ప్రధాన వార్తలు

మెడికల్ కాలేజీలు.. అన్నంత పని చేసిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: ప్రజల ఆందోళనను, రాజకీయ పార్టీల అభ్యంతరాలను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లెక్క చేయలేదు. అన్నంత పని చేసేశారు. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు టెండర్ నోటిఫికేషన్ ఇవాళ జారీ అయ్యింది. తొలివిడత నాలుగు మెడికల్ కాలేజీలను పీపీపీ(Public-Private Partnership)లో అప్పగించేందుకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. మెడికల్ కాలేజీలు.. 625 పథకాల సూపర్ స్పెషలిటీ ఆస్పత్రుల పీపీపీకి టెండర్ ప్రకటన ఏపీ ఎంఎస్ఐడీసీ రిలీజ్ చేసింది.చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజా ఆస్తుల ప్రైవేటీకరణ, ముఖ్యంగా మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, అలాగే వైద్య విద్యపై తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ, ఎమ్మార్పీఎస్, ఇతర సామాజిక సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటు ప్రజలలోనూ ఈ నిర్ణయంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంగా ఇన్నేళ్ల తన పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టని చంద్రబాబు.. పేదలు, మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందాలనే లక్ష్యంతో తాము నిర్మించిన కాలేజీలను ప్రైవేట్ చేతుల్లో పెడుతున్నారంటూ వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రేపు తాము అధికారంలోకి వచ్చాక టెండర్లు రద్దు చేసి తీరతామని హెచ్చరించారు కూడా.

క్లౌడ్బరస్ట్ దెబ్బకు పలు ఇళ్లు ధ్వంసం.. ఐదుగురు గల్లంతు
చమోలి: ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో పెను విపత్తు సంభవించింది. ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న నందనగర్లో గురువారం తెల్లవారుజామున సంభవించిన క్లౌడ్ బరస్ట్ పలు ఇళ్లను ధ్వంసం చేసింది. ఐదుగురు అదృశ్యమయ్యారు. జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, నందనగర్లోని కుంత్రి వార్డులో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. చమోలి జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. VIDEO | Chamoli, Uttarakhand: Cloudburst in Nandanagar results in massive destruction. More details are awaited.(Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/LMiM4SuTPQ— Press Trust of India (@PTI_News) September 18, 2025క్లౌడ్ బరస్త్ దరిమిలా ఆ ప్రాంతంలో భయాందోళనలు అలుముకున్నాయి. ఇళ్ల శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంఘటన జరిగిన సమయంలో ఏడుగురు ఇళ్లలో ఉండగా, వారిలో ఇద్దరిని రెస్క్యూ సిబ్బంది సజీవంగా బయటకు తీసుకువచ్చారు. గల్లంతైన మరో ఐదుగురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఎస్డీఆర్ ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, వైద్య బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.చమోలి జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ తివారీ వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ బుధవారం రాత్రి చమోలి జిల్లాలోని నందనగర్ ఘాట్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ సంభవించి, భారీ నష్టం జరిగిందన్నారు. నందనగర్లోని కుంత్రి లంగాఫలి వార్డులో ఆరు ఇళ్ల శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగామని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇంతలో వాతావరణ శాఖ ఉత్తరాఖండ్లో 20 గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. VIDEO | Chamoli, Uttarakhand: Cloudburst in Nandanagar results in massive destruction. More details are awaited.(Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/LMiM4SuTPQ— Press Trust of India (@PTI_News) September 18, 2025

మరో నాలుగు రోజులు ఇంతే..
భారతదేశం అంతటా ద్విచక్ర వాహన డీలర్షిప్ల్లో షోరూమ్ బుకింగ్లు దాదాపు స్తంభించాయి. సెప్టెంబర్ 4న సవరించిన పన్ను రేట్లను జీఎస్టీ కౌన్సిల్ అధికారికంగా ఆమోదం తెలిపినప్పటి నుంచి ఈ తంతు కొనసాగుతోంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేటును తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు దేశవ్యాప్తంగా వినియోగదారులు ధరల తగ్గింపునకు వేచిచూస్తున్నారు.ఏదేమైనా, ఈ ప్రకటన విస్తృతంగా కొనుగోలుదారులను కట్టిపడేసింది. వినియోగదారులు తాము కొనాలనుకునే ఉత్పత్తులపై త్వరలో ధరల రాయితీ ఉంటుందని నమ్మి ఇలా కొనుగోళ్లను వాయిదా వేస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. ‘జీఎస్టీ రేటు తగ్గింపును ప్రధాని ప్రకటించినప్పటి నుంచి అమ్మకాలు తగ్గాయి. సెప్టెంబర్ 4న చేసిన కొత్త రేట్లను అధికారికంగా ఆమోదం తెలపడంతో వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు’ అని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) డీలర్ ఆశిష్ పాండే చెప్పారు.‘సెప్టెంబర్ 22 కొత్త జీఎస్టీ శ్లాబులు అమలు తర్వాతే కొనుగోళ్లు తిరిగి ఊపందుకుంటాయని ఆశిస్తున్నాం. అయితే ఇది భవిష్యత్తులో సాధారణ ప్రక్రియగానే మారుతుందని, పరిమిత సమయ పథకం కాదని వినియోగదారులకు తెలుసు’ అన్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే షోరూమ్ బుకింగ్స్ దాదాపు 50% పడిపోయాయని దేశవ్యాప్తంగా డీలర్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: అంతర్జాతీయంగా ఏఐ నైతిక ప్రమాణాలపై కసరత్తు

Antifa: మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వామపక్ష భావజాలమున్న ఎంటిఫా సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. కన్జర్వేటిక్ ఉద్యమకారుడు చార్లీ కిర్క్ హత్య నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో స్వయంగా ఆయన ప్రకటన చేశారు.ఎంటిఫాను ప్రధాన ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ ప్రకటన చేశారు. దానిని అత్యంత ప్రమాదకరమైన సంస్థగా.. రాడికల్ లెఫ్ట్ విపత్తుగా ఆయన అభివర్ణించారు. అంతేకాదు దీనికి నిధులు సమకూర్చే వారిపై కఠిన విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలకు సూచించారాయన. The United States of America will be designating ANTIFA as a Terrorist Organization.— Donald J. Trump (@realDonaldTrump) May 31, 2020ఏంటీ ఎంటిఫా.. Antifa అంటే ఫాసిస్ట్ వ్యతిరేక (anti-fascist) పదానికి సంక్షిప్త రూపం. ఇదేం ఒక అధికార, కేంద్రీకృత సంస్థ కాదు. ఫార్-లెఫ్ట్ కార్యకర్తల గ్రూప్. ఫాసిజం, రేసిజం, అన్నింటికంటే ముఖ్యంగా కన్జర్వేటివ్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడే రాజకీయ ఉద్యమం అని చెప్పొచ్చు. ఈ సభ్యులు తరచూ ఫార్-రైట్ ర్యాలీలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. బెల్లా సియావో(Bella Ciao) వంటి పాటలు, 1917 రష్యా విప్లవానికి సంబంధించిన గుర్తులను, నినాదాలను తమ నిరసనలకు ఉపయోగిస్తుంటారు. సోషల్ మీడియాలో సిగ్నల్, ఇతర ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. అయితే.. ట్రంప్ గత టర్మ్లోనే ఈ గ్రూప్ను ఉగ్రసంస్థగా గుర్తించాలని అనుకున్నారు. కానీ అది వీలుపడలేదు. ఇప్పుడు తనకు సన్నిహితుడైన చార్లీ కిర్క్ హత్యతో ఆ పని చేశారు. అయితే Antifa అనేది ఒక సిద్ధాంతం మాత్రమేనని, దానిని సంస్థగా గుర్తించి నిషేధించడం అసాధ్యమని, పైగా చట్టపరంగా ఇబ్బందులూ ఎదురుకావొచ్చని ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే అభిప్రాయపడుతున్నారు. కిర్క్ మరణంకన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ మరణం.. అమెరికాలో రాజకీయ దుమారం రేపింది. సెప్టెంబర్ 10వ తేదీన ఉటా యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ని రైఫిల్తో కాల్చి చంపారు. ఒకే భావజాలం ఉన్న ట్రంప్ కోసం అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కిర్క్ ప్రచారం కూడా చేశారు. దీంతో తన ఆప్తుడి మరణంపై ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని మండిపడ్డారాయన. ఈ క్రమంలో.. వామపక్ష భావజాలం ఉన్న 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్ అనే వ్యక్తిని ఎఫ్బీఐ అరెస్ట్ చేసింది. ఘటనా స్థలంలో "Hey fascist! Catch!" వంటి రాతలున్న బుల్లెట్ కేసింగ్లపై కనిపించడం గమనార్హం. అయితే రాబిన్సన్ Antifa సభ్యుడా అనే విషయాన్ని ఎఫ్బీఐ ఇంకా నిర్ధారించలేదు. కానీ ట్రంప్ మాత్రం అతను ‘‘ఇంటర్నెట్ ద్వారా రాడికలైజ్ అయ్యాడు’’ అని చెబుతుండడం గమనార్హం.

Asia Cup 2025: మళ్లీ భారత్-పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే?
ఆసియాకప్-2025లో చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్లో యూఏఈను 41 పరుగుల తేడాతో పాక్ చిత్తు చేసింది. దీంతో గ్రూపు-ఎ నుంచి సూపర్ 4కు ఆర్హత సాధించిన జట్టుగా పాకిస్తాన్ నిలిచింది.ఈ క్రమంలో సెప్టెంబర్ 21(ఆదివారం) దుబాయ్ వేదికగా జరగనున్న సూపర్-4 మ్యాచ్లో మెన్ ఇన్ బ్లూ.. మెన్ ఇన్ గ్రీన్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. మరోసారి దాయాది పాక్ను చిత్తు చేయాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. కాగా లీగ్ స్టేజిలో భాగంగా గత ఆదివారం(సెప్టెంబర్ 14) జరిగిన మ్యాచ్లో పాక్పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.128 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే హ్యాండ్ షేక్ వివాదమే ఎక్కువగా హైలెట్ అయింది. ఈ మ్యాచ్లో పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరాచాలనాన్ని తిరష్కరించారు.దీంతో ఘోర అవమానంగా భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. భారత్ ఆటగాళ్లతో పాటు మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాప్ట్పై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. కానీ రూల్ బుక్లో ప్రత్యర్ధి ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ చేయడం తప్పనిసారి అని లేకపోవడంతో ఐసీసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు సూపర్-4లో కూడా నో హ్యాండ్ షేక్ విధానాన్ని భారత్ కొనసాగించనుంది.చదవండి: మరోసారి బీభత్సం సృష్టించిన సాల్ట్.. ఈసారి పసికూన బలి

నా భర్త మరణం.. మోహన్లాల్ తన బుద్ధి చూపించాడు: నటి
మలయాళ సీనియర్ నటి శాంతి విలియమ్స్ మోహన్లాల్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె తమిళ, మలయాళంలో వందకు పైగా సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో సహాయక పాత్రలు పోషించారు. అపరిచితుడు సినిమాలో విక్రమ్కు తల్లిగా కూడా నటించారు. తనకు 12 ఏళ్ల వయసు ఉండగానే చిత్రపరిశ్రమలో ఆమె అడుగుపెట్టారు. ఆమె 1979లో మలయాళీ కెమెరామెన్ జె. విలియమ్స్ ను వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. తన భర్త మరణం సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండగా దానిని మోహన్లాల్ తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడని ఆమె ఆరోపించారు.మలయాళ సినిమాల్లో ఒకప్పుడు సుపరిచితుడైన సినిమాటోగ్రాఫర్ జె విలియమ్స్ను వివాహం చేసుకున్న శాంతి, తన భర్త అనారోగ్యానికి గురైనప్పుడు కుటుంబం తీవ్ర పేదరికంలోకి నెట్టబడిందని, కానీ పరిశ్రమ నుండి ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. విలియమ్స్ 2005లో అనారోగ్యంతో మరణించారు. అయితే, ఆ సమయంలో మోహన్ లాల్తో జరిగిన ఒక సంఘటన గురించి శాంతి ఇలా అన్నారు, “ఒకప్పుడు నాకు తెలిసిన లాల్ నేటి సూపర్ స్టార్ కంటే చాలా భిన్నంగా ఉంటాడు. అప్పట్లో, అతనికి చిన్నపిల్లవాడి అమాయకత్వం ఉండేది. అతను మా ఇంటికి వచ్చి, మాతో ఎప్పుడూ మాట్లాడేవాడు. నవ్వుతూ అన్ని విషయాలు పంచుకునే మంచి వ్యక్తి. కానీ, అతను పాపులర్ అయిన తర్వాత అతని ప్రవర్తన మారిపోయింది. చాలా మంది ఇతరులు కూడా అదే చెప్తారు.లక్షల విలువైన కృష్ణుడి విగ్రహాన్ని తీసుకెళ్లాడుతన ఇంట్లో ఉండే కృష్ణుడి విగ్రహాన్ని మోహన్లాల్ ఎలా తీసుకెళ్లాడో శాంతి ఇలా చెప్పింది. "మా ఇంట్లో పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తున్న కృష్ణుడి విగ్రహం ఉండేది. నేడు ఆ విగ్రహం మోహన్లాల్ ఇంట్లో ఉంది. నా భర్తకు ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాం. ఆ సమయంలో కృష్ణుడి విగ్రహాన్ని మేము సరిగ్గా నిర్వహించగలమో లేదోనని నా భర్తకు అనిపించింది. మా ఇంట్లో ఎయిర్ కండిషనర్ లేదని, పిల్లలకు ఇబ్బందిగా ఉందని మోహన్లాల్తో నా భర్త విలియమ్స్ చెప్పాడు. మా ఆర్థిక పరిస్థితిని లాల్ సద్వినియోగం చేసుకున్నాడు. లక్షల విలువైన కృష్ణుడి విగ్రహాన్ని తీసుకెళ్లి, బదులుగా తన ఆఫీసు నుండి పాత ఎయిర్ కండిషనర్ను మాకు ఇచ్చాడు. కేవలం పదిరోజుల తర్వాత అది రిపేయర్కు వచ్చింది. దీంతో మేము దానిని అమ్మినప్పుడు, మాకు రెండు వేల రూపాయలు మాత్రమే వచ్చాయి. నాకు చాలా బాధ కలిగించే విషయం ఏమిటంటే.., మేము మోహన్లాల్ కోసం చాలా చేసినప్పటికీ, నా భర్త మరణించినప్పుడు అతను రాలేదు. నేను దాని గురించి మాట్లాడే ప్రతిసారీ, నాలో కోపం ఉప్పొంగుతుంది. ఆకలితోనే నా పిల్లలు నిద్రపోయేవారునాకు నలుగురు పిల్లలు ఉన్నారనే విషయం మోహన్లాల్కు తెలుసు. విలియమ్స్ మంచం పట్టిన తర్వాత, కుటుంబాన్ని పోషించడానికి నేను డబ్బింగ్, నటన అంటూ తిరగాల్సి వచ్చింది. పిల్లలకు కడుపు నిండా ఆహారం లేని రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు వారు ఆకలితోనే నిద్రపోయేవారు. ఇప్పటివరకు నేను దీని గురించి ఎవరికీ చెప్పలేదు. అయితే, దర్శకుడు శంకర్ సార్ నా భర్త మరణించారని తెలుసుకొని రూ. 25వేలు సాయం చేశారు. ఏదైనా సాయం అవసరమైతే కాల్ చేయమని కూడా చెప్పారు. అయితే, మలయాళ పరిశ్రమ నుంచి ఏ ఒక్కరు కూడా సాయం చేయలేదు. కానీ, తమిళ పరిశ్రమ నుంచి కొందరు చేశారు. నా మాతృభూమి కేరళ, నేను మలయాళీని. అయినప్పటికీ నన్ను నేను అలా పిలుచుకోవడానికి సిగ్గుపడుతున్నాను. మా దగ్గర డబ్బున్న సమయంలో ఎందరికో సాయం చేశాం. కానీ, నా భర్త మరణించిన సమయంలో ఎవరూ కూడా పలకరించలేదు.' అని ఆమె అన్నారు. ప్రస్తుతం శాంతి పిల్లలు పెద్దవారయ్యరు. ఉద్యోగాలు చేస్తూ జీవితంలో సెటిల్ అయ్యారు. భర్త మరణం తర్వాత తనకు చిన్న పాత్ర వచ్చినా సరే చేస్తూ పిల్లలను చదివించారని అక్కడి పరిశ్రమ గురించి తెలిసిన వారు చెప్తారు.

సర్.. నా భార్య చిలిపి దొంగతనాలు చేస్తోంది!
నా భార్య వయసు 45 ఏళ్ళు. మాకు ఒక సొంత సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. మంచి ఉన్నతమైన కుటుంబం. మా ఆవిడకు మొదటి నుంచి ఒక వింత అలవాటు ఉంది. షాపింగ్కు వెళ్లినపుడు అవసరం లేకపోయినా, కొనగలిగిన స్థోమత ఉన్నా, ఏదో ఒక వస్తువు దొంగిలిస్తుంది. ఆమె దొంగిలించే వాటిలో కాస్మెటిక్స్ లాంటి చిన్న వస్తువుల నుంచి, ఒక్కోసారి చీరలు, చిన్న బంగారు వస్తువులు కూడా ఉన్నాయి. అలా దొంగిలించినవి కొన్ని ఇంట్లో దాచిపెడుతుంది. కొన్నేమో ఇతరులకు తాను గొప్ప అనిపించుకోవడానికి అన్నట్లు పంచిపెడుతుంది. ఆమెకు 300లకు పైగా చీరలు,కోట్లు విలువ చేసే బంగారు నగలు ఉన్నాయి. ఒక్కోసారి నా జేబులోంచి కూడా, నాకు చెప్పకుండా డబ్బులు తీసి దాస్తుంది. ఇన్ని చేసినా ఏమి తెలియనట్లు ఉంటుంది. ఏమాత్రం గిల్టీగా ఫీలవదు. ఇన్ని ఆస్తిపాస్తులుండి కూడా, ఆమె ఎందుకు ఇలా చీప్గా దొంగతనాలు చేస్తుందో అర్థం కావడం లేదు. ఇలా చేసి కొన్నిసార్లు షాప్స్లో పట్టుబడితే, పొరపాటయిందని సారీ చెప్పింది. ఆమె ప్రవర్తన వల్ల నాకు ఇబ్బందిగా ఉంది. బయట ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నాది. సాక్షిలో మీ కాలమ్ చూసి, మీరే ఏదైనా మంచి పరిష్కారం చూపిస్తారనే ఆశతో ఉన్నాను!– కామేశ్వరరావు, హైదరాబాద్రావుగారూ! మీరెంతో ఆవేదనతో మీ సమస్యను సాక్షి ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరన్నట్లుగా ఇది బయటకు చెప్పుకోలేని పరిస్థితి. అన్నీ ఉన్నా, అవసరం లేకున్నా ఇలా దొంగతనాలు చేయడాన్ని ‘క్లెప్టోమెనియా’ అంటారు. ఇది చాలా అరుదైన ఒక వింత మానసిక సమస్య. ఈ సమస్య ఉన్న వారికి, ఎలాగైనా ఏదో ఒకటి దొంగిలించాలనే ‘తహ తహ’ ఉంటుంది. వాస్తవానికి ఆ దొంగిలించిన వస్తువు వల్ల వారికి ఎలాంటి అవసరం ఉండదు. ఆ వస్తువు విలువ కూడా చాలా స్వల్పమై ఉండవచ్చు. మామూలు దొంగతనాల లాగా వీరు ఏదీ ప్లాన్ చేసుకుని, దొంగతనాలు చేయరు. ఏదైనా షాపింగ్కి అని వెళ్లినపుడు అలా సడన్గా చేతికందిన ఏదో ఒక వస్తువును వారికవసరం లేకపోయినా ఎత్తేస్తుంటారు. బాగా స్థోమత కలిగి, డబ్బులు పెట్టి కొనగలిగిన వారిలోనే ఈ అలవాటు ఎక్కువ. బహిష్టు సమయంలో ఇలాంటి కోరిక, కొందరిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో కనబడిన వస్తువు ఎత్తేయకుంటే విపరీతమైన టెన్షన్కు గురయి, తీసిన తర్వాత చాలా మానసిక ప్రశాంతతకు లోనవుతారు. దీనిని ‘ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్’ అని కూడా అంటారు. ఈ అలవాటు యుక్తవయసులో మొదలై పెద్దయ్యే కొద్ది తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ కొందరిలో మాత్రం శాశ్వతంగా ఉండి΄ోతుంది. ఈ సమస్య నుంచి బయటపడేయాలంటే ఆ వ్యక్తి సహకరించాలి. కొన్నిరకాల మందులతో పాటు ‘కాగ్నిటివ్ బిహేవియర్ మాడిఫికేషన్’ లాంటి ప్రత్యేక మానసిక చికిత్స పద్ధతుల ద్వారా ఇలాంటి వారిని ఈ అలవాటు నుండి బయటపడేసే అవకాశముంది. మొదట్లోనే ఈ అలవాటు గుర్తించి మానసిక వైద్యుడిని కలిస్తే ఫలితాలు మంచిగా ఉంటాయి. ఇప్పటికైనా మీ భార్యను మంచి నిపుణులైన సైకియాట్రిస్ట్ క్లినికల్ సైకాలజిస్టుల పర్యవేక్షణలో తగిన థెరపీ చేయించండి. ఆల్దిబెస్ట్!డాక్టర్ ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)

‘మెదడును తినే అమీబా’ కలకలం.. ఈ ఏడాదిలోనే 19 మంది మృతి!
న్యూఢిల్లీ: కేరళలో ‘మెదడును తినే అమీబా’ కేసులు కలకలం రేపుతున్నాయి. అధిక మరణాల రేటు కలిగిన మెదడు ఇన్ఫెక్షన్ అయిన ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పామ్) కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో కేరళ ఆరోగ్యశాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ ఇన్ఫెక్షన్ నేగ్లేరియా ఫౌలేరి వల్ల వస్తుంది. దీనిని సాధారణ బాషలో ‘మెదడును తినే అమీబా’ అని పిలుస్తారు. ఈ ఏడాది కేరళలో ఈ తరహాలో 61 పామ్ కేసులు నమోదయ్యాయి. 19 మరణాలు సంభవించాయి. వీటిలో పలు మరణాలు గత కొన్ని వారాలలోనే నమోదయ్యాయి.కేరళ ప్రస్తుతం తీవ్రమైన ప్రజారోగ్య సవాలుతో పోరాడుతోందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. గతంలో కోజికోడ్, మలప్పురం తదితర జిల్లాల్లోని క్లస్టర్లతో ముడిపడి ఉన్న ఈ ఇన్ఫెక్షన్లు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్నాయన్నారు. బాధితుల జాబితాలో మూడు నెలల శిశువు నుండి 91 ఏళ్ల వయస్సు వారి వరకు ఉన్నారని తెలిపారు. కేరళ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ‘పామ్’ అనేది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. పలు సందర్భాలలో ఇది తీవ్రమైన మెదడు వాపు, మరణానికి దారి తీస్తుంది. ఇది సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, టీనేజర్లు, యువకులకు సోకుతుంది.మెదడును తినే అమీబా అనేది నిలిచిపోయిన నీరులో కనిపిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ అమీబాతో కలుషితమైన నీటి వనరులలో ఈత కొట్టడం, డైవింగ్ చేయడం లేదా స్నానం చేసేవారికి ఈ అమిబీ సోకే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. పామ్ కేసులలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని నిర్ధారించడం కష్టమని నిపుణుల చెబుతున్నారు. అయితే దీని లక్షణాలు బాక్టీరియల్ మెనింజైటిస్ లాంటివి.. అంటే తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు. ‘పామ్’ సోకినప్పుడు ఈ లక్షణాలు ఒకటి నుండి తొమ్మిది రోజుల మధ్య కనిపించే అవకాశాలున్నాయి. కేరళలో 2016లో తొలి ‘పామ్’ కేసు నమోదయ్యింది. గత ఏడాది నుంచి ఈ కేసులలో పెరుగుదల కనిపించింది . కొత్త ఇన్ఫెక్షన్లను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు చెరువులు, సరస్సులు వంటి శుద్ధి చేయని లేదా నిలిచిపోయిన నీటి వనరులలో ఈత కొట్టటం లాంటి పనులు చేయవద్దని కేరళ ఆరోగ్యశాఖ ప్రజలకు సూచించింది.

‘‘ఆ దేవుడినే అడగండి..’’ సీజేఐ వ్యాఖ్యలపై దుమారం
న్యూఢిల్లీ: ధ్వంసమైన ఏడడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.మధ్యప్రదేశ్లోని ఛాతర్పూర్జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ప్రఖ్యాత ఖజురహో ఆలయ సముదాయంలోని జవారీ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసమైంది. ఈ విగ్రహాన్ని పక్కనబెట్టి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించేలా ఆదేశాలు ఇవ్వాలని(Khajuraho Vishnu idol case) రాకేశ్ దలాల్ అనే వ్యక్తి ఈ పిల్ వేశారు. ఈ పిల్ స్వీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రనల్ ధర్మాసనం పరిశీలించింది. ‘‘ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు. పబ్లిసిటీ ప్రయోజన వ్యాజ్యం. ఇందులో మేం చేసేది ఏం లేదు. భారత పురతత్వ విభాగం(ఏఎస్ఐ) పరిధిలో ఆలయం ఉంది. వాళ్లనే అభ్యర్థించండి. లేదంటే మీరెలాగూ విష్ణుమూర్తికి పరమభక్తుడిని అని చెబుతున్నారుగా. ఆయననే వేడుకోండి. శైవత్వానికి మీరు వ్యతిరేకులు కాకపోతే అదే ఖజురహోలో అతిపెద్ద శివలింగం ఉంది. అక్కడ కూడా మీరు విన్నవించుకోవచ్చు. విగ్రహ పునరుద్ధరణ, పునర్నిర్మాణంపై ఏఎస్ఐ తుది నిర్ణయం తీసుకుంటుంది’’ అని వ్యాఖ్యానించారు. అయితే తీర్పు సందర్భంగా సీజేఐ జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒక వర్గం మనోభావాలు దెబ్బ తీసేలా ఆయన మాట్లాడారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అంతేకాదు.. ఆయన్ని అభిశంసించాలంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వినీత్ జిందాల్ అనే న్యాయవాది సీజేఐ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్రపతికి, సుప్రీం కోర్ట్కు ఆయన ఓ లేఖ రాశారు. ప్రతి మత విశ్వాసానికి గౌరవం ఇవ్వాలి అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. సత్యం సింగ్ రాజ్పుత్ అనే మరో న్యాయవాది జస్టిస్ బీఆర్ గవాయ్కు బహిరంగ లేఖ రాశారు. విష్ణుమూర్తి భక్తుడిగా ఆయన వ్యాఖ్యలు నన్ను వ్యక్తిగతంగా బాధించాయి. కాబట్టి వెంటనే ఆయన వాటిని ఉపసంహరించుకోవాలి అని లేఖలో డిమాండ్ చేశారు. ప్రస్తుతం సీజేఐ వ్యాఖ్యలపై న్యాయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ఇసుక మాఫియాకు.. ఏడుగురు బలి
రాష్ట్రంలో కూటమి నేతల అరాచకంలో మరో కోణమిది.. 15 నెలల చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఉచిత ఇసుక ముసుగులో సాగుతున్న దందా ప్రజల ప్రాణాలు తీస్తోంది.. నదులు, వాగులు, వంకలను చెరబట్టి రేయింబవళ్లు నిబంధనలకు విరుద్దంగా ఇసుక తవ్వకాలు సాగించడమే కాక.. ఇష్టానుసారం అక్రమ రవాణాతో పట్టపగలే ప్రమాదాలకు కారణమవుతూ అమాయకులను చంపేసే స్థాయికి చేరింది.. 30–40 టన్నుల లోడ్తో అతి వేగంగా వెళ్తున్న టిప్పర్లు మృత్యు శకటాలుగా మారాయి.. ఇసుక గుంతల్లో పడి కొందరు, ప్రమాదాల బారిన పడి మరికొందరు నిత్యం చనిపోతున్నారు.. అయినా ఏమాత్రం స్పందించని సర్కారు పెద్దలు మీకింత–మాకింత అంటూ బేరసారాల్లో బిజీగా ఉండటం విషాదకరం. సంగం: సగం జీవితం కూడా చూడని ఆ ఏడుగురికీ అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి.. సాయంత్రానికల్లా ఇంటికొస్తామని పిల్లలకు చెప్పి వెళ్లిన వారు అటునుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. ఇసుక మాఫియా తప్పునకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని బాధిత కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన సమీపంలో జాతీయ రహదారిపై తెలుగుదేశం పార్టీ నేత ఇసుక టిప్పర్ రాంగ్ రూట్లో అతివేగంగా ఎదురుగా వచ్చి కారును ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. అనధికారికంగా పడమటి కంభంపాడు వద్ద నిర్వహిస్తున్న క్వారీ నుంచి సంగం మండలానికి చెందిన టీడీపీ నేతకు చెందిన టిప్పర్ ఇసుక లోడ్తో నెల్లూరు వైపు రాంగ్ రూట్లో బయలు దేరింది. అదే సమయంలో నెల్లూరు నుంచి ఆత్మకూరు వైపు వస్తున్న కారును పెరమన వద్ద అతివేగంతో ఎదురుగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తాళ్లూరి శ్రీనివాసులు (40), తాళ్లూరి రాధ (36), ఇందుకూరుపేటకు చెందిన చల్లగుండ శ్రీనివాసులు (40), చల్లగుండ్ల లక్ష్మి (34), శేషం సారమ్మ (40), శేషం వెంగయ్య (38), కారు డ్రైవర్ కత్తి బ్రహ్మయ్య (24) కారులోనే మృతి చెందారు. టిప్పర్ అతి వేగంగా కారును ఢీకొనడంతో వీరి శరీరాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఘటనలో మృతి చెందిన వారంతా బంధువులే. తాళ్లూరు శ్రీనివాసులు, తాళ్లూరు రాధ భార్యాభర్తలు. వీరు నెల్లూరులోని స్టోన్హౌస్పేటలో సాయి ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. వీరి వద్ద కత్తి బ్రహ్మయ్య పని చేస్తున్నారు. చల్లగుండ్ల శ్రీనివాసులు, చల్లగుండ్ల లక్ష్మి భార్యాభర్తలు. శేషం సారమ్మ, శేషం వెంగయ్య వదినా మరుదులు. మృతి చెందిన తాళ్లూరు రాధ.. చల్లగుండ్ల లక్ష్మికి, శేషం వెంగయ్యకు చెల్లెలు. పరామర్శకు వెళ్తూ.. తాళ్లూరు రాధ, చల్లగుండ్ల లక్ష్మి, శేషం వెంగయ్యల చిన్న చెల్లెలు భర్త ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆత్మకూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని పరామర్శించేందుకు తాళ్లూరు శ్రీనివాసులు తన కారులో వీరందరినీ తీసుకుని వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. తన వద్ద పనిచేసే కత్తి బ్రహ్మయ్యను కారు డ్రైవింగ్ కోసం తీసుకు రావడంతో అతడు కూడా మత్యువాత పడ్డాడు. అతి కష్టం మీద మృతదేహాల వెలికితీత సుమారు 40 టన్నుల ఇసుక ఉన్న 12 టైర్ల టిప్పర్.. రాంగ్ రూట్లో అతివేగంగా దూసుకు రావడంతో కారు నుజ్జునుజ్జు అయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురూ క్షణాల్లో చనిపోయారు. వారి మృతదేహాలు సైతం చిద్రమయ్యాయి. వెలికి తీసేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాద విషయం తెలుసుకుని సంగం సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్, అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య, ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్, సంగం సర్కిల్లోని పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారు సగ భాగం పూర్తిగా టిప్పర్ ఇంజిన్లోకి వెళ్లడంతో మృతదేహాలను బయటకు తీసేందుకు రెండు క్రేన్లు, ఒక జేసీబీ, కట్టర్ను వినియోగించాల్సి వచ్చింది. ఘటన స్థలాన్ని ఆర్డీఓ భూమిరెడ్డి పావని, ఎంవీఐ రాములు పరిశీలించారు. బుధవారం రాత్రి జిల్లా ఎస్పీ అజిత ఏజెండ్ల ఘటన స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్ లొంగిపోయాడని మీడియాకు వెల్లడించారు. ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నదీ, లేనిదీ విచారిస్తామని చెప్పారు. కాగా, పోలీసుల అదుపులో ఉన్నది ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కాదని, నకిలీ అని విశ్వసనీయ సమాచారం.మృతుల్లో తాళ్లూరు శ్రీనివాసులు, తాళ్లూరు రాధ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె ఇటీవల మృతి చెందడంతో ఆ బాధను దిగమింగుతూ కుమారుడిపై ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు. తల్లిదండ్రుల మృతితో కుమారుడు ఏకాకిగా మిగిలిపోయాడు. చల్లగొండ్ల శ్రీనివాసులు, చల్లగొండ్ల లక్ష్మి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారు ఇప్పుడు అనాథలుగా మిగిలిపోయారు. శేషం సారమ్మ, శేషం బాలవెంగయ్యల కుటుంబాల్లో తీవ్ర విషాధం నెలకొంది. శేషం బాలవెంగయ్య బేల్దారి పనులు చేసుకుంటూ తన ఇద్దరు కుమార్తెలను చదివించుకుంటున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆసరా కరువైంది.ఇసుక మాఫియా తీరుపై వైఎస్ జగన్ మండిపాటు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సాక్షి, అమరావతి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఇసుక మాఫియా వల్ల చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పాపం చంద్రబాబు ప్రభుత్వానిదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉచిత ఇసుక ముసుగులో సాగిస్తున్న దందాను ఆపేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. ‘నెల్లూరు’లో ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం సాక్షి, అమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.టిప్పర్ ఓనర్ మంత్రి ఆనం అనుచరుడేఏడుగురు మరణానికి కారణమైన టిప్పర్ (ఏపీ39డబ్ల్యూహెచ్1695) మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏఎస్ పేట మండలం చిరమనకు చెందిన కాటం రెడ్డి రవీంద్రారెడ్డిదిగా గుర్తించారు. ఇసుక టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టమవుతోంది. అతివేగంతో వస్తూ అదుపు చేయలేక కారును ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారును ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ టిప్పర్ దిగి పారిపోయాడు. తెలుగుదేశం పార్టీ నేత టిప్పర్ కావడంతో కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
25,400 పాయింట్ల వద్ద నిఫ్టీ
ఏపీ శాసనమండలిలో గందరగోళం.. వాయిదా
ఆటిట్యూడ్ స్టార్ 'కాయిన్' మూవీ గ్లింప్స్ విడుదల
ఈ-పాస్పోర్ట్ అర్హులు, దరఖాస్తు వివరాలు..
రాహుల్ గాంధీ ‘హైడ్రోజన్ బాంబ్’పై ఉత్కంఠ
అస్తవ్యస్తంగా కూటమి పాలన: వైఎస్ అవినాష్రెడ్డి
కిమ్మెల్ లైవ్ షో నిలిపివేతపై ట్రంప్ హర్షం.. హోస్ట్ నోరుకట్టేసిన ఏబీసీ?
ఈవీ స్కూటర్లో మొదటిసారి స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్
మరో నాలుగు రోజులు ఇంతే..
మెడికల్ కాలేజీలు.. అన్నంత పని చేసిన చంద్రబాబు
'రాను బొంబాయికి రాను'.. ఈ పాట వెనక ఇంత కథ ఉందా?
ఎట్టకేలకు ఓటీటీలోకి 'జూనియర్' సినిమా
సాగర తీరాన అక్కినేని కోడలు శోభిత ధూలిపాల (ఫొటోలు)
ఒక్క కంకి కొను ప్లీజ్.. త్రీడేస్ నో ఫుడ్!!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
నలుగురితో ప్రేమాయణం.. ముగ్గురితో పెళ్లి..ఇప్పుడు సింగిల్గానే స్టార్ హీరోయిన్!
బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
ఈ ఒక్కదానిలో విఫలమయ్యామంటే.. మిగతా అన్నింట్లో సఫలమయ్యాం అనుకుంటారని..!
మళ్లీ జతకట్టిన 'కోర్ట్' జంట.. శ్రీదేవి నోట బూతులు
యాంకర్ సుమ ఇంట్లో ఓనం సెలబ్రేషన్స్ (ఫొటోలు)
అప్పుల్లో మంచు లక్ష్మీ .. ఆ ఇల్లు నా సొంతం కాదంటూ క్లారిటీ
దీపావళి ముందు ఉద్యోగులకు డబుల్ ఆఫర్?
'ఓజీ' అభిమానులకు బ్యాడ్ న్యూస్?
..రద్దు చేస్తారేమోననిపిస్తోంది సార్!
పెద్ది 'రామ్ చరణ్' తల్లిగా సీనియర్ నటి
తాత, తండ్రి, కొడుకు..‘అక్కినేని’మూడు తరాలతో నటించిన ఏకైక హీరోయిన్ ఈమే!
బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే
ఆసీస్ భారీ స్కోర్.. ధీటుగా బదులిస్తున్న టీమిండియా
‘మీడియా ముందుకు రావొద్దన్నారు మావాళ్లు!
25,400 పాయింట్ల వద్ద నిఫ్టీ
ఏపీ శాసనమండలిలో గందరగోళం.. వాయిదా
ఆటిట్యూడ్ స్టార్ 'కాయిన్' మూవీ గ్లింప్స్ విడుదల
ఈ-పాస్పోర్ట్ అర్హులు, దరఖాస్తు వివరాలు..
రాహుల్ గాంధీ ‘హైడ్రోజన్ బాంబ్’పై ఉత్కంఠ
అస్తవ్యస్తంగా కూటమి పాలన: వైఎస్ అవినాష్రెడ్డి
కిమ్మెల్ లైవ్ షో నిలిపివేతపై ట్రంప్ హర్షం.. హోస్ట్ నోరుకట్టేసిన ఏబీసీ?
ఈవీ స్కూటర్లో మొదటిసారి స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్
మరో నాలుగు రోజులు ఇంతే..
మెడికల్ కాలేజీలు.. అన్నంత పని చేసిన చంద్రబాబు
'రాను బొంబాయికి రాను'.. ఈ పాట వెనక ఇంత కథ ఉందా?
ఎట్టకేలకు ఓటీటీలోకి 'జూనియర్' సినిమా
ఒక్క కంకి కొను ప్లీజ్.. త్రీడేస్ నో ఫుడ్!!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
నలుగురితో ప్రేమాయణం.. ముగ్గురితో పెళ్లి..ఇప్పుడు సింగిల్గానే స్టార్ హీరోయిన్!
బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
ఈ ఒక్కదానిలో విఫలమయ్యామంటే.. మిగతా అన్నింట్లో సఫలమయ్యాం అనుకుంటారని..!
మళ్లీ జతకట్టిన 'కోర్ట్' జంట.. శ్రీదేవి నోట బూతులు
అప్పుల్లో మంచు లక్ష్మీ .. ఆ ఇల్లు నా సొంతం కాదంటూ క్లారిటీ
దీపావళి ముందు ఉద్యోగులకు డబుల్ ఆఫర్?
'ఓజీ' అభిమానులకు బ్యాడ్ న్యూస్?
..రద్దు చేస్తారేమోననిపిస్తోంది సార్!
తాత, తండ్రి, కొడుకు..‘అక్కినేని’మూడు తరాలతో నటించిన ఏకైక హీరోయిన్ ఈమే!
పెద్ది 'రామ్ చరణ్' తల్లిగా సీనియర్ నటి
బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే
ఆసీస్ భారీ స్కోర్.. ధీటుగా బదులిస్తున్న టీమిండియా
‘మీడియా ముందుకు రావొద్దన్నారు మావాళ్లు!
'ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వస్తా.. నా కోసం ఆ ఒక్క పని చేసి పెట్టమని చెప్పా'
ఈ ర్యాపిడో అన్న జీతం 32 లక్షలు!!
సినిమా

'ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వస్తా.. నా కోసం ఆ ఒక్క పని చేసి పెట్టమని చెప్పా'
అధ్యక్షా.. అనే ఒకే ఒక్క డైలాగ్తో ఫేమస్ అయిన కమెడియన్ సుమన్ శెట్టి (Suman Shetty). నితిన్ హీరోగా వచ్చిన జయం మూవీతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో తన కామెడీ టైమింగ్తో మెప్పించాడు. అప్పట్లో సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన సుమన్.. ఈ మధ్యకాలంలో సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా కనిపించని సుమన్ శెట్టి.. బిగ్బాస్ రియాలిటీ షోతో మళ్లీ కెరీర్ రీ స్టార్ట్ చేశాడు.తాజాగా సుమన్ శెట్టి గురించి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తేజ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతన్ని పరిచయం చేశాక.. సినిమాల్లో నీకు మంచి అవకాశాలు వస్తాయి.. తొందరగా నువ్వు ఒక సైట్ కొనుక్కో అని సుమన్కు సలహా ఇచ్చానని అన్నారు. అన్నట్లుగానే సుమన్ శెట్టి ఓ సైట్ కొని ఇల్లు కూడా కట్టుకున్నాడని తెలిపారు. ఒకసారి నా వద్దకు వచ్చిన సుమన్.. ఇదంతా మీవల్లే సార్ అంటూ నా కాళ్లను టచ్ చేస్తా అన్నారు. నేను ఏ విధంగా మీ రుణం తీర్చుకోవాలని అడిగాడని గుర్తు చేసుకున్నారు.తేజ మాట్లాడుతూ.. 'కాళ్లను టచ్ చేయడం నా కిష్టం లేదని చెప్పా. నేను ఏ విధంగా మీ రుణం తీర్చుకోవాలని అడిగాడు. నేను కొత్త వాళ్లతో సినిమాలు తీస్తా ఉంటా. ఇలా చేస్తూ నేను ఏదో ఒక రోజు రోడ్డుమీదకి వచ్చేస్తా. అప్పుడు నేను ఉండేందుకు నువ్వు కట్టుకునే ఇంటిలో ఒక రూమ్ ఉంచు అని చెప్పా. నేను అన్నట్లుగానే అతని ఇంటిలో నాకోసం రూమ్ కట్టి.. ఆ గదిలో నా ఫోటో పెట్టి రోజు క్లీన్ చేస్తూ ఉంటాడు' అని తెలిపారు.కాగా.. తేజ డైరెక్షన్లో వచ్చిన జయం, జై, సంబరం, ఔనన్నా కాదన్నా, ధైర్యం, నిజం లాంటి సినిమాల్లో సుమన్ శెట్టికి అవకాశాలిచ్చాడు. అందువల్లే తేజ సార్ నాకు గాడ్ ఫాదర్ అని సుమన్ శెట్టి చాలాసార్లు చెప్పారు. కాగా.. కమెడియన్ సుమన్ శెట్టి.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, భోజ్పురి భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించారు.

బాక్సాఫీస్ మాత్రమే కాదు.. ఓటీటీలోనూ సంచలనమే!
ఈ ఏడాది సూపర్ హిట్గా నిలిచన రొమాంటిక్ లవ్ స్టోరీ సైయారా. మోహిత్ సూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.580 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ను షేర్ చేసింది. ఈ చిత్రం ద్వారా అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. జులై 18న విడుదలైన ఈ సినిమా సంచనాలు క్రియేట్ చేసింది. కేవలం మౌత్ టాక్ పవర్తో బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాసింది. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్లో అనేక చిత్రాల కలెక్షన్స్ను దాటి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న బాలీవుడ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది బాలీవుడ్ హిట్ సినిమా ఛావా రికార్డ్ను కూడా దాటేసింది.ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో సందడి చేస్తోంది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన సైయారా ఓటీటీలోనూ తగ్గేదేలే అంటోంది. ఓటీటీకి వచ్చిన తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న నాన్- ఇంగ్లీష్ చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్గా ఆంగ్లేతర చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో సైయారా కొనసాగుతోంది. ఈ రొమాంటిక్ డ్రామా జర్మన్ చిత్రం 'ఫాల్ ఫర్ మీ', హిందీ మూవీ 'ఇన్స్పెక్టర్ జెండే'లను అధిగమించింది. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే అగ్రస్థానానికి చేరుకుంది, 'ఫాల్ ఫర్ మీ' మూవీతో సహా అనేక చిత్రాలను దాటేసింది.ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేతర చిత్రాల జాబితాలో సైయారా మొదటి స్థానంలో ఉంది. ఈ చిత్రం 3.7 మిలియన్ల వ్యూస్తో పాటు 9.3 మిలియన్ గంటల వీక్షణలతో దూసుకెళ్తోంది. జర్మన్ థ్రిల్లర్ మూవీ 'ఫాల్ ఫర్ మీ' 6.5 మిలియన్ గంటల వ్యూస్తో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత మనోజ్ భాజ్పాయ్ నటించిన 'ఇన్స్పెక్టర్ జెండే' 6.2 మిలియన్ గంటల వీక్షణలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' 2.5 మిలియన్ గంటల వ్యూస్తో తొమ్మిదో స్థానంలో ఉంది.

అనసూయ సోలో ట్రిప్.. సమంత మేకప్ లేకుండా!
సోలోగా ట్రిప్ వేసిన యాంకర్ అనసూయక్యూట్ జ్ఞాపకాల్ని షేర్ చేసిన నివేతా థామస్జిమ్లో కష్టపడుతూ అలా.. మరోవైపు సమంత ఇలాచీరలో వయ్యారాలు పోతున్న అనుపమ పరమేశ్వరన్పొద్దుతిరుగుడు పువ్వుతో గ్లామర్ చూపిస్తున్న రకుల్అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న అనన్య నాగళ్ల View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

అదంతా పీఆర్ స్టంట్.. నోరు విప్పుతానని చాహల్ భయపడ్డారు: ధనశ్రీ వర్మ
ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ను పెళ్లాడారు. 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన వీరిద్దరు మనస్పర్థలు రావడంతో ఈ ఏడాది తమ బంధానికి ఎండ్ కార్డ్ పడేశారు. ఫిబ్రవరి అఫీషియల్గా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి యుజ్వేంద్ర చాహల్ ప్రముఖ ఆర్జే మహ్వశ్తో డేటింగ్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి.అయితే ఇవన్నీ పక్కనపెడితే ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోన్న చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడాకుల సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. చాహల్ను తాను మోసం చేశానంటూ పలు కథనాలొచ్చాయి. తాజాగా వీటిపై ధనశ్రీ వర్మ రియాక్ట్ అయింది. ఇదంతా నెగెటివ్ పీఆర్లో భాగంగానే చేశారని విమర్శించింది. ఓ ఎపిసోడ్లో మరో కంటెస్టెంట్ అర్బాజ్ పటేల్ చాహల్ను ధనశ్రీ మోసం చేసిందని తాను విన్నానని ఆమెతో చెప్పాడు.దీనిపై ధనశ్రీ స్పందిస్తూ.. 'అలాంటి వాళ్లు నా గురించి ఇలాంటి చెత్త మాటలు వ్యాప్తి చేస్తారు. నేను నోరు తెరుస్తానేమోనని భయపడుతున్నాడు. నా నోరు మూయించడానికే ఇదంతా చేస్తున్నారు. అసలేం జరిగిందో నిజమైన వివరాలు చెబితే.. ఈ షో మీకు మరోలా అనిపిస్తుంది. ఆర్జే మహ్వశ్తో రిలేషన్పై ధనశ్రీ మాట్లాడింది. నాకు చాహల్తో విడాకులు అయిపోయాయి. అతని గాసిప్స్ గురించి నాకు అక్కర్లేదు. నా లైఫ్లో అదొక ముగిసిన అధ్యాయం. పెళ్లి అనే బంధంలో ఉన్నప్పుడు బాధ్యాతాయుతంగా ఉండాలి. ఇతరుల గౌరవాన్ని కూడా మనం కాపాడేలా వ్యవహరించాలి. మన ఇమేజ్ కోసం మరొకరిని ఎందుకు తక్కువ చేయాలి? మీరు నా గురించి ఎంత నెగెటివ్గా మాట్లాడినా దాంతో మీకెలాంటి ఊపయోగం లేదు. మీ టైమ్ వేస్ట్ తప్ప' అని పంచుకుంది.
న్యూస్ పాడ్కాస్ట్

భారత్ ఎవరికీ తల వంచదు... పాకిస్తాన్ కోరితేనే కాల్పులు ఆపేశాం... హైదరాబాద్ లిబరేషన్ డే వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ

సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో మెరిట్ను ఎలా విస్మరిస్తారు?

ఏపీ ప్రజారోగ్య రంగంలో 2023 సెప్టెంబర్ 15 ఒక గొప్ప రోజు. సీఎంగా నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చిన రోజు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్య

పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పేరిట అస్మదీయులకు సంపద సృష్టి... ఏపీలో ప్రైవేట్ పరమయ్యే కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీటు ఏడాదికి 57 లక్షల రూపాయల పైమాటే

‘ఎమ్మార్’ పేరిట ప్రజలను ఏమార్చే కుట్ర... ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విష ప్రచారం

కర్నూలులో 2 వేల 700 కోట్ల రూపాయల విలువైన స్థలంపై గురి...

ఆంధ్రప్రదేశ్లో వెయ్యి ఎకరాల దేవుడి భూముల స్వాహాపర్వం... అధికార తెలుగుదేశం పార్టీ నేతల కబ్జాకాండ

చంద్రబాబు సర్కార్ సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది, చంద్రబాబు ముఠా ఆదాయం పెరుగుతోంది... వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

నూతన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్... ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డిపై ఘన విజయం

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం...రోడ్డున పడ్డ రైతాంగం
క్రీడలు

పతకంపై నీరజ్ గురి
టోక్యో: అంతా అనుకున్నట్లు జరిగితే... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఈరోజు భారత్ పతకాల బోణీ కొట్టనుంది. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో భారత్ నుంచి డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా, రైజింగ్ స్టార్ సచిన్ యాదవ్ ఫైనల్కు అర్హత సాధించారు. భారత్కే చెందిన మరో ఇద్దరు జావెలిన్ త్రోయర్లు యశ్వీర్ సింగ్, రోహిత్ యాదవ్ ఫైనల్కు చేరుకోలేకపోయారు. 2022 ప్రపంచ చాంపియన్షిప్లో రజత పతకం... 2023 ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా ‘హ్యాట్రిక్ పతకం’ లక్ష్యంగా నేడు మెడల్ రౌండ్లో బరిలోకి దిగనున్నాడు. బుధవారం జరిగిన జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్లో నీరజ్ ఒక్క ప్రయత్నంలోనే ఫైనల్ బెర్త్ను దక్కించుకున్నాడు. క్వాలిఫయింగ్లో ఒక్కో జావెలిన్ త్రోయర్కు మూడు అవకాశాలు ఇస్తారు. జావెలిన్ను కనీసం 84.50 మీటర్ల దూరం విసిరిన వారు లేదా టాప్–12లో నిలిచిన వారు ఫైనల్కు అర్హత పొందుతారు. గ్రూప్ ‘ఎ’లో పోటీపడ్డ నీరజ్ తన మొదటి ప్రయత్నంలోనే జావెలిన్ను 84.85 మీటర్ల దూరం విసిరి ఫైనల్ బెర్త్ను దక్కించుకున్నాడు. గ్రూప్ ‘ఎ’.. గ్రూప్ ‘బి’ నుంచి ఓవరాల్గా ఏడుగురు జావెలిన్ త్రోయర్లు మాత్రమే అర్హత ప్రమాణాన్ని అధిగమించారు. మరో ఐదుగురికి ర్యాంక్ ప్రకారం ఫైనల్ బెర్త్ను కేటాయించారు. అర్హత ప్రమాణాన్ని అధిగమించిన ఏడుగురిలో నీరజ్ చోప్రాతోపాటు ఆండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 89.53 మీటర్లు), జూలియన్ వెబెర్ (జర్మనీ; 87.21 మీటర్లు), జూలియస్ యెగో (కెన్యా; 85.96 మీటర్లు), వెగ్నెర్ (పోలాండ్; 85.67 మీటర్లు), పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ అర్షద్ నదీమ్ (పాకిస్తాన్; 85.28 మీటర్లు), కుర్టిస్ థాంప్సన్ (అమెరికా; 84.72 మీటర్లు) ఉన్నారు. ఓవరాల్గా 8 నుంచి 12 స్థానాల్లో నిలిచిన జాకుబ్ వెద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 84.11 మీటర్లు), కెషార్న్ వాల్కట్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో; 83.93 మీటర్లు), సచిన్ యాదవ్ (భారత్; 83.67 మీటర్లు), కామెరాన్ మెసెన్టైర్ (ఆ్రస్టేలియా; 83.03 మీటర్లు), రుమేశ్ థరంగ (శ్రీలంక; 82.80 మీటర్లు) కూడా ఫైనల్లో చోటు సంపాదించారు.భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 53 నిమిషాల నుంచి పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ జరుగుతుంది. మరోవైపు ట్రిపుల్ జంప్ క్వాలిఫయింగ్లో భారత క్రీడాకారులు ప్రవీణ్ చిత్రవేల్ (16.74 మీటర్లు) 15వ స్థానంలో, అబూబకర్ (16.33 మీటర్లు) 24వ స్థానంలో నిలిచారు. 200 మీటర్లలో జాతీయ చాంపియన్ అనిమేశ్ కుజుర్ హీట్స్లోనే వెనుదిరిగాడు.

‘సూపర్–4’కు పాకిస్తాన్
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో రెండో విజయంతో పాకిస్తాన్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో పాక్ 41 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ (36 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలవగా, ఇతర ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. సయీమ్ అయూబ్ (0) వరుసగా మూడో మ్యాచ్లోనూ డకౌటై అంతర్జాతీయ టి20ల్లో ఈ చెత్త రికార్డును నెలకొల్పిన మూడో పాకిస్తానీ ఆటగాడిగా నిలిచాడు. ఫర్హాన్ (5), కెపె్టన్ సల్మాన్ ఆగా (27 బంతుల్లో 20), హసన్ (3), ఖుష్దిల్ (4), హారిస్ (18) ప్రభావం చూపలేకపోయారు. చివర్లో షాహిన్ అఫ్రిది (14 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడటంతో పాక్ మెరుగైన స్కోరు సాధించింది. యూఏఈ బౌలర్లలో జునేద్ సిద్దిఖీ 4 వికెట్లు పడగొట్టగా, సిమ్రన్జీత్ సింగ్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం యూఏఈ 17.4 105 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ చోప్రా (35 బంతుల్లో 35; 1 ఫోర్, 1 సిక్స్) రాణించగా, ధ్రువ్ పరాశర్ (20) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, రవూఫ్, అబ్రార్ అహ్మద్ రెండు వికెట్లు చొప్పున తీశారు. నేడు జరిగే మ్యాచ్లో అఫ్గానిస్తాన్తో శ్రీలంక తలపడుతుంది.

మరోసారి బీభత్సం సృష్టించిన సాల్ట్.. ఈసారి పసికూన బలి
అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసకాండ కొనసాగుతోంది. కొద్ది రోజుల కిందట సౌతాఫ్రికాపై సుడిగాలి శతకంతో (60 బంతుల్లో 141 నాటౌట్; 15 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడిన అతను.. ఇవాళ (సెప్టెంబర్ 17) పసికూన ఐర్లాండ్పై అదే తరహాలో రెచ్చిపోయాడు.మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐర్లాండ్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్య ఛేదనలో ఆది నుంచే బ్యాట్ ఝులిపిస్తూ విధ్వంసం సృష్టించాడు. 46 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి గెలుపు ఖరారయ్యాక ఔటయ్యాడు.సాల్ట్ వీర ఉతుకుడు ధాటికి ఇంగ్లండ్ మరో 14 బంతులు మిగిలుండగానే (6 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ అంచనాలకు మించి భారీ స్కోర్ చేసింది. హ్యారీ టెక్టార్ (36 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), లోర్కన్ టక్కర్ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగిపోయారు. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (34), రాస్ అదైర్ (26) కూడా సత్తా చాటారు.ఐరిష్ బ్యాటర్ల ధాటికి ఇంగ్లండ్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఓవర్టన్, డాసన్, ఆదిల్ రషీద్ మాత్రం తలో వికెట్ తీశారు.197 పరుగుల లక్ష్య ఛేదనలో సాల్ట్ తొలి బంతి నుంచే డ్యూటీకి ఎక్కాడు. అతనికి బట్లర్ (10 బంతుల్లో 28), జేకబ్ బేతెల్ (16 బంతుల్లో 24), సామ్ కర్రన్ (15 బంతుల్లో 27) తోడయ్యారు. మ్యాచ్ను మరింత వేగంగా ముగించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లు వికెట్లు కోల్పోయారు. రెహాన్ అహ్మద్ 8, టామ్ బాంటన్ 11 పరుగులకు ఔటయ్యారు. ఓవర్టన్ బౌండరీతో మ్యాచ్ను ముగించాడు. ఐరిష్ బౌలర్లలో హంఫ్రేస్, హ్యూమ్ తలో 2, హ్యారీ టెక్టార్, గెరాత్ డెలానీ చెరో వికెట్ తీశారు. ఈ సిరీస్లోని రెండో టీ20 సెప్టెంబర్ 19న డబ్లిన్లోనే జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ ఐర్లాండ్లో పర్యటిస్తుంది.

మంధన విధ్వంసకర శతకం.. ఆసీస్ను చిత్తుగా ఓడించిన టీమిండియా
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన రెండో వన్డేలో టీమిండియా 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 49.5 ఓవర్లలో 292 పరుగులు చేసి ఆలౌటైంది.ఓపెనర్ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడింది. భారత ఇన్నింగ్స్లో మంధన మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. దీప్తి శర్మ (40), రిచా ఘోష్ (29), ప్రతిక రావల్ (25), స్నేహ్ రాణా (24) పర్వాలేదనిపించారు.హర్లీన్ డియోల్ (10), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (17), రాధా యాదవ్ (6), అరుంధతి రెడ్డి (4), క్రాంతి గౌడ్ (2) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్ 3, ఆష్లే గార్డ్నర్ 2, మెగాన్ షట్, అన్నాబెల్ సదర్ల్యాండ్, తహ్లియా మెక్గ్రాత్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో ఆసీస్ కెప్టెన్ హీలీ ఏకంగా ఎనిమిది బౌలర్లను ప్రయోగించింది.అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. క్రాంతి గౌడ్ (9.5-1-28-3), దీప్తి శర్మ (6-0-24-2), రేణుకా సింగ్ ఠాకూర్ (6.3-0-28-1), స్నేహ్ రాణా (6-0-35-1), అరుంధతి రెడ్డి (7.3-0-46-1), రాధా యాదవ్ (5-0-27-1) ధాటికి 40.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్లో సదర్ల్యాండ్ (45), ఎల్లిస్ పెర్రీ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.ఈ గెలుపుతో భారత్ సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మక మూడో వన్డే న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 20న జరుగనుంది.
బిజినెస్

యస్ బ్యాంక్లో ఎస్ఎంబీసీ వాటా జూమ్
పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) నుంచి యస్ బ్యాంక్కు చెందిన 13.18 శాతం వాటాను జపనీస్ దిగ్గజం సుమితోమొ మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్ఎంబీసీ) చేజిక్కింకుకుంది. దీంతో ఎస్ఎంబీసీ నుంచి రూ. 8,889 కోట్లు అందుకున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఫలితంగా యస్ బ్యాంక్లో ఎస్బీఐ వాటా 10.8 శాతానికి దిగివచ్చింది. ఈ డీల్లో భాగంగా ఇతర 7 ప్రయివేట్ బ్యాంకింగ్ సంస్థల నుంచి సైతం మరో 6.82 శాతం వాటాను ఎస్ఎంబీసీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా యస్ బ్యాంక్లో పీఈ దిగ్గజం కార్లయిల్ నుంచి మరో 4.2 శాతం వాటాను ఎస్ఎంబీసీ సొంతం చేసుకోనుంది. ఇందుకు షేరుకి రూ. 21.5 ధరలో(ఎస్బీఐ వాటా విక్రయ ధర)నే కొనుగోలు చేసేందుకు తప్పనిసరి ఒప్పందం కుదుర్చుకున్నట్లు బుధవారం(17న) తెలియజేసింది. ఇందుకు రూ. 2,800 కోట్లు వెచి్చంచనున్నట్లు వెల్లడించింది. వెరసి యస్ బ్యాంక్లో వాటాను జపనీస్ దిగ్గజం సుమితోమో మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్(ఎస్ఎంఎఫ్జీ)కు చెందిన ఎస్ఎంబీసీ 24.2 శాతానికి పెంచుకోనుంది. తద్వారా యస్ బ్యాంక్లో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తోంది. ప్రస్తుతం యస్ బ్యాంక్లో కార్లయిల్ గ్రూప్ 4.22 శాతం వాటా కలిగి ఉంది.ఇదీ చదవండి: పండుగ సీజన్పై ‘సోనీ’ ఆశలు..!

పండుగ సీజన్పై ‘సోనీ’ ఆశలు..!
కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ సోనీ ఇండియా ప్రస్తుత పండుగల సీజన్ పట్ల ఆశావహంగా ఉన్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పెద్ద తెరల టీవీల ధరలు తగ్గుతాయని.. దీంతో విక్రయాలు రెండంకెల మేర వృద్ధి చెందుతాయని (గతేడాది ఇదే సీజన్తో పోల్చి చూస్తే) అంచనా వేస్తున్నట్టు సంస్థ ఎండీ సునీల్ నయ్యర్ ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి టీవీల అమ్మకాలు ఫ్లాట్గా, ఎలాంటి వృద్ధి లేకుండా ఉన్నట్టు చెప్పారు.జీఎస్టీ శ్లాబుల్లో మార్పుల వల్ల వీటి ధరలు 7.5–8 శాతం మేర తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. దీంతో కొనుగోళ్ల సెంటిమెంట్ మెరుగుపడుతుందన్నారు. పెద్ద సైజు తెరల టీవీల మార్కెట్లో (ప్రీమియం మార్కెట్) సోనీ ప్రముఖ సంస్థగా ఉండడం తెలిసిందే. ఈ విభాగంలో టీవీల ధరలు మోడల్ ఆధారంగా రూ.8,000 నుంచి రూ.70,000 మధ్య తగ్గుతాయని నయ్యర్ ప్రకటించారు. ధరలు తగ్గడంతో కస్టమర్లు పెద్ద సైజు టీవీలు, మెరుగైన టెక్నాలజీ ఫీచర్లతో ఉన్న వాటికి మారతారన్న (అప్గ్రేడ్) ఆశాభావం వ్యక్తం చేశారు. విక్రయాలు 10–15 శాతం వరకు పెరగొచ్చన్నారు. మాకు ప్రయోజనం..జీఎస్టీలో 32 అంగుళాలకు మించిన టీవీలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం గమనార్హం. కొత్త రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. 55 అంగుళాలు, అంతకుమించిన సైజు టీవీల మార్కెట్లో కీలకంగా ఉన్న సోనీ ఈ రేటు తగ్గింపుతో ప్రయోజనం పొందుతుందని నయ్యర్ చెప్పారు. ‘‘55, 65, 75, 85, 98 అంగుళాల టీవీలను పెద్ద సంఖ్యలో విక్రయిస్తుంటాం. ఈ టీవీలన్నీ ప్రీమియం, పెద్ద సైజు విభాగం కిందకు వస్తాయి’’అని తెలిపారు. 55 అంగుళాల టీవీ ధర రూ.8,000 వరకు తగ్గుతుందని.. 75 అంగుళాలు అంతకుమించిన సైజు టీవీలపై రూ.19,000–51,000 వరకు, 85 అంగుళాల టీవీలపై రూ.47,000–70,000 వరకు రేట్లు తగ్గుతాయని చెప్పారు. బడ్జెట్లో ప్రకటించిన ఆదాయపన్ను ప్రయోజనాలతో ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుందని.. దీని ఫలితంగా కెమెరాలు, సౌండ్బార్లు, పార్టీ స్పీకర్లు, హెడ్ఫోన్లు, ప్లే స్టేషన్ ఉత్పత్తుల అమ్మకాలు సైతం పెరుగుతాయని నయ్యర్ అంచనా వేశారు. విక్రయాల్లో సగం వాటా కలిగిన చిన్న పట్టణాలు, గ్రామీణ మార్కెట్లలో సోనీ స్థానం మరింత బలపడుతుందన్నారు. నిలిచిన కొనుగోళ్లుప్రభుత్వం జీఎస్టీపై నిర్ణయాలు ప్రకటించిన తర్వాత వినియోగదారులు టీవీల కొనుగోళ్లను నిలిపివేసినట్టు నయ్యర్ తెలిపారు. ప్రస్తుతం డిమాండ్ తక్కువగా ఉన్నట్టు చెప్పారు. అందరూ సెప్టెంబర్ 22 కోసం వేచి చూస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత కొనుగోళ్లు ఒక్కసారిగా పెరుగుతాయని అంచనా వేశారు.ఇదీ చదవండి: 5 ఏళ్లలో రూ.70 లక్షల కోట్లు

5 ఏళ్లలో రూ.70 లక్షల కోట్లు
మధ్య, దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి సాధించేందుకు అత్యుత్తమ అవకాశాలున్నట్లు గ్లోబల్ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ తాజాగా అభిప్రాయపడింది. దీంతో రానున్న ఐదేళ్లలో ప్రయివేట్ రంగం నుంచి 800 బిలియన్ డాలర్ల(రూ. 70 లక్షల కోట్లు) పెట్టుబడులకు వీలున్నట్లు అంచనా వేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ప్రయివేట్ పెట్టుబడులు ఊపందుకునే చాన్స్ లేనట్లు పేర్కొంది.ప్రయివేట్ రంగంలో భారీస్థాయి సామర్థ్య విస్తరణలో అప్రమత్తత కనిపిస్తున్నట్లు సంస్థ అధికారి గీతా చుగ్ తెలియజేశారు. కాగా.. ప్రయివేట్ రంగంలో పెట్టుబడులు కనిపిస్తున్నప్పటికీ నామినల్ జీడీపీ వృద్ధి రేటుకంటే తక్కువ స్థాయిలో నమోదవుతున్నట్లు ఎస్అండ్పీ దేశీ రేటింగ్స్ యూనిట్ క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషీ పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య విధానాలు, టారిఫ్లలో మార్పులు, తదితర తీవ్ర అనిశ్చితులు కార్పొరేట్ సంస్థల పెట్టుబడి నిర్ణయాలలో ఆలస్యానికి కారణమవుతున్నట్లు వివరించారు.పలు కంపెనీలు పెట్టుబడులను సమకూర్చుకోవడంలో బ్యాంకులకు బదులుగా సొంత అంతర్గత వనరులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. బ్యాంక్ రుణాలు లేదా క్యాపిటల్ మార్కెట్ల నుంచి రుణ సమీకరణ ద్వారా కనీసస్థాయిలోనే నిధులను సమీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి పరిస్థితులు మెరుగుపడనుండటంతో బ్యాంకింగ్ వ్యవస్థలో 12–13 శాతం రుణ వృద్ధికి వీలున్నట్లు అంచనా వేశారు.ఇదీ చదవండి: దీపావళి ముందు ఉద్యోగులకు డబుల్ ఆఫర్?

ఫెడ్ వడ్డీ రేటు పావు శాతం కోత
వాషింగ్టన్ డీసీ: యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమీక్షలో వడ్డీ రేటును పావు శాతం తగ్గించేందుకు నిర్ణయించింది. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) తాజాగా వడ్డీ రేటులో 0.25 శాతం కోతకు ఓటు వేసింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేటు 4–4.25%కి దిగివచ్చింది. గత ఐదు పాలసీ సమీక్షలలో యథాతథ వడ్డీ రేటు (4.25–4.5%) అమలుకే మొగ్గు చూపిన ఫెడ్ 9 నెలల తదుపరి రేట్ల కోతకు నిర్ణయించింది. తదుపరి నిర్వహించే విలేకరుల సమావేశంలో వచ్చే ఏడాది జూన్కల్లా మరో రెండుసార్లు రేట్లను తగ్గించే సంకేతాలివ్వనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగడానికితోడు ఉపాధి మార్కెట్ క్షీణించడం రేట్ల కోతకు కారణమైనట్లు విశ్లేíÙంచారు. కాగా.. గత కేలండర్ ఏడాది (2024)లో ఫెడ్ 3 సార్లు వడ్డీ రేటులో కోత పెట్టిన సంగతి తెలిసిందే.
ఫ్యామిలీ

సాంస్కృతిక వారసత్వానికి కేరాఫ్ అడ్రస్గా..ప్రధాని మోదీ డ్రెస్సింగ్ స్టైల్
ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంతేగాదు ఆ పార్టీ శ్రేణులు తమ ప్రియతమ నేత పుట్టినరోజుని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు కూడా. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్లోని థార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలతో కాసేపు ముచ్చటించారు. అక్కడ మోదీ వేదికపైకి రాగానే ఆ రాష్ట్ర సాంస్కృతికి అద్దం పట్టే గులాబీ రంగు తలపాగా(పగ్డి), జాకెట్ను బహుకరించారు. ఆ పగ్డిపై(తలపాగ) క్లిష్టమైన బంగారం, ముత్యాలతో ఎంబ్రాయిడరీ చేయడగా, బంజారా సమాజం శక్తిమంతమైన చేతి పనికి నిదర్శనం జాకెట్పై లంబానీ ఎంబ్రాయిడరీ ఉంది. వీటితోపాటు ధార్ జిల్లాకు చెందిన ప్రసిద్ధ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్త్రం పై సహజరంగులతో కూడిన రేఖాగణిత నమునాలు ఉన్న స్కార్ఫ్ను కూడా మోదీకి బహుకరించారు. ఇది ఆయన 75వ పుట్టినరోజు అయినప్పటికీ తన సిగ్నేచర్ శైలికే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రజలు ఇచ్చిన అభిమాన బహుమతులు, దుస్తుల కారణంగా మోదీ డ్రెస్సింగ్ స్టైల్ సాంస్కృతిక వారసత్వానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ముఖ్యంగా ఆ కానుకలతో మోదీ లుక్లో మధ్యప్రదేశ్ సాంస్కృతిక వారసత్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆయన ఈ పుట్టినరోజుని పీఎం మిత్ర పార్కుకి పునాది రాయి వేయడం, అనేక అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ ఆరోగ్య పథకాల ప్రారంభంతో జరుపుకోవడం విశేషం. ఇక ఆ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ..స్వావలంబన చర్య తీసుకోవాలనే పిలుపునిస్తూ ప్రసంగించారు. "ఇది పండుగల సమయం. మన స్వదేశీ ఉత్పత్తుల మంత్రాన్ని పునరావృతం చేస్తూ ఉండాలి. 140 మంది కోట్ల భారతీయులు ఏది కొనుగోలు చేసినా..అది మేడ్ ఇన్ ఇండియాగానే ఉండాలని అభ్యర్థిస్తున్నా. వికసిత్ భారత్కు మార్గం వేసి, ఆత్మనిర్బర్ భారత్గా ముందుకు సాగాలన్నారు. ఎప్పుడైతే మనం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులనే కొనుగోలు చేస్తామో, అప్పుడూ డబ్బు మన దేశంలోనే ఉంటుంది, పైగా ఆ డబ్బుని అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగించవచ్చని అన్నారు. అలాగే మహేశ్వరి చీరలు, పీఎం మిత్రా పార్క్ ప్రాముఖ్యత గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇక్కడ పట్టు, పత్తి లభ్యత, నాణ్యత తనిఖీలు, సులభమైన మార్కెట్ యాక్సెస్ వంటివి నిర్ధారిస్తారని అన్నారు. దాంతోపాటు స్పిన్నింగ్, డిజైనింగ్, ప్రాసెసింగ్, ఎగుమతి అన్నీ ఒకే చోట జరుగుతాయని చెప్పారు. అదీగాక ఈ చీరలు, వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా తమ ముద్ర వేస్తూ, దేవి అహల్యాబాయి హోల్కర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి..మన మాతృభూమిని ప్రపంచ మార్కెట్లో ప్రకాశవంతంగా మెరిసేలా చేయగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. .(చదవండి: ప్రపంచంలోనే తొలి ఏఐ కేబినేట్ మంత్రి..! ఎందుకోసం అంటే..)

కన్నీళ్లకే కన్నీరొచ్చె..
ఈ ఫొటో చూడగానే అర్థమయ్యే ఉంటుంది ఇదో విషాద సందర్భమని. స్నేహితుడి లాంటి భర్తకు చివరిసారిగా భార్య కన్నీటి వీడ్కోలు చెబుతున్న విషాద ఘట్టమిది. ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పెనిమిటి చివరి చూపు కోసం స్ట్రెచర్పై వచ్చింది ఆమె. మరో స్ట్రెచర్పై నిర్జీవంగా ఉన్న భర్తను చూసి బోరున విలపించింది. రెండు రోజుల క్రితం వరకు తనతో ఎంతో సంతోషంగా గడిపిన భర్త.. శాశ్వతంగా తిరిగిరాడన్న బాధతో ఆమె పడిన వేదనకు అక్కడున్నారంతా కదిలిపోయారు. ఢిల్లీ ద్వారక ప్రాంతంలోని వెంకటేశ్వర్ ఆస్పత్రి మంగళవారం మధ్యాహ్నం ఈ విషాద ఘట్టానికి వేదికయింది. ఢిల్లీ బీఎండబ్ల్యూ కారు ప్రమాదంలో (Delhi BMW Accident) ప్రాణాలు కోల్పోయిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ నవజ్యోత్ సింగ్ అంత్యక్రియలు మంగళవారం నాడు ముగిశాయి. ఇదే దుర్ఘటనలో ఆయన భార్య సందీప్ కౌర్ తీవ్రంగా గాయపడి చిక్సిత పొందుతున్నారు. అంత్యక్రియలకు ముందు నవజ్యోత్ పార్థీవదేహాన్ని చివరి చూపు కోసం సందీప్ కౌర్ ఉన్న ఆస్పత్రికి తీసుకొచ్చారు. లేవలేని స్థితిలో ఉన్న ఆమె.. స్ట్రెచర్పై నుంచే తన చేతులతో భర్త ముఖాన్ని తడిమి కడసారిగా కన్నీటి వీడ్కోలు చెప్పింది. తన కొడులిద్దరి పుట్టినరోజు నాడే భర్తకు చివరి వీడ్కోలు చెప్పాల్సిరావడంతో ఆమె బాధ వర్ణణాతీతం.గురుద్వారా, లంచ్.. విషాదంటీచర్గా పనిచేస్తున్న సందీప్ కౌర్ (Sandeep Kaur) తన భర్తతో కలిసి బైకుపై ఆదివారం బయటకు వెళ్లారు. ఆ రోజు ఉదయం సెంట్రల్ ఢిల్లీలోని బంగ్లా సాహిబ్ గురుద్వారాను సందర్శించిన తర్వాత ఆర్కే పురంలోని కర్ణాటక భవన్లో భోజనం చేశారు. అక్కడి నుంచి ప్రతాప్ నగర్లోని తమ ఇంటికి వెళుతుండగా బీఎండబ్ల్యూ కారు వారి బైక్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే నవజ్యోత్ చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. అయితే దగ్గరలో కాకుండా 19 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రి తీసుకెళ్లడంతోనే తన భర్త మరణించారని సందీప్ కౌర్ ఆరోపించారు. ప్రమాదం జరిగిన తర్వాత 40 నిమిషాలు ప్రయాణించి జీటీబీ నగర్లో ఉన్న న్యూలైఫ్ ఆస్పత్రికి వీరిని తరలించారు.అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారుకొడుకు మరణంతో నవజ్యోత్ తల్లి గుర్పాల్ కౌర్ శోకసంద్రంలో ముగినిపోయారు. తన కుమారుడిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కోడలు కూడా తీవ్రంగా గాయపడి ఇంకా ఆస్పత్రిలో ఉందని వాపోయారు. ప్రమాదస్థలికి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే తన తండ్రి బతికివుండేవారని నవజ్యోత్ కుమారుడు నవనూర్ సింగ్ అన్నాడు. తన తల్లికి కూడా తీవ్ర గాయాలయినట్టు వైద్యులు చెప్పారని, హెల్మెట్ (Helmet) ధరించినప్పటికీ తలకు గాయమైందని బాధ పడ్డాడు.కొడుకుల పుట్టినరోజు నాడే..నవజ్యోత్ సింగ్ (52) మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు విషాదంలో మునిగిపోయారు. నవజ్యోత్ మరణం ఆయన కుటుంబానికే కాదు, దేశానికి లోటని సహోద్యోగులు అన్నారు. ఆయన ఇద్దరు కొడుకుల పుట్టినరోజు నాడే నవజ్యోత్ అంత్యక్రియలు జరపాల్సి రావడం విషాదమని ఆవేదన చెందారు. నవజ్యోత్ అంత్యక్రియలు మంగళవారం బేరి వాలా బాగ్ శ్మశానవాటికలో జరిగాయి. అంతకుముందు ఉత్తర ఢిల్లీలోని ప్రతాప్ నగర్ నుంచి బేరి వాలా బాగ్ శ్మశానవాటిక సాగిన అంతిమయాత్రలో నవజ్యోత్ సింగ్ కుటుంబ సభ్యులు, బంధువులు, సహచరులు పాల్గొన్నారు.కావాలని చేయలేదు..నిర్లక్ష్యంగా కారు నడిపి నవజ్యోత్ సింగ్ (Navjot Singh) మరణానికి కారణమైన నిందితురాలు గగన్ప్రీత్ కౌర్, ఆమె భర్త పరీక్షిత్ మక్కర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద సమయంలో వారిద్దరి పిల్లలు కూడా కారులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారి కారును స్వాధీనం చేసుకున్నామని.. ప్రమాదంలో కౌర్, ఆమె భర్తకు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరినట్టు స్థానికి డీసీపీ చెప్పారు. కాగా, సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గగన్ప్రీత్ను పోలీసులు అరెస్ట్ చేసి, 2 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. తాను కావాలని యాక్సిడెంట్ చేయలేదని, ప్రమాదవశాత్తు జరిగిపోయిందని పోలీసులతో ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురయ్యానని, అందుకే తనకు తెలిసిన ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు వెల్లడించింది. కోవిడ్ సమయంలో తన పిల్లలు అక్కడే చికిత్స పొందారని తెలిపారు.చదవండి: టికెట్ బుకింగ్.. రైల్వేశాఖ కొత్త రిజర్వేషన్ విధానంఎఫ్ఐఆర్లో ఏముంది?ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో రింగ్ రోడ్లో నవజ్యోత్ సింగ్ మోటార్ సైకిల్ను బీఎండబ్ల్యూ కారు (BMW Car) ఢీకొట్టడంతో ఆయన మృతి చెందారు. ఆయన భార్య సందీప్ కౌర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురుగ్రామ్ నివాసి గగన్ప్రీత్ కౌర్, ఆమె భర్త పరీక్షిత్ మక్కర్, వారి ఇద్దరు పిల్లలు, పనిమనిషి ప్రమాద సమయంలో కారులోనే ఉన్నారు. పరీక్షిత్కు స్వల్ప గాయాలయ్యాయి. గగన్ప్రీత్పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 281 (బహిరంగ మార్గంలో వేగంగా వాహనం నడపడం), 125B (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించే చర్యలు), 105 (హత్యతో సమానం కాని నేరపూరిత హత్య), 238 (నేరానికి సంబంధించిన సాక్ష్యాలను అదృశ్యం చేయడం లేదా నేరస్థుడిని తప్పించడానికి తప్పుడు సమాచారం ఇవ్వడం) కింద కేసు నమోదు చేశారు.

పేరెంటింగ్ విషయంలో బీకేర్ఫుల్..! ఆ తల్లిదండ్రులకు రూ. 2 కోట్లు జరిమానా..
పిల్లలు ప్రవర్తనా తీరు వల్లే వాళ్ల తల్లిందండ్రులకు గుర్తింపు లేదా అవమానం అనేవి రావడం జరుగుతాయి. అందుకే పిల్లల పెంపకంలో ప్రతి తల్లిదండ్రులు చాలా కేర్ఫుల్గా ఉండాలని అంటుంటారు. వాళ్లు గనుక ఇతరులను ఇబ్బందిపెట్టేలా ఊహకందని ఘనకార్యం చేసి వస్తే..ఇక తల్లిదండ్రులకు చీవాట్లు, అవమానాలు తప్పవు. అంతవరకు అయితే పర్లేదు, వారి కారణంగా కోర్టులపాలై, కోట్ల కొద్ది జరిమానాలు ఎదుర్కొంటే ఆ తల్లిదండ్రులకు కనడమే నేరంగా మారుతుంది. అలాంటి దురదృష్టకర ఘటనే పాపం ఆ ఇద్దరు టీనేజర్ల తల్లిందండ్రులకు ఎదురైంది.అసలేం జరిగిందంటే..ఆ యువకులను చూస్తే..అబ్బా ఇలాంటి పుత్రులు పగవాడికి కూడా వద్దు అని అస్యహించుకునేంత దారుణానికి ఒడిగట్టారు ఆ ఇద్దరు. వాళ్లు చేసిన పని వింటే ఎవ్వరికైనా చిర్రెత్తికొచ్చి తిట్టిపోసేలా ఉంది. ఈ ఘటన చైనాలోని షాంఘైలో చోటు చేసుకుంది. అక్కడ ప్రసిద్ద హైడిలావ్ హాట్పాట్ రెస్టారెంట్లో టాంగ్ అనే ఇంటిపేరుతో ఉన్న ఇద్దరు 17 ఏళ్ల యువకులు మద్యం తాగి ఆ మత్తులో విచక్షణరహితంగా ప్రవర్తించారు. సమీపంలోని టైబుల్ ఎక్కి సంప్రాదాయ చైనీస్ హాట్పాట్ శైలిలో మాంసం, కూరగాయలు వండటానికి ఉపయోగించే కమ్యూనల్ సూప్లో మూత్రం పోశారు. ఆ ఇరువురు ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటన ఫిబ్రవరి 24, 2025న ఒక ప్రైవేట్ డైనింగ్ రూమ్లో జరిగింది. అయితే ఆ కలుషితమైన రసాన్ని కస్టమర్లు సేవించినట్లు ఆధారాలు లేవు. అందుకుగానూ సదరు బ్రాంచ్ హైడిలావ్ రెస్టారెంట్ ఈ సంఘటన జరిగిన రోజు నుంచి మార్చి 8లోపు సందర్శించిన దాదాపు నాలుగువేల మంది కస్టమర్లకు పరిహారం చెల్లించింది. అంతేగాదు ఈ ఘటనకు పరిహారం కావాలంటూ సదరు రెస్టారెంట్ కోర్టు మెట్లు ఎక్కింది. ఈ ఘటన కారణంగా తమ రెస్టారెంట్ పరవు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది, పైగా కస్లమర్ల నమ్మకానికి భంగం కలిగేలా చోటు చేసుకుందని అందుకుగానూ తమకు సుమారు రూ. 28 కోట్లు దాక నష్ట పరిహారం చెల్లించాలని కోరింది. ఈ కేసుని విచారించిన షాంఘై కోర్టు..ఇది అవమానకరమైన చర్యగా పేర్కొంటూ..టేబుల్వేర్ని కలుషితం చేయడమే గాక ప్రజలకు కూడా అసౌకర్యం కల్పించారంటూ మండిపడింది. ఈ టీనేజర్లు ఇద్దరు సదరు రెస్టారెంట్ ఆస్తిహక్కులు, ప్రతిష్టను ఉల్లంఘించారని పేర్కొంది. అంతేగాదు ఈ టీనేజర్ల తల్లిదండ్రులు పిల్లల సంరక్షణ బాధ్యతల్లో విఫలమయ్యారంటూ చీవాట్లు పెట్టింది. అందుకుగానూ ఆ పేరెంట్స్ని సందరు రెస్టారెంట్కి రూ. 2 కోట్లుదాక నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరిచ్చింది. అలాగే ఆ టీనేజర్ల తల్లిదండ్రులు సదరు రెస్టారెంట్కి బహిరంగంగా క్షమాపణుల కోరుతూ.. వార్తపత్రికలో ప్రచురించాలని కూడా ఆదేశించింది. అందుకేనేమో మొక్కై వంగనిది.. మానై వంగునా అని పెద్దలు అంటుంటారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే సరిగా పెరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. లేదంటే వాళ్లు చేసే ఘనకార్యలకు ఫలితం అనుభవించక తప్పదు. పేరెంటింగ్ విషయంలో ప్రతి తలిందండ్రులు చాలా కేర్ఫుల్గా ఉండాలని ఈ ఉదంతం చెప్పకనే చెబుతోంది కదూ..!.(చదవండి: రండి.. ఫొటో దిగుదాం’)

ఈసారి శరన్నవరాత్రి తొమ్మిది రోజులు కాదు..!
గణపతి నవరాత్రలు ముగిసిన వెంటనే దేవి నవరాత్రులు కోలాహలం మొదలవుతుంది. ఊరు, వాడ, గ్రామంలోని ప్రతి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వాలంకరంణలతో ముస్తాబవుతుంది. అందులోనూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయనే విషయం తెలిసిందే. ఈ ఏడాది దేవి నవరాత్రులు సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభం కాగా, ఈ నవరాత్రులు ఎప్పటిలా తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు జరగడం విశేషం. చివరి రోజు విజయ దశమితో కలిపి పదకొండు రోజులు పాటు నిర్వహించనున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇలా దుర్గమ్మ పది అవతారాల రూపంలో దర్శనమివ్వడానికి కారణం ఏంటంటే..ప్రతి పదేళ్లకు ఒక సారి తిథి వృద్ధి చెందుతుంది. దీంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకు ముందు ఇలా 2016లో 11 రోజుల పాటు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయినీదేవిగా అలంకరించారు. మళ్లీ ఈ ఏడాది అమ్మవారిని కాత్యాయినీదేవి అలంకారం చేయనున్నారు. అయితే సెప్టెంబర్ 29వ తేదీన అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ దసరా పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల దేవీ నవరాత్రులు ఈసారి పది రోజులు జరగనున్నాయి. ఇక చివరిరోజు విజయదశమి కలసి దసరా అంటారు. కాబట్టి ఈ శరన్నవరాత్రుల్లో మొత్తం 11 రోజులు 11 అవతారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుందని పండితులు చెబుతున్నారు. భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటున్న దుర్గమ్మ పదకొండు అలంకారాలు ఇవే..!.సెప్టెంబర్ 22 - శ్రీ బాలాత్రిపురసుందరిదేవి అలంకారంసెప్టెంబర్ 23 - శ్రీ గాయత్రి దేవి అలకారంసెప్టెంబర్ 24 - శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంసెప్టెంబర్ 25 - శ్రీ కాత్యాయినీ దేవి అలంకారంసెప్టెంబర్ 26 - శ్రీ మహా లక్ష్మీదేవి అలంకారంసెప్టెంబర్ 27 - శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంసెప్టెంబర్ 28 - శ్రీ మహా చండీదేవి అలంకారంసెప్టెంబర్ 29 - మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతి దేవి అలంకారంసెప్టెంబర్ 30 - శ్రీ దుర్గా దేవి అలంకారంఅక్టోబర్ 1 - శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారంఅక్టోబర్ 2 - విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంగమనిక: ఈ కథనంలో తెలియజేసిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. (చదవండి: విష్ణు సేనాపతి విష్వక్సేనుడు)
ఫొటోలు


ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ (ఫొటోలు)


సైమా అవార్డ్స్ -2025లో అందరినీ ఆకర్షించిన ఫోటోలు ఇవే


షారుక్ ఖాన్ కుమారుడి కోసం తరలిన అంబానీ ఫ్యామిలీ (ఫోటోలు)


హైదరాబాద్లో కుండపోత బీభత్సం.. నీటమునిగిన పలు ప్రాంతాలు (ఫొటోలు)


లండన్ వేకేషన్లో హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)


తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు (ఫొటోలు)


తొలిసారి ఒంటరిగా.. యాంకర్ అనసూయ పోస్ట్ (ఫొటోలు)


సిద్దార్థ్-అదితీ పెళ్లిరోజు సెలబ్రేషన్స్ (ఫొటోలు)


‘మిరాయ్’ మూవీ సక్సెస్ మీట్లో మెరిసిన శ్రియా శరణ్ (ఫొటోలు)


నవరాత్రులకు సిద్దమైన అమ్మవారి విగ్రహాలు రండి చూసేద్దాం (ఫొటోలు)
అంతర్జాతీయం

ఖలిస్థానీల హెచ్చరిక.. భారత కాన్సులేట్ను సీజ్ చేస్తామంటూ..
ఒట్టావా: కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత్ను టార్గెట్ చేసి వాంకోవర్లోని భారత కాన్సులేట్ను సీజ్ చేస్తామని తాజాగా బెదిరింపులకు దిగారు. ఈ మేరకు ఖలిస్థానీ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ హెచ్చరించింది. దీంతో, ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది.వివరాల ప్రకారం.. భారత్, కెనడా మధ్య మళ్లీ దౌత్య సంబంధాలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ కెనడాలోని ఖలిస్థానీలు రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన ఖలిస్థానీ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్.. వాంకోవర్లోని భారత కాన్సులేట్ను ముట్టడిస్తామని పేర్కొంది. ఈనెల 18న (గురువారం) దీన్ని స్వాధీనం చేసుకుంటామని, ఆ సమయంలో ఇక్కడికి ఎవరూ రావొద్దంటూ హెచ్చరికలు చేసింది. ఇదే సమయంలో కాన్సులేట్కు వచ్చే వారు తన సందర్శనను వాయిదా వేసుకోవాలని సూచించింది.ఈ సందర్భంగా భారత హైకమిషనర్ దినేశ్ కె.పట్నాయక్ను లక్ష్యంగా చేసుకుని ఉన్న పోస్టర్లను కూడా విడుదల చేసింది. అంతటితో ఆగకుండా.. భారత కాన్సులేట్లు గూఢచారి నెట్వర్క్ను నడుపుతున్నాయని, ఖలిస్థానీలను లక్ష్యంగా చేసుకుని నిఘా పెట్టాయని ఆ బృందం ఆరోపించింది. దీంతో ఇది కాస్తా తీవ్ర కలకలం రేపింది. ఇదిలా ఉండగా.. రెండు సంవత్సరాల క్రితం 18 సెప్టెంబర్ 2023న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర దర్యాప్తులో ఉందని అప్పటి ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, నాటి నుంచి భారత్, కెనడా మధ్య దౌత్యపరంగా విభేదాలు వచ్చాయి.

న్యూయార్క్ టైమ్స్పై ట్రంప్ పరువు నష్టం దావా
వాషింగ్టన్: ‘ద న్యూయార్క్ టైమ్’ పత్రిక తనను అవమానించడమే పనిగా పెట్టుకుందని అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. అంతేకాకుండా విపక్ష డెమెక్రటిక్ పార్టీకి కరపత్రికగా మారిపోయిందని ఆరోపించారు. తనకు, తన కుటుంబానికి, వ్యాపారానికి వ్యతిరేకంగా తప్పుడు సేŠట్ట్మెంట్లు ప్రచురిస్తోందని ధ్వజమెత్తారు. ఆ పత్రికపై కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. తనకు జరిగిన నష్టానికి గాను ఆ పత్రిక 15 బిలియన్ డాలర్ల (రూ.1.32 లక్షల కోట్లు) పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.ఈ ఈ మేరకు సోమవారం రాత్రి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే, ట్రంప్ డిమాండ్ చేస్తున్న సొమ్ము ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక మార్కెట్ విలువ కంటే అధికం కావడం గమనార్హం. పాత్రికేయ రంగంలో ప్రమాణాలను పునరుద్ధరించడం, సమగ్రతను కాపాడడం తన ఉద్దేశమని ట్రంప్ చెబుతుండడం విశేషం. అయితే, నిపుణుల వాదన మరోలా ఉంది.న్యూయార్క్ టైమ్స్పై పరువు నష్టం దావా వేయడం ద్వారా పత్రికా స్వేచ్ఛను హరించాలని, వ్యతిరేక గళాలను అణచివేయాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోందని అంటున్నారు. ట్రంప్ వ్యవహార శైలిని తప్పుపడితే కోర్టుకు లాగడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, ట్రంప్ వేసిన పరువు నష్టం దావాలో పుస్తక ప్రచురణ సంస్థ పెంర్విన్ రాండమ్ హౌస్తోపాటు న్యూయార్క్ టైమ్స్లో పనిచేసే నలుగురు జర్నలిస్టుల పేర్లు కూడా చేర్చారు. వీరిలో ఇద్దరు ట్రంప్పై ఒక పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్ని పెంర్విన్ ప్రచురించింది.ఆ దావాలో పస లేదుకోర్టులో ట్రంప్ దాఖలు చేసిన పరువునష్టం దావాపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక యాజమాన్యం స్పందించింది. ఆ దావాలో ఏమాత్రం పస లేదని, అది చెల్లదని, న్యాయ పరీక్షకు నిలవదని తేల్చిచెప్పింది. మీడియా స్వతంత్రను దెబ్బతీయడమే ట్రంప్ ఉద్దేశమని విమర్శించింది. ప్రసార మాధ్యమాలను అణచివేయడం మానుకోవాలని సూచించింది. ఇలాంటి చిల్లర బెదిరింపులకు తాము లొంగబోమని స్పష్టంచేసింది. నిజాలు నిర్భయంగా బహిర్గతం చేస్తూనే ఉంటామని, తమను ఎవరూ అడ్డుకోలేరని పేర్కొంది. న్యాయం తమవైపే ఉందని ఉద్ఘాటించింది.

గాజాపై భీకర దాడులు
జెరూసలేం: గాజా నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ మంగళవారం దాడులను మరింత తీవ్రతరం చేసింది. హమాస్ సైనిక వనరుల నాశనమే లక్ష్యంగా గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టినట్లు ప్రకటించింది. ‘ప్రమాదకరమైన యుద్ధ జోన్’గా మారిన నగరాన్ని వీడి దక్షిణప్రాంతంలోని అల్ మువాసిలో ఏర్పాటు చేసిన మానవీయ జోన్కు తరలివెళ్లాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం రాత్రి నుంచి కొనసాగిస్తున్న దాడుల్లో మరో 68 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఎడతెగని దాడులతో భీతిల్లిన జనం నగరాన్ని వీడి పెద్ద సంఖ్యలో వెళ్లిపోతున్నారు.తీరం వెంబడి రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. అంతకుముందు, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ మంగళవారం ఉదయం ‘గాజా తగులబడుతోంది’అంటూ వ్యాఖ్యానించారు. హమాస్ సాయుధ వనరులను ధ్వంసం చేసి, బందీలను విడిపించుకుంటామన్నారు. లక్ష్యం నెరవేరేదాకా వెనక్కి తగ్గేది లేదన్నారు. దీంతో, ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్థం తీవ్రరూపం దాల్చగా, కాల్పుల విరమణ కోసం ఇప్పటి వరకు కొనసాగిన దౌత్యప్రయత్నాలకు ముగింపు పలికినట్లేనని భావిస్తున్నారు.ఆగని మారణకాండగాజా నగర జనాభా దాదాపు 10 లక్షలు కాగా ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో గత నెల నుంచి ఇప్పటి వరకు 2.20లక్షల మంది దక్షిణాదికి వలస వెళ్లినట్లు ఐరాస అంచనా వేసింది. మంగళవారం ఈ నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులను ఉధృతం చేసింది. ఈ దాడుల్లో కనీసం 68 మంది చనిపోయినట్లు అల్ జజీరా తెలిపింది. సోమవారం రాత్రంతా శతఘ్నులు, హెలికాప్టర్లు, క్షిపణులు, డ్రోన్లు, ఎఫ్–16 యుద్ధ విమానాలతోవిరామం లేకుండా బాంబింగ్ కొనసాగిందని షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ అబూ సెల్మియాహ్ వ్యాఖ్యానించారు. తమ ఆస్పత్రికి పదుల సంఖ్యలో మృతదేహాలు వచ్చాయన్నారు. కనీసం 90 మంది క్షతగాత్రులకు చికిత్స చేశామన్నారు. భవనాల శిథిలాల కింద చాలామందే చిక్కుకుని ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇజ్రాయెల్ శత్రువు: ఈజిప్టుఅమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో సోమవారం ఇజ్రాయెల్ చేరుకుని, ప్రధాని నెతన్యాహూతో చర్చలు జరిపారు. గాజాలో క్షేత్రస్థాయి ఆపరేషన్ ప్రారంభమైనందున, ఒప్పందం కుదుర్చుకునేందుకు తగు సమయం లేదంటూ వ్యాఖ్యానించారు. ఎంతో ముఖ్యమైన ఈ ఆపరేషన్ కొన్ని వారాల్లోనే ముగియనుందన్నారు. అనంతరం ఆయన ఖతార్ రాజధాని దోహాకు చేరుకున్నారు. దోహాలో జరుగుతున్న అరబ్, ముస్లిం దేశాల నేతల సమావేశం ఖతార్పై ఇజ్రాయెల్ గత వారం చేపట్టిన దాడులను తీవ్రంగా ఖండించింది.ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా చేపట్టాల్సిన చర్యలపై ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. అయితే, ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధానికి దౌత్యప రమైన ఒత్తిడుల ద్వారా ముగింపునకు తేవాలని నిర్ణయించింది. ఇజ్రాయెల్ను శత్రువంటూ దోహాలో జరిగిన సమావేశంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సిస్సి అభివర్ణించారు. 1979లో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలయ్యాక ఇజ్రాయెల్ను ఆ దేశం ఇంత తీవ్రంగా నిందించడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. అయితే, ఇది కేవలం తమ అసంతృప్తి తీవ్రతను వ్యక్తం చేసేందుకే తప్ప, ఇజ్రాయెల్తో సంబంధాలను తెంచుకునేందుకు కాదని అంటున్నారు.జన హననానికి ఆధారాలుఇజ్రాయెల్ ఆర్మీ గాజా ప్రాంతంలో జనహననానికి పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమితి నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ పేర్కొంది. మారణహోమానికి ముగింపు పలికి, ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఈ కమిటీ 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ సాగిస్తున్న దాడులు, మానవహక్కుల ఉల్లంఘన పర్యవసానాలను రికార్డు చేసింది.

థర్డ్ పార్టీ జోక్యాన్ని భారత్ ఒప్పుకోలేదు
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్–పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే చొరవ తీసుకున్నానని, తన హెచ్చరికల వల్లే యుద్ధం ఆగిపోయిందని పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల్లోని డొల్లతనాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బయటపెట్టారు. కాల్పుల విరమణ విషయంలో మూడో పక్షం జోక్యాన్ని భారత్ ఎంతమాత్రం అంగీకరించలేదని తేల్చిచెప్పారు. అంటే ట్రంప్ చెప్పినదంతా అబద్ధమని పరోక్షంగా స్పష్టంచేశారు. తాజాగా అల్జజీరా మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.కీలకం అంశాలపై పొరుగుదేశంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కానీ, తమతో చర్చలపై భారత్ స్పందించడం లేదని చెప్పారు. భారత్తో ఇటీవల సంప్రదింపులు ఏమైనా జరిగాయా? మూడో వ్యక్తి ఎవరైనా జోక్యం చేసుకున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఇషాక్ దార్ బదులిచ్చారు. అలాంటిదేమీ లేదని అన్నారు. రెండు దేశాల వ్యవహారాల్లో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించదని వెల్లడించారు.భారత్–పాక్ల నడుమ మధ్యవర్తిత్వం వహించానని, రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేశానని ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నుంచి వివరణ కోరామని ఇషాక్ దార్ తెలిపారు. ద్వైపాక్షిక అంశాలపై థర్డ్ పార్టీ జోక్యాన్ని భారత్ ఒప్పుకోవడం లేదంటూ ఆయన తమతో చెప్పారని వివరించారు.భారత్ను అడుక్కోలేం కదా!‘‘కాల్పుల విరమణ గురించి చర్చిద్దామంటూ ఆమెరికా నుంచి మే 10వ తేదీన ఆఫర్ వచి్చంది. ఒక తటస్థ వేదికపై అతిత్వరలో చర్చలు ప్రారంభిద్దామని మార్కో రూబియో మాకు చెప్పారు. కానీ, ఆ చర్చలేవీ జరగలేదు. జూలై 25వ తేదీన వాషింగ్టన్లో జరిగిన భేటీలో రూబియో కలిశారు. కాల్పుల విరమణ ఒప్పందం కోసం మీరు ఏర్పాటు చేస్తారన్న సమావేశం ఎందుకు జరగలేదని ప్రశ్నించాను. ఇది ద్వైపాక్షిక అంశమని, మూడో పక్షం జోక్యాన్ని అనుమతించబోమని భారత్ తేల్చిచెప్పిందని, అందుకే సమావేశం ఏర్పాటు చేయలేకపోయామని బదులిచ్చారు.భారత్, పాక్ల సంబంధించినది ఏదైనా సరే ద్వైపాక్షిక అంశమేనని భారత్ చెబుతుండగా ఇక మేము ఏం చేయగలం. మూడో వ్యక్తిని కూడా అనుమతించాలని భారత్ను అడుక్కోలేం కదా! శాంతిని కోరుకొనే దేశం పాకిస్తాన్. చర్చల ద్వారాపై సమస్యలు పరిష్కారం అవుతాయని మేము విశ్వసిస్తున్నాం. అందుకు రెండు దేశాలూ ముందుకు రావాలి. చర్చలకు భారత్ ఒప్పుకుంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదం, వాణిజ్యం, ఆర్థికం, జమ్మూకశీ్మర్ తదితర అన్ని అంశాలపై సమగ్రంగా చర్చిద్దాం. థర్డ్ పార్టీని అనుమతించాలని మేము కూడా పట్టుబట్టడం లేదు’’ అని ఇషాక్ దార్ సూచించారు.ట్రంప్ విజ్ఞప్తిని తిరస్కరించిన భారత్ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టడమే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే ఆపరేషన్ ముగిసింది. భారత్–పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ రెండు దేశాల ప్రభుత్వాల కంటే ముందే ట్రంప్ ప్రకటించారు. సోషల్ మీడియాలో పోస్టుచేశారు. దీనిపై విమర్శలు వచి్చనప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు.భారత్, పాక్లపై వాణిజ్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధం ఆగేలా చేశానని, ఆ క్రెడిట్ తనకే దక్కాలని, అంతేకాకుండా నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడినని ట్రంప్ పదేపదే ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీనిపై భారత్ స్పందిస్తూ ట్రంప్ వాదనను పలుమార్లు తిప్పికొట్టింది. రెండు దేశాలతో సంబంధం లేని మూడో వ్యక్తి చెబితే కాల్పుల విరమణకు తామెందుకు ఒప్పుకుంటామని ప్రశ్నించింది. పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చి ప్రాధేయపడడం వల్లే దాడులు ఆపేశామని స్పష్టంచేసింది. నోబెల్ శాంతి బహుమతికి తన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని ట్రంప్ విజ్ఞప్తి చేయగా, భారత్ నిర్మొహమాటంగా తిరస్కరించింది.
జాతీయం

మార్పు అవసరమే..అసాధ్యమేమీ కాదు..
దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులు అవసరమని భారతీయులు భావిస్తున్నట్లు ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మొత్తం 25 దేశాల్లో ఒక్క భారతీయులు మాత్రమే రాజకీయ వ్యవస్థలో మార్పును కోరుకుంటూనే.. ఆ మార్పులు జరుగుతాయన్న నమ్మకాన్ని కూడా ప్రబలంగా వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. ప్రజలు రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళనను కోరుకుంటున్నారని, అయితే ప్రక్షాళన జరగటంపై సందేహాలు వ్యక్తం చేశారని ‘ప్యూ’ తెలిపింది. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రపంచ వ్యాప్తంగా భారత్, అమెరికా, కెనడా, గ్రీస్, ఫ్రాన్స్, స్పెయిన్, యూకే, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ వంటి 25 దేశాలలో ‘ప్యూ’ నిర్వహించిన ఈ సర్వేలో 50 శాతానికిపైగా ప్రజలు తమ దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులు లేదా పూర్తి సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయాన్ని సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 70 శాతానికిపైగా వ్యక్తం చేశారు. 2025 జనవరి 8 – ఏప్రిల్ 26 మధ్య ‘ప్యూ’ ఈ సర్వేను నిర్వహించింది. సర్వే కోసం 28,333 మంది అభిప్రాయాలు సేకరించింది.మార్పుపై మనవాళ్లుభారీ మార్పు అవసరం అన్న భారతీయులు 37 శాతం మంది కాగా, మొత్తం అంతా మారిపోవాలి అన్నవాళ్లు 34 శాతం మంది. అసలు మార్పే అవసరం లేదన్నవారు 9 శాతం మంది, చిన్నచిన్న మార్పులు అవసరం అన్నవారు 16 శాతం మంది. రాజకీయ వ్యవస్థ మారుతుందని 59 శాతం మంది భారతీయులు నమ్ముతుండగా, 10 శాతం మంది తమకు అలాంటి నమ్మకం లేదని తెలిపారు. 25 శాతం మంది కొద్దిపాటి మార్పులు చేస్తే బాగుంటుందని / అసలు మార్పులే అవసరం లేదని అన్నారు.కొన్ని దేశాల్లో పెదవి విరుపు రాజకీయ వ్యవస్థలో మార్పులు జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు వివిధ దేశాల ప్రజలు వేర్వేరుగా సమాధానాలు ఇచ్చారు. ఉదాహరణకు, దక్షిణ కొరియా వాసుల్లో 87 శాతం మంది రాజకీయ సంస్కరణలు అవసరమని చెప్పినప్పటికీ, అవి జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని అన్నారు. మొత్తం 25 దేశాల్లో ఒక్క భారతీయులు మాత్రమే రాజకీయ వ్యవస్థలో మార్పును కోరుకుంటూనే, ఆ మార్పులు జరుగుతాయన్న నమ్మకాన్ని కూడా ప్రబలంగా వ్యక్తం చేశారు. నాయకులపై సానుకూలతప్రపంచ దేశాలన్నిటిలోనూ నాయకులపై సానుకూల భావనే కనిపించింది. భారతీయులు కూడా – తమ దేశ రాజకీయాల్లో వ్యవస్థాగత మార్పులు అవసరం అంటూనే, తాము ఎన్నుకున్న నాయకుల వ్యక్తిత్వాల పట్ల ఎక్కువగా సదభిప్రాయాలనే వ్యక్తం చేశారు. ఎంపిక చేసిన ఐదు రకాల గుణగణాలు (నిజాయితీ, ప్రజావసరాలను అర్థం చేసుకోవటం, సమస్యలపై దృష్టి పెట్టటం, నైతిక ప్రవర్తన, యోగ్యతలు).. తమ నాయకులలో అవి ఉన్నదీ లేనిదీ గుర్తించమని ‘ప్యూ’ సర్వే అడిగినప్పుడు ఎక్కువమంది సానుకూలంగా స్పందించారు. భారతీయులదీ అదే తీరుభారతీయులు తాము ఎన్నుకున్న నాయకుల వ్యక్తిత్వంపై పూర్తి వ్యతిరేకంగా లేరు. 33 శాతం మంది తమ నాయకులు నిజాయితీకి, 31 శాతం మంది ప్రజావసరాలను అర్థం చేసుకునే నైజానికి, 27 శాతం మంది ప్రజా సమస్యలపై పెడుతున్న దృష్టికి, 27 శాతం మంది నైతికతకు, 23 శాతం మంది యోగ్యతలకు పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. మనకు నమ్మకం ఎక్కువేరాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని చెప్పిన దేశాల్లో నైజీరియా మొదటి స్థానంలో (51 శాతం)లో ఉండగా, దక్షిణ కొరియా రెండో స్థానంలో (43 శాతం), ఇండియా మూడో స్థానంలో (34) ఉన్నాయి. 7 శాతంతో స్వీడన్ చివరి స్థానంలో ఉంది. ఎప్పటికైనా మార్పులు జరుగుతాయన్న నమ్మకం ఉన్న దేశాల్లో ఇండియా, కెన్యా రెండూ సమానంగా (59 శాతం) ప్రథమ స్థానంలో ఉండగా; మార్పులు జరుగుతాయన్న నమ్మకం లేని దేశాల్లో ఇండియా (10 శాతం) ఆఖర్న, గ్రీసు మొదట (68 శాతం) ఉన్నాయి. ఇక నేతల వ్యక్తిత్వాలు, సామర్థ్యాలపై నమ్మకం ఉన్న ఆసియా–పసిఫిక్ దేశాలలో 28 సగటు శాతంతో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా (41 శాతం), దక్షిణ కొరియా (34 శాతం), ఇండోనేషియా (31 శాతం) ఉన్నాయి.

హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై కాల్పులు.. నిందితుల ఎన్కౌంటర్
సాక్షి,న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై కాల్పుల ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిశాపఠానీ ఇంటిపైకి కాల్పులకు తెగబడ్డ నిందితుల్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ప్రముఖ అంతర్జాతీయ నేరస్థుల ముఠా సభ్యులైన ఈ ఇద్దరిని ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.సెప్టెంబర్ 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ నగర సివిల్ లైన్స్ ఏరియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆ రోజు తెల్లవారు జామున సరిగ్గా 3.45 నిమిషాలకు గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా ముఠాకు చెందిన రవీంద్ర, అరుణ్లు ఈ కాల్పులు జరిపారు. అయితే, ఈ కాల్పుల ఘటనను యూపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. నిందితులు ఎక్కడున్నా వారిని పట్టుకుని తీరుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు.ఆ మరుసటి రోజే ఘాజియాబాద్లోని ట్రోనికా సిటీలో ఎస్టీఎఫ్ నోయిడా యూనిట్, ఢిల్లీ పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. సంఘటనా స్థలం నుంచి తుపాకీ,బుల్లెట్స్ను స్వాధీనం చేసుకున్నట్లు లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఎడిజి) అమితాబ్ యష్ తెలిపారు. ఇటీవల,దిశా పటానీ సోదరి,మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది.

ఇది ఓ కార్పొరేట్ ఉద్యోగి క(ఖ)ర్మ!
కార్పొరేట్ ప్రపంచం చాలా చిత్రమైంది. ఒక పైసా ఖర్చు మిగిల్చేందుకు వంద రూపాయలు తగలేసేందుకూ సిద్ధం. ఇది కూడా అట్లాంటి వ్యవహారమే. కంపెనీ ఊరూ, పేరు తెలియదు కానీ.. సామాజిక మాధ్యమం రెడిట్లో ప్రచురితమైన వివరాల ప్రకారం...అతడో సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఏళ్లుగా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. గాడిద చాకిరీ చేస్తున్నానని తనే చెప్పుకున్నాడు కూడా. ఈమధ్యే వార్షిక ఇంక్రిమెంట్ల ప్రహసనం ముగిసింది. ఊహించినట్టుగానే జీతం జానెడే పెరిగింది. ‘‘జీతం కనీసం పది శాతమైనా పెంచండి సారూ’’ అంటూ పైవాళ్లకు మెయిల్ పెట్టాడు. పైనున్న మేనేజర్.. ఆ పైనున్న హెచ్ఆర్ వాళ్లు ఏమనుకున్నారో.. ఎలా ఆలోచించారో తెలియదు కానీ.. ‘‘ఠాట్.. పది శాతం పెంచమంటావా’’ అంటూ హూంకరించారు.‘‘నిన్ను ఉద్యోగం లోంచి పీకేశాం. ఫో’’ అనేశారు. కంపెనీ కదా.. ఆమాత్రం పైచేయి చూపడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆఫ్ట్రాల్ ఒక ఉద్యోగి విజ్ఞప్తిని మన్నిస్తే.. అందరూ మీదపడిపోతారు అనుకుని ఉంటుంది. తొలగించనైతే తొలగించారు కానీ.. అప్పటివరకూ ఆ ఇంజినీర్ చేసే పని? అర్జెంటుగా ‘‘సిబ్బంది కావలెను’’ అన్న సందేశం వెళ్లిపోయింది. హడావుడిగా మెయిళ్లు అటు ఇటూ కదిలాయి. బోలెడంత మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. చివరకు ఆరు మందిని సెలెక్ట్ చేశారు. మంచి ప్యాకేజీలతో వారి జీతాలూ ఫిక్స్ చేసేశారు. ఆ ఒక్కడు చేసే పనిని వీరందరూ కలసికట్టుగా చేయడం మొదలుపెట్టారు కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల వ్యవహారం ఇలా ఉంటుందన్నమాట.పది శాతం పెంపును నిరాకరించి ఉద్యోగంలోంచి తొలగించిన ఆ ఉద్యోగి ఆరేళ్లపాటు కంపెనీకి సంబంధించిన కీలకమైన బ్యాకెండ్ వ్యవస్థను ఒంటిచేత్తో నడిపిస్తున్నాడట. ముందుగా చెప్పినట్లు గాడిద మాదిరిగా ఆ బాధ్యతంతా తలపై మోసుకుని కష్టపడినా.. సహోద్యోగుల కంటే తక్కువ జీతం వస్తూండటంతో ఉండబట్టలేక జీతం పది శాతం పెంచమని అడిగాడట. ఇక లాభం లేదనుకుని కంపెనీ పనులపై శ్రద్ధ తగ్గించేశాడు. ఇతగాడి ఖర్మానికో, పుణ్యానికో అప్పుడే కంపెనీలో ఒక కొత్త డైరెక్టర్ వచ్చి చేరాడు. ఆఫీసుకు సక్రమంగా రావడం లేదన్న మిషతో ఉద్యోగంలోంచి తీసేశాడు. ఫలితం.. ఒకరి స్థానంలో ఆరుగురికి జీతాలు సమర్పించుకోవాల్సి రావడం. ‘‘పదిశాతం పెంచేసి ఉంటే గొడవే ఉండకపోవను. అయితే ఒక్కటి. ప్రపంచంలో న్యాయం అనేది ఇంకా ఉంది అనేందుకు ఇదో నిదర్శనం’’ అని ఆ ఉద్యోగి తన రెడిట్ పోస్టులో రాసుకోవడం అక్షర సత్యం అనిపిస్తుంది! ఏమంటారు?

ఈవీఎం బ్యాలెట్పై కలర్ ఫొటోలు
పట్నా: బిహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో శాసనసభ ఎన్నికల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నడుంబిగించింది. ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం) బ్యాలెట్ పేపర్ లేఔట్లో ఆధునిక మార్పులు తేనున్నట్లు ఈసీ ప్రకటించింది. గతంలో ఈవీఎం లేఔట్పై అభ్యర్థుల ఫొటోలు నలుపు,తెలుపు రంగులో ఉండేవి. కొందరి ఫొటోలైతే అస్సలు ముద్రించకపోయేవాళ్లు. ఇకపై కలర్ ఫొటోలను ముద్రించి ఓటర్లు సులభంగా తమ అభ్యర్థులను గుర్తించే వెసులుబాటు కల్పించనున్నారు. ఫొటో కోసం కేటాయించిన మొత్తం ప్రదేశంలో ముప్పావువంతు సైజులో ఫొటో పెద్దగా కని్పంచనుంది. దీంతో కంటి సమస్యలున్న ఓటర్లు సైతం తమ అభ్యర్థి ముఖాన్ని స్పష్టంగా చూశాకే ఓటేసే అవకాశమొచ్చింది. కొత్తగా వచ్చిన మార్పులేంటి? → అభ్యర్థి సీరియల్ నంబర్తోపాటు ‘ఎవరికి ఓటు వేయబోము(నన్ ఆఫ్ ది ఎబో–నోటా) అనే ఆప్షన్ సైతం పెద్ద సైజులో ఉండనుంది. → అంతర్జాతీయ భారతీయ అంకెల విధానమైన లక్షలు, కోట్లు వంటి వాటిని సైతం ఉపయోగించనున్నారు. ఈ అంకెలను 30 నంబర్ ఫాంట్సైజులో ముద్రిస్తారు. → స్పష్టంగా కనిపించేందుకు మందంగా బోల్డ్లో ప్రింట్చేస్తారు. → అభ్యర్థుల అందరి పేర్లు ఒకే పరిమాణంలో కన్పించేలా ఒకే నంబర్ ఫాంట్ సైజును ఉపయోగించనున్నారు. నోటాకు సైతం ఇదే వర్తించనుంది. లిపి(ఫాంట్) రకాలు వేర్వేరుకాకుండా ఒకే రకం ఫాంట్ను వాడనున్నారు → చదరపు మీటర్కు 70 గ్రాముల బరువు ఉండే 70 జీఎస్ఎం గ్రేడ్ పేపర్ను ఈవీఎం బ్యాలెట్ పేపర్ ముద్రణ కోసం ఉపయోగిస్తారు. శాసనసభ ఎన్నికల కోసం ప్రత్యేకంగా గులాబీరంగు పేపర్ను ఉపయోగిస్తారు. అందులోనూ పింక్, రెడ్, గ్రీన్లను ప్రత్యేకంగా వాడనున్నారు. → బిహార్లోనే తొలిసారిగా ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నారు.
ఎన్ఆర్ఐ

తానా “తెలుగుభాషా యువభేరి” విజయవంతం
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వహించిన “తెలుగుభాషా యువభేరి” భారీ విజయం. డాలస్, టెక్సస్లో తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత ఐదున్నర సంవత్సరాలగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్యసదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 83వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం శ్రీ గిడుగు వెంకట రామమూర్తి (ఆగస్ట్ 29) 162వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జరిగిన “తెలుగుభాషా యువభేరి” ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తెలుగు వ్యావహారిక భాషోద్యమ మూలపురుషుడు, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది, ఉపాధ్యాయుడు,అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు తెలుగును గ్రాంధిక భాషనుంచి వ్యావహారిక భాషగా మార్చే ప్రయత్నంలో గిడుగు చేసిన కృషిని సోదాహరణంగా వివరించి ఘన నివాళులర్పించారు.“ఈ నాటి ఈ కార్యక్రమంలో 9వ తరగతి చదువుకుంటున్న విద్యార్ధినీ విద్యార్దుల నుంచి ఎం.బి.బి.ఎస్ చదువుతున్న విద్యార్ధుల వరకు కేవలం తెలుగుభాషలో ప్రావీణ్యమే గాక, అవధానాలు చేసే స్థాయికి ఎదగిన యువతీయువకులు చూపిన సాహితీ ప్రతిభ, వెదజల్లిన సాహితీ పరిమళాలు ఇతరులకు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి అన్నారు. ఈ ప్రయాణంలో పసితనం నుంచే వీరిలో తెలుగుభాషపై ఆసక్తి, అనురక్తి కలిగించడంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల శిక్షణ, ముఖ్యంగా అవధాన విద్యా వికాస పరిషత్ పోషించిన గురుతరమైన పాత్ర ఎంతైనా కొనియాడదగ్గవి అన్నారు” డా. తోటకూర ప్రసాద్ముఖ్యఅతిధిగా హాజరైన ప్రముఖ సినీగీత రచయిత తిపిర్నేని కళ్యాణచక్రవర్తి మాట్లాడుతూ “నేను పట్టాలు పొందింది తెలుగులో కాదు, చదువుకున్నది ఎం టెక్, ఎం.బి.ఏ. ఐనప్పటికీ తన తాత, తల్లిదండ్రుల ప్రోత్సాహం, పాఠశాలలో గురువుల శిక్షణ తనకు తెలుగు భాషామాధుర్యాన్ని చవిచూసే అవకాశం కల్పించి, నేడు తెలుగు సినిమా రంగంలో దాదాపు వంద పాటలు వ్రాసే స్థాయికి తీసకు వెళ్ళాయన్నారు. కనుక చిన్నతనంనుండే పిల్లలకు తెలుగు నేర్పే బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు” విశిష్టఅతిథులు పాల్గొన్న అద్దంకి వనీజ, 9వ తరగతి విద్యార్ధిని, విజయవాడ - “ఘనమైన గద్యం”; అష్టావధాని వింజమూరి సంకీర్త్, 9వ తరగతి విద్యార్ధి, హైదరాబాద్ (వింజమూరు, నల్గొండ జిల్లా) - “శతక సాహిత్యం”; బులుసు రమ్యశ్రీ, 10వ తరగతి విద్యార్ధిని (భీమడోలు, ఏలూరు జిల్లా) - “ఆధునిక సాహిత్యం”; శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ, బి.ఏ విద్యార్ధి, తిరుపతి - “ఉదాహరణకావ్యవైభవం”; అష్టావధాని యెర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, పి.హెచ్.డి విద్యార్ధి, తిరుపతి (బల్లిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా) - “అవధానంలో సామాజిక దృక్పధం”; అష్టావధాని డా. బోరెల్లి హర్ష, బి.డి.ఎస్, దంతవైద్యులు, కర్నూలు - “వర్ణన”; అష్టావధాని నల్లాన్ చక్రవర్తుల సాహిత్, ఎం.టెక్ విద్యార్ధి, ఐఐటి, ఖరగ్పూర్ (హైదరాబాద్) - “నిషిద్ధాక్షరి”; అష్టావధాని గట్టెడి విశ్వంత్, పి.హెచ్.డి విద్యార్ధి, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (మెట్పల్లి, జగిత్యాల జిల్లా) - “తెలుగుభాష పుట్టుపూర్వోత్తరాలు”; అష్టావధాని బాణావత్ నితిన్ నాయక్, బి.టెక్, ఐఐఐటి, బాసర (నిజామాబాద్) - “అవధాన విద్య-ఒక సమీక్ష” అష్టావధాని సుసర్ల సుధన్వ, ఎం.బి.బి.ఎస్ విద్యార్ధి, చెన్నై (హైదరాబాద్) – “సమస్యాపూరణం” అనే అంశాల మీద అద్భుత ప్రసంగాలుచేసి అందరినీ ఆశ్చ్యర్య పరచారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు చిగురుమళ్ళ శ్రీనివాస్ తన వందన సమర్పణలో ఈ కార్యక్రమంలో ఈ యువతీ యువకులు చూపిన భాషా పాండిత్య ప్రతిభ చూస్తుంటే తెలుగు భాష భవిష్యత్తుకు ఏ ప్రమాదం లేదనే ఆశ కలుగుతోందన్నారు. పాల్గొన్న అతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు, తానా కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లింకులో వీక్షించవచ్చు https://www.youtube.com/live/DqCQES2BcwM?si=eRcIZ3B-NFxtUcMX(చదవండి: ఖతర్లో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం)

బాపట్లలో విషాదం.. అమెరికాలో లోకేశ్ మృతి
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. అమెరికాలో బాపట్లకు చెందిన లోకేష్(21) మృతిచెందారు. స్విమ్మింగ్ పూల్లో మునిగిపోయి పాటిబండ్ల లోకేష్ చనిపోయాడు. బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన గ్రానైట్ వ్యాపారి కుమారుడిగా లోకేష్ను గుర్తించారు. కాగా, ఉన్నత చదువుల కోసం లోకేశ్.. అమెరికా వెళ్లాడు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఖతర్లో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం
ఖతర్లో తెలుగు వారంతా తెలుగు భాషా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. దోహాలోని భారత రాయబారి కార్యాలయం ఆధ్వర్యంలోని ఇండియన్ కల్చరల్ సెంటర్ తెలుగు లిటరేచర్ క్లబ్ అనుబంధ సంస్థలైన తెలుగు కళా సమితి, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జాగృతి, ఆంధ్ర కళా వేదిక ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాయి. ఎంతో అద్భుతమైన ఈ కార్యక్రమం తెలుగు సంఘాల ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన, గొప్ప భాషలలో ఒకటైన "తెలుగు" భాషను గౌరవిస్తూ, గొప్ప తెలుగు కవి, వ్యవహారిక భాష శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి పుట్టినరోజునాడు నాలుగు తెలుగు సంస్థలు - హరీష్ రెడ్డి (అధ్యక్షులు - TKS), శ్రీనివాస్ గద్దె (అధ్యక్షులు - TPS), నాగ లక్ష్మి (ఉపాధ్యక్షులు - TJQ), విక్రమ్ సుఖవాసి (ఆపద్ధర్మ అధ్యక్షులు - AKV) నాయకత్వంలో ఈ వేడుకను దిగ్విజయముగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలుగు సంస్థల కార్యవర్గ సభ్యులతో పాటు, ఐసీసీ కార్యవర్గ సభ్యులు, తెలుగు భాషాభిమానులు, వర్ధమాన కవులు, తెలుగు పండితులు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో, వివిధ కూరగాయలు, పండ్ల పేర్లను ఉపయోగించి అందమైన తెలుగు కథా కథనాలతో, వేమన పద్యాలు, తెలుగు పొడుపు కథలు/మెదడును చురుకుగా ఉంచే ఆటలతో, ఆశక్తికరమైన సంభాషణలతో తెలుగు భాషలో వారి సృజనాత్మకతను ప్రదర్శించారు. అంతేగాక, ప్రపంచ వేదికపై వివిధ రంగాలలో తెలుగు ప్రజల విజయాలు,వారి కృషిని గురించి కొనియాడారు. తెలుగు భాష పై నిర్వహించిన క్విజ్ అందరినీ అలరించింది.గిడుగు వెంకట రామమూర్తి గారి కవిత్వాన్ని, ఇంకా వారి గ్రామంలో కొనసాగుతున్న సంస్కృతిని వివరిస్తూ.. తాము ఆ గ్రామానికి చెందినవారమని ఒక ప్రేక్షకురాలు గర్వంగా చెప్పినప్పుడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఆనందించారు. ఈ కార్యక్రమం తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా పేర్కొనవచ్చు. ఈ కార్యక్రమంలో అత్యధిక యువత భాగస్వామ్యం కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే మన సంస్కృతి ప్రస్తుత తరానికి వారసత్వంగా అందుతోందని ఆశించటం అతిశయోక్తి కాదనిపించింది. ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం మాతృదేశానికి దూరంగా ఉంటున్న యువత తమ మూలాలను గుర్తించి గౌరవించడం అని తెలియ చేశారు.ఈ కార్యక్రమం ఐసిసి తెలుగు లిటరేచర్ క్లబ్, హెచ్ఆర్, అడ్మిన్ అండ్ కాన్సులర్ హెడ్ రాకేష్ వాఘ్ హృదయపూర్వక స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. ఖతర్లో తెలుగు సమాజం తమ సంస్కృతిని నిరంతరం సజీవంగా ఉంచడంలో చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఐసిసి జనరల్ సెక్రటరీ అబ్రహం కె జోసెఫ్ తన అధ్యక్ష ప్రసంగంలో వివిధ వర్గాలు ఐక్యతను పెంపొందించడంలో భాష ప్రముఖమైన పాత్ర వహిస్తుందని నొక్కి చెప్పారు. ప్రపంచ స్థాయి కవులు, తత్వవేత్తలు, కళాకారులను తయారుచేసే తెలుగు వారసత్వాన్ని ఆయన ప్రశంసించారు. అలాగే వారి రచనలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు.ఐసిసి అనుబంధ విభాగాధిపతి రవీంద్ర ప్రసాద్, ఐసిసి అంతర్గత కార్యకలాపాల విభాగాధిపతి వెంకప్ప భాగవతుల ప్రత్యేక అభినందన ప్రసంగాలు చేశారు. సాహిత్యంలో మాట్లాడే మాండలికాన్ని ఉపయోగించడం కోసం ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన ప్రముఖ తెలుగు రచయిత, సామాజిక సంస్కర్త గిడుగు వెంకట రామమూర్తి జన్మదినాన్ని స్మరించుకునే తెలుగు భాషా దినోత్సవం శాశ్వత వారసత్వాన్ని, తెలుగు సాహిత్య సాంస్కృతిక సంపదను ప్రవాసులలోని పిల్లలు, యువతకు అందించాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు నడిపించిన సౌమ్య, శిరీష, హారిక, నాగలక్ష్మి గార్లకు ఐ సి సి నాలుగు తెలుగు సంస్థల తరపున అభినందనలు తెలియజేశారు.(చదవండి: వర్జీనియాలో అంగరంగ వైభవంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభ)

షార్జా, సౌదీలో వైఎస్సార్కు ఘన నివాళి
సింహాద్రిపురం/కడప కార్పొరేషన్: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా యూఏఈలోని షార్జాలో మహమ్మద్ జిలాన్ బాషా ఆధ్వర్యంలో ప్రసన్న సోమిరెడ్డి, కోటేశ్వరరెడ్డి నేతృత్వంలో తెలుగు ప్రజలు మంగళవారం వైఎస్సార్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు.అనంతరం వైఎస్సార్ అభిమాని జిలాన్ బాషా మాట్లాడుతూ వైఎస్సార్ (YSR) ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. ఆయన చూపిన దారి ఎప్పటికీ తమకు ప్రేరణ అని పేర్కొన్నారు. అనంతరం అభిమానులు వైఎస్సార్ స్మృతులను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు శ్రీనివాస్ చౌదరి, అక్రమ్ బాషా, బ్రహ్మానంద రెడ్డి, నాగ ప్రతాప్ రెడ్డి, కర్ణ, పవన్, గంగిరెడ్డి, క్రాంతికుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శివలింగా రెడ్డి, హనుమంత్ రెడ్డి, తాజుద్దీన్, సత్య, అంజాద్, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.సౌదీ అరేబియాలో...డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 16వ వర్ధంతిని సౌదీ అరేబియాలో ఘనంగా నిర్వహించారు. జుబైల్ ప్రాంతంలో అనుయాకినో కంపెనీ క్యాంపులో కడప పట్టణానికి చెందిన షేక్ ఇలాహి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అనుయాకినో కంపెనీలో పని చేసే సుమారు 50 మంది కార్మికులకు అన్నదానం చేశారు.చదవండి: విదేశాల్లో వైఎస్సార్కు ఘన నివాళులు ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు తాజుద్దీన్, అబ్రార్, ఖ్వాజా, బాషా, సలాం బాషా, మతివ్, అఫ్జల్, ఆతిఫ్, ముహమ్మద్, జాఫర్, ఫర్ ఖాన్, ఫైరోజ్, అసిమ్, ఫైసల్ తదితరులతో పాటు కిషోర్, సంతోష్, శ్రీను పాల్గొన్నారు.
క్రైమ్

భార్య చేతులు కట్టేసి బెల్టుతో చితకబాదిన భర్త
ప్రకాశం జిల్లా: ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు యత్నించడంతో స్థానికులు అడ్డుకుని ఆమెను కాపాడిన సంఘటన ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే కలుజువ్వలపాడు చెందిన గురునాథం బాలాజీకి భాగ్యలక్ష్మితో సుమారు 8 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. మద్యానికి బానిసైన బాలాజీ భార్యను తరచూ తీవ్రంగా హింసించేవాడు. ఈ క్రమంలో భార్యా పిల్లలను వదిలేసి వేరే మహిళతో హైదరాబాదులో ఉంటున్నాడు. శనివారం రాత్రి కలుజువ్వలపాడు గ్రామానికి వచ్చిన బాలాజీ.. స్థానికంగా ఉండే బేకరీలో పని ముగించుకొని ఇంటికి వస్తున్న భార్య భాగ్యలక్ష్మిని అటకాయించాడు.మద్యానికి డబ్బులు ఇవ్వాలని కోరగా అందుకు ఆమె నిరాకరించడంతో బాలాజీలోని రాక్షసుడు నిద్ర లేచాడు. తన అక్క రమణ, మేనల్లుడు విష్ణు, బాలాజీ మరో భార్య కలిసి భాగ్యలక్ష్మిని బైకుపై బలవంతంగా ఎక్కించుకొని.. అక్క ఇంటికి తీసుకువెళ్లి తాళ్లతో నిర్బంధించాడు. రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు చిత్రహింసలకు గురిచేసి విడిచిపెట్టారు. మళ్లీ సోమవారం రాత్రి చిత్రహింసలు పెట్టేందుకు బాలాజీ యత్నించగా ఆమె తప్పించుకొని ఎస్సీ కాలనీలోకి పరుగెత్తింది. స్థానిక చర్చి వద్ద ఉన్న కొందరు యువకులు బాలాజీని, అతని మేనల్లుడిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక యువకులు 112కు ఫోన్ చేశారు. రాత్రి 11 గంటల సమయంలో వచ్చిన పోలీసులు బాధిత మహిళను ఫొటో తీసుకుని బాలాజీ మేనల్లుడు విష్ణును బైక్పై ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్లి మధ్యలో వదిలేసినట్లు సమాచారం. శనివారం చేసిన చిత్రహింసను బాలాజీ రెండో భార్య వీడియో తీయగా అది మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. కాగా మహిళను చిత్రహింసలకు గురిచేయడంపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై విలేకరులతో తెలిపారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వీడియో ప్రచురితం కావడంతో దర్శి సీఐ, తర్లపాడు ఎస్సై కలుజువ్వలపాడు గ్రామానికి చేరుకున్నారు. బాధిత మహిళను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ప్రకాశం తర్లుపాడు మండలంలో కలుజువ్వలపాడు ఎస్సీ కాలనీలో దారుణం భార్యను కట్టేసి బెల్టుతో కొడుతూ, కాళ్లతో తన్నిన భర్త#prakasham #tharlupadu #husbandkickswife #andhrapradesh #uanow pic.twitter.com/vqiLth1eOd— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) September 16, 2025

నేపాల్ బాలిక అదృశ్యం
లక్ష్మీపురం: నేపాల్కు చెందిన బాలిక అదృశ్యమైన ఘటనపై అరండల్పేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్ దేశానికి చెందిన గోవింద్ తాప అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వలస వెళ్లి అక్కడ హోటల్లో పని చేసుకుంటున్నాడు. అయితే ఇటీవల రెండు నెలల క్రితం గోవింద్ తాప కుమార్తె సరిత కుమారి మరి కొంత మందితో కలిసి గుంటూరుకు వచ్చి, గుంటూరులోని రైల్వే కోచ్ రెస్టారెంట్లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. అయితే ఈనెల 14వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. విషయం తెలుసుకున్న తండ్రి గోవింద్ తాప గుంటూరు వచ్చి చుట్టు పక్కల ప్రాంతాలలో, బంధుమిత్రుల వద్ద ఎంత వెతుకులాడినా ఆచూకీ తెలియక పోవడంతో దిక్కు తోచక అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు అరండల్పేట పోలీసు స్టేషన్ 0863–2231955, సీఐ ఆరోగ్య రాజు 8688831332, ఎస్ఐ రోజాలత, 8688831334, నంబర్లకు సమాచారం తెలియజేయాల్సిందిగా సూచించారు.

పెళ్లైన మూడు నెలలకే నవ వధువు ఆత్మహత్య
మూసాపేట: నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మూసాపేట యాదవ బస్తీలో నివాసముండే సూరవరపు రమ్య (18)కు మూడు నెలల క్రితం అశోక్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి కూతురు, అల్లుడు అత్తింట్లోనే ఉంటున్నారు. సోమవారం రాత్రి అందరు కలిసి భోజనం చేసిన అనంతరం..రమ్య ముందుగా తన రూమ్కు వెళ్లి ఫ్యాన్ రాడ్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త భోజనం ముగించి రూముకు వెళ్లగా డోర్ తెరుచుకోలేదు. దీంతో అందరూ కలిసి తలుపులు తెరవగా రమ్య ఫ్యాన్కు వేలాడుతూ కని్పంచింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మిస్టరీ వీడేదెన్నడు?
శ్రీ సత్యసాయి జిల్లా: రెండు వేర్వేరు కీలక హత్య కేసుల్లో మిస్టరీని ఛేదించడంలో పోలీసులు చతికిల పడ్డారు. ఆ రెండు కేసులను లోతుగా దర్యాప్తు చేస్తే ఒకరిద్దరు పోలీసు అధికారులు సైతం జైలుకెళ్లాల్సి వస్తుందనే ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ హత్యలు జరిగి మూడు, నాలుగేళ్లు కావస్తున్నా నేటికీ దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. రెండు రోజుల క్రితం జిల్లా ఎస్పీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్.సతీష్ కుమార్ ఈ రెండు కేసుల దర్యాప్తు సవాల్గా నిలిచాయి. ప్రత్యేక చొరవ చూపి, నిందితులకు శిక్ష పడేలా చూడాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.గదిలోనే కిరణ్ దారుణ హత్యమహారాష్ట్రకు చెందిన కిరణ్(23) కొన్నేళ్లుగా కదిరి పట్టణంలోని ఎంజీ రోడ్డులో మేడపై ఓ గదిని అద్దెకు తీసుకొని బంగారు నగలు తయారీతో జీవనం సాగించేవాడు. సకాలంలో నగలు సిద్దం చేసి ఇస్తుండడంతో నగల వ్యాపారులందరూ అతనికే పని ఇచ్చేవారు. దీంతో రోజంతా బిజీగా ఉంటూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడు. అతని వద్ద కిలోకు పైగా బంగారం, 10 కిలోలకు పైగా వెండి ఉండేదని కొందరు నగల వ్యాపారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో 2021 సెప్టెంబర్ 12న రాత్రి తన గదిలో నిద్రిస్తుండగా కిరణ్ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మొదట్లో ఈ కేసు విషయంలో పోలీసులు కొంత హడావుడి చేసినా ఆ తర్వాత ఉన్నఫళంగా దర్యాప్తు ఆగిపోయింది. ఈ కేసు విచారణలో భాగంగా అప్పటి ఓ పోలీసు అధికారి తన చేతి వాటం ప్రదర్శించి పెద్ద మొత్తంలో నగదు, బంగారు నగలు సొమ్ము చేసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపైనే సదరు పోలీసు అధికారిని వీఆర్కు అప్పట్లో ఉన్నతాధికారులు పంపినట్లుగా సమాచారం.ప్రమీల శరీరంపై 26 కత్తిపోట్లుకదిరిలోని కాలేజీ రోడ్డులో కిరాణా కొట్టు నిర్వహించే రంగారెడ్డి అనే వ్యక్తి ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత అతని భార్య ప్రమీల(24) ఇంట్లోనే ఉంటూ కిరాణా దుకాణం నిర్వహించేది. 2022, మార్చి 21న అర్రధరాత్రి తన కిరాణా కొట్టులోనే ఆమె దారుణ హత్యకు గురయ్యారు. ఆమె శరీరంపై 26 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. తన సమీప బంధువులతో ఆస్తి తగాదా విషయంలో అప్పట్లో తరచూ పట్టణ పోలీస్ స్టేషన్కు వెళుతున్న ఆమె అమాయకత్వాన్ని అప్పటి ఒక పోలీసు అధికారి ‘క్యాష్’ చేసుకోవడంతో పాటు వివాహేతర సంబంధం కూడా కొనసాగించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమీల సెల్ఫోన్కు అందిన కాల్స్ ఆధారంగా సదరు పోలీసు అధికారి తరచూ ఆమెతో మాట్లాడినట్లు అప్పట్లో పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దీంతో సదరు పోలీసు అధికారిని అప్పట్లో విధుల నుంచి తప్పించినట్లుగా పోలీసు వర్గాల సమాచారం. కాగా, సదరు పోలీసు అధికారి అప్పట్లో స్థానిక సబ్జైలు ఎదురుగా ఉన్న పోలీస్ గెస్ట్హౌస్లోనే ఉండేవారు. ఆయనకు ప్రమీల తన ఇంటి నుంచి క్యారియర్ తీసుకెళ్లి ఇస్తుండడం తాము కళ్లారా చూశామని కొందరు పోలీసులు సైతం అంగీకరిస్తున్నారు. అలాంటి మహిళ రాత్రికి రాత్రి హత్యకు గురి కావడం నమ్మలేక పోతున్నామని వారంటున్నారు. ఆమె సమీప బంధువులు సైతం ఇదే అంశాన్ని బలపరుస్తున్నారు. ఈ హత్య జరిగి మూడేళ్లకు పైగా కావస్తున్నా నిందితులను ఇప్పటి వరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు కేసుల్లోనూ కొందరు ఖాకీల పాత్ర ఉన్నందునే విచారణ పక్కదారి పట్టినట్లుగా బలమైన విమర్శలున్నాయి.
వీడియోలు


పవన్ గురించి రిపోర్టర్ ప్రశ్న.. అవినాష్ రెడ్డి సమాధానం అదుర్స్


బంగారంపై GST ప్రభావం ఎలా ఉంటుంది..


పాన్ ఇండియా షేక్..! ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే అప్డేట్


భారత్ అంటే ఇంత భయమా..? బయటపడ్డ పాక్ డ్రామా


హైకోర్టు ఆదేశాలు లెక్కచేయకుండా అమరావతిలో DSC వేడుకలు


మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి రంగం సిద్ధం


అంబేద్కర్ రాజ్యాంగం దిండు కింద పెట్టి.. లోకేష్ రాజ్యాంగం నడుపుతున్నారు


వరుణుడి ఉగ్రరూపం.. హైదరాబాద్ ను ముంచెత్తిన వాన


అప్పులు చేయడంలో దేశంలో ఆగ్రగామిగా ఆంధ్రప్రదేశ్


సనాతన శాఖా మంత్రి పవన్.. ఇంత అపచారం జరిగితే ఎక్కడ దాక్కున్నావ్