Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Kasibugga Temple Stampede: Ysrcp Leaders Kasibugga Visit Updates1
కాశీబుగ్గ ప్రమాద బాధితులను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, తాడేపల్లి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో YSRCP బృందం పర్యటించింది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో సంఘటన స్థలాన్ని పార్టీ బృందం పరిశీలించింది.అనంతరం తొక్కిసలాట బాధితులను పార్టీ నేతలు పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందంలో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యన్నారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకులు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సహా పలు నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, నాయకులు ఉన్నారు.ఇవాళ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కాశీబుగ్గ చేరుకున్న పార్టీ ప్రతినిధి బృందం.. అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించి.. బాధితులను కూడా పరామర్శించారు.

Vreels Virtually Relax Explore Engage Live Share app in tech market2
టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీగా కొత్త యాప్‌.. పూర్తి వివరాలు..

డిజిటల్ యుగం మన జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. ప్రతి రోజూ మనం ఎన్నో యాప్‌లు ఉపయోగిస్తూ ఉంటాం. అందులో కొన్ని చాటింగ్‌ కోసం, మరికొన్ని వీడియోల కోసం, ఇంకొన్ని షాపింగ్ కోసం.. వాడుతుంటాం. అయితే ఒకే వేదికపై ఇలాంటి సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వీరీల్స్‌(Vreels-Virtually Relax, Explore, Engage, Live, Share) రూపొందించారు. ప్రపంచానికి కొత్త తరహా డిజిటల్ అనుభవాన్ని అందించడానికి అమెరికాలోని తెలుగు ఇంజినీర్లు దీన్ని తయారు చేశారు.ఇది ఇప్పటికే 22 దేశాల్లో విడుదలై, ప్రస్తుతం బీటా దశలో ఉంది. Play Store, App Storeలో Vreelsను డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ కొత్త అనుభవాన్ని ఆస్వాదించవచ్చని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.వెబ్సైట్: www.vreels.comసృజనాత్మకతతో..Vreels ఒకే చోట కంటెంట్‌ సృష్టి, వినోదం, సంభాషణకు డిజిటల్ వేదికగా మారింది. ఇందులో ప్రతి యూజర్ ఒక క్రియేటర్‌గా మారొచ్చు. చిన్న వీడియోలు, ఫొటోలు, క్రియేటివ్ స్టోరీస్‌ను వ్యక్తిగతంగా యూజర్ల ఆసక్తులకు సరిపోయేలా రూపొందించుకోవచ్చు. ఇందులోని ఫీడ్ యూజర్లు ఇష్టపడే విషయాలను నేర్చుకుంటూ మరింత పర్సనల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. యాప్‌లోని కొన్ని ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.Reels, Pixమీ భావాలు, ప్రయాణాలు, ఆలోచనలు.. అన్నీ ఒక క్లిక్‌లో రికార్డ్ చేసి, ఎడిట్ చేసి ఇతరులతో పంచుకోవచ్చు. వీడియోలు, ఫొటోల రూపంలో ఆకస్తి కరంగా యూజర్లు తమ భావాలను వ్యక్తీకరించవచ్చు. ఫిల్టర్లు, టెక్స్ట్, స్టిక్కర్లు, మ్యూజిక్ సపోర్త్‌తో Vreels క్రియేటర్లకు మెరుగైన అనుభవం ఇస్తుంది.Pix Pouches.. డిజిటల్‌ నోట్‌బుక్‌Pix Pouches అనేది డిజిటల్ నోట్‌బుక్‌. ఇష్టమైన ఫొటోలను లేదా ఆలోచనలను వర్గాల వారీగా స్టోర్‌ చేసుకోవచ్చు. మిత్రులతో కలిసి కలెక్షన్లు సృష్టించి, మంచి ప్రాజెక్టులను ప్లాన్ చేయవచ్చు.Chats, Calls — కనెక్ట్ అ​‍య్యేందుకు..స్నేహితులతో మాట్లాడటానికి, గ్రూప్‌లో చాట్ చేయటానికి లేదా వీడియో కాల్ చేసుకోవటానికి వేర్వేరు యాప్‌లు అవసరం లేదు. Vreelsలోనే ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. వీరీల్స్‌ క్రియేటివ్ వేదికగా ఉన్నందున ఇది సాధ్యపడింది. మీరు మాట్లాడుతూనే మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవచ్చు.V Map — లొకేషన్‌ షేరింగ్‌మీ స్నేహితులు లేదా కమ్యూనిటీ సభ్యులు ఎక్కడ ఉన్నారో V Mapతో సులభంగా తెలుసుకోవచ్చు. లొకేషన్ షేరింగ్ పూర్తిగా మీ నియంత్రణలో ఉంటుంది.V Capsules — మధుర జ్ఞాపకాలుఈ ప్రత్యేక ఫీచర్‌లో భావోద్వేగ జ్ఞాపకాలను డిజిటల్‌గా ఒక ‘క్యాప్సూల్’లో ఉంచి ఒక నిర్దిష్ట తేదీన దాన్ని ఓపెన్‌ చేసి చూసుకోవచ్చు. బర్త్‌డే, యానివర్సరీ, లేదా మైల్‌స్టోన్‌.. వంటి ముధుర జ్ఞాపకాలను భద్రపరుచుకొని తిరిగి ఆ మెమొరీని చూసుకోవడం ఆనంద క్షణంగా ఉంటుంది.Vreels Shop/Bid — మీ అవసరాలన్నీ ఒకే చోటVreels షాప్/బిడ్ త్వరలో రాబోతోంది. యూజర్లకు కావాల్సిన ప్రతి ఉత్పత్తిని ఇందులో కొనుగోలు చేయవచ్చు. వెండర్లు తమ ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తారు. యూజర్లు నమ్మకంగా ఇందులో బిడ్ చేయవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు. ఇది అంతా ఒకే సురక్షితమైన, సౌకర్యవంతమైన వేదికలో జరుగుతుంది. నమ్మకం, నాణ్యత, విశ్వాసం ఇవే Vreels షాప్/బిడ్ పునాది సూత్రాలని నిర్వాహకులు చెబుతున్నారు.భద్రత.. యూజర్ విశ్వాసమే ప్రాధాన్యంఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రపంచంలో మన డేటా ఎక్కడికి వెళ్తుందో, ఎవరు వాడుతారో అన్న సందేహం సహజం. కానీ Vreelsలో మీరు ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ యూజర్ల డేటాకు అధిక భద్రత ఉంటుంది.టోకెన్ ఆధారిత ప్రామాణీకరణ, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌, యూజర్ నియంత్రిత ప్రైవసీ సెట్టింగులు.. ఇవన్నీ యూజర్ల వ్యక్తిగత డేటాను కాపాడటానికి ఎంతో తోడ్పడుతాయి. ముఖ్యంగా యూజర్‌ పోస్టులు, ప్రొఫైల్, లొకేషన్.. ఎవరు చూడాలో నిర్ణయించే అధికారం పూర్తిగా యూజర్‌ పరిధిలోనే ఉంటుంది.Vreels ఆవిష్కరణల వేదికVreels ఒక యాప్ మాత్రమే కాదు. అమెరికన్‌ వ్యాపార స్పూర్తిని, భారతీయ స్వయం ఆవిష్కరణ శక్తిని ప్రతిబింబించే ఒక వేదిక. ప్రతి అప్‌డేట్‌తో కొత్త సాంకేతిక పరిణామాలు, స్థానిక భాషల సపోర్ట్, యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచే మార్పులు తెస్తోంది. ఇది Made for the World అనే స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తుంది. ఇప్పటికే Vreels బృందం వినూత్న సాంకేతిక పేటెంట్లను దాఖలు చేసింది. ఇవి ప్రస్తుతం ఆమోద దశలో ఉండగా, త్వరలోనే మంజూరు అవుతాయని అంచనా. ఈ పేటెంట్లు ఆమోదం పొందిన తర్వాత Vreels సాంకేతిక సామర్థ్యం మరింత బలపడటమే కాక, అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపు లభించనుంది.Vreels యాప్ డౌన్‌లోడ్ చేసుకోనే లింక్‌లు కింద ఉన్నాయి.ఆండ్రాయిడ్‌ యూజర్లుhttps://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsయాపిల్‌ యూజర్లుhttps://apps.apple.com/us/app/vreels/id6744721098 కింది క్యూఆర్‌ కోడ్‌లు స్కాన్‌ చేసి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

India To Earn Record Prize Money If They Win World Cup Final 20253
WC 2025: కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ!.. బీసీసీఐ బంపరాఫర్‌

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌-2025 టోర్నమెంట్‌ తుది అంకానికి చేరుకుంది. నవీ ముంబై వేదికగా భారత్‌- సౌతాఫ్రికా (IND W vs SA W) మధ్య ఆదివారం నాటి ఫైనల్‌తో ఈ టోర్నీలో కొత్త చాంపియన్‌ అవతరించనుంది.ఈ ఈవెంట్లో ఇప్పటికే రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన టీమిండియా.. తొలిసారి ఫైనలిస్టు అయిన సౌతాఫ్రికా... ప్రస్తుత బలాబలాల దృష్ట్యా టైటిల్‌ పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త చాంపియన్‌ రాకతో పాటు.. ఈసారి వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీకి మరో ప్రత్యేకత కూడా ఉంది.కళ్లు చెదిరే ప్రైజ్‌మనీవిజేతగా నిలిచిన జట్టుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ ప్రకటించింది. పురుషుల, మహిళల క్రికెట్‌లో రికార్డు స్థాయిలో చాంపియన్‌కు ఏకంగా 4.48 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 39.78 కోట్లు) ఇవ్వనుంది.123 కోట్ల రూపాయలుఅదే విధంగా.. రన్నరప్‌ జట్టుకు.. విజేతకు అందించిన నగదులో సగం అంటే 2.24 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు (దాదాపు రూ. 19 కోట్లకు పైగా) ప్రైజ్‌మనీగా ప్రకటించింది. భారత్‌- శ్రీలంక సంయుక్త ఆతిథ్య దేశాలుగా ఉన్న ఈ టోర్నీ ప్రైజ్‌మనీల మొత్తానికి ఐసీసీ ఏకంగా 13.88 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు అంటే... దాదాపు 123 కోట్ల రూపాయలు కేటాయించింది.239 శాతం పెంచారువరల్డ్‌కప్‌ టోర్నీ చరిత్రలోనే ఇది అత్యధికం. వన్డే వరల్డ్‌కప్‌-2022 ఎడిషన్‌తో పోలిస్తే ఇది ఏకంగా 297 శాతం ఎక్కువ కావడం విశేషం. అంతేకాదు.. నాటి విజేత ఆస్ట్రేలియాకు ఇచ్చిన ప్రైజ్‌మనీ కంటే తాజా సీజన్‌ విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్‌మనీని ఏకంగా 239 శాతం పెంచడం గమనార్హం.రూ. 42 కోట్లకుఇక ఈ టోర్నీలో భారత్‌ ఇప్పటికే దాదాపు 3,50,000 యూఎస్‌ డాలర్ల ప్రైజ్‌మనీ (సుమారుగా 3.1 కోట్ల రూపాయలు) సొంతం చేసుకుంది. టోర్నీలో పాల్గొన్నందుకు, గ్రూప్‌ దశలో మూడు విజయాలకు గానూ ఈ మొత్తం టీమిండియాకు లభించింది. అన్నీ సజావుగా సాగి భారత్‌ చాంపియన్‌గా అవతరిస్తే మొత్తం ప్రైజ్‌మనీ రూ. 42 కోట్లకు చేరుకుంటుంది.మరోవైపు.. సౌతాఫ్రికా ఇప్పటికే నాలుగు లక్షల యూఎస్‌ డాలర్లకుపైగా గెలుచుకుంది. గ్రూప్‌ దశలో ఐదు విజయాలు సాధించి ఈ మొత్తం సొంతం చేసుకుంది. ఏదేమైనా క్రికెట్‌ ప్రపంచంలో పురుష జట్ల ఆధిపత్యం కొనసాగుతున్న వేళ.. మహిళా టోర్నీలో రికార్డు స్థాయి ప్రైజ్‌మనీ అందించడం హర్షించదగ్గ పరిణామం. మహిళా క్రికెట్‌కు ఆదరణ పెంచడంతో పాటు.. యువ ఆటగాళ్లను ఆకర్షించడానికి ఇలాంటి చర్యలు తోడ్పడతాయి.బీసీసీఐ బంపరాఫర్‌!ఇదిలా ఉంటే.. ఒకవేళ హర్మన్‌ సేన గనుక వన్డే వరల్డ్‌కప్‌ గెలిస్తే.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) మహిళా క్రికెటర్లుకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోందని సమాచారం. పురుష క్రికెటర్లతో పాటు మహిళా ప్లేయర్లకు కూడా సమవేతనం చెల్లించాలనే యోచనలో ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి. మరోవైపు.. హర్మన్‌సేన ట్రోఫీ గెలిస్తే బీసీసీఐ రూ. 125 కోట్ల నజరానా ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. కాగా నవీ ముంబై వేదికగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు భారత్‌- సౌతాఫ్రికా మధ్య ఫైనల్‌కు తెరలేస్తుంది.చదవండి: IND vs AUS 3rd T20: సమం చేసేందుకు సమరం

Jubilee Hills By-Election Campaign in Full Swing4
రేసు మొదలైంది: ముగ్గురు నేతలు, ఒక విజేత!

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ‘జూబ్లీహిల్స్‌’ ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పక్షాలకు అగ్ని పరీక్షగా మారింది. అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీలు గెలుపు కోసం అవసరమయ్యే అన్ని అ్రస్తాలను ప్రయోగిస్తూ సర్వశక్తులొడ్డుతున్నాయి. అధికార కాంగ్రెస్‌ అభివృద్ధి మంత్రం, బీసీ కార్డు, సినీ కార్మికుల సంక్షేమం, మైనారిటీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం వంటివి కాగా.. బీఆర్‌ఎస్‌ సానుభూతి, మూడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం, ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారంటీల బాకీ కార్డు, ప్రత్యర్థుల కుటుంబ నేపథ్యం తమకు కలిసి వచ్చే అంశాలుగా భావిస్తోంది. బీజేపీ హిందూత్వ ఎజెండా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మల్చుకుంటోంది. మూడు పక్షాలూ హేమాహేమీలను ఎన్నికల ప్రచారంలో దింపడంతో మాటల తూటాలు రాజకీయ అగ్గి రాజేస్తున్నాయి. ఆయా పారీ్టల గెలుపోటములపై బలాలతో పాటు బలహీనతలు ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు అనుకూల అంశాలు రాష్ట్రంలో అధికారంలో ఉండటం, కేవలం రెండు నెలల్లో రూ.150 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులు, రాష్ట్ర మంత్రి వర్గంలో మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన అజహరుద్దీన్‌కు మంత్రివర్గంలో అవకాశం కల్పించడం, పార్టీ అభ్యరిత్వం ఎంపికలో బీసీ కార్డు ప్రయోగం. ఎన్నికల బరిలో దిగిన యువనేత నవీన్‌ యాదవ్‌కు వ్యక్తిగత పరిచయాలు, మజ్లిస్, వాపపక్షాలు, టీజేసీ, సినీ కారి్మకులు, బీసీ సంఘాల మద్దతు, సీఎంతో పాటు ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్, మంత్రులు ఫోకస్‌ పెట్టడం. గత 12 ఏళ్లుగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే వైఫల్యాలు. ప్రతికూల అంశాలు: నియోజకవర్గంలో సంస్థాగత పట్టుతో పాటు స్థానిక ప్రాతినిధ్యం లేకపోవడం, పార్టీలలోని కొత్త, పాత కేడర్‌లో అంతర్గత కుమ్ములాటలు, కొరవడిన సమన్వయం, నవీన్‌ యాదవ్‌ కుటుంబ నేపథ్యం, దివంగత మాగంటి గోపీనాథ్‌ మూడు పర్యాయాల పాటు ప్రాతినిధ్యం వహించడం. బీఆర్‌ఎస్‌కు గట్టి కేడర్, గడిచిన రెండేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యర్థుల ప్రచారం తదితర అంశాలు ప్రభావం చూపనున్నాయి. బీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశాలు.. సానుభూతి గత మూడు పర్యాయాల పాటు ప్రాతినిధ్యం, సంస్థాగతంగా గట్టి ఓటు బ్యాంక్, స్థానిక ప్రాతినిధ్యం, ముస్లిం మైనారిటీల్లో పట్టున్న సోషల్‌ వర్కర్‌ పారీ్టలో చేరడం, ఎన్నికల ప్రచార భారాన్ని మొత్తాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన భుజస్కంధాలపై వేసుకోవడం, గత రెండేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారంటీల బాకీ కార్డు. ప్రతికూల అంశాలు: అధికారంలో లేకపోవడం, పలువురు ముఖ్య నేతలు, కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించడం, అధికారంలో ఉన్నప్పుడు మిత్రపక్షమైన మజ్లిస్‌ కాంగ్రెస్‌ పంచన చేరడం. తాజాగా అధికార కాంగ్రెస్‌ అభివృద్ధి మంత్రం, ప్రత్యర్థి యువకుడు కావడంతో పాటు వ్యక్తిగత పరిచయాలు అధికంగా ఉండటం.కమలం పార్టీకి అనుకూల అంశాలు హిందూత్వ ఎజెండా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్మిషా. కేంద్రంలో అధికారంలో ఉండటం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ మాజీ మజ్లిస్‌ నేత కావడం, మజ్లిస్‌ బేషరతుగా మద్దతు ఇవ్వడం, టీడీపీ, జనసేన పారీ్టల మద్దతు. అభ్యర్థి దీపక్‌ రెడ్డికి విరివిగా వ్యక్తిగత పరిచయాలు ఉండటం ప్రతికూల అంశాలు: సంస్థాగతంగా బలహీనంగా ఉండటం. స్థానిక ప్రాతినిధ్యం లేకపోవడం. బీజేపీ పోటీ చేయడం రెండోసారి కావడం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 14% ఓట్లు లభించడం. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లతో పోలిస్తే పారీ్టకి బలమైన కేడర్‌ నెట్‌వర్క్‌ లేకపోవడం.

Berkshire cash sets record signaling caution ahead of Warren Buffett exit5
బెర్క్‌షైర్ భారీ నగదు నిల్వలు.. దేనికి సంకేతాలు?

లాభాలు పెరిగినప్పటికీ, మార్కెట్లపై అప్రమత్త ధోరణిని చూపిస్తూ బెర్క్‌షైర్ (Berkshire) హాతవే సంస్థ రికార్డు స్థాయి నగదు నిల్వలను ప్రకటించింది. కంపెనీ నగదు నిల్వలు మూడవ త్రైమాసికంలో 381.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది బెర్క్‌షైర్ చరిత్రలో అత్యధికం.వారెన్ బఫెట్ (Warren Buffett) సీఈఓ హోదాలో తన చివరి త్రైమాసిక నివేదికను విడుదల చేసిన సందర్భంలో ఈ ప్రకటన వచ్చింది. 95 ఏళ్ల బఫెట్ ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ చేయనున్నారు.స్టాక్ విక్రయాలు, బైబ్యాక్ నిలిపివేతబెర్క్‌షైర్ వరుసగా 12వ త్రైమాసికంలో కొనుగోలు కంటే ఎక్కువ స్టాక్స్‌ను విక్రయించింది. దాని 283.2 బిలియన్ డాలర్ల ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో యాపిల్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి హోల్డింగ్స్ ఉన్నాయి. కంపెనీ ఐదవ వరుస త్రైమాసికంగా తన సొంత స్టాక్ బైబ్యాక్‌ను నిలిపివేసింది. అయినప్పటికీ దాని షేర్ ధర విస్తృత మార్కెట్‌ను మించకపోవడం గమనార్హం.లాభాల్లో పెరుగుదల, కానీ వృద్ధి మందగింపుతక్కువ బీమా నష్టాలు మూడవ త్రైమాసిక ఆపరేటింగ్ లాభాన్ని 34% పెంచి 13.49 బిలియన్ డాలర్లకు చేర్చాయి. ఇది విశ్లేషకుల అంచనాలను మించిపోయింది. నికర లాభం 17% పెరిగి 30.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే మొత్తం ఆదాయం కేవలం 2% మాత్రమే పెరిగింది. ఇది అమెరికా ఆర్థిక వృద్ధి రేటుకంటే తక్కువ.కంపెనీ ప్రకారం.. ఆర్థిక అనిశ్చితి, వినియోగదారుల విశ్వాసం తగ్గడం ప్రధాన అవాంతరాలుగా మారాయి. ఈ ప్రభావం క్లేటన్ హోమ్స్, డ్యూరాసెల్, ఫ్రూట్ ఆఫ్ ది లూమ్, స్క్విష్‌మాలోస్ తయారీదారు జాజ్వేర్స్ వంటి అనుబంధ వ్యాపారాలపై కనిపించింది.నాయకత్వ మార్పు దిశగా..వారెన్‌ బఫెట్ వైదొలుగుతున్న తరుణంలో, 63 ఏళ్ల గ్రెగ్ అబెల్ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బఫెట్ మాత్రం చైర్మన్‌గా కొనసాగుతారు. కాగా అబెల్.. బఫెట్‌ కంటే కూడా “మరింత హ్యాండ్-ఆన్” మేనేజర్‌గా ప్రసిద్ధి చెందారు. ఈ నేపథ్యంలో బెర్క్‌షైర్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.👉 ఇది ఇంకా చదవలేదా? అదిగో భారీ క్రాష్‌.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్‌!

Chandrababu Diversion Politics On Jogi Ramesh Arrest6
బాబు డైవర్షన్‌ డ్రామా.. 18 నెలల్లో ఎన్ని కథలంటే?

సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్‌ మరో డైవర్షన్‌ డ్రామాకు తెరలేపింది. శ్రీకాకుళంలోని కాశీబుగ్గ తొక్కిసలాట డైవర్ట్‌ కోసం మాజీ మంత్రి జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేసింది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిందని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకునేందుకు కూటమి సర్కార్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోంది. గతంలో పలుమార్లు కూటమి సర్కార్‌పై ప్రజాగ్రహం వచ్చిన ప్రతీసారి బాబు డైవర్షన్‌ డ్రామాలకు తెరలేపారు. దీంతో, డైవర్షన్‌ పాలిటిక్స్‌లో మాస్టర్‌గా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని సోషల్‌ మీడియాలో పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు వైఫల్యం చెందినా చంద్రబాబు డైవర్షన్‌ డ్రామాలకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్‌సీపీ నేతలపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసిన టీడీపీ నేతలను వదిలేసి వైఎస్సార్‌సీపీ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారు. నకిలీ మద్యం కేసులో ప్లాన్‌ ప్రకారం మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఇరికించి అక్రమంగా అరెస్ట్‌ చేశారు. టీడీపీ పెద్దల ప్లాన్‌ ప్రకారం జోగి రమేష్‌ అరెస్ట్‌ జరిగింది. జోగి రమేష్‌ను అరెస్ట్‌ చేస్తామని మంత్రులు ఇప్పటికే చాలాసార్లు పలు మీడియా సమావేశాల్లో చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు కాశీబుగ్గ ఘటనను డైవ‍ర్ట్‌ చేసేందుకు జోగి రమేష్‌ను అరెస్ట్‌ చేశారు. 18 నెలల కాలంలో బాబు డైవర్షన్లు..2024లో విజయవాడ వరదల్ని డైవర్ట్‌ చేసేందుకు బ్యారేజీని బోట్లతో ఢీకొట్టబోయారంటూ చంద్రబాబు డ్రామా.వంద రోజుల పాలన పూర్తి అయిన సమయంలో తిరుమల లడ్డు కల్తీ డ్రామా.ఉచిత ‍గ్యాస్‌పై ప్రజలు ప్రశ్నిస్తున్నారనగానే రూ.14 లక్షల కోట్ల అప్పు అంటూ ప్రచారం.గత డిసెంబర్‌ తుపాను సమయంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేషన్‌ తనిఖీల పేరుతో హడావుడి.తిరుపతి తొక్కిసలాటకు బాధ్యులైన టీటీడీ చైర్మన్‌, టీటీడీ ఈవో, ఎస్పీని వదిలేసి సంబంధం లేని అధికారులపై చర్యలు.చంద్రబాబు దావోస్‌ పర్యటన ఫెయిల్యూర్‌ను డైవర్ట్‌ చేసేందుకు నీతి ఆయోగ్‌ రిపోర్టు పేరుతో నాటకాలు.ఫిబ్రవరిలో ఏపీలో రిజిస్ట్రేషన్ల బాదుడు నుంచి డైవర్ట్‌ కోసం వంశీ అరెస్ట్‌.కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయంపై దృష్టి మరల్చేందుకు పోసాని అక్రమ అరెస్ట్‌.ఏపీ బడ్జెట్‌లో సూపర్‌ సిక్స్‌కు గుండుసున్నా పెట్టారు. దాన్ని డైవర్ట్‌ చేసేందుకు లిక్కర్‌ కేసును తెర మీదకు తెచ్చారు.సింహాచలం చందనోత్సవం వైఫల్యం నుంచి తప్పించుకునేందుకు మిథున్‌ రెడ్డిపై కేసు. డైవర్షన్‌లో భాగంగా కాకాణి గోవర్థన్‌పై అక్రమ కేసు. ఇప్పుడు కాశీబుగ్గ ఘటనను డైవర్ట్‌ చేసేందుకు జోగి రమేష్‌ అరెస్ట్‌తో డైవర్షన్‌. కక్ష సాధింపులో భాగంగా..మరోవైపు నకిలీ మద్యం కేసుకు సంబంధించిన ప్రశ్నలు గుప్పిస్తున్న, సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్‌ చేసింది. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని నేతల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. ఇందులో మేడపాటి నాగిరెడ్డితో పాటు బీసీ సెల్‌ అధ్యక్షుడు కుంచం జయరాజు కూడా ఉన్నారు. వాళ్ల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే.. మంత్రి లోకేష్, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఫేక్‌ పోస్టులు పెట్టారని, టీడీపీ నేతలు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారని, అందుకే విచారణ జరుపుతున్నామని పోలీసులు అంటున్నారు.

Medak cremation ground incident7
చితిలోనుంచి శవాన్ని బయటకులాగి..

మెదక్‌ జిల్లా (తూప్రాన్‌): సగం కాలిన శవాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చితి నుంచి బయటపడేశారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా చేగుంటలో శనివారం వెలుగు చూసింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. చేగుంటకు చెందిన కర్రె నాగమణి (70) శుక్రవారం మృతి చెందగా అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. రెండో రోజు కార్యక్రమం నిర్వహించేందుకు శనివారం కుటుంబీకులు శ్మశానానికి వెళ్లి చూడగా సగం కాలిన నాగమణి మృతదేహం చల్లార్చి చితి పక్కకు పడేసి కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న మురాడి నర్సమ్మ కుటుంబీకులు సైతం శ్మశానానికి చేరుకొని చూడగా నర్సమ్మ చితికి సంబంధించిన బూడిదను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల మృతి చెందిన పోచమ్మ, మల్లయ్యకు సంబంధించిన పుర్రెతో పాటు ఎముకలను కూడా ఎత్తుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు. అయితే ఎముకలు, పుర్రెలను మృతదేహం నోటిలో ఉంచే బంగారం కోసమా? అసలు ఎందుకు ఎత్తుకెళుతున్నారో తెలియడం లేదు. విచారణ జరుపుతామని ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

Bigg Boss 9 Telugu: Demon Pavan Apologised by Neel Down In Front of Nagarjuna8
షో ఇమేజ్‌ ఏం కాను? నాగ్‌ ఉగ్రరూపం.. మోకాళ్లపై కూర్చుని పవన్‌ వేడుకోలు

వీకెండ్‌ వచ్చిందంటే క్లాసులు పీకడమే నాగార్జున చేసే ఏకైక పని. సంజనా, ఇమ్మాన్యుయేల్‌, కల్యాణ్‌, భరణికి పెద్ద లెక్చర్‌లే ఇచ్చాడు. కానీ పవన్‌ను మాత్రం ఏకంగా ఏడిపించేశాడు. ఇంతకీ హౌస్‌లో ఏం జరిగిందో శనివారం (నవంబర్‌ 1వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..బెస్ట్‌ కెప్టెన్‌రేషన్‌ మేనేజర్‌ తనూజ (Thanuja Puttaswamy)కే ఆర్డర్‌ వేస్తావా? అని కల్యాణ్‌ను, నామినేషన్‌ చేసిన పాయింటే తప్పని ఇమ్మాన్యుయేల్‌ను ఏకిపారేశాడు నాగ్‌. సుమన్‌ను అసమర్థ కెప్టెన్‌ అన్న సంజనాని సైతం తప్పుపట్టాడు. ప్రేక్షకులతో సుమన్‌ బెస్ట్‌ కెప్టెన్‌ అనిపించేలా చేశాడు. కెప్టెన్సీ గేమ్‌లో భరణి గోడమీద పిల్లిలా సేఫ్‌ గేమ్‌ ఆడటాన్ని ఖండించాడు. ఇలాగే ఉంటే ఎక్కువరోజులు ఉండలేవని వార్నింగ్‌ ఇచ్చాడు. ఇక వారమంతా ఎప్పుడుపడితే అప్పుడు గొడవలు పెట్టుకుంటూ, దాన్ని సాగదీస్తూ మహా చిరాకు తెప్పించారు పవన్‌-రీతూ. డోర్స్‌ ఓపెన్‌వీళ్లకు నాగార్జున గట్టి క్లాస్‌ పీకితేకానీ బుద్ధి రాదని ప్రేక్షకులు ఎదురుచూశారు. తీరా నాగార్జున (Nagarjuna Akkineni) ఊహించినదానికన్నా ఎక్కువ సీరియస్‌ అవడంతో పవన్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆడపిల్లను తోసేస్తావా? మ్యాన్‌ హ్యాండ్లింగ్‌ చేస్తావా? నీ బ్యాగులు సర్దుకో.. డోర్స్‌ ఓపెన్‌ అంటూ తక్షణమే వెళ్లిపోవాలన్నాడు. ఆ మాటకు పవన్‌ నిలువెల్లా వణికిపోయాడు. ఇంకోసారి ఆ తప్పు రిపీట్‌ చేయను సార్‌ అని వేడుకున్నాడు. చేతులు జోడించి వేడుకున్న పవన్‌అటు రీతూ (Rithu Chowdary) కూడా.. ఇద్దరం గొడవపడుతున్నాం.. నేను వెళ్లిపోతున్నాననే ఆవేశంలో అలా తోశాడు. ఈసారికి వదిలేయండి అని వేడుకుంది. అయినా నాగ్‌ కనికరించలేదు. బిగ్‌బాస్‌ ఇంటి డోర్‌ తెర్చుకోవడంతో పవన్‌కు ధైర్యం చెప్పే ‍ప్రయత్నం చేసింది రీతూ. నువ్వు కోపంలో అలా చేశావ్‌, నాకు తెలుసు.. స్ట్రాంగ్‌గా ఉండు.. సార్‌కు అర్థమయ్యేలా వివరించు.. ఆయనకు సారీ చెప్పు అని బోధించింది. దీంతో అతడు సారీ సర్‌.. ఇంకోసారి రిపీట్‌ చేయను, ఈ ఒక్కసారికి క్షమించండి అని దీనంగా చేతులు జోడించి అడిగాడు. క్షమించేది లేదన్న నాగ్‌ఈసారి నాగార్జున హౌస్‌మేట్స్‌ అభిప్రాయాలు అడగ్గా.. ఎవరూ కూడా అతడికి ఎలిమినేట్‌ అయ్యేంత పెద్ద శిక్ష విధించాలని కోరుకోలేదు. అ‍ప్పుడు నాగ్‌.. ఇది హౌస్‌కు మాత్రమే సంబంధించిన విషయం కాదు, షో ఇమేజ్‌కు సంబంధించింది. మీ తరువాత వచ్చేవాళ్లు ఈ సంఘటనను చూసి ఇలాగే ప్రవర్తిస్తే షో పడిపోతుంది. కాబట్టి నేను క్షమించలేను అన్నాడు. ఇంతలో రీతూ మాట్లాడుతూ.. వాడు నన్నేదో చేయాలనే ఉద్దేశం కాదు సార్‌.. ఇద్దరం గొడవపడుతుంటే మాట వినకుండా వెళ్లిపోతున్నాననే అలా నెట్టాడు. అంత చిన్నదానికి హౌస్‌లో నుంచి పంపించొద్దు అని బతిమాలింది. మోకాళ్లపై కూర్చుని సారీ అందుకు నాగ్‌ మాట్లాడుతూ.. మాధురి మీది అన్‌హెల్దీ బాండ్‌ అన్నప్పుడు చాలా కోపం వచ్చింది. అలా అనడానికి ఆమెకేం హక్కు ఉందనిపించింది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీది కచ్చితంగా అన్‌హెల్దీ బాండింగే.. అని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. రీతూకే కాదు, ఆడియన్స్‌కు కూడా క్షమాపణ చెప్పాలని పవన్‌ను ఆదేశించాడు. దీంతో పవన్‌.. రీతూ కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు. మోకాళ్లపై కూర్చుని.. నేనలా చేసి ఉండకూడదంటూ తలవంచుకుని సారీ చెప్పాడు. అప్పటికి శాంతించిన నాగార్జున.. తెరుచున్న బిగ్‌బాస్‌ ఇంటి డోర్లను మూయించేశాడు.చదవండి: పవన్‌కి రెడ్ కార్డ్.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే?

Yadaiah Family Incident At Vikarabad9
వికారాబాద్‌లో దారుణం.. భార్యపై అనుమానంతో వదిన, కూతురును..

సాక్షి కులకచర్ల: వికారాబాద్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కులకచర్ల మండల కేంద్రంలో భార్య, ఇద్దరు పిల్లలు, వదినను వేపూరి యాదయ్య అనే వ్యక్తి కత్తితో దారుణంగా నరికి చంపాడు. అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం.. యాదయ్య, అలవేలు భార్యాభర్తలు. వారికి అపర్ణ, శ్రావణి ఇద్దరు కుమార్తెలు. రోజువారీ కూలీగా పనిచేసే యాదయ్యకు భార్య అలవేలుపై అనుమానం ఎక్కువ అని కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. ఆమెపై అనుమానంతో ప్రతీరోజు గొడవ పడేవాడని చుట్టుపక్కల వారు తెలిపారు. ఈ క్రమంలోనే వారం రోజులుగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. భార్యను యాదయ్య తీవ్రంగా కొట్టినట్టు కూడా తెలిసింది.దీంతో, ఇద్దరిని రాజీ చేసేందుకు వదిన హన్మమ్మ వారి ఇంటికి వచ్చింది. శనివారం రాత్రి వారి మధ్య చర్చలు జరిగాయి. ఆ తరువాత అందరూ పడుకున్న సమయంలో అర్ధరాత్రి యాదయ్య దారుణానికి ఒడిగట్టాడు. భార్య అలవేలు (32), కూతురు శ్రావణి (13), వదిన హన్మమ్మ (40)ను కోడవలితో గొంతుకోసి హత్య చేశాడు. పెద్దకుమార్తె అపర్ణపై కూడా దాడి చేయబోగా ఆమె తప్పించుకొని పారిపోయింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పడంతో.. వారు వచ్చేలోపే యాదయ్య ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌ హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. నలుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Funday Cover Story On One minute reels10
స్క్రోలాటం చిట్టి రీల్స్‌.. గట్టి ఆదాయం

నవ్వించు, ప్రేరేపించు, షేర్‌ చేయించు ఇవన్నీ రెండు నిమిషాల్లోనే! ఇక్కడ సమయం తక్కువ, ఐడియాలు ఎక్కువ. కాని, పవర్‌ మాత్రం మ్యాక్స్‌! టైమింగ్‌లో రీల్స్‌ కంటే ఎక్కువ, షార్ట్‌ ఫిల్మ్‌ కంటే తక్కువ. కానీ, ఫుల్‌ ఎంటర్‌టైన్ మెంట్, ఫుల్‌ ఇంపాక్ట్, ఫుల్‌ మనీ! అవే, ఈ టూ మినిట్స్‌ వీడియోల చిన్న సినిమాలు! అందుకే, ఇవి రీల్స్‌నే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ ఫాస్ట్‌ ఇంపాక్ట్‌ ఇస్తున్నాయి.చిన్న వీడియోల పెద్ద హంగామాఒకప్పుడు సినిమా థియేటర్లో మూడు గంటలు కూర్చుని ఒక కథ చూస్తే, ఇప్పుడు అదే ఎమోషన్, అదే మెసేజ్, అదే ఫీల్‌ను రెండు నిమిషాల వీడియోలోనే చూస్తున్నాం! కారణం? డిజిటల్‌ ప్రపంచం వేగంగా పరుగులు తీస్తోంది. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లు, డేటా ఇవన్నీ కలసి మనకు రీల్స్‌ స్క్రోలింగ్‌ అనే ఒక కొత్త అలవాటు తెచ్చాయి. ఇప్పుడు ఆ రీల్సే కాస్త పెద్దవై షార్ట్‌ స్క్రోలింగ్‌ సినిమాలుగా మారాయి. అందుకే, ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, జోష్, మోజ్‌ ఏ యాప్‌ తెరిచినా ఒక్కో స్క్రోల్‌లోనే నవ్వు, డ్రామా, పాట, డ్యాన్ ్స, ట్రెండ్, ఎమోషన్ అన్నీ మీ చేతిలోకి వస్తున్నాయి, అది కూడా రెండు నిమిషాల్లోనే! ఇంతలోనే వాటికి మిలియన్ల వ్యూస్, కోట్ల లైక్స్, సూపర్‌స్టార్‌ ఫేమ్‌. ఈ రెండు నిమిషాల ఫేమ్‌తో లక్షల ఆదాయం కూడా వస్తోంది.ఎందుకు ఈ పిచ్చి?మనిషి మైండ్‌ ఇప్పుడు ఫాస్ట్‌ మోడ్‌లో ఉంది. తక్కువ టైమ్‌లో ఎక్కువ ఎంటర్‌టైన్ మెంట్‌ కావాలని కోరుకుంటోంది. పది నిమిషాల వీడియో ఎవరు చూస్తారు? అదే తొంభై సెకన్లలో నవ్వు, ప్రేమ, డ్యాన్ ్స, డ్రామా అన్నీ ఇస్తే, దాన్ని మిస్సవ్వడం కష్టం! అందుకే మనసు వెంటనే ‘నెక్ట్స్‌’ అంటుంది. ఇదే డోపమైన్ లూప్‌. ప్రతి స్క్రోల్‌లో చిన్న సంతోషం, ప్రతి వీడియోలో కొత్త హిట్‌. సైకాలజిస్టుల మాట ప్రకారం, చిన్న వీడియోలు మన మెదడులో ‘ఇన్ స్టంట్‌ రివార్డ్‌’ ఫీలింగ్‌ కలిగిస్తాయి. అందుకే మనం ‘ఇంకో వీడియో మాత్రమే’ అని మళ్లీ మళ్లీ స్క్రోల్‌ చేస్తూనే ఉంటాం! వీటిలో యూట్యూబ్‌ షార్ట్స్‌ వీడియోస్‌కు ఎక్కువ క్రేజ్‌ రావడంతో, క్రియేటర్లు యూట్యూబ్‌ షార్ట్‌ ఫిల్మ్, వీడియోస్‌ కంటే రీల్స్‌లోనే తమ క్రియేటివిటీతో కథలను సృష్టిస్తున్నారు. అలా ‘ఒక్క నిమిషం చాలదు, రెండు నిమిషాలైనా ఇవ్వండి!’ అని క్రియేటర్లు డిమాండ్‌ చేసినప్పుడు, యూట్యూబ్‌ ‘సరే! మీకు 180 సెకన్లు!’ అని అంగీకరించింది. ఈ నేపథ్యం వలనే వివిధ రకాల సోషల్‌ మీడియా యాప్స్‌ కూడా ఈ రెండు, మూడు నిమిషాల వీడియోలకు ఆసక్తి చూపించడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం, టిక్‌టాక్, యూట్యూబ్‌ షార్ట్స్‌ నిడివి మూడు నిమిషాల వరకు పొడుగవుతుండగా, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ కూడా పొడవవుతున్నాయి! అలా ఇప్పుడు ప్రపంచం మొత్తం టూ మినిట్స్‌ రివల్యూషన్‌ మొదలైంది. క్విక్‌ కరెన్సీగా!వాణిజ్య ప్రకటనలు అంటే పెద్ద క్యాంపెయిన్, టీవీ యాడ్స్, బిల్‌బోర్డులను అనుకుంటే, ఇప్పుడు అవి మొబైల్‌లో ఒక్క స్క్రోల్‌తో సరిపోతుంది! మార్కెటింగ్‌ ఇప్పుడు డైలాగ్‌ కాదు, రెండు నిమిషాల డ్రామాగా మారింది. ఫ్లిప్‌కార్ట్‌ రీల్స్‌లో డిస్కౌంట్‌ చెబుతుంది, స్విగ్గీ రీల్స్‌లో కర్రీ చూపిస్తుంది, మీషో రీల్స్‌లో సేల్స్‌ పెంచుతుంది! పక్కా మార్కెటింగ్‌ కన్సల్టెంట్స్‌ అందరూ ఇదే మంత్రం ‘ప్రోడక్ట్‌ ఎంత గొప్పదో కాదు, రెండు నిమిషాల్లో ఎవరి మనసు దోచుకుంటామో అదే బ్రాండ్‌ సక్సెస్‌!’ అంటున్నారు. వీటికి కంటెంట్‌ క్రియేటర్స్, ఇన్ ఫ్లుయెన్సర్స్‌ తోడవటంతో, బ్రాండ్స్‌కు క్రియేటర్లకు షార్ట్‌ వీడియోలు ఒక క్విక్‌ కరెన్సీగా మారాయి. స్టార్టప్స్‌ కూడా ఈ షార్ట్‌ వీడియోస్‌ ఆధారంగా కస్టమర్‌ను కట్టిపడేస్తున్నాయి. సంక్లిష్టమైన టెక్నాలజీని కేవలం రెండు నిమిషాల్లో అర్థమయ్యేలా చూపించి, మార్కెటింగ్‌లో కొత్త ఫ్యాషన్‌ క్రియేట్‌ చేశారు. మార్కెటింగ్‌ నిపుణుల ప్రకారం, 2026 నాటికి ప్రపంచం చూసే కంటెంట్‌లో 70 శాతం షార్ట్‌ వీడియోలే ఉంటాయి. సినిమా ట్రైలర్లు, యూనివర్సిటీ క్యాంపెయిన్లు, ఏ సందేశాలు అయినా ఇప్పుడు రీల్‌ రూట్‌లోనే అందరికీ చేరుతున్నాయి.అంతర్జాతీయ స్థాయిలో..ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘స్క్రోల్, ప్లే, షేర్‌!’ అనే రిథమ్‌లో నడుస్తోంది. అందుకే, ప్రపంచ వ్యాప్తంగా టిక్‌టాక్, యూట్యూబ్‌ షార్ట్స్, ఇన్ స్టాగ్రామ్‌ రీల్స్, క్వాయ్, మోజ్, జోష్‌ కలిపి 80 శాతం మొబైల్‌ డేటా వినియోగానికి కారణం. ఈ కారణంగానే 2020లో యూజర్లు రోజుకు సుమారు 35 నిమిషాలు స్క్రోల్‌ చేస్తే, ఇప్పుడు 80 నిమిషాలు స్క్రోల్‌ చేస్తున్నారట! అందులో మన దేశం ముందు వరుసలో ఉంది. రోజుకు సుమారు 65 కోట్ల మంది యూజర్లు ఈ షార్ట్‌ వీడియోస్‌ వీక్షిస్తారు. ముఖ్యంగా తెలుగు, తమిళం, హిందీ వంటి ప్రాంతీయ భాషల కంటెంట్‌కు డిమాండ్‌ ఎక్కువ. అందుకే, స్థానిక క్రియేటర్లు ఇప్పుడు గ్లోబల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లుగా ఎదుగుతున్నారు. ఈ నేపథ్యంలో, ‘2025 గ్లోబల్‌ షార్ట్‌ వీడియోస్‌ ట్రెండ్స్‌’ సర్వే ప్రకారం, వివిధ సంస్థలు పరిశీలించిన ఫలితాలను వెల్లడి చేశారు. వివిధ మొబైల్‌ యాప్‌ల డేటా, యూజర్‌ సర్వేలు, సోషల్‌ మీడియా విశ్లేషణల ద్వారా, ఒక్కో దేశంలో ప్రత్యేక కంటెంట్, ట్రెండ్స్‌ స్పష్టమయ్యాయి. ప్రతి చోటా స్థానిక భాషలు, సంస్కృతులు ఆధారంగా షార్ట్‌ వీడియోలు కొత్త దారులు సృష్టిస్తున్నాయి.డబుల్‌ లైఫ్‌!ఉదయం బాస్‌ ‘మీటింగ్‌ టైమ్‌’ అంటాడు, రాత్రి ఫాలోవర్స్‌ ‘రీల్‌ టైమ్‌’ అంటారు! ఇలా రెండు ప్రపంచాల మధ్య బ్రిడ్జ్‌ వేసుకుని నడుస్తున్నవారే డబుల్‌ లైఫ్‌ ఇన్ ఫ్లుయెన్సర్లు! పగలు ఆఫీస్‌లో ప్రెజెంటేషన్ ్స చేసి, రాత్రి కెమెరా ముందు ప్రెజెన్ ్స ఇస్తున్నారు. ఇలా ఇండియాలో ఇప్పటి వరకు 45 లక్షల షార్ట్‌ వీడియో క్రియేటర్లు ఉన్నారని, వారిలో దాదాపు 60 శాతం మంది ప్రైవేట్‌ ఉద్యోగులు లేదా ఫ్రీలాన్సర్లు అని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. ప్రపంచం మొత్తం చూస్తే, సోషల్‌ మీడియాలోని క్రియేటర్లలో 40 శాతం మంది రెండు ఉద్యోగాలు చేస్తున్నార ని అంచనా. వీరిలో దాదాపు 6 లక్షల మంది క్రమంగా వీడియోల ద్వారా ఆదాయం పొందుతున్నారు. అంటే పగలు జీతం, రాత్రి వైరల్‌ వీడియోల ఆదాయం! దీంతో చాలామంది ప్రొఫెషనల్‌ ఉద్యోగం కంటే ఈ సైడ్‌ ఇన్ కమ్‌ పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆఫీస్‌లో ఇంక్రిమెంట్‌ రాకపోయినా, రీల్‌లో ఎంగేజ్‌మెంట్‌ పెరుగుతుంది! అందుకే, ఒక్క రీల్‌ సక్సెస్‌ అయితే నెల జీతం కన్నా ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది. వీరంతా ప్రతిరోజూ ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌లో లంచ్‌ బాక్స్‌తో పాటు మరో పక్క ట్రైపాడ్‌తో ఆఫీస్‌లకు వెళ్తూ, ఒక కొత్త వర్క్‌ కల్చర్‌తో పనిచేస్తున్నారు. మరికొందరు ‘వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌’ మాదిరి ‘వర్క్‌ ఫ్రమ్‌ రీల్‌’ అనే కొత్త ఫుల్‌ టైమ్‌ ఉద్యోగం చేస్తున్నారు! ఇలా వచ్చిన పాపులారిటీతో టీవీ షోలు, ఇంటర్వ్యూలు, బ్రాండ్‌ కొలాబరేషన్లు, సిల్వర్‌ స్క్రీన్ చాన్ ్సలు కూడా దక్కించుకుంటున్నారు. ఇలా సాధారణ ఉద్యోగుల కంటే వీరి జీవితం ఇప్పుడు మరింత ఆదాయభరితంగా, ఆనందభరితంగా, వైరల్‌గా మారింది. ఏఐ క్రియేటర్లు! ఇప్పటి క్రియేటర్లకు కెమెరా మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్ ్స కూడా పెద్ద సహాయంగా మారింది. వీడియో తీసేందుకు డైరెక్టర్, ఎడిటర్, మ్యూజిక్‌ డిజైనర్‌ అవసరం లేదు. ఏఐ వాయిస్, ఫేస్‌ ఫిల్టర్, స్మార్ట్‌ ఎడిటింగ్‌ యాప్‌లు ఇవే కొత్త టెక్నాలజీ టీమ్‌ మెంబర్స్‌. ఒక క్లిక్‌తో బ్యాక్‌గ్రౌండ్‌ మారిపోతుంది, వాయిస్‌ టోన్ అడ్జస్ట్‌ అవుతుంది, మూడ్‌కి సరిపోయే మ్యూజిక్‌ వచ్చేస్తుంది. కెమెరా ముందు ఉన్నది మనిషే కాని, వెనుక ఆలోచిస్తున్నది మొత్తం ఏఐనే. ఇదే కారణంగా ఇప్పుడు కంటెంట్‌ క్రియేటర్ల వేగం పెరిగింది. ఒకప్పుడు వీడియోకి రోజులు పట్టేది, ఇప్పుడు నిమిషాల్లో సిద్ధమవుతోంది!రీల్‌లోనే ఫీల్స్, డ్రీమ్స్‌! బ్రేక్‌అప్‌ అయినా, బర్త్‌డే అయినా ఇప్పుడు ప్రతి ఒక్క సందర్భానికి రీల్‌ తప్పనిసరి! ముఖ్యంగా 16 నుంచి 25 ఏళ్ల వయసు వారు ‘రియల్‌ లైఫ్‌ కంటే రీల్‌ లైఫ్‌ బెటర్‌!’ అని నమ్ముతున్నారు. సినిమా చూడటానికి ఓపిక లేదు కానీ, రీల్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ‘ఒక్క నిమిషం లవ్‌ స్టోరీ’, ‘30 సెకండ్ల అడ్వెంచర్‌’, ‘45 సెకండ్ల ట్రాజెడీ’ ఇవే ఇప్పుడు న్యూ ఏజ్‌ బ్లాక్‌బస్టర్స్‌! జెన్ జీ కి రీల్‌ అంటే భాష కాదు లైఫ్‌ స్టయిల్‌. ఇదే కారణంగా ఈ వయసు వారు సోషల్‌ మీడియాలో అత్యధికంగా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఫ్యాషన్ నుంచి ఫుడ్‌ వరకూ, ట్రావెల్‌ నుంచి ట్రెండ్‌ వరకూ అన్నీ వీళ్ల చేతుల్లోనే! అందుకే, అసలైన వైరల్‌ పవర్‌ కూడా వీరివద్దే దాగుంది. ప్రాంతీయ భాషల శక్తిప్రపంచం ఇంగ్లీష్‌లో మాట్లాడినా, సోషల్‌ మీడియాలో ఇప్పుడు ప్రాంతీయ భాషలే రాజ్యం చేస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో ఉన్న కంటెంట్‌ ఎక్కువగా వైరల్‌ అవుతోంది.వీక్షకులు తమ భాషలో ఉన్న కంటెంట్‌కి ఎక్కువగా కనెక్ట్‌ అవుతున్నారు. ఇందుకే ఇప్పుడు ప్రతి యాప్‌ కూడా ‘మీ భాషలో రీల్‌ క్రియేట్‌ చేయండి’ అని ప్రోత్సహిస్తోంది. తెలుగు క్రియేటర్ల రీల్స్‌ ఇప్పుడు గ్లోబల్‌ ట్రెండ్స్‌లోకి చేరాయి!రేపటి రియాలిటీ!భవిష్యత్తులో షార్ట్‌ వీడియోల ప్రపంచం మరింత టెక్‌ రిచ్‌గా మారబోతోంది. త్రీడీ వీడియోలు, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ కంటెంట్‌ ఇవే రేపటి రీల్స్‌. క్రియేటర్లు ఇప్పుడు కెమెరాతో కాదు, మెటావర్స్‌లో రికార్డు చేయబోతున్నారు! అప్పుడు ప్రేక్షకులు కేవలం వీడియో చూడరు, దానిలోకి అడుగుపెడతారు. అంటే రేపటి రీల్‌ కేవలం వినోదం కాదు. ఒక వాస్తవిక అనుభవం అవుతుంది! ఇప్పటికే కొంతమంది క్రియేటర్లు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు కూడా. త్వరలోనే రీల్స్‌ చూడటం కాదు, అందులో జీవించబోతున్నాం. భవిష్యత్తులో రెజ్యూమేలో డిగ్రీ కాదు. ఫాలోవర్స్‌ కౌంటే కెరీర్‌ డిసైడ్‌ చేస్తుందేమో! హై పెయిడ్‌ జాబ్స్‌లో షార్ట్‌ వీడియో క్రియేటర్‌ ఒకటిగా మారచ్చు కూడా! అప్పుడు, డాక్టర్‌ రీల్‌ మధ్యలో ఆపరేషన్ చేస్తాడు. లాయర్‌ వాదన మధ్యలో ‘లైక్, షేర్, సబ్‌స్క్రైబ్‌ ప్లీజ్‌!’ అంటాడు. టీచర్‌ కూడా కెమెరా ముందు ‘టుడేస్‌ ట్రెండ్‌!’ అని క్లాస్‌ మొదలుపెడుతుంది. ఇలా చాలామంది కంటెంట్‌ క్రియేటర్‌నే మెయిన్‌ జాబ్‌గా, మిగతా ఉద్యోగాలను పార్ట్‌టైమ్‌లా చేస్తారేమో!కిచెన్ నుంచి కెమెరా వరకు!భారతదేశంలో షార్ట్‌ వీడియోల రంగంలో మహిళల సంఖ్య ఆశ్చర్యకరంగా పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం 40 శాతం పైగా షార్ట్‌ వీడియో క్రియేటర్లు మహిళలే! వంటింటి కథల నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టిప్స్, ఫ్యాషన్ నుంచి ఫిట్‌నెస్‌ వరకు, మహిళలు కంటెంట్‌ ప్రపంచాన్ని కొత్తగా మలుస్తున్నారు. ఇప్పుడు వాళ్లు కేవలం కంటెంట్‌ క్రియేటర్లు మాత్రమే కాదు, బ్రాండ్‌ అంబాసిడర్లు, ఇన్ ఫ్లుయెన్సర్లు, స్టార్టప్‌ ఫేస్‌లు కూడా అయ్యారు.లక్షల్లో ఆదాయం!చూస్తున్న వీడియోలు కేవలం రెండు నిమిషాలే అయినా, క్రియేటర్లకు మాత్రం లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతుంది. ఇందులో ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న క్రియేటర్‌ మార్కెట్‌. 2019లో షార్ట్‌ వీడియో మార్కెట్‌ విలువ 1.3 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, 2025 నాటికి అది 3 బిలియన్‌ డాలర్లకు చేరనుందని అంచనా. 2027 నాటికి ఇండియాలో క్రియేటర్‌ ఎకానమీ 45,000 కోట్ల రూపాయల విలువకు చేరనుంది. అందుకే మార్కెటింగ్‌ కూడా రీల్‌ ఫార్మ్‌లోకి వచ్చేసింది. రెండు నిమిషాల్లో బ్రాండ్‌ కథ చెప్పగలిగిన వారే గెలుస్తున్నారు. ఒక్క స్క్రోల్‌కి కోట్ల రూపాయల మార్కెట్‌– ఇదే కొత్త డిజిటల్‌ వండర్‌! ఈ కారణంగానే ఇండియాలో ఇప్పటికే పదకొండు వేలకు పైగా చానెల్స్‌ మిలియన్ల సబ్‌స్క్రైబర్లు దాటాయి. రోజూ కోటాను కోట్ల వ్యూస్‌! అంటే ఒక్కొక్క షార్ట్‌ వీడియో చూస్తే, మన ఫింగర్స్‌ స్క్రోల్‌ చేస్తూ ‘ఓ మై గాడ్‌!’ అని చెప్పాల్సిందే. మనీకంట్రోల్‌ సంస్థ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం, ప్రస్తుతం 45 లక్షల ఇండియాలో క్రియేటర్లలో సుమారు 6 లక్షల మంది డబ్బు సంపాదిస్తున్నారు. వారి సబ్‌స్క్రైబర్లు, ఫాలోవర్స్‌ ఆధారంగా ఆదాయం వస్తుంది. యూట్యూబ్‌ గత మూడు సంవత్సరాల్లో 5.8 లక్షల కోట్ల రూపాయలు క్రియేటర్లకు చెల్లించిందట! ఎవరికి తెలుసు? ఈరోజు మీరు చూసిన చిన్న రీల్‌ రేపటికి లక్షలు తెచ్చే కంటెంట్‌ కావచ్చు!

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement