారీ సంస్థ ‘కార్ల్స్బర్గ్’ ప్రధాన కార్యాలయం సందర్శనకు పంపనున్నట్లు ప్రకటించింది. ఈ పోటీలో పాల్గొన్న స్వీడిష్ మినియేచర్ కళాకారిణి ఆసా స్ట్రాండ్ ‘కార్ల్స్బర్గ్’ బీరుసీసా నమూనాలోనే ధాన్యం గింజంత పరిమాణంలో ఒక్క చుక్క బీరు మాత్రమే పట్టేంత ఈ సీసాను తయారు చేసి, విజేతగా నిలిచింది. ఈమె రూపొందించిన సీసాలో ఉన్న బీరు పరిమాణం 0.05 మిల్లీలీటర్లు మాత్రమే! దీనికి బహుమతిగా చెల్లించిన మొత్తం పదివేల స్వీడిష్ క్రోన్లు (రూ.93,410) కావడం విశేషం.(చదవండి: నటి ప్రగ్యా జైస్వాల్ స్టైలింగ్ టిప్స్..! బ్లాక్ డ్రెస్ ధరించేటప్పుడు..)
నటి ప్రగ్యా జైస్వాల్ స్టైలింగ్ టిప్స్..!
ప్రగ్యా జైస్వాల్ అంటే సింపుల్ లుక్తోనే మెరిసే స్టార్.ఏ రంగులోనైనా ఏ డ్రైస్లోనైనా, కేవలం కంఫర్ట్ ఫ్లస్ కాన్ఫిడెన్స్ కలయికతో ఫ్యాషన్ స్పార్క్ చూపించే ఆమె స్టయిలింగ్ టిప్స్ మీ కోసం! జిమ్లో గంటల కొద్దీ గడపటం కంటే, శరీరానికి కావలసిన విశ్రాంతి ఇవ్వడమే ముఖ్యం. రెస్ట్, హైడ్రేషన్, హెల్తీ మీల్స్ ఇవే నా ఫిట్నెస్ సీక్రెట్స్. ఫ్యాషన్ విషయానికి వస్తే, సింపుల్, క్లాసీ లుక్స్ను ఇష్టపడతాను. రెడ్, గోల్డ్ నా ఫేవరెట్ కలర్స్. కాని, బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు వచ్చే ఆ క్లాసిక్ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. స్టయిలింగ్ ఏదైనా వాటికి కాన్ఫిడెన్స్ కలిస్తేనే అవే బెస్ట్ లుక్ అవుతాయి అని చెబుతోంది ప్రగ్యా జైస్వాల్. ఆమె ధరించిన చీర బ్రాండ్: స్వాన్ గాంధీ, ధర: రూ. 88,000, జ్యూలరీ బ్రాండ్: రాజ్వాడా జ్యూలర్స్, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. రంగురంగుల దండ!ఏ చీర వేసుకున్నా ఈజీగా సెట్ అయిపోయే సీక్రెట్ వెపన్ కావాలా? అయితే వెంటనే ఒక మల్టీకలర్డ్ నెక్పీస్ రెడీ చేసుకోండి. ఇది సాధారణ ఆభరణం కాదు, నవరత్నాల ఫ్యాషన్లో పటాకా మోడ్ ఆన్ చేసే రంగురంగుల మణుల దండ! ఎరుపు, పచ్చ, గులాబీ, ముత్యాలు అన్నీ ఒక్కటే లైఫ్లో మెరిసిపోతూ, ‘నిన్ను చూడగానే దేవతా వైబ్ వచ్చిందమ్మా!’ అని చెప్పించే మ్యాజిక్ ఇది. ఏ రంగు చీర వేసుకున్నా ఈ మల్టీకలర్డ్ నెక్లెస్ ఆటోమేటిక్గా మ్యాచ్ అయిపోతుంది. నలుపు చీర వేసుకుంటే నయగారంగా, పసుపు చీర వేసుకుంటే పండుగలా మారిపోతుంది! జుట్టు బన్ వేసుకుంటే ఈ నెక్లెస్ మెడ చుట్టూ మెరిసిపోతూ లుక్ను హైలైట్ చేస్తుంది. ఓపెన్ హెయిర్ అయితే కంఫర్ట్ ఫీల్తో కూల్ లుక్ ఇస్తుంది. చెవుల్లో చిన్న జుంకాలు పెయిర్ చేస్తే లుక్కి ఫుల్ మార్క్స్. లిప్ కలర్ని నెక్లెస్లోని ఏదో ఒక స్టోన్ షేడ్కి మ్యాచ్ చేస్తే ఇక మీ లుక్ సూపర్హిట్ అనిపించక మానదు. (చదవండి: ఈత కొడుతూ ఫ్లూట్ వాయిస్తూ.. ప్రపంచ రికార్డు !)
ఫొటోలు
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 02-09)
'జటాధర' ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడిగా చిత్ర యూనిట్ (ఫోటోలు)
హ్యాపీ బర్త్ డే మై లవ్.. ప్రియురాలితో హృతిక్ రోషన్ (ఫొటోలు)
మహేశ్ ఫ్యామిలీ నుంచి రాబోయే 'సినీ' వారసులు (ఫొటోలు)
భర్త పుట్టినరోజు.. వింటేజ్ ఫొటోలతో సమీరా రెడ్డి (ఫొటోలు)
పెళ్లిరోజు.. మెగా కోడలు లావణ్య ఇంట్రెస్టింగ్ పోస్ట్ (ఫొటోలు)
కాజల్ అగర్వాల్ పెళ్లయి ఐదేళ్లు.. పోస్ట్ వైరల్ (ఫొటోలు)
‘మాస్ జాతర’ సినిమా రిలీజ్..ట్రెండింగ్ లో శ్రీలీల (ఫొటోలు)
అద్భుతమైన చరిత్ర గల కొండపల్లి కోట (ఫొటోలు)
హైటెక్స్లో అట్టహాసంగా కామికాన్ డ్రీమ్హాక్–2025 ఫెస్ట్ సందడి (ఫొటోలు)
అంతర్జాతీయం
ఐరాసలో మిథున్రెడ్డి
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ లోక్సభ పక్షనేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశంలో భారత్ తరఫున ఆయన తాజాగా ప్రసంగించారు(Mithun Reddy UN Speech). న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం ఇందుకు సంబంధించిన ప్రసంగాన్ని పోస్ట్ చేసింది.అంతర్జాతీయ లా కమిషన్ ఆరవ కమిటీ పని నివేదికపై ఆయన భారత ప్రతినిధిగా మాట్లాడారు. పైరసీ, సాయిధ దోపిడి నిరోధానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలాగే.. ప్రభుత్వ అధికారుల ఇమ్యూనిటీ ముసాయిదా నిబంధనలపై భారత్ అభ్యంతరాలను మిథున్రెడ్డి తెలియజేశారు. ఆయన ప్రసంగం.. ‘‘పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని భారత్ విశ్వసిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో భారత్ వ్యవస్థాపక సభ్య దేశం. ఐక్యరాజ్యసమితి విధివిధానాలకు మా దేశం కట్టుబడి ఉంది. వర్తకం, పెట్టుబడులలో తలెత్తే వివాదాల పరిష్కారాలకు ఐక్యరాజ్యసమితి విధానాలకు అనుగుణంగా పనిచేస్తోంది. ఆర్బిట్రేషన్, ప్రత్యామ్నాయ పరిష్కార విధానాల ద్వారా సమస్యలను పరిష్కరిద్దాం#IndiaAtUNHon’ble MP @MithunReddyYSRC delivered 🇮🇳’s statement on Report of the work of International Law Commission in the Sixth Committee. He highlighted India’s reservations on draft provision concerning Immunity of State Officials. Underscored the use of new… pic.twitter.com/urrgNyM2pM— India at UN, NY (@IndiaUNNewYork) October 31, 2025.. అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల మధ్య వివాదాలను కూడా ఇలాంటి పద్ధతుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చు. వ్యక్తిగత మానవ హక్కులు, న్యాయ సౌలభ్యం, అంతర్జాతీయ సంస్థల స్వతంత్ర పని విధానాల మధ్య సమతుల్యత అవసరం. అంతర్జాతీయ సంస్థల మధ్య వివాదాల పరిష్కార సమయంలో దౌత్యపరమైన రక్షణలు అవసరం. అలాగే.. .. పైరసీ, ఆయుధాల దోపిడి నిరోధానికి సమగ్రమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ అవసరం ఉంది. అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను సమగ్రంగా తయారు చేయాలి. కొత్త టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా వీటిని నిరోధించాలి. ఆయుధాల దోపిడీ నిరోధానికి సముద్ర చట్టాలను పరిగణలోకి తీసుకోవాలి. అంతర్జాతీయ చట్టాలను పరిగణలోకి తీసుకొని సముద్రంలో జరిగే ఆయుధాల దోపిడి నివారించాలి.. స్టేట్స్ సక్సేషన్ విషయంలో పారదర్శక విధానాలు అవసరం. ఈ అంశంలో భీమల్ , పటేల్ నేతృత్వంలో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును భారత్ స్వాగతిస్తోంది. జఠినమైన ఈ అంశంలో స్పష్టమైన పాలనాపరమైన విధివిధానాలు అవసరం’’ అని మిథున్రెడ్డి అన్నారు.
కెనడాలో భారతీయుడికి 25 ఏళ్ల జైలు శిక్ష
ఒట్టావా: ఓ హత్య కేసులో భారత సంతతి వ్యక్తికి కెనడా న్యాయస్థానం 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మూడేళ్ల క్రితం బాల్రాజ్ బస్రా(25)పై నమోదైన ఆరోపణలు రుజువు కావడంతో మంగళవారం బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2022 అక్టోబర్ 17వ తేదీన యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాకు చెందిన గోల్ఫ్క్లబ్ ప్రాంతంలో చోటుచేసుకున్న విశాల్ వాలియా(38) హత్య ఘటనలో శిక్ష పడిన వారిలో బాల్రాజ్ మూడో వ్యక్తి. ఈ కేసులో ఇక్బాల్ కాంగ్(24), డియాండ్రె బాప్టిస్ట్(21)అనే వారికి ఇప్పటికే 17 ఏళ్ల చొప్పున జైలు శిక్షలు పడ్డాయి. ఈ ముగ్గురూ కలిసి వాలియాను కాల్చి చంపి, వాహనానంలో అతడిని అగి్నకి ఆహుతి చేశారు. మరో వాహనంలో పరారైన అనుమానితులను వెంటనే గుర్తించి, వెంటాడి పోలీసులు కొన్ని నిమిషాల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.
ఉష మతం మారదు: జేడీ వాన్స్
మత విశ్వాసాల విషయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తన భార్య ఉషా వాన్స్ హిందూ మతంలో పెరిగినప్పటికీ.. క్రైస్తవ మతం స్వీకరించాలని తనకు ఆశగా ఉందంటూ ఆయన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించడం తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన మరోసారి స్పందించారు. ఆయన క్రిస్టియన్ కాదని.. ఆమెకు మతం మారే ఉద్దేశం ఏమాత్రం లేదని అన్నారాయన. తాను చేసింది అసహ్యమైన వ్యాఖ్య అంటూ కొందరు నన్ను విమర్శించారు. నేను ప్రజల మనిషిని. వాళ్లు వేసే ప్రశ్న నుంచి తప్పించుకోలేను. అయినా మరోసారి స్పష్టత ఇస్తున్నా. ఆమెకు(ఉష) మతం మారే ఉద్దేశం లేదు. అయినా మతపరమైన విషయాలనేవీ వ్యక్తిగతం. కుటుంబం, స్నేహితులతో చర్చించాల్సిన అంశం అది. క్రిస్టియన్లు తమ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవాలనుకుంటారు. ఇది సాధారణమైన విషయం. నా వ్యాఖ్యలు కూడా అలాంటి సాధారణ ఆకాంక్షే అని ఎక్స్ పోస్ట్లో వివరించారాయన. తనపై వస్తున్న విమర్శలను అసహ్యకరమైనవిగా అభివర్ణించిన ఆయన.. క్రిస్టియన్ మతంపై ద్వేషంతోనే వాళ్లు అలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. నా భార్యను నేను ప్రేమగా చూస్తా. అలాగే ఆమె మతాన్ని కూడా గౌరవిస్తా. నేను ఆమె మతాన్ని తక్కువ చేసినట్లు మాట్లాడినట్లుగా భావించి విమర్శలు చేయడం సరికాదు అని అన్నారాయన. What a disgusting comment, and it's hardly been the only one along these lines. First off, the question was from a person seemingly to my left, about my interfaith marriage. I'm a public figure, and people are curious, and I wasn't going to avoid the question.Second, my… https://t.co/JOzN7WAg3A— JD Vance (@JDVance) October 31, 2025యూనివర్సిటీ ఆఫ్ మిసిసిప్పీలో జరిగిన ఓ ఈవెంట్లో జేడీ వాన్స్ ప్రసంగిస్తుండగా.. భారత మూలాలున్న ఓ యువతి ఆయనపై ప్రశ్నలు గుప్పించింది. వలసలు, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అవలంభిస్తున్న కఠిన వైఖరిపై నిలదీస్తూనే.. మరోపక్క మతం గురించి ఒక ప్రశ్న సంధించారు. దానికి వాన్స్ స్పందిస్తూ.. తన భార్య ఉషా, హిందూ మతంలో పెరిగినవారిగా క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాలనే ఆశ తనకు ఉందని చెప్పారు. ఆమె చాలా ఆదివారాలు తనతో పాటు చర్చికి వస్తుందని, తాను అనుభవించిన ఆధ్యాత్మిక అనుభూతిని ఆమె కూడా అనుభవిస్తే బాగుంటుందని ఆశిస్తున్నానని అన్నారు. అంతే.. ఆయన్ని తిట్టిపోస్తూ నెటిజన్లు మండిపడ్డారు. ఉషా వాన్స్ నేపథ్యం.. జేడీ వాన్స్ సతీమణి, అమెరికా సెకండ్ లేడీ ఉషా చిలుకూరి వాన్స్. ఈమె తెలుగు మూలాలున్న వ్యక్తి. ఉష తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి (Usha Chilukuri Vance) పుట్టిపెరిగారు. యేల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. యేల్ లా స్కూల్లోనే ఉషా, జె.డి.వాన్స్ (JD Vance) తొలిసారి కలుసుకున్నారు. 2014లో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. ప్రత్యేకంగా హిందూ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకోవడం విశేషం. వీళ్లకు ముగ్గురు సంతానం. ఆమె న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు. యేల్ విశ్వవిద్యాలయంలో లా అండ్ టెక్ జర్నల్కు మేనేజింగ్ ఎడిటర్గా, యేల్ లా జర్నల్కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్గా పనిచేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జాన్ రాబర్ట్స్, జస్టిస్ బ్రెట్ కెవానా వద్ద విధులు నిర్వర్తించారు. 2015 నుంచి ఆమె న్యాయ సంబంధిత సంస్థలు ముంగర్, టోల్స్, ఓస్లాన్లో కార్పొరేట్ లిటిగేటర్గా పనిచేస్తున్నారు. విశేషం ఏంటంటే.. అమెరికాలో ఉష లెఫ్ట్-వింగ్, లిబరల్ గ్రూప్స్తో కలిసి పనిచేశారు. 2014లో ఆమె డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తగా నమోదు చేసుకున్నారు. అయితే.. రిపబ్లికన్ అయిన భర్త జేడీ వాన్స్ విజయంలో ఉషా కీలక పాత్ర పోషించారు. ఆ మధ్య ఈ కుటుంబం భారత పర్యటనలోనూ సందడి చేశారు.
వేలానికి మరో బంగారు టాయిలెట్
న్యూయార్క్: ప్రముఖ ఆర్టిస్ట్ మౌరిజియో క్యాటల్లాన్ రూపొందించిన కొత్త బంగారు టాయిలెట్ త్వరలో వేలానికి రానుంది. ఆయన గతంలో రూపొందించిన బంగారు టాయిలెట్ను దుండగులు అపహరించుకుపోయారు. అలాంటిదే మరో బంగారు టాయిలెట్ను క్యాటల్లాన్ రూపొందించటంతో దానిని ఈ నెల 18న ప్రముఖ వేలం సంస్థ సౌత్బే వేలం వేయనుంది. క్యాటల్లాన్ మొదట రూపొందించిన బంగారు టాయిలెట్ దాదాపు 100 కిలోల 18 క్యారెట్ల బంగారంతో తయారైంది. దాని పేరు అమెరికా. అది గొప్ప ఆర్ట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. దానిని మొదట 2016లో న్యూయార్క్లోని గుగ్గెన్హీమ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచినప్పుడు దాదాపు లక్ష మంది సందర్శించారు. దానిని కొనుగోలు చేసేందుకు నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆసక్తి చూపించారు. అయితే, దానిని బ్రిటన్లోని బ్లెన్హీమ్ ప్యాలెస్లో ప్రదర్శనకు ఉంచగా, 2019లో దొంగలు నాలుగు నిమిషాల్లోనే దోచుకెళ్లారు. ఎంత గాలించినా అది మళ్లీ కనిపించలేదు. దానిని దొంగలు కరిగించి బంగారాన్ని అమ్మేసి ఉంటారని భావిస్తున్నారు. అలాంటిదే మరో టాయిలెట్ను క్యాటల్లాన్ తయారు చేయటంతో ఈ నెలలో వేలం వేస్తున్నారు. దీనికి భారీ ధర పలుకొచ్చని భావిస్తున్నారు. క్యాటల్లాన్ బనానా ఆర్టిస్ట్గా కూడా ప్రసిద్ధి చెందారు. ఓ గోడపై టేపుతో అరటి పండును అతికించి ప్రదర్శనకు ఉంచటం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది.
జాతీయం
పారాచూట్ నేతలతో పరేషాన్..!
పారాచూట్ నేతలు ఏమేరకు విజయా న్ని అందిస్తారనేది బిహార్లోని అన్ని పార్టీల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. దాదాపు అన్ని పార్టీల నేతలూ దీన్నో సమస్యగానే భావిస్తున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ ఎన్నికలకు కొద్ది రోజులు ముందుగా అకస్మాత్తుగా పార్టీలో చేరిన వారికి(పారాచూట్ నేతలకు), టిక్కెట్ ఇచ్చి బరిలో దించడం చకచకా చేసేశాయి. దీంతో ఆ పార్టీలు జనంలోకి వెళ్లలేక, అప్పటి వరకూ జనంలోనే ఉన్న అసంతృప్తి నేతలకు సమాధానం ఇచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పరిస్థితులు విజ యావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతా యని విశ్లేషకులు అంటున్నారు. బిహార్ పీఠం చేజిక్కించుకోవడానికి ప్రతీ నియో జకవర్గమూ కీలకంగా మారింది. అందుకే ప్రతీ సీటుపైనా పార్టీలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో టిక్కెట్ చేజిక్కించుకున్న స్థానాల్లో విజయం సాధించాలంటే ప్రత్యేక వ్యూహ రచన తప్పదని భావిస్తున్నాయి.ఎవరిపై ‘జాలి’?దర్భంగా జిల్లా జాలి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా రిషి మిశ్రా అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఆయన తాత లలిత్ నారాయణ్ మిశ్రా రాజకీయ వారసత్వం టిక్కెట్ విషయంలో మలుపు తప్పింది. దీంతో తాజాగా పార్టీలో చేరిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆర్జేడీ అభ్యర్థి జబీర్ అన్సారీ ఇక్కడ ఎమ్మెల్యే. ముస్లిం, యాదవ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ స్థానంలో అభ్యర్థి మార్పు కారణంగా ఓటు బదలాయింపు ఏమేర ఉంటుందనేది కాంగ్రెస్ వర్గాల్లోనూ సందేహంగానే ఉంది. అలీనగర్లో అల్లుకుపోతారా?గాయకుడు మైథిలీ ఠాకూర్ను బీజేపీ అలీనగర్ నుంచి పోటీకి దింపింది. ఇది బీజేపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈసారి ఇక్కడ బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ఇంతకాలం కేడర్లో ఉంది. బ్రాహ్మణ ఓటర్లు ఎన్డీయే పక్షం వైపు ఉన్నారనే విశ్వాసమే దీనికి కారణం. వికాస్శీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన మిశ్రీలాల్ యాదవ్ 2020లో కేవలం 10 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఈయన ఎన్డీయే అభ్యర్థి అయినప్పటికీ ఈసారి బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఓట్లు చీలిపోతే కష్టమని, కొత్త అభ్యర్థి గెలుపు జాతీయ నాయకుల ప్రచారంపై ఆధారపడి ఉంటుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఆఖరి నిమిషంలో ఈ ప్రయోగం సరికాదనే వాదన ఆ పార్టీ నుంచి విన్పిస్తోంది.‘ఔరా’అన్పించేదెవరు?ముజఫర్పూర్ జిల్లా ఔరై నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ప్రాంతం. బీజేపీ అభ్యర్థి రామ్ సూరత్ కుమార్ ఇక్కడ ఎమ్మెల్యే. 47 వేల ఓట్ల మెజారిటీతో గతంలో గెలిచారు. ఇప్పుడీ స్థానాన్ని రమా నిషాద్కు కేటాయించింది పార్టీ. ఇప్పటి వరకూ ఆమె పార్టీలో కూడా లేరు. ఇంకా చెప్పాలంటే రాజకీయాలకూ ఆమె దూరంగానే ఉన్నారు. కేవలం ఇంటి పనులు మాత్రమే చేసుకుంటున్నారు. పార్టీలో చేరడం, టిక్కెట్ ఇవ్వడం అన్నీ నాలుగు రోజుల్లోనే జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆమె ఎలా ప్రభావితం చేస్తారన్నది ప్రశ్నగానే మిగిలిపోయిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.ఆకట్టుకునేదెలా?పైన పేర్కొన్న చోట్లనే కాదు.. అనేక సీట్లలో ఇదే ప్రయోగం. దీన్ని మార్పు అని పార్టీలు చెప్పుకుంటున్నాయి. స్థానిక అంశాలపై ప్రస్తుత అభ్యర్థిని ప్రజల అసంతృప్తికి దూరం చేయడమే వ్యూహమంటున్నాయి. టిక్కెట్ ఇవ్వడానికి ముందు జేడీయూలో ఉన్న కౌశల్ యాదవ్, పూర్తిమ యాదవ్ను నవాడ, గోవింద్పూర్ స్థానాలకు ఎంపిక చేయడం వ్యూహమేనని ఆర్జేడీ తెలిపింది. యాదవ్ ఓట్లకు గాలం వేయడమే దీని ఉద్దేశంగా పేర్కొంది. శివహార్ నుంచి ఆర్జేడీ ఎమ్మెల్యేగా ఉన్న చేతన్ ఆనంద్ను జేడీయూ నైన్బీనగర్ నుంచి బరిలోకి దింపింది. రాజ్పుత్లను ఆకర్షించడానికి జేడీయూ కోమల్ సింగ్ను నామినేట్ చేసింది, ఆయన తల్లి వీణా దేవి ఎల్జేపీ ఎంపీ. బీజేపీకి చెందిన అజయ్ కుష్వాహా జేడీయూ కండువా కప్పుకున్న వెంటనే ఆ పార్టీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. ఎల్జేపీ సీటు సాధించడంలో విఫలమైన సరితా పాశ్వాన్ జేడీయూలో చేరారు. దీంతో, ఆమె ఆ పార్టీ అభ్యర్థి అయిపోయారు. ఇలాంటి వ్యూహ ప్రతివ్యూహాలు అన్ని పార్టీల్లో ఉన్నా విజయావకాశాలపై అనుమానాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి.వనం దుర్గాప్రసాద్ (బిహార్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
నక్సలిజం త్వరలోనే అంతం
రాయ్పూర్: దేశంలో నక్సలిజం పూర్తిగా అంతమయ్యే రోజు ఇక ఎంతో దూరంలో లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మావోయిస్టుల ప్రభావం ఇప్పటికే చాలావరకు తగ్గిపోయిందని చెప్పారు. ఆయన శనివారం ఛత్తీస్గఢ్లో పర్యటించారు. రూ.14,260 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ అవతరించి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నవ రాయ్పూర్లో నిర్వహించిన ‘రజత్ మహోత్సవ్’లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రగతి ప్రయాణం తనకు ఆనందం కలిగిస్తోందని అన్నారు. 25 ఏళ్ల క్రితం నాటిన విత్తనం ఇప్పుడు వటవృక్షంగా మారిందని ఉద్ఘాటించారు. ఛత్తీస్గఢ్ 25 ఏళ్ల ప్రయాణం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఒకప్పుడు నక్సలైట్ల హింసాకాండకు, వెనుకబాటుతనానికి ప్రతీక అయిన రాష్ట్రం నేడు అభివృద్ధి, భద్రత, స్థిరత్వానికి మారుపేరుగా మారిందని హర్షం వ్యక్తంచేశారు. నక్సల్స్ హింసాకాండ నుంచి రాష్ట్రం విముక్తి పొందడం ఎంతో సంతృప్తినిస్తోందని తెలిపారు. మావోయిస్టుల సిద్ధాంతం వల్ల అధోగతే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి లొంగిపోతుండడం శుభపరిణామం అని అభివరి్ణంచారు. వారు భారత రాజ్యాంగం స్వీకరించి, శాంతి మార్గంలో నడుస్తున్నారని పేర్కొన్నారు. శాసనసభ అంటే కేవలం చట్టాలు చేసే వేదిక కాదని.. రాష్ట్ర భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దే మహోన్నత క్షేత్రమని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఛత్తీస్గఢ్ రాజధాని నవ రాయ్పూర్ అటల్ నగర్లో రాష్ట్ర అసెంబ్లీ నూతన భవనాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉన్న దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కూడా నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. రామచరిత మానస్ పఠనం 16వ శతాబ్దంలో తులసీదాస్ రచించిన రామచరిత మానస్లోని ఓ శ్లోకాన్ని ప్రధాని మోదీ పఠించారు. సుపరిపాలనకు శ్రీరాముడి ఆశయాలే నాంది అని తెలిపారు. ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే దార్శనికతకు ఆయనే స్ఫూర్తి అని పేర్కొన్నారు. శ్రీరాముడి తల్లి జన్మస్థలం ఛత్తీస్గఢ్లోనే ఉందన్నారు. ఛత్తీస్గఢ్కు రాముడు ప్రియమైన మేనల్లుడు అని వ్యాఖ్యానించారు. సామాజిక సామరస్యం, సమానత్వానికి శ్రీరాముడి ఆశయాలే పునాది అని ఉద్ఘాటించారు. సమాజంలో వివక్ష అంతం కావాలని, అందరికీ సామాజిక న్యాయం దక్కాలని అకాంక్షించారు. శాంతి శిఖర్ ధ్యాన కేంద్రం ప్రారంభం అంతర్జాతీయంగా ఎలాంటి సంక్షోభం తలెత్తినా మొదట భారత్ ప్రతిస్పందిస్తోందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. బాధితులకు తగిన సాయం అందించేందుకు దేశం ముందుకు వస్తోందని అన్నారు. నవ రాయ్పూర్లో బ్రహ్మకుమారీలకు సంబంధించిన శాంతి శిఖర్ సెంటర్ ఫర్ స్పిరిచ్యువల్ లెర్నింగ్ అండ్ మెడిటేషన్ను ఆయన శనివారం ప్రారంభించారు. రాష్ట్రాల అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి సాధించాలన్నదే తమ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. ప్రతి మనిíÙలో మనం శివుడిని దర్శిస్తున్నామని చెప్పారు. ప్రపంచం సౌభాగ్యంతో విలసిల్లాలని, అందరిలోనూ మానవత్వం నెలకొనాలని కోరుకోవడం మన సంప్రదాయమని తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్ అనే ఆశయ సాధనకు తోడ్పాడు అందించాలని బ్రహ్మకుమారీలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్గఢ్ అవతరించి ఈ రోజుతో 25 ఏళ్లు పూర్తయ్యాయని, ఇది చాలా ప్రత్యేకమైన దినమని చెప్పారు. జార్ఖండ్, ఉత్తరాఖండ్ కూడా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాయని గుర్తుచేశారు. మరికొన్ని రాష్ట్రాలు కూడా అవతరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాలకు శుభాభినందనలు ప్రధానమంత్రి తెలియజేశారు. శ్రీసత్యసాయి సంజీవని ఆసుపత్రి సందర్శన నవ రాయ్పూర్లో శ్రీసత్యసాయి సంజీవని హాస్పిటల్ను ప్రధాని మోదీ సందర్శించారు. సత్యసాయి బాబా విగ్రహానికి పూజలు చేశారు. ‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్’ కార్యక్రమంలో భాగంగా ఈ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయించుకున్న చిన్నారులతో మాట్లాడారు. వారికి ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా పాల్గొన్నారు.
‘చతుర్ముఖ’ వ్యూహాన్ని ఛేదిస్తేనే పీఠమెక్కేది..!
బిహార్ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నాయి. మరోమారు పట్నా గద్దెనెక్కేందుకు నితీశ్ ఉవి్వళ్లూరుతుంటే ప్రస్తుత ఎన్నికల సంగ్రామంలో ఆయనను పడొగొట్టేందుకు ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ వ్యూహాలు రచిస్తున్నారు. సమరంలో ఎవరు గట్టెక్కుతారో నిర్ణయించే గెలుపు వ్యూహాలు మాత్రం రాజధాని పాటలీపుత్రలో కాకుండా రాష్ట్రంలోని నాలుగు విభిన్న ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి సమీకరణాల్లో దాగి ఉన్నాయి. సీమాంచల్లోని మతపరమైన ఓటు బ్యాంకు, మిథిలాంచల్లోని ఈబీసీల మద్దతు, మగద్లోని దళిత ఓటర్లు, భోజ్పుర్లోని గ్రామీణ–పట్టణ వ్యత్యాసాలు అనే ఈ 4 అంశాలపైనే అధికార, విపక్ష కూటముల భవిష్యత్ ఆధారపడి ఉంది. నితీశ్ పాలనపై తీర్పుతో పాటు కుల, ప్రాంతీయ అస్తిత్వాల మధ్య జరుగుతున్న ఈ పోరు అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటములకు అసలుసిసలు పరీక్ష పెడుతోంది. కుల సమీకరణాల పునాదులపై జరుగుతున్న ఈ ఎన్నికల సమరంలో, ఎన్డీఏ ‘డబుల్ ఇంజిన్’నినాదం, మహాగఠ్బంధన్ ‘సామాజిక న్యాయం’హామీ రెండూ పదునైన అ్రస్తాలే.సీమాంచల్: మహాగఠ్బంధన్ కోటలో ‘చీలిక’గండం సీమాంచల్లో కిషన్గంజ్, అరేరియా, పూరి్నయా, కతిహార్ అనే నాలుగు ఉపప్రాంతాలున్నాయి. మొత్తంగా ఇక్కడ దాదాపు 28 స్థానాలున్నాయి సీమాంచల్ అనేది బిహార్లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతం. కిషన్గంజ్లో దాదాపు 70 శాతం జనాభా ముస్లింలు కాగా, ఇతర జిల్లాల్లో 35–45 శాతం వరకు ఉంటారు. ఇది సహజంగానే ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమికి కంచుకోట. ‘ముస్లిం –యాదవ్’సమీకరణంలో ‘ముస్లిం’ఓటు బ్యాంకు ఇక్కడ అత్యంత బలంగా ఉంది. అయితే గత ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఇక్కడ 5 స్థానాలను గెలుచుకుని, మహాగఠ్బంధన్ అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. ఈసారి 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. మహాగఠ్బంధన్ ఓట్ల ఏకీకరణే లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీని ఓడించాలంటే తమ కూటమికి పడే ఓట్లు చీలకుండా కాపాడుకోవాలని మహాగఠ్బంధన్ చూస్తోంది. ఎంఐఎం అనేది బీజేపీ ‘బీ–టీమ్’అని, ఓట్లు చీల్చడానికే వచ్చిందని ప్రచారం చేస్తూ, తమ సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి మహాగఠ్బంధన్ కూటమి సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఎన్డీఏ పూర్తిగా మహాగఠ్బంధన్ ఓట్లు ఎంత ఎక్కువగా చీలితే తమకు అంత లాభం చేకూరుతుందని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు గాలమేస్తోంది. మిథిలాంచల్: నితీశ్కు అసలు సిసలు అగ్నిపరీక్ష మిథిలాంచల్లో ప్రధానంగా దర్భంగా, మధుబని, సమస్తిపూర్, సహర్సా, సుపాల్, మధేపుర ప్రాంతాలున్నాయి. మొత్తంగా ఇక్కడ దాదాపు 50–60 స్థానాలున్నాయి. ఇది అత్యంత సంక్లిష్టమైన సామాజిక సమీకరణాలున్న ప్రాంతం. బ్రాహ్మణులు, రాజ్పుత్లు (బీజేపీ ఓటు బ్యాంకు), యాదవులు (ఆర్జేడీ బలం) ఇక్కడ బలంగా ఉన్నారు. అయితే, ఫలితాలను శాసించేది మాత్రం ఈబీసీ (అత్యంత వెనుకబడిన వర్గాలు). మల్లా, టెలీ, ధానుక్ వంటి అనేక చిన్న కులాలు సీఎం నితీశ్ కుమార్కు అండగా నిలుస్తున్నాయి. అయితే ‘సన్ ఆఫ్ మల్లా‘గా పిలుచుకునే ముఖేశ్ సహానీకి నిషాద్ కమ్యూనిటీపై గట్టి పట్టుంది. ఈయన ప్రస్తుతం మహాగఠ్బంధన్ కూటమిలో ఉండటం వారికి కలిసి రానుంది. ఈ ప్రాంతంలో ఎన్డీఏ తన సంప్రదాయ ఓటు బ్యాంకుకు తోడుగా ఈబీసీలను కలుపుతోంది. నితీశ్ను ముందు నిలిపి ఈబీసీ ఓట్లను, అగ్రవర్ణాల ఓట్లను కొల్లగొట్టాలని ఎన్డీఏ ఆశపడుతోంది. ఈ కూటమి 2020లో మెరుగైన ప్రదర్శన చేసి 34 సీట్లు గెలుచుకుంది. మహాగఠ్బంధన్ మాత్రం ’సహానీ’తో ఎన్డీఏ ఓట్లకు గండి కొట్టే ప్లాన్ చేస్తోంది. ముస్లిం, యాదవ్లతోపాటు ఈసారి మల్లాలను, వామపక్ష పారీ్టలకు దగ్గరగా ఉన్న శ్రామిక వర్గాలను ఏకం చేయాలని విపక్షపారీ్టలు ఆశిస్తున్నాయి. నితీశ్పై ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఈబీసీ ఓట్లను తమ వైపు తిప్పుతుందని మహాగఠ్బంధన్ గట్టిగా నమ్ముతోంది. ఇది నితీశ్ విశ్వసనీయతకు అసలైన పరీక్ష.మగధ్: ‘లెఫ్ట్’జోరుకు కళ్లెం! మగధ్ ప్రాంతంలో గయా, జెహానాబాద్, ఔరంగాబాద్, నవాడా, అర్వాల్ అనేవి ముఖ్యమైనవి. ఇక్కడ సుమారు 28 స్థానాలున్నాయి. మగధ్ ప్రాంతం ఆర్జేడీ, వామపక్షాలకు కంచుకోట. ఇక్కడ యాదవులు, దళితులు/మహాదళితులు (ముసహర్, పాశ్వాన్), భూమిహార్ల జనాభా ఎక్కువ. ఈ ప్రాంతంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీకి బలమైన కేడర్ ఉంది. 2020లో ఎన్డీఏ ఇక్కడ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ప్రాంతంలోని 26 స్థానాల్లో మహాగఠ్బంధన్(ముఖ్యంగా ఆర్జేడీ, సీపీఐ –ఎంఎల్) ఏకంగా 20 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఈ ప్రాంతాల్లో ఎన్డీఏలోని జితన్ రాం మాంఝీ (హెచ్ఏఎం పారీ్ట), చిరాగ్ పాశ్వాన్ (లోక్జనశక్తి– పాశ్వాన్) గత కొంతకాలంగా బలాన్ని పుంజుకుంటున్నారు. ఈ దళిత మిత్రుల సాయంతో 2020 నాటి ఓటమికి బదులు తీర్చుకోవాలని ఎన్డీఏ కూటమి కంకణం కట్టుకుంది. గయా ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి మాంఝీ (ముసహర్ నేత), చిరాగ్ పాశ్వాన్ (పాశ్వాన్ నేత) ద్వారా విపక్షాల దళిత ఓటు బ్యాంకును చీల్చాలని ఎన్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. మహాగఠ్బంధన్ మాత్రం ‘ఆర్జేడీ (యాదవ్), సీపీఐ–ఎంఎల్ (అణగారిన వర్గాలు/దళితులు) అనే విజయవంతమైన ఫార్ములాను నమ్ముకుంది. ఈసారి కూడా తమను అదే ఫార్ములా విజయతీరాలకు చేర్చనుందని బలంగా నమ్ముతోంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మగధ్ ప్రాంతంలో తప్పనిసరిగా మోదీ మ్యాజిక్ పనిచేయాల్సిందే. 2020లో గెలిచిన ఆరు సీట్లను పెంచుకుని ఈసారి కనీసం 15 సీట్లలో విజయపతాక ఎగరేస్తేనే అధికారంపై ఆశలు బలపడతాయి.భోజ్పూర్: నగరాలపై ‘కమలం’ఆశ భోజ్పూర్ పరిధిలో పట్నా, భోజ్పుర్(ఆరా), రోహ్తాస్, బక్సర్, కైమూర్ ప్రాంతాలున్నాయి. ఇక్కడ మొత్తంగా దాదాపు 46 స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని రాజ్పుత్ల గడ్డగా పిలుస్తారు. అగ్రవర్ణాలలో రాజ్పుత్ల ఆధిపత్యం ఎక్కువ. ఆర్జేడీకి మద్దతుగా నిలబడే యాదవ్, జేడీయూకు మద్దతుగా నిలిచే కుర్మీ–కోయిరీల సంఖ్య కూడా ఈ ప్రాంతంలో అధికంగా ఉంటుంది. పటా్నలోని పట్టణ ఓటర్లు (కాయస్థులు, బనియాలు) బీజేపీకి మద్దతునిస్తున్నారు. 2020లో మగధ్ లాగే భోజ్పుర్ గ్రామీణ ప్రాంతాల్లో మహాగఠ్బంధన్ అద్భుతమైన ప్రదర్శన చేసి 43 స్థానాలకు గాను ఏకంగా 30 చోట్ల విజయం సాధించడం విశేషం. ఇక్కడ పట్టు సాధించేందుకు ఎన్డీఏ పట్టణ ఓటును, అగ్రవర్ణాలను ఏకీకరణ చేస్తూనే ఈబీసీ, ఓబీసీలను కలుపుకుపోయే ఫార్ములాతో బరిలోకి దిగుతోంది. మహాగఠ్బంధన్ మాత్రం గ్రామీణ పట్టు నిలుపుకునే యత్నం చేస్తోంది. ఈ చతుర్ముక పోరులో విజయం సాధించేది ఎవరో తెలియాలంటే ఫలితాల వెల్లడిదాకా ఆగక తప్పదు.
ఎంత ఖర్చయినా ధరిస్తాం
ఈ రోజుల్లో చేతి వేళ్లకు, మణికట్టుకు స్మార్ట్ గ్యాడ్జెట్స్ ధరించే ట్రెండ్ పెరిగిపోయింది. చాలామంది చేతులకు స్మార్ట్ వాచ్లు కనిపిస్తున్నాయి. ఆరోగ్య స్పృహ ఉన్నవారు స్మార్ట్ రిస్ట్ బ్యాండ్లు, స్మార్ట్ రింగులు వంటివి ధరిస్తున్నారు. చెవుల్లో పెట్టుకునే వైర్లెస్ ఇయర్ బడ్స్ కూడా ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. ఇలాంటివన్నీ కలిపి.. 2024లో దేశంలో మొత్తం సుమారు 12 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయంటే వాటి క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. మనదేశంలో రిస్ట్ బ్యాండ్ సగటు అమ్మకం ధర (ఏఎస్పీ) సుమారుగా రూ.12,000 ఉందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే ఇలా వేళ్లకో, మణికట్టుకో ధరించే స్మార్ట్ గ్యాడ్జెట్ల సగటు అమ్మకం ధర ప్రస్తుతం రూ.1,920 వరకూ ఉంది. ధర పెరుగుతున్నా వా టిని కొనడానికి ఎవరూ వెనకాడటం లేదు. 2025లో మొదటి ఆరు నెలల్లో 5 కోట్లకుపైగా ఇలాంటి స్మార్ట్ గ్యాడ్జెట్లు అమ్ముడవడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడిప్పుడే స్మార్ట్ రింగ్స్కి మార్కెట్ పెరుగుతోంది. అలాగే మెటా, లెన్స్కార్ట్ల వంటివి ఉత్పత్తులు మార్కె ట్లోకి తీసుకురావడంతో స్మార్ట్ గ్లాసెస్కి కూడా ఆదరణ పెరుగుతోంది. రిస్ట్ బ్యాండ్లు కూడా యువతను ఆకట్టుకుంటున్నాయి. భారీగా షిప్మెంట్లు2025 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ – జూన్) స్మార్ట్ గ్యాడ్జెట్ల షిప్మెంట్లు (రిటైలర్లకు తయారీ సంస్థలు సరఫరా చేసే సంఖ్య) 2.67 కోట్ల వరకు జరిగాయని ఐడీసీ చెబుతోంది. స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ల షిప్మెంట్లు రికార్డు స్థాయిలో 118% పెరిగాయి. ఇదే సమయంలో స్మార్ట్ రింగ్స్ సుమారు 75వేలు, స్మార్ట్ గ్లాసెస్ 50వేలకుపైగా మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఈసారి మార్కెట్లోకి వచ్చిన ఇయర్వేర్లో సింహభాగం వైర్లెస్ ఇయర్బడ్స్ (టీడబ్ల్యూఎస్) కావడం.. వీటికి పెరుగుతున్న క్రేజ్కి నిదర్శనం.మొదట్లో అదో క్రేజ్స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల వంటి ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకీ, ఈ స్మార్ట్ గ్యాడ్జెట్లకీ చాలా తేడా ఉంది. ‘వీటిపై మొదట్లో క్రేజ్ ఎక్కువ ఉంటోంది. ఎందుకంటే.. ఆరోగ్య, ఆహార సంబంధ విషయాలపై ఇచ్చే వివరాలు, స్కోర్లు ఆసక్తికరంగా ఉంటాయి. రానురాను.. రోజూ అవే విషయాలను ఆ గ్యాడ్జెట్స్ ఇస్తుండటంతో వాటిని వాడే వారిలో మొదట్లో ఉన్న ఆసక్తి తరవాత ఉండటం లేదు. మొదట్లో అందరూ చూడాలని, అందులోని వివరాలు తెలుసుకోవాలని పెట్టుకునేవారు.. తరవాత్తరవాత అందరూ చూడాలని మాత్రమే వాటిని ధరిస్తున్నారు’ అంటున్నారు టెక్ నిపుణులు. చాలామంది ఇలా బోర్ కొట్టడం వల్ల తమ మొదటి స్మార్ట్ వాచ్ను అప్డేట్ చేయడం లేదు. ‘చాలా స్మార్ట్ వాచ్లు రోజువారీ నడిచిన అడుగుల లెక్క, గుండె కొట్టుకునే రేటు వంటివి తప్ప కొత్త విషయాలు ఉండటం లేదు’ అంటున్నారు వినియోగదారులు.ఆలోచించి కొంటున్నారు‘ఇవి వన్టైమ్ పర్చేజ్ ఐటెమ్స్గా మారిపోతున్నాయి. అంటే స్మార్ట్ఫోన్ని చాలామంది ఏడాదికొకటి మారుస్తారు. కానీ, స్మార్ట్ వాచ్లు, రింగ్ల వంటి వాటిని ఒకసారి కొన్నాక... మళ్లీ కొత్తది కొనేందుకు ఇష్టపడటం లేదు. చాలా విషయాల్లో ఈ తరం వారు.. ఒక వస్తువును చూడగానే లేదా దాని గురించి వినగానే కొనేస్తుంటారు. కానీ, ఈ స్మార్ట్ గ్యాడ్జెట్ల విషయంలో అలా కాదు. ఒకటికి పదిసార్లు ఆలోచించి కొంటున్నారు. అందుకే వీటి ధరలను పెంచాల్సి వస్తోంది. కానీ, ఉత్పత్తిలో ప్రత్యేకత ఉంటే వాటిని ఎంత ధర పెట్టి కొనడాని కైనా వినియోగదారులు సిద్ధపడుతున్నారు’ అని కంపెనీలు చెబుతున్నాయి.
ఎన్ఆర్ఐ
ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్కు అరుదైన గౌరవం
ప్రపంచ శాంతికి, మానవతా విలువల పరిరక్షణకు కృషిచేస్తున్న గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్కు అరుదైన గౌరవం దక్కింది. సమాజానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరం ఈ నెల 19వ తేదీని “శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవం”గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నిర్మించేందుకు, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని, వివిధ మతాల మధ్య సుహృద్భావాన్ని పెంపొందించటం, సమాజాభివృద్ధికి కృషి చేయటం వంటి విషయాలలో గురుదేవుల చేసిన సేవకుగానూ ఈ గౌరవాన్ని ప్రకటిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడుతున్న మానవతావాది, ఆధ్యాత్మికవేత్త, శాంతిదూత అయిన శ్రీశ్రీ రవిశంకర్ ఒత్తిడి లేని, హింస లేని సమాజం నెలకొల్పాలనే లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలలో 8కోట్లకు పైగా ప్రజలను ప్రభావితం చేసిందని సియాటెల్ నగర మేయర్ బ్రూస్ హారెల్, వాంకోవర్ మేయర్ కెన్ సిమ్ పేర్కొన్నారు. రవిశంకర్ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వహించిన ఒత్తిడి నిర్మూలన శిబిరాలు, యువ నాయకత్వ శిబిరాలు, సామాజిక అభివృద్ధి, సేవా కార్యక్రమాలు అక్కడి ప్రజలలో మానసిక దృఢత్వం, సౌభ్రాతృత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడటమేగాక శాంతియుత వాతావరణం, మహిళా సాధికారికతను పెంపొందించాయన్నారు. చివరగా ఇక అంతకు ముందురోజైన అక్టోబర్ 18వ తేదీన వాంకోవర్ నగరం సైతం గురుదేవుల్ని ఇదే విధంగా సత్కరించి, అక్టోబర్ 18వ తేదీని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ దినం గా ప్రకటించటం గమనార్హం.(చదవండి: శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా డబ్లిన్లో ఘనంగా దీపావళి వేడుకలు)
న్యూజెర్సీ హైవే దత్తతలో నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్థులు
ఈస్ట్ విండ్సర్, న్యూజెర్సీ: భావితరంలో సామాజిక బాధ్యత పెంచేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా న్యూజెర్సీలో హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టి హైవేను శుభ్రం చేసింది. ఈస్ట్ విండ్సర్, న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో అడాప్ట్-ఎ-హైవే క్లీన్ అప్ ప్రోగ్రామ్ పేరుతో నాట్స్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ సభ్యులు, పలువురు తెలుగు విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రహదారి పరిసరాలను శుభ్రం చేశారు. ఇలా తెలుగు విద్యార్థులు నాట్స్ ద్వారా చేసిన ఈ సామాజిక సేవకు అమెరికా ప్రభుత్వం నుంచి వాలంటీర్ అవర్స్గా గుర్తిస్తుంది.. ఇది విద్యార్థుల కాలేజీ ప్రవేశాలకు ఉపకరిస్తుంది. నాట్స్ న్యూజెర్సీ నాయకులు ప్రశాంత్ కూచు నాయకత్వంలో కిరణ్ మందాడి, సుఖేష్ సుబ్బాని, రాజేష్ బేతపూడి తదితరులు హైవే దత్తత పరిశుభ్రత కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.తెలుగు వాళ్లు అమెరికా సమాజానికి సేవ చేయగలగడం పట్ల సంతోషంగా ఉందని నాట్స్ అధ్యక్షుడు శ్రీ హరి మందాడి అన్నారు. శుభ్రమైన, పచ్చని వాతావరణం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ పని గంటలు విద్యార్థులకుతమ వాలంటీర్ అవర్స్గా పాఠశాలలో ఉపయోగపడతాయన్నారు. ఇకపై ప్రతీ రెండు నెలలకొకసారి ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయని తెలుగు విద్యార్ధులు చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.నాట్స్ న్యూజెర్సీ బృందం నుంచి శ్రీనివాసరావు భీమినేని, కిరణ్ మందాడి, శ్రీనివాస్ మెంట, వంశీ వెనిగళ్ల, ప్రశాంత్ కుచ్చు, సుఖేష్ సుబ్బాని, రాజేష్ బేతపూడి, శ్రీనివాస్ నీలం, సూర్య గుత్తికొండ, శంకర్ జెర్రిపోతుల, మల్లి తెల్ల, వెంకట్ గోనుగుంట్ల తదితరులు ఈ హైవే దత్తత, పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలుగు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంచే చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన న్యూజెర్సీ నాట్స్ టీమ్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.
మిస్సోరీలో నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్, ట్రోఫీలు
అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసేలా అనేక కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మిస్సోరీ తెలుగువారి కోసం వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్లు నిర్వహించింది. నాట్స్ మిస్సోరీ విభాగం ఆధ్వరంలో ఫెంటన్ మిస్సోరీలోని లెగసీ వీటీసీలోఈ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్లు జరిగాయి. తెలుగు క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపుతూ సాగిన ఈ క్రీడా సంబరం తెలుగు క్రీడా ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. చెస్టర్ఫీల్డ్ సిటీ కౌన్సిల్ సభ్యుడు గ్యారీ చేతుల మీదుగా ఈ టోర్నమెంట్ను నాట్స్ ప్రారంభించింది. ఈ టోర్నమెంట్లలో మొత్తం 25 జట్లు, 200 మందికి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ టోర్నమెంట్లు తెలుగువారి క్రీడా స్ఫూర్తిని, క్రీడల పట్ల ఉన్న మమకారాన్ని చాటి చెప్పాయి.నాట్స్ మిస్సోరీ విభాగం విశేష కృషిఈ క్రీడా పోటీలు విజయవంతం కావడానికి నాట్స్ ప్రముఖులు, మిస్సౌరీ ఛాప్టర్ నాయకత్వం, మిస్సోరీ నాట్స్ సభ్యులు విశేష కృషి చేశారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, నాట్స్ పూర్వ అధ్యక్షులు ప్రస్తుత బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరీ చాప్టర్ కో ఆర్డినేటర్ సందీస్ కొల్లిపరతో పాటు తెలుగు అసోషియేషన్ ఆఫ్ సెయింట్ లూయిస్ మాజీ అధ్యక్షుడు సురేంద్ర బాచిన, మధుసూదన్ దద్దాల, మురళి బందరుపల్లి వంటి ప్రముఖులు ఈ పోటీల నిర్వహణను పర్యవేక్షించారు.నాట్స్ మిస్సోరీ ఛాప్టర్ బృందం తరుణ్ దివి, చైతన్య పుచకాయల, సంకీర్త్ కట్కం, రాకేష్ రెడ్డి మారుపాటి, సునీల్ స్వర్ణ, హరీష్ గోగినేని, నరేష్ రాయంకుల, నవీన్ కొమ్మినేని, శ్రీనివాస్ సిస్ట్ల తదితరులు ఈ టోర్నమెంట్ దిగ్విజయం కావడానికి ఎంతో కృషి చేచేశారు. నాట్స్ వాలంటీర్లు కూడా ఈ టోర్నమెంట్ కోసం విలువైన సమయాన్ని, సేవలను వెచ్చించారు..విజేతలకు ట్రోఫీలు పంపిణీఐదు విభాగాలలో విజేతలు మరియు రన్నరప్లకు నాట్స్ ట్రోఫీలను పంపిణీ చేసింది.. క్రీడాకారుల అంకితభావం, ప్రతిభను ఈ సందర్భంగా నాట్స్ నాయకులు కొనియాడారు. నాట్స్ మిస్సోరి విభాగం వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను దిగ్విజయం చేయడంలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
డల్లాస్ ఫ్రిస్కోలో దిగ్విజయంగా నాట్స్ అడాప్ట్ ఏ పార్క్
ఫ్రిస్కో, టెక్సాస్: భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ డల్లాస్ లో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. నాట్స్ డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో ఫ్రిస్కో నగరంలోని మోనార్క్ వ్యూ పార్క్ వద్ద అడాప్ట్ ఏ పార్క్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో 40 మందికి పైగా తల్లిదండ్రులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొండ వెనుక భాగంలో పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో మొక్కలు నాటి, వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా, సిటీ ఆఫ్ ఫ్రిస్కో పార్క్ విభాగం సభ్యులు పిల్లలకు శుభ్రత, పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పించారు. సీతాకోకచిలుకల సంరక్షణకు అనుకూల వాతావరణం కల్పించడంలో ఇదొక ముఖ్యమైన అడుగు అని పర్యావరణ పరిరక్షకులు తెలిపారు.గత ఆరు నెలలుగా నాట్స్ డల్లాస్ చాప్టర్ ఈ మొనార్క్ వ్యూ పార్క్ ను దత్తత తీసుకుని, అక్కడ తరచూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ కాలంలో విద్యార్థులను భాగస్వామ్యులను చేస్తోంది. పార్క్ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, పచ్చదనాన్ని ప్రోత్సహిస్తూ 2,000 కు పైగా మొక్కలను నాటిన ఘనతను నాట్స్ డల్లాస్ చాప్టర్ సాధించింది.నాట్స్ చేస్తున్న నిరంతర కృషిని సిటీ ఆఫ్ ఫ్రిస్కో ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న 25 మంది యూత్ వాలంటీర్లను గుర్తించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి సిటీ ఆఫ్ ఫ్రిస్కో పార్క్ విభాగం అధికారి క్రిస్టల్, ప్రకృతి పరిరక్షకులు రిక్, లారా హాజరయ్యారు. నాట్స్ తరపున ప్రతినిధులు బాపు నూతి, రాజేంద్ర మాదాల, రవి తాండ్ర, కిశోర్ నారె, స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి, శివ మాధవ్ లు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.నాట్స్ డల్లాస్ చాప్టర్ ఇలాంటి సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని ప్రతినిధులు తెలిపారు. నాట్స్ డల్లాస్ విభాగం చేపట్టిన ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
క్రైమ్
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
వనపర్తి జిల్లా: వనపర్తి జిల్లా కేంద్రంలో దారుణ హత్య కేసు వెలుగుచూసింది. వివాహేతర సంబంధం కారణంగా భార్యే భర్త ప్రాణాలు తీసింది. జిల్లా కేంద్రంలో కురుమూర్తి, నాగమణి దంపతులు నివసిస్తున్నారు. భార్య నాగమణి నందిమల్ల శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేత బంధం పెట్టుకుంది. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, అతనిని హత్య చేయాలని పథకం వేసింది. అక్టోబరు 28న ప్రియుడు నందిమల్ల శ్రీకాంత్తో కలిసి భర్త కురుమూర్తిని హత్య చేసింది.అనంతరం కారులో తీసుకెల్లి శ్రీశైలం వెళ్లి డ్యాంలో మృతదేహాన్ని పడేశారు. కురుమూర్తి సోదరి చెన్నమ్మ ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై వనపర్తి రెండో ఎస్సై శశిధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. రంగంలోకి దిగిన పోలీసులు, నాగమణి, శ్రీకాంత్లను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ దారుణ హత్య కేసు వనపర్తిలో సంచలనం రేపింది. భార్య చేతిలో భర్త ప్రాణాలు కోల్పోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిన్ను కలవాలని ఉంది.. శివాజీపార్క్కి వస్తావా?
ఎంవీపీకాలనీ: విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని సమత డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థి కోన సాయితేజ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న అతడి బలవన్మరణం కలకలం రేపింది. ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులతోనే సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు, అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. కళాశాల విద్యార్థులు ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. సహచర విద్యార్థులు, తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన మేరకు.. తోటి విద్యార్థులతో సరదాగా ఉండే సాయితేజ కొంతకాలంగా తరగతులకు హాజరుకావడంలేదు. ఈ క్రమంలో ఇద్దరు మహిళా అధ్యాపకులు వేధిస్తున్నట్లు తల్లిదండ్రులు, తమ్ముడి వద్ద పలుమార్లు వాపోయాడు. ఐదో సెమిస్టర్లో భాగంగా స్టాటిస్టిక్స్ రికార్డ్ పూర్తిచేసి ఇటీవల అధ్యాపకురాలికి సబి్మట్ చేశాడు. అందులో కరెక్షన్స్ ఉన్నాయంటూ ఆమె రికార్డ్ను రిజెక్ట్ చేస్తూ వచ్చారు. దీంతో కొన్ని రోజులుగా సాయితేజ మరింత మనస్తాపానికి గురయ్యాడు. చాలాసార్లు కరెక్షన్లు చేసినా అధ్యాపకురాలు రికార్డ్ తీసుకోలేదు. దీంతో మరోసారి కరెక్షన్స్ చేసి సబి్మట్ చేసేందుకు గురువారం తల్లిదండ్రులతో కలిసి కాలేజీకి వెళ్లాడు. సాయంత్రం వరకు ఆ అధ్యాపకురాలు కళాశాలకు రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం కళాశాలకు వెళదామని తల్లిదండ్రులు చెప్పారు. ముందు మీరు వెళ్లండి, నేను తరువాత వస్తా.. అని సాయితేజ తల్లిదండ్రులకు, తమ్ముడికి చెప్పాడు. వారు కళాశాలకు వెళ్లి ఎంతసేపు చూసినా.. సాయితేజ రాలేదు. ఫోన్ కూడా తీయలేదు. దీంతో ఇసుకతోటలోని ఇంటికి వెళ్లిన వారికి సాయితేజ ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించి, అతడిని మెడికవర్ హాస్పటల్కు తరలించారు. అప్పటికే సాయితేజ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం ఎంవీపీ పోలీసులు అక్కడికు చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించారు. ఏడాదిగా లైంగిక వేధింపులు ఏడాది కాలంగా సాయితేజ ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులకు గురవుతున్నట్లు సహచర విద్యార్థులు, కుటుంబసభ్యులు ఆరోపించారు. సహచర విద్యార్థులతో పాటు తమ్ముడికి కూడా సాయితేజ చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పినట్లు వెల్లడించారు. ఒక అధ్యాపకురాలు ‘ఉదయాన్నే నన్ను ఎందుకు విష్ చేయడంలేదు.. నిన్ను కలవాలని ఉంది.. శివాజీపార్క్కి వస్తావా?.. నాగురించి ఒకసారైనా ఆలోచించవా..’ వంటి మెసేజ్లు పంపటంతోపాటు తరచు వాట్సాప్ కాల్స్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నట్లు సాయితేజ చెప్పాడని స్నేహితులు తెలిపారు. మరో అధ్యాపకురాలు సబ్జెక్ట్ పరంగా వేధిస్తున్నట్లు ఆరోపించారు. సాయితేజ ఆత్మహత్యకు కారణమైన ఆ ఇద్దరు మహిళా అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలంటూ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అనంతరం లైంగిక వేధింపులకు సంబంధించిన వాట్సాప్ సందేశాల జిరాక్స్లను ఏబీవీపీ ప్రతినిధి నితిన్తో కలిసి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావుకు అందజేశారు. సాయితేజ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎంవీపీ పోలీసులు తెలిపారు. ఫిర్యాదుతో పాటు వాట్సాప్ సందేశాల ప్రతులను కూడా పోలీసులకు అందించారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
కార్తీక దీపం.. ఇంటినే కాల్చేసింది!
చిత్తూరు జిల్లా: ఇంటి వద్ద కార్తీక శుక్రవారం సందర్భంగా వెలిగించిన దీపం వారి ఇంటినే కాల్చేసింది. ఈ ఘటన మండలంలోని కాగతి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో స్కూటర్ కాలిపోగా.. సుమారు రూ.4 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లింది. గ్రామస్తుల కథనం.. పుంగనూరు–బోయకొండ ప్రధాన రహదారిలో కాగతి ఉంది. రోడ్డు పక్కన ఎల్.ఉదయ్కుమార్, తల్లి శారదమ్మ కలిసి చిల్లర అంగడి నిర్వహిస్తున్నారు. వీటితోపాటు పెట్రోల్, గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో కార్తీక శుక్రవారం కావడంతో షాపు, ఇంటి గడపలో దీపం వెలిగించి పెట్టారు. పెట్రోల్ బాటిళ్లు, క్యాన్తోపాటు బైక్ వరండాలో ఉంచారు. దీపం నుంచి పెట్రోల్కు మంటలు చెలరేగి బైక్కు వ్యాపించాయి. మంటలు ఎగసి పడడంతోపాటు పొగ కమ్మేసింది. మంటలను అదపుచేసేందుకు స్థానికులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. గ్యాస్ సిలిండర్లు ఉన్నాయన్న భయంతో పరుగులు తీశారు. తీరా ఉదయ్కుమార్ ఇంట్లోనే ఉండిపోవడంతో గ్రామస్తులు, యువకులు సాహసం చేసి ఇంటి కిటికీలు ధ్వసం చేసి అతన్ని బయటకు తీసుకొచ్చారు. అతనికి స్వల్పగాయాలు కాగా.. ప్రాథమిక చికిత్స అందించారు. ఇంట్లోని సామగ్రి, ఎలక్ట్రికల్ వస్తువులు, కొయ్య సామగ్రి మొత్తం కాలిబూడిదైంది. ఈ ఘటనతో గ్రామంలోని ప్రజలు, చుట్టుపక్కల నివాసమున్నవారు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. పుంగనూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
లడ్డూ ఇప్పిస్తామని చెప్పి..
యాదాద్రి భువనగిరి జిల్లా : మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కామాంధులు లడ్డూ ఇస్తానని ఆశ చూపించి నాలుగేళ్ల చిన్నారిని తమ వెంట తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లా మహాసువ గ్రామానికి చెందిన దినేష్ కాల్(45), శివరాజ్ కాల్(44) గత మూడు నెలల క్రితం లింగోజిగూడెం గ్రామానికి వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో కాంట్రాక్టర్ కింద దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు లింగోజిగూడెం గ్రామంలోని బీసీకాలనీలో (రైస్విుల్ దగ్గర) మరికొంత మంది కూలీలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్కు చెందిన బాలిక కుటుంబం సైతం మూడు నెలల క్రితం ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చారు. బాలిక తండ్రి అదే పరిశ్రమలో పెయింటింగ్ కాంట్రాక్టర్ వద్ద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరు.. నిందితులు ఉంటున్న ఇంటి వెనుక భాగంలో ఉన్న అద్దె ఇంట్లో ఉంటున్నారు. లడ్డూ ఇప్పిస్తామని చెప్పి.. చిన్నారి తండ్రి కూలికి వెళ్లగా తల్లి ఇంటి వద్దే ఉంది. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో తల్లి ఇంట్లో దుస్తులు ఉతుకుతండగా చిన్నారులు బయట ఆడుకుంటున్నారు. డ్యూటీకి వెళ్లని దినేష్, శివరాజ్లు పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న వారిద్దరు ఇంటి ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారి దగ్గరకు వెళ్లారు. లడ్డూ ఇప్పిస్తానని ఆశ చూపించి తమ వెంట తీసుకెళ్లారు. వారు బాలికపై లైంగిక దాడికి యత్నిస్తుండగా రోదించడంతో బాలిక తల్లి బయటకు వచ్చి వెతకసాగింది. ఇద్దరు వ్యక్తులు మీ కుమార్తెను తీసుకెళ్లారని స్థానికంగా ఉన్న ఓ బాలిక చెప్పింది. దీంతో వెంటనే పక్కింటి వారి సాయంతో తల్లి అక్కడకు వెళ్లి బాలికను తీసుకువచ్చి పోలీసులకు సమాచారమిచి్చంది. పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వైద్యచికిత్స నిమిత్తం బాలికను చౌటుప్పల్లోని ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
వీడియోలు
జోగి రమేష్ అరెస్ట్ పై YS జగన్ ఆగ్రహం
తప్పు మీరు చేసి కాశీబుగ్గ గుడి కట్టించిన 90 ఏళ్ల వ్యక్తి ని జైల్లో పెట్టిన సర్కార్
తిరుపతి లడ్డు నుండి కాశీబుగ్గ వరకు.. బాబు డైవర్షన్ పాలిటిక్స్
కాశీబుగ్గ తొక్కిసలాటపై బాబు డైవర్షన్ డ్రామా..
నీకు భార్య, పిల్లలు ఉన్నారు కదా.. జోగి రమేష్ అరెస్ట్ పై భార్య ఎమోషనల్..
అరెస్ట్ పై జోగి రమేష్ స్ట్రాంగ్ రియాక్షన్
మళ్లీ దొరికిపోయిన బాబు.. కాశీబుగ్గ తొక్కిసలాటపై ఆలయ ధర్మకర్త సంచలన వీడియో
కాశీబుగ్గ ఘటన డైవర్షన్ కోసమే జోగి రమేష్ అక్రమ అరెస్ట్..
ఎంత టార్చర్ పెట్టారంటే..!! సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్
కాశీబుగ్గ తొక్కిసలాటకు ఉచిత బస్సు కారణమంటూ లోకేష్ అడ్డగోలు మాటలు





