Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

AP Govt Floats PPP Tender for Medical Colleges Amid Public Outcry1
మెడికల్‌ కాలేజీలు.. అన్నంత పని చేసిన చంద్రబాబు

సాక్షి, విజయవాడ: ప్రజల ఆందోళనను, రాజకీయ పార్టీల అభ్యంతరాలను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లెక్క చేయలేదు. అన్నంత పని చేసేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు టెండర్ నోటిఫికేషన్ ఇవాళ జారీ అయ్యింది. తొలివిడత నాలుగు మెడికల్ కాలేజీలను పీపీపీ(Public-Private Partnership)లో అప్పగించేందుకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. మెడికల్ కాలేజీలు.. 625 పథకాల సూపర్ స్పెషలిటీ ఆస్పత్రుల పీపీపీకి టెండర్ ప్రకటన ఏపీ ఎంఎస్ఐడీసీ రిలీజ్‌ చేసింది.చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజా ఆస్తుల ప్రైవేటీకరణ, ముఖ్యంగా మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, అలాగే వైద్య విద్యపై తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్‌సీపీ, ఎమ్మార్పీఎస్‌, ఇతర సామాజిక సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటు ప్రజలలోనూ ఈ నిర్ణయంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంగా ఇన్నేళ్ల తన పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టని చంద్రబాబు.. పేదలు, మధ్యతరగతి ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందాలనే లక్ష్యంతో తాము నిర్మించిన కాలేజీలను ప్రైవేట్ చేతుల్లో పెడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రేపు తాము అధికారంలోకి వచ్చాక టెండర్లు రద్దు చేసి తీరతామని హెచ్చరించారు కూడా.

Uttarakhand Chamoli Cloudburst Heavy Rain2
క్లౌడ్‌బరస్ట్‌ దెబ్బకు పలు ఇళ్లు ధ్వంసం.. ఐదుగురు గల్లంతు

చమోలి: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో పెను విపత్తు సంభవించింది. ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న నందనగర్‌లో గురువారం తెల్లవారుజామున సంభవించిన క్లౌడ్‌ బరస్ట్‌ పలు ఇళ్లను ధ్వంసం చేసింది. ఐదుగురు అదృశ్యమయ్యారు. జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, నందనగర్‌లోని కుంత్రి వార్డులో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. చమోలి జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. VIDEO | Chamoli, Uttarakhand: Cloudburst in Nandanagar results in massive destruction. More details are awaited.(Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/LMiM4SuTPQ— Press Trust of India (@PTI_News) September 18, 2025క్లౌడ్‌ బరస్త్‌ దరిమిలా ఆ ప్రాంతంలో భయాందోళనలు అలుముకున్నాయి. ఇళ్ల శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంఘటన జరిగిన సమయంలో ఏడుగురు ఇళ్లలో ఉండగా, వారిలో ఇద్దరిని రెస్క్యూ సిబ్బంది సజీవంగా బయటకు తీసుకువచ్చారు. గల్లంతైన మరో ఐదుగురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఎస్‌డీఆర్ ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, వైద్య బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.చమోలి జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ తివారీ వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ బుధవారం రాత్రి చమోలి జిల్లాలోని నందనగర్ ఘాట్ ప్రాంతంలో క్లౌడ్‌ బరస​్‌ సంభవించి, భారీ నష్టం జరిగిందన్నారు. నందనగర్‌లోని కుంత్రి లంగాఫలి వార్డులో ఆరు ఇళ్ల శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగామని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇంతలో వాతావరణ శాఖ ఉత్తరాఖండ్‌లో 20 గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. VIDEO | Chamoli, Uttarakhand: Cloudburst in Nandanagar results in massive destruction. More details are awaited.(Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/LMiM4SuTPQ— Press Trust of India (@PTI_News) September 18, 2025

Two wheeler dealerships facing zero confirmed sales3
మరో నాలుగు రోజులు ఇంతే..

భారతదేశం అంతటా ద్విచక్ర వాహన డీలర్‌షిప్‌ల్లో షోరూమ్ బుకింగ్‌లు దాదాపు స్తంభించాయి. సెప్టెంబర్ 4న సవరించిన పన్ను రేట్లను జీఎస్టీ కౌన్సిల్ అధికారికంగా ఆమోదం తెలిపినప్పటి నుంచి ఈ తంతు కొనసాగుతోంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేటును తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు దేశవ్యాప్తంగా వినియోగదారులు ధరల తగ్గింపునకు వేచిచూస్తున్నారు.ఏదేమైనా, ఈ ప్రకటన విస్తృతంగా కొనుగోలుదారులను కట్టిపడేసింది. వినియోగదారులు తాము కొనాలనుకునే ఉత్పత్తులపై త్వరలో ధరల రాయితీ ఉంటుందని నమ్మి ఇలా కొనుగోళ్లను వాయిదా వేస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. ‘జీఎస్టీ రేటు తగ్గింపును ప్రధాని ప్రకటించినప్పటి నుంచి అమ్మకాలు తగ్గాయి. సెప్టెంబర్ 4న చేసిన కొత్త రేట్లను అధికారికంగా ఆమోదం తెలపడంతో వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు’ అని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) డీలర్ ఆశిష్ పాండే చెప్పారు.‘సెప్టెంబర్ 22 కొత్త జీఎస్టీ శ్లాబులు అమలు తర్వాతే కొనుగోళ్లు తిరిగి ఊపందుకుంటాయని ఆశిస్తున్నాం. అయితే ఇది భవిష్యత్తులో సాధారణ ప్రక్రియగానే మారుతుందని, పరిమిత సమయ పథకం కాదని వినియోగదారులకు తెలుసు’ అన్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే షోరూమ్ బుకింగ్స్ దాదాపు 50% పడిపోయాయని దేశవ్యాప్తంగా డీలర్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: అంతర్జాతీయంగా ఏఐ నైతిక ప్రమాణాలపై కసరత్తు

After Charlie Kirk Incident Trump Designates Antifa As Check Full Details4
Antifa: మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వామపక్ష భావజాలమున్న ఎంటిఫా సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. కన్జర్వేటిక్‌ ఉద్యమకారుడు చార్లీ కిర్క్‌ హత్య నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన సోషల్‌ మీడియాలో స్వయంగా ఆయన ప్రకటన చేశారు.ఎంటిఫాను ప్రధాన ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ సోషల్‌ మీడియా ద్వారా ట్రంప్‌​ ప్రకటన చేశారు. దానిని అత్యంత ప్రమాదకరమైన సంస్థగా.. రాడికల్ లెఫ్ట్ విపత్తుగా ఆయన అభివర్ణించారు. అంతేకాదు దీనికి నిధులు సమకూర్చే వారిపై కఠిన విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలకు సూచించారాయన. The United States of America will be designating ANTIFA as a Terrorist Organization.— Donald J. Trump (@realDonaldTrump) May 31, 2020ఏంటీ ఎంటిఫా.. Antifa అంటే ఫాసిస్ట్‌ వ్యతిరేక (anti-fascist) పదానికి సంక్షిప్త రూపం. ఇదేం ఒక అధికార, కేంద్రీకృత సంస్థ కాదు. ఫార్-లెఫ్ట్ కార్యకర్తల గ్రూప్‌. ఫాసిజం, రేసిజం, అన్నింటికంటే ముఖ్యంగా కన్జర్వేటివ్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడే రాజకీయ ఉద్యమం అని చెప్పొచ్చు. ఈ సభ్యులు తరచూ ఫార్-రైట్ ర్యాలీలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. బెల్లా సియావో(Bella Ciao) వంటి పాటలు, 1917 రష్యా విప్లవానికి సంబంధించిన గుర్తులను, నినాదాలను తమ నిరసనలకు ఉపయోగిస్తుంటారు. సోషల్ మీడియాలో సిగ్నల్‌, ఇతర ఎన్‌క్రిప్టెడ్‌ యాప్స్‌ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. అయితే.. ట్రంప్‌ గత టర్మ్‌లోనే ఈ గ్రూప్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాలని అనుకున్నారు. కానీ అది వీలుపడలేదు. ఇప్పుడు తనకు సన్నిహితుడైన చార్లీ కిర్క్‌ హత్యతో ఆ పని చేశారు. అయితే Antifa అనేది ఒక సిద్ధాంతం మాత్రమేనని, దానిని సంస్థగా గుర్తించి నిషేధించడం అసాధ్యమని, పైగా చట్టపరంగా ఇబ్బందులూ ఎదురుకావొచ్చని ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే అభిప్రాయపడుతున్నారు. కిర్క్‌ మరణంకన్జర్వేటివ్‌ కార్యకర్త చార్లీ కిర్క్‌ మరణం.. అమెరికాలో రాజకీయ దుమారం రేపింది. సెప్టెంబర్‌ 10వ తేదీన ఉటా యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ని రైఫిల్‌తో కాల్చి చంపారు. ఒకే భావజాలం ఉన్న ట్రంప్‌ కోసం అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కిర్క్‌ ప్రచారం కూడా చేశారు. దీంతో తన ఆప్తుడి మరణంపై ట్రంప్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని మండిపడ్డారాయన. ఈ క్రమంలో.. వామపక్ష భావజాలం ఉన్న 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్ అనే వ్యక్తిని ఎఫ్‌బీఐ అరెస్ట్‌ చేసింది. ఘటనా స్థలంలో "Hey fascist! Catch!" వంటి రాతలున్న బుల్లెట్‌ కేసింగ్‌లపై కనిపించడం గమనార్హం. అయితే రాబిన్‌సన్‌ Antifa సభ్యుడా అనే విషయాన్ని ఎఫ్‌బీఐ ఇంకా నిర్ధారించలేదు. కానీ ట్రంప్ మాత్రం అతను ‘‘ఇంటర్నెట్ ద్వారా రాడికలైజ్‌ అయ్యాడు’’ అని చెబుతుండడం గమనార్హం.

IND vs PAK on September 21 as Pakistan set Asia Cup 2025 Super 45
Asia Cup 2025: మ‌ళ్లీ భార‌త్-పాక్ మ్యాచ్‌.. ఎప్పుడంటే?

ఆసియాక‌ప్‌-2025లో చిర‌కాల ప్ర‌త్య‌ర్ధులు భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు మ‌రోసారి త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధ‌వారం జ‌రిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో యూఏఈను 41 ప‌రుగుల తేడాతో పాక్ చిత్తు చేసింది. దీంతో గ్రూపు-ఎ నుంచి సూప‌ర్ 4కు ఆర్హ‌త సాధించిన జ‌ట్టుగా పాకిస్తాన్ నిలిచింది.ఈ క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 21(ఆదివారం) దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న సూప‌ర్‌-4 మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ.. మెన్ ఇన్ గ్రీన్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. మరోసారి దాయాది పాక్‌ను చిత్తు చేయాల‌ని భార‌త జ‌ట్టు ఉవ్విళ్లూరుతోంది. కాగా లీగ్ స్టేజిలో భాగంగా గ‌త ఆదివారం(సెప్టెంబ‌ర్ 14) జ‌రిగిన మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది.128 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్ ఫ‌లితం కంటే హ్యాండ్ షేక్ వివాద‌మే ఎక్కువ‌గా హైలెట్ అయింది. ఈ మ్యాచ్‌లో పెహల్గ‌మ్ ఉగ్ర‌దాడికి నిర‌స‌న‌గా భార‌త ఆట‌గాళ్లు పాక్ ప్లేయ‌ర్ల‌తో క‌రాచాల‌నాన్ని తిర‌ష్క‌రించారు.దీంతో ఘోర అవ‌మానంగా భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. భార‌త్ ఆట‌గాళ్ల‌తో పాటు మ్యాచ్ రిఫ‌రీ అండీ పైక్రాప్ట్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. కానీ రూల్ బుక్‌లో ప్ర‌త్య‌ర్ధి ఆట‌గాళ్ల‌తో హ్యాండ్ షేక్ చేయడం త‌ప్ప‌నిసారి అని లేకపోవ‌డంతో ఐసీసీ ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. ఇప్పుడు సూప‌ర్‌-4లో కూడా నో హ్యాండ్ షేక్ విధానాన్ని భార‌త్ కొన‌సాగించ‌నుంది.చదవండి: మరోసారి బీభత్సం సృష్టించిన సాల్ట్‌.. ఈసారి పసికూన బలి

Malayalam Actress Shanthi williams Comments On Mohanlal6
నా భర్త మరణం.. మోహన్‌లాల్‌ తన బుద్ధి చూపించాడు: నటి

మలయాళ సీనియర్‌ నటి శాంతి విలియమ్స్ మోహన్‌లాల్‌ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె తమిళ, మలయాళంలో వందకు పైగా సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో సహాయక పాత్రలు పోషించారు. అపరిచితుడు సినిమాలో విక్రమ్‌కు తల్లిగా కూడా నటించారు. తనకు 12 ఏళ్ల వయసు ఉండగానే చిత్రపరిశ్రమలో ఆమె అడుగుపెట్టారు. ఆమె 1979లో మలయాళీ కెమెరామెన్ జె. విలియమ్స్ ను వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. తన భర్త మరణం సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండగా దానిని మోహన్‌లాల్‌ తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడని ఆమె ఆరోపించారు.మలయాళ సినిమాల్లో ఒకప్పుడు సుపరిచితుడైన సినిమాటోగ్రాఫర్ జె విలియమ్స్‌ను వివాహం చేసుకున్న శాంతి, తన భర్త అనారోగ్యానికి గురైనప్పుడు కుటుంబం తీవ్ర పేదరికంలోకి నెట్టబడిందని, కానీ పరిశ్రమ నుండి ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. విలియమ్స్ 2005లో అనారోగ్యంతో మరణించారు. అయితే, ఆ సమయంలో మోహన్ లాల్‌తో జరిగిన ఒక సంఘటన గురించి శాంతి ఇలా అన్నారు, “ఒకప్పుడు నాకు తెలిసిన లాల్ నేటి సూపర్ స్టార్ కంటే చాలా భిన్నంగా ఉంటాడు. అప్పట్లో, అతనికి చిన్నపిల్లవాడి అమాయకత్వం ఉండేది. అతను మా ఇంటికి వచ్చి, మాతో ఎప్పుడూ మాట్లాడేవాడు. నవ్వుతూ అన్ని విషయాలు పంచుకునే మంచి వ్యక్తి. కానీ, అతను పాపులర్‌ అయిన తర్వాత అతని ప్రవర్తన మారిపోయింది. చాలా మంది ఇతరులు కూడా అదే చెప్తారు.లక్షల విలువైన కృష్ణుడి విగ్రహాన్ని తీసుకెళ్లాడుతన ఇంట్లో ఉండే కృష్ణుడి విగ్రహాన్ని మోహన్‌లాల్‌ ఎలా తీసుకెళ్లాడో శాంతి ఇలా చెప్పింది. "మా ఇంట్లో పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తున్న కృష్ణుడి విగ్రహం ఉండేది. నేడు ఆ విగ్రహం మోహన్‌లాల్ ఇంట్లో ఉంది. నా భర్తకు ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాం. ఆ సమయంలో కృష్ణుడి విగ్రహాన్ని మేము సరిగ్గా నిర్వహించగలమో లేదోనని నా భర్తకు అనిపించింది. మా ఇంట్లో ఎయిర్ కండిషనర్ లేదని, పిల్లలకు ఇబ్బందిగా ఉందని మోహన్‌లాల్‌తో నా భర్త విలియమ్స్ చెప్పాడు. మా ఆర్థిక పరిస్థితిని లాల్ సద్వినియోగం చేసుకున్నాడు. లక్షల విలువైన కృష్ణుడి విగ్రహాన్ని తీసుకెళ్లి, బదులుగా తన ఆఫీసు నుండి పాత ఎయిర్ కండిషనర్‌ను మాకు ఇచ్చాడు. కేవలం పదిరోజుల తర్వాత అది రిపేయర్‌కు వచ్చింది. దీంతో మేము దానిని అమ్మినప్పుడు, మాకు రెండు వేల రూపాయలు మాత్రమే వచ్చాయి. నాకు చాలా బాధ కలిగించే విషయం ఏమిటంటే.., మేము మోహన్‌లాల్‌ కోసం చాలా చేసినప్పటికీ, నా భర్త మరణించినప్పుడు అతను రాలేదు. నేను దాని గురించి మాట్లాడే ప్రతిసారీ, నాలో కోపం ఉప్పొంగుతుంది. ఆకలితోనే నా పిల్లలు నిద్రపోయేవారునాకు నలుగురు పిల్లలు ఉన్నారనే విషయం మోహన్‌లాల్‌కు తెలుసు. విలియమ్స్ మంచం పట్టిన తర్వాత, కుటుంబాన్ని పోషించడానికి నేను డబ్బింగ్, నటన అంటూ తిరగాల్సి వచ్చింది. పిల్లలకు కడుపు నిండా ఆహారం లేని రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు వారు ఆకలితోనే నిద్రపోయేవారు. ఇప్పటివరకు నేను దీని గురించి ఎవరికీ చెప్పలేదు. అయితే, దర్శకుడు శంకర్‌ సార్‌ నా భర్త మరణించారని తెలుసుకొని రూ. 25వేలు సాయం చేశారు. ఏదైనా సాయం అవసరమైతే కాల్‌ చేయమని కూడా చెప్పారు. అయితే, మలయాళ పరిశ్రమ నుంచి ఏ ఒక్కరు కూడా సాయం చేయలేదు. కానీ, తమిళ పరిశ్రమ నుంచి కొందరు చేశారు. నా మాతృభూమి కేరళ, నేను మలయాళీని. అయినప్పటికీ నన్ను నేను అలా పిలుచుకోవడానికి సిగ్గుపడుతున్నాను. మా దగ్గర డబ్బున్న సమయంలో ఎందరికో సాయం చేశాం. కానీ, నా భర్త మరణించిన సమయంలో ఎవరూ కూడా పలకరించలేదు.' అని ఆమె అన్నారు. ప్రస్తుతం శాంతి పిల్లలు పెద్దవారయ్యరు. ఉద్యోగాలు చేస్తూ జీవితంలో సెటిల్‌ అయ్యారు. భర్త మరణం తర్వాత తనకు చిన్న పాత్ర వచ్చినా సరే చేస్తూ పిల్లలను చదివించారని అక్కడి పరిశ్రమ గురించి తెలిసిన వారు చెప్తారు.

What is Kleptomania Causes Symptoms And Treatment7
సర్‌.. నా భార్య చిలిపి దొంగతనాలు చేస్తోంది!

నా భార్య వయసు 45 ఏళ్ళు. మాకు ఒక సొంత సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉంది. మంచి ఉన్నతమైన కుటుంబం. మా ఆవిడకు మొదటి నుంచి ఒక వింత అలవాటు ఉంది. షాపింగ్‌కు వెళ్లినపుడు అవసరం లేకపోయినా, కొనగలిగిన స్థోమత ఉన్నా, ఏదో ఒక వస్తువు దొంగిలిస్తుంది. ఆమె దొంగిలించే వాటిలో కాస్మెటిక్స్‌ లాంటి చిన్న వస్తువుల నుంచి, ఒక్కోసారి చీరలు, చిన్న బంగారు వస్తువులు కూడా ఉన్నాయి. అలా దొంగిలించినవి కొన్ని ఇంట్లో దాచిపెడుతుంది. కొన్నేమో ఇతరులకు తాను గొప్ప అనిపించుకోవడానికి అన్నట్లు పంచిపెడుతుంది. ఆమెకు 300లకు పైగా చీరలు,కోట్లు విలువ చేసే బంగారు నగలు ఉన్నాయి. ఒక్కోసారి నా జేబులోంచి కూడా, నాకు చెప్పకుండా డబ్బులు తీసి దాస్తుంది. ఇన్ని చేసినా ఏమి తెలియనట్లు ఉంటుంది. ఏమాత్రం గిల్టీగా ఫీలవదు. ఇన్ని ఆస్తిపాస్తులుండి కూడా, ఆమె ఎందుకు ఇలా చీప్‌గా దొంగతనాలు చేస్తుందో అర్థం కావడం లేదు. ఇలా చేసి కొన్నిసార్లు షాప్స్‌లో పట్టుబడితే, పొరపాటయిందని సారీ చెప్పింది. ఆమె ప్రవర్తన వల్ల నాకు ఇబ్బందిగా ఉంది. బయట ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నాది. సాక్షిలో మీ కాలమ్‌ చూసి, మీరే ఏదైనా మంచి పరిష్కారం చూపిస్తారనే ఆశతో ఉన్నాను!– కామేశ్వరరావు, హైదరాబాద్‌రావుగారూ! మీరెంతో ఆవేదనతో మీ సమస్యను సాక్షి ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరన్నట్లుగా ఇది బయటకు చెప్పుకోలేని పరిస్థితి. అన్నీ ఉన్నా, అవసరం లేకున్నా ఇలా దొంగతనాలు చేయడాన్ని ‘క్లెప్టోమెనియా’ అంటారు. ఇది చాలా అరుదైన ఒక వింత మానసిక సమస్య. ఈ సమస్య ఉన్న వారికి, ఎలాగైనా ఏదో ఒకటి దొంగిలించాలనే ‘తహ తహ’ ఉంటుంది. వాస్తవానికి ఆ దొంగిలించిన వస్తువు వల్ల వారికి ఎలాంటి అవసరం ఉండదు. ఆ వస్తువు విలువ కూడా చాలా స్వల్పమై ఉండవచ్చు. మామూలు దొంగతనాల లాగా వీరు ఏదీ ప్లాన్‌ చేసుకుని, దొంగతనాలు చేయరు. ఏదైనా షాపింగ్‌కి అని వెళ్లినపుడు అలా సడన్‌గా చేతికందిన ఏదో ఒక వస్తువును వారికవసరం లేకపోయినా ఎత్తేస్తుంటారు. బాగా స్థోమత కలిగి, డబ్బులు పెట్టి కొనగలిగిన వారిలోనే ఈ అలవాటు ఎక్కువ. బహిష్టు సమయంలో ఇలాంటి కోరిక, కొందరిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో కనబడిన వస్తువు ఎత్తేయకుంటే విపరీతమైన టెన్షన్‌కు గురయి, తీసిన తర్వాత చాలా మానసిక ప్రశాంతతకు లోనవుతారు. దీనిని ‘ఇంపల్స్‌ కంట్రోల్‌ డిజార్డర్‌’ అని కూడా అంటారు. ఈ అలవాటు యుక్తవయసులో మొదలై పెద్దయ్యే కొద్ది తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ కొందరిలో మాత్రం శాశ్వతంగా ఉండి΄ోతుంది. ఈ సమస్య నుంచి బయటపడేయాలంటే ఆ వ్యక్తి సహకరించాలి. కొన్నిరకాల మందులతో పాటు ‘కాగ్నిటివ్‌ బిహేవియర్‌ మాడిఫికేషన్‌’ లాంటి ప్రత్యేక మానసిక చికిత్స పద్ధతుల ద్వారా ఇలాంటి వారిని ఈ అలవాటు నుండి బయటపడేసే అవకాశముంది. మొదట్లోనే ఈ అలవాటు గుర్తించి మానసిక వైద్యుడిని కలిస్తే ఫలితాలు మంచిగా ఉంటాయి. ఇప్పటికైనా మీ భార్యను మంచి నిపుణులైన సైకియాట్రిస్ట్‌ క్లినికల్‌ సైకాలజిస్టుల పర్యవేక్షణలో తగిన థెరపీ చేయించండి. ఆల్‌దిబెస్ట్‌!డాక్టర్‌ ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ.(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com)

Brain Eating Amoeba Kills 19 in Kerala8
‘మెదడును తినే అమీబా’ కలకలం.. ఈ ఏడాదిలోనే 19 మంది మృతి!

న్యూఢిల్లీ: కేరళలో ‘మెదడును తినే అమీబా’ కేసులు కలకలం రేపుతున్నాయి. అధిక మరణాల రేటు కలిగిన మెదడు ఇన్ఫెక్షన్ అయిన ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పామ్‌) కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో కేరళ ఆరోగ్యశాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ ఇన్ఫెక్షన్ నేగ్లేరియా ఫౌలేరి వల్ల వస్తుంది. దీనిని సాధారణ బాషలో ‘మెదడును తినే అమీబా’ అని పిలుస్తారు. ఈ ఏడాది కేరళలో ఈ తరహాలో 61 పామ్‌ కేసులు నమోదయ్యాయి. 19 మరణాలు సంభవించాయి. వీటిలో పలు మరణాలు గత కొన్ని వారాలలోనే నమోదయ్యాయి.కేరళ ప్రస్తుతం తీవ్రమైన ప్రజారోగ్య సవాలుతో పోరాడుతోందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. గతంలో కోజికోడ్, మలప్పురం తదితర జిల్లాల్లోని క్లస్టర్‌లతో ముడిపడి ఉన్న ఈ ఇన్ఫెక్షన్లు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్నాయన్నారు. బాధితుల జాబితాలో మూడు నెలల శిశువు నుండి 91 ఏళ్ల వయస్సు వారి వరకు ఉన్నారని తెలిపారు. కేరళ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ‘పామ్‌’ అనేది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. పలు సందర్భాలలో ఇది తీవ్రమైన మెదడు వాపు, మరణానికి దారి తీస్తుంది. ఇది సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, టీనేజర్లు, యువకులకు సోకుతుంది.మెదడును తినే అమీబా అనేది నిలిచిపోయిన నీరులో కనిపిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ అమీబాతో కలుషితమైన నీటి వనరులలో ఈత కొట్టడం, డైవింగ్ చేయడం లేదా స్నానం చేసేవారికి ఈ అమిబీ సోకే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. పామ్‌ కేసులలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని నిర్ధారించడం కష్టమని నిపుణుల చెబుతున్నారు. అయితే దీని లక్షణాలు బాక్టీరియల్ మెనింజైటిస్ లాంటివి.. అంటే తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు. ‘పామ్‌’ సోకినప్పుడు ఈ లక్షణాలు ఒకటి నుండి తొమ్మిది రోజుల మధ్య కనిపించే అవకాశాలున్నాయి. కేరళలో 2016లో తొలి ‘పామ్‌’ కేసు నమోదయ్యింది. గత ఏడాది నుంచి ఈ కేసులలో పెరుగుదల కనిపించింది . కొత్త ఇన్ఫెక్షన్లను నివారించడానికి రాష్ట్ర ‍ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు చెరువులు, సరస్సులు వంటి శుద్ధి చేయని లేదా నిలిచిపోయిన నీటి వనరులలో ఈత కొట్టటం లాంటి పనులు చేయవద్దని కేరళ ఆరోగ్యశాఖ ప్రజలకు సూచించింది.

Advocates ask CJI Gavai to withdraw Go And Ask The Deity remarks9
‘‘ఆ దేవుడినే అడగండి..’’ సీజేఐ వ్యాఖ్యలపై దుమారం

న్యూఢిల్లీ: ధ్వంసమైన ఏడడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలంటూ పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.మధ్యప్రదేశ్‌లోని ఛాతర్‌పూర్‌జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ప్రఖ్యాత ఖజురహో ఆలయ సముదాయంలోని జవారీ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసమైంది. ఈ విగ్రహాన్ని పక్కనబెట్టి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించేలా ఆదేశాలు ఇవ్వాలని(Khajuraho Vishnu idol case) రాకేశ్‌ దలాల్‌ అనే వ్యక్తి ఈ పిల్‌ వేశారు. ఈ పిల్‌ స్వీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రనల్‌ ధర్మాసనం పరిశీలించింది. ‘‘ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు. పబ్లిసిటీ ప్రయోజన వ్యాజ్యం. ఇందులో మేం చేసేది ఏం లేదు. భారత పురతత్వ విభాగం(ఏఎస్‌ఐ) పరిధిలో ఆలయం ఉంది. వాళ్లనే అభ్యర్థించండి. లేదంటే మీరెలాగూ విష్ణుమూర్తికి పరమభక్తుడిని అని చెబుతున్నారుగా. ఆయననే వేడుకోండి. శైవత్వానికి మీరు వ్యతిరేకులు కాకపోతే అదే ఖజురహోలో అతిపెద్ద శివలింగం ఉంది. అక్కడ కూడా మీరు విన్నవించుకోవచ్చు. విగ్రహ పునరుద్ధరణ, పునర్‌నిర్మాణంపై ఏఎస్‌ఐ తుది నిర్ణయం తీసుకుంటుంది’’ అని వ్యాఖ్యానించారు. అయితే తీర్పు సందర్భంగా సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒక వర్గం మనోభావాలు దెబ్బ తీసేలా ఆయన మాట్లాడారంటూ సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. అంతేకాదు.. ఆయన్ని అభిశంసించాలంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వినీత్‌ జిందాల్‌ అనే న్యాయవాది సీజేఐ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్రపతికి, సుప్రీం కోర్ట్‌కు ఆయన ఓ లేఖ రాశారు. ప్రతి మత విశ్వాసానికి గౌరవం ఇవ్వాలి అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. సత్యం సింగ్ రాజ్‌పుత్ అనే మరో న్యాయవాది జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌కు బహిరంగ లేఖ రాశారు. విష్ణుమూర్తి భక్తుడిగా ఆయన వ్యాఖ్యలు నన్ను వ్యక్తిగతంగా బాధించాయి. కాబట్టి వెంటనే ఆయన వాటిని ఉపసంహరించుకోవాలి అని లేఖలో డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం సీజేఐ వ్యాఖ్యలపై న్యాయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

Chandrababu Govt another angle in anarchy of AP With Sand Mafia10
ఇసుక మాఫియాకు.. ఏడుగురు బలి

రాష్ట్రంలో కూటమి నేతల అరాచకంలో మరో కోణమిది.. 15 నెలల చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఉచిత ఇసుక ముసుగులో సాగుతున్న దందా ప్రజల ప్రాణాలు తీస్తోంది.. నదులు, వాగులు, వంకలను చెరబట్టి రేయింబవళ్లు నిబంధనలకు విరుద్దంగా ఇసుక తవ్వకాలు సాగించడమే కాక.. ఇష్టానుసారం అక్రమ రవాణాతో పట్టపగలే ప్రమాదాలకు కారణమవుతూ అమాయకులను చంపేసే స్థాయికి చేరింది.. 30–40 టన్నుల లోడ్‌తో అతి వేగంగా వెళ్తున్న టిప్పర్లు మృత్యు శకటాలుగా మారాయి.. ఇసుక గుంతల్లో పడి కొందరు, ప్రమాదాల బారిన పడి మరికొందరు నిత్యం చనిపోతున్నారు.. అయినా ఏమాత్రం స్పందించని సర్కారు పెద్దలు మీకింత–మాకింత అంటూ బేరసారాల్లో బిజీగా ఉండటం విషాదకరం. సంగం: సగం జీవితం కూడా చూడని ఆ ఏడుగురికీ అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి.. సాయంత్రానికల్లా ఇంటికొస్తామని పిల్లలకు చెప్పి వెళ్లిన వారు అటునుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. ఇసుక మాఫియా తప్పునకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని బాధిత కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన సమీపంలో జాతీయ రహదారిపై తెలుగుదేశం పార్టీ నేత ఇసుక టిప్పర్‌ రాంగ్‌ రూట్లో అతివేగంగా ఎదురుగా వచ్చి కారును ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. అనధికారికంగా పడమటి కంభంపాడు వద్ద నిర్వహిస్తున్న క్వారీ నుంచి సంగం మండలానికి చెందిన టీడీపీ నేతకు చెందిన టిప్పర్‌ ఇసుక లోడ్‌తో నెల్లూరు వైపు రాంగ్‌ రూట్‌లో బయలు దేరింది. అదే సమయంలో నెల్లూరు నుంచి ఆత్మకూరు వైపు వస్తున్న కారును పెరమన వద్ద అతివేగంతో ఎదురుగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తాళ్లూరి శ్రీనివాసులు (40), తాళ్లూరి రాధ (36), ఇందుకూరుపేటకు చెందిన చల్లగుండ శ్రీనివాసులు (40), చల్లగుండ్ల లక్ష్మి (34), శేషం సారమ్మ (40), శేషం వెంగయ్య (38), కారు డ్రైవర్‌ కత్తి బ్రహ్మయ్య (24) కారులోనే మృతి చెందారు. టిప్పర్‌ అతి వేగంగా కారును ఢీకొనడంతో వీరి శరీరాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఘటనలో మృతి చెందిన వారంతా బంధువులే. తాళ్లూరు శ్రీనివాసులు, తాళ్లూరు రాధ భార్యాభర్తలు. వీరు నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేటలో సాయి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నడుపుతున్నారు. వీరి వద్ద కత్తి బ్రహ్మయ్య పని చేస్తున్నారు. చల్లగుండ్ల శ్రీనివాసులు, చల్లగుండ్ల లక్ష్మి భార్యాభర్తలు. శేషం సారమ్మ, శేషం వెంగయ్య వదినా మరుదులు. మృతి చెందిన తాళ్లూరు రాధ.. చల్లగుండ్ల లక్ష్మికి, శేషం వెంగయ్యకు చెల్లెలు. పరామర్శకు వెళ్తూ.. తాళ్లూరు రాధ, చల్లగుండ్ల లక్ష్మి, శేషం వెంగయ్యల చిన్న చెల్లెలు భర్త ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆత్మకూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని పరామర్శించేందుకు తాళ్లూరు శ్రీనివాసులు తన కారులో వీరందరినీ తీసుకుని వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. తన వద్ద పనిచేసే కత్తి బ్రహ్మయ్యను కారు డ్రైవింగ్‌ కోసం తీసుకు రావడంతో అతడు కూడా మత్యువాత పడ్డాడు. అతి కష్టం మీద మృతదేహాల వెలికితీత సుమారు 40 టన్నుల ఇసుక ఉన్న 12 టైర్ల టిప్పర్‌.. రాంగ్‌ రూట్‌లో అతివేగంగా దూసుకు రావడంతో కారు నుజ్జునుజ్జు అయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురూ క్షణాల్లో చనిపోయారు. వారి మృతదేహాలు సైతం చిద్రమయ్యాయి. వెలికి తీసేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాద విషయం తెలుసుకుని సంగం సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్‌, అడిషనల్‌ ఎస్పీ సీహెచ్‌ సౌజన్య, ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్, సంగం సర్కిల్‌లోని పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారు సగ భాగం పూర్తిగా టిప్పర్‌ ఇంజిన్‌లోకి వెళ్లడంతో మృతదేహాలను బయటకు తీసేందుకు రెండు క్రేన్లు, ఒక జేసీబీ, కట్టర్‌ను వినియోగించాల్సి వచ్చింది. ఘటన స్థలాన్ని ఆర్డీఓ భూమిరెడ్డి పావని, ఎంవీఐ రాములు పరిశీలించారు. బుధవారం రాత్రి జిల్లా ఎస్పీ అజిత ఏజెండ్ల ఘటన స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్‌ లొంగిపోయాడని మీడియాకు వెల్లడించారు. ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నదీ, లేనిదీ విచారిస్తామని చెప్పారు. కాగా, పోలీసుల అదుపులో ఉన్నది ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ కాదని, నకిలీ అని విశ్వసనీయ సమాచారం.మృతుల్లో తాళ్లూరు శ్రీనివాసులు, తాళ్లూరు రాధ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె ఇటీవల మృతి చెందడంతో ఆ బాధను దిగమింగుతూ కుమారుడిపై ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు. తల్లిదండ్రుల మృతితో కుమారుడు ఏకాకిగా మిగిలిపోయాడు. చల్లగొండ్ల శ్రీనివాసులు, చల్లగొండ్ల లక్ష్మి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారు ఇప్పుడు అనాథలుగా మిగిలిపోయారు. శేషం సారమ్మ, శేషం బాలవెంగయ్యల కుటుంబాల్లో తీవ్ర విషాధం నెలకొంది. శేషం బాలవెంగయ్య బేల్దారి పనులు చేసుకుంటూ తన ఇద్దరు కుమార్తెలను చదివించుకుంటున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆసరా కరువైంది.ఇసుక మాఫియా తీరుపై వైఎస్‌ జగన్‌ మండిపాటు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సాక్షి, అమరావతి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఇసుక మాఫియా వల్ల చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పాపం చంద్రబాబు ప్రభుత్వానిదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి­కైనా ఉచిత ఇసుక ముసు­గులో సాగిస్తున్న దందాను ఆపేయా­లని ప్రభు­త్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందంటూ మృతుల కుటుంబాలకు ప్రగా­ఢ­సా­ను­­భూతిని తెలియజేశారు. ‘నెల్లూరు’లో ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం సాక్షి, అమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.టిప్పర్‌ ఓనర్‌ మంత్రి ఆనం అనుచరుడేఏడుగురు మరణానికి కారణమైన టిప్పర్‌ (ఏపీ39­డబ్ల్యూహెచ్‌1695) మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏఎస్‌ పేట మండలం చిరమనకు చెందిన కాటం రెడ్డి రవీంద్రారెడ్డిదిగా గుర్తించారు. ఇసుక టిప్పర్‌ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టమవుతోంది. అతివేగంతో వస్తూ అదుపు చేయలేక కారును ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారును ఢీకొట్టిన వెంటనే డ్రైవర్‌ టిప్పర్‌ దిగి పారిపోయాడు. తెలుగుదేశం పార్టీ నేత టిప్పర్‌ కావడంతో కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement