ప్రధాన వార్తలు
ఏపీకి‘మోంథా’ముప్పు.. పార్టీ క్యాడర్ను అప్రమత్తం చేసిన వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రానికి మోంథా తుపాను ముప్పు ముంచుకొస్తుంది. మోంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ క్యాడర్ను అప్రమత్తం చేశారు.మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 28న తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసన ర్యాలీలు వాయిదా వేశారు. నవంబర్ 4 న ర్యాలీలను నిర్వహించాలని పేర్కొన్నారు.
ఆ ‘సింగిల్ మైండ్సెట్’ మస్క్ కంటే ధనవంతున్ని చేసింది!
బిలియనీర్, ఒరాకిల్ (Oracle) వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ (Larry Ellison) గురించి కొత్తగా వెలుగులోకి వచ్చిన వీడియో.. ఆయన విజయానికి మూలమైన వ్యక్తిత్వ లక్షణాన్ని బయటపెట్టింది. అదే “సాంప్రదాయ జ్ఞానాన్ని ప్రశ్నించే ధోరణి.” ఈ ధోరణి ఆయన్ను మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లింది. చివరికి ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఎలాన్ మస్క్ (Elon Musk) సంపదను కూడా అధిగమించే స్థితికి చేర్చింది.ఎల్లిసన్ తన విజయ రహస్యాన్ని వివరిస్తూ, “సాంప్రదాయ ఆలోచనలకు అనుగుణంగా ఉండకండి” అని సలహా ఇచ్చారు. నిపుణుల మాటలను కూడా గుడ్డిగా నమ్మకూడదని, అధికారాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. “నిపుణులు కాబట్టి వారిని అనుమానించకూడదు అనే భావన తప్పు” అని చెప్పిన ఎల్లిసన్, ఈ ఆలోచన పద్ధతి కొంత మందికి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో సంబంధాలను “చాలా బాధాకరంగా” మార్చవచ్చని కూడా అంగీకరించారు. అయినప్పటికీ, ఆయన దృష్టిలో ఉత్సుకత మానవ స్వభావంలోని అత్యంత విలువైన లక్షణం.సెయిల్ బోట్ల రేసింగ్ పట్ల ఆసక్తిని ప్రస్తావిస్తూ, ఎల్లిసన్ దాన్ని స్వీయ-ఆవిష్కరణకు ఒక రూపంగా వివరించారు. తన కెరీర్పై మాట్లాడిన ఎల్లిసన్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ (Microsoft) మధ్య పోటీ రోజులు తనకు స్వీయ అవగాహనను పెంచాయని తెలిపారు. “ప్రతిరోజూ నా గురించి కొత్త విషయాలు నేర్చుకుంటాను” అని చెప్పారు. ఎల్లిసన్ చివరగా చెప్పిన మాటలు ఆయన తత్వాన్ని స్పష్టంగా ప్రతిబింబించాయి. “నా జీవితంలో నేను ఎన్నో పనులు చేశాను. వాటికి జీతం లభించింది. కానీ ఆ పనులన్నీ ఒకే లక్ష్యానికి, స్వీయ ఆవిష్కరణకు దారితీశాయి” అన్నారు.ఇదీ చదవండి: కొడుకుతో వాచ్మెన్కు క్షమాపణ చెప్పించిన ముకేశ్ అంబానీLarry Ellison on success being directly correlated to questioning limits and conventional wisdom pic.twitter.com/gD87fTVxP8— prayingforexits 🏴☠️ (@mrexits) October 24, 2025
రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యద్భుతం
రంజీ ట్రోఫీ 2025-26 (Ranji Trophy) ఎడిషన్లో అద్భుతం జరిగింది. అస్సాం, సర్వీసస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ (Assam vs Services) కేవలం 90 ఓవర్లలోనే ముగిసింది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగంగా (బంతుల పరంగా) పూర్తైన మ్యాచ్ ఇదే.గతంలో ఈ రికార్డు 1961-62 ఎడిషన్లో ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పేరిట ఉండేది. ఈ మ్యాచ్ 547 బంతుల్లో ముగియగా.. అస్సాం-సర్వీసస్ మ్యాచ్ కేవలం 540 బంతుల్లోనే పూర్తైంది.అస్సామ్లోని టిన్సుకియా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ గ్రౌండ్లో నిన్న (అక్టోబర్ 25) మొదలైన ఈ మ్యాచ్ కేవలం నాలుగు సెషన్లలోనే (రెండో రోజు తొలి సెషన్) ముగిసింది. ఎలైట్ గ్రూప్-సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో అస్సాంపై సర్వీసస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అస్సాం తొలి ఇన్నింగ్స్లో 17.2 ఓవర్లు (103 ఆలౌట్), రెండో ఇన్నింగ్స్లో 29.3 ఓవర్లు (75 ఆలౌట్) ఆడగా.. సర్వీసస్ తొలి ఇన్నింగ్స్లో 29.2 ఓవర్లు (108 ఆలౌట్), రెండో ఇన్నింగ్స్లో 13.5 ఓవర్లు (73/2) ఆడింది.మ్యాచ్ మొత్తంలో ఇరు జట్లు కలిపి 359 పరుగులు చేశాయి. 32 వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాడు రియాన్ పరాగ్ (Riyan Parag) (అస్సాం) బంతితో అద్భుత ప్రదర్శనలు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 5, రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీశాడు.చరిత్రాత్మక హ్యాట్రిక్స్ఈ మ్యాచ్లో మరో అద్భుతం కూడా చోటు చేసుకుంది. సర్వీసస్ బౌలర్లు అర్జున్ శర్మ (లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్), మోహిత్ జాంగ్రా (లెఫ్ట్ ఆర్మ్ సీమర్) ఒకే ఇన్నింగ్స్లో (అస్సాం తొలి ఇన్నింగ్స్) హ్యాట్రిక్లు నమోదు చేశారు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో డబుల్ హ్యాట్రిక్లు నమోదు కావడం ఇదే తొలిసారి.ఇన్నింగ్స్ విశ్లేషణ:- అస్సాం తొలి ఇన్నింగ్స్: 103 పరుగులు (17.2 ఓవర్లు) టాప్ స్కోరర్: ప్రద్యున్ సైకియా – 52 - సర్వీసస్ తొలి ఇన్నింగ్స్: 108 పరుగులు (29.2 ఓవర్లు) అస్సాం బౌలర్ రియాన్ పరాగ్: కెరీర్ బెస్ట్ 5/25 - అస్సాం రెండో ఇన్నింగ్స్: 75 పరుగులు (29.3 ఓవర్లు) అర్జున్ శర్మ: 4/20 అమిత్ శుక్లా: 6 ఓవర్లు – 3 వికెట్లు – కేవలం 6 పరుగులు - సర్వీసస్ లక్ష్యం- 71 పరుగులు 13.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించిందిచదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..!
దేశ వ్యాప్త ‘SIR’కు సీఈసీ సన్నద్ధం.. రేపు కీలక మీడియా సమావేశం
ఢిల్లీ: ఇప్పటికే బిహార్ రాష్ట్రంలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యక సమగ్ర సవరణ-SIR(Special Intensive Revision) ను దేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతుంది.. దీనిలో రేపు(సోమవారం, అక్టోబర్ 27వ తేదీ) రాష్ట్రాల ‘SIR’ నిర్వహణ తేదీలను ప్రకటించే అవకాశాలు కనబుడుతున్నాయి. సుమారు 10 నుంచి 15 రాష్ట్రాలకు సర్ నిర్వహించే తదీలను ఖరారు చేయనుంది. ఇందులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాలు కూడా ఉండనున్నాయి. ఈ మేరకు సీఈసీ రేపు కీలక మీడియా సమావేశంలో ‘సర్’ నిర్వహణ రాష్ట్రాలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మీడియా సమావేశానికి సీఈసీ ఆహ్వారం పంపిన దరిమిలా ‘సర్’పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉండవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న లేదా జరగబోయే రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను ఇప్పుడే ప్రారంభించవద్దని నిర్ణయించింది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తలమునకలై ఉంటారు కనుక వాటికి జోలికి వెళ్లకుండా మిగతా రాష్ట్రాల్లో సర్ను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
మరో ప్రైవేటు స్లీపర్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
లక్నో: యూపీకి చెందిన ఓ ప్రైవేటు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డబుల్ డెక్కర్ ఏసీ స్లీపర్ బస్సులో మంటలు వ్యాపించినప్పటికీ డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం(అక్టోబర్ 26వ తేదీ) ఉదయం ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై వెళుతున్న సమయంలో ఓ ఏసీ స్లీపర్ బస్సు టైర్ల కింద నుంచి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్.. వెంటనే బస్సును ఆపేసి ప్రయాణికుల్ని కిందకు దించేశాడు. అదే సమయంలో పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని మంటల్ని అదుపు చేశారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం కానీ, గాయాల బారిన పడటం కానీ జరగలేదన్నారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా వస్తున్న సమయంలో జరిగినట్లు తెలిపారు. ఆ సమయంలో 39 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. టోల్ ప్లాజాకు 500 మీటర్ల దూరంగా ఉండగా బస్సులో మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు. బస్సు టైర్ల కింద నుంచి మంటలు రావడంతో దాన్ని రోడ్డుపైనే నిలిపేసిన డ్రైవర్ జగత్ సింగ్ చాలా చాక్యంగా వ్యవహరించినట్లు పోలీసులు ప్రశంసించారు. ఈ ప్రమాదం కారణంగా ఎక్స్ప్రెస్ వేపై చాలా సేపు ట్రాఫిక్ స్తంభించిందని, బస్సును అక్కడ నుంచి తొలగించిన తర్వాత ట్రాఫిక్ మళ్లీ యథావిధికి వచ్చినట్లు పేర్కొన్నారు పోలీసులు. लखनऊ आगरा एक्सप्रेस वे पर दिल्ली से आ रही डबल डेकर बस के पिछले पहिए में रेवरी टोल प्लाजा से पहले आग लग गई । जिससे पूरी बस धू धू कर जल गई। हालांकि बस में सवार 39 सवारी सुरक्षित रही। pic.twitter.com/jTkFQvdztM— Ajay Srivastav (@ajaysridj) October 26, 2025 A major accident was averted on the Lucknow-Agra Expressway early Sunday morning. A double-decker bus from #Delhi to Gonda caught fire after a tyre burst, but all passengers were safely evacuated before the flames engulfed the vehicle.(Video/Picture Courtesy : X) pic.twitter.com/wPERgIbV84— Deccan Chronicle (@DeccanChronicle) October 26, 2025
AP: కాకినాడ వైపు దూసుకొస్తున్న మోంథా తుపాను
ప.గో, కృష్ణా జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలుఒక్కో జిల్లాకు 30 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్రేపటి నుంచి 3 రోజుల పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించిన కలెక్టర్తుపాను నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు విజయవాడ: మోంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశంవాతావరణ హెచ్చరికల నేపధ్యంలో రేపట్నుంచి కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు27,28,29 తేదీల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన రెండు జిల్లాల కలెక్టర్లుజిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టల్స్ లోని విద్యార్ధులు ఇళ్లకు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలుకలెక్టర్ల ఆదేశాల మేరకు కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లోని హాస్టల్స్ నుంచి ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్ధులువిద్యార్ధులను ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులుగుంటూరు: కలెక్టర్ కార్యాలయంలో మోంథా తుఫాన్ దృష్ట్యా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రత్యేక అధికారి సిసోడియా,జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయాస్పెషల్ ఆఫీసర్ సిసోడియా కామెంట్స్రానున్న 3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందిఅధికారులను అప్రమత్తం చేసాంలోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసాంప్రభుత్వ పాఠశాల ల్లో 16 పునరావాస కేంద్రాల్లో అధికారులు వుంటారుతుఫాన్ కి ఎక్కువ నష్టం జరగకుండా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాంజిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా కామెంట్స్27,28,29 తేదీలలో భారీ వర్షం ఈదురుగాలులు ఉంటాయిగుంటూరు జిల్లాలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదు18 మండలాల్లో అధికారులు దగ్గరనుండి పర్యవేక్షణ చేస్తున్నారుప్రజల కోసం కంట్రోల్ నెంబర్ కూడా ఏర్పాటు చేసాంవ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలిరూరల్ ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాంఅత్యాసవసర పరిస్థితి ఉంటేనే ప్రజలు బయటకు రావాలికాలేజీ స్కూల్స్ అంగన్ వాడి కేంద్రాలు 3 రోజులు సెలవలు ప్రకటించాంప్రజలకు సమస్య ఉంటే తప్పకుండా కాల్ సెంటర్ కి కాల్ చేయండినగరంలో 12 లోతట్టు ప్రాంతాల ను తెలుసుకున్నాంప్రధానంగా ఉన్న పీకల వాగు పొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఏలూరు జిల్లా:ఏలూరు జిల్లాలో మోంథా తుఫాన్ ప్రభావం..ఈనెల27, 28న జిల్లాలో తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు ఉండే అవకాశంజిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలకు 27, 28 తేదీలలో సెలవువాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా అధికారులుగోదావరి నదిలోనికి పర్యాటక లాంచీలను నిలిపివేతజిల్లా, అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుఏలూరు జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ 9491041419, టోల్ ఫ్రీ నెంబర్ 18002331077ప్రజలకు అందుబాటులో గ్రామానికి ఒక నోడల్ అధికారి*తుఫాన్ తీవ్రతపై జిల్లా ఎస్పీతో కలిసి అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్విపశ్చిమ గోదావరి జిల్లామోంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ముందస్తు విస్తృత ఏర్పాట్లు.జిల్లా కలెక్టరేట్ తో పాటు ఆర్డీవో కార్యాల యాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు..జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్.. 08816 299219,భీమవరం ఆర్డీవో కార్యాలయంలో .. 98484 13739, 87907 31315,నరసాపురం ఆర్టీవో కార్యాలయంలో 93911 85874,తాడేపల్లి గూడెం ఆర్డీవో కార్యాలయంలో 93817 01036, 98497 12358కాకినాడ:మోంథా తుపాన్ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులురేపటి నుంచి ఐదు రోజులపాటు సెలవు ప్రకటించిన కలెక్టర్ాకాకినాడలో 14 పునరావాస కేంద్రాలు ఏర్పాటుకాకినాడ పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేతకాకినాడలో బీచ్లు మూసివేత విశాఖ:విశాఖ జిల్లాలో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవుసోమ, మంగళవారాలు స్కూళ్లకు సెలవుబాపట్లమోంథా తుపాన్ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులురేపటి నుంచి నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటించిన కలెక్టర్తుపాన్ ాకారణంగా బాపట్ల జిల్లాలోని బీచ్లు మూసివేతయాత్రికులు, భక్తులు బీచ్లకు రావొద్దని పోలీసుల హెచ్చరికలువిశాఖ:మోంథా తుపాన్ నేపథ్యంలో రైల్వే జోన్ హై అలెర్ట్రైల్వే వంతెనలు, పట్టాలు, యార్డులు, సిగ్నలింగ్ వ్యవస్థపై నిఘాఅత్యవసర సేవల కోసం రైళ్లు ిసిద్ధం చేసిన అధికారులుట్రాక్, సిగ్నలింగ్, విద్యుత్ పునరుద్ధరణ కోసం ప్రత్యేక బృందాలువిశాఖ, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటుతుపాను పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్న వాల్తేరు డీఆర్ఎమ్ ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. తీవ్రవాయుగుండంగా కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో వాయుగుండం కదిలింది. రాబోయే 24 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని.. మంగళవారం (అక్టోబర్ 28) ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 610 కి.మీ, చెన్నైకి 790 కి.మీ, విశాఖపట్నంకి 850 కి.మీ, కాకినాడకి 840 కి.మీ, గోపాల్పూర్ కి 950 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని.. రేపు, ఎల్లుండి(సోమ, మంగళ కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.మోంథా తుఫాన్.. కాకినాడ వైపు దూసుకొస్తోంది. అప్రమత్తమైన అధికారులు.. తుపాన్ను ఎదుర్కోనేందుకు సన్నద్ధమయ్యారు. కాకినాడ- ఉప్పాడ రోడ్డులో ఈనెల 30 వరకు రాకపోకలు నిలిపివేశారు. వాకలపూడి బీచ్, ఎన్టీఆర్ బీచ్ మూసివేశారు. హోప్ ఐలాండ్లో నివాసం ఉంటున్న మత్స్యకారులను తీరానికి తరలిస్తున్నారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అధికారులు, సిబ్బందికి సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. తుపాను సహయక చర్యల కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.అల్లూరి సీతారామరాజు జిల్లా: తుపాను ప్రభావంతో పాపికొండల విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాగులు వద్దకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. పర్యాటక ప్రాంతాలన్నీ తాత్కాలికంగా మూయించివేసిన పోలీసులు.. సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు.విజయవాడ: భారీవర్షాల నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ఈనెల 27, 28, 29వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 27, 28 ,29వ తేదీల్లో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. అన్ని సంక్షేమ హాస్టల్స్ లోని విద్యార్ధులు రేపు సాయంత్రంలోగా (ఈనెల 26) ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఆదేశాలిచ్చారు.
లొంగిపోయిన మరో 21 మంది మావోలు
రాయ్పూర్: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఆదివారం మరో 21 మంది మావోలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బస్తర్ రేంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లొంగిపోయిన మావోయిస్టులు కేశ్కాల్ డివిజన్ కుమారి, కిస్కోడా ఏరియా కమిటీ మావోయిస్టులని.. లొంగిపోయిన వారిలో కేశ్కాల్ డివిజన్ కమిటీ కార్యదర్శి ముకేష్, మావోయిస్టులు కుయెమారి/కిస్కోడో ఏరియా కమిటీ, కేశ్కల్ డివిజన్ (నార్త్ సబ్ జోనల్ బ్యూరో)కు చెందినవారు. వీరిలో డివిజన్ కమిటీ కార్యదర్శి ముకేశ్ ఉన్నారు. ఆయుధాలతో సహా లొంగిపోయిన మావోయిస్టుల్లో నాలుగు మంది డివిజన్ స్థాయి కమాండర్లు, తొమ్మిది మంది ఏరియా కమిటీ సభ్యులు ,ఎనిమిది మంది పార్టీ సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక 21 మంది మావోయిస్టుల్లో 13 మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు మూడు ఏకే-47 రైఫిళ్లు,నాలుగు ఎస్ఎల్ఆర్లు, రెండు ఇన్సాస్ రైఫిళ్లు, ఆరోనంబర్ 303 రైఫిళ్లు, రెండు సింగిల్ షాట్ రైఫిళ్లు, ఒక బీజీఎల్ ఆయుధాన్ని సరెండర్ చేసినట్లు బస్తర్రేంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ పీ సుందర్రాజ్ వెల్లడించారు.
మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ
ఇప్పటి జనరేషన్లో ఎంతమందికి 'మహాభారతం' గురించి తెలుసు? కచ్చితంగా చాలామందికి తెలిసి ఉండదు. ఎందుకంటే రీసెంట్ టైంలో దీని ఆధారంగా వచ్చిన సినిమాలు పెద్దగా లేవని చెప్పొచ్చు. ప్రభాస్ 'కల్కి'లో కర్ణుడు, అశ్వద్ధామ పాత్రల్నిచూపించినా సరే మహాభారతంని పెద్దగా టచ్ చేయలేదు. అలాంటిది మహాభారతంలో జరిగిన యుద్దం ఆధారంగా 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ సిరీస్ తీశారు. అక్టోబరు 10న తొమ్మిది ఎపిసోడ్స్తో తొలి సీజన్ రిలీజ్ కాగా ఇప్పుడు మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్ని రెండో సీజన్గా స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఇది ఎలా ఉంది? ప్రేక్షకుల్ని మెప్పించిందా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్)కథేంటి?'కురుక్షేత్ర' సంగ్రామంలో కౌరవ పక్షానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్న ద్రోణుడిని పాండవులు సంహరించడంతో తొలి సీజన్ ముగించారు. అక్కడి నుంచే రెండో సీజన్ మొదలైంది. మరి కౌరవుల కొత్త సైన్యాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కౌరవులు పక్షాన ఉన్న ధుర్యోధనుడు, కర్ణుడు, అశ్వద్ధామ, దుశ్శాసన.. పాండవుల పక్షాన ఉన్న అర్జునుడు, ధర్మరాజు, భీముడు తదితరుల మధ్య ఎలాంటి భీకర పోరాటం జరిగింది? అసలు ఈ కురుక్షేత్రం ఎలా మొదలైంది? ఎలా అంతమైంది? శ్రీకృష్ణుడు బోధించిన ధర్మ మార్గం, కర్మ ఫలితం ఏంటి? యుద్ధం ముగిసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర యుద్ధాన్ని.. ఈ సిరీస్ మేకర్స్ 18 ఎపిసోడ్స్గా తీశారు. తొలుత తొమ్మిది ఎపిసోడ్స్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సీన్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ప్రతిదీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తొలి సీజన్లో దాదాపు 15 రోజుల పాటు సాగిన యుద్ధాన్ని చూపించేశారు. రెండో సీజన్లో ఏం చూపిస్తారా అనే సందేహం వచ్చింది. కానీ మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్లో ఓవైపు యాక్షన్ చూపిస్తూనే మరోవైపు డ్రామాని కూడా అద్భుతంగా ఆవిష్కరించారు.కుంతి, కర్ణుడు, దుశ్శాసన, భీమ, అశ్వత్థామ, దుర్యోధన.. ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో ఎపిసోడ్ డిజైన్ చేశారు. అసలు వీళ్లు ఎవరు? ఈ యుద్ధంలో ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది? 'కురుక్షేత్ర'లో వీళ్ల పాత్ర ఏంటి? అనేది చక్కగా చూపించారు. పేరుకే యానిమేటెట్ సిరీస్ గానీ చూస్తున్నంతసేపు మహాభారతం కళ్లముందు కనిపిస్తుంది. నేరుగా యుద్ధాన్ని చూపించేసి సిరీస్ ముగించేస్తే పెద్దగా డ్రామా పండదు. 16వ ఎపిసోడ్లోనే యుద్ధం పూర్తయిపోతుంది. చివరి రెండు ఎపిసోడ్స్లో యుద్ధం తర్వాత పరిస్థితుల్ని ఆకట్టుకునేలా చూపించారు. 'స్త్రీ పర్వ' ఎపిసోడ్, అందులో వచ్చే డ్రామా, డైలాగ్స్ బాగుంటాయి. చివరి ఎపిసోడ్లో శ్రీ కృష్ణుడి పాత్రపై వచ్చే విజువల్స్.. సగటు సినీ ప్రేక్షకుడికి మంచి కిక్ ఇస్తాయి.ఇదివరకే మహాభారతం చూసినవాళ్లకు, తెలిసినవాళ్లకు ఈ సిరీస్ ఓకే అనిపించొచ్చు. కానీ మహాభారతం, కురుక్షేత్రం గురించి ఏ మాత్రం తెలియనవాళ్లకు మాత్రం బోలెడంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎందుకంటే కృష్ణుడు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు, కర్ణుడు, అశ్వత్థామ, దృతరాష్ట్రుడు, కుంతి, గాంధారి, ద్రౌపతి, దుర్యోధనుడు, దుశ్శానస.. ఇలా లెక్కలేనన్ని పాత్రలు ఉన్నాసరే అన్నింటి మధ్య కనెక్షన్స్, ఆయా విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి.రీసెంట్ టైంలో 'మహావతార్ నరసింహా' అనే యానిమేటెడ్ సినిమా.. దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. ఒకవేళ ఈ మూవీ గనక నచ్చితే 'కురుక్షేత్ర' సిరీస్ని అస్సలు మిస్ చేయొద్దు. పేరుకే 18 ఎపిసోడ్స్ గానీ ఒక్కొక్కటి 25-30 నిమిషాల నిడివితోనే ఉంటాయి. ఇలా మొదలుపెడితే అలా పూర్తయిపోతాయి. నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. వీలైతే పిల్లలకు కూడా చూపిస్తే 'మహాభారతం' గురించి వాళ్లకు కూడా బోలెడంత జ్ఞానం వస్తుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!)
చాదర్ఘాట్ ఘటన.. డీసీపీ చైతన్యను పరామర్శించిన డీజీపీ, సీపీ
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున నిన్న(శనివారం అక్టోబర్ 25) తుపాకీ కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. చాదర్ఘాట్లోని విక్టోరియా ప్లే గ్రౌండ్ జరిగిన ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్, ఆయన గన్మెన్ వీఎస్ఎన్ మూర్తిలను డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్ ఆదివారం మధ్యాహ్నం పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో వారిని పరామర్శించి.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.డీసీపీ, గన్మెన్ ధైర్య సాహసాలు కనబరిచారు : డీజీపీ శివధర్ రెడ్డినిన్న చాదర్ఘాట్లో పోలీసులపై మొబైల్ స్నాచర్లు దాడులు జరిపారు. సెల్ ఫోన్ స్నాచింగ్కి పాల్పడే వారిని పట్టుకునే క్రమంలో నిందితులు కత్తితో దాడి చేశారు. డీసీపీ చైతన్య కుమార్, గన్మెన్ మూర్తి 750 మీటర్లు నిందితులను చేజ్ చేశారు. అందులో భాగంగా నిందితులు కత్తితో దాడి చేశారు. నిందితుడు ఒమర్ అన్సారీ పై 22 కేసులు ఉన్నాయి. కలపథర్ పరిధిలో ఒమర్ అన్సారీపై రౌడీషీట్ ఉంది. ఈ ఆపరేషన్లో ధైర్యసాహసాలు కనబరిచిన డీసీపీ, గన్మెన్ ఆర్యోగ్య పరిస్థితి తెలుసుకున్నాను. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. డీసీపీ, కానిస్టేబుల్ రేపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నాం. నిందితుడు ఒమర్ అన్సారీకి ఆపరేషన్ జరిగింది. నిందితుడి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది.రౌడీ షీటర్లు, దొంగలపై ఉక్కుపాదం: సీపీ సజ్జనార్ఈ ఘటనలో ఇవోల్వ్ అయినా ఆటో డ్రైవర్, ఇంకో వ్యక్తిని పట్టుకోవడానికి డీసీపీ సౌత్ జోన్ నేతృత్వంలో టీమ్స్ పని చేస్తున్నాయి. కొన్ని క్లూస్ కూడా లభించాయి. ఇటీవల ఒమర్ కదలికలు, అతనికి ఉన్న పరిచయాలపై ఆరా తీస్తున్నాము. విజబుల్ పోలీసింగ్ కూడా పెంచాం. నగర ప్రజలు ఎవ్వరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. రౌడీ షీటర్లు, దొంగల పట్ల ఉక్కుపాదం మోపుతాం. మొబైల్ స్నాచింగ్ గ్యాంగ్స్పై కూడా నిఘా పటిష్టం చేశాం డీసీపీకి మెడ భాగంలో గాయమైంది. గన్ మెన్ మూర్తికి కాలు గాయం అయ్యింది. డ్రైవర్ సందీప్ అలర్ట్గా ఉండి కీలక పాత్ర పోషించారు. డీసీపీ చైతన్య, మూర్తి, డ్రైవర్ సందీప్ ముగ్గురు ధైర్యసాహసాలు చూపారు. ఐదు బృందాలు నిందితుల కోసం గలిస్తున్నాయి.అసలేం జరిగిందంటే..కరడుగట్టిన దొంగ అన్సారీ సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోతుండగా డీసీపీ చైతన్య గమనించి తన గన్మ్యాన్తో కలిసి పట్టుకునేందుకు ప్రయత్నించగా అన్సారీ తిరగబడి కత్తితో దాడి చేశాడు. ఆత్మ రక్షణ కోసం చైతన్యకుమార్ తన గన్ మ్యాన్ వద్ద ఉన్న తుపాకీని తీసుకొని కాల్పులు జరపడంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు.డీసీపీ, గన్మ్యాన్లకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ముగ్గురిని వేర్వేరు ఆస్పత్రుల్లో చేర్పించారు. ఘటనాస్థలిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ సందర్శించారు. తన కంట పడిన నేరగాడిని పట్టుకోవడానికి ఓ ఐపీఎస్ అధికారి ఛేజింగ్ చేయడం, కాల్పులు జరపడం నగర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి.
రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
మనం సరదాగా తినే కొన్ని రకాల స్నాక్స్ అనారోగ్యం బారినపడేందుకు కారణమవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి అందరూ ఇష్టంగా లాగించే సమోసా. నోరూరించే ఈ సమోసా కోసం ఆఫీసులకి వెళ్లేవాళ్ల దగ్గర నుంచి రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే చిన్న చితక వ్యాపారుల వరకు టీ టైంలో స్నాక్ ఐటెంగా తినే వంటకమే ఈ సమోసా. రూ.10 లేదా 20 వెచ్చించి కొనుక్కుని తినే దాంతో ఆస్పత్రిపాలై రూ. 3లక్షల అప్పు కొని తెచ్చుకుంటున్నామని హెచ్చరిస్తున్న గుండె వైద్యుడి పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఢిల్లీ కార్డియాలజిస్ట్ "అనారోగ్యకరమైన ఆఫీస్ స్నాక్స్ సమోసాతో సవంత్సరాలుగా ఎంత ఖర్చు పెడుతున్నాం. ఆ తర్వాత దాని కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్య కొని తెచ్చుకుని ఎంత అప్పులపాలవ్వుతున్నాం. " కళ్లకు కట్టినట్లుగా వివరించారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తెచ్చే చేటు అంత ఇంత కాదంటూ మండిపడుతున్నారు వైద్యులు. ప్రతి సాయంత్రం చాలామంది తీసుకుని సమోసా ధర మహా అయితే రూ. 20 ఉంటుందనుకుంటే..క్రమం తప్పకుండా తినేవాడికి 15 ఏళ్లకు 300 సార్లు తింటాడనుకుంటే..మొత్తం ఖర్చు రూ. 90,000 అవుతుంది. అంటే అనారోగ్యకరమైన ఆహారం కోసం అంతమొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నామే కానీ ఆదా చేయడం లేదు. ఇలా తినడం వల్ల గుండెల్లో కరోనరీ ధమనుల్లో సమస్య ఏర్పడి.. యాంజియోప్లాస్టీ చేయించుకునే పరిస్థితికి కొని తెచ్చుకుంటాం. అదేనండి స్టంట్ వేయించుకున్నాం అంటుంటారు కదా హార్ట్ పేషెంట్లు. అంటే సమోసాలు తిన్న ఫలితం హార్ట్ సర్జరీకి దారితీస్తుంది. దాని ఖర్చు రూ. 3 లక్షలు. అంటే అనారోగ్య ఆహారానికి ఖర్చు చేసే డబ్బుని ఆదా చేసినా ఆరోగ్యంగా ఉంటాం గానీ..తిని మరి యాంజియోప్లాస్టీ చికిత్స రూపంలో రూ. 3లక్షల అప్పుని కొని తెచ్చుకుంటున్నాం అంటూ ఆలోచింప చేసేలా..చాలా చక్కగా లెక్కలు వేసి వివిరించారు ఢిల్లీ కార్డియాలజిస్ట్. అంతేగాదు దాని ఫలితం ఎన్నో రోజులు భూమ్మీద ఉండే అవకాశం లేదనేలా పలు రకాల అనారోగ్య సమస్యల రూపంలో వార్నింగ్ ఇస్తుందట. సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా ఇలాంటి ఆహారపు అలవాట్లను దూరం చేసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండేలి అంటూ ప్రణాళికల దగ్గర ఆగిపోతే.. జీవితం మన కోసం ఆగిపోదు అనేది గ్రహించండి అని నొక్కి చెబుతున్నారు గుండె వైద్యులు. Office canteen samosa: ₹20Angioplasty: ₹3 lakhsSamosas per year: 300Years of eating: 15Total samosa cost: ₹90,000You're not saving money on unhealthy food.You're taking a loan against your arteries at 400% interest.— Dr Shailesh Singh (@drShaileshSingh) October 23, 2025 వ్యాయామం చేయాల్సిన ప్రాధాన్యత..అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉంటూ..వ్యాయామం వంటి అలవాట్లను కష్టంగా అనిపించినా..అవి దైనందిన లైఫ్లో రోటీన్గా ఎలా మారుతాయో వివరించారు వైద్యులు. ఒక వారం వ్యాయమాల వల్ల శారీర కష్టాలు అనుభవించి ఉండొచ్చు. కానీ కంటిన్యూగా చేస్తూ ఉంటే..నెలాఖరికిగా అదొక అలవాటుగా మారిపోవడమే గాక, చేయకపోవడమే తప్పుగా లేదా లోటుగా అనేలా మారుతుందని అన్నారు. (చదవండి: నీటికి బదులు బీర్! స్పెషల్ హైడ్రేషన్ స్టయిల్..)
ఆ ‘సింగిల్ మైండ్సెట్’ మస్క్ కంటే ధనవంతున్ని చేసింది!
ఈ పాన్ ఇండియా నటుడిని గుర్తుపట్టారా? బయోపిక్ కోసం ఇలా
దేశ వ్యాప్త ‘SIR’కు సీఈసీ సన్నద్ధం.. రేపు కీలక మీడియా సమావేశం
మరో సోషల్ మీడియా యాక్టివిస్టు అక్రమ అరెస్టు..
అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన కర్నూలు యువకుడు
ఇల్లా, ఫ్లాటా.. వాణిజ్య భవనాల్లో స్థలమా?
కర్నూలు బస్సు ప్రమాదం..19 మృత దేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తి
ఇంగ్లండ్ సునాయాస విజయం
రకుల్ అందం.. కృతిశెట్టి గ్లామర్.. చీరలో మంచు లక్ష్మీ
మళ్లీ ప్రాణం పోసుకున్న పునీత్ రాజ్కుమార్.. ఫ్యాన్స్తో మాట్లాడతాడు!
ఇవి జరిగితేనే.. బంగారం ధరలు తగ్గుతాయి!
బంగారం ధర 2026లో కొత్త రికార్డులు సృష్టిస్తుందా?
భారత్తో టీ20 సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన! విధ్వంసకర వీరుడు వచ్చేశాడు
పసిడి ధరలు రివర్స్! తులం బంగారం ఒక్కసారిగా..
ఈ రాశి వారు వాహనాలు, భూములు కొంటారు
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్
అర్రే, అలా దూకేసిందేంటి.. చూసుకోవాలి కదా మృగరాజా!
బిగ్బాస్ ఆదిరెడ్డి కూతురి బారసాల వేడుక (ఫొటోలు)
ఈ రాశి వారికి సంఘంలో గౌరవమర్యాదలు లభిస్తాయి.. భూలాభాలు
రెండోసారి తల్లి కాబోతున్న 'జయం' చైల్డ్ ఆర్టిస్ట్
రోహిత్ భయ్యా ఏ తప్పూ చేయలేదు.. నన్నెందుకు కెప్టెన్ చేశారు?
కళ్లు తిరిగి పడిపోయిన తనూజ.. ఆరుగురి రీఎంట్రీ !
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఇంకా మిరాయ్ జ్ఞాపకాల్లోనే రితికా నాయక్ (ఫోటోలు)
కర్నూలు ఘటన: బైకర్ శివశంకర్ వీడియో వైరల్
ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్
కర్నూలు ఘటన.. స్పందించిన ట్రావెల్స్ యాజమాన్యం
తండ్రి కాబోతున్న దగ్గుబాటి హీరో?
ప్లే ఆఫ్స్కు వేళాయె...
కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. పలువురి సజీవ దహనం
ఆ ‘సింగిల్ మైండ్సెట్’ మస్క్ కంటే ధనవంతున్ని చేసింది!
ఈ పాన్ ఇండియా నటుడిని గుర్తుపట్టారా? బయోపిక్ కోసం ఇలా
దేశ వ్యాప్త ‘SIR’కు సీఈసీ సన్నద్ధం.. రేపు కీలక మీడియా సమావేశం
మరో సోషల్ మీడియా యాక్టివిస్టు అక్రమ అరెస్టు..
అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన కర్నూలు యువకుడు
ఇల్లా, ఫ్లాటా.. వాణిజ్య భవనాల్లో స్థలమా?
కర్నూలు బస్సు ప్రమాదం..19 మృత దేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తి
ఇంగ్లండ్ సునాయాస విజయం
రకుల్ అందం.. కృతిశెట్టి గ్లామర్.. చీరలో మంచు లక్ష్మీ
మళ్లీ ప్రాణం పోసుకున్న పునీత్ రాజ్కుమార్.. ఫ్యాన్స్తో మాట్లాడతాడు!
ఇవి జరిగితేనే.. బంగారం ధరలు తగ్గుతాయి!
బంగారం ధర 2026లో కొత్త రికార్డులు సృష్టిస్తుందా?
భారత్తో టీ20 సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన! విధ్వంసకర వీరుడు వచ్చేశాడు
పసిడి ధరలు రివర్స్! తులం బంగారం ఒక్కసారిగా..
ఈ రాశి వారు వాహనాలు, భూములు కొంటారు
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్
ఈ రాశి వారికి సంఘంలో గౌరవమర్యాదలు లభిస్తాయి.. భూలాభాలు
రెండోసారి తల్లి కాబోతున్న 'జయం' చైల్డ్ ఆర్టిస్ట్
రోహిత్ భయ్యా ఏ తప్పూ చేయలేదు.. నన్నెందుకు కెప్టెన్ చేశారు?
కళ్లు తిరిగి పడిపోయిన తనూజ.. ఆరుగురి రీఎంట్రీ !
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
కర్నూలు ఘటన: బైకర్ శివశంకర్ వీడియో వైరల్
ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్
కర్నూలు ఘటన.. స్పందించిన ట్రావెల్స్ యాజమాన్యం
తండ్రి కాబోతున్న దగ్గుబాటి హీరో?
ప్లే ఆఫ్స్కు వేళాయె...
కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. పలువురి సజీవ దహనం
అవమాన భారంతో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్
కర్నూలు ప్రమాదంలో కొత్త కోణం!.. 400 ఫోన్లు పేలడం వల్లే మంటలు
అతడే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇకనైనా మారవా?
సినిమా
వందల కోట్లు పోగొట్టుకుంటోన్న ప్రభాస్.. కారణం ఇదేనట!
టాలీవుడ్ ‘డార్లింగ్’ ప్రభాస్(Prabhas) దక్షిణాది నుంచి తొలి గ్లోబల్ స్టార్ హీరో అనేది అందరికీ తెలిసిందే. దేశ విదేశాల్లో ప్రభాస్కి ఉన్న క్రేజ్ సామాన్యమైనది కాదు. బాహుబలి సిరీస్తో పాటు సలార్, కల్కి వంటి సినిమాలు ప్రభాస్ను సమకాలీన హీరోలకు అందనంత ఎత్తులో నిలబెట్టాయి. అయితే తన క్రేజ్ను ఆదరాబాదరా క్యాష్ చేసుకునే రెగ్యులర్ స్టార్స్కు భిన్నంగా అందివచ్చిన రూ.వందల కోట్లను మన రెబల్ స్టార్ పోగొట్టుకుంటున్నాడు. దీనికి తొలి బీజం బాహుబలి సినిమా సమయంలోనే పడిందని సమాచారం.’బాహుబలి 2: ది కన్ క్లూజన్’ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టినప్పటి నుంచీ, అనేక టాప్ బ్రాండ్లు ప్రభాస్ను వాణిజ్య ప్రకటనల కోసం ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆయనకి పెద్ద మొత్తంలోనే డబ్బు ఆఫర్ చేస్తున్నాయి. దుస్తులు, ఫుట్వేర్, ఎలక్ట్రానిక్ ఫిట్నెస్ రంగాలకు చెందిన బ్రాండ్ల నుంచి అతనికి అంబాసిడర్గా ఉండేందుకు వచ్చిన ఆఫర్లను కాదని, ఒక్క సంవత్సరంలోనే రూ.150 కోట్లకు పైగా విలువైన బ్రాండ్ ఎండార్స్మెంట్ ఆఫర్లను తిరస్కరించడం ద్వారా ప్రభాస్ సినీ పరిశ్రమతో పాటు వ్యాపార రంగాల వారినీ ఆశ్చర్యపరచాడు. గతంలో బాహుబలి 2 కోసం రూ. 10 కోట్ల విలువైన బ్రాండ్ ఎండార్స్మెంట్లను వదులుకున్నాడని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి వెల్లడించాడు. అయితే అనధికారికంగా ఆ సినిమా టైమ్లో ప్రభాస్ వదులకున్న ప్రకటనల విలువ రూ.80కోట్ల వరకూ ఉంటుందని అంచనా. తన లుక్లో మార్పు చేర్పులు చేసుకుంటే అది సినిమాకు నష్టం చేస్తుందనే ఆలోచనతోనే ఆయన అప్పట్లో వద్దనుకున్నాడట. ఆ తర్వాత కూడా అదే పంథా కొనసాగించాడు.మరోవైపు టాలీవుడ్లో ప్రభాస్ తో పాటు టాప్ ప్లేస్లో కొనసాగుతున్న మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు పెద్ద సంఖ్యలో ప్రకటనల్లో నటించడం గమనార్హం. ప్రభాస్ మాత్రం సమకాలీనుల మాదిరిగా కాకుండా వరుసగా అనేక ఆఫర్లను తిరస్కరిస్తూనే ఉన్నాడు. ఒక ప్రధాన కోలా కంపెనీ వివిధ ఆటోమొబైల్ ఎండార్స్మెంట్లతో సహా అగ్ర బ్రాండ్ల ఒప్పందాలను ఇటీవల ఆయన తిరస్కరించినట్లు సమాచారం. ‘ కేవలం మూడు రోజుల పనికి ప్రభాస్ రూ.25 కోట్లకు పైగా సంపాదించవచ్చు. ఒక రోజు ఫోటోషూట్ కోసం, మరొక రోజు వాణిజ్య ప్రకటన చిత్రీకరణ కోసం చివరి రోజు ప్రమోషన్స్ కోసం వెచ్చిస్తే సరిపోతుంది.‘ అని ఒక సెలబ్రిటీ మేనేజర్ వెల్లడించాడు. అయితే ‘ఈ బ్రాండ్ ఎండార్స్మెంట్లను తరచుగా అతను తిరస్కరించడానికి కారణం ఎండార్స్మెంట్లకు వ్యతిరేకమని కాదు. గతంలో బ్రాండ్లను ప్రమోట్ చేశాడు భవిష్యత్తులో కూడా చేస్తాడని, అయితే ఒక బ్రాండ్ను ఎండార్స్మెంట్ చేస్తున్నప్పుడు ఆచి తూచి వ్యవహరిస్తాడని సదరు మేనేజర్ తెలిపాడు. తన విలువలకు అనుగుణంగా తన ప్రేక్షకులతో అనుబంధాన్ని చెడగొట్టని బ్రాండ్లను మాత్రమే అత్యంత జాగ్రత్తగా ఎంచుకుంటాడని వివరించాడు. ఇంత వరకూ ఈ స్థాయిలో బ్రాండ్లను స్క్రూటినీ చేసే మరో స్టార్ను చూడలేదంటున్నాడు. ప్రస్తుతం ఒక అగ్రగామి వాహన కంపెనీకి, మరో మొబైల్కి మాత్రమే ప్రభాస్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు.రూ.వందల కోట్ల సంపద ఉన్నా మద్యం ప్రకటనల నుంచి పాన్ మసాలా ప్రకటనల దాకా ఏదైనా సరే సై అనే నటీనటులున్న ఈ రోజుల్లో... తద్భిన్నంగా పైసా వెనుక పరుగులు తీయకుండా రూ.వందల కోట్లను వద్దు అనుకుంటున్న ఏకైక స్టార్గా ప్రభాస్ తన వ్యక్తిత్వంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడని చెప్పొచ్చు.
ఓటీటీలోకి సూపర్ హీరోల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సూపర్ హీరో సినిమాలు అనగానే హాలీవుడ్లో మార్వెల్, డీసీ యూనివర్స్లే గుర్తొస్తాయి. కొన్నేళ్ల ముందు వరకు వీటి నుంచి అద్భుతమైన మూవీస్ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి అలాంటి రెస్పాన్స్ వచ్చేది. కానీ రీసెంట్ టైంలో మాత్రం చిత్రాలైతే వస్తున్నాయి గానీ అంతంత మాత్రంగానే ఆదరణ దక్కించుకుంటున్నాయి. అలా ఈ ఏడాది జూలైలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరోల మూవీ 'ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్'. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్ అయింది.జూలై 25న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాగా.. పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు ఎందుకనో పెద్దగా కలెక్షన్స్ సాధించలేకపోయింది. కొన్నిరోజుల ముందు రెంట్ విధానంలో ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు ఉచితంగానే నవంబర్ 5 నుంచి హాట్స్టార్లోకి రాబోతుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఒకవేళ సూపర్ హీరో జానర్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ట్రై చేయండి.(ఇదీ చదవండి: 9 నెలల పిల్లాడు.. దెయ్యమై పగ తీర్చుకుంటే?)'ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్' విషయానికొస్తే.. రీడ్ రిచర్డ్ (పెడ్రో పాస్కల్), స్యూ స్ట్రామ్ (వన్నెసా), జానీ స్ట్రామ్ (జోసెఫ్ క్విన్), బెన్ (మోస్ బాక్రాక్).. ఓ జట్టుగా ఉండే వీళ్లు ఆస్ట్రోనాట్స్. అందరూ వీళ్లని ఫెంటాస్టిక్ ఫోర్ అని పిలుస్తుంటారు. భూమిని ఎప్పుడూ కాపాడటమే వీళ్ల పని. స్యూ ప్రెగ్నెంట్ కావడంతో ఈమెకు పుట్టబోయే బిడ్డకు కూడా సూపర్ పవర్స్ వస్తాయా అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో గలాక్టస్ (రాల్ఫ్ ఇన్నేసన్) భూమిని అంతం చేయబోతున్నాడని తెలుస్తుంది. దీంతో ఇతడికోసం ఫెంటాస్టిక్ ఫోర్ వేట మొదలుపెడతారు.స్యూకి పుట్టబోయే బిడ్డని తనకు ఇస్తే.. భూమిని, మనుషుల్ని విడిచిపెడతానని గలాక్టస్ చెబుతారు. అప్పుడు స్యూ ఏం చేసింది? భూమ్మీదకు వచ్చిన గలాక్టస్ని ఫెంటాస్టిక్ ఫోర్ ఏం చేసింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పిల్లలతో తీసిన హారర్ సినిమా.. ఓటీటీ రివ్యూ)
డ్యూడ్ @ రూ.100 కోట్లు.. తెలుగు ప్రేక్షకుల వల్లే సాధ్యం!
‘‘డ్యూడ్’(Dude) సినిమా రూ. 100 కోట్లు వసూళ్లు దాటేసింది. నేను నటించిన ‘లవ్ టుడే, డ్రాగన్’ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంత ఆదరించారో... ‘డ్యూడ్’కి అంతకంటే ఎక్కువ ఆదరణ అందించారు. మీరు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నన్ను ఇంతలా ప్రోత్సహిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan ) చెప్పారు. ఆయన హీరోగా మమితా బైజు(Mamitha Baiju) హీరోయిన్గా నటించిన చిత్రం ‘డ్యూడ్’. శరత్కుమార్ కీలక పాత్ర పోషించారు. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. హైదరాబాద్లో నిర్వహించిన ‘డ్యూడ్ బ్లాక్ బస్టర్ 100 కోట్ల జర్నీ’ ఈవెంట్లో వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘డ్యూడ్’ విజయం చాలా ఆనందాన్నిచ్చింది. మా సినిమాకి అన్ని భాషల్లో అద్భుతమైన స్పందన వచ్చింది. మా సంస్థలో దర్శకులుగా పరిచయమైన భరత్ కమ్మ, నితీష్ రానా, బుచ్చిబాబు పెద్ద దర్శకులు అయ్యారు. ఈ జాబితాలో కీర్తీశ్వరన్ ఉండటం ఆనందంగాఉంది’’ అని తెలిపారు. ‘‘మా సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి కృతజ్ఞతలు’’ అని కీర్తీశ్వరన్ అన్నారు. నిర్మాత ఎస్కేఎన్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, రచయిత కృష్ణ మాట్లాడారు.
పసిబిడ్డను చంపేయమని అడిగా.. నాపై ఉమ్మేశారు!: కస్తూరి
ముక్కుసూటి వైఖరితో ఎప్పుడూ వివాదాల్లో నానుతూ ఉంటుంది నటి కస్తూరి శంకర్ (Kasthuri Shankar). తమిళనాడులోని అంతఃపురంలో సేవలు చేసేందుకు తెలుగువారు వచ్చారని.. అందులో కొందరు ఇప్పుడు తమిళులుగా చెలామణి అవుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ జైలుకు కూడా వెళ్లొచ్చింది. తాజాగా ఆమె తన సినీ జీవితం, జైలు జీవితం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిందిఅపార్థం చేసుకున్నారుకస్తూరి మాట్లాడుతూ.. 'నేను యాంకర్గా కెరీర్ ప్రారంభించాను. ఆ సమయంలో నాగార్జున షేక్హ్యాండ్ ఇచ్చారు. తర్వాత ఆయనతోనే అన్నమయ్య సినిమాలో నటించాను. అందుకు చాలా హ్యాపీ. గతేడాది నాకు అస్సలు కలిసిరాలేదు. ఓ రాజకీయ వేదికపై నేను చెప్పిన మాటల్ని ట్విస్ట్ చేసి వైరల్ చేశారు. నాపై నింద వేసి మరీ జైల్లో వేశారు. తెలుగు భాష అన్నా, ఇక్కడివారన్నా నా ఫ్యామిలీలాగా భావిస్తాను. ఆ అభిమానంతోనే ఇక్కడ సెటిలయ్యాను. అలాంటిది వీళ్లందరూ నన్ను అపార్థం చేసుకున్నారన్నదే నా పెద్ద బాధ!బ్లడ్ క్యాన్సర్సినిమాల్లో చూపించినట్లుగా జైలు జీవితం ఉండదు. జైలుకు వెళ్లిన రోజు నా జీవితంలోనే వరస్ట్. ఇకపోతే నా జీవితం అయిపోయింది అని బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మా అమ్మ ఆరోగ్యం బాగుచేయాలని ఆరేళ్లు కష్టపడ్డాం. కానీ చనిపోయింది. అమ్మ పోయిన ఐదు నెలలకే నాన్న మరణించాడు. తర్వాత మా అమ్మాయిని చావు అంచుల నుంచి బయటకు తీసుకొచ్చాం. తనకు బ్లడ్ క్యాన్సర్.. ట్రీట్మెంట్ పని చేయలేదు. ప్రపంచంలో 200 మందికి మాత్రమే వచ్చే అరుదైన బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. తనను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలన్నారు. అదే నాకు పెద్ద పరీక్ష, బాధ! నా కూతురి పేరిట మను మిషన్ అని ఓ స్వచ్చంద సంస్థను ప్రారంభించాను. రైల్వే ట్రాక్పై పసిబిడ్డ దొరికిందిఈ చారిటీ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఏదైనా బహుమతులు, దుస్తులు ఇవ్వడం లాంటి చిన్నచిన్న పనులు చేస్తుంటాం. అలా చేస్తుండగా ఓసారి రైల్వే ట్రాక్పై ఓ పసిబిడ్డను చూశాను. తనకు రెండేళ్లు.. కానీ చూసేందుకు ఐదు నెలల పిల్లాడిలా ఉంటాడు. రోడ్లపై అడుక్కోవడం కోసం ఆ చిన్నారిని ఎదగనివ్వలేదు. నోట్లో సారా పోసి పడుకోబెట్టేవారు. ఆ బిడ్డను అవసరమైనంతవరకు వాడుకుని తర్వాత రైల్వే ట్రాక్పై పడేశారు. ఆ బాబును ఆస్పత్రికి తీసుకెళ్తే కాలేయం పూర్తిగా పాడైందన్నారు.చావును ప్రసాదించమన్నా..మానసిక ఎదుగుదల లేదని చెప్పారు. వారంపాటు నేన ట్రీట్మెంట్ చేయించాను. ఏమాత్రం బెటర్మెంట్ లేకపోయేసరికి నేను ధైర్యం తెచ్చుకుని ఓ మాట అడిగాను. తనకు ఎదుగుదల లేనప్పుడు వైద్యం చేయించి ఇంకా నరకంలోకి తోయడం ఎందుకు? తనను మెర్సీ కిల్లింగ్(చావు ప్రసాదించడం)కి వదిలేయొచ్చుగా అని అడిగాను. అందుకు డాక్టర్.. అలా చావాలని రాసుంటే ఆకలిదప్పికలతో ఎప్పుడో చచ్చిపోయేవాడు. బతికున్నాడంటే అతడొక ఫైటర్. నాపై ఉమ్మేశారుతనను బతికించడం మా బాధ్యత అన్నారు. ప్రస్తుతానికైతే బాబు పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చావును మనం నిర్ణయించకూడదు. బతకడం మాత్రమే మన కర్తవ్యం అని చెప్పుకొచ్చిందిది. తనకు ఎదురైన ఓ చెత్త అనుభవం గురించి చెప్తూ.. ఓసారి దగ్గర్లో ఉన్న ఏటీఎమ్ కోసం నడుచుకుంటూ వెళ్లాను. ఇంతలో ఓ బస్సులో నుంచి ఒకరు నా మీద ఉమ్మేశారు అని తెలిపింది.చదవండి: 'రూ.2 కోట్లిస్తావా? ప్రైవేట్ వీడియోలు బయటపెట్టమంటావా?'
న్యూస్ పాడ్కాస్ట్
ముంచుకొస్తున్న సూపర్ సైక్లోన్... ఈ నెల 28న తీవ్ర తుఫానుగా బలపడనున్న ‘మొంథా’
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. 19 మంది సజీవ దహనం
అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు
విశాఖ అభివృద్ధి గురించి ఆలోచించింది జగనే..
ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం మాఫియా... లిక్కర్ దుకాణాలు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులు నడిపేది చంద్రబాబు మనుషులే... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
క్రెడిట్ చౌర్యంలో చంద్రబాబు సిద్ధహస్తుడు
చంద్రబాబు దిగిపోయాకే పెరిగిన ఐటీ ఎగుమతులు
గూగుల్ డేటా సెంటర్.. చంద్రబాబు రోల్ నిల్..
అదానీ పేరెందుకు ప్రస్తావించడం లేదు?
అక్రమ మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు ప్రభుత్వం బరితెగింపు.. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్లను అప్రూవర్లుగా మార్చే కుతంత్రం
క్రీడలు
అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..!
మహిళల వన్డే ప్రపంచకప్లో (women's Cricket World Cup) ఆస్ట్రేలియా (Australia Women's Cricket Team) ప్రస్తానం అద్వితీయంగా సాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు పూర్తైన 12 ఎడిషన్లలో ఏడు సార్లు ఛాంపియన్గా నిలిచింది. తద్వారా టోర్నీ చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డు కలిగి ఉంది.ఘన చరిత్ర కలిగిన ఆసీస్.. ప్రస్తుతం ఎనిమిదో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2025 ఎడిషన్లో ఓటమెరుగని ఏకైక జట్టుగా సెమీస్కు చేరింది. సెమీస్లో భారత్తో అమీతుమీకి సిద్దమైంది. ఈ మ్యాచ్ నవీ ముంబై వేదికగా అక్టోబర్ 30న జరుగనుంది. తొలి సెమీస్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా పోటీపడనున్నాయి. ఆసీస్ మరోసారి సెమీస్కు చేరిన నేపథ్యంలో ప్రపంచకప్లో ఆ జట్టు ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం.తొట్ట తొలి ఛాంపియన్ ఇంగ్లండ్ఈ మెగా టోర్నీ 1973లో (ఇంగ్లండ్లో) తొలిసారి జరిగింది. ఈ ఎడిషన్లో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి తొట్ట తొలి జగజ్జేతగా ఆవిర్భవించింది. 7 జట్లు పాల్గొన్న ఆ ఎడిషన్లో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచి రన్నరప్తో సరిపెట్టుకుంది. తొలిసారి జగజ్జేతభారత్ వేదికగా జరిగిన రెండో ఎడిషన్లో (1978) ఆస్ట్రేలియా తొలిసారి ఛాంపియన్గా నిలిచింది. ఈ ఎడిషన్లో ఆసీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి విజేతగా అవతరించింది. కేవలం నాలుగు జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్లో ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆతిథ్య భారత్ చివరి స్థానంతో సరిపెట్టుకుంది. భారత్కు ఇదే తొలి ప్రపంచకప్. రెండోసారిన్యూజిలాండ్ వేదికగా జరిగిన మూడో ఎడిషన్లో (1982) ఆస్ట్రేలియా రెండో సారి ఛాంపియన్గా నిలిచింది. రౌండ్ రాబిన్ ఫార్మాట్లోనే జరిగిన ఈ ఎడిషన్లో ఆసీస్ అజేయగా జట్టుగా నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్లోనూ ఇంగ్లండ్ రన్నరప్తో సరిపెట్టుకుంది. హ్యాట్రిక్స్వదేశంలో జరిగిన 1988లో ఎడిషన్లో ఆసీస్ మరోసారి ఛాంపియన్గా నిలిచి, హ్యాట్రిక్ సాధించింది. ఐదు జట్లుతో 60 ఓవర్ల ఫార్మాట్లో జరిగిన ఈ ఎడిషన్లోనూ ఇంగ్లండ్ రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో ఆసీస్ ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించి, ముచ్చటగా మూడో టైటిల్ ఎగరేసుకుపోయింది.తొలిసారి పరాభవం1993 ఎడిషన్లో ఆస్ట్రేలియా తొలిసారి ఫైనల్కు చేరలేకపోయింది. రౌండ్ రాబిన్ పద్దతిలో జరిగిన ఈ ఎడిషన్లో ఇంగ్లండ్ ఛాంపియన్గా, న్యూజిలాండ్ రన్నరప్గా నిలువగా.. ఆస్ట్రేలియా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ ఎడిషన్లో 8 జట్లు పాల్గొనగా భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.తిరిగి జగజ్జేతగా..1997లో భారత్ వేదికగా జరిగిన ఎడిషన్లో ఆస్ట్రేలియా తిరిగి జగజ్జేతగా ఆవిర్భవించింది. 11 జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్లో న్యూజిలాండ్ రన్నరప్గా నిలువగా.. భారత్ సెమీస్ వరకు చేరుకుంది.మూడు సార్లు పరాభవం తర్వాత..!మూడు సార్లు ఫైనల్లో పరాభవం తర్వాత న్యూజిలాండ్ తొలిసారి 2000 ఎడిషన్లో ఛాంపియన్గా అవతరించింది. స్వదేశంలో జరిగిన ఈ ఎడిషన్లో న్యూజిలాండ్ తిరుగులేని ఆధిపత్యం చలాయించి టైటిల్ను సొంతం చేసుకుంది. 8 జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్లో ఆస్ట్రేలియా రన్నరప్తో సరిపెట్టుకుంది.భారత్పై గెలిచి ఐదోసారిసౌతాఫ్రికా వేదికగా జరిగిన 2005 ఎడిషన్లో ఆస్ట్రేలియా ఐదోసారి జగజ్జేతగా ఆవతరించింది. ఫైనల్లో భారత్పై విజయం సాధించి, ఛాంపియన్గా అవతరించింది.ఊహించని పరాభవంస్వదేశంలో జరిగిన 2009 ఎడిషన్లో ఆసీస్కు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ ఎడిషన్లో ఆ జట్టు సూపర్ సిక్స్ దశను అధిగమించలేకపోయింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫైనల్కు చేరుకోగా.. ఇంగ్లండ్ తమ మూడో టైటిల్ను సొంతం చేసుకుంది.ఆరో టైటిల్భారత్ వేదికగా జరిగిన 2013 ఎడిషన్లో ఆస్ట్రేలియా తిరిగి పుంజుకొని ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో వెస్టిండీస్పై విజయం సాధించి ఆరో టైటిల్ను ఖాతాలో వేసుకుంది. ఈ ఎడిషన్లో భారత్ సూపర్ సిక్స్కు కూడా చేరలేకపోయింది.ఇంగ్లండ్ నాలుగోసారి..స్వదేశంలో జరిగిన 2017 ఎడిషన్లో ఇంగ్లండ్ విజేతగా అవతరించింది. ఫైనల్లో భారత్పై విజయం సాధించి, నాలుగసారి జగజ్జేతగా నిలిచింది.ఏడోసారి జగజ్జేతగా..న్యూజిలాండ్ వేదికగా జరిగిన 2022 ఎడిషన్లో ఆస్ట్రేలియా ఏడో సారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో ఇంగ్లండ్పై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్లో భారత్ నాకౌట్ దశకు చేరలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎడిషన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆసీస్ ఎనిమిదో టైటిల్పై కన్నేసింది. చదవండి: కేకేఆర్ హెడ్ కోచ్గా రోహిత్ శర్మ ఫిట్నెస్ గురు
కేకేఆర్ హెడ్ కోచ్గా రోహిత్ శర్మ ఫిట్నెస్ గురు
ఐపీఎల్ 2025లో నిరాశజనక ప్రదర్శన తర్వాత కోల్కతా నైట్రైడర్స్ (KKR) తమ ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్ను తప్పించింది. తాజాగా పండిట్ స్థానాన్ని మాజీ ముంబై ఆల్రౌండర్ అభిషేక్ నాయర్తో (Abhishek Nayar) భర్తీ చేసినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీ నిర్ణయాన్ని గత వారం నాయర్కు తెలియజేసినట్టు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.నాయర్ గతంలో కేకేఆర్ అకాడమీకి కీలకంగా పనిచేశాడు. ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో, వారి ప్రతిభను వెలికితీయడంలో అతని పాత్ర ముఖ్యమైంది. గత సంవత్సరం సహాయక సిబ్బందిగా కేకేఆర్లో చేరిన నాయర్, ఇప్పుడు ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు.42 ఏళ్ల నాయర్, ఇటీవల మహిళల ఐపీఎల్లో (WPL) యూపీ వారియర్జ్కు (UP Warriorz) హెడ్ కోచ్గా పనిచేశాడు. అతని కోచింగ్ శైలి వ్యక్తిగతంగా ఆటగాళ్లను ఫిట్నెస్, ఫామ్ పరంగా తిరిగి పుంజుకునేలా చేస్తుంది. నాయర్ ఇటీవలే టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మలో (Rohit Sharma) ఊహించిన ఫిట్నెస్ పరివర్తను తీసుకొచ్చాడు. నాయర్ సహకారంతో రోహిత్ ఏకంగా 10 కిలోల బరువు తగ్గి స్లిమ్గా తయారయ్యాడు. నాయర్ రోహిత్కు మంచి మిత్రుడు కూడా. నాయర్ రోహిత్కు మాత్రమే కాకుండా కేఎల్ రాహుల్ తదితర ఆటగాళ్లకు కూడా ఫిట్నెస్ గురుగా ఉన్నాడు.వ్యక్తిగత కోచ్గా, ఫిట్నెస్ గురుగా మంచి పేరున్న నాయర్ టీమిండియా అసిస్టెంట్ కోచ్గా మాత్రం రాణించలేకపోయాడు. ఇటీవలే బీసీసీఐ అతన్ని ఆ పదవి నుంచి తప్పించింది. టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ నియమితుడయ్యాక నాయర్ను ప్రత్యేకంగా తన బృందంలో చేర్చుకున్నాడు. అయితే జట్టు వైఫల్యాల కారణంగా నాయర్ ఎంతో కాలం భారత సహాయ కోచ్గా ఉండలేకపోయాడు.ఇదిలా ఉంటే, గత సీజన్లో కేకేఆర్ పేలవ ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్ల్లో కేవలం 5 విజయాలు మాత్రమే సాధించి, ప్లేఆఫ్స్కు చేరలేకపోయింది. తదుపరి సీజన్లో కేకేఆర్ నాయర్పై భారీ ఆశలు పెట్టుకుంది. కేకేఆర్ హెడ్ కోచ్ పదవిపై అధికారిక ప్రకటన వచ్చాక నాయర్ యూపీ వారియర్జ్ కోచ్గా కూడా కొనసాగుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.చదవండి: చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్కే కుప్పకూలిన న్యూజిలాండ్
చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్కే కుప్పకూలిన న్యూజిలాండ్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's WC 2025) ఇవాళ (అక్టోబర్ 26) ఉదయం మొదలైన నామమాత్రపు మ్యాచ్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు (England vs New Zealand) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 38.2 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది.ఇంగ్లండ్ బౌలర్లలో లిండ్సే స్మిత్ 3, కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్, అలైస్ క్యాప్సీ తలో 2, ఛార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ జార్జియా ప్లిమ్మర్ (43) టాప్ స్కోరర్గా నిలువగా.. అమేలియా కెర్ (35), కెప్టెన్ సోఫీ డివైన్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.సూజీ బేట్స్ 10, బ్రూక్ హ్యాలీడే 4, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గేజ్, జెస్ కెర్ 10, రోస్మేరీ మైర్ డకౌట్, లియా తహుహు 2 పరుగులకు ఔటయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ త్వరగా మ్యాచ్ ముగించే దిశగా సాగుతోంది. 10 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఇంగ్లండ్ గెలుపుకు మరో 119 పరుగులు కావాలి. యామీ జోన్స్ (20), ట్యామీ బేమౌంట్ (26) క్రీజ్లో ఉన్నారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో సెమీస్ బెర్త్లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఈ మెగా టోర్నీ ఫైనల్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది.చదవండి: హ్యారీ బ్రూక్ ఐకానిక్ శతకం వృధా
హ్యారీ బ్రూక్ ఐకానిక్ శతకం వృధా
న్యూజిలాండ్ పర్యటనలో ఇంగ్లండ్ తొలి ఓటమి ఎదుర్కొంది. తొలుత జరిగిన టీ20 సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న ఇంగ్లీష్ జట్టు.. మౌంట్ మాంగనూయ్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 26) జరిగిన తొలి వన్డేలో (New Zealand vs England) 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) ఐకానిక్ శతకం (101 బంతుల్లో 135; 9 ఫోర్లు, 11 సిక్సరు) కారణంగా గౌరవప్రదమైన స్కోర్ (35.2 ఓవర్లలో 223 ఆలౌట్) చేయగా.. న్యూజిలాండ్ 36.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో వెళ్లింది. రెండో వన్డే హ్యామిల్టన్ వేదికగా అక్టోబర్ 29న జరుగనుంది.బ్రూక్ ఐకానిక్ శతకంఈ మ్యాచ్లో బ్రూక్ చేసిన శతకం వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత క్రేజీయెస్ట్ శతకంగా చెప్పవచ్చు. బ్రూక్ తన జట్టును 56 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గౌరవప్రదమైన స్కోర్ వరకు చేర్చి పదో వికెట్గా వెనుదిరిగాడు.ఇంగ్లండ్ 166 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోగా ఆ సమయానికి బ్రూక్ స్కోర్ 86 పరుగులుగా ఉండింది. ఈ దశలో బ్రూక్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో బ్రూక్ ఒంటిచేత్తో ఇన్నింగ్స్ మొత్తాన్ని నడిపాడు. జేమీ ఓవర్టన్ (46) అతనికి కాస్త సహకించాడు. మిగతా ఇంగ్లండ్ బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.గెలిపించిన మిచెల్స్వల్ప లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ కూడా తడబడింది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును డారిల్ మిచెల్ (78 నాటౌట్), మైఖేల్ బ్రేస్వెల్ (51) ఆదుకున్నారు. ముఖ్యంగా మిచెల్ చివరి వరకు క్రీజ్లో నిలబడి న్యూజిలాండ్ను విజయతీరాలకు చేర్చాడు. మిచెల్కు బ్రేస్వెల్తో పాటు టామ్ లాథమ్ (24), మిచెల్ సాంట్నర్ (27) సహకరించారు. చదవండి: జీరో నుంచి హీరో.. యువ క్రికెటర్లకు రోల్ మోడల్! ఈ వీరుడి గురుంచి తెలుసా?
బిజినెస్
రియల్ కదలిక!.. పెరిగిన రిజిస్ట్రేషన్లు
రెండేళ్లుగా స్తబ్ధుగా ఉన్న రియల్ రంగంలో మళ్లీ కదలిక మొదలైంది. 2023 నవంబర్లో అసెంబ్లీ, 2024లో లోక్సభ ఎన్నికలకు తోడు అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం.. తర్వాత చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో వెలసిన నిర్మాణాల కూల్చివేతలతో భూముల క్రయవిక్రయాలు భారీగా తగ్గినప్పటికీ ఇటీవల మళ్లీ ఊపందుకోవడం రియల్ రంగానికి కొంత ఊరటనిస్తోంది.2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు జిల్లా వ్యాప్తంగా 2,48,189 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.3,893.26 కోట్ల ఆదాయం సమకూరింది. 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 2,41,297 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, వీటి ద్వారా రూ.3,911.87 కోట్ల ఆదాయం వచ్చింది. 2025 జనవరి నుంచి అక్టోబర్ 20 వరకు 1,98,766 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా ప్రభుత్వానికి రూ.3,381.12 కోట్ల ఆదాయం సమకూరింది.రాయదుర్గం భూముల వేలంతో..రాయదుర్గంలోని పలు భూములకు ఇటీవల హెచ్ఎండీఏ వేలం నిర్వహించగా బహిరంగ మార్కెట్లో ఎకరం ధర రూ.177 కోట్లు పలికిన విషయం తెలిసిందే. ఆర్థికమాంద్యం కారణంగా ఇప్పటి వరకు ఇక్కడ పెట్టుబడులకు కొంత వెనుకాడిన రియల్ సంస్థలు తాజా వేలంతో మళ్లీ జిల్లాపై దృష్టి సారించాయి.ఇదే సమయంలో ప్రభుత్వం మీర్ఖాన్పేట కేంద్రంగా 30 వేల ఎకరాల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి రూపకల్పన చేయడం, పరిశ్రమలకు అనువైన వా తావరణం కల్పిస్తుండటం తెలిసిందే. ప్రతిష్టాత్మక 550 బడా కంపెనీలను ఇక్కడికి తీసుకురావడమే లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించడం, రేడియల్ రోడ్లు, రింగు రోడ్లకు భూ సేకరణ ప్రక్రియను చేపట్టి, ఇప్పటికే ఆయా పనులకు శంకుస్థాపనలు చేయడంతో ఆయా పరిసరాల్లో భూముల కొనుగోళ్లకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు ఈ-వేలం: ఇదిగో ఫుల్ డీటెయిల్స్భవిష్యత్తులో ఇక్కడ భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో బడా రియల్టర్లే కాదు సాధారణ ప్రజలు కూడా తమ పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ముందే ప్లాట్లు, ఖాళీ స్థలాలు కొనిపెడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ జూలై, ఆగస్టు, సెపె్టంబర్లో రిజి్రస్టేషన్ల సంఖ్య కొంత పెరగడమే ఇందుకు నిదర్శనమని రిజి్రస్టేషన్స్ అండ్ స్టాంప్స్ విభాగం అధికారులు చెబుతున్నారు.
కంపెనీల ఆదాయం వృద్ధి: రంగాల వారీ పనితీరు ఇలా..
భారత కంపెనీల ఆదాయం, సెప్టెంబర్ త్రైమాసికంలో.. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే 5 - 6 శాతం పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. లాభదాయకత అర శాతం వరకు తగ్గొచ్చని తన తాజా నివేదికలో పేర్కొంది. నిర్వహణ మార్జిన్లు 0.60 శాతం తక్కువ నమోదు కావొచ్చని తెలిపింది. విద్యుత్, బొగ్గు, ఐటీ సేవలు, ఉక్కు రంగాల్లో మెరుగైన పనితీరు ఆదాయ వృద్ధికి అనుకూలిస్తుందని పేర్కొంది. 600 కంపెనీల పనితీరును విశ్లేషించి అనంతరం క్రిసిల్ రేటింగ్స్ ఈ వివరాలను విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ త్రైమాసికంతో పోల్చి చూస్తే కంపెనీల ఆదాయం ఒక శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది.రంగాల వారీ పనితీరు అంచనా..ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్స్, అల్యూమినియం రంగాల్లో పెరిగిపోయిన ముడిపదార్థాల వ్యయాలను కస్టమర్లకు పూర్తిగా బదిలీ చేసే విషయంలో కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో నిర్వహణ లాభాల మార్జిన్ 0.50–1 శాతం వరకు తగ్గొచ్చు.ఐటీ రంగంపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం కొనసాగుతోంది. ప్రాజెక్టులు వాయిదా పడుతుండడంతో ఆదాయ వృద్ధి ఒక శాతం మించకపోవచ్చు. స్టీల్ రంగంలో ఆదాయం 4 శాతం వరకు పెరగొచ్చు. ధరలు తగ్గడంతో అమ్మకాల పరిమాణం 9 శాతం అధికంగా ఉండొచ్చు.విద్యుత్ రంగంలో కంపెనీల ఆదాయం ఒక శాతం మెరుగుపడుతుంది. అధిక వర్షపాతంతో జలవిద్యుత్ తగినంత ఉత్పత్తి కావడం, పునరుత్పాదక విద్యుత్ 10 శాతం పెరగడం ఆదాయ వృద్ధిని పరిమితం చేయొచ్చు. దీంతో బొగ్గు రంగం ఆదాయం ఫ్లాట్గా ఉండొచ్చు. అమ్మకాలు 31 శాతం పెరగడంతో ట్రాక్టర్ల తయారీదారుల ఆదాయం 36 శాతం అధికం కావొచ్చు. ద్విచక్ర వాహన కంపెనీల ఆదాయం 9 శాతం (అమ్మకాలు 6 శాతం పెరగడం వల్ల) పెరగొచ్చు. టెలికం కంపెనీలు 7 శాతం వరకు ఆదాయంలో వృద్ధిని చూపించొచ్చు. చందాదారుల వృద్ధి ఫ్లాట్గా ఉన్నప్పటికీ, అధిక టారిఫ్లతో కూడిన ప్లాన్లు ఇందుకు అనుకూలిస్తాయి.సిమెంట్ అమ్మకాలు 6–7 శాతం వృద్ది చెందడంతో.. కంపెనీల ఆదాయం 8 శాతం వరకు పెరుగుతుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీల మార్జిన్లు 1.5–2 శాతం వరకు, అల్యూమినియం కంపెనీల మార్జిన్లు 1–1.5 శాతం వరకు తగ్గుతాయి. సిమెంట్, స్టీల్, టెలికం కంపెనీల మార్జిన్లు మెరుగుపడతాయి.గ్రామీణ ప్రాంతాల్లో సానుకూలత‘‘జీఎస్టీ రేట్ల క్రమబద్దీకరణతో కొత్త ఉత్పత్తులు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తాయన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్యాసింజర్ వాహనాలు, ఎఫ్ఎంసీజీ రంగంలో తాత్కాలిక అవరోధాలు నెలకొన్నాయి. రిటైలర్లు, పంపిణీదారులు ఎఫ్ఎంసీజీ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. అప్పటికే నిల్వలు ఉండడం, రిటైల్ అమ్మకాలు స్తబ్దుగా ఉండడం క్యూ2లో ప్యాసింజర్ వాహనాల డిమాండ్పై ప్రభావం చూపించింది. వర్షాలు సమృద్ధిగా పడడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించింది. ఖరీఫ్ పంటలకు మద్దతు ధరలను పెంచడంతో రైతుల్లో సానుకూల సిమెంట్ నెలకొంది. ఇది ట్రాక్టర్లు, ద్విచక్ర వాహన విక్రయాలు పెరిగేందుకు దారితీసింది’’అని క్రిసిల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పూషణ్ శర్మ తెలిపారు.
పెరిగిన ఐటీ నియామకాలు: వీరికే డిమాండ్!
కొన్నాళ్లుగా దేశీ ఐటీ రంగంలో నియామకాలు నెమ్మదించినప్పటికీ కాస్త కుదురుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఫ్రెషర్లు, మిడ్-సీనియర్ స్థాయి నిపుణుల రిక్రూట్మెంట్ రూపంలో నియామకాల ధోరణులు మెరుగుపడినట్లు హెచ్ఆర్ సొల్యూషన్స్ సంస్థ ఎడెకో ఇండియా ఒక నివేదికలో తెలిపింది.గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే క్యాంపస్ నియామకాలు 25 శాతం మేర పెరిగినట్లు ఎడెకో ఇండియా డైరెక్టర్ సంకేత్ చెంగప్ప తెలిపారు. అలాగే, ఐటీ దిగ్గజాలు కీలకమైన ఇంజినీరింగ్, టెక్నికల్ సంస్థలతో హైరింగ్పై మళ్లీ సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. ఇంజినీరింగ్, టెక్నికల్, ఏఐ ఉద్యోగాలకు డిమాండ్ 27 శాతం పెరిగింది. వేతన స్థాయులు కూడా 5 శాతం మేర పెరిగాయి. రెండో త్రైమాసికంలో ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలు, ఉద్యోగులకు నెలకొన్న డిమాండ్ను బట్టి ఈ నివేదిక రూపొందింది.మరిన్ని విశేషాలు..➤చాలా వరకు క్యాంపస్ రిక్రూట్మెంట్ హైదరాబాద్, బెంగళూరు, పుణె, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో జరుగుతోంది. విశాఖ, కోయంబత్తూర్, ఉదయ్పూర్, నాగ్పూర్లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో ప్లేస్మెంట్లు 7 శాతం పెరిగాయి.➤బెంచ్కే పరిమితం చేయకుండా ఫ్రెషర్ల నుంచి కూడా ఉత్పాదకత రాబట్టే విధమైన హైరింగ్కి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముందు రిక్రూట్ చేసుకుని, తర్వాత శిక్షణనిచ్చే సంప్రదాయానికి భిన్నంగా, ముందుగానే క్యాంపస్లను సంప్రదించడం ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత నియమించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి.➤ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్సెక్యూరిటీ, క్రాస్–డొమైన్ ఇంజినీర్స్, ఎంఆల్ఆప్స్ ఇంజినీర్స్, డేటా ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో డిమాండ్–సరఫరా మధ్య 45–50 శాతం మేర వ్యత్యాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ, డిమాండ్కి తగ్గట్లుగా హైరింగ్ చేపట్టడానికి మొగ్గు చూపుతున్నాయి.➤కంపెనీలు పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకోవడం కాకుండా, నైపుణ్యాలకే పెద్ద పీట వేస్తు న్నా యి. క్లౌడ్, డేటా, ఏఐ సామర్థ్యాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. క్యాంపస్ హైరింగ్ క్రమంగా పెరుగుతున్నప్పటికీ, మార్కెట్కి అవసరమైన ఇంజినీరింగ్ నైపుణ్యాలున్న వారు దొరకడం ప్రధాన సవాలుగా ఉంటోంది.➤భారీ టీమ్ల కన్నా అత్యంత ప్రభావవంతంగా, సత్ఫలితాలను చూపగలిగే చిన్న బృందాలను ఏర్పాటు చేసుకోవడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. కుదుర్చుకోబోయే డీల్స్, డెలివరీ లక్ష్యాల ఆధారంగా మాత్రమే వేరే సంస్థల నుంచి నిపుణులను నియమించుకుంటున్నాయి.➤ఎడెకో గణాంకాల ప్రకారం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, డెలివరీ లీడర్షిప్ ఉద్యోగాలకు సంబంధించి మిడ్–సీనియర్ స్థాయి ఉద్యోగుల రిక్రూట్మెంట్ 42 శాతం పెరిగింది. మూడో త్రైమాసికంలో ఐటీ హైరింగ్ జోరు 45 శాతం స్థాయిలో స్థిరపడొచ్చని అంచనా.ఇదీ చదవండి: ఆర్బీఐ మార్గదర్శకాలు.. పేటిఎం ఆఫ్లైన్ బిజినెస్ బదిలీ!
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్: హై-స్పీడ్ డేటా, ఫ్రీ కాలింగ్స్
జియో తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే.. హై-స్పీడ్ ఇంటర్నెట్ ఉపయోగించేవారు కొరకు.. మూడు అద్భుతమైన ఫ్యాక్స్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా డేటా మాత్రమే కాకుండా.. ఫ్రీ టీవీ ఛానెల్స్, ఓటీటీ యాప్లకు ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.రూ. 599 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడంతో.. మీకు 30Mbps ఇంటర్నెట్ వేగం.. 1000GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. ఫ్రీ వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. అంతే కాకుండా.. 800 కంటే ఎక్కువ టీవీ ఛానెల్లు, జియో హాట్స్టార్, సోనీ లివ్, జీ5 తో సహా 11 ఓటీటీ యాప్లకు యాక్సెస్ను పొందవచ్చు.రూ. 899 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ 100Mbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. 1000GB హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. కాగా ఈ ప్లాన్ 800కి పైగా టీవీ ఛానెల్లు, జియో హాట్స్టార్, సోనీ లివ్ & జీ5 తో సహా 11 ఓటీటీ యాప్లకు యాక్సెస్ పొందవచ్చు.రూ. 1199 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ 100Mbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. మీకు మొత్తం 1000GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో వస్తుంది. 800కి పైగా టీవీ ఛానెల్స్, నెట్ఫ్లిక్స్ (బేసిక్), అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్స్టార్తో సహా 15 ఓటీటీ యాప్లకు ఉచిత యాక్సెస్ కూడా పొందవచ్చు.ఇదీ చదవండి: అరట్టైను తెలుగులో ఎలా పిలవాలంటే?: శ్రీధర్ వెంబు
ఫ్యామిలీ
తిరిగొచ్చిన ఉంగరం! ఆరు దశాబ్దాలు జ్ఞాపకం..
నీదైతే ఎక్కడికెళ్లినా నీ దగ్గరకు వస్తుంది. నీది కాకపోతే ప్రపంచం మొత్తం వెతికినా తిరిగి రాదు.’ అన్నట్లు.. అచ్చం ఒక ఉంగరానికి జరిగింది. 1969లో న్యూయార్క్లోని సీడార్ బీచ్లో అల్ఫ్రెడ్ డి స్టెఫానో అనే వ్యక్తి ఒక రోజు ఈత కొడుతున్నప్పుడు, అతని విలువైన క్లాస్ రింగ్ జారి నీటిలో పడిపోయింది. సముద్రంలో పడ్డ ఆ ఉంగరం, ఇక ఎప్పటికీ దొరకదని భావించి, దానికి మనసులోనే ఫుల్స్టాప్ పెట్టేసుకున్నాడు. కాని, కాలం మరో అద్భుతాన్ని దాచిపెట్టింది. దాదాపు 56 ఏళ్ల తర్వాత, డేవిడ్ ఓర్లొవ్స్కీ అనే మరో వ్యక్తి, మెటల్ డిటెక్టర్ పట్టుకుని బీచ్లో నిధి నిక్షేపాల కోసం వెతుకుతుండగా, అనుకోకుండా ఆ ఉంగరం అతని చేతికి చిక్కింది. మొదట అది సాధారణ ఆభరణమేమోనని అనుకున్నాడు. కాని, దానిపై చెక్కి ఉన్న పేరు, కాలేజీ గుర్తు చూసి ఆశ్చర్యపోయాడు. అదే సమయానికి, అతని భార్య ‘నువ్వు నీ ఉంగరం కోల్పోతే, దొరికిన వారు తిరిగి ఇస్తే ఎంత ఆనందిస్తావు?’ అని ప్రశ్నించింది. భార్య మాటలు అతన్ని కదిలించాయి. వెంటనే, ఉంగరం అసలు యజమాని కోసం వెతకడం ప్రారంభించాడు. అలా సోషల్ మీడియా సహాయంతో ఫేస్బుక్లో గాలించి, చివరికి డి స్టెఫానోకు ఆ ఉంగరం చేరేలా చేశాడు. దాదాపు ఆరు దశాబ్దాలుగా దాచుకున్న జ్ఞాపకం అకస్మాత్తుగా తిరిగి చేతిలోకి రావడంతో అతని కళ్లలో ఆనందబాష్పాలు వెల్లువెత్తాయి. (చదవండి: నీటికి బదులు బీర్! స్పెషల్ హైడ్రేషన్ స్టయిల్..)
నీటికి బదులు బీర్!
ఒక్క రోజంతా నీరు తాగకుండా ఉంటే శరీరం మొత్తం డీహైడ్రేషన్ అయి, ఏ పని చేయలేం. కాని, అమెరికాకు చెందిన లోరీ మాత్రం ఎన్నో ఏళ్లుగా నీరే తాగడం లేదు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం! జిమ్లో రెండుసార్లు ఎక్కువ శ్రమ చేసి ఆసుపత్రిలో చేరినా, ఆమె నిర్ణయం ఏమాత్రం మారలేదు. సాదాసీదా నీటి కంటే కాఫీ, బీర్, రుచికరమైన పానీయాలే తనకు ఇష్టమని చెప్పేసి, లోరీ నీటిని పూర్తిగా మానేసింది. డాక్టర్లు దీన్ని ఒక మానసిక సమస్యగా చెప్తున్నారు. అందుకే ఆమె తనకంటూ ఓ ప్రత్యేకమైన హైడ్రేషన్ పద్ధతిని ఫిక్స్ చేసుకుంది. ఉదయం కాఫీతో మొదలు, మధ్యాహ్నం మరో కాఫీతో పాటు సాఫ్ట్ డ్రింక్స్, సాయంత్రం జిమ్ తర్వాత బీర్, రాత్రికి రెండు పుల్ల ఐస్క్రీమ్స్.. ఇదే ఆమె స్టయిల్. వీటన్నింటికీ రోజుకి దాదాపు నూటయాభై డాలర్లు, అంటే పదమూడు వేల రూపాయలకు పైగా ఖర్చవుతుంది. మంచినీరు తాగితే ఇంత ఖర్చు అవసరం లేదని తెలిసినా, ‘ఇవి నాకు నీటికి మించిన రుచితో హైడ్రేషన్ ఇస్తున్నాయి’ అని ఆమె సమర్థించుకుంటోంది. ఈ విషయం సోషల్ మీడియాలో తెలిసి కొందరు షాక్ అయ్యారు, కొందరు నవ్వుకున్నారు. కానీ లోరీ మాత్రం తన ప్రత్యేక హైడ్రేషన్ స్టయిల్కి కట్టుబడి, తనదైన రీతిలో ఆనందంగా జీవిస్తోంది. View this post on Instagram A post shared by 60 Second Docs (@60secdocs) (చదవండి: బియ్యపు గింజంత కంప్యూటర్!)
బియ్యపు గింజంత కంప్యూటర్!
ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు ఇవన్నీ పెద్దవిగా అనిపిస్తున్నాయా? అయితే రెడీగా ఉండండి! ఇప్పుడు ప్రపంచంలోనే అతి చిన్న కంప్యూటర్ వచ్చేసింది. అది కూడా ఒక బియ్యపు గింజ కంటే చిన్నది. అమెరికాలోని మిషిగన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని రూపొందించారు. కేవలం 0.3 మిల్లీమీటర్లు పరిమాణంలో ఉంటుంది. కాని, ఇది చేసే పనులు తెలిస్తే, పెద్ద పెద్ద కంప్యూటర్లు కూడా షాక్ అవుతున్నాయి. అంతేకాదు, ఈ సూక్ష్మ యంత్రాన్ని శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తే, ఇది క్యాన్సర్ కణాలను గమనిస్తుంది. క్యాన్సర్ కణితి లోపలి ఉష్ణోగ్రతను కొలుస్తుంది, ఇంకా డాక్టర్లకు రియల్టైమ్ డేటా పంపిస్తుంది. అంటే ఇది డాక్టర్ జేబులో దాగి ఉన్న గూఢచారిలా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇంకా పరిశోధన దశలో ఉన్న ఈ కంప్యూటర్, భవిష్యత్తులో పర్యావరణ పరిశీలన, భద్రతా సెన్సర్లు, ఇంకా మన ఊహలకు మించి ఉండే స్మార్ట్ పరికరాల్లోనూ తన మాయాజాలాన్ని చూపబోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (చదవండి: సూట్కేస్ ఓపెన్ చేస్తే.. లైట్ ఆన్!)
సూట్కేస్ ఓపెన్ చేస్తే.. లైట్ ఆన్!
సూట్కేస్లో బట్టలు కాదు, ఇప్పుడు బల్బులు వెలిగించే పవర్ను సర్దేయవచ్చు! అవును, చిన్న సూట్కేస్లా కనిపించే ఇది, నిజానికి ఒక విద్యుత్ ఉత్పత్తి యంత్రం. సాధారణంగా కరెంట్ జనరేటర్స్ మాదిరి వైర్లు, బల్బులు, ట్రాన్స్ఫార్మర్లు, జేబుకు చిల్లులు పడే బిల్లులు మాదిరి కాకుండా, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తూ, కొత్తగా జర్మనీ శాస్త్రవేత్తలు ఈ సూట్కేస్ సైజ్ టర్బైన్ను డిజైన్ చేశారు. ఇది నది లేదా వాగు దగ్గర పెట్టేస్తే చాలు, నీరు ప్రవహించగానే, కైనెటిక్ ఎనర్జీని ఉపయోగించుకొని, విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. డ్యామ్ లేదు, డ్యామేజ్ లేదు, కేవలం నీటి ప్రవాహమే దీని ఇంధనం. పైగా ఇది లైట్ వెయిట్. సెట్ చేయడం కూడా చాలా సింపుల్. ప్రవహించే నీటి పక్కన, సూట్కేస్ ఓపెన్ చేస్తే చాలు, రెండు గంటల్లో ‘లైట్ ఆన్!’ అవుతుంది. నీరు తక్కువగా ఉన్నా కూడా ఇది పనిచేస్తుంది. ఒక యూనిట్తో పది ఇళ్లు వెలుగుతాయి, రెండు యూనిట్లు పెట్టేస్తే ఊరంతా డిస్కో లైట్స్ ఆన్ చేయొచ్చు. ఇప్పటికే ఆసియా, ఆఫ్రికా, సౌత్ అమెరికాలో దీన్ని టెస్ట్ చేశారు. ఫలితం? సూపర్ హిట్! త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తే, గ్రామాలు, పల్లెలు అన్నీ ‘సూట్కేస్ పవర్ స్టేషన్’లుగా మారిపోతాయి. (చదవండి: నవ్విస్తూ కొనేలా చేశాడు!'యాడ్ గురు'..)
ఫొటోలు
దుబాయిలో ఫైట్ నైట్.. హీరోహీరోయిన్ సందడి (ఫొటోలు)
'రాజాసాబ్' బ్యూటీ మాళవిక హోమ్ టూర్ (ఫొటోలు)
నా బిడ్డ పుట్టి పదేళ్లు.. యాంకర్ రవి ఎమోషనల్ (ఫోటోలు)
హీరోయిన్ అమలాపాల్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తెలుగు సీరియల్ యాక్టర్స్ అరుణాచలం ట్రిప్ (ఫొటోలు)
నచ్చిన ఫుడ్ లాగించేస్తున్న విశ్వంభర బ్యూటీ (ఫోటోలు)
తిరుమలలో హీరో సుధీర్బాబు, డైరెక్టర్ వేణు కుటుంబం (ఫోటోలు)
నదియా @59.. సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
కూతురితో తిరుమలలో సురేఖ వాణి (ఫోటోలు)
సాగర తీరాన అద్భుత మాయా ప్రపంచం (ఫొటోలు)
అంతర్జాతీయం
కరీబియన్ జలాల్లో అమెరికా మళ్లీ దాడి
వాషింగ్టన్: కరీబియన్ సముద్ర జలాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ బోటుపై చేపట్టిన వైమానిక దాడిలో ఆరుగురు చనిపోయారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ శుక్రవారం తెలిపారు. వీరంతా వెనిజులా జైలు నుంచి నడుస్తున్న ట్రెన్ డె అరాగ్వా గ్యాంగ్కు చెందిన వారేనన్నారు. ఈ ప్రాంతంలోని నార్కో– టెర్రరిస్ట్ డ్రగ్స్ రవాణాదారులను అల్ఖైదా ఉగ్రవాదులుగానే భావిస్తామన్నారు. వారిని వెంటాడి వేటాడి చంపుతామని హెగ్సెత్ హెచ్చరించారు. తాజా ఘటనతో సెపె్టంబర్ నుంచి ఆ ప్రాంతంలో అమెరికా చేపట్టిన దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 43కు చేరుకుంది. ఇలా ఉండగా, దక్షిణ అమెరికా ప్రాంతంలోకి విమాన వాహక నౌకను పంపిస్తున్నట్లు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. గురువారం అమెరికా సైనిక సూపర్సోనిక్ హెవీ బాంబర్లు రెండు వెనిజులా తీరం వెంబడి చక్కర్లు కొట్టాయి. కరీబియన్ సముద్రం, వెనిజులా తీర వెంబడి అమెరికా బలగాల అసాధారణ మోహరింపులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో నార్కో టెర్రరిజమ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను గద్దె దించే లక్ష్యంతోనే ఇవన్నీ చోటుచేసుకుంటున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. డ్రగ్స్ రవాణా ఒక కారణం మాత్రమే కాగా, ఆయా దేశాలను బెదిరించి దారికి తెచ్చుకోవడమే అమెరికా అసలు లక్ష్యమని పరిశీలకులు అంటున్నారు.
ఇమ్రాన్ సోదరి పాస్పోర్టుపై నిషేధం
లాహోర్: జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ పాస్పోర్టు, గుర్తింపు కార్డు, బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయాలని రావ ల్పిండిలోని ఉగ్రవాద నిరోధక కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్లతో ఉగ్రవాద ఆరోపణలను ఎదుర్కొంటున్న అలీమా ఖాన్ విచారణకు రావాలంటూ పదేపదే పంపుతున్న నోటీసులను పట్టించుకోనందునే ఈ మేరకు ఆదేశాలిచి్చనట్లు కోర్టు తెలిపింది. అయితే, ఇతర కార్యక్రమాలు ఎక్కడున్నా తప్పకుండా హాజరయ్యే అలీమా ఖాన్..కోర్టుకు మాత్రం ఎందుకు రావడం లేదని విచారణ సందర్భంగా జడ్జి అంజాద్ అలీ షా ప్రశ్నించారు. కేసు విచారణను తదుపరి ఈ నెల 27వ తేదీకి వాయిదా వేస్తున్నామని, ఈ దఫా ఆమెను తప్పకుండా కోర్టులో హాజరుపర్చాలని అధికారులను ఆదేశించారు.
బాలల సాహిత్యానికీ బుకర్
లండన్: ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన సాహితీ పురస్కారాల్లో ఒకటైన బుకర్ ప్రైజ్ను అందించే బుకర్ ప్రైజ్ చారిటీ శుక్రవారం మరో విశేషమైన ప్రకటన చేసింది. బాలల సాహిత్యానికి బుకర్ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపింది. ‘ఈ సాహిత్యం 8– 12 ఏళ్ల వయస్సున్న పిల్లల కోసం రాసిన లేదా ఆంగ్లంలోకి అనువదించిన అత్యుత్తమ సమకాలీన కాల్పనిక సాహిత్యమై ఉండాలి. యూకే లేదా ఐర్లాండ్లో ప్రచురించినదై ఉండాలి’అని బుకర్ ప్రైజ్ చారిటీ తెలిపింది. ప్రముఖులతోపాటు పిల్లలే జడ్జీలుగా వ్యవహరిస్తూ విజేతను ఎంపిక చేస్తారని పేర్కొంది. ఎంపికైన రచయితకు చిల్డ్రన్స్ బుకర్ ప్రైజ్గా 50వేల పౌండ్లు, అంటే సుమారు రూ.58 లక్షలను అందజేస్తామని తెలిపింది.
‘ఖులా’ ద్వారా పెళ్లి రద్దు
ఇస్లామాబాద్: మహిళల హక్కుల విషయంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. ‘ఖులా’ద్వారా వివాహాన్ని రద్దు చేసుకొనే అధికారం మహిళలకు సైతం ఉందని తేలి్చచెప్పింది. భర్త శారీరకంగానే కాకుండా.. మానసికంగా కూడా వేధింపులకు గురిచేస్తే విడాకులు తీసుకోవచ్చని స్పష్టంచేసింది. ఖులా అనేది ఇస్లామిక్ ధర్మంలో ఒక భాగం. పురుషులకు తలాక్ హక్కు ఉన్నట్లుగానే మహిళలకు ఖులా హక్కు ఉంది. ఖులా హక్కును పాక్ సుప్రీంకోర్టు గుర్తించింది. మహిళా న్యాయమూర్తులైన జస్టిస్ ఆయేషా ఎం.మాలిక్, జస్టిస్ నయీం అఫ్గాన్తో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెబ్సైట్లో శుక్రవారం పొందుపర్చారు. భర్త మానసికంగా వేధిస్తుండడంతో ఓ మహిళ అతడితో వివాహాన్ని రద్దుచేసుకున్నారు. అయితే, షెషావర్ హైకోర్టు ఆమె నిర్ణయాన్ని తిరస్కరించింది. వివాహాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకోవడం కుదరదని, అందుకు భర్త అంగీకారం కూడా ఉండాలని పేర్కొంది. దాంతో పెషావర్ హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దాంతో బాధితురాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. పెషావర్ హైకోర్టు ఉత్తర్వును తప్పుపట్టింది. ఖులా అనేది మహిళల హక్కు అని, విడాకులు పొందాలనుకుంటే భర్త అంగీకారం అవసరం లేదని స్పష్టంచేసింది. క్రూరత్వం అనేది భౌతికమైన హింస రూపంలోనే కాకుండా మానసికంగానూ ఉండొచ్చని వెల్లడించింది. మానసికంగా హింసిస్తున్న భర్త నుంచి ఖులా ద్వారా విడిపోవచ్చని, అతడితో జరిగిన పెళ్లిని రద్దు చేసుకోవచ్చని ధర్మాసనం తీర్పు వెలువరించింది.
జాతీయం
బ్లడ్బ్యాంక్ నిర్వాకం.. ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్
రాంచీ: జార్ఖండ్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త మార్పిడి తర్వాత ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. హైకోర్టు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఉన్నతస్థాయి వైద్యబృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటన కారణంగా ప్రభుత్వం, రాష్ట్ర ఆరోగ్యశాఖపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. జార్ఖండ్లోని చాయ్బాసాలో స్థానిక బ్లడ్ బ్యాంకులో రక్తం ఎక్కించుకున్న తర్వాత తలసీమియాతో బాధపడుతున్న తమ ఏడేళ్ల కుమారుడికి హెచ్ఐవీ సోకిందని శుక్రవారం ఓ బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి వైద్యబృందాన్ని ఏర్పాటు చేసింది. ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల వైద్య బృందాన్ని విచారణకు పంపింది. శనివారం జరిగిన విచారణలో అదే ఆసుపత్రిలో తరచుగా రక్తం ఎక్కించుకుంటున్న తలసేమియాతో బాధపడుతున్న మరో నలుగురు పిల్లలకు కూడా హెచ్ఐవీ పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య ఐదుగురికి పెరిగింది.ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘తలసీమియా రోగికి కలుషిత రక్తం ఎక్కించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బ్లడ్ బ్యాంకులో కొన్ని లోపాలు ఉన్నట్లు విచారణ సందర్భంగా గుర్తించాం. లోపాలు సరిచేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాం’’ అని అన్నారు. ఈ అవకతవకలను వివరించే నివేదికను రాష్ట్ర ఆరోగ్య శాఖకు సమర్పించారు.అనంతరం, జిల్లా సివిల్ సర్జన్ డా. సుశాంత్ కుమార్ మాఝీ ఈ అంశంపై మాట్లాడారు. ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపించిందో తెలుసుకోవడానికి సమగ్ర విచారణ జరుగుతోందని అన్నారు. అయితే, ఇన్ఫెక్షన్ రక్త మార్పిడి ద్వారా మాత్రమే వచ్చిందని నిర్ధారించడం తొందరపాటు అవుతుందని, ఎందుకంటే కలుషితమైన సూదులు వంటి ఇతర కారణాల వల్ల కూడా హెచ్ఐవీ సంక్రమించవచ్చని ఆయన తెలిపారు.హైకోర్టు ఆగ్రహం..ఈ ఘటనను జార్ఖండ్ హైకోర్టు సీరియస్గా తీసుకుంది. ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి, జిల్లా సివిల్ సర్జన్ నుంచి ఈ విషయంపై నివేదిక కోరింది. ప్రస్తుతం అధికారిక రికార్డుల ప్రకారం, వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలో 515 హెచ్ఐవీ పాజిటివ్ కేసులు, 56 తలసేమియా రోగులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రక్త దాతలందరిని గుర్తించి వారి రక్త నమూనాలను మళ్లీ పరీక్షించాలని ఆదేశించింది.వ్యక్తిగత కక్ష కారణమా?అయితే, ఈ వ్యవహారంలో మరో కోణం వెలుగుచూసింది. మంజహరి జిల్లా పరిషత్ సభ్యుడు మాధవ్ చంద్ర కుంకల్ ఈ ఘటన వెనుక వ్యక్తిగత విద్వేషం కారణంగా ఉన్నట్లు ఆరోపించారు. రక్త బ్యాంక్ సిబ్బందికి, బాధితుల్లో ఓ బాలుడి బంధువులో ఒకరికి మధ్య ఏడాదికాలంగా కోర్టులో కేసు నడుస్తోందని ఆయన పేర్కొన్నారు.
‘మహారాష్ట్ర డాక్టర్’ కేసులో కీలక పరిణామం
పుణే/సతారా: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మహిళా ప్రభుత్వ వైద్యురాలి ఆత్మహత్య కేసులో నిందితుడైన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానేను శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అతని సహ నిందితుడు పట్టుబడిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఫల్తాన్ పోలీసుల బృందం పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్ను అరెస్టు చేసింది. వైద్యురాలు రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్న ఇద్దరు ఆరోపితులలో ప్రశాంత్ బంకర్ ఒకరు.సతారా ఎస్పీ తుషార్ దోషి తెలిపిన వివరాల ప్రకారం ఎస్ఐ బదానే ఫల్తాన్ గ్రామీణ పోలీసు స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. మరోవైపు బాధితురాలిని మానసికంగా వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రశాంత్ బంకర్ను సతారా జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనిని నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. మహారాష్ట్రలోని మరాఠ్వాడ పరిధిలోని బీడ్ జిల్లాకు చెందిన వైద్యురాలు గురువారం రాత్రి ఫల్తాన్ పట్టణంలోని ఒక హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలు తన అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్లో, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ బదానే తనపై పలుమార్టు అత్యాచారం చేశాడని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన బంకర్ తనను మానసికంగా వేధించాడని ఆరోపించారు. ఈ నేపధ్యంలో వీరిద్దరిపై కేసు నమోదైంది.పోలీసుల కథనం ప్రకారం ప్రశాంత్ బంకర్.. ఆ వైద్యురాలు ఉంటున్న ఇంటి యజమాని కుమారుడు. కేసు దర్యాప్తులో సబ్-ఇన్స్పెక్టర్ బదానే పేరు బయటకు రాగానే ఉన్నతాధికారులు ఆయనను సర్వీసు నుండి సస్పెండ్ చేశారు. కాగా ఈ కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఈ వేధింపులపై పలుమార్టు ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఆమె బంధువు మీడియా ముందు ఆరోపించారు. మహిళా వైద్యురాలిని వేధించిన ఎంపీని ఈ కేసులో నిందితునిగా చేర్చాలని బీజేపీ ఎమ్మెల్యే సురేష్ ధాస్ డిమాండ్ చేశారు. కాగా మృతురాలు తన ఎంబీబీఎస్ చదువు కోసం తీసుకున్న మూడు లక్షల రూపాయల రుణం ఇంకా తిరిగి చెల్లించలేదని ఆమె మామ మీడియాకు తెలిపారు.ఇది కూడా చదవండి: Singapore: విజిటర్ను వేధించిన భారత నర్సుకు జైలు
యాసిడ్ దాడి జరిగిన 28 ఏళ్లకు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం
షాజహాన్పూర్: పెళ్లిని రద్దు చేసుకున్నారనే కోపంతో ఓ యువకుడు, వధువు కావాల్సిన 15 ఏళ్ల బాలిక ముఖంపై యాసిడ్ పోశాడు. ఈ ఘోరం 1997 అక్టోబర్ 28వ తేదీన యూపీ రాజధాని లక్నోలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక ముఖమంతా కాలిపోయింది. చూపుమందగించింది. నేరానికి గాను పప్పు అనే నిందితుడికి జైలు శిక్ష పడింది. అయితే, బాధితురాలిది తీరని వ్యథ అయ్యింది. అప్పట్నుంచి ఆమె ముఖానికి పలు శస్త్రచికిత్సలు జరిగాయి. టైలర్గా పనిచేసే తండ్రి సంపాదించిందంతా ఆమె కోసమే ఖర్చు చేశాడు. అనంతర కాలంలో తల్లి,తండ్రి చనిపోయారు. తోబుట్టువులు వదిలేశారు. ఒంటరిగా బతుకు లాగుతోంది. ఆమె తరఫున బ్రేవ్ సౌల్స్ ఫౌండేషన్ అనే ఎన్జీవో పోరాడుతోంది. యాసిడ్ దాడి బాధితురాలికి అవసరమైన సాయం అందజేయాలని అధికారులు, నేతల చుట్టూ ఆ సంస్థ వ్యవస్థాపకురాలు షహీన్ మాలిక్ తిరుగుతూనే ఉన్నారు. బాధితురాలికిప్పుడు 43 ఏళ్లు. ఎట్టకేలకు, 28 ఏళ్లకు ఇటీవలే యూపీ ప్రభుత్వం రూ.4 లక్షలు అందజేసింది. కేంద్రం నుంచి గతేడాది రూ.లక్ష బాధితురాలికి అందాయి. అయితే, తాము న్యాయం కోసం హైకోర్టుకు వెళతామని, బాధితురాలికి రూ.50 లక్షలు పరిహారం అందించాలని కోరుతామని షహీన్ తెలిపారు. బాధితురాలు ఇప్పటికీ ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉన్నారన్నారు. ‘నా ముఖంతోపాటు జీవితం కూడా ఒక్క క్షణంలోనే నాశనమైపోయాయి. నా తల్లిదండ్రులు ఇప్పుడు లేరు. సోదరులు పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడిక కేవలం గౌరవంగా బతకాలని కోరుకుంటున్నా’అని బాధితురాలు ఆవేదన చెందుతున్నారు.
‘కీలక ఖనిజాల’పై పరిశోధనలకు మరింత ఊపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ భవిష్యత్ అవసరాలకు అత్యంత ముఖ్యమైన ‘కీలక ఖనిజాల’రంగంలో పరిశోధన, అభివృద్ధిని బలోపేతం చేసేందుకు కేంద్ర గనుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్సీఎంఎం) కింద మరో రెండు ప్రతిష్టాత్మక సంస్థలకు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’(సీఓఈ) హోదాను కల్పించింది. ఈ జాబితాలో హైదరాబాద్లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ–మెట్), బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) చేరాయి. దీంతో ఈ హోదా పొందిన మొత్తం సంస్థల సంఖ్య 9కి పెరిగింది. ఇటీవల కేంద్ర గనుల శాఖ కార్యదర్శి పియూష్ గోయల్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరందీకర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. గుర్తింపు పొందిన ఈ సంస్థలు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారిస్తాయి. ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక కన్సార్టియంగా పనిచేస్తుంది. ఇందులో కనీసం ఇద్దరు పరిశ్రమ భాగస్వాములను, ఇద్దరు ఆర్అండ్డీ/విద్యాసంస్థల భాగస్వాములు ఉంటారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల్లో జరిగే పరిశోధనల్లో కనీసం 90 పరిశ్రమలు, విద్యా/పరిశోధన సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని గనుల శాఖ తెలిపింది.
ఎన్ఆర్ఐ
శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా డబ్లిన్లో ఘనంగా దీపావళి వేడుకలు
ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని తెలుగు సంఘాలు, ముఖ్యంగా అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పూజలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఇవి సిలికాన్ వ్యాలీని కాంతిమయం చేశాయి. బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) కూడా మిల్పిటాస్లో వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలో సుమారు 25 వేలమందికి పాల్గొన్నారు. (చదవండి: టెక్సాస్ గవర్నర్ అధికార నివాసభవనంలో వైభవంగా దీపావళి వేడుకలు)
టెక్సాస్ గవర్నర్ అధికార నివాసభవనంలోవైభవంగా దీపావళి వేడుకలు
డాలస్, టెక్సాస్: టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ , సిసిలీయా అబ్బాట్ దంపతులు రాష్ట్రంలోని కొంతమంది ప్రవాస భారతీయనాయకులను ఆహ్వానించి, తమ అధికార నివాసభవనంలో దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. గత 11 సంవత్సరాలుగా ప్రతీ ఏడాదీ గవర్నర్ దంపతులు దీపావళి పండుగ జరుపుకోవడం విశేషం. గౌరవ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ దంపతులు వివిధరంగాలలో విశేషంగా కృషి చేస్తూ, టెక్సస్ రాష్ట్ర శరవేగ అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలతోపాటు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ వంటకాలతో దీపావళి విందు ఏర్పాట్లు చెయ్యడమేగాక అందరికీ దీపావళి కానుకలిచ్చి సత్కరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనురాగ్ జైన్ దంపతులు ఈ సంవత్సరపు దీపావళి వేడుక ఏర్పాట్లను సమన్వయపరచారు. గౌరవ కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా డి.సి మంజునాథ్ దంపతులు, టెక్సస్ రాష్ట్ర కార్యదర్శి జేన్ నెల్సన్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. టెక్సాస్ రాష్ట్రంలోని వివిధ నగరాలైన డాలస్, హూస్టన్, ఆస్టిన్, శాన్అంటానియో, కార్పస్ క్రిస్టీ, మిడ్ల్యాండ్, ఓడిస్సా మొదలైన నగరాలనుండి 100 మందికి పైగా పాల్గొన్న ప్రవాస భారతీయులలో ప్రవాసాంధ్రులైన డా. ప్రసాద్ తోటకూర, చిన సత్యం వీర్నపు, కుమార్ నందిగం, వెంకట్ ఏరుబండి, వెంకట్ గొట్టిపాటి, సతీష్ మండువ, నీలిమ గోనుగుంట్ల, ఆషా రెడ్డి, సుజిత్ ద్రాక్షారామ్, బంగార్ రెడ్డి, రాజ్ కళ్యాణ్ దుర్గ్ వారి కుటుంబ సభ్యులున్నారు.భారత అమెరికా దేశాలమధ్య సంభందాల బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ కు ప్రవాసభారతీయులందరి తరపున డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రవాసభారతీయుల ముఖ్యమైన అన్ని ఉత్సవాలకు హాజరయ్యే గవర్నర్ మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డాలస్ లో జరిగిన మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా హాజరైన సంఘటన గుర్తుచేసుకుని గవర్నర్ కు మరోసారి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.
H1b Visa: విదేశీ విద్యార్థులకు భారీ ఊరట
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. కొత్త H-1B వీసా దరఖాస్తులపై 100,000 డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్(USCIS) పేర్కొంది. హెచ్1బీ ఫీజు పెంపుపై స్పష్టత ఇచ్చే క్రమంలో పలు వివరాలను వెల్లడించింది.హెచ్-1బీ ఫీజు పెంపు కేవలం అమెరికా బయట నుంచి దరఖాస్తు చేసుకొన్నవారికే వర్తిస్తుందని పేర్కొంటూ అమెరికాలో చదువుకొంటున్న విద్యార్థులకు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ తీపి కబురు చెప్పింది. అలాగే.. ఫీజు పెంపు ప్రకటన వెలువడే సమయానికి అమెరికాలోనే ఉన్నవారికి మినహాయింపు వర్తిస్తుందని వెల్లడించింది.ఇదిలా ఉంటే.. 2025 సెప్టెంబర్ 19న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ప్రెసిడెన్షియల్ ప్రోక్లమేషన్’ విడుదల చేశారు. దీని ప్రకారం, కొత్త H-1B వీసా దరఖాస్తులపై $100,000 ఫీజు విధించబడుతుంది. ఈ ఫీజు 2025 సెప్టెంబర్ 21 నుంచి కొత్త H-1B వీసా పిటిషన్లకు వర్తించడం అమలైంది. అయితే.. USCIS అక్టోబర్ 20న ఫీజు అమలులో పారదర్శకత, మినహాయింపు విధానం, అర్హత ప్రమాణాలు గురించి వివరిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను తెలియజేసింది.మరోవైపు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ న్యాయవాది నికోల్ గునారా మాట్లాడుతూ.. F-1 (విద్యార్థి వీసా), L-1 (ఇంటర్కంపెనీ ట్రాన్స్ఫర్ వీసా) లబ్ధిదారులు ఈ భారీ ఫీజు నుంచి విముక్తి పొందారని తెలిపారు. ఇది విదేశీ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపశమనం కలిగించే నిర్ణయమని అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మార్పులు అమెరికాలో ఉన్న ఉద్యోగదారులకు, అలాగే విద్యార్థులకు.. ఇమ్మిగ్రేషన్ ఖర్చులను తగ్గించేందుకు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.భారత్ నుంచి వెళ్లే విద్యార్థులు ఎక్కువగా అమెరికాలో నుంచే H-1Bకి మారుతారు. కాబట్టి. ఈ భారీ ఫీజు వాళ్లు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నమాట.
లండన్ పార్లమెంట్లో పద్మశ్రీ గరికపాటికి సన్మానం
తెలుగు సంస్కృతి సంఘం ఆధ్వర్యంలో బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ ఎంపీ వీరేంద్ర శర్మ, వలేరి వాజ్ బ్రహ్మ శ్రీ, పద్మశ్రీ గరికపాటి నరసింహ రావు గారికి సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పద్మశ్రీ గరికపాటి నరసింహ రావుభారతీయ రచనలు, పాశ్చాత్య సాహిత్యానికి ఉన్న సంబంధాన్ని, సారూప్యతలను చాలా చక్కగా వివరించారు. గరికపాటి గారు రచించిన ఒషెన్ బ్లూస్ సముద్రం గురించి, ప్రముఖ రచయిత షేక్స్ పియర్ గురించి రాసిన కవితలు అద్భుతంగా వివరించారు.భారతీయ రచనలు, మంగళ ప్రదంగా మొదలై, మంగళ ప్రదంగా నడుస్తూ, మంగళ ప్రదంగా ముగుస్తాయి అని అద్భుతంగా వివరించారు.పాశ్చాత్య రచనల్లో అతి ప్రముఖమైన షేక్స్ పియర్ రచనలైన హామ్లెట్ వంటి రచనల్లో పాత్రధారుల అన్ని కోణాలు ఆవిష్కరించబడతాయని వివరించారు. లండన్ లోని గ్లోబ్ థియేటర్ లో షేక్స్ పియర్ గారి నాటకాలు ఎంత విజయవంతంగా ప్రదర్శించబడ్డాయో వివరించారు.ఈ కార్యక్రమంలో బిట్స్ వ్యవస్థాపకులు సురేష్ మంగళగిరి ,సభ్యులు రాగసుధా ,యశ్వంత్ నూక గారు, అశ్విన్, వాస భరత్ వాస, హర్ష మైనేని, రాజ్ దేవరపు, శరత్ తమ, సుభాష్ రెడ్డి, షణ్ముఖ్, సుదర్శన్ రెడ్డి, రంజిత్, కాటిపల్లి సచిందర్ రెడ్డి, వివేక్, జయా తులసి తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్
ఒంటరితనం భరించలేక.. యువతి ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : తల్లిదండ్రులిద్దరూ చిన్న తనంలోనే చనిపోయారు. ఊహ తెలిసిన నాటి నుంచి తోడుగా ఉంటున్న అక్క పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. ఒంటరి తనంతో మానసికంగా కుంగిపోయిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రొద్దుటూరులోని ఈశ్వర్రెడ్డినగర్లో చోటుచేసుకుంది. పల్లా మహేశ్వరి (26) అనే యువతి శుక్రవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈశ్వరరెడ్డినగర్కు చెందిన పల్లా కవిత, మహేశ్వరిలు అక్కా చెళ్లెల్లు. వీరి చిన్న తనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో మృతి చెందగా భర్త మరణాన్ని జీరి్ణంచుకోలేక తల్లి లక్ష్మీదేవి కూడా కొన్ని రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లను వారి తాత అయిన బడిగించల రామయ్య పెంచి పెద్ద చేశారు. మహేశ్వరి ఎంఎస్సీ వరకు చదువుకొని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తోంది. ఈ క్రమంలో కవితకు మూడు నెలల క్రితం వివాహం అయింది. ఆమె పెళ్లి చేసుకొని వెళ్లినప్పటి నుంచి మహేశ్వరి, ఆమె తాత రామయ్యలు ఉంటున్నారు. రామయ్య వృద్ధాప్యం కారణంగా ఇంటి వద్దనే ఉండేవాడు. అతని బాగోగులన్నీ చిన్న మనవరాలే చూసు కునేది. చిన్నతనం నుంచి తోడుగా ఉన్న అక్క పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లడంతో ఒంటరిని అయ్యాననే భావన మహేశ్వరిని తరచూ వేధిస్తుండేది.దీపావళికి చెల్లెలు వద్దకు వచ్చిన అక్క..చెల్లెలితో కలిసి దీపావళి పండుగ చేసుకోవడానికి కొత్త దంపతులిద్దరూ వారం రోజుల క్రితం ప్రొద్దుటూరులోని మహేశ్వరి ఇంటికి వచ్చారు. అక్క కవితతో కలిసి చెల్లెలు దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కవిత తన భర్తతో కలిసి పట్టణలోని గుడికి వెళ్లింది. ఆమె కొద్ది సేపటి తర్వాత ఇంటికి రాగా చెల్లెలు ఇంట్లో లేదు. ఫోన్ చేస్తే రింగ్ అవుతోంది కానీ ఆమె లిఫ్ట్ చేయలేదు. చుట్టు పక్కల చూసినా ఆమె కనిపించలేదు. దీంతో మేడపైన ఉన్న రేకుల ఇంట్లోకి వెళ్లి చూడగా మహేశ్వరి తాడుతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కిందికి దింపి చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యుడు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఒక్కగానొక్క తోడబుట్టిన చెల్లెలు దూరం కావడంతో ఆమె మృతదేహంపై పడి అక్క బోరున విలపించసాగింది. మృతురాలి అక్క కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు.
రేబిస్ వ్యాధితో బాలిక మృతి
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో వీధి కుక్క కాటుతో రేబిస్ వ్యాధి సోకి చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన లక్షణ (10)పై నెల కిందట వీధి కుక్క దాడి చేసింది. దీంతో కుక్క గోళ్లు గీరి తలలో చిన్న గాయం అయింది. భయంతో చిన్నారి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదు. అయితే మూడు రోజుల కిందట చిన్నారి కుక్కలాంటి అరుపులతో వింతగా ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలికకు తీవ్రమైన రేబిస్ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం బాలికను హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం బాలిక మృతి చెందింది.
హైదరాబాద్ నడిబొడ్డున కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్/సుల్తాన్ బజార్: హైదరాబాద్ నడిబొడ్డున శనివారం తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. నగరంలో కరడుగట్టిన దొంగ అన్సారీ ఈ కాల్పుల్లో గాయపడ్డాడు. సెల్ ఫోన్ చోరీచేసి అతడు పారి పోతుండగా సౌత్ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యకుమార్ గమనించి తన గన్మ్యాన్తో కలిసి పట్టుకునేందుకు ప్రయత్నించగా అన్సారీ తిరగబడి కత్తితో దాడి చేశాడు. ఆత్మరక్షణ కోసం చైతన్యకుమార్ తన గన్ మ్యాన్ వద్ద ఉన్న తుపాకీని తీసుకొని కాల్పులు జరపడంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు. డీసీపీ, గన్మ్యాన్లకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ముగ్గురిని వేర్వేరు ఆస్పత్రుల్లో చేర్పించారు. ఘటనాస్థలిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ సందర్శించారు. తన కంట పడిన నేరగాడిని పట్టుకోవడానికి ఓ ఐపీఎస్ అధికారి ఛేజింగ్ చేయడం, కాల్పులు జరపడం నగర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి.ఘరానా నేరగాడు మహ్మద్ ఒమర్ అన్సారీ...నగరంలోని కామాటిపుర ప్రాంతానికి చెందిన మహ్మద్ ఒమర్ అన్సారీపై టప్పాచబుత్ర, కామాటిపుర, మైలార్దేవ్పల్లి, శివరాంపల్లి, చార్మినార్, బహదూర్పుర, అఫ్జల్గంజ్, ఉప్పల్, హుస్సేనిఆలం, ఫలక్నుమా, కాలాపత్తర్ ఠాణాల్లో 20 కేసులు ఉన్నాయి. వీటిలో చైన్ స్నాచింగ్, చోరీ, బెదిరింపులు తదితర నేరాలపై నమోదైనవే అధికం. అతడిపై పోలీసులు గతంలో రెండుసార్లు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఆయా సందర్భాల్లో ఏడాది చొప్పున జైలులో గడిపి వచ్చినా అన్సారీ తన పంథా మార్చుకోలేదు. ఇటీవల మరో నిందితుడితో కలిసి సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్నాడు. రద్దీ ప్రాంతాలతో పాటు నిర్మానుష్యంగా ఉన్న చోటు మాటు వేసి అటుగా వచ్చే వారి సెల్ఫోన్లు లాక్కుపోతున్నాడు. ఇతడితో కలిసి నేరాలు చేస్తున్నది కూడా పాతబస్తీకి చెందిన పాత నేరగాడిగా తెలుస్తోంది. వీళ్లిద్దరూ పోలీసులకు మోస్ట్వాంటెడ్గా ఉన్నారు. నేరం చేస్తుండగా గుర్తించి.. 500 మీటర్లు వెంబడించి...నగరంలోని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా పని చేస్తున్న ఎస్.చైతన్య కుమార్ శనివారం మధ్యాహ్నం వ్యక్తిగత పనిపై సైదాబాద్లోని కార్యాలయం నుంచి బయటకు వెళ్లారు. సాయంత్రం సుల్తాన్బజార్ మీదుగా చాదర్ఘాట్ చౌరస్తా వైపు వస్తున్నారు. ఈయన వాహనం కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళ యూనివర్సిటీ వద్దకు చేరుకునే సమయానికి అన్సారీ, మరో నేరగాడితో కలిసి ఆటోలో వెళ్తున్న వ్యక్తి వద్ద సెల్ఫోన్ దొంగిలించి పారిపోతున్నారు. వారిని గమనించిన చైతన్యకుమార్ తన వాహనం నుంచి కిందకు దిగి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయన వెంటే గన్మ్యాన్ సైతం వాహనం నుంచి బయటకు వచ్చారు. వారిని తోసేసిన అన్సారీ, మరో నిందితుడు తలోదిక్కు పారిపోయారు. అన్సారీ ఇసామియా బజార్ మీదుగా పారిపోతుండగా డీసీపీ అతడిని ఛేజ్ చేసుకుంటూ విక్టోరియా ప్లే గ్రౌండ్ వరకు దాదాపు 500 మీటర్లు పరిగెత్తారు. ఆయన వెంటనే గన్మ్యాన్ కూడా వచ్చారు. అక్కడ ఓ భవనం ఎక్కిన అన్సారీ తప్పించుకునే అవకాశం లేకపోవడంతో ప్లేగ్రౌండ్స్లోకి దూకేశాడు. అతడి వెంటే డీసీపీ, గన్మ్యాన్ కూడా గ్రౌండ్లోకి దూకారు. అక్కడ తన వద్ద ఉన్న కత్తితో గన్మ్యాన్, డీసీపీపై అన్సారీ దాడికి ప్రయత్నించాడు. పెనుగులాట జరిగి ముగ్గురూ కిందపడిపోయారు. అదే సమయంతో కత్తితో రెచ్చిపోవడానికి ప్రయత్నించిన అన్సారీపై గన్మ్యాన్ తుపాకీతో డీసీపీ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ తూటాలు అన్సారీ చేయి, కడుపులోకి దూసుకుపోయాయి. తీవ్రగాయాలైన అన్సారీ కుప్పకూలిపోయాడు.ఆస్పత్రుల్లో చికిత్స...డీసీపీ చైతన్యకుమార్తో పాటు ఆయన గన్మ్యాన్కు స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. తీవ్రంగా గాయపడిన అన్సారీని బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అన్సారీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సుల్తాన్బజార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్సారీతో వచ్చి పరారైన మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఉదంతం తర్వాత నగర పోలీసు విభాగంలోని అధికారులు, సిబ్బందిలో అవసరమైన వారికి తుపాకులు జారీ చేయాలని కొత్వాల్ సజ్జనర్ నిర్ణయించారు. కేవలం మహిళలపై జరిగే నేరాల విషయంలోనే కాకుండా ప్రతి నేరగాడి విషయంలోనూ కఠినంగానే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నగరాన్ని నేర రహితంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కర్నూలు ప్రమాదం.. నెల్లూరు రమేష్ కుటుంబ సభ్యులు మృతి
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కుటుంబం మొత్తం సజీవ దహనమైంది. నెల్లూరుకు చెందిన రమేష్ సహా అతడి భార్య, పిల్లలు చనిపోయారు. దీంతో, వారి బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో నలుగురు నెల్లూరు జిల్లా వాసులు చనిపోయారు. వారిని వింజమూరు మండలం గోల్లవారిపాలెంకు చెందిన గోళ్ళ రమేష్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. వీరంతా హైదరాబాద్ వెళ్లి బెంగళూరు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గొల్ల రమేష్ (35), అనూష (30), మన్విత (10), మనీశ్ (12) మృతి చెందారు. బంధువులు ఘటనా స్థలికి చేరుకున్నారు.ఇక, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ డీడీ01ఎన్9490 బస్సులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి సమయంలో బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది(Kurnool Bus Accident). క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి.
వీడియోలు
యాష్ బాలీవుడ్ ఎంట్రీ.. షారుఖ్ సినిమాలో విలన్ గా ఛాన్స్!
అడ్డంగా దొరికిపోయిన బాబు..? ఎక్సైజ్ విచారణలో వెలుగులోకి సంచలన నిజాలు
70 కిలోలు తగ్గిన ఇద్దరు పిల్లల తల్లి.. ఆమె పాటించిన ఐదు సూత్రాలు ఇవే
తుఫాన్ వచ్చేస్తోంది.. తీర ప్రాంతం కొట్టుకుపోయేలా 3 రోజులు భారీ వర్షాలు
నెల్లూరు టీడీపీకి కోలుకోలేని దెబ్బ.. YSRCPలో భారీ చేరికలు
కొలికపూడి, కేశినేని చిన్నిపై పేర్నినాని ఫైర్
కూటమి ఖాతాలో మరో ఘనకార్యం.. ప్రమాదం వెనుక టీడీపీ నకిలీ మద్యం ?
అది ప్రమాదం కాదు.. కూటమి హత్యే..!
మద్యం కొంటున్న బైకర్.. CCTV వీడియో వైరల్
Janatantram: క్రెడిట్ చోరీ.. డెబిట్ బదిలీ






