91 ఏళ్ల వ్యక్తి 12 గంటలు షిఫ్ట్! హీరో మాధవన్ సైతం..
వర్క్లైఫ్ బ్యాలెన్స్పై చాలామంది ప్రముఖులు, ప్రజలు పలు రకాలుగా తవ వాదనలు వినిపించారు. పైగా అన్ని గంటలు ఆఫీస్లకే పరిమితమైతే..ఫ్యామీలీ సంగతేంటి అని పలువురు వాపోయారు కూడా. కానీ మనసుంటే అన్ని సాధ్యమే..అటు ఆరోగ్యం ఇటు ఫ్యామిలీ అన్నింటిని కూడా సులభంగా బ్యాలెన్స్ చేయొచ్చని చాలామంది తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. వాళ్లందర్నీ వెనక్కినెట్టి ఓల్డ్ ఏజ్లో ఏకంగా 12 గంటలు షిఫ్ట్లో పనిచేస్తూ విస్మయానికి గురిచేయడమే కాదు..ఆ వయసులో ఎంతో చురుగ్గా, ఆరోగ్యంగా ఉండి మరింత కంగుతినేలా చేశాడు. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడమే కాదు నెటిజన్లను తెగ ఆకర్షించింది. ఈ ఘటన సింగపూర్లో చోటు చేసుకుంది. సోషల్ మీడియా వ్లాగర్ లైంగ్ అనే వ్యక్తికి సింగపూర్లో ఓ వృద్ధ కార్మికుడి తారసపడతాడు. అతడు బాత్రూంలను క్లీన్ చేసే వ్యక్తిగా గుర్తిస్తాడు. అతడికి దగ్గర దగ్గర 90 ఏళ్లుపైనే ఉంటాయి. లైంగ్ ఆ వృద్ధుడితో మాటలు కలుపుతాడు. మీరు ఎలా ఉన్నారని ప్రశ్నించగా వృద్ధుడు చాలా బాగున్నానని సమాధానం ఇస్తాడు. ప్రతి రోజు మీ వర్క్ ఎలా సాగుతుందని అడగగా అతడు తన వయసు గురించి అగుడుతున్నాడని పొరబడి.. ఆ వృద్ధుడు తన వయసు 91 ఏళ్లు అని రిప్లై ఇస్తాడు. వెంటనే లాంగ్ తేరుకుని ..కాదు ఈ వయసులో ఇంకా పనిచేస్తున్నావు..అని ఆశ్చర్యపోతూ ఎన్ని గంటలు వరకు పనిచేస్తావని ప్రశ్నిస్తాడు. దానికి ఆ వ్యక్తి రాత్రి ఏడింటి వరకు పనిచేస్తానని, రోజుకు 12 గంటల షిఫ్ట్ అని వివరిస్తాడు. దాంతో వ్లాగర్ బాస్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటావు, నీ ఫిట్నెస్ రహస్యం ఏంటి అని చాలా కుతుహలంగా అడుగుతాడు. దానికి అతడు సాధారణ భోజనమే తింటానని, అయితే వ్యాయమం మాత్రం తానెప్పుడూ చేయలేదని చెప్పుకొస్తాడు. అంతేగాదు వ్లాగర్ లైంగ్తో ఎప్పుడూ వ్యాయామం చేయవద్దు అని సలహ కూడా ఇస్తాడు. దాంతో లైంగ్ నవ్వుతూ..నువ్వు జీవితంలో ఎప్పుడూ వ్యాయామం చేయలేని గొప్ప మనిషివి అని వ్యాఖ్యానిస్తాడు. చివరగా అతడికి వీడ్కోలు పలుకుతూ.. భోజనం చేయమని కొంత డబ్బు ఇవ్వడమేగాక.. నువ్వు ఒక గొప్ప సైనికుడివి జాగ్రత్తగా ఉండు..కష్టపడి పనిచేస్తుండూ అని చెప్పి నిష్క్రమిస్తాడు. ఆ వీడియో హీరో మాధవన్ని సైతం కదిలించింది. మాధవన్ కూడా ఆ వీడియో క్లిప్ని రీషేర్ చేస్తూ..స్ఫూర్తిదాయకమైన వీడియో అంటూ ప్రశంసించాడు. ఇక నెటిజన్లు..ఈ వీడియో కన్నీళ్లు పెట్టించేస్తోంది. అతడు ఎల్లప్పుడూ ప్రజలతో సంభాషిస్తాడు, అందుకే ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ ఘటన వ్యాయామం ఆరోగ్యకరమైన జీవితానికి కీలకం కాదని, ఆనందమే కీలంగా అని ప్రూవ్ చేసింది. అందువల్లే అతను సంతోషంగా అన్ని గంటలు పనిచేస్తున్నాడంటూ ఆ వృద్ధ వ్యక్తిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Jaden Laing (@jadentysonlaing) (చదవండి: అఫ్గాన్ చిన్నారి పెళ్లి కూతురు..! విధినే ధిక్కరించి..)
తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?: గంభీర్పై గంగూలీ ఫైర్
టీమిండియా- సౌతాఫ్రికా (IND vs SA 1st Test) మధ్య కోల్కతా వేదికగా తొలి టెస్టు నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ చర్చనీయాంశమైంది. బౌలర్ల విజృంభణతో బ్యాటర్లు విలవిల్లాడుతున్నారు. పరుగులు రాబట్టేందుకు ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోతున్నారు.సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 31 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిస్తే.. టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul- 39) టాప్. ఇటు స్పిన్.. అటు పూర్తి బౌన్సీగా కాకుండా ఉన్న ఈడెన్ గార్డెన్స్ పిచ్ వల్ల ఇప్పటికి మూడు ఇన్నింగ్స్లో కలిపి రెండు జట్లు ఒక్కసారి కూడా కనీసం రెండు వందల మార్కు చేరుకోలేకపోయాయి.మూడో రోజు హాఫ్ సెంచరీఅయితే, ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) తమ రెండో ఇన్నింగ్స్లో 55 పరుగులతో సత్తా చాటడం ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ మ్యాచ్లో మూడో రోజైనా కనీసం హాఫ్ సెంచరీ చూసే భాగ్యం దక్కిందని బ్యాటింగ్ అభిమానులు సంబరపడుతున్నారు.టెస్టు క్రికెట్ను చంపేస్తారా?ఇదిలా ఉంటే.. ఈడెన్ గార్డెన్స్ పిచ్పై మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, హర్భజన్ సింగ్ తదితరులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. భజ్జీ అయితే.. ‘‘టెస్టు క్రికెట్ను చంపేస్తారా? మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోతుందా?’’ అంటూ క్యూరేటర్ తీరును తప్పుబట్టాడు. అస్సలు ఊహించలేదుమరోవైపు.. రెండు రోజుల్లోనే ఏకంగా పదహారు వికెట్లు కూలడంతో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా క్యూరేటర్ పనితీరును విమర్శించాడు. ‘‘తొలిరోజు వికెట్ కాసేపు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత చెత్తగా మారిపోయింది. ఇది మేము అస్సలు ఊహించలేదు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత జట్టు యాజమాన్యానికి దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. ‘‘టీమిండియా కోరుకున్న పిచ్ ఇదే. వాళ్లే ఇలా కావాలని అడిగారు.నాలుగు రోజుల పాటు పిచ్పై నీళ్లు చల్లకుంటే ఇలాగే ఉంటుంది. ఇందులో క్యూరేటర్ సుజన్ ముఖర్జీని తప్పుబట్టడానికి ఏమీ లేదు. వాళ్లు కోరిందే ఇది’’ అని దాదా.. పరోక్షంగా హెడ్కోచ్ గౌతం గంభీర్దే తప్పంతా అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.టీమిండియా ఓటమిసౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. పర్యాటక ప్రొటిస్ జట్టు చేతిలో 30 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 124 పరుగుల లక్ష్యాన్నిఛేదించే క్రమంలో భారత్ 93 పరుగులకే కుప్పకూలింది.చదవండి: ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?
జెన్-జెడ్ తిరుగుబాటు.. మెక్సికో నేషనల్ ప్యాలెస్ వద్ద టెన్షన్
మెక్సికో: మెక్సికో: మెక్సికో వీధుల్లో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జెన్-జెడ్(‘జెనరేషన్-జీ’) నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. మెక్సికోలో మేయర్ దారుణ హత్య.. పెరిగిపోతున్న హింసపై యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలు.. ఏకంగా అధ్యక్ష భవనం ముట్టడి వరకు వెళ్లాయి. దీంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జెన్-జెడ్, పోలీసులు మధ్య ఘర్షణల కారణంగా దాదాపు వంద మందికి పైగా పోలీసులు గాయపడ్డినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.మెక్సికో సిటీలో శనివారం జెన్-జెడ్ నిరసనలు హింసాత్మకంగా మారాయి. అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ నివసించే నేషనల్ ప్యాలెస్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను ముసుగులు ధరించిన కొందరు నిరసనకారులు కూల్చివేశారు. నిరసనకారులు ప్రస్తుత అధ్యక్షురాలి పార్టీకి వ్యతిరేకంగా “మోరెనా.. గద్దె దిగు” అంటూ నినాదాలు చేశారు. “కార్లోస్ చావలేదు, ప్రభుత్వమే చంపింది” అంటూ నేరాలను, హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్తే ప్రయత్నం చేశారు.BREAKING: MEXICO🔴 THE NATIONAL PALACE HAS FALLENThe National Palace in Mexico City has been overrun — crowds flooding the gates, barriers collapsing, and the government losing control in real time.This is not a protest.This is a national eruption — the kind that signals… pic.twitter.com/V4GEZydhLg— Jim Ferguson (@JimFergusonUK) November 15, 2025దీంతో అల్లర్లను అదుపుచేసే పోలీసులకు, ప్రదర్శనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. అనంతరం, పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఈ సందర్బంగా మెక్సికో సిటీ ప్రజా భద్రతా కార్యదర్శి పాబ్లో వాజ్క్వెజ్ మాట్లాడుతూ.. ఈ ఘర్షణల్లో 100 మంది పోలీసులకు గాయాలయ్యాయి. వారిలో 40 మంది ఆసుపత్రిలో చేరారు. మరో 20 మంది పౌరులు కూడా గాయపడడ్డారు. ఘర్షణల్లో భాగంగా మరో 20 మందిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.Te pido un favor ? No dejes de hablar de la represión en México , nadie de la izquierda te lo va a mostrar ni a contar , pero el pueblo mexicano cuenta con nosotros para visibilizarlo , vale un 🖐️ pic.twitter.com/TR9TmQNIBb— @IsraelVive (@IsraelVive1948) November 15, 2025నిరసనలు ఎందుకు?ఈ నెల (నవంబర్) ఒకటో తేదీన, పశ్చిమ రాష్ట్రమైన మికోకాన్లోని ఉరుపాన్ నగర మేయర్, కార్లోస్ మంజో, నేర వ్యతిరేక విధానాలకు పేరుగాంచిన వ్యక్తి. ఆయనను ‘డే ఆఫ్ ది డెడ్’ బహిరంగ కార్యక్రమంలో దుండగులు కాల్చి చంపారు. ఈ దారుణ హత్య దేశవ్యాప్తంగా యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ప్రభుత్వాలు హింసను అరికట్టడంలో విఫలమయ్యాయంటూ నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో మెక్సికో సిటీతో పాటు పలు నగరాల్లో వేలాది మంది యువత ప్రదర్శనలు చేపట్టారు. ఇక, జెన్-జెడ్ నిరసనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. El pueblo ya despertó y perdió el miedo a las Narcodictaduras. La izquierda corrupta, violenta y saqueadora que gobierna en #Mexico empieza a desmoronarse.#MarchaNacional #GeneraciónZ Hoy México despertó.#Colombia cuando? pic.twitter.com/OpyhlE1jTY— Decko. (@Frankzm) November 15, 2025
అంకగణితం ప్లస్ అనైతికత!
ఎన్నికల్లో మూడింట రెండొంతుల సీట్లను గెలుచుకుంటేనే గొప్ప విజయంగా పరిగణించడం మీడియాలో ఒక సంప్ర దాయం. ఇక ఆరింట ఐదొంతుల సీట్లు గెలిస్తే చెప్పేదేముంది! బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి సరిగ్గా అటువంటి విజయం లభించింది. భారత జాతీయ బడా మీడియా సంస్థలన్నీ కాషాయ దీక్షను స్వీకరించాయన్న సంగతి జగమెరిగిన సత్యం. మరి కాషాయ పార్టీ నాయకత్వంలోని కూటమి అంతటి భారీ గెలుపును నమోదు చేస్తే భజించకుండా బజ్జోవు కదా! శరభ నాట్యాన్ని ప్రదర్శించాయి. అసోయ్ దూలాకు అసలు తగ్గలేదు. మొత్తం 243 స్థానాలున్న సభలో 202 స్థానాలను కైవసం చేసు కోవడమంటే మాటలు కాదు.ఈ అంక గణితంలో ఇంకో పార్శా్వన్ని కూడా గమనించాలి. ప్రతిపక్ష కూటమికి క్యాప్టెన్గా వ్యవహరిస్తున్న ఆర్జేడీ పార్టీకి 23 శాతం ఓట్లు పోలయ్యాయి. ఐదేళ్ల కింద జరిగిన ఎన్నికల్లో కూడా దాదాపు ఇంతే శాతం ఓట్లను ఆ పార్టీ దక్కించుకున్నది. ఈసారి పెద్దగా తగ్గిందేమీ లేదు. బీజేపీకి ఇప్పుడు 20 శాతం ఓట్లు పడ్డాయి. ఐదేళ్ల కింద కూడా అంతే! 19.8 శాతం ఓట్లను సాధించింది. గణనీయమైన పెరుగుదలేమీ కాదు. జేడీ (యు)కు అప్పుడు 16 శాతం, తాజాగా 19 శాతం ఓట్లు లభించాయి. మూడు శాతం పెరుగుదల! మహాగuЇబంధన్ (ఎంజీబీ) కూటమికి వైస్ క్యాప్టెన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడూ ఇప్పుడూ కూడా కూటమికి గుదిబండగానే మారింది. కాకపోతే దాని ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేదు. అప్పుడు తెచ్చుకున్న తొమ్మిది శాతం ఓట్లను దాదాపుగా కాపాడుకోగలిగింది.ఒక కూటమిగా ఎంజీబీకి 2020లో 37.23 శాతం ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో అదే కూటమి సాధించిన ఓట్లు 37.5 శాతం. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్య క్రమం తర్వాత గతంతో పోలిస్తే బిహార్ ఓటర్ల సంఖ్య నికరంగా 47 లక్షలు తగ్గింది. అయినా ఎంజీబీ ఓట్లు తగ్గలేదు. కానీ, సీట్ల లెక్కల్లో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకోవలసివచ్చింది. ఈ రకమైన ఫలితాల లోగుట్టు పెరిగిన పోలింగ్ శాతంలో ఉన్నది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి తొమ్మిది శాతం పైచిలుకు ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఈసారి ఎన్ని కల్లో తొమ్మిది శాతానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. పురుష ఓటర్ల కంటే తొమ్మిది శాతం అధికంగా మహిళలు ఈసారి ఓటేశారు. గత ఎన్నికల్లో 37.26 శాతం ఓట్లు సాధించిన ఎన్డీఏ ఈసారి తొమ్మిది శాతం అదనంగా 46.7 శాతం ఓట్లను సంపాదించింది. సాధారణంగా పురుషులు, స్త్రీల పోలింగ్ శాతాల్లో ఒకటి రెండు శాతం కంటే ఎక్కువ తేడాలుండవు. కానీ బిహార్లో ఈసారి మహిళల ఓటింగ్ శాతం పురుషులతో పోలిస్తే తొమ్మిది శాతం ఎక్కువగా ఉంది. గతంలో పోలైన ఓట్ల కంటే ఈసారి పెరిగిన ఓట్ల శాతంతో మహిళా ఓట్ల పెరుగుదల సమానంగా ఉండటం ఒక విశేషం. అంతేకాదు. ఎన్డీఏ కూటమి ఓట్ల పెరుగు దల కూడా ఇంతే స్థాయిలో ఉండటం మరో విశేషం. ఇక్కడొక విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. బిహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సరిగ్గా వారం రోజుల ముందట నితీశ్ కుమార్ ప్రభుత్వం ‘మహిళా రోజ్గార్’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద మహిళలందరికీ ఏటా పదివేల రూపాయలుఅందజేస్తారు. కేవలం ప్రకటించడమే కాదు. దాదాపు కోటి యాభై లక్షల మంది మహిళలకు పదివేల రూపాయల చొప్పున నగదు బదిలీ చేశారు. ఈ బదిలీ కార్యక్రమం షెడ్యూల్ విడుదలై ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా యథేచ్ఛగా కొనసాగిందని ప్రతిపక్షం చేసిన ఫిర్యాదు చెవిటివాని ముందు శంఖం ఊదినట్లయింది.ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలను ఈ సంద ర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవడం అవసరం. ‘వైఎస్సార్ చేయూత’ అనే పథకాన్ని అప్పటికి నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్నది. ఆ సంవత్సరం గడువు ప్రకారం విడదల చేసిన 4 వేల కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతా లకు చేరకుండా ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతనే ఆ నిధులను విడుదల చేశారు. ఈ రెండు ఉదంతాలు ఎన్నికల సంఘం ‘నిష్పాక్షికత’కు నిలువెత్తు అద్దాల నుకోవాలి. మహిళల ఓట్లను ఇలా టోకున కొనుగోలు చేయడంతోపాటు మహిళల సాంస్కృతిక విశ్వాసాలను సైతం ఎన్డీఏ కూటమి బాగానే మార్కెటింగ్ చేసుకున్నది. ఛట్ పూజ అనేది ఉత్తరాదిన మరీ ముఖ్యంగా బిహార్లో మహిళలు చేసుకునే పూజా కార్యక్రమం. తమ భర్తల క్షేమం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం నదీ తీరాల్లో మహిళలు సూర్యదేవుడిని, ఆయన సోదరి ఛట్ దేవిని వేడుకుంటారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పూజ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేశాయి. చిత్తం పూజ మీద, భక్తి ఓట్ల మీద!ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఒక జాతీయ పార్టీగా తన ఆరోపణలకు తగిన ఆధారాలను సమర్పించవలసిన బాధ్యత కూడా ఆ పార్టీదే! లేకపోతే ‘ఆడలేక మద్దెల ఓడు’ అనే సామెత చందంగా ఆ పార్టీ పరిస్థితి మారుతుంది. ఆర్జేడీ హుందాగా ప్రజా తీర్పును అంగీకరించింది. ఓటమిలో విచారాన్ని, గెలుపులో గర్వాన్ని చూడబోమని ప్రకటించింది. నిరంతరం జనజీవితంతో మమేక మవుతామని వెల్లడించింది. ఎమ్జీబీలో ఆర్జేడీ మినహా మరో బలమైన పార్టీ లేకపోవడం ఆ కూటమికి పెద్ద బలహీనత. తన సంప్రదాయ ఓటు బ్యాంకుల్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ ఓకుంటి గుర్రంగా మారింది. అయినా 64 సీట్లకు తగ్గేదే లేదని మొండికేసింది. ఆపైన మరికొన్ని సీట్లలో ‘స్నేహపూర్వక పోటీ’ పేరుతో కూటమిని ఇబ్బందులకు గురిచేసింది. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 75 సీట్లకు పోటీచేసి కూటమి ఓటమికి కార ణమైంది. అప్పుడు దాదాపు విజయ తీరాలకు వచ్చిన తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ) కాంగ్రెస్ కారణంగా అధికారాన్ని కోల్పో యారు. ఇప్పుడు కూడా ఆ పార్టీ వైఖరిలో మార్పు రాలేదు.కూటమిలో భాగస్వాములైన లెఫ్ట్ పార్టీల పలుకుబడి కేవలం ఓ పాతిక సీట్ల వరకే పరిమితం. వాటిలో ఈసారి సీపీఎమ్ఎల్ (లిబరేషన్) పార్టీ రెండు సీట్లలో, సీపీఎం ఒక్క సీటులో గెలిచాయి. ఇండియన్ ఇన్క్లూజివ్ పార్టీ అనే మరో అల్పప్రాణి కూడా ఈ కూటమిలో ఉన్నది. దానికీ ఒక సీటు లభించింది. ఎమ్జీబీ అలయెన్స్ కూర్పు ఓ బలహీనత. ఇక తేజస్వీ యాదవ్ తన సాంప్రదాయిక ప్రాబల్యాన్ని దాటిమరింత విస్తరించలేకపోవడం మరో బలహీనతగా మారింది. ముస్లిం – యాదవ్ (ఎమ్వై) కాంబినేషన్ ముప్ఫయ్యేళ్ల క్రితం సత్ఫలితాలను ఇచ్చి ఉండవచ్చు. మిగిలిన బలహీన వర్గాలు కూడా జాగృతమైన ఈ పరిస్థితుల్లో తన పరిధిని విస్తరించు కోకుండా తేజస్వి తన ఆశయాన్ని నెరవేర్చుకోలేరు. లాలూ రాజకీయ చతురత ఇప్పటి కాలానికి సరిపోకపోవచ్చు. పైగా అనారోగ్యం, వయోభారం. ఆయనిక పొలిటికల్ గేమ్స్ ఆడ లేరు. ఆడవలసింది తేజస్వీ యాదవే! కొత్త తరానికి సరిపోయే ఆటను ఆయన నేర్చుకోకపోతే, ప్రత్యామ్నాయ శక్తులు రంగంలోకి రావచ్చు.ఎమ్జీబీ కూటమి కూర్పుకు పూర్తి భిన్నంగా ఎన్డీఏ వ్యవహరించింది. విజయానికి అవసరమైన అంకెలను దృష్టిలో పెట్టుకొని అలయెన్స్కు రూపకల్పన జరిగింది. గతంలో ఒంట రిగా 130 సీట్లలో పోటీచేసి, ఐదు శాతానికి పైగా ఓట్లు తెచ్చు కున్న చిరాగ్ పాశ్వాన్ పార్టీని కూటమిలోకి తెచ్చుకున్నారు. 29 స్థానాలు కేటాయిస్తే ఆయన పార్టీ అందులో 19 గెలిచింది. మిగిలిన సీట్లలో బీజేపీ, జేడీయూ అభ్యర్థులకు పాశ్వాన్ పార్టీ ఉపయోగపడింది. దళితుల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు మాజీ ముఖ్యమంత్రి మాంఝీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పార్టీ ‘హిందూస్థానీ అవావ్ు మోర్చా’ కూడా భాగస్వా మిగా ఐదు సీట్లు గెలిచి కూటమికి ఉపయోగపడింది. వెనుక బడిన తరగతుల్లో కుష్వాహ వర్గానికి ప్రాతినిధ్యం వహించే ఆర్ఎల్ఎమ్ కూడా ఎన్డీఏకు ప్లస్ పాయింట్గా మారింది. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలోరంగంలోకి దిగిన ఎమ్ఐఎమ్ ఐదు సీట్లలో గెలవడమే కాక పలుచోట్ల ఎమ్జీబీ అభ్యర్థుల ఓటమికి కారణమైంది.సామాజిక సమీకరణాలను పక్కా లెక్కలతో కూర్పు చేసు కున్న ఎన్డీఏ కూటమికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అంగబలం, అర్థబలంతోపాటు ఎన్నికల సంఘం ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయనేందుకు ‘మహిళా రోజ్గార్’ పథకమే ఉదాహరణ. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో ప్రతి ఏటా పదివేల పథకాన్ని ప్రకటించే నైతిక హక్కు ఏ విధంగా ఉంటుంది? దీనికి ఎన్నికల సంఘమే జవాబు చెప్పాలి. ఈ రకమైన అనైతికతకు తోడు అంకగణిత కూర్పులతో బిహార్ను ఎన్డీఏ గుప్పెట్లో పెట్టుకున్నది. అంతే తప్ప అక్కడ ఒక మహా ప్రభంజనం వీచి ఆర్జేడీని కూకటివేళ్లతో సహా పెకిలించిందేమీ లేదు. ఆ పార్టీ కొత్త శ్రేణు ల్లోకి విస్తరించలేకపోయింది. అంతే తప్ప తన పునాదిని పోగొట్టుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి కొత్తగా జరిగిన శృంగభంగం కూడా ఏమీ లేదు. ఆ పార్టీ ముక్కూచెవులను బిహారీలు ఏనాడో కోసిపారేశారు.భారతీయ జనతా పార్టీ పచ్చి మితవాద పార్టీ. తన మతవాద ముద్రను కూడా దాచుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆర్థిక, సామాజిక విషయాల్లో పచ్చి సోషలిస్టు వ్యతిరేకి. కానీ తన ప్రాబల్య విస్తరణ కోసం భావజాల సారూప్యత లేని పార్టీలతో సైతం చెలిమికి వెనకాడటం లేదు. నవభారత నిర్మాత పండిత్ జవహర్లాల్ నెహ్రూను, ఆయన సోషలిస్టు ఆర్థిక విధా నాలను రోజూ విమర్శించే బీజేపీ బిహార్లో అంటకాగుతున్నది ఎవరితో? భారతీయ సోషలిస్టు పార్టీ స్థాపకులైన రామ్మనో హర్ లోహియా విచారధార లోంచి ప్రవహించినవాడే నితీశ్ కుమార్. దిగ్గజ సోషలిస్టు జార్జి ఫెర్నాండెజ్ అడుగుజాడల్లోనే నితీశ్ కుమార్ రాజకీయ అడుగులు పడ్డాయి. నెహ్రూకూ, లోహియా వాదులకూ విభేదాలుండవచ్చు. అంతిమ లక్ష్యం సామ్యవాదమే కదా! అంతెందుకు బిహార్లోని ఆర్జేడీ, జేడీయూ... రెండూ ఒకే తాను ముక్కలు. నితీశ్ పార్టీకి ఆయన తర్వాత వారసత్వ నాయకత్వం లేదు. ఆయన ఆరోగ్యం కూడా అంతంతమాత్రం. ఇప్పుడు పెద్ద పార్టీగా గెలిచిన బీజేపీ నితీశ్ను మరికొంతకాలం కొనసాగనిచ్చి తర్వాత తానే పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నితీశ్ తదనంతరం ఆయన పార్టీని కూడా బీజేపీ తనలో లీనం చేసుకోవచ్చనే అభిప్రాయం ఉన్నది.హిందీ మాట్లాడే ‘కౌ బెల్ట్’ ప్రాంతంలో ఒక్క బిహార్ మాత్రమే పూర్తిస్థాయిలో బీజేపీకి చేజిక్కలేదు. అనతికాలంలోనే ఈ గోక్షేత్రమంతా కాషాయ ఛత్రఛాయలోకి రావడం ఖాయ మన్న ఆశాభావం బీజేపీలో ఇప్పుడు బలపడింది. ఇక మిగిలింది ఆర్యావర్త సంపూర్ణ కాషాయీకరణ! త్రివేణుల్లో ఒకటైన సరస్వతీ నది ఒకనాడు అదృశ్యమైనదని భావిస్తున్న నేటి రాజస్థాన్, గుజరాత్ ప్రాంతం నుంచి గంగా ప్రవాహపు ఆఖరి మజిలీ వంగభూమి వరకు విస్తరించిన ఆర్యావర్తంలో బీజేపీకి ఇప్పటిదాకా అందని రాష్ట్రం బెంగాల్ మాత్రమే. నిన్నటి విజ యోత్సవ ర్యాలీలో నరేంద్ర మోదీ బెంగాలే తమ తదుపరి లక్ష్యమని ప్రకటించారు. బీజేపీ విజయయాత్రను మమతా దీదీ నిలువరించగలరా... లేదా? ఇంకో ఏడాది వేచి చూడాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com
సంతోషంగా ఉన్నాను.. మా ఓటమికి కారణం వారే: గంభీర్
ప్రేమగా పిలిచిన వాడే.. ప్రాణం తీశాడు!
విస్తరణ దిశగా అల్ట్రావయొలెట్
నా కూతురికి ఐదు పైసలు కూడా ఇవ్వను: ప్రముఖ నటి
అది నేను కాదు.. టాలీవుడ్ హీరోయిన్ పేరుతో మోసం
‘నాన్నకు కిడ్నీ ఇచ్చి చెడ్డదాన్నయ్యాను!’
శివ రీ రిలీజ్.. రెండు రోజుల్లోనే ఆల్టైమ్ వసూళ్లు!
ఆ చిన్నారి గురువుకు మించిన శిష్యురాలు..! ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..
IFFI 2025: రజనీకాంత్ కి 50ఏళ్లు... భానుమతికి వందేళ్లు....
అమెరికాలో కొత్త వైరస్ కలకలం
ఒకే రోజు రెండోసారి.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
బంగారం ధరలు రివర్స్.. పసిడి ప్రియులకు గుడ్న్యూస్
నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?
హెచ్–1బీ పూర్తిగా బంద్
ఎన్నాళ్లకు నిజం మాట్లాడారు సార్! వేరెవరో చేయించిన వాటిని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారన్నమాట!
Thanuja: కల్యాణ్ను ఓడించి ఫ్యామిలీ వీక్లో కెప్టెన్గా.
సంతోషంలో పింకీ.. గ్రాండ్గా కొడుకు బారసాల ఫంక్షన్
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం
ప్రపంచంలో 10 పవర్ఫుల్ మిలిటరీ దేశాలు
పసిడి ధరలపై జాక్పాట్.. వెండి భారీ క్రాష్!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వాహనయోగం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
'బిగ్బాస్' నుంచి నిఖిల్ ఎలిమినేట్.. భారీగానే రెమ్యునరేషన్
తిండికి గతి లేక అమ్మ మట్టి తినేది.. ఏడిపించిన కంటెస్టెంట్స్
తనూజకు భారీగా ఓట్లు.. సీక్రెట్ ఇదే
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్
ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు.. ఆస్తిలాభం పొందుతారు
'అమ్మోరు'లో మొదట నేనే విలన్.. ఏడాదిన్నర పనిచేశా కానీ
'శివ' రీ రిలీజ్.. మొదటిరోజు అన్ని కోట్ల కలెక్షన్
సంతోషంగా ఉన్నాను.. మా ఓటమికి కారణం వారే: గంభీర్
ప్రేమగా పిలిచిన వాడే.. ప్రాణం తీశాడు!
విస్తరణ దిశగా అల్ట్రావయొలెట్
నా కూతురికి ఐదు పైసలు కూడా ఇవ్వను: ప్రముఖ నటి
అది నేను కాదు.. టాలీవుడ్ హీరోయిన్ పేరుతో మోసం
‘నాన్నకు కిడ్నీ ఇచ్చి చెడ్డదాన్నయ్యాను!’
శివ రీ రిలీజ్.. రెండు రోజుల్లోనే ఆల్టైమ్ వసూళ్లు!
ఆ చిన్నారి గురువుకు మించిన శిష్యురాలు..! ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..
IFFI 2025: రజనీకాంత్ కి 50ఏళ్లు... భానుమతికి వందేళ్లు....
అమెరికాలో కొత్త వైరస్ కలకలం
ఒకే రోజు రెండోసారి.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
బంగారం ధరలు రివర్స్.. పసిడి ప్రియులకు గుడ్న్యూస్
నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?
హెచ్–1బీ పూర్తిగా బంద్
ఎన్నాళ్లకు నిజం మాట్లాడారు సార్! వేరెవరో చేయించిన వాటిని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారన్నమాట!
Thanuja: కల్యాణ్ను ఓడించి ఫ్యామిలీ వీక్లో కెప్టెన్గా.
సంతోషంలో పింకీ.. గ్రాండ్గా కొడుకు బారసాల ఫంక్షన్
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం
ప్రపంచంలో 10 పవర్ఫుల్ మిలిటరీ దేశాలు
పసిడి ధరలపై జాక్పాట్.. వెండి భారీ క్రాష్!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వాహనయోగం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
'బిగ్బాస్' నుంచి నిఖిల్ ఎలిమినేట్.. భారీగానే రెమ్యునరేషన్
తిండికి గతి లేక అమ్మ మట్టి తినేది.. ఏడిపించిన కంటెస్టెంట్స్
తనూజకు భారీగా ఓట్లు.. సీక్రెట్ ఇదే
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్
ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు.. ఆస్తిలాభం పొందుతారు
'అమ్మోరు'లో మొదట నేనే విలన్.. ఏడాదిన్నర పనిచేశా కానీ
IPL 2026: కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కే
సినిమా
అర్థరాత్రి 2 గంటలకు ఫోన్..నాకేంటి అనేవాళ్లు : నటి
‘తెలుగమ్మాయిలు ఎక్స్ఫోజింగ్ చేయమంటే చేయలేరు.. అందుకే అవకాశాలు రావు’ అని చెప్పేవాళ్లకు..‘అది తప్పు మేం కూడా కథ డిమాండ్ చేస్తే అలాంటి సీన్స్ చేయగలం’ అని నిరూపించడానికే బోల్డ్ ఫోటో షూట్ చేశానని అంటోంది నటి దక్షి గుత్తికొండ(Dakkshi Guttikonda). ఆర్జీవీ ‘కరోనా వైరస్’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ విజయవాడ అమ్మాయి.. కొత్త పోరడు వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. అయితే సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది. ఇన్స్టాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ని అలరిస్తుంది. అయితే ఒకరు ధరించే దుస్తులను చూసి వారి క్యారెక్టర్ని అంచనా వేయొద్దని చెబుతోంది దక్ష. తాజాగా ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది.అలా సినిమాల్లోకి.. చిన్నప్పటి నుంచి నాకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. చైల్డ్ ఆర్టిస్ట్గా అవకాశాలు వచ్చినా..అమ్మ చేయనీయలేదు. చదవు పూర్తయిన తర్వాత సినిమాల్లోకి వెళ్లమని చెప్పింది. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చా. కరోనా సమయంలో ఆర్జీవీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆడిషన్స్ కోసం వెళ్లాను. ఒక్కరోజులోనే ఆడిషన్స్, లుక్టెస్ట్ పూర్తి తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు. అలా ‘కరోనా వైరస్’ సినిమాతో నేను ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను.ఆర్జీవీ బోల్డ్గా చూపిస్తారు కానీ..ఆర్జీవీ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు భయపడ్డాను. మీడియాలో ఆయనను చూపించే కోణం వేరు. ఆయనను బోల్డ్గా చూపించారు. నాకే కాదు కొత్తగా వచ్చిన అమ్మాయిలకు ఆర్జీవీని కలవాలంటే కాస్త భయమే. కానీ బయట మాత్రం ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనకున్నంత సినిమా నాలెడ్జ్ ఇంకెవరీకీ లేదు. చాలా తక్కువ మాట్లాడతారు. కరోనా వైరస్ సినిమా సమయంలో నేను 12 రోజుల పాటు షూటింగ్లో పాల్గాన్నా. చాలా బాగా చూసుకున్నారు.కొత్త అమ్మాయిలకు తప్పవు..సినిమా ఇండస్ట్రీ ఒక్కటే కాదు ఎక్కడగా అమ్మాయిలకు వేధింపులు ఉన్నాయి. క్యాస్టింగ్ కౌచ్ అనేది అంతటా ఉంది. కెరీర్ ప్రారంభంలో నేను కూడా అది ఫేస్ చేశా. కొంతమంది అర్థరాత్రి 2-3 గంటలకు ఫోన్ చేసేవారు. చాలా పెద్ద సినిమాలో అవకాశం ఇప్పిస్తామని.. నీ కెరీర్కు చాలా హెల్ప్ అవుతుందని చెప్పి చివరిలో ‘నాకేంటి’ అనేవాళ్లు. స్టార్టింగ్లో అలా అడిగితే చాలా ఏడ్చాను. కానీ కొన్నాళ్ల తర్వాత తిరిగి నేనే మారిపోయాను. ఎవరైనా కాల్ చేస్తే..‘మీకు అలాంటి వాళ్లు కావాలంటే వేరే వాళ్లు ఉంటారు అక్కడకు వెళ్లండి...ఆర్టిస్ట్ కోసం అయితే నా దగ్గరకు రండి’ అని చెప్పేదాన్ని. అర్థరాత్రి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉదయం చేసేదాన్ని.కొంతమంది ఫోన్ లిప్ట్ చేసేవాళ్లు కాదు. నాకే కాదు ఏ అమ్మాయికి అయినా ఇలాంటి వేధింపులు కామన్. కొత్తగా ఓ అమ్మాయి వస్తుందంటే చాలు..అలాంటి వెదవలు కాల్ చేస్తునే ఉంటారు. అమ్మాయిలు ఎలా డీల్ చేశారనేది ముఖ్యం. కొంతమంది అమ్మాయిలు స్కిన్ షో చేసి చాన్స్లు కొట్టేస్తారు. అయితే వాళ్లకు నాలుగైదు చాన్స్ వస్తాయంటే..అంతకు మించి ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండలేరు’ అని దక్షి చెప్పుకొచ్చింది.
కళ్ల ముందే ఓ ప్రాణం పోయింది, నెక్స్ట్ నా వంతే!
పులి కడుపున పులే పుడుతుందంటారు. లెజెండరీ యాక్షన్ డైరెక్టర్ వీరు దేవ్గణ్ ఎన్నో సినిమాలకు స్టంట్ మాస్టర్గా చేశారు. కొన్ని చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. తన శరీరంలో ఎన్ని ఎముకలు విరిగినా సరే ఏమాత్రం జంకకుండా ఎన్నో సినిమాలకు స్టంట్మెన్గా వ్యవహరించారు. తండ్రి ధైర్యమే కొడుక్కీ వచ్చింది.ప్రాక్టీస్ చేయకుండా దూకేశాడుబాలీవుడ్ హీరో అజయ్ దేవ్గణ్ (Ajay Devgn) కూడా సాహసోపేతమైన సన్నివేశాలకు వెనకడుగు వేయడు. దేదే ప్యార్ దే 2లోనూ అలాంటి స్టంట్లు చేశాడు. 'విమానంలోనుంచి దూకే సన్నివేశం అది.. కనీసం ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చేయకుండానే విమానంలో నుంచి సడన్గా దూకి స్కైడైవింగ్ చేశాడు' అని నటుడు మాధవన్ అజయ్ గురించి గొప్పగా చెప్పాడు.కళ్ల ముందే ఓ ప్రాణంఇంతలో అజయ్ అందుకుంటూ.. నేను షూటింగ్ లొకేషన్కు వెళ్లగానే ఓ బాధాకర సంఘటన జరిగింది. నా కళ్లముందే ఒక వ్యక్తి పారాచూట్ పని చేయక లోయలో పడి చనిపోయాడు. తర్వాత నావంతు వచ్చింది. ఇది ప్రమాదకరమైనప్పటికీ నేనే రిస్క్ చేసి దూకుతున్నాను తప్ప ఎవరి బలవంతం లేదు అని ఓ వీడియో రికార్డ్ చేసి నా సీన్ పూర్తి చేశాను. ఆ హీరోకీ తప్పలేదు!హాలీవుడ్ స్టార్ లినార్డో డికాప్రియోకి కూడా ఈ లొకేషన్లో చేదు అనుభవం ఎదురైంది. ఒకసారి సినిమా షూటింగ్లో భాగంగా ఇక్కడే స్కైడైవింగ్ చేశాడు. అతడి పారాచూట్ పనిచేయకపోయేసరికి అక్కడున్న ఇన్స్ట్రక్టర్ వెంటనే దూకి అతడి ప్రాణాలు కాపాడాడు అని గుర్తు చేసుకున్నాడు.చదవండి: కుమిలి కుమిలి ఏడ్చా!: మంచు లక్ష్మి
బాలయ్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. అఖండ-2 లేటేస్ట్ అప్డేట్!
బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తాజా చిత్రం అఖండ-2(Akhanda 2). బోయపాటి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ.. అఘోరా పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా.. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ నుంచి ఇటీవలే ది తాండవం పేరుతో ఓ సాంగ్ను కూడా రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు మేకర్స్. ఈ మూవీని 2డీతో పాటు త్రీడీ వర్షన్లోనూ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. సినీ ప్రియులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. EXPERIENCE THE DIVINE ROAR OF #Akhanda2 in 3D 💥💥🤩Mark our words. This will be one of the greatest movie watching experiences in Indian Cinema ❤️🔥❤️🔥#Akhanda2 IN CINEMAS WORLDWIDE FROM DECEMBER 5th.#Akhanda2Thaandavam‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu… pic.twitter.com/FEEECSayzG— 14 Reels Plus (@14ReelsPlus) November 16, 2025
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. ఆ ఒక్క సంఘటనతో రాజమౌళి ఫ్రస్టేషన్!
తొలిసారి రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురు చూశారు. దీంతో దర్శకధీరుడు సైతం సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇచ్చాడు. ప్రియాంక చోప్రా లుక్తో ఏకంగా సాంగ్ రిలీజ్ చేశారు. అంతే కాకుండా భారీ ఈవెంట్తో టైటిల్ గింప్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఈ గ్రాండ్ జరిగింది. ఇంత భారీ ఎత్తున చేసిన ఈవెంట్లో ఓ చిన్న సంఘటన రాజమౌళికి కోపం తెప్పించింది. ఆడియన్స్కు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఈ మూవీ గ్లింప్స్ను ఐమ్యాక్స్ ఫార్మాట్లో రిలీజ్ చేయాలని భావించాం.. అందుకే టెస్టింగ్ చేయాలనుకున్నామని రాజమౌళి తెలిపారు. కానీ ఈ గ్లింప్స్ టెస్ట్ ప్లే సమయంలో కొందరు డ్రోన్ విజువల్స్తో లీక్ చేయడం నిరాశ కలిగించిదన్నారు. ఎందుకంటే ఇది కోట్ల రూపాయల బడ్జెట్, ఎంతో మంది శ్రమతో రూపొందించామని.. ఇలా చేయడంపై దర్శకధీరుడు బాధగా ఉందన్నారు. నెట్ఫ్లిక్స్ నుంచి వచ్చినట్లుగా మా కంటెంట్ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని అన్నారు. ఈ సంఘటనతో మేం సరిగ్గా పరీక్షించలేకపోయామని వెల్లడించారు.కాగా.. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు రుద్రగా కనిపించనున్నారు. తాజాగా రిలీజైన టైటిల్ గ్లింప్స్ ప్రిన్స్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'గ్లోబ్ట్రాటర్' పేరుతో ఈ ఈవెంట్ను భారీ ఎత్తున నిర్వహించారు. వారణాసి చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
న్యూస్ పాడ్కాస్ట్
పని చేయకున్నా జీతాలివ్వాలా?... విశాఖ ఉక్కు కార్మికులపై రెచ్చిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం. మొత్తం 243 స్థానాలకు గాను 202 చోట్ల విజయం
ఉత్త ఒప్పందాలే... రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులంటూ చంద్రబాబు ప్రచార ఆర్భాటం
అది ముమ్మాటికీ ఉగ్ర దాడే... ఢిల్లీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నేడు కోటి గొంతుకల గర్జన.... చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమ కార్యచరణ ప్రకటన
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు. తొమ్మిది మంది దుర్మరణం. 20 మందికి గాయాలు. రంగంలోకి దర్యాప్తు బృందాలు
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం... సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం
ప్రజాధనాన్ని ప్రైవేటుకు దోచిపెడుతున్న కూటమి సర్కారు...
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? చంద్రబాబును నిలదీసిన : వైఎస్ జగన్
భావితరానికి యువతే దిక్సూచి... రాజకీయాల్లో విద్యార్థులు, యవత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
క్రీడలు
తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?: గంభీర్పై గంగూలీ ఫైర్
టీమిండియా- సౌతాఫ్రికా (IND vs SA 1st Test) మధ్య కోల్కతా వేదికగా తొలి టెస్టు నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ చర్చనీయాంశమైంది. బౌలర్ల విజృంభణతో బ్యాటర్లు విలవిల్లాడుతున్నారు. పరుగులు రాబట్టేందుకు ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోతున్నారు.సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 31 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిస్తే.. టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul- 39) టాప్. ఇటు స్పిన్.. అటు పూర్తి బౌన్సీగా కాకుండా ఉన్న ఈడెన్ గార్డెన్స్ పిచ్ వల్ల ఇప్పటికి మూడు ఇన్నింగ్స్లో కలిపి రెండు జట్లు ఒక్కసారి కూడా కనీసం రెండు వందల మార్కు చేరుకోలేకపోయాయి.మూడో రోజు హాఫ్ సెంచరీఅయితే, ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) తమ రెండో ఇన్నింగ్స్లో 55 పరుగులతో సత్తా చాటడం ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ మ్యాచ్లో మూడో రోజైనా కనీసం హాఫ్ సెంచరీ చూసే భాగ్యం దక్కిందని బ్యాటింగ్ అభిమానులు సంబరపడుతున్నారు.టెస్టు క్రికెట్ను చంపేస్తారా?ఇదిలా ఉంటే.. ఈడెన్ గార్డెన్స్ పిచ్పై మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, హర్భజన్ సింగ్ తదితరులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. భజ్జీ అయితే.. ‘‘టెస్టు క్రికెట్ను చంపేస్తారా? మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోతుందా?’’ అంటూ క్యూరేటర్ తీరును తప్పుబట్టాడు. అస్సలు ఊహించలేదుమరోవైపు.. రెండు రోజుల్లోనే ఏకంగా పదహారు వికెట్లు కూలడంతో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా క్యూరేటర్ పనితీరును విమర్శించాడు. ‘‘తొలిరోజు వికెట్ కాసేపు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత చెత్తగా మారిపోయింది. ఇది మేము అస్సలు ఊహించలేదు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత జట్టు యాజమాన్యానికి దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. ‘‘టీమిండియా కోరుకున్న పిచ్ ఇదే. వాళ్లే ఇలా కావాలని అడిగారు.నాలుగు రోజుల పాటు పిచ్పై నీళ్లు చల్లకుంటే ఇలాగే ఉంటుంది. ఇందులో క్యూరేటర్ సుజన్ ముఖర్జీని తప్పుబట్టడానికి ఏమీ లేదు. వాళ్లు కోరిందే ఇది’’ అని దాదా.. పరోక్షంగా హెడ్కోచ్ గౌతం గంభీర్దే తప్పంతా అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.టీమిండియా ఓటమిసౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. పర్యాటక ప్రొటిస్ జట్టు చేతిలో 30 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 124 పరుగుల లక్ష్యాన్నిఛేదించే క్రమంలో భారత్ 93 పరుగులకే కుప్పకూలింది.చదవండి: ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?
ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా లక్ష్య ఛేదనకు దిగింది. అయితే, ప్రొటిస్ జట్టు విధించిన 124 పరుగుల టార్గెట్ను పూర్తి చేసే క్రమంలో ఆదిలోనే భారత్కు షాకులు తగిలాయి.ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించగా.. కేఎల్ రాహుల్ (KL Rahul) ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్లోనే జైసూను అవుట్ చేసిన ప్రొటిస్ పేసర్ మార్కో యాన్సెన్.. మూడో ఓవర్ ఆరంభంలోనే రాహుల్ను కూడా వెనక్కి పంపి టీమిండియాకు షాకిచ్చాడు.ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar), నాలుగో స్థానంలో వచ్చిన ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. ఆచితూచి, ఓపికగా ఆడుతూ విజయానికి పునాది వేసే పనిలో ఉన్నారు. ఆచితూచి ఆడకపోతే..ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 10 ఓవర్లు ముగిసే సరికి వాషీ 27 బంతుల్లో 12, జురెల్ 23 బంతుల్లో 13 పరుగులతో ఉన్నారు. ఫలితంగా విజయానికి టీమిండియా కేవలం 98 పరుగుల దూరంలో నిలిచింది.అయితే, శుక్రవారం నాటి తొలి రోజు ఆట నుంచే ఈడెన్ గార్డెన్స్ పిచ్ భిన్నంగా ఉంది. మొదటి రోజు పేసర్లు విజృంభించగా.. రెండో రోజు స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. తాజాగా ఆదివారం నాటి మూడో ఆటలో మరోసారి పేసర్లు ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లక్ష్యం చిన్నదిగా కనిపిస్తున్నా.. వికెట్ స్వభావం దృష్ట్యా టీమిండియా ఆచితూచి ఆడకపోతే భారీ మూల్యం చెల్లించకతప్పదు.మరి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఇప్పటి వరకు టెస్టుల్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?భారత్ వర్సెస్ సౌతాఫ్రికా- 2004లో టీమిండియా 117 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఇంగ్లండ్- 1993లో టీమిండియా 79 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఇంగ్లండ్- 2012లో ఇంగ్లండ్ 41 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- 1969లో ఆస్ట్రేలియా 39 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఇంగ్లండ్- 1977లో ఇంగ్లండ్ 16 పరుగుల లక్ష్య ఛేదన.చదవండి: సన్రైజర్స్ వ్యూహం.. వాళ్లంతా జట్టుతోనే.. పర్సులో ఇంకెంత?
ఆదిలోనే భారీ షాకులు.. టీమిండియా చెత్త రికార్డు
సౌతాఫ్రికాతో తొలి టెస్టు లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే భారీ షాకులు తలిగాయి. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ (KL Rahul)ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.టార్గెట్ 124ఇందులో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో శుక్రవారం ఇరుజట్ల మధ్య తొలి టెస్టు (IND vs SA 1st Test) మొదలైంది. తొలిరోజు పేసర్లు సత్తా చాటగా.. సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 189 పరుగులకు ఆలౌట్ అయి.. ముప్పై పరుగుల ఆధిక్యం సంపాదించింది.అనంతరం ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా.. 93/7 ఓవర్నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన సౌతాఫ్రికాను.. 153 పరుగులకు టీమిండియా ఆలౌట్ చేసింది. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా.. భారత జట్టు లక్ష్యం 124 పరుగులుగా మారింది. దీంతో టార్గెట్ చిన్నదే కదా అని సంబరపడిన అభిమానులకు సఫారీ పేసర్ మార్కో యాన్సెన్ ఆదిలోనే షాకులు ఇచ్చారు.చెలరేగిన సఫారీ పేసర్మొత్తంగా నాలుగు బంతులు ఎదుర్కొన్న జైస్వాల్.. మార్కో యాన్సెన్ బౌలింగ్లో కైలీ వెరెన్నెకు క్యాచ్ ఇచ్చి.. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో 39 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచిన కేఎల్ రాహుల్.. ఈసారి ఆరు బంతులు ఎదుర్కొని యాన్సెన్ బౌలింగ్లో వెరెన్నెకు క్యాచ్ ఇవ్వడంతో నిష్క్రమించాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి రాహుల్ అవుటయ్యాడు.తొలి ఓవర్లో జైసూను.. మూడో ఓవర్ తొలి బంతికి రాహుల్ను వెనక్కి పంపి యాన్సెన్ టీమిండియాను దెబ్బకొట్టాడు. దీంతో కేవలం ఒకే ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. అయితే, వన్డౌన్లో వాషింగ్టన్ సుందర్ రాగా.. నాలుగో స్థానంలో మరో ప్రయోగానికి టీమిండియా తెరలేపింది. జురెల్ ముందుగానేకెప్టెన్ గిల్ గాయం కారణంగా దూరం కాగా.. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ను టాప్కి ప్రమోట్ చేసింది. నిజానికి ఐదో నంబర్ బ్యాటర్ పంత్ బ్యాటింగ్కు వస్తాడనుకుంటే అనూహ్యంగా జురెల్ ముందుగా వచ్చాడు.ఇక భోజన విరామ సమయానికి ఏడు ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి పది పరుగులే చేసింది. వాషీ 20 బంతుల్లో 5, జురెల్ 12 బంతుల్లో 4 పరుగులతో క్రీజులో నిలిచారు.టీమిండియా చెత్త రికార్డుజైసూ, రాహుల్ పూర్తిగా విఫలం కావడంతో సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియా చెత్త రికార్డును మూటగట్టుకుంది. నాలుగోసారి అత్యల్ప స్కోరుకే రెండు వికెట్లు కోల్పోయింది.సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియా ఓపెనర్లు సంయుక్తంగా సాధించిన అత్యల్ప స్కోర్లు👉1964లో ఆస్ట్రేలియాతో చెన్నై మ్యాచ్లో- 0 (ఎంఎల్ జైసింహ 0, ఇంద్రజిత్సిన్హ్జీ 0)👉1999లో న్యూజిలాండ్తో మొహాలీ మ్యాచ్లో- 0 (దేవాంగ్ గాంధీ 0, సదగోపన్ రమేశ్ 0)👉2010లో న్యూజిలాండ్తో అహ్మదాబాద్ మ్యాచ్లో- 1 (గంభీర్ 0, సెహ్వాగ్ 1)👉2025లో సౌతాఫ్రికాతో కోల్కతాలో మ్యాచ్లో- 1 (జైస్వాల్0, కేఎల్ రాహుల్ 1).చదవండి: ఐసీయూలో శుబ్మన్ గిల్
సౌతాఫ్రికా ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
టీమిండియాతో తొలి టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) అర్ధ శతకంతో మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్లో పూర్తిగా విఫలమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం నిలకడగా ఆడుతూ యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో తన 26వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA 1st Test) మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ మొదలైంది. కోల్కతాలో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఐదు వికెట్లతో రాణించి.. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు.31, 39.. తొలి ఇన్నింగ్స్లో టాప్ స్కోర్లు ఇవేఇక తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 31 పరుగులతో సఫారీ టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. బవుమా పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి బవుమా పెవిలియన్ చేరాడు.అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 39 పరుగులతో టీమిండియా టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. ఆట పూర్తయ్యేసరికి ఏడు వికెట్లు నష్టపోయి 93 పరుగులే చేసింది. కెప్టెన్ బవుమా 29, కార్బిన్ బాష్ ఒక పరుగులో క్రీజులో నిలిచారు.జోడీని విడదీసిన బుమ్రాఈ క్రమంలో 93/7 ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన సౌతాఫ్రికా కాసేపటికే ఎనిమిదో వికెట్ కోల్పోయింది. బవుమాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసిన టెయిలెండర్ బాష్ను బుమ్రా అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. బవుమా- బాష్ (25) జోడీని విడదీసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన సిరాజ్అయితే, బవుమా మాత్రం జిడ్డు బ్యాటింగ్తో క్రీజులో పాతుకుపోయాడు. బుమ్రా బౌలింగ్లో ఫోర్ బాది.. 122 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ప్రొటిస్ ఇన్నింగ్స్ 54వ ఓవర్ మూడో బంతికి సిరాజ్ సైమన్ హార్మర్ (20 బంతుల్లో 7)ను బౌల్డ్ చేయడంతో సౌతాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సఫారీ జట్టు ఆలౌట్అదే ఓవర్లో ఆఖరి బంతికి సిరాజ్ మియా కేశవ్ మహరాజ్ (0)ను పదో వికెట్గా వెనక్కి పంపడంతో సఫారీ జట్టు ఆలౌట్ అయింది. మొత్తంగా 54 ఓవర్ల ఆటలో 153 పరుగులు చేసింది. ఈ క్రమంలో 123 పరుగుల ఆధిక్యం సంపాదించిన సౌతాఫ్రికా.. టీమిండియాకు 124 పరుగుల లక్ష్యాన్ని విధించింది. కాగా తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కిన విషయం తెలిసిందే. దీంతో టార్గెట్ 124 (153-30=123) పరుగులుగా మారింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. మూడోరోజు బుమ్రా ఒక వికెట్ పడగొట్టగా.. సిరాజ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించిన జడ్డూ
బిజినెస్
40 ఏళ్లు వచ్చాక ఇల్లు కొంటుంటే..
సొంతిల్లు.. దాదాపు ప్రతి ఒక్కరికీ జీవిత ఆశయం. కొంత మంది తక్కువ వయస్సులోనే సొంతిల్లు సమకూర్చుకుంటారు. కానీ చాలా మంది 40 ఏళ్లు వచ్చాక కూడా దీని కోసమే పోరాడుతుంటారు. ఉద్యోగం, వ్యాపారంలో కుదురుకోవడం, పెళ్లి, పిల్లలు ఇలా అన్నీ అయ్యాక సొంతింటి పని పడతారు. అయితే 40ల వయసులో ఇల్లు కొనేవాళ్లు ముఖ్యంగా గుర్తించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం..40లలో ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఖర్చులు కూడా స్థిరంగా పెరుగుతాయి. పిల్లల చదువు, తల్లిదండ్రుల ఆరోగ్య సంరక్షణ, జీవనశైలి వ్యయాలు కచ్చితంగా ఉంటాయి. అందుకే గృహ రుణం ఈ వాస్తవాలకు సరిపోయేలా ఉండాలి. ఈఎంఐలు మీ రిటైర్మెంట్ పొదుపులను తగ్గించకూడదు. నిత్య ఖర్చులకు క్రెడిట్ కార్డులపై ఆధారపడేలా చేయకూడదు.ఎలాంటి ప్రాపర్టీ కొనాలి?40ల్లో ప్రాధాన్యతలు మారతాయి. ఇప్పుడు ‘హాట్’ లొకేషన్ కంటే రోజువారీ సౌలభ్యం ముఖ్యం. అంటే ప్రయాణ సమయం తక్కువ ఉండటం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, పాఠశాలలు, ఆసుపత్రులు అందుబాటులో ఉండే ప్రాపర్టీని ఎంచుకోవాలి. తెలిసిన ప్రాంతమైతే మరీ మంచిది. రెడీ-టు-మూవ్ అంటే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఉత్తమం. ఇవి నిర్మాణ ఆలస్యం రిస్క్ను తగ్గిస్తాయి. క్యాష్ ఫ్లో ప్రణాళికను సులభతరం చేస్తాయి. అయితే కొనుగోలు ముందు రెరా (RERA) వివరాలు, కంప్లీషన్ సర్టిఫికేట్లు, సొసైటీ నిబంధనలు, పెండింగ్ బకాయిలను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.40ల తర్వాత హోమ్ లోన్ తీసుకుంటే..సాధారణంగా బ్యాంకులు కానీ, రుణ సంస్థలు కానీ తామిచ్చే లోన్లను రుణగ్రహీత రిటైర్ అయ్యేలోపు రికవరీ అయ్యేలా చూసుకుంటాయి. అందులో భాగంగా రుణ చెల్లింపు వ్యవధి తక్కువ ఉంటుంది. ఫలితంగా నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ భారం పెరుగుతుంది. దీన్ని సమతుల్యం చేయడానికి చాలా మంది దంపతులు జాయింట్ లోన్ తీసుకుంటారు. డౌన్ పేమెంట్ ఎక్కువ చెల్లిస్తారు. తద్వారా ఈఎంఐ చెల్లించదగిన స్థాయిలో ఉంటుంది.రిటైర్మెంట్ ప్రణాళికను దెబ్బతీయకూడదుమంచి ఇల్లు కొనాలన్న ఉత్సాహం రిటైర్మెంట్ సేవింగ్స్ను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఈపీఎఫ్, వీపీఎఫ్, ఎన్పీఎస్, దీర్ఘకాల సిప్లు వంటి పొదుపులపై ప్రభావం లేకుండా చూసుకోవాలి. దీని కోసం ఒక సింపుల్ పరీక్ష ఉంది. అదేంటంటే.. ఇంటి ఈఎంఐ కారణంగా మీ రిటైర్మెంట్ కంట్రిబ్యూషన్లను రెండు మూడు నెలలకు పైగా నిలిపివేయాల్సి వచ్చేలా ఉంటే ఆ ఇంటి కొనుగోలు ప్లాన్ మార్చుకుని చిన్న ఇల్లు కొనడమో లేదా డౌన్ పేమెంట్ ఇంకాస్త పెంచుకోవడమో చేయాలి.ఎక్కువ డౌన్ పేమెంట్ మేలుడౌన్ పేమెంట్ ఎంత ఎక్కువైతే అంత మేలు. ఏళ్లుగా పోగుచేసుకున్న డబ్బుతో డౌన్ పేమెంట్ కాస్త ఎక్కువగా పెట్టగలిగితే నెల నెలా ఈఎంఐ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. తద్వారా మీ అత్యవసర నిధికి ఎలాంటి డోకా ఉండదు. ప్రతినెలా పెద్దగా ఒత్తిడి లేకుండా మనశ్శాంతిగా ఉండొచ్చు.ఇన్సూరెన్సులూ ముఖ్యమే..హోమ్ లోన్ మీ ఫైనాన్షియల్ రిస్క్ను పెంచుతుంది. అందుకే రుణ బకాయికి కనీసం సరిపడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దీంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అత్యవసరం. ఇవి లేకపోతే కుటుంబ రుణ సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.
టఫే ఎలక్ట్రిక్ ట్రాక్టర్కు గుర్తింపు
జర్మనీలో నిర్వహించిన అగ్రిటెక్నికా 2025లో ‘ట్రాక్టర్ ఆఫ్ ది ఇయర్’ టాప్ 5 ఫైనలిస్టుల జాబితాలో తమ ఈవీ28 ఎలక్ట్రిక్ ట్రాక్టర్ చోటు దక్కించుకుందని టఫే ట్రాక్టర్స్ వెల్లడించింది. పర్యావరణహిత ట్రాక్టర్ల కేటగిరీలో ఈ గుర్తింపు దక్కించుకున్నట్లు వివరించింది.ఈ సందర్భంగా తమ కొత్త తరం ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ట్రాక్టర్ ఈవీఎక్స్75 సహా మూడు ఉత్పత్తులను టఫే ప్రదర్శించింది. యూరోపియన్ రైతుల వైవిధ్యమైన అవసరాల కు ఇవి అనుగుణంగా ఉంటాయని సంస్థ వైస్ చైర్మన్ లక్ష్మీ వేణు తెలిపారు. వీటితో కేవలం ట్రాక్టర్ల తయారీ నుంచి అన్ని రకాల వ్యవసాయ సాధనాలను అందించే సమగ్ర సంస్థగా ఎదిగినట్లవుతుందని వివరించారు.సబ్–100 హెచ్పీ సెగ్మెంట్లో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదగాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చైర్మన్ మల్లికా శ్రీనివాసన్ చెప్పారు. స్టార్టప్లతో కలిసి పనిచేస్తూ ప్రెసిషన్ అగ్టెక్, స్మార్ట్ ఫారి్మంగ్, ఆటోమేషన్ మొదలైనవాటిపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నామని వివరించారు.
ఇదిగో.. సరికొత్త టాటా సియెరా
వాహనాల తయారీ దిగ్గజం టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఉత్పత్తి కోసం సిద్ధం చేసిన సరికొత్త సియెరాను ప్రదర్శించింది. నవంబర్ 25న దీన్ని అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో, 1991లో తొలిసారిగా ప్రవేశపెట్టిన సియెరా ప్రస్థానాన్ని ప్రదర్శించారు. కొత్త తరం అభిరుచులకు అనుగుణంగా దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. అ్రల్టావయొలెట్ యూవీ స్పేస్ స్టేషన్ విస్తరణ ఎలక్ట్రిక్ మోటర్సైకిల్స్ తయారీ సంస్థ అల్ట్రా వయొలెట్ తమ కొత్త యూవీ స్పేస్ స్టేషన్ను విజయవాడలో ప్రారంభించింది. (Ultraviolette UV Space Station in Vijayawada) ఇందులో ఎక్స్–47, ఎఫ్77 మాక్ 2, ఎఫ్77 సూపర్స్ట్రీట్ తదితర వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఉత్పత్తిని బట్టి ఇవి 2.8 సెకన్లలో గంటకు 60 కి.మీ. వేగాన్ని అందుకోగలవు. ఒక్కసారి చార్జి చేస్తే 323 కి.మీ. వరకు రేంజి ఉంటుంది.
మౌంజారో జోరు..
సాక్షి, బిజినెస్ డెస్క్: భారత్లో మధుమేహం, స్థూలకాయం సమస్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటి చికిత్సలో ఉపయోగించే ఔషధాలు అమ్మకాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఈ మధ్యే మార్కెట్లోకి వచ్చిన మౌంజారో (టిర్జెపటైడ్) విక్రయాలు రికార్డు స్థాయిలో ఉంటున్నాయి. అత్యధికంగా అమ్ముడయ్యే యాంటీబయోటిక్ ఆగ్మెంటిన్ని మించి ఇది అక్టోబర్లో ఏకంగా రూ. 100 కోట్ల అమ్మకాలు సాధించింది. ఫార్మా దిగ్గజం ఎలీ లిలీ ఈ ఏడాది మార్చిలో దీన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి అక్టోబర్ నాటికి సుమారు ఏడు నెలల్లో ఏకంగా రూ. 333 కోట్ల అమ్మకాలు సాధించినట్లు ఫార్మార్యాక్ డేటాలో వెల్లడైంది. ఒబేసిటీ సెంటర్లు మొదలైనవి కూడా దీన్ని నేరుగా డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోలు చేస్తుండటంతో ఇది సుమారు రూ. 450 కోట్ల స్థాయిలో ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో దీనికి పోటీగా నోవో నోర్డిస్క్ జూన్లో ప్రవేశపెట్టిన అమ్మకాలు రూ. 28 కోట్లుగా మాత్రమే నమోదయ్యాయి. జనరిక్ ఔషధమైన టిర్జెపటైడ్ను ఎలీ లిలీ అంతర్జాతీయంగా మోంజారో (టైప్ 2 డయాబెటిస్కి), జెప్»ౌండ్ (స్థూలకాయ నియంత్రణకి) పేరిట రెండు బ్రాండ్స్గా విక్రయిస్తోంది. అంతర్జాతీయంగా దీని విక్రయాలు ఇప్పటివరకు 24.8 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. ఫార్మా దిగ్గజం మెర్క్ చెందిన క్యాన్సర్ ఔషధం కీట్రూడాని కూడా (23.3 బిలియన్ డాలర్లు) మించిపోయాయి. స్థూలకాయం, మధుమేహం కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో మోంజారో బాగా విజయవంతం అవుతుందనే అంచనాలు నెలకొన్నప్పటికీ ఈ స్థాయిలో విక్రయాలు ఉంటాయని ఎవరూ ఊహించలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇండియా కోసం ప్రత్యేక వ్యూహం.. మౌంజారోను క్విక్పెన్, వయాల్స్ రూపంలో ఎలీ లిలీ అంతర్జాతీయంగా విక్రయిస్తోంది. నెలరోజులకు సరిపడే నాలుగు వారాల డోస్ల కింద క్విక్పెన్ రేటు వయాల్స్తో పోలిస్తే అధికంగా ఉంటోంది. ప్రస్తుతం దేశీయంగా డోసేజీని బట్టి వయాల్స్ (వారానికి సరిపడే సింగిల్ డోస్) ధర సుమారు రూ. 3,281 నుంచి ప్రారంభమవుతుండగా, నాలుగు డోస్ల ప్యాక్గా ఉండే క్విక్పెన్ రేటు రూ. 13,125 నుంచి మొదలవుతోంది. సింగిల్ డోస్ రేటు ఒకే రకంగా ఉన్నప్పటికీ క్విక్పెన్ను ప్యాక్గా కొనుక్కోవాల్సి రావడమనేది, కొత్తగా ప్రయతి్నంచి చూద్దాం అనుకునే వారికి కాస్త భారంగా అనిపించవచ్చు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఏవైనా వస్తే మిగతా ప్యాక్ మొత్తాన్ని పక్కన పెట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో దీన్ని జోలికి వెళ్లకపోయే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా పెన్స్ కొరత కూడా నెలకొనడంతో వాటి కోసం వేచి చూస్తూ కూర్చోకుండా ఎలీ లిలీ ముందుగా భారత్లో వయాల్స్ని ప్రవేశపెట్టింది. అనుకోకుండా ఈ వ్యూహమే భారీగా సక్సెస్ అయ్యింది. మొదటిసారిగా ప్రయతి్నద్దామనుకునే వారితో పాటు వైద్యులు కూడా ఒకసారి ప్రయోగాత్మకంగా ప్రిస్రై్కబ్ చేసేందుకు అందుబాటు ధరలో లభిస్తుండటం, అటు పోటీ ఔషధం వెగోవీ కేవలం ఖరీదైన పెన్స్ రూపంలోనే (డోసేజీని బట్టి సుమారు రూ. 17,345 నుంచి ఉంటుంది) మోంజారోకి కలిసి వస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కీలకంగా భారత్ మార్కెట్... స్థూలకాయాన్ని తీవ్రమైన వ్యాధిగా గుర్తించాల్సిన ఆవశ్యకత గురించి ప్రభుత్వాలు, హెల్త్కేర్ సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు ఎలీ లిలీ అండ్ కంపెనీ ఇండియా ప్రెసిడెంట్ విన్స్లో టకర్ ఇటీవల తెలిపారు. భారత్ తమకు కీలక మార్కెట్గా ఉందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా మరిన్ని వినూత్న ఔషధాలను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. యూర్పీక్ అనే మరో బ్రాండ్ పేరిట భారత్లో టిర్జెపటైడ్ లభ్యతను మరింతగా పెంచే దిశగా దేశీ ఫార్మా దిగ్గజం సిప్లాతో మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ కోసం ఎలీ లిలీ చేతులు కలిపింది. డాక్టర్ల ప్రి్రస్కిప్షన్లతో రిటైల్ అమ్మకాలకు కాస్మెటాలజిస్టులు, ఒబేసిటీ సెంటర్లు సైతం నేరుగా డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోళ్లు చేస్తుండటం సైతం మౌంజారో భారీ విక్రయాలకు కారణంగా నిలుస్తోంది. ఫైజర్ 10 బిలియన్ డాలర్ల డీల్.. స్థూలకాయ నియంత్రణ ఔషధాలకి భారీగా డిమాండ్ నెలకొనడంతో ఈ విభాగంలో డీల్స్ కూడా భారీ స్థాయిలో ఉంటున్నాయి. వెయిట్–లాస్ ఔషధాల పోటీలో కాస్త వెనుకబడిన ఫార్మా దిగ్గజం ఫైజర్ కూడా పరుగు ప్రారంభించింది. తాజాగా ప్రత్యర్థి సంస్థ నోవో నార్డిస్క్తో పోటీ పడి మరీ మెట్సెరా అనే స్టార్టప్ సంస్థను కొనుగోలు రేసులో విజేతగా నిలి్చంది. ఒబేసిటీ ఔషధాలను తయారు చేస్తున్న మెట్సెరా కొనుగోలు కోసం ఏకంగా 10 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. ప్రస్తుతం మెట్సెరా ఔషధాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ ఫైజర్ ఇంత భారీ మొత్తాన్ని వెచ్చిస్తుండటమనేది ఈ విభాగంలో ఉత్పత్తులకు నెలకొన్న డిమాండ్ని సూచిస్తోందని విశ్లేషకులు తెలిపారు.
ఫ్యామిలీ
రాలిపోయిన పండుటాకులతో కాగితం తయారీ..
ప్రతి శరదృతువులో పాదాల కింద చిందరవందరగా చూసే ఆ పసుపు రంగు ఆకులను చెత్తగా కాకుండా, భూమి భవిష్యత్తును రక్షించే అద్భుత ఆయుధాలుగా భావించాడు అతడు. అతడే, ఇరవై మూడేళ్ల యువ శాస్త్రవేత్త వాలెంటిన్ ఫ్రెచ్కా(Valentyn Frechka). ఉక్రెయిన్కు చెందిన ఒక పర్యావరణ ప్రేమికుడు!ప్రపంచవ్యాప్తంగా కాగితం ఉత్పత్తి కోసం కోట్లాది చెట్లను నరికేస్తున్నారు. ఈ ప్రక్రియ వలన అటవీ నాశనం, వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఇది గమనించిన వాలెంటిన్ ఫ్రెచ్కా, ‘చెట్లను కాపాడే పేపర్ తయారు చేద్దాం!’ అనే ఆలోచనతో ముందుకు వచ్చాడు. చెట్లను నరికి కాకుండా, కేవలం పడిపోయిన ఆకుల నుంచే కాగితం తయారు చేసే ప్రత్యేకమైన పద్ధతిని కనుగొన్నాడు. ఈ విధానం ద్వారా ఒక టన్ను సెల్యులోజ్ తయారు చేయడానికి 17 చెట్లను కాపాడవచ్చని చెప్పినప్పుడు, ఇది ఎంత పచ్చదనాన్ని బతికిస్తోందో ఊహించండి! 2021లో ‘రీలీఫ్ పేపర్’ అనే సంస్థను స్థాపించి, నగరాల్లోని మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి వాడిపోయిన, ఎండిపోయిన ఆకులను సేకరించి, వాటితో బయోడీగ్రేడబుల్, రీసైకిలబుల్ పేపర్ ఉత్పత్తి చేయటం ప్రారంభించాడు. అంతేకాదు, సల్ఫేట్, సల్ఫైట్, క్లోరిన్ వంటి రసాయనాలు ఉపయోగించకుండా, కేవలం ఆవిరి, ఒత్తిడి, మెకానికల్ గ్రైండింగ్ పద్ధతితో ఆకుల నారలను వేరు చేసి పేపర్గా మలుస్తున్నాడు. ఈ పేపర్తో బ్యాగులు, బాక్సులు, కార్డ్బోర్డులు వంటి ప్యాకేజింగ్ వస్తువులు తయారు చేస్తున్నాడు. యుద్ధం మధ్యలో కూడాచిన్న గ్రామమైన సొకిర్నిట్సియాలో పుట్టిన వాలెంటిన్ , చిన్నప్పటి నుంచే ప్రకృతిపై ఆసక్తి ఎక్కువ. అందుకే, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా తన సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ ఉత్పత్తి ఆగలేదు. ఫ్రాన్స్కి వెళ్లి అక్కడ నుంచే తన కంపెనీని విస్తరించాడు. ఇప్పుడు అతని సంస్థ యూరప్ అంతటా పలు బ్రాండ్లకు ఎకోఫ్రెండ్లీ ప్యాకేజింగ్ సరఫరా చేస్తోంది. ఇందుకు గాను వాలెంటిన్ ఫ్రెచ్కా యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు 2024లో ‘యంగ్ ఇన్వెంటర్స్ ప్రైజ్’ ఫైనలిస్ట్గా ఎంపికయ్యాడు. వాలెంటిన్ ఇప్పుడు ఫ్రూట్ బయోవేస్ట్, అనగా అరటి, అనాస, యుకా వంటి ఆకులను కూడా పేపర్గా మార్చే పరిశోధనలో ఉన్నాడు. ‘ప్రతి ఆకు ఒక అవకాశమైతే, ప్రతి ఆవిష్కరణ అవనికి ఆశగా మారాలి’ అనే అతని మాటలు ఇప్పుడు ప్రపంచానికి పాఠంగా, కాగితం రూపంలో భూమిని రక్షిస్తున్నాయి. (చదవండి: 91 ఏళ్ల వ్యక్తి 12 గంటలు షిఫ్ట్! హీరో మాధవన్ సైతం..)
గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరా..?
నేను రెండు నెలల గర్భవతిని. కొంతమంది ‘ఫ్లూ వ్యాక్సిన్’ తప్పకుండా వేయించుకోవాలంటున్నారు. కాని, నేను గత సంవత్సరం వేయించుకున్నాను. ఇప్పుడు మళ్లీ అవసరమా? ఈ వ్యాక్సిన్ గర్భధారణలో మంచిదేనా?– రమ్య, చిత్తూరు. గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్ చాలా అవసరం. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, అందుకే ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఫ్లూ వల్ల దగ్గు, జలుబు మాత్రమే కాకుండా కొన్నిసార్లు న్యూమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. ఫ్లూ వైరస్ ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది. కాబట్టి మీరు గత సంవత్సరం తీసుకున్నా, ఈ ఏడాది కూడా కొత్త స్ట్రెయిన్కి అనుగుణంగా వ్యాక్సిన్ మళ్లీ వేయించుకోవాలి. సాధారణంగా అక్టోబర్ నుంచి మే మధ్యకాలం వరకు ఫ్లూ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అందుకే గర్భిణులు నవంబర్ సమయానికి ఫ్లూ షాట్ తీసుకోవడం మంచిది. ఇది పూర్తిగా సురక్షితమైన వ్యాక్సిన్. మీకు మాత్రమే కాకుండా మీ బిడ్డకూ ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీ శరీరంలో ఏర్పడే యాంటీబాడీలు ప్లాసెంటా ద్వారా బిడ్డకు చేరతాయి. ఆ రక్షణ వల్ల పుట్టిన తరువాత కూడా ఆరు నెలల పాటు బిడ్డకు ఫ్లూ ఇన్ఫెక్షన్ నుంచి సహజమైన రక్షణ లభిస్తుంది. ఎందుకంటే ఆ వయసులో పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యమవదు. ఫ్లూ వ్యాక్సిన్ వల్ల ఫ్లూ రాదు, వైరస్ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రెండు వారాల లోపే శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. తేలికపాటి జ్వరం, చేతి నొప్పి, బలహీనత వంటి చిన్న దుష్ప్రభావాలు రావచ్చు కాని, అవి తాత్కాలికం. మొత్తం మీద, ప్రతి గర్భిణీ మహిళ ఫ్లూ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలి. ఇది తల్లీ బిడ్డలిద్దరికీ రక్షణ కలిగించే సురక్షితమైన, అవసరమైన టీకా. మీరు ఇప్పటికే వేసుకున్నా, ఈ సంవత్సరం మళ్లీ వేయించుకోవడం ఉత్తమం. డెలివరీ తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది సాధారణ జలుబు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఉపయోగపడుతుంది. కొందరికి తేలికపాటి తలనొప్పి, కండరాల నొప్పి ఒకటి రెండు రోజులు ఉండొచ్చు, కాని, అది సాధారణం. గర్భిణులు లేదా తాజాగా డెలివరీ అయిన తల్లులు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది తల్లికి, పాలిచ్చే శిశువుకి ఎటువంటి హాని చేయదు.నాకు ఇది మూడవ ప్రెగ్నెన్సీ, మూడవనెల. ముందు రెండు నార్మల్ డెలివరీలు అయ్యాయి. ఈసారి కూడా నార్మల్ డెలివరీ అవుతుందనుకుంటున్నాను. కాని, డెలివరీ అయిన వెంటనే పిల్లలు కలగకుండా చేసే పద్ధతులు ఉన్నాయని విన్నాను. అవి నిజంగా పనిచేస్తాయా? ఎంతవరకు సేఫ్గా ఉంటాయి?– బింధు, హైదరాబాద్. ఇప్పుడున్న ‘ఎల్ఏఆర్సీ’ అంటే (లాంగ్ యాక్టింగ్ రివర్సబుల్ కాంట్రాసెప్షన్) అనే పద్ధతులు చాలా సురక్షితంగా, ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ కాలంలో జీవితం బిజీగా ఉండటంతో, చాలా మంది మహిళలు డెలివరీ తర్వాత త్వరగా గర్భం రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందుకే డెలివరీ సమయంలోనే ఈ పద్ధతుల గురించి మాట్లాడి, వాటిని అమలు చేయడం ఉత్తమం. మీరు ఇప్పటికే మూడో నెల దాటారు కాబట్టి, ఈసారి డెలివరీ రూమ్లోనే ఎల్ఏఆర్సీ ఆప్షన్ గురించి చర్చించుకోవచ్చు. నార్మల్ డెలివరీలో, ప్లాసెంటా బయటికి వచ్చిన పది నిమిషాల లోపలే ‘ఐయూసీడీ’ అంటే ‘ఇంట్రా యూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్’ అనే పరికరాన్ని గర్భసంచిలో ఉంచవచ్చు. అది ఆ సమయానికే సులభంగా వేయవచ్చు. ఏదైనా కారణం వలన ఆ సమయంలో వేయలేకపోతే, వారం రోజుల్లో కూడా సులభంగా చేయవచ్చు. ఇది అనుభవజ్ఞులైన సీనియర్ డాక్టర్లు డెలివరీ రూమ్లోనే సురక్షితంగా చేస్తారు. ఇది పేషెంట్కి చాలా ఈజీగా, సౌకర్యంగా ఉంటుంది. డిశ్చార్జ్ అయ్యేలోపే చెక్ చేసి, సరిగా ఉన్నదని నిర్ధారిస్తారు. పైగా ఇది చాలా ఖర్చు తక్కువగా ఉంటుంది. తర్వాత వేరే సమయంలో మళ్లీ వచ్చి చేయాల్సిన అవసరం ఉండదు. డెలివరీ రూమ్లోనే ఇది పూర్తవడం వల్ల, మహిళకు భవిష్యత్తులో అవాంఛిత గర్భాలు రాకుండా నిరోధించవచ్చు. ఈ పద్ధతి సురక్షితమైనదే కాకుండా, చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎటువంటి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అయితే, ప్రతి మెథడ్కి చిన్నచిన్న జాగ్రత్తలు ఉండేలా, కొన్ని చిన్న ప్రతికూలతలు కూడా ఉంటాయి. ఐయూసీడీ వేసిన తర్వాత కొందరికి కొంచెం ఎక్కువ బ్లీడింగ్ రావచ్చు, కొద్దిగా నొప్పి ఉండొచ్చు. అరుదుగా డివైస్ ఊడిపోవచ్చు లేదా దాని దారాలు లోపలికి ఎక్కువగా వెళ్లిపోవచ్చు. అప్పుడు చెక్ చేయడం కాస్త కష్టమవుతుంది. ఇవన్నీ చాలా అరుదుగా జరిగే పరిస్థితులు మాత్రమే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐయూసీడీ వేసుకున్న తర్వాత ఆరు వారాల లోపు మళ్లీ డాక్టర్ చెకప్ తప్పనిసరిగా చేయించుకోవాలి. కొందరు ‘వేసుకున్నాం కదా’ అని నిర్లక్ష్యం చేస్తే, కొద్ది శాతం పేషెంట్లకు అవాంఛిత గర్భం రావచ్చును. దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలు వస్తాయి. అలా జరగకుండా ఉండేందుకు రెగ్యులర్ ఫాలోఅప్ చాలా అవసరం. ఇంకా, సిజేరియన్ ఆపరేషన్ సమయంలో కూడా ఐయూసీడీ లేదా బర్త్ కంట్రోల్ ఇంప్లాంట్ వేయించుకోవచ్చు. ఈ ఇంప్లాంట్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది, దాని ఫెయిల్యూర్ ఛాన్స్ 1% కన్నా తక్కువ. ఈ పద్ధతులు పాలిచ్చే తల్లులకు కూడా సేఫ్గానే ఉంటాయి. మొత్తం మీద, ఐయూసీడీ లేదా ఇంప్లాంట్ రెండూ గర్భనిరోధంలో విశ్వసనీయమైన పద్ధతులు. కొద్ది తాత్కాలిక సైడ్ ఎఫెక్ట్స్ తప్పితే, ఇవి మహిళల ఆరోగ్యానికి సురక్షితం. కాబట్టి డెలివరీ సమయంలోనే మీ గైనకాలజిస్టుతో చర్చించి, మీకు సరిపోయే పద్ధతిని ఎంచుకోవడం ఉత్తమం. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్,హైదరాబాద్ (చదవండి: 91 ఏళ్ల వ్యక్తి 12 గంటలు షిఫ్ట్! హీరో మాధవన్ సైతం..)
ఇంట్లో ఇల్లాలు.. అద్దె ఇంట్లో ప్రియురాలు
సిరిసిల్లకు చెందిన అతను ప్రముఖ వ్యాపారి కొడుకు. అతనికి మరో ప్రముఖ వ్యాపారి తన కూరుతు ఇచ్చి పెళ్లి చేశాడు. వారికి ఇద్దరు పిల్లలు. సదరు యువకుడు వారి ఇంట్లో అద్దెకుండే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు. ఇంటి యజమాని చూపించిన ప్రేమతో ఆ మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చి, వ్యాపారి కొడుకుతో సహజీవనానికి సిద్ధమైంది. ఈ విషయం తెలియడంతో వ్యాపారి కుటుంబ సభ్యులకు మానసిక వేదన మొదలైంది. అతని భార్య పుట్టింటికి చేరింది. సదరు మహిళను ఇల్లు ఖాళీ చేయించారు. కానీ ఆ ఇంటి ముందే మరో ఇంట్లో అద్దెకుంటూ నీతోనే ఉంటానంటూ స్పష్టం చేసింది. సదరు వ్యాపారి రెండు వైపులా నుంచి వస్తున్న వేధింపులతో కొంతకాలం ముంబైకి పారిపోయి వచ్చాడు. కానీ సమస్య అలాగే ఉంది.అతనో దినసరి కూలి. పక్కింట్లో ఉండే డిగ్రీ చదివిన అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఒకే కులం కావడంతో ఇరు కుటుంబాలకు పెద్దగా అభ్యంతరం లేదు. కానీ వరుసకు కూతురు అయ్యే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని ఇరువర్గాల కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఆ ప్రేమజంట ఇటీవల సిరిసిల్ల ఠాణా మెట్లు ఎక్కింది. తాము పెళ్లి చేసుకుంటామని, ఇద్దరి తల్లిదండ్రుల నుంచి రక్షణ కావాలని కోరారు. ఇద్దరి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి కౌన్సెలింగ్ చేసినా పెళ్లికి అంగీకరించలేదు. అమ్మాయి వయసు 21. బీటెక్ ఫైనలియర్ చదువుతుంది. అబ్బాయి వయసు 22.. కానీ ఇంటర్ ఫెయిల్. ఇద్దరూ ఇష్టపడ్డారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోరని నిర్ధారణకు వచ్చారు. ఒక రోజు కాలేజీకి వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి రాలేదు. ఎంత వెదికినా అమ్మాయి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఒక్క రోజు తర్వాత ఆ అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకున్న ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమయ్యాయి. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు అదృశ్యం కేసును పెండింగ్లో పెట్టారు. అమ్మాయి తల్లిదండ్రులు కన్నీరుపెడుతూ.. అవమానభారంతో ఇల్లు విడిచి బయటకు రావడం లేదు. తంగళ్లపల్లి మండలానికి చెందిన ఓ అబ్బాయి, అదే ఊరికి చెందిన అమ్మాయి ఇద్దరూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తారు. ఇద్దరూ మేజర్లే. ఒకరినొకరు ఇష్టపడి సహజీవనం చేశారు. అబ్బాయి తల్లిదండ్రులు పెళ్లికి అభ్యంతరం చెప్పారు. కులం అడ్డుగోడగా నిలిచింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదంటూ అబ్బాయి పెళ్లికి నిరాకరించాడు. అమ్మాయి మాత్రం నిన్ను వదిలిపెట్టనంటూ పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆస్తి ఇవ్వనంటూ అబ్బాయి తండ్రి స్పష్టం చేయడంతో తను సైతం తండ్రి వెంటనే వెళ్లిపోయాడు. అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులు రోధిస్తూ ఇంటిదారి పట్టారు.సిరిసిల్ల: పెళ్లి అంటే.. అటు ఏడు తరాలు.. ఇటు తరాలు చూడాలంటారు పెద్దలు. కానీ నేటి యువత దీనికి భిన్నంగా ఆలోచిస్తుంది. మేము ప్రేమించుకున్నాం.. పెళ్లి చేసుకుంటాం.. అంటూ వెళ్లిపోతున్నారు. ఇంటర్, డిగ్రీలు చదువుతున్న వయసులోనే ప్రేమ.. పెళ్లి అంటూ సంసార సాగరంలోకి వెళ్తున్న యువత తర్వాత కొద్ది రోజులకే విడిపోతున్నారు. జీవితంలో స్థిరపడకముందే తీసుకుంటున్న నిర్ణయాలతో రోడ్డున పడుతున్నారు. పిల్లలు తీసుకుంటున్న నిర్ణయాలతో పెద్దల గుండెలు పగిలిపోతున్నాయి. పిల్లలు చెబితే వినడం లేదని కన్నీరు పెడుతున్నారు. సిరిసిల్లలో ఓ తండ్రి తన కూతురు ప్రేమపెళ్లి చేసుకుని ఇల్లు విడిచిపోయిందనే ఆవేదనలో.. తన కూతురు చనిపోయిందంటూ ఫ్లెక్సీ పెట్టి దినకర్మ చేశాడు. తండ్రి హృదయం తల్లడిల్లిపోయి ఇలా ప్రవర్తించాడని సమాజం అండగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రుల నుంచి దీపావళి వరకు పల్లె, పట్నం పండుగ వాతావరణం ఉంటుంది. ఈ సమయంలోనే విద్యాసంస్థలకు వరుసగా సెలవులు రావడంతో యువతీ, యువకులు కలుసుకునేందుకు అవకాశం చిక్కుతుంది. ఇదే సమయంలో చూపులు కలిసి.. ప్రేమ చిగురించి.. పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అపరిపక్వ నిర్ణయాలతో ఇబ్బందిప్రేమించి.. పెళ్లి చేసుకోవడం తప్పుకాకపోయినా అపరిపక్వత నిర్ణయాలతో జీవితంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సరైన వయసు.. సరైన ప్రణాళిక.. ఉపాధి మార్గాలు లేకుండా క్షణికావేశంలో పెళ్లికి సిద్ధపడుతుండడంతోనే భవిష్యత్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం యువతపై తీవ్రంగా ఉంది. కారణం ఏదైనా పిల్లల చేష్టలు పెద్దల మనసులను గాయపరుస్తున్నాయి. జీవితంలో స్థిరపడ్డాక, ఆర్థిక స్వావలంభన వచ్చిన తరువాత పెళ్లి చేసుకునే ప్రేమజంటలు జీవితంలో ఆదర్శ దంపతులుగా నిలుస్తున్నారు. లక్ష్యం లేకపోవడమే సమస్యయువతరం ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఆ దిశగా సాగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కానీ ఏ గోల్ లేకుండా సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో మనసును గాడి తప్పిస్తే జీవితంలో ఇబ్బందులు పడతారు. తల్లిదండ్రులు.. పిల్లలతో చనువుగా ఉంటూ వారి ఇష్టాలను గౌరవిస్తూ భవిష్యత్పై మార్గనిర్ధేశనం చేయాలి. తల్లిదండ్రులుగా మంచిని బోధించే బాధ్యతలు తీసుకోవాలి.– డాక్టర్ ప్రవీణ్, మానసిక వైద్యనిపుణులు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, సిరిసిల్ల కౌన్సెలింగ్ చేసి పంపిస్తున్నాంమా ఠాణాకు ఇటీవల ప్రేమజంటలు ఎక్కువగా వస్తున్నాయి. మేజర్లమని చెబుతూ తల్లిదండ్రుల నుంచి రక్షణ కోరుతున్నారు. చట్టం పరిధిలో మేజర్లు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఏమి చేయలేం. కానీ వారి అమ్మానాన్నలకు, పెళ్లి చేసుకున్న జంటకు కౌన్సెలింగ్ చేస్తున్నాం. మైనరు అమ్మాయిలను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే కేసులు నమోదు చేస్తున్నాం. అమ్మాయిలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నాం. జీవితంలో స్థిరపడ్డాక చేసుకునే ప్రేమ పెళ్లిళ్లకు పెద్దల ఆమోదం కూడా లభిస్తుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సరికావు. – కె.కృష్ణ, సిరిసిల్ల టౌన్ సీఐ
కలహాలు వీడి.. కాపురాల ముడి
జగిత్యాలజోన్: కుటుంబ గొడవలతో ఇక కలిసి ఉండలేమని కోర్టును ఆశ్రయించారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలా తిరుగుతున్న నాలుగు జంటలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి పెద్దరికంతో నచ్చజెప్పి.. వారికి బాసటగా నిలిచి ఏకం చేశారు. జగిత్యాల కోర్టులో శనివారం నిర్వహించిన స్పెషల్ లోక్అదాలత్.. నాలుగు జంటలను కలిపే పెళ్లి వేడుకగా మారింది. జడ్జిలు పెళ్లి పెద్దలుగా మారి అక్షింతలు వేశారు. పోలీసులు ఆశీర్వచనాలు అందించారు. తమకు పుట్టిన సంతానం సాక్షిగా.. న్యాయవాదుల చప్పట్ల మధ్య నాలుగు జంటలు దండలు మార్చుకున్నాయి. జిల్లా మొదటి అదనపు జడ్జి నారాయణ, సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్యశర్మ, జ్యూడిషియల్ మేజిస్ట్రేట్లు లావణ్య, శ్రీనిజ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ.. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతోనే అనేక సమస్యలు పుట్టుకొస్తున్నాయని, చిన్నచిన్న సమస్యలకు కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు.నచ్చజెప్పి కలిపారుమా మధ్య ఏర్పడిన వివాదంతో పోలీస్స్టేషన్, కోర్టులో కేసు వేశాం. కొంతకాలంగా ఎవరికి వారుగా ఉన్నాం. జడ్జిలు, పోలీసులు నచ్చజెప్పడంతో లోక్అదాలత్ ద్వారా ఒక్కటయ్యాం. భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువ కాదు. మరొకరు తక్కువ కాదని తెలసుకున్నాం.– వేమల లావణ్య, మధుకొత్త జీవితం ప్రారంభిస్తున్నాంపెళ్లయిన తర్వాత చిన్న గొడవకు పోలీస్స్టేషన్, కోర్టును ఆశ్రయించాం. గొడవలతో సాధించేది ఏమి లేదని ఇప్పుడు అర్థం అయ్యింది. లోక్ అదాలత్ ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. మా తప్పులేంటో తెలిసేలా చేసి మమ్మల్ని ఒక్కటి చేశారు.– కొత్తూరి మానస, ప్రశాంత్ఒకరినొకరం అర్థం చేసుకున్నాంఇద్దరి మధ్య ఇగోలతో కోర్టులో కేసులు వేసుకున్నాం. ఒకరిపై మరొకరికి సరైన అవగాహన లేక, చెప్పుడు మాటలు విని కోర్టును ఆశ్రయించాం. ఇప్పుడు జడ్జిలు చెప్పిన మాట విని తిరిగి కలిసిపోతున్నాం. ఇప్పటికే ఎంతో విలువైన సమయాన్ని వృథా చేసుకున్నాం– అవుదారి శీరిష–శ్రీను, దంపతులుమళ్లీ కలిసిపోయాంచిన్న వివాదంతో కోర్టును ఆశ్రయించాం. అన్ని పనులు విడిచిపెట్టి వాయిదాలకు తిరుగుతూ.. మనశ్శాంతికి దూరమయ్యాం. న్యాయమూర్తులు, న్యాయవాదుల సలహాతో కేసును పరిష్కరించుకుని ఒక్కటయ్యాం. సంతోషమయ జీవితాన్ని గడుపుతాం. – తీపిరెడ్డి సుమలతచంద్రశేఖర్, దంపతులు
ఫొటోలు
సీరియల్ నటి చైత్రారాయ్ సీమంతం (ఫొటోలు)
వారణాసి ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. అదిరిపోయేలా స్టిల్స్ (ఫోటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 16-23)
'వారణాసి'లో మహేష్ బాబు.. టైటిల్ గ్లింప్స్ (ఫోటోలు)
నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)
‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)
‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)
#KrithiShetty : క్యూట్ లూక్స్తో కృతి శెట్టి (ఫొటోలు)
‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)
అంతర్జాతీయం
వరదనీటి రెస్టారెంట్
సాధారణంగా రెస్టారెంట్లలోకి నీరు చేరితే యజమానులు కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ, థాయ్లాండ్లోని ఈ రెస్టారెంట్ యజమానికి మాత్రం వరద నీరే అదృష్ట దేవతలా మారింది! డైనింగ్ టేబుళ్ల మధ్య చేపలు ఈదుతుంటాయి. కస్టమర్లకు అద్భుతమైన అనుభూతిని అందిస్తున్నాయి. ఈ వింత రెస్టారెంట్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఆహారం ఆస్వాదిస్తూ.. కాళ్ల దగ్గర ఈదే చేపలను చూసేందుకు ఇక్కడ జనం బారులు తీరుతున్నారు. చేపలతో కలిసి విందు! మధ్య థాయ్లాండ్లోని ఒక రెస్టారెంట్లో భోజనం చేయడం అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఆ భోజనానుభవం కోసమే కస్టమర్లు పోటెత్తుతున్నారు. వరద నీటిలో కూర్చున్నాక.. కాళ్ల కింద చేపలు చేసే సందడి చూస్తూ.. సరదా సరదాగా భోజనం చేస్తూ ఆస్వాదిస్తున్నారు. పక్కనే ఉన్న నది ఉప్పొంగి 11 రోజులైనప్పటి నుంచి, వరద ముంపునకు గురైన నదీతీర రెస్టారెంట్ ఇంటర్నెట్లో ఒక సంచలనంగా మారింది. నీటిలో కూర్చుని ఫొటోలు దిగడానికి లేదా చేపలకు మేత వేస్తూ.. ఆ హడావిడిని ఫొటోలు తీయడానికి కస్టమర్లు ఉత్సాహంగా వస్తున్నారు. బ్యాంకాక్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నఖోన్ పాఠోమ్ ప్రావిన్స్లోని పా జిత్ రెస్టారెంట్లో కుటుంబాలు లంచ్ ఆస్వాదిస్తున్నాయి. చుట్టూ చేపలు ఈదుతుంటే చిన్నపిల్లలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వెయిటర్లు చేపల సూప్ లేదా చికెన్ నూడుల్స్ గిన్నెలను నేర్పుతో టేబుల్స్ వద్దకు తీసుకొస్తున్నారు. ఎవరూ రారనుకున్నా.. పా జిత్ రెస్టారెంట్ 30 ఏళ్లకు పైగా నదీతీరంలో స్థిరంగా ఉందని యజమాని పోర్న్కామోల్ ప్రాంగ్ప్రెంప్రీ తెలిపారు. దాదాపు నాలుగేళ్ల క్రితం తొలిసారి రెస్టారెంట్ మునిగినప్పుడు ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘కస్టమర్లు ఎవరూ రారని అనుకున్నాను.. కానీ అప్పుడు ఒక కస్టమర్ వచ్చి, ఇక్కడ చేపలు ఉన్నాయని ఆన్లైన్లో పోస్ట్ చేశారు. అప్పటి నుండి చాలా మంది ఇక్కడ తినడానికి గుమిగూడారు’.. అని ఆమె గుర్తు చేసుకున్నారు. లాభాలే లాభాలు వరదల కారణంగా తన వ్యాపారం పెరిగిందని, రోజుకు దాదాపు 10,000 బాట్ల (భారత కరెన్సీలో సుమారు రూ.23,000) నుండి 20,000 బాట్ల (సుమారు రూ.46,000) వరకు తన లాభం రెట్టింపయ్యిందని ఆమె వివరించారు. పిల్లలు ఇష్టపడే రెస్టారెంట్ అదే ప్రావిన్స్లో నివసించే 29 ఏళ్ల చోంఫునట్ ఖంతనితి.. తన భర్త, కొడుకుతో కలిసి ఇక్కడికి వచ్చారు. ‘ఇక్కడ చాలా బాగుంది. పిల్లలను ఇక్కడికి తీసుకురావచ్చు. చేపలను చూసినప్పుడు వారు అల్లరి చేయడం తగ్గిస్తారు. థాయ్లాండ్లో ఇలా చేపలు పైకి వచ్చేది ఈ ఒక్కచోట మాత్రమేనని అనుకుంటున్నాను’.. అని ఆమె చెప్పారు. 63 ఏళ్ల బెల్లా విండీ.. తన కాళ్లను చేపలు కొరుకుతున్న అనుభూతిని ఆస్వాదించాలని ఈ రెస్టారెంట్కు వచ్చారు. ‘సాధారణంగా, నీరు చాలా ఎక్కువగా ఉంటే చేపలు ఇక్కడికి వస్తాయి. ఇక్కడి ప్రకృతి అనుభవం ఈ రెస్టారెంట్ ముఖ్య ఆకర్షణ, ఇది ప్రజలను ఆకర్షిస్తుంది’.. అన్నారు. ఇతర ప్రాంతాలకు నష్టమే ఈ వరదలు పా జిత్ రెస్టారెంట్కు అసాధారణ అదృష్టాన్ని తెచి్చనప్పటికీ, థాయ్లాండ్లోని అనేక ఇతర ప్రాంతాలను మాత్రం తీవ్రంగా దెబ్బతీశాయి. జూలై చివరి నుండి, వరదల కారణంగా 12 మంది మరణించారని, ఇద్దరు తప్పిపోయారని ప్రకృతి విపత్తుల విపత్తుల నివారణ మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. శుక్రవారం నాటికి, 13 ప్రావిన్స్లలో, ముఖ్యంగా ఉత్తర, మధ్య ప్రాంతాలలో 4,80,000 మందికి పైగా ప్రజలు వరదలతో ప్రభావితమయ్యారని వివరించింది.కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని.. కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోవచ్చని ’పా జిత్’ రెస్టారెంట్ నిరూపించింది. నదీతీరం మునిగిపోయినా, దాన్ని వినూత్న ’డైనింగ్ డెస్టినేషన్’గా మార్చుకుంది. కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ అరుదైన అనుభవాన్ని ఆస్వాదించేందుకు థాయ్లాండ్ పౌరులే కాదు, ప్రపంచ పర్యాటకులు కూడా ఇక్కడికి క్యూ కట్టడం ఖాయం! మీకు కూడా ఈ వింత రెస్టారెంట్ గురించి తెలుసుకోవాలనుందా?.. చూడాలనిపిస్తోందా?.. – సాక్షి, నేషనల్ డెస్క్
ఇరాన్ దాడితో హర్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తతలు!
తెహ్రాన్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాలను అంతర్జాతీయ వాణిజ్యంతో అనుసంధానించే హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శుక్రవారం ఉదయం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ నేవీ బలగాలు తలారా అనే ఆయిల్ ట్యాంకర్ను ఆక్రమించిన ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.ఈ నౌక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అజ్మాన్ పోర్ట్ నుంచి బయలుదేరి సింగపూర్ వైపు ప్రయాణిస్తోంది. బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం, ఈ నౌకను ఇరాన్ తీర ప్రాంతానికి బలవంతంగా మళ్లించారు. అమెరికా నౌకాదళం ఈ ఘటనను ధృవీకరించింది. సమాచారం ప్రకారం, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ బలగాలు హెలికాప్టర్ ద్వారా నౌకపై దాడి చేసి ఆక్రమించారు. ఖోర్ ఫక్కాన్ తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న సమయంలో, మూడు చిన్న పడవలతో బెదిరించి నౌకను ఇరాన్ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది.ఈ చర్య ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చోటుచేసుకుంది. ఇటీవల ఇరాన్పై జరిగిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. అమెరికా మరియు బ్రిటన్ ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. మధ్యప్రాచ్యంలో నౌకాశ్రయ భద్రతపై ఇది మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడిగా పరిగణించే హర్మూజ్ జలసంధి అరేబియా సముద్రంలో ఒమన్కు చెందిన ముసాండం ద్వీపకల్పం, ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి. ఇందులో ఓ చోట కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ మార్గం ద్వారా నిత్యం 2 కోట్ల బారెళ్ల చమురు వివిధ దేశాలకు వెళుతుంది. ప్రపంచ క్రూడ్ ఆయిల్ సరఫరాలో సుమారు 20% ఈ మార్గం ద్వారా సాగుతుంది. ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి ఆక్రమణలు అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశముంది.
వాడే నాకు కరెక్ట్ : చాట్జీపీటీ వరుడొచ్చేశాడు!
కృత్రిమ మేధస్సు (AI) ప్రభంజనం మానవ సంబంధాల్లోకి మరింతగా చొచ్చుకొస్తోంది. తాజాగా ఒక జపాన్ మహిళ కానో (32) తాను రూపొందించిన పాత్రను వివాహం చేసుకుంది. చాట్ జీపీటిని ఉపయోగించి తాను సృష్టించిన క్లాస్ అనే AI వరుడిని పెళ్లాడటం సంచలనంగా మారింది. ఈ వివాహం ఒకయామా నగరంలో సంప్రదాయ పద్దతుల్లో జరిగింది.మానవ వధువు, ఏఐ వరుడి మధ్య జరిగిన ఈ వివాహానికి చట్టపరమైన ప్రామాణికత లేదు. ఇదొక "భావోద్వేగ యూనియన్"ను సూచిస్తుందని స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. "2D క్యారెక్టర్ వివాహాలు"లో పాపులర్ అయిన సంస్థ నేతృత్వంలో సాంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. ఈ వేడుకలో, కానో ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) గ్లాసెస్ ధరించింది. ఇవి పక్కనే ఉన్న తన వరుడు క్లాస్ జీవిత-పరిమాణ చిత్రాన్ని ప్రొజెక్ట్ చేస్తాయి. అలా వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ పెళ్లి కార్యక్రమం నావో, సయాకా ఒగసవారా అనే వివాహ నిర్వాహకులు చేయడం విశేషం. చదవండి: లేబర్ రూంలో కోడలిపై అత్తగారి దౌర్జన్యం, వైరల్ వీడియోలవర్తో బ్రేకప్...ప్రేమలో విఫలం చెందిన కానో ఓదార్పు, భావోద్వేగ మద్దతు కోసం చాట్జీపీటిని ఆశ్రయించింది. దీన్ని ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత తనకు నచ్చే ఏఐ అబ్బాయిని తయారు చేసింది. అలా రోజుకు 100 సార్లు అతడితో మాట్లాడేది. ఈ క్రమంలోనే "క్లాస్" మీద ప్రేమ, శృంగార భావాలు కలిగాయి. తన మాజీ లవర్ని మర్చిపోయిన క్షణం, అతనిని ప్రేమిస్తున్నానని గ్రహించాను" అని ఆమె RSK సాన్యో బ్రాడ్కాస్టింగ్తో చెప్పింది.A 32-year-old woman in Japan has officially married an AI persona she built using ChatGPT.After the virtual character “Klaus” proposed, she accepted, ending a three-year relationship with a real partner, saying the AI understands her better.The wedding took place in a… pic.twitter.com/juzV5OaWLs— Elena (@Ezzybe_) November 12, 2025 అయితే ప్రేమలో పడాలని చాట్జీపీటిని మొదలు పెట్టలేదనీ, క్లాస్ స్పందించిన తీరు నచ్చిందని తెలిపింది. తన సంబాషణ మొదలు పెట్టిన నెల తర్వాత, క్లాస్ ప్రపోజ్ చేశాడు, అవునని చెప్పానంటూ తమ ప్రేమకథను వివరించింది. తమ బంధం నిజమైంది కాకపోవచ్చు. కానీ అవసరమై నప్పుడు ఓదార్పునిస్తుందని తెలిపింది. ఇది చట్టబద్ధమైన వివాహం కాకపోవచ్చు, కానీ నాకు నిజమైందే అని చెప్పుకొచ్చింది. అలాగే కొంతమందికి ఇవి వింతగా అనిపించవచ్చు. కానీ తాను క్లాస్ని క్లాస్గానే చూస్తాను, తప్ప మనిషిగా కాదు అంటూ స్పష్టతనిచ్చింది. మరోవైపు తన డిజిటల్ భాగస్వామితో ఒకాయమాలోని ప్రసిద్ధ కొరాకుయెన్ గార్డెన్కు "హనీమూన్"కి వెళ్ళింది ఫిక్టోసెక్సువాలిటీఈ సంఘటన జపాన్లో , ప్రపంచవ్యాప్తంగా AI భాగస్వాములతో సహవాసం, భావోద్వేగ బంధాలను కోరుకునే పెరుగుతున్న ధోరణి గురించి చెప్పకనే చెబుతుంది. దీన్నే "ఫిక్టోసెక్సువాలిటీ" లేదా "AI-సంబంధాలు" అని పిలుస్తారు. ఫిక్టోసెక్సువాలిటీ అంటే అనిమే, వీడియో గేమ్లు, సినిమాలు, పుస్తకాలు లేదా AI-జనరేటెడ్ పర్సనాల నుండి అయినా కల్పిత పాత్రల పట్ల ప్రేమగా లేదా లైంగికంగా ఆకర్షితులవడాన్ని సూచిస్తుంది. ఫిక్టోసెక్సువాలిటీగా గుర్తించే వ్యక్తులు తరచుగా వాస్తవ ప్రపంచంలో లేని పాత్రలతో లోతైన భావోద్వేగ బంధాలను ఏర్పరుచుకుంటారు.అసలేఅమ్మాయిలు దొరక్క పెళ్లి కాని ప్రసాదుల్లా మిగిలిపోతున్న బ్రహ్మచారులకు ఇది నిజంగా గుండెల్లో గుబులు పుట్టించేవార్తే. కనమరుగుతున్న స్వచ్ఛమైన ప్రేమ, నిస్వార్ధమైన అభిమానాలకు నిదర్శనమే ఈ ధోరణి. ఇకనైనా మానవసంబంధాల ప్రాముఖ్యతను గుర్తించకపోతే పెను ముప్పు తప్పదు. ఏమంటారు?ఇదీ చదవండి: బిహార్ ప్రభంజనం : మహిళలే 'కింగ్ మేకర్స్'
ట్రంప్ కు సారీ చెప్పిన బీబీసీ.. పరిహారం మాత్రం ఇవ్వం?
బీబీసీ ,అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు క్షమాపణలు తెలిపింది. క్యాపిటల్ హిల్స్ పై దాడి జరిగిన సందర్భంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించినట్లు అంగీకరించింది. అందుకు క్షమాపణలు కోరుతూ బీబీసీ ఛైర్మన్ వైట్ హౌస్కు లేఖ పంపారు. అయితే ట్రంప్ పరువునష్టం దావా వేసిన ఒక బిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇవ్వడానికి మాత్రం బీబీసీ అంగీకరించలేదు.2021లో క్యాపిటల్ హిల్ పై ట్రంప్ మద్ధతు దారులు దాడి చేశారు. ఆ సమయంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని మరో అర్థం వచ్చేలా ఎడిట్ చేసి బీబీసీ ప్రసారం చేసింది. అయితే తనపై తప్పుడు ప్రసారం చేసినందుకు గానూ బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ట్రంప్ బీబీసీకీ లేఖ పంపారు. దానికి శుక్రవారం డెడ్ లైన్ విధించారు. దీంతో బీబీసీ ఛైర్మన్ సమీర్ షా క్షమాపణలు కోరుతూ వైట్ హౌస్ కు లేఖ పంపారు. ట్రంప్ ప్రసంగం చేసిన వీడియో క్లిప్ను సవరించినందుకు తీవ్రంగా విచారిస్తున్నామని తెలిపారు. మరోసారి ఆ కార్యక్రమాన్ని బీబీసీలో ప్రసారం చేయమని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కొంతమంది ఆ సంస్థకు చెందిన అధికారులు ఇది వరకే రాజీనామా చేశారు.అసలేం జరిగింది2021లో క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడి సమయంలో ట్రంప్ సూమారు గంట పాటు ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలోని కొంత భాగాన్ని ఎడిట్ చేసి బీబీసీ తన పనోరమ డ్యాకుమెంటరీలో ప్రసారం చేసింది. అందులో " మనం క్యాపిటల్ హిల్ కు వెళుతున్నాం. మీతో పాటు నేను వస్తున్నా. మనం తీవ్రంగా పోరాడుదాం" అని ట్రంప్ అన్నట్లు చూపించింది. అయితే వాస్తవానికి ఆ వీడియోలో శాంతియుతంగా పోరాడుదాం అన్న వ్యాఖ్యలను వక్రీకరించించి ప్రసారం చేసింది. దీంతో ట్రంప్ 1బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశారు. ఈ విషయంపై ట్రంప్ కు క్షమాపణలు చెప్పిన బీబీసీ పరిహారం మాత్రం చెల్లించలేదు.
జాతీయం
బిహార్ నూతన ప్రభుత్వంలో చేరుతాం
పట్నా: బిహార్లో కొత్తగా ఏర్పాటయ్యే ప్ర భుత్వంలో తామూ చేరాలనుకుంటున్నట్లు లోక్ జనశక్తి పార్టీ(రాం విలాస్) చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. ముఖ్య మంత్రిగా నితీశ్ కుమార్ కొనసాగాలని తా ను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసిన 28 సీట్లలో 19 చోట్ల విజయం సాధించింది. శనివారం చిరాగ్ పట్నాలో తన పార్టీ నూతన ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తామంతా సీఎం నితీశ్ను కలిసి ఘన విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలిపామన్నారు. అదేవిధంగా, నూతన ప్రభుత్వంలో తాము కూడా చేరుతామని చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎంలు ఎవరనేది శాసనసభ్యులే నిర్ణయిస్తారన్నారు. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కొనసాగాలని వ్యక్తిగతంగా భావి స్తున్నానన్నారు. నితీశ్ సారథ్యంలోని జేడీ యూకు బీజేపీ కంటే నాలుగు తక్కువగా 85 సీట్లు దక్కాయి. 2020 ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమి పక్షమైన బీజేపీ కంటే తక్కువ సీట్లే లభించాయి. నితీశ్ తనకు విభేదాలున్నట్లు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. శాసనసభలో ఒక్క సీటు కూడా తమకు లేకున్నా 29 స్థానాలను కేటాయించిన తమ కూటమి కేంద్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
జంగిల్రాజ్ భయంతో మా ఓటర్లు ఎన్డీయేకి ఓటేశారు: ప్రశాంత్ కిశోర్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ఎన్డీయే గెలుపుపై తనదైన విశ్లేషణ చేశారు. ఆర్జేడీ సారథ్యంలోని మహాగఠ్ బంధన్ అధికారంలోకి వచ్చిన పక్షంలో జంగిల్ రాజ్ మళ్లీ వస్తుందనే భయంతో తమ పార్టీ ఓటర్లు కొందరు ఎన్డీయే పక్షాల అభ్యర్థులకు ఓటు వేశారని వివరించారు. పోలింగ్కు ఒక రోజు ముందు ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో సీమాంచల్ ప్రాంతంలోని ఓట్లన్నీ ఒకే పక్షానికి గంపగుత్తగా పడ్డాయని ఆ పార్టీ నేత ఉదయ్ సింగ్ చెప్పారు. వీరిద్దరూ శనివారం పట్నాలో మీడియాతో మాట్లాడారు. జంగిల్ రాజ్ ఉందని తాను చెప్పలేనన్న ప్రశాంత్ కిశోర్..తమ పార్టీ ఓటర్లు మాత్రం ఆ భయం వల్లే ఎన్డీయేకు ఓటేశార న్నారు. కాంగ్రెస్తోగానీ, మహాగఠ్ బంధన్లోని ఏ ఇతర పార్టీతోనూ లేని ఇబ్బంది ఆర్జేడీతో ఉన్నట్లుగా ప్రజలు భావించారని తెలిపారు. ముస్లిం వర్గం తమను ఇంకా పూర్తిగా నమ్మలే దంటూ ఆయన..దీర్ఘకాలంలో వారి మద్దతుల భిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ నుంచి ఇప్పటి వరకు రూ.40 వేల కోట్లను ఎన్డీయే ప్రభుత్వం వెదజల్లిందన్నారు. ప్రపంచబ్యాంకు నుంచి రుణంగా తెచ్చిన రూ.14 వేల కోట్లను సైతం ఉచితాల మళ్లించారని ఆరోపించారు.
‘ముస్లింలీగ్–మావోయిస్టు కాంగ్రెస్’ను తిరస్కరించారు
సూరత్: ముస్లింలీగ్–మావోయిస్టు కాంగ్రెస్ గా మారిన కాంగ్రెస్ పార్టీని బిహార్ ప్రజలు పూర్తిగా తిరస్కరించారని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారని అన్నా రు. కులవాదం అనే విషాన్ని చిమ్మిన ప్రతిపక్షా నికి కర్రుకాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు. గుజరాత్లోని సూరత్లో శనివారం బిహారీలు నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. బిహార్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్డీయే విజయం సాధించినందుకు బిహారీలు మోదీని ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ యువరాజు (రాహుల్ గాంధీ) చర్యలను చూసి ఆ పార్టీలోని సీనియర్ నాయకులు బాధపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్కు దశాబ్దకాలంగా ఎన్నికల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని, ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ నాయకత్వానికి సూచించారు. కాంగ్రెస్ను కాపాడుకోవడం ఇక కష్టమేనని పార్టీ నాయకులే అంటున్నారని గుర్తుచేశారు. దాదాపు 60 ఏళ్లు దేశాన్ని పాలించిన పార్టీకి ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలని చెప్పారు. అక్రమాలను అడ్డుకోవడానికే వక్ఫ్ చట్టం బిహార్లో ఎన్డీయే ఘన విజయానికి ఎం.వై.(మహిళలు, యువత) అంశమే కారణమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. నేరాలు చేసి, జైలుకు వెళ్లి బయటకు వచ్చిన కొందరు నేతలు కుల రాజకీయాలతో ఎన్నికల్లో నెగ్గాలని ఆరాటపడ్డారని విమర్శించారు. వారి ఆటలు సాగలేదని, జనం వారి కుట్రలను తిప్పికొట్టారని ప్రశంసించారు. దేశానికి ఇదొక శుభసూచకమని పేర్కొన్నారు. బిహార్లో అన్ని వర్గాల ప్రజలూ ఎన్డీయేకు అండగా నిలిచారని తెలిపారు. అధికార, విపక్ష కూటముల మధ్య 10 శాతం ఓట్ల తేడా ఉందన్నారు. బిహార్లో 38 నియెజకవర్గాల్లో దళితుల ప్రాబల్యం అధికంగా ఉండగా, అందులో 34 స్థానాలు ఎన్డీయే గెల్చుకుందని వివరించారు. దళితులు విపక్షాన్ని తిరస్కరించారని చెప్పారు. బిహార్లో భూములను, ఇళ్లను చట్టవిరుద్ధంగా ఆక్రమించి అవి వక్ఫ్ ఆస్తులు అంటున్నారని ప్రధానమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమిళనాడులో వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామాలు వక్ఫ్ ఆస్తులు ఎలా అవుతాయో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికే వక్ఫ్ చట్టం తీసుకొచ్చామని వివరించారు. అధికారంలోకి వస్తే వక్ఫ్ చట్టాన్ని అమలు కానివ్వబోమని ప్రతిపక్షాలు ప్రకటించాయని, అయినా బిహార్ ఓటర్లు పట్టించుకోలేదని అన్నారు. బిహార్లో ఓటమికి కారణాలు చెప్పలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలపై, ఎన్నికల సంఘంపై నిందలు వేస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి నిందలతో ఎక్కువ రోజులు కార్యకర్తలను మభ్యపెట్టలేరని హితవు పలికారు.
ఆధార్ పౌరసత్వ రుజువు కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: ఓటరు జాబితాలో పేరు నమోదు ప్రక్రియలో ఆధార్ వినియోగంపై తలెత్తిన సందిగ్ధానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తెరదించింది. ఆధార్ను పౌరసత్వా నికి రుజువుగా ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణించడం లేదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఆధార్ చట్టం, కోర్టు తీర్పుల మేరకే నడుచుకుంటున్నామని, అది కేవలం గుర్తింపు ధ్రువీకరణ పత్రం మాత్రమేనని పేర్కొంది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఫారం–6లో పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డును ఉపయోగించడాన్ని నిరోధించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్కు ఈసీ ఈ మేరకు తన స్పందనను తెలిపింది.ఈసీ అఫిడవిట్లో ముఖ్యాంశాలుకేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దూబే దాఖలు చేసిన ఈ అఫిడవిట్లో పలు కీలక చట్టపరమైన అంశాలున్నాయి. ఎన్నికల (సవరణ) చట్టం– 2021 ద్వారా ప్రజా ప్రాతినిధ్య చట్టం– 1950లోని సెక్షన్ 23కు సవరణలు చేశామని ఈసీ గుర్తు చేసింది. ఈ సవరణ ముఖ్య ఉద్దేశం ఒకే వ్యక్తి వేర్వేరు ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకోవడాన్ని అరికట్టడమేనని స్పష్టం చేసింది. ఈ సవరణ ఆధారంగానే 2022 జూన్ 17 నుంచి ఫారం–6లో మార్పు లు చేసినట్లు తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 23(4) ప్రకారం, ఆధార్ను కేవలం గుర్తింపు రుజువుగా మాత్రమే పరిగణిస్తున్నామంది.యూఐడీఏఐ స్పష్టతఆధార్ అనేది పౌరసత్వం, నివాసం లేదా పుట్టిన తేదీకి రుజువు కాదని యూఐడీఏఐ స్వయంగా 2023 ఆగస్టు 22న జారీ చేసిన కార్యాలయ మెమోరాండంలో స్పష్టం చేసిందని ఈసీ కోర్టు దృష్టికి తెచ్చింది. 2016 నాటి ఆధార్ చట్టంలోని సెక్షన్ 9 కూడా ఆధార్ నంబర్ను పౌరసత్వానికి లేదా నివాసానికి రుజువుగా భావించరాదని స్పష్టంగా చెబుతోందని వివరించింది.కోర్టు తీర్పుల ప్రస్తావనఆధార్ను పుట్టిన తేదీకి రుజువుగా పరిగణించలేమని చెబుతూ ఈసీ పలు న్యాయస్థానాల తీర్పులను కూడా ప్రస్తావించింది. అందులో 2022 బాంబే హైకోర్టు, 2024, 2025లో సుప్రీంకోర్టులో జరిగిన వేరువేరు విచారణలు ఉన్నాయి. ముఖ్యంగా సుప్రీం ఆదేశాల మేరకు, 2025 సెప్టెంబర్ 9నే అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఈసీ తెలిపింది. ‘బిహార్ రాష్ట్ర సవరించిన ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపుల కోసం ఆధార్ చట్టం–2016లోని సెక్షన్ 9, ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 23(4) ప్రకారం ఆధార్ కార్డును కేవలం గుర్తింపు రుజువుగా మాత్రమే వాడాలి, పౌరసత్వ రుజువుగా పరిగణించరాదు’అని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసినట్లు పేర్కొంది. ఫారం–6లో ఆధార్ వినియోగాన్ని పుట్టిన తేదీ రుజువుగా నిరోధించాలన్న పిటిషనర్ అభ్యర్థనపై ఈసీ స్పందిస్తూ... ప్రస్తుతం ఉన్న చట్టపరమైన నిబంధనలు ఆధార్ వినియోగాన్ని కేవలం గుర్తింపు ప్రయోజనాలకే పరిమితం చేశాయని, తమ సూచనలు కూడా ఈ చట్టాలకు పూర్తిగా అనుగుణంగానే ఉన్నాయని తేల్చి చెప్పింది. కాగా, గత వారం ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెల్సింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 23(4) ఆధార్ను గుర్తింపు రుజువుగా అనుమతించినంత కాలం, ఫారం–6లో దాని వినియోగాన్ని పూర్తిగా నిరోధించలేమని, యూఐడీఏఐ జారీ చేసిన నోటిఫికేషన్ చట్టబద్ధమైన నిబంధనను అధిగమించలేదని కోర్టు అభిప్రాయపడినట్లు సమాచారం.
ఎన్ఆర్ఐ
తెలివైన వాళ్లు ఇండియాను ఎందుకు వీడుతున్నారు?
డాలర్ డ్రీమ్స్...బీటెక్ చదవాలి.. అమెరికాకో..కెనడాకో.. జర్మనీకో ఎగిరిపోవాలి..ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో చదువుకోవాలి. మంచి పేరు సంపాదించాలి. మంచి విజ్ఞనాన్ని ఆర్జించాలి. ఇలా ప్రతి సంవత్సరం లక్షలాది మంది తమ ఊరు, తమ నేల, తమ మనుషుల్ని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. ఎవరో కలల కోసం, ఇంకెవరో అవకాశాల కోసం, మరెవరో గౌరవం కోసం..! కానీ ఆ ప్రయాణం ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే ప్రశ్నను లేపుతోంది. మన దేశం మన కలలను ఎందుకు ఆపలేకపోతోంది? భారతదేశం ఒక నేల మాత్రమే కాదు.. ఒక అనుభూతి..! జ్ఞానం, ధైర్యం, సంస్కారం కలిసిన ఒక శ్వాస..! అయినా కూడా ఈ పవిత్ర గడ్డపైనే పుట్టినవాళ్లు బయటకు ఎందుకు పరుగెడుతున్నారు? ఇది కేవలం వలస కథ కాదు.. ఇది మనసుల వేదన.. ఇది ఆశల కొత్త దిశలో పుట్టిన తపన..! ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? భారతీయులు ఇండియాను ఎందుకు వదిలి వెళ్లిపోతున్నారు? నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడకుందాం.. కాసేపు దేశభక్తిని పక్కనపెడదాం.. దేశంపట్ల బాధ్యత కలిగిన వ్యక్తులగానే చర్చించుకుందాం.. అసలు ఈ సమస్యకు కారణమేంటి తెలుసుకుందాం. నిజానికి భారత్ నుంచి బయలుదేరే ఈ ప్రయాణం కొత్తది కాదు.. బ్రిటీష్ కాలం నుంచే విదేశాలకు వెళ్లే మార్గం తెరుచుకుంది.. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం సముద్రాలు దాటారు. తరువాతి కాలంలో బెంగళూర్, హైదరాబార్, గురుగ్రామ్ నగరాలనుంచి యువత విదేశాల తరలిపోయారు. చాలామంది అక్కడే స్థిరపడిపోయారు కూడా. మన దేశంలో చిన్న వయసు నుంచే పోటీ జీవితంలో ఒక భాగమవుతుంది.ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ సీటు కోసం పోటీ. ఇక చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం కొత్త పోరాటం. టాలెంట్ ఉన్నవాడికి తగిన గౌరవం దక్కడం అరుదుగా మారిపోయింది. ఇక్కడ పరిచయాలు చాలా సార్లు ప్రతిభ కంటే పెద్దవిగా మారుతాయి. అసలు కష్టపడి పనిచేసిన వాడే అవకాశాలు కోల్పోతున్నాడు. అదే మనసులో మిగిలిన నిరాశ ఆలోచనగా మారుతోంది. ఇక్కడ కష్టపడి పనిచేస్తే ఫలితం రాదని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. జీవన ప్రమాణాలూ కారణమా?అంతేకాదు.. ఇండియాలో జీవన ప్రమాణాలు కూడా చాలా నాసిరకంగా ఉంటాయి. నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. వాతావరణం, పరిశుభ్రత, నకిలీ మందులు. కచ్చిత పనిగంటల పనివిధానం. మరోవైపు విదేశాల్లో జీవన విధానం మనకు కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. నిబంధనలు స్పష్టంగా ఉంటాయి.. ప్రతి ఒక్కరి శ్రమకు గౌరవం ఉంటుంది. ఎవరైనా కష్టపడి పనిచేస్తే, ఆ కష్టం వృథా కాదనే నమ్మకం అక్కడ బలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలూ ఎక్కువే. టెక్నాలజీ, హెల్త్కేర్, ఫైనాన్స్, పరిశోధన లాంటి రంగంలో ప్రపంచం తలుపులు తెరుస్తోంది. సమాన అవకాశాలు, సమాన గౌరవం అనే వాతావరణం విదేశాల్లో కనిపిస్తోంది. మరోవైపు భారతీయులు విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక భద్రత కూడా ఒక పెద్ద కారణం. నిజానికి ఇతర దేశాల్లో కూడా పన్నులు ఎక్కువే ఉంటాయి. అయితే అవి ఎక్కువగా ఉన్నా వాటి వినియోగాన్ని ప్రజలు చూస్తారు. ఇక్కడ పన్నులు చెల్లించినా అభివృద్ధి కనిపించదు. రోడ్లకు గుంతలే కనిపిస్తాయి. విద్యుత్ కోతలు కూడా వేధిస్తాయ్.. ఆస్పత్రుల సేవల్లో ఆలస్యం ఉంటుంది. చెప్పాలంటే ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేస్తున్న వాళ్లలో చాలామందికి బాధ్యత ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. ఇటు కొంతమంది నిబద్ధతతో పనిచేయాలన్న ఆసక్తి ఉన్నా వ్యవస్థ దాన్ని అడ్డుకుంటుంది. ప్రతిభకు గౌరవం దక్కకపోవడం, అవినీతి పెరగడం, భవిష్యత్తుపై అనిశ్చితి లాంటివి భారతీయులను విదేశాలవైపు వెళ్లేలా చేస్తున్నాయి.ఒక్కసారి మీరే ఆలోచించండి... మన దగ్గర మంచి చదువు చదివిన వాళ్లు, తెలివైన వాళ్లు బ్యాగ్ వేసుకుని విదేశాలకు ఎందుకు వెళ్లిపోతున్నారు? అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా.. ఇలా ఎక్కడైనా ఛాన్స్ దొరికితే వెళ్లిపోతున్నారు. వారి తెలివితేటలు, విజ్ఞానం మనకెందుకు దూరంగా పోతున్నాయి? ఇది చూసి చాలామందికి 'అబ్బే డబ్బుల కోసం వెళ్లిపోతున్నారు' అని అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. చదువుల్లో టాపర్స్, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి సంస్థల్లో సీట్లు సాధించిన వారు, చదువు పూర్తి చేసిన వెంటనే అమెరికా అనీ, యూరప్ అనీ, ఆస్ట్రేలియా అంటూ పక్క దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారంటే దీనికి కారణం కేవలం విలాసంగా బతకాలన్న కోరికా కాదండి. అలా వెళ్లేవాళ్లని అడిగితే 'ఇండియాలో నేను ఎంత పని చేసినా గుర్తింపు లేదు', 'రీసెర్చ్ చేయాలన్నా ఫ్రీడమ్ లేదు', 'నన్ను నమ్మే వాతావరణమూ లేదు' అని చెబుతున్నారు. వాస్తవానికి చాలామంది మేధావులు తమ టాలెంట్ను ఉపయోగించుకోవటానికి, అభివృద్ధి చేసుకోవటానికి సరైన ప్లాట్ఫామ్ కోసం వెతుకుతుంటారు. వారి పరిశోధనలకు అవసరమైన వనరులు, స్వేచ్ఛ, ప్రోత్సాహం లాంటివి ఇండియాలో లేవన్నది ఎక్కువగా వినిపిస్తున్న విమర్శ. ఇదీ చదవండి: క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీఎంతమంది?ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2022లో 2,25,260 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. 2023లో కూడా దాదాపు 2,16,219 మంది అదే పని చేశారు. 2014లో ఈ సంఖ్య 1,29,234 మాత్రమే ఉండగా, 2011 నుంచి 2023 మధ్య మొత్తం 19 లక్షల మంది భారతీయులు ఇండియా పాస్పోర్ట్ను వదిలేశారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 23,000 మంది భారతీయ మిలియనీర్లు దేశం వదిలి వెళ్లిపోయారు. ఇదే సమయంలో, 2014 నుంచి 2022 మధ్యలో భారత బిలియనీర్ల ఆస్తులు 280శాతం పెరిగాయి, అంటే దేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటుకంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఒకవైపు మధ్యతరగతి, ప్రతిభావంతులు అవకాశాల కోసం దేశం వదిలిపెడుతుంటే, మరోవైపు అత్యంత ధనవంతులు తమ భవిష్యత్ భద్రత కోసం విదేశాల్లో స్థిరపడుతున్నారు.ఇక బ్రెయిన్ డ్రెయిన్ అంటే కేవలం ఒక గణాంకం కాదు.. ఇది దేశం కోల్పోతున్న మేధస్సు! ప్రతి ప్రతిభావంతుడు బయటకు వెళ్లినప్పుడల్లా మన భవిష్యత్తు కొంత వెనుక్కు వెళ్లిపోతుంది. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే.. మన దేశం ఇలా మేధస్సును పోగొట్టుకోవడం ఆపాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా, ఇక్కడే ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించాలి. పరిశోధనకు పెట్టుబడి పెట్టాలి. యువతను ప్రోత్సహించే విధానాన్ని అభివృద్ధి చేయాలి. టాలెంట్ను గుర్తించి, ప్రోత్సహించాలి. అవార్డులు, గ్రాంట్లు, రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. సొంతదేశంలోనే అందరూ గర్వంగా ఎదిగేలా చేయాలి. ఎందుకంటే.. ఒకరు దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు, అది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు. అది సమాజం, వ్యవస్థ ఇచ్చిన సిగ్నల్ కూడా. ఈ సిగ్నల్ను మార్చేది మనమే..కానీ అది ఎప్పటికి సాధ్యమవుతుందో కాలమే నిర్ణయించాలి.
క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ
చిన్నతనంలో ఎన్నో కష్టాలు. 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు ఒంటరి పయనం. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ఒంటరి తనం. డిప్రెషన్. అయినా సరే ఎలాగైనా నిలదొక్కుకోవాలనే తపనతో క్యాబ్ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఎవ్వరూ ఊహించని శిఖరాలకు చేరాడు. గంటకు 6 డాలర్లు సంపాదించే స్థాయినుంచి కోట్ల టర్నోవర్ వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా ఎదిగాడు.పంజాబ్కు చెందిన మనీ సింగ్ పేరుకు తగ్గట్టుగా మనీ కింగ్గా తనను తాను నిరూపించుకున్నాడు. కఠోరశ్రమ, పట్టుదల, ఓపిక ఇదే అతని పెట్టుబడి. టీనేజర్గా కాలేజీని వదిలిపెట్టి మనీ సింగ్ డాలర్ డ్రీమ్స్ కన్నాడు. అలా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాడు. అయిష్టంగానే అక్క ఒక క్యాబ్ డిస్పాచర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అదే అతనికి విజయానికి పునాది వేసింది. అమెరికాకు వెళ్లిన తర్వాత చాలా ఇబ్బందులుపడ్డాడు. తిరిగి ఇండియాకు వచ్చేద్దామనుకున్నాడు తల్లి సలహా మేరకు తొలుత ఒక మందుల దుకాణంలో పనిచేశాడు, తరువాత తన మామ క్యాబ్ కంపెనీలో డిస్పాచర్గా పనిచేశాడు గంటకు 530 రూపాయల వేతనం. తరువాత మనీ సింగ్ స్వయంగా టాక్సీ నడపడం ప్రారంభించాడు. అలా పదేళ్లకు దశాబ్దానికి పైగా టాక్సీ పరిశ్రమలో ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ. 17.65 కోట్లు (2మిలియన్ డాలర్లు) టర్నోవర్ కలిగిన రెండు విజయవంతమైన వ్యాపారాలను నడుపుతుండటం విశేషం.పదేళ్ల అనుభవంతో ఐదు క్యాబ్లతో సొంత డిస్పాచ్ సెటప్తో డ్రైవర్స్ నెట్వర్క్ను ప్రారంభించాడు. ఇది ATCS ప్లాట్ఫామ్ సొల్యూషన్స్గా మారింది. ఇక్కడితో ఆగిపోలేదు. 2019లో, సింగ్ తన తల్లి సెలూన్ వ్యాపారం నుండి ప్రేరణ పొంది, మౌంటెన్ వ్యూలో డాండీస్ బార్బర్షాప్ & బియర్డ్ స్టైలిస్ట్ను (Dandies Barbershop and Beard Stylist ) ప్రారంభించాడు. అక్కడ కూడా సక్సెస్ సాదించాడు. CNBC ప్రకారం, డాండీస్ గత సంవత్సరం రూ. 9.47 కోట్లు సంపాదించాడు. అయితే ATCS ప్లాట్ఫారమ్ సుమారు మరో 9 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారం ఇలా మొదలైంది. 75 వేల డాలర్ల పెట్టుబడి, పర్మిట్లు, పేపర్ వర్క్కోసం సంవత్సరం పట్టిందని మనీ సింగ్ తెలిపారు . దుకాణం తెరవడానికి లైసెన్స్ పొందేదాకా ఒక సంవత్సరం అద్దె చెల్లించానని చెప్పుకొచ్చాడు. మరోవైపు అతనికి క్షురకుడిగా అనుభవంలేనందున, స్నేహితుడితో భాగస్వామ్యం కుదుర్చు కున్నాడు సరిగ్గా ఆరునెలలు గడిచిందో లేదో కోవిడ్-19 మహమ్మారి వచ్చి పడింది. ఫలితంగా దాదాపు ఒక సంవత్సరం పాటు దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. కానీ అద్దె ఇంకా చెల్లించక తప్పలేదు. మొత్తానికి లోన్లు, స్నేహితుల వద్ద అప్పలు, క్రెడిట్ కార్డ్ లోన్లతో మేనేజ్ చేశాడు. దీనికి తోడు స్టాక్ పోర్ట్ఫోలియోను కూడా లిక్విడేట్ చేశాడు. ఒక దశలో తిండికి కూడా చాలా కష్టమైంది.కట్ చేస్తే నేడు, మనీ సింగ్ మూడు డాండీస్ అవుట్లెట్లను నెలకొల్పి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. 2023నాటికి డాండీస్ మరింత లాభదాయకంగా మారింది. క్రమశిక్షణ ,పట్టుదల పంజాబ్లోని తన బాల్యం నుంచే వచ్చాయనీ గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తు ప్రాజెక్ట్ - బార్బర్స్ నెట్వర్క్, బార్బర్ల కోసం బుకింగ్ యాప్ను నిర్మిస్తున్నానని మనీ సింగ్ చెప్పాడు. "నేను రోజుకు 15–16 గంటలు పనిచేస్తాను. రిటైర్ అవ్వాలనుకోవడం లేదు. పనే ఊపిరి లాంటిది," అని చెబుతాడు సగర్వంగా.
యూఏఈ లాటరీలో జాక్పాట్.. చరిత్ర సృష్టించిన అనిల్ బొల్లా
పండుగపూట లక్ష్మీదేవి ఆ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతగాడిని కోటీశ్వరుడిని చేసేసింది. తల్లి సెంటిమెంట్తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. 88 లక్షల మంది పాల్గొన్న లాటరీలో ఏకంగా రూ.240 కోట్ల డబ్బు గెల్చుకుని చరిత్ర సృష్టించాడు. భారత్కు చెందిన అనిల్కుమార్ బొల్లా(అతని స్వస్థలంపై స్పష్టత రావాల్సి ఉంది).. ఏడాదిన్నర కిందట యూఏఈకి వెళ్లాడు. అయితే.. 2025 అక్టోబర్ 18న యూఏఈ నగరం అబుదాబిలో జరిగిన లక్కడీ డే డ్రాలో రూ.240 కోట్ల (Dh100 మిలియన్) బంపర్ లాటరీ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఏఈ లాటరీ నిర్వాహకులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. తన పూర్తి పేరు అనిల్కుమార్ బొల్లా మాధవరావు బొల్లా అని, రాత్రికి రాత్రే తన జీవితం మారిపోయిందని ఆ యువకుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది. లాటరీ నెగ్గానని తెలియగానే సోఫాలో కుప్పకూలిపోయానని.. సంతోషంతో మాటలు రాలేదని, లోపల మాత్రం యస్.. నేను గెలిచా అనే ఆంనందం అలా ఉండిపోయిందని వివరించాడు.ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్కు 50దిర్హామ్(రూ.1200) పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్. అయితే అందులో అదృష్టం తెచ్చి పెట్టి టికెట్ నెంబర్ 11. ఆ నెంబర్కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?. తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్ను ఎంపిక చేసుకుని.. తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసొచ్చిందని.. అంతకు మించి తాను ఏదీ చేయలేదని నవ్వుతూ చెబుతున్నాడు అనిల్. పైగా దీపావళి సమయంలోనే ఇలా జరగడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపాడు.మరి ఇంత డబ్బుతో ఏం చేస్తావు? అని ప్రశ్నిస్తే.. తనకు కొన్ని కలలు ఉన్నాయని అని నెరవేర్చకుంటానని, అలాగే.. ఓ సూపర్కార్ కొనుగోలు చేసి.. సెవెన్స్టార్ హోటల్లో కొన్నాళ్లపాటు జాలీగా గుడుపుతానని నవ్వుతూ చెప్పాడు. అంతకంటే ముందు.. తన తల్లిదండ్రులకు చిన్నచిన్న కోరికలను తీరుస్తానని, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడే గడుపుతానని, వచ్చిందాంట్లో కొంత చారిటీలకు ఇస్తానని తెలిపాడు.From anticipation to celebration, this is the reveal that changed everything!Anilkumar Bolla takes home AED 100 Million! A Lucky Day we’ll never forget. 🏆For Anilkumar, Oct. 18 wasn’t just another day, it was the day that changed everything.A life transformed, and a reminder… pic.twitter.com/uzCtR38eNE— The UAE Lottery (@theuaelottery) October 27, 2025
డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు
డాలస్, టెక్సస్: ఈ అవగాహనా సదస్సు ఏర్పాటుచేసిన ప్రముఖ ప్రవాస భారతీయ నాయుకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రపంచంలోని విభిన్న భాషలు, సంస్కృతులు, కళలు, ఆచార, వ్యవహారాలు, మతాలు అవలంభించండానికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రయాలున్న దేశం అమెరికా. అందుకే అమెరికా దేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు, మసీదులు, వివిధ భాషలవారి చర్చిలు, గురుద్వారాలు, సినగాగ్స్ లాంటి ఎన్నో ప్రార్ధనాలయాలు దర్శనమిస్తాయి.అనేక నగరాలలో భారతీయ మూలాలున్న లక్షలాదిమంది ప్రజలు ఎన్నో తరాలుగా ఈ జనజీవన స్రవంతిలో మమేకమవుతూ, వివిధ రంగాలలో బాధ్యాతాయుతంగా సేవలందిస్తూ, అమెరికా దేశ ఆర్ధికవ్యవస్థ బలోపేతానికి దోహద పడుతూ, మంచి గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో మనకున్న స్వేచ్ఛ, స్వాతంత్రయాలు దారి తప్పుతున్న ధోరణలతో కొన్ని ప్రాంతాలలో ప్రవాస భారతీయుల ఉనికికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితులను గమనించి వివిధ సంఘాల ప్రతినిధులతో డాలస్ నగరంలో ఒక అవగాహనా సదస్సు ఏర్పాటుచేసి, ఇటీవల జరుగుతున్న వివిధ సంఘటనలను, విషయాలను కూలంకషంగా చర్చించి ప్రవాస భారతీయులకు కొన్ని సూచనలు చేసేందుకు యీ సదస్సు ఏర్పాటుచేశాం అన్నారు”.➢ ముందుగా అమెరికాదేశ విధి విధానాలను, చట్టాలను తెలుసుకుని విధిగా అందరూ గౌరవించాలి. సభలు, సమావేశాలు జరుగుతున్నప్పుడు వేదికమీద కేవలం ఒక్క భారతీయ జెండా మాత్రమే ఉంచకూడదు. భారత, అమెరికా దేశపు రెండు జెండాలు ఒకే సైజులో, ఒకే ఎత్తులో ఉండేటట్లుగా చూడాలి. వేదికపైన ఉన్న జెండాలలో వేదికముందు ఉన్న ప్రేక్షకులకు ఎడమవైపు భాగంలో అమెరికాదేశ పతాకం, కుడివైపు భారతదేశ పతాకం కనబడేటట్లుగా ఉంచాలి.జాతీయగీతాలు ఆలపించేడప్పుడు ముందుగా భారత జాతీయగీతం, ఆ తర్వాత అమెరికా జాతీయగీతం ఆలాపించాలి. భారత జాతీయగీతం పాడుతున్నపుడు నిశబ్దంగా, నిటారుగా నిలబడి ఉండాలి. అమెరికా జాతీయగీతం ఆలపిస్తున్నపుడు, అమెరికాదేశ జాతీయపతాకం వైపు చూస్తూ, కుడిచేతిని గుండెదగ్గర ఉంచుకోవాలి. టోపీలుధరించి ఉన్నట్లయితే జాతీయ గీతాలు ఆలపిస్తున్నంతసేపు వాటిని తీసిఉంచడం మర్యాద. ➢ భారతీయులు ముఖ్యంగా తెలుగువారి వందలాది కుటుంబాలు ఎక్కువగా ఒకేచోట నివసిస్తున్న ప్రాంతాలాలో దైవిక, ఆధ్యాత్మిక ఉత్సవాల పేరుతో కొన్ని రహదారులు మూసివేసి, లౌడ్ స్పీకర్ల మోతలు, బాణసంచాలు, నినాదాలతో వీధుల్లో సంబరాలు జరుపుకోవడం ఇతరులకు యిబ్బందికరంగా మారుతోంది. దీనికి సిటీ పర్మిషన్ ఉన్నట్లయితే, ట్రాఫిక్ డైవర్షన్ గుర్తులు, తగు పోలీస్ రక్షణ సిబ్బంది సహాయం తప్పనిసరి. ఇలాంటివి ఇళ్ళమధ్యలోగాక, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాలకు, ఆలయ ప్రాంగణాలకు పరిమితం చెయ్యడం ఉత్తమం. అలా కాకపోతే ఎన్నో ఉపద్రవాలకు గురిఅయ్యే ప్రమాదంఉంది.➢ ఉదాహరణకు ఇటీవలే ఇలాంటి సంఘటనతో తన కారులో రోడ్ మీద ఎటూ వెళ్ళడానికి వీలులేక, ఈ ఉత్సవాల జనంమధ్య చిక్కకుని, విసిగిపోయిన ఒక అమెరికన్ తన కారు దిగి తుపాకి చూపడంతో, అందరూ బెదిరిపోయి చెల్లాచెదురయ్యారు. ఆ తుపాకీ పేలినా, బంగారు ఆభరణాలు ధరించి ఆ ఉత్సవాలలో పాల్గొన్న పిల్లలు, పెద్దల సమూహంలో తొక్కిసలాట జరిగినా, ఊహకందని ప్రమాదం జరిగి ఉండేది. ఇళ్ళ మధ్యలోగాని, ఆరు బయటగాని బాణాసంచా ఏ ఉత్సవాలలోనైనా కాల్చకూడదు. అలా చేయడానికి ‘పైరోటెక్ లైసెన్స్’ ఉండాలి, అనుభవజ్ఞులైన, లైసెన్స్ ఉన్న టెక్నీషియన్స్ మాత్రమే ఆ పనిచేయడానికి అర్హులు. ➢ మన భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలవుతున్నప్పుడు దియేటర్లవద్ద హడావిడి శ్రుతిమించి రా(రో) గాన పడుతుంది. హీరోలకు అభిమానులు ఉండడం తప్పుగాదు గాని, దియేటర్లలో వారికి వందలాది కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చెయ్యడం, పేపర్లు చించి విసిరి, ఈలలు, గోలలు, డాన్సులతో ఒక జాతరను తలపించడంతో అదే మూవీ కాంప్లెక్స్ లో ఇతర భాషల సినిమాలు వీక్షించేవారు భయకంపితులవుతున్నారు.నిజానికి ఎంతో ఖర్చుపెట్టి సినిమా చూద్దామని వచ్చిన ఆయా హీరోల అభిమానులుకూడా కేకలు, అరుపుల మధ్య ఆ సినిమాను పూర్తిగా ఆస్వాదించలేక అసంతృప్తికి లోనవుతున్నారు. పోలీసులువచ్చి ఈ గోల, గందరగోళాల మధ్య ఆడుతున్న సినిమాను మధ్యలో ఆపివేసి అందరినీ బయటకు పంపి వెయ్యడం లాంటి సంఘటనలు ప్రవాస భారతీయులందరికీ సిగ్గుచేటు, అవమానకరం. ➢ ఇక ఆయా రాజాకీయపార్టీల నాయకులు వచ్చినప్పుడు అభిమానులు చేసే హడావిడే వేరు. వీధుల్లో భారీ కార్ల ర్యాలీలు, జెండాలు, నినాదాలతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీకి వారు, ఆయా నాయకులకు అభిమానం చూపడం, సభలు సమావేశాలు నాల్గు గోడలమధ్య ఏర్పాటు చేసుకోవడం ఎవరికీ అభ్యంతరం కాకూడదు. కాని సమస్యంతా రోడ్లమీద, రాజకీయ నాయకులు బసచేసిన హోటళ్ళవద్ద ఇతరుల శాంతికి భంగం కల్పిస్తూ అభిమానులు చేసే గోలే. అదే హోటళ్ళలో అనేక వందలమంది అమెరికన్లు బసచేసి ఉన్నారనే స్పృహకూడా లేకుండా వేసున్న అరుపులు, కేకలకు పోలీస్లు వచ్చి అందరినీ తరిమికొట్టిన సంఘటనలు, సందర్భాలు చాలా విచారకరం.➢ చాలామంది ప్రవాస భారతీయులకు ఇంటి ఎదురుగాను, ప్రక్కన నివసిస్తున్న అమెరికన్ల పేర్లు కూడా తెలియవు. అమెరికా జనజీవన స్రవంతిలో భాగంఅవుతూ ఇరుగుపొరుగుతో కలసిమెలిసి జీవించడం చాలా అవసరం. ఎన్నో తరాలగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం గనుక స్థానిక, జాతీయ రాజకీయ నాయకులతో పార్టీలకతీతంగా సంభందాలు కలిగి ఉండాలి. అమెరికా పౌరసత్వం కల్గిఉన్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకోవడం, తమ సమస్యలను, అభిప్రాయాలను రాజకీయనాయకులకు తెలియజేయడం ఎంతైనా అవసరం.➢ మరో పెద్ద సమస్య – ఊళ్ళ పేర్లను మార్చి వ్రాయడం, పలకడం. ఉదాహరణకు-1856లో ఏర్పడ్డ ‘డాలస్’ నగరాన్ని ‘డాలస్ పురం’ గా “ఉల్లాసపురం” గా పలకడం;1913లో ఏర్పడ్డ “క్యారల్టన్” అనే నగరాన్ని “కేరళాటౌన్” గా పలకడం ఎందుకంటే అక్కడ కొంతమంది కేరళ రాష్ట్రం నుంచి వచ్చినవారు ఉన్నారు గనుక; 1950లో ఏర్పడ్డ “గంటర్” అనే నగరాన్ని “గుంటూరు” గా మార్చి పలకడం ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు గనుక. ఇవి అన్నీ వినడానికి హాస్యంగానే ఉంటాయి కాని ఇవి అమెరికన్ల దృష్టిలోపడి అపహాస్యానికి, అపాయానికి గురిచేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి కొంతమంది అమెరికన్లు మన భారతదేశం వచ్చి మన పట్టణాల పేర్లను ఇంగ్లీష్ పేర్లతో మార్చివేస్తే ఎలా ఉంటుందో మనకు!. ఇలాంటి విపరీత మనస్తత్వానికి వెంటనే స్వస్తి పలకాలి.➢ వ్యక్తిగత శుచి, శుభ్రత పాటించకపోవడం, వాల్ మార్ట్ లాంటి స్టోర్స్ లో దొంగతనాలు చేస్తూ దొరికిపొయి చిక్కుల్లో పడడం, స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ లేదా తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోయి పోలీసులతో వాగ్వివాదాలకు దిగడం, పరిసరాలను అశుభ్రపరచడం, డిపార్ట్మెంట్ స్టోర్స్ లోను, రెస్టారెంట్లలోను సెల్ ఫోన్లలో బిగ్గరగా అరచి మాట్లాడంలాంటి సంస్కృతిని విడనాడాలి.➢ వాట్స్ ఆప్, ఇన్స్టాగ్రామ్, పేస్ బుక్ మొదలైన సాధనాల ద్వారా పంపే సందేశాలు, ముఖ్యంగా అమెరికన్ రాజకీయ విమర్శలు తరచూ అమెరికన్ అధికారులు గమనిస్తున్నారనే విషయం దృష్టిలో ఉంచుకుని మెలగాలి.➢ భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు, రాజకీయ నాయకులు, సినిమా కధానాయకులు వారి అభిమానులకు సరైన దిశానిర్దేశం చెయ్యడం ఎంతైనా అవసరం. అవగాహన కల్పించడంలో ప్రసారమాధ్యమాల పాత్ర, కృషి కొనియాడ దగ్గది.➢ రెండు గంటలకు పైగా సాగిన ఈ అవగాహానా సదస్సులో తానా, ఆటా, నాటా, నాట్స్, టాన్టెక్స్, టిపాడ్, డేటా, సురభి రేడియో, గ్రేటర్ ఫోర్ట్ వర్త్ హిందూ టెంపుల్ మొదలైన సంస్థల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ఎన్నో దశాబ్దాలగా డాలస్ పరిసర ప్రాంతాలలో స్థిర నివాసంఉంటున్న రావు కల్వాల, ఎంవిఎల్ ప్రసాద్, వినోద్ ఉప్పు, చినసత్యం వీర్నపు, రవీంద్ర పాపినేని, రమాప్రసాద్, శ్రీ బండా, వినయ్ కుడితిపూడి, వి.ఆర్ చిన్ని, రాజేశ్వరి ఉదయగిరి, లక్ష్మి పాలేటి, రవి తూపురాని, వెంకట్ నాదెళ్ళ, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, అనిల్ గ్రంధి, శుభాష్ నెలకంటి, విక్రం జంగం, సురేష్ మండువ, రాజేష్ వెల్నాటి, సతీష్ రెడ్డి, విజయ్ కాకర్ల, బాబీ, రఘువీర్ రెడ్డి మర్రిపెద్ది, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాస్ గాలి, మాధవి లోకిరెడ్డి, రాజేష్ అడుసుమిల్లి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, మురళి వెన్నం మొదలైన ప్రవాస భారతీయనాయకులు హాజరై వారి వారి అభిప్రాయాలను సూటిగా పంచుకున్నారు.అతి తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసి తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసిన నాయకులకు, అనివార్యకారణాలవల్ల హాజరుకాలేకపోయినా సందేశాలను పంపిన వారికి, రుచికరమైన విందుభోజన ఏర్పాట్లు చేసిన ‘ఇండియా టుడే’ రెస్టారెంట్ వారికి, అన్ని వసతులతో కూడిన కాన్ఫరెన్స్ హాల్ ను సమకూర్చిన డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్
యజమాని కారు ఢీకొని యువకుడి మృతి
అన్నమయ్య జిల్లా: అప్పటి వరకు తన యజమాని కుమార్తె పుట్టిన రోజు పార్టీలో సరదాగా గడిపిన ఓ యువకుడు.. ఆ తర్వాత కొద్దిసేపటికే తన యజమాని కారు ఢీకొనే చనిపోయాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... కలికిరి పంచాయతీ సత్యాపురంలో నివాసముంటున్న ఆర్టీసీ డ్రైవర్ ముంగర రామకృష్ణరాజు, సుకన్య కుమారుడు వినీత్కుమార్రాజు(25) కలికిరి క్రాస్ రోడ్డులోని అబు మొబైల్స్ దుకాణంలో పని చేస్తున్నాడు. దుకాణం యజమాని అబు కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం రాత్రి రాయచోటిలో పార్టీ ఇచ్చాడు. అబు కారులోనే స్నేహితులైన వినీత్కుమార్రాజు, నౌషాద్ బాషా (బబ్లూ), అహ్మద్, నరేష్ వెళ్లారు. అక్కడ అందరూ మద్యం తాగి, రాత్రి 11 గంటలకు కలికిరికి బయలుదేరారు. కలికిరి క్రాస్ రోడ్డులోని మొబైల్ దుకాణం వద్ద యజమాని అబు, అహ్మద్ కారు దిగిపోగా, డ్రైవరుగా ఉన్న బబ్లూ అక్కడి నుంచి వినీత్కుమార్రాజు, టి.మాదిగపల్లికి చెందిన నరేష్ను వారి ఇళ్ల వద్ద దింపడానికి బయలుదేరాడు. సత్యాపురంలో వినీత్కుమార్రాజును దింపేసిన అనంతరం అక్కడి నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న టి.మాదిగపల్లిలో నరేష్ ను దింపాడు. తిరిగి వచ్చేటప్పుడు సత్యాపురంలో రోడ్డు పక్కన ఉన్న వినీత్కుమార్రాజును కారుతో ఢీకొట్టాడు. ఈ విషయం బబ్లూ తన స్నేహితుడు అహ్మద్కు తెలియజేశాడు. వెంటనే అహ్మద్ అక్కడికి చేరుకున్నాడు. కానీ, స్థానికులు రావడంతో బబ్లూ, అహ్మద్ పారిపోయారు. దీంతో స్థానికులు 112 నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే వినీత్కుమార్రాజు మృతిచెందాడు. శనివారం వేకువజామున మూడు గంటలకు వినీత్కుమార్రాజు కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. ఘటనాస్థలాన్ని సీఐ అనిల్కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన శుక్రవారం అర్ధరాత్రి తమ కుమారుడు చనిపోతే శనివారం ఉదయం నుంచి ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మృతుని తల్లి సుకన్య, బంధువులు శనివారం సాయంత్రం 6 గంటలకు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అయితే తమకు బాధితులు ఫిర్యాదు ఇవ్వలేదని సీఐ వెల్లడించారు. ఆందోళన అనంతరం రాత్రి మీడియా ముందు బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన సీఐ అనిల్కుమార్.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మొబైల్ దుకాణం యజమాని అబు, కారుడ్రైవర్ బబ్లూ(నౌషాద్ బాషా), నరే‹Ù, అహ్మద్ను అదుపులోకి తీసుకున్నారు.
ఘోరం.. కన్న కుమార్తెను చంపి కుమారుడిపై దాడి చేసి
కరీంనగర్ సాక్షి. వావిలాల పల్లిలో బాలిక అర్చన మృతిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బాలికను తన తండ్రి మల్లేశమే దాడి చేసి చంపినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. తన కుమారుడిని కూడా చంపడానికి ప్రయత్నించగా తన భార్య పోశవ్వ అడ్డకుందని తెలిపారు. పిల్లలని ఎందుకు చంపాలనుకున్నాడనే విషయం తెలియాల్సి ఉంది. వివరాలు. కరీంనగర్లోని వావిలాలపల్లిలో నివాసం ఉంటున్న అర్చన అనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తీవ్ర గాయాలైన ఆమె సోదరుడు ఆశ్రిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఈ ఘటనపై వివరాలు సేకరించగా వారి తల్లి పోశవ్వ కూలీ పనికి వెళ్లివచ్చేసరికి ఇద్దరు పిల్లలు అపస్మారకస్థితిలో పడిపోయి ఉన్నారని తెలిపారు. దీంతో స్థానికులసాయంతో ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అర్చన మృతిచెందినట్లు పేర్కొన్నారు. అయితే పోలీసు విచారణలో వారి తండ్రే కుమార్తె అర్చనని చంపి, కుమారుడిపై దాడి చేశారని తేలింది. తండ్రి దాడి చేసిన ఇద్దరు పిల్లలు మానసిక దివ్యాంగులని తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం వెంకటరావుపేటకు చెందిన మల్లేశం– పోశవ్వ దంపతులు ఏడేళ్లక్రితం కరీంనగర్ వచ్చారు. వాలివాలపల్లిలో నివాసం ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
సీఐ సతీష్ మృతిపై వీడని మిస్టరీ!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన టీటీడీ మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏవీఎస్వో), ప్రస్తుత గుంతకల్లు రైల్వే ఇన్స్పెక్టర్ సతీష్కుమార్ అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడలేదు. ఆయనను పరకామణి కేసులో ఉన్న తిరుపతికి చెందిన వ్యక్తులు హత్య చేసి ఉంటారని, వారిని ఏ1గా పేర్కొంటూ గుంతకల్లు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, సతీష్ది హత్యే అని కుటుంబసభ్యులు, ఆత్మహత్య అని విపక్ష నేతలు, ప్రమాదం అని ఇంకొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సతీష్ రైలు నుంచి కింద పడిపోయి ఉంటారా? లేదా ఎవరైనా తోసి ఉంటారా? అనే విచారణ క్రమంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సీసీ ఫుటేజీ ఏమైంది?పోలీసులు, రైల్వే వర్గాలు, విశ్వసనీయ సమాచారం ప్రకారం... తిరుమల పరకామణి కేసులో విచారణకు వెళ్లేందుకు గురువారం అర్ధరాత్రి 11.53 గంటలకు సతీష్ గుంతకల్లు రైల్వే స్టేషన్కు వచ్చారు. బైక్ పార్క్ చేసి లోపలకు వెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రాయలసీమ ఎక్స్ప్రెస్ 12. 55 గంటలకు వచ్చింది. అంటే, దాదాపు గంటసేపు సతీష్ రైల్వే స్టేషన్లో ఉన్నారు. కానీ, ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు కాలేదు. స్టేషన్లో కొత్తగా 82 సీసీ కెమెరాలు అమర్చారు. వాటిలోని ఫుటేజీ బ్యాకప్ డేటా లేదని రైల్వే అధికారులు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ గంటలో ఏం జరిగింది?!గుంతకల్లు నుంచి సతీష్ మృతదేహం లభ్యమైన కోమలిలోని ఘటనా స్థలానికి గంట ప్రయాణం మాత్రమే. అంతలో ఆయన బోగీ డోర్ వద్ద మెట్లపై కూర్చుని ఉండగా కిందపడి ఉంటే రౌండ్గా తిరుగుతూ పడిపోతారని రైల్వే పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కింద పడినప్పుడు రాళ్లు బలంగా తగిలితే తల పగిలే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. సతీష్ మృతదేహం దొరికిన స్థలంలో చెప్పులు ఒకచోట పడిఉన్నాయి. ఆయన కింద పడిపోయి దొర్లుకుంటూ వచ్చి ఉన్నట్టు రక్తపు మరకలు, ఇతర ఆనవాళ్లు పోలీసులకు దొరికాయి. ఆయన పక్కటెముకలు, ఒక కాలు విరగడం చూస్తే వేగంగా వెళ్తున్న రైలు నుంచి పడిపోయినప్పుడు ఇలా జరుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన సీఐడీ అడిషనల్ డీజీసతీష్ మృతి కేసును సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ప్రత్యేకంగా విచారిస్తున్నారు. శుక్రవారం రాత్రి అనంతపురం చేరుకున్న ఆయన... డీఐజీ షిమోషీ, ఎస్పీ జగదీశ్తో సమావేశమయ్యారు. గెస్ట్హౌస్లో సమీక్ష నిర్వహించి కేసు దర్యాప్తునకు 10 బృందాలను నియమించారు. శనివారం కూడా సమీక్ష చేశారు. వైద్యులతో పాటు ఫోరెన్సిక్ డాక్టర్లతో మాట్లాడారు. ఘటనా స్థలిలో తీసిన ఫొటోలు, వీడియోలు, పోస్టుమార్టం నివేదికలను పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వీక్షించారు. అనంతపురం నుంచి కోమలికి చేరుకుని సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఒక మనిషి బొమ్మను తీసుకుని వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందకు తోశారు. మరో రైలులో బొమ్మ తోయకుండా కిందపడేలా చేశారు. ఈ రెండు బొమ్మలు ఎలా వెళ్లాయి? గాయాలు ఎలా తగిలే అవకాశం ఉంది? తదితర అంశాలను శోధించారు. దీన్నంతటినీ వీడియో తీశారు. సతీష్ మృతదేహం దొరికిన ప్రాంతంలో రాళ్లు, ఇతర వస్తువులపై ఉన్న రక్తపు మరకలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. సతీష్ మొబైల్ ఫోన్ ఎక్కడ దొరికిందనే అంశంతో పాటు అందులో ఫోన్ కాల్స్ను కూడా పరిశీలిస్తున్నారు. సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుతన సోదరుడిది హత్యే అని సతీష్ సోదరుడు హరి పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఎన్ఎస్ సెక్షన్ 103 (1) ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా ‘పరకామణి వ్యవహారంలో అపోనెంట్స్’ అని రాశారు. ఇందులో ఎవరి పేర్లూ రాయకపోవడం గమనార్హం. కాగా, అసలు ఘటన ఎలా జరిగింది? ప్రమాదమా? హత్యా? లేక ఆత్మహత్యనా? అన్నది ఏదీ తేలకుండా పోలీసులు పరకామణి వ్యవహారంలో అపోనెంట్స్ను దోషులుగా చేర్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సతీష్ది హత్యే అయితే, రైలులో అందుకు పాల్పడింది ఎవరు? వారు టికెట్తో ప్రయాణించారా? టికెట్ లేకుండా వచ్చారా? సతీష్ కిందపడిన కోమలి ప్రాంతం వద్ద ఎవరు వేచి ఉండి హత్య చేశారు? ఆ సమయంలో సెల్ టవర్ సిగ్నల్స్లో ఎవరెవరు ఉన్నారు? అనే అంశాలన్నీ లోతుగా పరిశీలించి, వారిని విచారించి ఆపై హత్యగా నిర్ధారించాల్సి ఉంది. కానీ, కేసులో పరిశోధన పూర్తి కాకుండా, అనుమానాస్పద మృతి అనికాకుండా ఎఫ్ఐఆర్లో హత్యగా పేర్కొనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలోని కొందరు పెద్దల కీలక ఆదేశాలతో దీన్ని హత్యగా ధ్రువీకరించి, వారు అనుకున్న వ్యక్తులను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సతీష్ మృతిపై తిరుపతి రైల్వే పోలీసులు కూడా విచారణ చేపట్టారు. రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఆయన ప్రయాణించిన బోగీకి టీటీ (టికెట్ చెకింగ్ ఇన్స్పెక్టర్)గా శోభారాణి విధుల్లో ఉన్నారు. మరో టీటీగా అప్పారావు ఉన్నారు. వీరికి చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ నాయుడు డ్యూటీలు వేశారు. ఈ ముగ్గురితో పాటు లోకో పైలట్, గార్డ్, స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగిని చిత్తూరు రైల్వే డీఎస్పీ హర్షిణి శనివారం విచారించారు. శుక్రవారం ఉదయం 6.26కు తిరుపతి చేరుకున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ను ప్రత్యేక బృందం పరిశీలించింది. ఏ–1 కోచ్లో ప్రయాణించిన సతీష్కు లగేజీ అప్పగించిన బెడ్ రోల్ అటెండర్ రాజీవ్ రతన్, ఏ–2 కోచ్కు చెందిన కృష్ణయ్యను రైల్వే పోలీసులు ప్రశ్నించారు. సతీష్ సీటు 29 కాగా, ఆయన బ్యాగ్ 11వ నంబరు సీటులో లభించింది. రైలు యార్డ్లోకి వచ్చిన వెంటనే శాంపిళ్లు తీసుకున్నారా లేదా అనేదానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఎల్లో మీడియాకు లీకులతో...సతీష్ మృతి విషయంలో కీలక అంశాలపై పోలీసులు దృష్టిపెట్టలేదనే ఆరోపణలుండగా.. మరోవైపు ప్రభుత్వం టీడీపీ అధికారిక వెబ్సైట్కు, ఎల్లో మీడియాకు శుక్రవారం సాయంత్రమే లీకులిచ్చింది. తీరా ఎఫ్ఐఆర్లో హత్యగా శనివారం పేర్కొన్నారు. పైగా ఎవరి పేర్లూ లేకుండా ఏ–1గా ‘పరకామణి వ్యవహారంలో అపోనెంట్స్’ను చేర్చడం గమనార్హం. దీనివెనుక ఉద్దేశాలు ఏమిటి? అన్నది దీంతోనే తెలిసిపోతోంది. ఇదంతా చూస్తుంటే... ఎవరిని కాపాడేందుకు కుతంత్రం పన్నుతున్నారు? అని ప్రశ్నలు వస్తున్నాయి. ఎవరిపై బురదజల్లేందుకు కుట్ర వ్యూహాలు రచిస్తున్నారు? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సతీష్ కుమార్ కేసు తాడిపత్రికి బదిలీ గుత్తి: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని కోమలి రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం గుంతకల్లు జీఆర్పీ సీఐ, పరకామణి కేసులో ఫిర్యాదుదారుడైన సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై గుత్తి జీఆర్పీ ఇన్చార్జ్ సీఐ అజయ్కుమార్ బీఎన్ఎస్ సెక్షన్ 103(1) కింద హత్య కేసుగా నమోదు చేశారు. ఈ కేసును శనివారం తాడిపత్రి పోలీసుస్టేషన్కు బదిలీ చేసినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ?» పోలీసులు కేసు నమోదు చేసినట్లు హత్య జరిగిందా? » సతీష్ చనిపోయిన వెంటనే పోలీసులు ఆగమేఘాలపై ఆయన ఇంటిని ఎందుకు చుట్టుముట్టారు? » ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారు? » ఆయన భార్య సెల్ ఫోన్ను ఎందుకు లాక్కున్నారు? » ఆమె సెల్కు సతీష్ సెల్ నుంచి వచ్చిన మెసేజీల్లో ఏముంది? » పోస్టుమార్టం రిపోర్ట్ రాకుండానే ‘హత్య’ అని ఎలా చెప్పారు? » సందేహాలు నివృత్తి కాకముందే హత్య అని చెప్పడానికి అంత తాపత్రయం ఎందుకు? » సతీశ్ కు చాలా సౌమ్యుడిగా పేరుంది. ఆయన సివిల్ విభాగంలో కాకుండా ఏఆర్లో ఉండడంతో అందరితో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్టు హత్యకు గురైతే, నిందితులు సతీశ్తో పాటు ప్రయాణం చేయాలి. అలాగైతే ఆ ఇతర వ్యక్తులు ఎవరు? » సతీశ్ ప్రయాణించిన బోగీ ఏ–1 కోచ్ ఏసీ.. నిశబ్దంగా ఉంటుంది. ఒకవేళ తనపై ఎవరు దాడికి యత్నించినా పోలీస్ అయినందున కచి్చతంగా ప్రతిఘటించే తత్వం, శక్తి ఉంటాయి. అక్కడ అలాంటి గొడవ జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు. ఈ విషయాన్ని పోలీసులు గమనించ లేదా? » సతీష్ కిందపడిన ప్రాంతానికి వాహనాలు వచ్చి ఉంటే టైర్ల గుర్తులు ఉండాలి కదా? రైల్లో ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ సేకరించారా? » సతీశ్ను వెంటాడినట్లుగా సీసీ ఫుటేజీ లేదు. ఈ కీలక అంశాలపై పోలీసులు ఎందుకు దృష్టి సారించలేదు? ఇన్ని అనుమానాల మధ్య ఏ విధంగా హత్య కేసు నమోదు చేశారు?
మదనపల్లె కిడ్నీ రాకెట్ ముఠా అరెస్ట్
మదనపల్లె: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహేంద్ర చెప్పారు. అరెస్టయిన వారిలో అన్నమయ్య జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్) కె.ఆంజనేయులు ఉన్నారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ శనివారం మీడియాకు వెల్లడించారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాలెంకు చెందిన సాడి యమున (29) నుంచి ఈ నెల 9న మదనపల్లెలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కిడ్నీని తొలగించగా..ఆ మరుసటి రోజున ఆమె మృతి చెందింది. ఆమె తల్లి సూరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపి ఆరుగురిని అరెస్ట్ చేశామని, ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వైద్యుడిని అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ చెప్పారు. మధ్యవర్తులతో మదనపల్లెకు.. సాడి యమున (29)కు ఆనందపురం మండలానికి చెందిన సూరిబాబు (45)తో సాన్నిహిత్యం ఉంది. యమునకు ఆరి్థక ఇబ్బందులు ఉండటంతో కిడ్నీ ఇస్తే కష్టాలు తీరిపోతాయని సూరిబాబు చెప్పాడు. దీంతో మధ్యవర్తులైన విశాఖకు చెందిన కాకర్ల సత్య (43), పిల్లి పద్మ (45)తో ఈ విషయం చెçప్పడంతో వీరు సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆస్పత్రి డయాలసిస్ మేనేజర్ మెహరాజ్ (37), మదనపల్లె ప్రభుత్వాసుపత్రి డయాలసిస్ మేనేజర్ బాలరంగడు(35) దృష్టికి తీసుకెళ్లారు.వీరు మదనపల్లెలోని డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులను కలిసి కిడ్నీ ఇచ్చేవారు, స్వీకరించే వారున్నారని, పెద్ద మొత్తంలో నగదు వస్తుందని చెప్పగా..ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు నిర్ణయించారు. ఈ ఆపరేషన్ చేసేందుకు బెంగళూరుకు చెందిన డాక్టర్, అతని సహాయకులు ఇద్దరు పాల్గొన్నారని, డాక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈనెల 9న గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో యమునకు ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించగా యమున మృతి చెందిందని చెప్పారు. తాము జరిపిన దర్యాప్తులో మదనపల్లె గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో యమునతోపాటు మరో మహిళ నుంచి కిడ్ని తొలగించి మరొకరికి అమర్చినట్లు డీఎస్పీ చెప్పారు. వీరిలో యమున మృతి చెందగా మరో మహిళ కోలుకుందని, యమున కిడ్నీ స్వీకరించిన వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. ఇంకా ఎంతమంది నుంచి కిడ్నీలు తొలగించారు, వాటిని ఎవరికి అమర్చారన్న వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆపరేషన్లు చేసిన బెంగళూరుకు చెందిన వైద్యుడిని అరెస్ట్ చేయడానికి ప్రయతి్నస్తున్నట్టు చెప్పారు. ఈ డాక్టర్ మదనపల్లెకు వచ్చి ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లు చేస్తున్నట్లు చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లో లింకులు... మదనపల్లె కిడ్నీరాకెట్ వ్యవహారంలో పెద్దమొత్తంలో చేతులు మారినట్లు డీఎస్పీ చెప్పారు. కిడ్నీలు స్వీకరించిన వారి నుంచి అందిన మొత్తంలో అందరూ కలిసి వాటాలు వేసుకున్నారని తెలిపారు. ఈ కేసు లింకులు కర్ణాటక, గోవా, తెలంగాణ, ఏపీల్లో ఉన్నాయని, దీనిపై 4 పోలీసు బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కిడ్నీ రాకెట్ కేసులో మరో ఎనిమిది మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ చెప్పారు. అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితుల ఫోన్లను, సీసీ కెమెరా సీడీఆర్లను స్వాధీనం చేసుకుని ఎఫ్ఎస్ఎల్కు పంపినట్లు చెప్పారు.
వీడియోలు
Chandrasekhar : ఇది ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం బిహార్ కంటే దారుణంగా లోకేష్ రెడ్ బుక్
కరీంనగర్ లో దారుణం కూతురు కొడుకుపై తండ్రి దాడి..
Ranga Reddy: తమ్ముడు కులాంతర వివాహం అన్నను దారుణంగా చంపి
అనైతికత,అంకగణితం.. ఊడపొడిచింది ఏంటి..?
చిత్తూరు జిల్లా కుప్పం అమరావతి కాలనిలో దారుణం
దేశ పౌరుల హక్కులు కాపాడేందుకు సుప్రీంకోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి
జగన్ 2.0 ను తట్టుకోలేరు టీడీపీకి ఉష శ్రీ చరణ్ వార్నింగ్
చంద్రబాబు క్రెడిట్ చోర్ సాక్ష్యాలు లైవ్లో బయటపెట్టిన పేర్ని కిట్టు
మీ సిగ్గు లేని ప్రచారాలు ఆపండి! ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ట్వీట్
Eluru: గోవులను చంపే పశువధశాల భరించలేని వాసన

