అతడో పిల్ల చేప.. ‘ఆర్గాన్’ స్కాంలో తెలంగాణకు లింకులు!
కేరళ కేంద్రంగా ఇరాన్కు నడిచిన అవయవాల అక్రమ రవాణా కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మధు జయకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అంతర్జాతీయ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే మధు పిల్ల చేప మాత్రమేనని.. దీని వెనుక పెద్ద చేపలు చాలానే ఉన్నాయని.. త్వరలో ఆ వివరాలు బయటపెడతామని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కొచి కోర్టుకు బుధవారం నివేదించింది. ఈ కేసులో ఇరాన్ నుంచి వచ్చిన ఎర్నాకులం వాసి మధు జయకుమార్ను నవంబర్ 8వ తేదీన కొచి ఎయిర్పోర్టులో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అయితే.. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేరళతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్యులు ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యాయని తేలింది. అంతేకాదు ఒక్క మధునే ఇరాన్కు భారత్ నుంచి 14 మంది బాధితుల్ని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 2019 జనవరి నుండి 2024 మే మధ్య.. ఈ చానెల్ ద్వారా కేరళ నుంచి అనేక మందిని అక్రమంగా అవయవదానం కోసం తరలించినట్లు ఎన్ఐఎ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. కేసు కేవలం కేరళకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించిందని ఎన్ఐఏ వెల్లడించింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో కూడా ఈ రాకెట్ కార్యకలాపాలు నడుస్తున్నట్లు ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. అవయవాలు దానం చేసిన వాళ్లకు రూ.50 లక్షల దాకా ఆఫర్ చేసినట్లు బాధితుల వాంగ్మూలాన్ని ప్రస్తావించింది. మరోపక్క.. మధు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆసుపత్రులు, బాధితులు తదితర అంశాలపై విస్తృత దర్యాప్తు కొనసాగుతోంది.కిందటి ఏడాది మే నెలలో త్రిస్సూర్కు చెందిన సబిత్ నసర్(30) కొచి ఎయిర్పోర్టులో అధికారులకు పట్టుబడ్డాడు. ఇరాన్ నుంచి వయా కువైట్ ద్వారా అతను వచ్చాడని, మానవ అవయవాల రవాణా అక్రమ ముఠాతో అతనికి లింకులు ఉన్నట్లు తేలడంతో ఈ వ్యవహారం కలకలం రేపింది. తన ఆధ్వర్యంలో కిడ్నీ మార్పిడి కోసం 20 మందిని తీసుకెళ్లానని.. అందులో చాలా మంది ఉత్తర భారతానికి చెందిన వాళ్లు ఉన్నారని పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఎర్నాకులం పోలీసులు సిట్ ఏర్పాటు చేసి విచారణ జరపగా.. ఆ తర్వాత అది ఎన్ఐఏ చేతికి వెళ్లింది. కిందటి ఏడాది అగష్టులో ఎన్ఐఏ చార్జిషీట్ను దాఖలు చేసింది. మెడికల్ టూరిజం పేరిట అవయవాల అక్రమ రవాణా ముఠా నడిపించిన నలుగురు నిందితులు సబిత, సాజిత్ శ్యామ్, బెల్లంకొండ రాం ప్రసాద్, మధు జయకుమార్లను గుర్తించింది. ఇదంతా చట్టబద్ధమైన వ్యవహారమేనని బాధితులను నమ్మించి ఇరాన్కు తీసుకెళ్లినట్లు తేలింది. సోషల్ మీడియా, ఏజెన్సీల ద్వారా యువతను ఇందుకు లక్ష్యంగా చేసుకున్నట్లు నిర్ధారించుకుంది. అయితే అప్పటి నుంచి జయ కుమార్ పరారీలో ఉన్నాడు. అతను ఇరాన్లో ఉన్నాడనే సమాచారంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్పోల్ సాయంతో రెడ్కార్నర్ నోటీసును జారీ చేయించారు. చివరకు స్వదేశానికి వచ్చిన అతన్ని అరెస్ట్ చేయగా.. ఇందులో పెద్ద తలకాయలు ఉన్నట్లు చెబుతున్నాడు. దీంతో సమగ్ర దర్యాప్తు జరపాలని ఎన్ఐఏ భావిస్తోంది.
సబ్మరతి జైల్లో ఉగ్రవాది అహ్మద్పై దాడి.. ఆస్పత్రికి తరలింపు
గుజరాత్లో ఉగ్ర కుట్రకు సూత్రధారి, హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్పై దాడి జరిగింది. ప్రస్తుతం అహ్మదాబాద్ శివారులోని సబర్మతి జైలులో ఉన్న అతడిపై తోటి ఖైదీలు దాడి చేసి చితకబాదారు. ఈ దాడిలో అతని ముఖానికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. జోన్ 2 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అహ్మద్ సయ్యద్ను జైల్లోని హైసెక్యూరిటీ సెల్లో ఉంచారు. అయితే ఈ కేసులో తనతో పాటే అరెస్టైన అజాద్, సుహాయిల్తో సయ్యద్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో ముగ్గురు ఖైదీలు అనిల్ కుమార్, శివమ్ శర్మ, అంకిత్ లోడీ జోక్యం చేసుకుని సయ్యద్పై ఓ కర్రతో దాడికి దిగారు. ఈ దాడిలో సయ్యద్ ముఖానికి గాయాలు కావడంతో చికిత్స కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు చెందిన ఓ బృందం సబర్మతి జైలుకు చేరుకుంది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి.. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంది. దాడికి పాల్పడిన ఖైదీలు ఒకరు హత్య కేసులో నిందితుడు కాగా.. మరొకర ఆర్థిక నేరంలో, ఇంకొకరు పోక్సో కేసులో శిక్ష అనుభవిస్తున్నారుఅసలు దాడి ఎందుకు జరిగిందనే అంశంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల అనగా నవంబర్ 8న, గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. మొహియుద్దీన్.. ఐసీస్కు చెందిన ఓ డిపార్ట్మెంట్ అయిన.. ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ)కు చెందిన ఉగ్రవాదిగా దాదాపు నిర్ధారణ అయ్యింది. ఆముదం గింజల నుంచి విషం తయారు చేసి.. దాన్ని ప్రసాదంలో కలిపి.. అమాయకుల ప్రాణాలు తీయాలని భావించిన మొహియుద్దీన్ స్కెచ్ గీశాడు. చైనాలో ఎంబీబీఎస్ చదవిన మొహియుద్దీన్.. అబుల్ ఖాదీమ్ ఆదేశాల మేరకు ఆముదం గింజల నుంచి ప్రమాదకరమైన రైసిన్ అనే ప్రమాదకరమైన విషాన్ని తయారు చేయడానికి ఇంట్లోనే అన్ని పరికరాలు ఏర్పాటు చేసుకున్నాడు. అహ్మదాబాద్ ఏటీఎస్ అహ్మద్తో పాటు అరెస్టైన మరో ఇద్దరిని విచారించింది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొహియుద్దీన్.. మరో ఉగ్రవాది అబూ ఖాదీమ్ ఆదేశాల మేరకు పని చేస్తుంటాడని విచారణలో తెలిసింది. అబూ ఖాదీమ్ పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లో ఉండి ఈ మాడ్యూల్ను నడిపిస్తున్నాడని.. దర్యాప్తులో వెల్లడైంది.
నగరవాసులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: నగరవాసులకు సైబరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. శీతాకాలం పొగమంచుతో ప్రమాదాల ముప్పు పెరుగుతుండడంతో ఈ కింది సూచనలను, మార్గదర్శకాలను పాటించాలని బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.పాదాచారుల కోసం.. పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గిపోతుంది. ఇది ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంది. అందుకే పాదాచారులు అత్యవసరమైతే మాత్రమే రోడ్లపైకి రావాలి.ద్విచక్ర వాహనదారుల కోసంవేగం తగ్గించాలి.. పొగమంచు వల్ల ముందున్న వాహనాలు కనిపించకపోవచ్చు, అందుకే మిత వేగంతో ప్రయాణించాలి.లైట్లు ఆన్లో ఉంచాలి.. వాహనం ముందు -వెనుక లైట్లు ఆన్లో ఉంచడం ద్వారా ఇతర వాహనదారులకు మీరు కనిపించగలుగుతారు.రిఫ్లెక్టివ్ దుస్తులు ధరించాలి: ఇవి వెలుతురు పడినప్పుడు మెరుస్తాయి, తద్వారా మీరు స్పష్టంగా కనిపిస్తారు.హెల్మెట్ వైజర్ను శుభ్రంగా ఉంచాలి: పొగమంచు, తేమ వల్ల వైజర్ మసకబారవచ్చు. స్పష్టంగా కనిపించేందుకు తరచూ శుభ్రం చేయాలి. ORR (Outer Ring Road) & హైవేల్లో ప్రయాణించే వారికిలేన్ మార్చవద్దు: పొగమంచు వల్ల ఇతర వాహనాలు కనిపించకపోవచ్చు. లేన్ మారడం ప్రమాదకరం.బ్రేక్ సాఫీగా వాడాలి: అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల వెనుక వాహనాలు ఢీకొట్టే ప్రమాదం ఉంది.ఏమర్జెన్సీ పరిస్థితుల్లో ఎడమ లేన్లో వాహనం ఆపాలి: ఇది ఇతర వాహనాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అవసరం.ఈ మార్గదర్శకాలు, సూచనలు ప్రజల భద్రత, ప్రమాద నివారణ, రవాణా సౌకర్యం కోసం రూపొందించబడ్డాయడని సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం చెబుతోంది. పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉన్న ఉదయం, రాత్రి సమయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమని అంటోంది.
శబరిమలలో.. చిన్నారుల ట్రాకింగ్కు ‘వీఐ బ్యాండ్’
పథనంతిట్ట: శబరిమలలో రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు కేరళ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గడిచిన నాలుగు రోజుల్లో శబరిమలకు వచ్చిన భక్తుల్లో చిన్నారుల వాటా 15శాతంగా ఉండడంతో.. వారి భద్రతకు వొడఫోన్-ఐడియా(వీఐ)తో కలిసి సురక్ష బ్యాండ్లను ప్రవేశపెట్టారు. తప్పిపోయిన చిన్నారులను ట్రాక్ చేసేందుకు ఈ బ్యాండ్ ఉపయోగపడుతుంది. బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసులు, వీఐ ప్రతినిధులు ఆ బ్యాండ్లను ఆవిష్కరించారు. మండల, మకరవిళక్కు సీజన్లో సెల్ సిగ్నల్స్ మెరుగుపరిచేందేకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వీఐ ప్రతినిధులు తెలిపారు. నీలక్కల్, పంపా, శబరిమల, సన్నిధానం ప్రాంతాల్లో ప్రత్యేకంగా 13 సెల్టవర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతాల్లో వేగవంతమైన డేటా కనెక్టివిటీ ఉంటుందన్నారు. ఎక్కడా సెల్ సిగ్నల్ డ్రాపవ్వకుండా.. కనెక్టివిటీ ఉంటుందన్నారు. పిల్లల భద్రతకు ఇలా..చిన్నారులతో కలిసి వచ్చే అయ్యప్ప భక్తులు పంపాలోని ‘వీఐ సెక్యూరిటీ కియోస్క్’ల వద్ద సెక్యూరిటీ బ్యాండ్ను తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఈ బ్యాండ్ల కోసం రిజిస్టర్ అవ్వొచ్చు.కేరళలోని ప్రతి వీఐ స్టోర్లో చిన్నారుల సురక్ష బ్యాండ్లు లభ్యమవుతాయి.ఈ బ్యాండ్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ప్రతి బ్యాండ్కు ప్రత్యేక డిజిటల్ కోడ్/ఐడీ ఉంటుంది.ఒకవేళ ఈ బ్యాండ్ ఉన్న చిన్నారులు తప్పిపోతే.. వారిని ట్రాక్ చేసి, గుర్తించవచ్చని పథనంతిట్ట ఎస్పీ ఆనంద్ వెల్లడించారు.గత ఏడాది శబరిమల సీజన్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ బ్యాండ్లను ప్రవేశపెట్టామని, అవి సత్ఫలితాలనివ్వడంతో ఈ సారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.
ట్రేడ్ ఇంటెలిజెన్స్ పోర్టల్ ప్రారంభం
పని చేసేవారు ఒకరు.. లాభపడేవారు మరొకరు
పాకిస్తాన్కు దిమ్మతిరిగే షాకిచ్చిన నేపాల్
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
మీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేద్సార్!
వారణాసిలో తెలుగు డబ్బింగ్.. ప్రియాంక చోప్రా ఏమన్నారంటే?
డేటా సెంటర్ల ఏర్పాటులో సవాళ్లు.. భారత్ ఏం చేయాలంటే..
2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు
రికార్డులు కొల్లగొట్టిన హోప్
భారత్తో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి పాక్ మంత్రి
తగ్గిన ధరలు: పసిడి ఊరట.. వెండి పతనం
సజ్జనార్ సార్కు నా రిక్వెస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మడి రవి నాన్న
ఉదయం 5 గంటలకు ఈమెయిల్..
ఇమ్మడి రవి అరెస్ట్లో బిగ్ ట్విస్ట్.. ఐ-బొమ్మ నుంచి మరో మెసేజ్!
దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు
రూ.750 కోట్లతో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్.. ఎక్కడంటే..
వారణాసి టైటిల్.. రాజమౌళికి బిగ్ షాక్!
లాభాలతో పాటు గౌరవాన్ని తెచ్చిపెట్టిన సినిమా
సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?.. ఉపాసనపై నెటిజన్ల ఫైర్!
రాజకీయాలతో పాటు కుటుంబంతో కూడా సంబంధాలను తెంచుకున్న లాలూ కుమార్తె రోహిణి
ఈ రాశి వారికి ఉద్యోగయోగం.. ధనప్రాప్తి.. యత్నకార్యసిద్ధి
'దమ్ము ఉంటే పట్టుకోండి' అన్నాడు.. పైరసీపై చిరంజీవి వ్యాఖ్యలు
అభివృద్ధి కోసమే అప్పులు తెస్తున్నామని ప్రభుత్వాలు అంటుంటే.. ఏంటో అనుకున్నా!!
టీమిండియాకు భారీ షాక్..! స్టార్ ప్లేయర్కు మళ్లీ పిలుపు
శుబ్మన్ గిల్ స్థానంలో ఊహించని ఆటగాడు!
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. కార్యజయం
ఐబొమ్మ ఇమ్మడి రవికి మరో బిగ్ షాక్!
ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన రైళ్లన్నీ ఫుల్!
అంటే అవి మనం వేశామనా? వీళ్ల ఉద్దేశం!!
లోపల తీవ్రంగా చర్చించుకుంటున్నారు!
ట్రేడ్ ఇంటెలిజెన్స్ పోర్టల్ ప్రారంభం
పని చేసేవారు ఒకరు.. లాభపడేవారు మరొకరు
పాకిస్తాన్కు దిమ్మతిరిగే షాకిచ్చిన నేపాల్
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
మీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేద్సార్!
వారణాసిలో తెలుగు డబ్బింగ్.. ప్రియాంక చోప్రా ఏమన్నారంటే?
డేటా సెంటర్ల ఏర్పాటులో సవాళ్లు.. భారత్ ఏం చేయాలంటే..
2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు
రికార్డులు కొల్లగొట్టిన హోప్
భారత్తో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి పాక్ మంత్రి
తగ్గిన ధరలు: పసిడి ఊరట.. వెండి పతనం
సజ్జనార్ సార్కు నా రిక్వెస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మడి రవి నాన్న
ఉదయం 5 గంటలకు ఈమెయిల్..
ఇమ్మడి రవి అరెస్ట్లో బిగ్ ట్విస్ట్.. ఐ-బొమ్మ నుంచి మరో మెసేజ్!
దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు
రూ.750 కోట్లతో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్.. ఎక్కడంటే..
వారణాసి టైటిల్.. రాజమౌళికి బిగ్ షాక్!
లాభాలతో పాటు గౌరవాన్ని తెచ్చిపెట్టిన సినిమా
సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?.. ఉపాసనపై నెటిజన్ల ఫైర్!
రాజకీయాలతో పాటు కుటుంబంతో కూడా సంబంధాలను తెంచుకున్న లాలూ కుమార్తె రోహిణి
ఈ రాశి వారికి ఉద్యోగయోగం.. ధనప్రాప్తి.. యత్నకార్యసిద్ధి
'దమ్ము ఉంటే పట్టుకోండి' అన్నాడు.. పైరసీపై చిరంజీవి వ్యాఖ్యలు
అభివృద్ధి కోసమే అప్పులు తెస్తున్నామని ప్రభుత్వాలు అంటుంటే.. ఏంటో అనుకున్నా!!
శుబ్మన్ గిల్ స్థానంలో ఊహించని ఆటగాడు!
టీమిండియాకు భారీ షాక్..! స్టార్ ప్లేయర్కు మళ్లీ పిలుపు
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. కార్యజయం
ఐబొమ్మ ఇమ్మడి రవికి మరో బిగ్ షాక్!
ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన రైళ్లన్నీ ఫుల్!
అంటే అవి మనం వేశామనా? వీళ్ల ఉద్దేశం!!
లోపల తీవ్రంగా చర్చించుకుంటున్నారు!
ఫొటోలు
తెలుసు కదా మూవీ సెట్లో సరదా సరదాగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫోటోలు)
శ్రీశైలంలో సురేఖవాణి కూతురు సుప్రీత ప్రత్యేక పూజలు (ఫోటోలు)
సినిమా పైరసీపై ఫిల్మ్ ఛాంబర్ మహా ధర్నా (ఫోటోలు)
జీన్స్ డ్రెస్సులో మెరుస్తున్న అక్కినేని కోడలు శోభిత (ఫోటోలు)
ప్రెగ్నెన్సీతో బిగ్బాస్ సోనియా.. లేటేస్ట్ బేబీ బంప్ ఫోటోలు చూశారా?
ముత్యపు పందిరి వాహనంపై అమ్మవారు
‘కిల్లర్’ మూవీ ఈవెంట్ లో మెరిసిన జ్యోతి రాయ్ (ఫోటోలు)
పుట్టపర్తి : కనుల పండువగా సత్యసాయి జయంతి వేడుకలు (ఫోటోలు)
జ్యోతి రాయ్ ‘కిల్లర్’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)
కర్నూలు : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
సినిమా
కొడుకు పేరు రివీల్ చేసిన హీరోయిన్.. అలాంటి అర్థం వచ్చేలా!
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా గతనెలలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రముఖ పొలిటీషియన్ రాఘవ్ చద్దాను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. రెండేళ్ల తర్వాత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 19న మొదటి బిడ్డను తమ జీవితంలో ఆహ్వానించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.తాజాగా తమ ముద్దుల చిన్నారికి బారసాల కార్యక్రమం నిర్వహించారు ఈ జంట. బాబు పుట్టిన నెల రోజులకు పేరు పెట్టారు. తమ బిడ్డకు నీర్ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. జలస్య రూపం, ప్రేమస్య స్వరూపం - తత్ర ఏవ నీర్.. మా హృదయాలు జీవితంలో శాశ్వతమైన శాంతిని పొందాయి.. మా అబ్బాయికి నీర్ అని పేరు పెట్టాం అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. నీర్ అంటే స్వచ్ఛమైన, దైవిక, పరిమితం లేని అనే అర్థం వస్తుందని వెల్లడించారు. పరిణీతిలోని నీ... రాఘవ్లోని రా కలిసి వచ్చేలా తమ ముద్దుల బిడ్డకు నామకరణం చేశారు.(ఇది చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన పరిణీతి చోప్రా.. సోషల్ మీడియాలో పోస్ట్)ఈ ఏడాదిలో ఆగస్టులో పరిణీతి, రాఘవ్ ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించారు. వీరిద్దరు సెప్టెంబర్ 2023లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఢిల్లీలో జరిగిన వీరి వివాహానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది అమర్ సింగ్ చంకీలా చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన పరిణీతి చోప్రా కనిపించింది. ఈ ఏడాది కేవలం ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్లో మాత్రమే నటించింది. View this post on Instagram A post shared by @parineetichopra
టాలీవుడ్లో తమిళ హీరోయిన్కి అవమానం.. డైరెక్టర్ చీప్ కామెంట్స్
తమిళ హీరోయిన్కి టాలీవుడ్లో దారుణమైన అవమానం జరిగింది. ఈ విషయాన్ని సదరు హీరోయిన్ బయటపెట్టింది. డైరెక్టర్ తనని షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా అవమానించాడని, ఈ మొత్తం వ్యవహారంలో హీరో (సుడిగాలి సుధీర్) సైలెంట్గా ఉండటం చాలా బాధించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.తమిళ హీరోయిన్ దివ్య భారతి.. తెలుగులో చేస్తున్న తొలి సినిమా 'గోట్'. సుడిగాలి సుధీర్ హీరోగా నరేశ్ కుప్పిలి దర్శకుడిగా రెండేళ్ల క్రితం దీన్ని లాంచ్ చేశారు. కొన్నాళ్లకు దర్శకుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాడు. తర్వాత నిర్మాత టేకోవర్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి పాట రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెడదామని అనుకున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో దర్శకుడు నరేశ్ తెరపైకి వచ్చాడు. హీరోయిన్ని అవమానించేలా ట్విటర్లో కామెంట్స్ పెట్టాడు. దీనికి దివ్యభారతి కూడా ఘాటుగా బదులిచ్చింది.'ఇదేం లేబర్రా నువ్వు. ఎడిట్లో తీసిపడేసిన షాట్స్తో నెక్స్ట్ సినిమా అంతా కాలం గడిపేలా ఉన్నావ్? అసలు సెకండ్ లీడ్ హీరోయిన్ చేయాల్సింది ఈ చిలకతో వదిలావ్. పోనీ మంచి ట్యూన్ ఏం చేశావ్ రా? స్టెప్పం కొట్టిన డప్పం వెయ్యనా. ఈ ఒక్క మాటతో రెండు చేతులు గుండెపై పెట్టుకుని..' అని దర్శకుడు నరేశ్ ట్వీట్ చేశాడు. దీన్ని స్క్రీన్ షాట్ తీసి, ట్విటర్లో పోస్ట్ చేసిన దివ్యభారతి ఇచ్చిపడేసేలా రిప్లై ఇచ్చింది.'మహిళలని చిలక లేదా మరేదైనా పదంతో పిలవడం జోక్ ఏం కాదు. ఇది ఆడవాళ్లపై నీకెంత ద్వేషముందో చెబుతోంది. ఇదొక్కటే కాదు సెట్లోనూ ఇతడు ఇలానే ప్రవర్తించేవాడు. పదేపదే మహిళల్ని కించపరుస్తూ తన కళకే ద్రోహం చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో హీరో మౌనంగా ఉండటం చూసి నేను చాలా బాధపడ్డాను. దీనివల్ల దర్శకుడికి చనువిచ్చినట్లు అయింది' అని దివ్య భారతి తన ఆవేదన వ్యక్తం చేసింది.మరో ట్వీట్లో తమిళ, తెలుగు చిత్రసీమ గురించి తేడాలు చెప్పుకొచ్చింది. 'నాతో ఎప్పుడూ సమస్యలే అని చెప్పేవాళ్లకు చెబుతున్నాను. నిజాలే మాట్లాడతాయి. తమిళ ఇండస్ట్రీలో అదే టీమ్, అదే నటీనటులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్లీ మళ్లీ పనిచేశాను. కానీ ఈ ఒక్క దర్శకుడు మాత్రమే గీత దాటి ప్రవర్తించాడు. అవమానించేలా నాపై కామెంట్స్ చేశాడు. వాటిని బయటపెట్టాడు. అందుకే నేను స్పందించాల్సి వచ్చింది. ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకుంటే మాత్రం అది నీ ఇష్టం' అని దివ్య భారతి రిప్లై ఇచ్చింది.గతంలో ఈ దర్శకుడు.. విశ్వక్ సేన్ హీరోగా 'పాగల్' తీశాడు. కానీ సమస్య ఏంటో గానీ మధ్యలోనే బయటకొచ్చేశాడు. ఇప్పుడు 'గోట్' విషయంలోనూ ఇలానే జరిగింది. అయితే దర్శకుడిని విమర్శించిన హీరోయిన్ దివ్య భారతి.. హీరో సుడిగాలి సుధీర్ని కూడా వివాదంలోకి లాగింది. మరి అతడు ఏం సమాధానం చెబుతాడో చూడాలి?
అక్రమ సంబంధంపై డార్క్ కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
ఓటీటీల్లో మలయాళ సినిమాలనే ఎందుకు ఎక్కువగా చూస్తారు? అంటే సమాధానం చాలా సింపుల్. కథలు, పాత్రలు సహజంగా ఉంటాయి. మంచి థ్రిల్ ఇస్తాయి లేదంటే ఫుల్ కామెడీ అనిపిస్తాయి. కొన్నిసార్లయితే ఇలాంటి ఓ పాయింట్తోనూ సినిమా తీయొచ్చా అని ఆశ్చర్యపరుస్తాయి. అలా ఇప్పుడు 'అక్రమ సంబంధం' అనే సీరియస్ అంశంపై పూర్తి కామెడీగా ఓ మూవీ తీశారు. అదే 'అవిహితం'. రీసెంట్గా ఇది హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఓ పల్లెటూరు. ప్రకాశ్ అనే వ్యక్తి ఓ రోజు రాత్రి ఫ్రెండ్స్తో మందు పార్టీ చేసుకుని ఇంటికి తిరిగొస్తుంటాడు. ఓ చోట అలికిడి అయ్యేసరికి అటువెపు వెళ్తాడు. ఆ చీకటిలో వినోద్ అనే కుర్రాడు.. మరో యువతితో కలుసుకోవడం చూస్తాడు. పక్కనే నిర్మల ఇల్లు ఉండేసరికి చీకటిలో ఉన్నది ఆమెనే అనుకుంటాడు. తర్వాత ఈ విషయాన్ని వేణు అనే వ్యక్తికి చెబుతాడు. అలా ఒకరి నుంచి ఒకరికి చాలామందికి దీని గురించి తెలుస్తుంది. చివరకు ఈ సంగతి.. నిర్మల భర్త ముకుందన్ వరకు చేరుతుంది. ఇంతకీ చీకటిలో కనిపిస్తున్న యువతి ఎవరు? వినోద్-నిర్మల విషయంలో అందరి అనుమానం నిజమైందా? చివరకు అందరూ కలిసి ఏం చేశారనేదే స్టోరీ.ఎలా ఉందంటే?సిటీలో తక్కువ గానీ గ్రామాల్లో గాపిస్ కల్చర్ ఎక్కువే. ఏదైనా ఓ విషయం జరగ్గానే అమ్మలక్కలు చేరిపోయి ముచ్చట్లు పెడతారు. చేయాల్సిన పనులన్నీ గాలికొదిలేసి సదరు పుకార్ల గురించే తెగ మాట్లాడుకుంటారు. ఈ సినిమా కూడా సేమ్ అలాంటి ఓ పాయింట్తోనే తీశారు. రాత్రిపూట చీకటిలో ఓ యువతీ యువకుడు కలుసుకోవడం ముందు ఒకడు చూస్తాడు. అది ఇంకోకడికి చెబుతాడు. ఈ ఇద్దరు మరో ఇద్దరికి చెబుతారు. అలా ఇదో పెద్ద డిస్కషన్ అయిపోతుంది.సినిమా మొదలైన ఐదు నిమిషాల్లోనే 'అక్రమ సంబంధం' అనే అసలు పాయింట్ రివీల్ అవుతుంది. చీకటిలో కనిపించిన అమ్మాయి ఎవరో ఒక్కరికి కూడా తెలియదు. కానీ పక్కనోడు చెప్పాడని, పరిస్థితులు సింక్ అవుతున్నాయని 'ఆమె'నే అని అందరూ ఫిక్స్ అయిపోతారు. ఎలాగైనా సరే ఆమెని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని స్కెచ్ వేస్తారు. రాత్రయితే చాలు ఈ విషయం తెలిసిన ఒక్కడూ నిద్రపోడు. చీకటిలో వాళ్లిద్దరూ ఏం చేస్తున్నారా అని మాత్రమే ఆలోచిస్తుంటారు. క్లైమాక్స్లో ఊహించని ట్విస్ట్. దానికి తోడు ఓ మెసేజ్. సందేశం కదా అని స్పీచుల్లాంటివి ఉంటాయని అనుకోవద్దు. సింపుల్గా రెండు మూడు సీన్లతోనే చాలామంది భర్తలకు కళ్లు తెరిపించే మెసేజ్ ఇచ్చారు.డార్క్ కామెడీ జానర్ కావడంతో అడల్ట్ టచ్ జోక్స్ చాలానే ఉన్నాయి. అవన్నీ గీత దాటకుండా ఉంటాయి. ఇవి అర్థమైతే మాత్రం ఫుల్గా నవ్వుకుంటారు. చూస్తున్నంతసేపు మంచి టైమ్ పాస్ అవుతుంది. సినిమాకు ప్లస్ పాయింట్ ఏంటంటే పల్లె వాతావరణంలో చాలా సహజంగా ఉంటుంది. ఇదేదో మన ఊరిలో జరుగుతుందా అనిపిస్తుంది. యాక్టర్స్ ఎవరో గానీ పాత్రల్లో జీవించేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, వన్ లైనర్స్ భలే పేలాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అయితే ఇలాంటి ఓ పాయింట్తోనూ సినిమాని తీయొచ్చు. ప్రేక్షకుల్ని అలరించొచ్చని ఇది చూశాకే అర్థమైంది.-చందు డొంకాన
నాకు లవ్స్టోరీ సినిమాలంటే పిచ్చి ఇష్టం: నాగచైతన్య
‘‘ఒక నటుడిగా, ప్రేక్షకుడిగా నాకు లవ్స్టోరీ సినిమాలంటే పిచ్చి ఇష్టం. కోవిడ్ తర్వాత అందరూ యాక్షన్ , సినిమాటిక్ యూనివర్స్, కొత్త వరల్డ్ నేపథ్యంలో వచ్చే సినిమాలకే ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని చెప్పారు. కానీ ప్రేమకథలు థియేటర్స్లోకి వస్తే, విజయాలు సాధిస్తాయని ఇటీవల మరోసారి ప్రూవ్ అయ్యింది. లవ్స్టోరీస్ టైమ్లెస్’’ అని చెప్పారు నాగచైతన్య. ప్రియదర్శి, ఆనంది జంటగా, సుమ కనకాల కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ప్రేమంటే..’. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో రానా సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు నాగచైతన్య, దర్శకుడు శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరై, బిగ్ టికెట్ను లాంచ్ చేశారు. తొలి టికెట్ను రూ.లక్షా పదహారువేల నూటపదహార్లకు కడివేలు సాయి కొనుగోలు చేశారు. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో ఉన్న విలక్షణ నటుల్లో ప్రియదర్శి ఒకరు. స్మాల్, బిగ్ బడ్జెట్ చిత్రాలు.. హారర్, కామెడీ, యాక్షన్ , లీడ్ యాక్టర్, హీరో... ఇలా తను ఒక మంచి కెరీర్ను బిల్డ్ చేసుకున్నాడు. నవనీత్ ఓ ఫ్రెష్ లవ్స్టోరీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. సుమగారు యాక్ట్ చేయడం ఓ సర్ప్రైజ్. ఈ టీమ్ అందరికీ శుభాకాంక్షలు’’ అని చెప్పారు.‘‘ప్రియదర్శి మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. నవనీత్ టెన్షన్ లేకుండా కనిపిస్తున్నాడు. సినిమా బాగా వచ్చిందనుకుంటున్నాను. చిన్న సినిమాలు బాగా ఆడుతున్న టైమ్ ఇది. ఈ యంగ్ టీమ్ చేసిన ఈ చిత్రం సక్సెస్ సాధిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు శేఖర్ కమ్ముల. ‘‘ఏషియన్స్ ప్రొడక్షన్స్ హౌస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలో నేను సినిమా చేసే అవకాశాన్ని ఫ్యాన్స్ ప్రేమ వల్లే పొందగలిగాను’’ అన్నారు ప్రియదర్శి. ‘‘పెళ్లయిన తర్వాత ఎంత కొట్లాడుకున్నా, ఎంత అరుచుకున్నా, ఒక చాయ్ తాగుతూ మాట్లాడుకుని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు’ అన్నదే ఈ సినిమా కథ’’ అని తెలి΄ారు నవనీత్. తెలుగు పరిశ్రమలోనివారిపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నవారిని హైపర్ ఆది విమర్శించారు. నిర్మాతలు సురేష్బాబు, జాన్వీ నారంగ్ మాట్లాడారు.
న్యూస్ పాడ్కాస్ట్
భద్రతాబలగాల ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మడివి హిడ్మా. ఆయన భార్య రాజే, మరో నలుగురు మావోలు సైతం మృతి
ఎమ్మెల్యేల అనర్హతపై వారంలోగా నిర్ణయం తీసుకోండి. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్దంగ ఉండండి.
ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తున్నది కేవలం అప్పుల్లోనే... సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
పని చేయకున్నా జీతాలివ్వాలా?... విశాఖ ఉక్కు కార్మికులపై రెచ్చిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం. మొత్తం 243 స్థానాలకు గాను 202 చోట్ల విజయం
ఉత్త ఒప్పందాలే... రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులంటూ చంద్రబాబు ప్రచార ఆర్భాటం
అది ముమ్మాటికీ ఉగ్ర దాడే... ఢిల్లీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నేడు కోటి గొంతుకల గర్జన.... చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమ కార్యచరణ ప్రకటన
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు. తొమ్మిది మంది దుర్మరణం. 20 మందికి గాయాలు. రంగంలోకి దర్యాప్తు బృందాలు
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం... సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం
క్రీడలు
టీమిండియాకు భంగపాటు
రాజ్కోట్ వేదికగా సౌతాఫ్రికా-ఏతో ఇవాళ (నవంబర్ 19) జరిగిన మూడో వన్డేలో భారత-ఏ జట్టుకు భంగపాటు ఎదురైంది. ఈ మ్యాచ్లో భారత యువ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. ఫలితంగా పర్యాటకుల చేతిలో 73 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇది వరకే సిరీస్ కోల్పోయిన సౌతాఫ్రికాకు ఇది కంటితుడుపు విజయం. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి రెండు వన్డేలు గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది.ఓపెనర్ల శతకాలుటాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోర్ (325/6) చేసింది. ఓపెనర్లు లూహాన్ డ్రి ప్రిటోరియస్ (123), రివాల్లో మూన్సామి (107) అద్బుత శతకాలు సాధించారు. వీరిద్దరు ఔటయ్యాక సౌతాఫ్రికా స్కోర్ నెమ్మదించింది. ఆతర్వాత వచ్చిన రుబిన్ హెర్మన్ (11), క్వెషైల్ (1), కెప్టెన్ ఆకెర్మన్ (16), డియాన్ ఫార్రెస్టర్ (20) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వీరంతా కూడా రాణించి ఉంటే సౌతాఫ్రికా ఇంకాస్త భారీ స్కోర్ చేసేది. ఆఖర్లో డెలానో పాట్గెటర్ (30 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి సౌతాఫ్రికా స్కోర్ను 300 మార్కు దాటించాడు. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఖలీల్ అహ్మద్ 10 ఓవర్లలో 82 పరుగులిచ్చాడు (2 వికెట్లు). హర్షిత్ రాణా (10-1-47-2), ప్రసిద్ద్ కృష్ణ (10-0-52-2) సౌతాఫ్రికా బ్యాటర్లను కాస్త నిలువరించగలిగారు.టాపార్డర్ వైఫల్యం326 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఇన్ ఫామ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (25) సహా టాపార్డర్ అంతా దారుణంగా విఫలమైంది. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ తిలక్ వర్మ తలో 11, రియాన్ పరాగ్ 17 పరుగులు చేసి ఔటయ్యారు. ఆతర్వాత ఇషాన్ కిషన్ (53), ఆయుశ్ బదోని (66) కాసేపు పోరాడారు. అయితే అప్పటికే భారత ఓటమి ఖరారైపోయింది. నకాబా పీటర్ (10-0-48-4), మొరేకి (9.1-0-58-3), ఫోర్టుయిన్ (10-0-48-2) అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ను 252 పరుగులకే కట్టడి చేశారు. చదవండి: 'మరో' చరిత్రకు అడుగు దూరంలో బంగ్లాదేశ్ దిగ్గజం
సత్యసాయి నాకు ఫోన్ చేశారు.. ఆయన ఆశీర్వాదం వల్లే ట్రోఫీ: సచిన్
భారత క్రికెట్ దిగ్గజం, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) జీవితంలో 2011 మర్చిపోలేని సంవత్సరం. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ ఏడాదే ‘మాస్టర్ బ్లాస్టర్’ తొలిసారి ప్రపంచకప్ను ముద్దాడాడు. సొంతగడ్డపై.. సొంత మైదానం వాంఖడేలో భారత్ టైటిల్ గెలవడంతో సంతోషంతో ఉప్పొంగిపోయాడు. సహచరులంతా తనను భుజాలపై ఊరేగిస్తుంటే చెమ్మగిల్లిన కళ్లతోనే అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు.నాటి అందమైన జ్ఞాపకాలను సచిన్ టెండుల్కర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. సత్యసాయి బాబా శత జయంతి వేడుకల (Sathya Sai Baba Birth Centenary Celebrations) కోసం ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తికి వచ్చిన సచిన్.. 2011 వరల్డ్కప్ సమయంలో ఒత్తిడిని జయించేందుకు వీలుగా బాబా తనలో స్ఫూర్తి నింపిన తీరు వివరించాడు.చివరి వరల్డ్కప్ అని తెలుసు‘‘అప్పటికే నేను చాలా వరకు ప్రపంచకప్ టోర్నమెంట్లలో పాల్గొన్నాను. 2011 నాటి టోర్నీ నా కెరీర్లో చివరి వరల్డ్కప్ అని తెలుసు. అప్పుడు నేను జట్టుతో కలిసి బెంగళూరు శిబిరంలో ఉన్నాను.బాబా స్వయంగా నాకు ఫోన్ చేశారుఆ సమయంలో నాకో ఫోన్ కాల్ వచ్చింది. బాబా స్వయంగా నాకు ఫోన్ చేశారు. నాకొక పుస్తకం పంపించానని చెప్పారు. అప్పుడు నా ముఖంపై చిరునవ్వు విరిసింది. ఆ ప్రపంచకప్ నా జీవితంలో అత్యంత ముఖ్యమైనదని తెలుసు. జట్టుకు కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైనది.బాబా మాటలు, ఆయన పంపిన పుస్తకం నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. అంతర్గత శక్తి పుంజుకుంది. ఆ తర్వాత ఆ పుస్తకం నా జీవితంలో భాగమైపోయింది’’ అని సచిన్ టెండుల్కర్ సత్యసాయి బాబా పట్ల ప్రేమాభిమానాలను చాటుకున్నాడు.అదే విధంగా.. ‘‘2011లో ఏం జరిగిందో అందరూ చూశారు. ముంబైలో శ్రీలంకను ఓడించి టీమిండియా ట్రోఫీని ముద్దాడింది. జాతి మొత్తం ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. నా క్రికెట్ జీవితంలో అదొక గోల్డెన్ మూమెంట్.బాబా ఆశీర్వాదం వల్లే అంతకుముందు నా జీవితంలో మునుపెన్నడూ లేని అనుభూతిని అప్పుడే పొందాను. నా శ్రేయోభిలాషులు, గురువులు... వీరందరితో పాటు బాబా ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యమైంది’’ అని సచిన్ టెండుల్కర్ సత్యసాయి బాబా పట్ల భక్తిని చాటుకున్నాడు. ఎదుటివారిని జడ్జ్ చేయకూడదని.. వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి బాబా చెప్పేవారని సచిన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.కాగా పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆంధ్రప్రదేశ్కు విచ్చేశారు. ఇక సచిన్ టెండుల్కర్తో పాటు సినీ నటి ఐశ్వర్యా రాయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఇదిలా ఉంటే.. ధోని కెప్టెన్సీలోని భారత జట్టు 2011 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఫలితంగా సచిన్ ఖాతాలో ఒక్క ప్రపంచకప్ టైటిల్ కూడా లేదనే లోటు ఆ ఏడాది తీరిపోయింది.చదవండి: శుబ్మన్ గిల్ వెళ్తాడు.. కానీ: బీసీసీఐ
'మరో' చరిత్రకు అడుగు దూరంలో బంగ్లాదేశ్ దిగ్గజం
బంగ్లాదేశ్ దిగ్గజ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) టెస్ట్ క్రికెట్లో మరో చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం వందో టెస్ట్ (ఐర్లాండ్తో రెండో టెస్ట్) ఆడుతున్న ఈ మాజీ కెప్టెన్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సెంచరీకి పరుగు దూరంలో (99 నాటౌట్) ఉన్నాడు.ముష్ఫికర్ రెండో రోజు ఈ ఒక్క పరుగు పూర్తి చేస్తే.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వందో మ్యాచ్లో వంద చేసిన 11వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్లో 83 మంది 100 టెస్ట్లు పూర్తి చేసుకోగా.. బంగ్లాదేశ్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు ముష్ఫికర్ మాత్రమే. వందో టెస్ట్లో సెంచరీ చేసిన ఆటగాళ్లు..కొలిన్ కౌడ్రేజావిద్ మియాందాద్గార్డన్ గ్రీనిడ్జ్అలెక్ స్టీవర్ట్ఇంజమామ్ ఉల్ హక్రికీ పాంటింగ్- రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలుగ్రేమీ స్మిత్హషీమ్ అమ్లాజో రూట్- వందో టెస్ట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడుడేవిడ్ వార్నర్- వందో టెస్ట్లో డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడుమ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లలో ఇప్పటికే తొలి టెస్ట్ (బంగ్లాదేశ్ విజయం సాధించింది) పూర్తి కాగా.. ఇవాళ (నవంబర్ 19) రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫికర్ రహీంకు వందో టెస్ట్.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్ 34, షద్మాన్ ఇస్లాం 35, మొమినుల్ హక్ 63, కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 8 పరుగులు చేసి ఔట్ కాగా.. ముష్ఫికర్ రహీం 99, లిటన్ దాస్ 47 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఐర్లాండ్ బౌలర్లలో ఆండీ మెక్బ్రైన్కే 4 వికెట్లు దక్కాయి.చదవండి: చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్
షాయ్ హోప్ మహోగ్రరూపం
న్యూజిలాండ్ పర్యటనలో వెస్టిండీస్ వన్డే సిరీస్ను కూడా కోల్పోయింది. తొలుత ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-3 తేడాతో చేజార్చుకున్న కరీబియన్ జట్టు.. తాజాగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది.నేపియర్ వేదికగా ఇవాళ (నవంబర్ 19) జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో విండీస్ కెప్టెన్ వీరంగం చేశాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ, విధ్వంసకర శతకం బాదాడు. కేవలం 69 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.విండీస్ ఇన్నింగ్స్లో హోప్ 109 పరుగుల తర్వాత రెండో అత్యధిక స్కోర్ కేవలం 22 పరుగులు మాత్రమే. అకీమ్ అగస్ట్, జస్టిన్ గ్రీవ్స్, రొమారియో షెపర్డ్ తలో 22 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లలో మాథ్యూ ఫోర్డ్ (21), రూథర్ఫోర్డ్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ 4, జేమీసన్ 3, టిక్నర్, సాంట్నర్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్కు ఓపెనర్లు డెవాన్ కాన్వే (90), రచిన్ రవీంద్ర (56) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆఖర్లో టామ్ లాథమ్ (39 నాటౌట్), మిచెల్ సాంట్నర్ (34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో చెలరేగడంతో న్యూజిలాండ్ మరో 3 బంతులు మిగిలుండగానే మ్యాచ్తో పాటు సిరీస్ను కూడా కైవసం చేసుకుంది. నామమాత్రపు చివరి వన్డే హ్యామిల్టన్ వేదికగా నవంబర్ 22న జరుగనుంది. అనంతరం డిసెంబర్ 2 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ మొదలవుతుంది.19వ సెంచరీఈ ఇన్నింగ్స్తో హోప్ ఈ ఏడాది విండీస్ తరఫున మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ సెంచరీ హోప్కు వన్డేల్లో 19వది. క్రిస్ గేల్ (25) తర్వాత వన్డేల్లో విండీస్ తరఫున అత్యధిక సెంచరీలు చేసింది హోపే. 19 శతకాలను హోప్ కేవలం 142 ఇన్నింగ్స్ల్లో సాధించడం మరో విశేషం. ఈ సెంచరీలకు హోప్ 12 దేశాలపై చేశాడు.
బిజినెస్
బ్యాటరీలతోనే బ్యాటరీలు తయారీ!
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) విప్లవం వేగవంతమవుతున్న నేపథ్యంలో వీటికి శక్తినిచ్చే లిథియం-అయాన్ బ్యాటరీల భవిష్యత్తుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈవీల ఉత్పత్తి పెరిగే కొద్దీ పనికిరాని బ్యాటరీల సంఖ్య కూడా భారీగా పేరుకుపోతుంది. భవిష్యత్తులో ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. వీటిని సరైన రీతిలో నిర్వహించకపోతే పర్యావరణానికి పెనుముప్పు తప్పదు. అయితే, ఈ బ్యాటరీల నిర్వహణనే ఒక భారీ ఆర్థిక అవకాశంగా కొన్ని కంపెనీలు మలుచుకుంటున్నాయి. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం.. త్వరలోనే ఈవీ బ్యాటరీ రీసైక్లింగ్ పరిశ్రమ వేల కోట్ల డాలర్ల వ్యాపారంగా అవతరించనుంది.పెరుగుతున్న బ్యాటరీల వాడకంఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీలే ప్రధానం. ఇంధన ధరల పెరుగుదల, కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాల నేపథ్యంలో అన్ని దేశాలూ ఈవీల తయారీని ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా అధిక శక్తి సాంద్రత, ఎక్కువ శ్రేణి(Range)ని అందించే అధునాతన లిథియం-అయాన్ బ్యాటరీలకు డిమాండ్ పెరుగుతోంది. కంపెనీలు నిరంతరం కొత్త రసాయన ఫార్ములాలు ఉపయోగిస్తూ బ్యాటరీల సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. అయితే వాహనం జీవితకాలం ముగిసిన తర్వాత లేదా బ్యాటరీ సామర్థ్యం తగ్గిన తర్వాత దాన్ని ఎలా నిర్వహించాలనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. ప్రస్తుతానికి పాత బ్యాటరీల నిర్వహణ గందరగోళంగా ఉంది.బ్యాటరీల రీసైక్లింగ్ఈవీ బ్యాటరీలను పర్యావరణ హితంగా రీసైకిల్ చేయడం సంక్లిష్ట ప్రక్రియ. వీటిలో విలువైన లోహాలు (కోబాల్ట్, నికెల్, లిథియం, మాంగనీస్) ఉంటాయి. ఈ లోహాలను తిరిగి వెలికి తీయడం రీసైక్లింగ్ ప్రధాన లక్ష్యం. అందుకు రెండు పద్ధతులను ఉపయోగిస్తున్నారు.హైడ్రోమెటలర్జీఇది అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతి. ముందుగా బ్యాటరీలను సురక్షితంగా విడిభాగాలుగా చేసి, పొడిగా చేస్తారు. తర్వాత శక్తివంతమైన రసాయన ద్రావణాలను (యాసిడ్స్) ఉపయోగించి చూర్ణం పొడి పదార్థాన్ని కరిగిస్తారు. ఈ ద్రావణం నుంచి లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి విలువైన లోహాలను వేరుచేసి, శుద్ధి చేస్తారు. దీనివల్ల అధిక స్వచ్ఛత కలిగిన పదార్థాలను తిరిగి పొందవచ్చు.పైరోమెటలర్జీఈ ప్రక్రియను స్మెల్టింగ్ అని కూడా అంటారు. ఇందులో బ్యాటరీ భాగాలను నేరుగా అధిక ఉష్ణోగ్రతల వద్ద (సుమారు 1500 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ) కాల్చివేస్తారు. ఈ ప్రక్రియలో ప్లాస్టిక్, కార్బన్ వంటి పదార్థాలు కాలిపోతాయి. విలువైన లోహాలు ద్రవ రూపంలోకి మారి లోహ మిశ్రమం (Alloy)గా ఏర్పడతాయి. ఈ మిశ్రమం నుంచి కోబాల్ట్, నికెల్లను తిరిగి పొందుతారు. ఇందులో బ్యాటరీలను పూర్తిగా విడదీయాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో అధిక ఉష్ణోగ్రతలు వెలువడడంతో లిథియంను తిరిగి పొందడం కష్టమవుతుంది.పైన తెలిపిన పద్ధతులతో పాటు కేవలం లోహాలను భౌతికంగా వేరుచేసే డైరెక్ట్ రీసైక్లింగ్ వంటి నూతన పద్ధతులపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.రీసైకిల్ చేయకపోతే కలిగే నష్టాలుపనితీరు తగ్గిపోయిన ఈవీ బ్యాటరీలను రీసైకిల్ చేయకుండా పారవేయడం వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతుంది. బ్యాటరీలలో ఉండే భారీ లోహాలు, విషపూరిత రసాయనాలు (ఉదా: లిథియం లవణాలు, ఎలక్ట్రోలైట్స్) భూమిలోకి, జల వనరులలోకి చేరి నీటిని, నేలను కలుషితం చేస్తాయి. పాత బ్యాటరీలను కాల్చివేసినా లేదా అవి శిథిలమైనా ప్రమాదకరమైన వాయువులు వాతావరణంలోకి విడుదలవుతాయి.లిథియం-అయాన్ బ్యాటరీలు అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. పారవేసిన ప్రదేశాల్లో ఇవి మండే ప్రమాదం ఉంది. రీసైకిల్ చేయకపోతే బ్యాటరీల్లోని కోబాల్ట్, నికెల్, లిథియం వంటి కీలకమైన ఖనిజ వనరులు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల కొత్త బ్యాటరీల తయారీకి కేవలం మైనింగ్ మీదే ఆధారపడాల్సి వస్తుంది.రీసైక్లింగ్ వల్ల లాభాలుబ్యాటరీ రీసైక్లింగ్ కేవలం పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదు, ఆర్థికంగా పరిశ్రమకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. లిథియం, కోబాల్ట్ వంటి లోహాల నిల్వలు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉన్నాయి. రీసైక్లింగ్ ద్వారా ఈ విలువైన ముడిసరుకును దేశీయంగా తిరిగి పొందవచ్చు. ఇది సరఫరా గొలుసుపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. మైనింగ్, శుద్ధి ప్రక్రియలతో పోలిస్తే రీసైక్లింగ్ ద్వారా లోహాలను పొందడం దీర్ఘకాలంలో చౌకైన పద్ధతిగా మారే అవకాశం ఉంది. ఉదాహరణకు, రీసైకిల్ చేసిన కోబాల్ట్ కొత్తగా తవ్విన కోబాల్ట్ కంటే సుమారు 25% తక్కువ ఖర్చుతో లభించవచ్చని అంచనా. బ్యాటరీ రీసైక్లింగ్ అనేది కొత్త పరిశ్రమ. దీని నిర్వహణ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో వేలాది కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి.
ఆధార్ కార్డుల్లో కొత్త మార్పులు..!!
ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు అక్రమ ఆఫ్లైన్ ధృవీకరణను తగ్గించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కొత్త మార్పులు చేయబోతోంది. పేరు, ఇతర వివరాలేవీ లేకుండా కేవలం కార్డుదారు ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే కలిగిన సరళీకృత ఆధార్ కార్డును జారీ చేసే విషయాన్ని యూఐడీఏఐ పరిశీలిస్తున్నదని ఆ సంస్థ సీఈఓ భువనేష్ కుమార్ వెల్లడించారు.ఆఫ్లైన్ స్టోరేజ్ లేదా ఆధార్ నంబర్ల వాడకాన్ని నిషేధించే చట్టం ఉన్నప్పటికీ అనేక సంస్థలు ఇప్పటికీ ఆధార్ ఫోటోకాపీలను సేకరిస్తున్నాయని ఆయన అన్నారు. హోటళ్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, బ్యాంకులు వంటి సంస్థల ద్వారా జరుగుతున్న ఆఫ్లైన్ ధృవీకరణను తగ్గించచడానికి, అలాగే వ్యక్తిగత గోప్యతను రక్షిస్తూ ఆధార్ ఆధారిత వయస్సు ధృవీకరణ ప్రక్రియను మరింత మెరుగుపరచడానికి డిసెంబర్లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని యూఐడీఏఐ యోచిస్తోంది.“కార్డుపై ఏవైనా వివరాలు ఎందుకు ఉండాలి? కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది కదా అన్న ఆలోచన ఉంది. మనం ఎలా ప్రింట్ చేసిన కార్డులను ప్రజలు అలా అంగీకరిస్తూనే ఉంటారు. దుర్వినియోగం చేయాలనుకునే వారు వాటిని అలా చేస్తూనే ఉంటారు” అని సీఈఓ భువనేష్ కుమార్ అన్నారు.ఆధార్ కార్డు కాపీల ద్వారా జరిగే ఆఫ్లైన్ ధృవీకరణను పూర్తిగా అరికట్టే నిబంధన కూడా సిద్ధమవుతుందని, దీనిపై ప్రతిపాదనను డిసెంబర్ 1న యుఐడీఏఐ పరిశీలనకు తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు. “ఆధార్ను డాక్యుమెంట్గా ఉపయోగించరాదు. ఆధార్ నంబర్ ద్వారా ప్రామాణీకరించాలి లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ధృవీకరించాలి. లేనిపక్షంలో నకిలీ పత్రం అయి ఉండే ప్రమాదం ఉంది,” అంటూ కుమార్ స్పష్టం చేశారు.ఆధార్ కొత్త యాప్ తీసుకొస్తున్న నేపథ్యంలో యూఐడీఏఐ బ్యాంకులు, హోటళ్లు, ఫిన్టెక్ సంస్థలు తదితర వాటాదారులతో సంయుక్త సమావేశం నిర్వహించింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్కు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్న కొత్త యాప్ ఆధార్ ప్రామాణీకరణ సేవలను మరింత మెరుగుపరచనుందని, ఇది సుమారు 18 నెలల్లో పూర్తిగా అందుబాటులోకి వస్తుందని యూఐడీఏఐ భావిస్తోంది.
ఎస్బీఐ కొత్త ప్రతిపాదన.. ఇలా చేయొచ్చు!
మోసాలను కట్టడి చేసే దిశగా ఫైనాన్షియల్ వ్యవస్థలోని అన్ని భాగాలను అనుసంధానం చేసేలా జాతీయ ఫైనాన్షియల్ గ్రిడ్ను ఏర్పాటు చేయొచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రతిపాదించారు. ఇందులో క్రెడిట్ బ్యూరోలు, ఫ్రాడ్ రిజిస్ట్రీలు, ఈ–కేవైసీ సదుపాయాలు, ఏకీకృత చెల్లింపుల ప్లాట్ఫాం, అకౌంట్ అగ్రిగేటర్లు మొదలైన వర్గాలు ఉండొచ్చని చెప్పారు.సీఐఐ ఫైనాన్సింగ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఆర్థిక రంగ సంస్థలన్నీ కలిసి ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ పేరిట లాభాపేక్షరహిత సంస్థను ఏర్పాటు చేయొచ్చని శెట్టి చెప్పారు. కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా పరిశ్రమ భాగస్వాములకు రియల్–టైమ్లో డేటాను అందించగలిగే ఉమ్మడి డిజిటల్ మౌలిక సదుపాయంగా ఇది ఉండాలని పేర్కొన్నారు.మరోవైపు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో టెక్నాలజీ వ్యవస్థను సమీక్షించాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ ఆశీష్ పాండే చెప్పారు. ఉద్యోగులకు నైపుణ్యాల్లో శిక్షణనివ్వడం మొదలైనవి పరిశ్రమకు కీలక సవాళ్లుగా ఉంటున్నాయని పేర్కొన్నారు.
ఎలక్ట్రిక్ కార్లదే సూపర్ స్పీడ్!
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా విద్యుత్ కార్లను కొనేందుకు ప్రజలు అధికాసక్తి చూపుతున్నారు. గతేడాది అక్టోబర్తో పోలిస్తే ఈ ఏడాది(2025) అక్టోబర్లో ఈ విభాగపు రిటైల్ విక్రయాల్లో 57% వృద్ధి నమోదైంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఫాడా) గణాంకాల ప్రకారం 2024 అక్టోబర్లో 11,464 ఈవీ కార్లు అమ్ముడవగా, ఈ ఏడాది ఈ సంఖ్య 18,055 యూనిట్లకు చేరింది.ఈ సెగ్మెంట్లో 7,239 యూనిట్లతో టాటా మోటార్స్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఎంజీ మోటార్స్(4,549 యూనిట్లు), మహీంద్రాఅండ్మహీంద్రా(3,911 యూనిట్లు), కియా ఇండియా(955 యూనిట్లు), బీవైడీ (570 యూనిట్లు) తరువాత స్థానాల్లో నిలిచాయి.ఈ–టూవీలర్స్ అమ్మకాల్లో వృద్ధి అంతంతే: ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో అమ్మకాలు నామమాత్ర వృద్ధిని నమోదు చేశాయి. గతేడాది అక్టోబర్లో 1.40 లక్షల యూనిట్లు అమ్ముడవగా, ఈసారి కేవలం 3% వృద్ధితో 1.43 లక్షల యూనిట్లు విక్రయాలు జరిగాయి. బజాజ్ ఆటో 31,426 యూనిట్లు అమ్మడం ద్వారా మారెŠక్ట్ లీడర్గా నిలిచింది. టీవీఎస్ మోటార్ 29,515 యూనిట్లు, ఏథర్ ఏనర్జీ 28,101 యూనిట్లు, ఓలా ఎలక్ట్రిక్ 16,036 యూనిట్లు, హీరో మోటోకార్స్ 15,952 యూనిట్లు, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 7,629 యూనిట్ల విక్రయాలు సాధించాయి.ఇక ఈ–త్రీ వీలర్స్ సిగ్మెంట్లో వార్షిక ప్రాతిపదికన 5% వృద్ధితో 70,604 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఎలక్ట్రిక్ వాణిజ్య వాహన అమ్మకాలు రెండు రెట్ల వృద్ధితో 1,767 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఫ్యామిలీ
శిఖరాలపై సింహనాదం..!
పంచభూతాల్లో భాగమైన నింగి, నేల, నీరు, వాయువులను ఎదురీది సాహసోపేతమైన ప్రయాణం చేయడం మనుషులకు సాధ్యమేనా అంటే.., ఆత్మవిశ్వాసం, శారీరక దారుఢ్యం, మనో సంకల్పం ఉంటే సాధ్యమేనని నిరూపిస్తున్నాడు ‘ఐన్ మ్యాన్’ చాలెంజ్ పూర్తి చేసిన సాహసికుడు కళాలి జై సింహ గౌడ్. ప్రపంచంలోని వివిధ ఖండాల్లో ఎత్తైన శిఖరాలను అధిరోహించడం, మహాసముద్రాలను ఈదడం, అత్యంత విపత్కర పరిస్థితుల్లో ఫుల్ మారథాన్లు పూర్తి చేయడం, బాడీ బిల్డింగ్లో సత్తా చాటడం.. అన్నింటికీ మించి ‘మేక్ ఫిట్ ఇండియా’లో భాగంగా ఫిట్నెస్పై అందరికీ అవగాహన కల్పించడం తన వృత్తి, ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ఎవరెస్ట్ అధిరోహణం వంటి లక్ష్యాలతో తన భవిష్యత్ ప్రణాళికలు నిర్దేశించుకుంటూనే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఫిట్నెస్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. యూరప్లోనే అత్యంత ఎత్తైన మంచు శిఖరం మౌంట్ ఎల్బ్రస్.. 18,600 అడుగుల ఎత్తులో ఎముకలు కొరికే 14 డిగ్రీల మైనస్ ఉష్ణోగ్రతల్లో ఈ మహా పర్వతాన్ని గతంలోనే అధిరోహించి జాతీయ జెండాతో పాటు జై తెలంగాణ పతాకాన్ని సగర్వంగా ఎగరేశారు నగరానికి చెందిన జై సింహ. అంతేకాకుండా ఆఫ్రికాలోని ఎత్తైన పర్వత శిఖరాల్లో ప్రసిద్ధి చెందిన కిలిమంజారో పర్వతాన్ని సైతం అధిరోహించారు. అంతేకాకుండా లద్దాక్లోని కాంగ్ యాట్సే 1, 2 పర్వతాలను సైతం ఈ లిస్ట్లో చేరిపోయాయి. పర్వతారోహణతో పాటు.. లద్దాక్ వేదికగా 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, హైదరాబాద్ నగరంలో ఎన్ఎండీసీ ఫుల్ మారథాన్.. వీటితో పాటు పలు ప్రతిష్టాత్మక మారథాన్లు పూర్తిచేశారు. ఇదే నెల ప్రారంభంలో గోవా వేదికగా మిరామర్ బీచ్లో నిర్వహించిన 5వ ఎడిషన్ ఐరన్ మ్యాన్ 70.3లో ఏకకాలంలో 1.9 కిలో మీటర్ల స్విమ్మింగ్, 90 కిలో మీటర్ల సైక్లింగ్, 21.1 కిలో మీటర్ల రన్నింగ్ పూర్తిచేసి సత్తాచాటారు. 46 ఏళ్ల ఈ పర్వతారోహకుడు, బాడీబిల్డర్, ఫిట్నెస్ ట్రైనర్.. రంగాల్లో రాణిస్తూ.. మొత్తంగా ఐరన్ మ్యాన్ అనిపించుకుంటున్నారు. ఈ స్ఫూర్తితో మరిన్ని పర్వతాలు అధిరోహించడానికి సన్నద్ధమవుతున్నారు. ఫిట్నెస్ అవగాహనే లక్ష్యం.. ఓవైపు వ్యక్తిగతంగా ప్రపంచ రికార్టులు తన ఖాతాలో వేసుకుంటన్నారు. మరోవైపు విభిన్న కార్యక్రమాలతో సామాజికంగా అందరికీ శారీరక ఆరోగ్యం అవసరమని అవగాహన కలి్పస్తున్నారు. మారథాన్లు, ఫిట్నెస్ అవేర్నెస్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నగరంలో ‘సిమ్ లయన్ ఫిట్నెస్’ సెంటర్లు ప్రారంభించి ఔత్సాహికులకు ఫిట్నెస్, జిమ్ సేవలు అందిస్తున్నారు. ఉప్పల్, బోడుప్పల్, రామంతాపూర్ వంటి ప్రాంతాల్లో జిమ్ సేవలతో పాటు బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహిస్తూ సామాజిక దృఢత్వానికి తానొక పునాదిలా నిలుస్తున్నారు. గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా, మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్గా సుదీర్ఘ కాలం పనిచేసిన జై సింహ.. ఫిట్నెస్ రంగాన్ని విస్తృతం చేయాలనే లక్ష్యంతో వాటన్నింటికీ స్వస్తిపలికానని తెలిపారు. వచ్చే ఏడాది అర్జెంటీనాలోని అకాన్గువా పర్వతంతో పాటు ప్రపంచంలో మరో ఎత్తైన పర్వతం ఎవరెస్టును సైతం అధిరోహించనున్నారు. ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తున్న నగరవాసి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని మారుమూల గ్రామం నుంచి నగరానికి వచి్చన నేను.. ఫిట్నెస్ను జీవిత లక్ష్యంగా మార్చుకుని ఖండాంతరాల్లోని ఎత్తైన శిఖరాలపై దేశ ఖ్యాతిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నా. వచ్చే ఏడాది జనవరి 9న అర్జెంటీనాలోని అకాన్గువా పర్వతాన్ని, తదుపరి మార్చ్ నెలలో ఎవరెస్ట్ పర్వతారోహణకు సన్నద్ధమవుతున్నా. అంతేకాకుండా ఓషన్మ్యాన్గా రికార్డు సృష్టించేందుకు మహాసముద్రంలో 10 కిలోమీటర్ల స్విమ్మింగ్కు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ఈ తరం యువతలో శారీరక క్రమశిక్షణ, వ్యాయామ అభిరుచి పెంచడం, అరోగ్య సంరక్షణలో ఫిట్నెస్ ప్రాధాన్యతను తెలియజేయడం,శారీరక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం సంకల్పంగా ముందుకు సాగుతున్నా. ఫిట్ ఇండియా భవిష్యత్ కార్యాచరణ, ఇప్పటి వరకూ చేసిన పర్వతారోహణలన్నీ సిమ్ లయన్ ఫిట్నెస్ ప్రయత్నంలో సొంత ఖర్చులతోనే పూర్తి చేశాను. తదుపరి తలపెట్టిన పర్వతారోహణకు లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ప్రభుత్వం, ఇతర సంస్థలు, వ్యక్తుల నుంచి స్పాన్సర్షిప్ లభిస్తే దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది. గోవాలో జరిగిన ఐరన్ మ్యాన్ 70.3 నేపథ్యంలో పోటీదారులను మోదీ అభినందించిన విధానం నాలో మరింత స్ఫూర్తి నింపింది. – కళాలి జై సింహ గౌడ్, ఫట్నెస్ నిపుణుడు (చదవండి: Cancer Fighting Foods: ఏయే కూరగాయలు, పండ్లు కేన్సర్కి చెక్పెడతాయంటే..!)
షేక్ హసీనా 'జమ్దానీ' చీరల వెనక ఇంత స్టోరీ ఉందా..!
బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కేటాయింపు అన్న అంశం చిలికి చిలికి గాలివానలా మారి..మాజీ ప్రధాని షేక్ హసినా ప్రభుత్వం కూలి, పదవిని కోల్పోవడం తోపాటు మరణశిక్ష పడేందుకు దారితీసింది. ఉక్కు మహిళగా కీర్తిగడించిన ఆమెను ఒక్కసారిగా నేరస్తురాలిలా నిలబెట్టి మరణశిక్ష విధించింది అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్. ఆ తీర్పుపై తనదైన శైలిలో షేక్ హసీనా స్పదించారు కూడా . దీన్ని ఆమె రాజకీయ ప్రేరేపిత తీర్పుగా అభివర్ణించారు కూడా. కాలం అనుకూలించకపోతే ఎంతటి శక్తిమంతమైన వాళ్లైనా నిర్వీర్యం అయిపోతారనేందుకు ఉదాహరణగా నిలిచిన షేక్ హాసినా దౌత్యపరమైన సంబంధాలను నెరిపేందుకు ఏం చేసేవారో తెలిస్తే విస్తుపోతారు. మరి ఆ విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హాసినా..తన స్టైలిష్ లుక్తోనే ఆకట్టుకుంటారామె. ముఖ్యంగా ఆమె ధరించే జమ్దానీ చీరలు.. యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఆ నేపథ్యంలోనే ఆమె ఈ చీరలను ధరించేవారా అని అంతా ఆశ్చర్యపోయేలా రాజకీయాలను ఫ్యాషన్ని మిళితం చేసిందామె. అంతేగాదు ఆమె కృషి ఫలితంగా చేతివృత్తుల వారికి ఉపాధి లభించడం తోపాటు పురాతన సాంస్కృతికి వారసత్వాన్ని పదిలపర్చుకునేలా.. ప్రపంచ దేశాలు దాని విశిష్టతను గుర్తించేందుకు దోహదపడింది.జమ్దానీ చీరలను బెంగాల్లో అత్యంత అద్భుతమైన వస్త్ర సంప్రదాయాలలో ఒకటిగాగా చెబుతుంటారు. చేతితోమాత్రమే నేసే గొప్ప కళాఖండంగా అలరారే ఈ చీరలు అంతర్జాతీయ దృష్టిని సైతం అమితంగా ఆకర్షించాయి. అందుకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనానే కారణం. ఆమె చేసిన సాంస్కృతిక దౌత్య ప్రయత్నలేనని అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. హసీనా మనం ధరించే దుస్తులే సంభాషిస్తాయి అని ప్రగాఢంగా విశ్వసించేవారామె. ఆ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ సాంస్కృతిక కళా నైపుణ్యం, జాతీయ గర్వాన్ని ప్రతిబింబించేలా ఇలాంటి సాంప్రదాయ దుస్తులనే ఎంచుకునేవారామె. అంతర్జాతీయ వేదికపై జమ్దానీ మెరిసిన క్షణాలు..2014లో భారతదేశంలో సంబంధాలను బలోపేతం చేసే విషయమై ఈ చీరలోనే కనిపించారు. అంతేగాదు జూన్ 2014లో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా హసీనాకు దక్షిణ భారత పట్టు చీరను బహూకరించగా, హసీనా జమ్దానీ చీరను బహూకరించింది.2015 ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ను సందర్శించినప్పుడు హసీనా తెలుపు-బూడిద రంగుతో మిళితమైన జమ్దానీని ధరించింది. అజర్బైజాన్లో జరిగిన NAM సమ్మిట్లో హసీనా జమ్దానీ-ప్రేరేపిత బృందం బంగ్లాదేశ్ నేత సంప్రదాయాన్ని ప్రపంచ దౌత్య వేదికపై ఉంచింది.2021లో గ్లాస్గోలో జరిగిన COP26 వాతావరణ సదస్సులో నీలం బూడిదర రంగుతో కలగలసిన చీరలో మెరిసింది. అంతేగాదు అది నెట్టింట విపరీతంగా వైరల్ అయిన ఫోటోగా నిలిచింది.సెప్టెంబర్ 2022లో హసీనా నాలుగు రోజుల భారతదేశ పర్యటన ఒక శిఖరాగ్ర క్షణం అని చెప్పొచ్చు. ఆమె ఆ సమయంలో కూడా ఆ చీరలనే ఎంచుకోవడం అనేది వ్యాపార నాయకులల్లో చర్చనీయాంశంగా హైలెట్ అయ్యింది. G20 సమ్మిట్లో, హసీనా తిలక్ రంగు ధకై జమ్దానీని ధరించింది. ఇది భారతదేశంతో బంగ్లాదేశ్కి ఉన్న సంబంధాలను సూక్ష్మంగా నొక్కి చెబుతూనే ప్రపంచ వేదికపై ఈ కళను హైలైట్ చేసింది.న్యూ ఢిల్లీ, లండన్, బ్రస్సెల్స్, మ్యూనిచ్లోని నాయకులతో జరిగిన అనేక ఉన్నత స్థాయి సమావేశాలలో జమ్దానీ చీరలోనే కనిపించారు హసీనా. జమ్దానీ చరిత్రజమ్దానీ మూలాలు రెండు వేల సంవత్సరాల క్రితం పురాతన ఢాకా మగ్గాల నుంచి రూపుదిద్దుకుంది. ఈ పేరు పర్షియన్ పదాలైన "జామ్" (పువ్వు) "డాని" (కుండీ) నుంచి వచ్చింది. చీరలలో ఉపయోగించే నేత నమూనాలు వాటి నుంచి తీసుకోవడంతోనే ఈ చీరకు ఆ పేరు వచ్చింది.జమ్దానిని ప్రత్యేకంగా నిలబెట్టేది శ్రమతో కూడిన "పారదర్శక నేత" సాంకేతికత. దీన్ని యాంత్రిక మద్దతు లేకుండా చేతితోనే తయారు చేస్తారు. అందువల్ల ఒక చీర తయారైందుకు నెలల తరబడి సమయం పడుతుంది. ఈ ప్రక్రియ చూసేందుకు తేలికగా కనిపించినా..చాలా క్లిష్టతరమైన చేతి పని. అయితే ఇదే జమ్దాని చీర పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విభిన్న వెర్షన్లు ఉన్నాయి. అయితే ప్రతి చీర వెనుక అపారమైన నైపుణ్యం, గంటల తరబడి శ్రమ తప్పక ఉంటుంది. అంతేగాదు ఇది ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన విలువైన చేసేత వస్త్రాల్లో ఒకటిగా పేరొందింది. అలాంటి చేనేత చీరను మాజీ ప్రధాని షేక్ హసీనా ధరించడంతో అంతర్జాతీయ ఆకర్షణ తోపాటు బంగ్లాదేశ్ స్వదేశీ నేత కార్మికులకు నేరుగా మద్దతు లభించినట్లయ్యింది కూడా. అలాగే ఈ చీరలకు భౌగోలిక(GI) గుర్తింపు సైతం లభించడం విశేషం. గతేడాది నిరసనల టైంలో కూడా..ఆగస్టు 2024లో, హసీనా రాజీనామా, బహిష్కరణకు దారితీసిన సందర్భంలో కూడా ఈ చీరలు వార్తల్లో హాట్టాపిక్గా మారాయి. ఎందుకంటే ఆ ఘటనలో సాముహిక నిరసనకారులు ఢాకాలోని ఆమె అధికారిక నివాసాన్ని ముట్టడించి ఆమె వార్డ్రోబ్లోని జమ్దానీ చీరలను ఎత్తకుపోవడం అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.(చదవండి: మానికా విశ్వకర్మకు అప్పుడు సుష్మితాను అడిగిన అదే ప్రశ్న..! స్త్రీగా ఉండటం అంటే అదే..)
కేన్సర్కు ఆహారం ఆన్సర్..!
ఇంగ్లిష్లోనూ తెలుగులోనూ కామన్గా ఓ సామెత ఉంది. అదే... ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్. అంటే చికిత్స కంటే నివారణ మేలు అని అర్థం. నిజమే... రోజూ ఆహారం తీసుకోక తప్పదు. అదే గనక ఆరోగ్యకరమైనది కావడంతోపాటు కేన్సర్ను నివారించేదైతే... అది కేవలం కేన్సర్నే కాదు... ఎంతో ఆత్మక్షోభనూ, మరెంతో వేదననూ నివారిస్తుంది. అంతేకాదు... భవిష్యత్తులో మందులకు పెట్టే బోలెడంత డబ్బునూ ఆదా చేస్తుంది. అన్నిటికంటే ముందుగా శారీరక బాధల నివారణతోపాటు మానసికమైన శాంతినీకాపాడుతుంది. అందుకే రోజూ ఎలాగూ తినే అవే ఆకుకూరలనూ, కాయగూరలనూ, పండ్లనూ మార్చి మార్చి తింటూ ఉంటే పై ప్రయోజనాలన్నీ కలుగుతాయి. ఏయే ఆహారపదార్థాలు ఏయే కేన్సర్లను నివారిస్తాయో, అలా నివారించడానికి వాటిల్లోని ఏ పోషకాలు తోడ్పడతాయో తెలుసుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. తద్వారా కేన్సర్ను నివారించుకుందాం...పండ్లు... ఆకుకూరలు... ఆహారపదార్థాలు... ఇలా మనం రోజూ తినే పదార్థాలతోనే కేన్సర్లను నివారించుకోవడం సాధ్యమనే అనడం కాకుండా వాటిల్లోని ఏయే పోషక విలువలు అలా జరిగిందేందుకు దోహదపడతాయో తెలుపుతున్నారు కేన్సర్పై పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలూ, ఆహారనిపుణులు. పైగా ఏయే ఆహారపదార్థాల్లోని ఏ నిర్దిష్టమైన పోషకం కేన్సర్ను ఎలా నివారిస్తుందో తెలుసుకునేందుకు యూకేకు చెందిన ‘వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్’ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఆ అధ్యయనాల ద్వారా కేవలం ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తినడం ద్వారానే చాలా సులువుగా కేన్సర్ను ఎలా నివారించగలమో తెలుసుకుందాం.పెదవులు, నోరు, ఫ్యారింగ్స్ కేన్సర్ నివారణకు... బాగా ముదురురంగులో ఉండే అన్ని రకాల పండ్లతోపాటు బాగా ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు పెదవులు, నోరు, ఫ్యారింగ్ కేన్సర్లను నివారిస్తాయి. అంతేకాదు... విటమిన్ ఏ ఎక్కువగా ఉండే పండ్లు కూడా నోరు, ఫ్యారింగ్స్ కేన్సర్లను నివారిస్తాయి. ఉదాహరణకు విటమిన్–ఏ ఎక్కువగా ఉండే బొప్పాయి, క్యారట్, మామిడి వంటి తాజా పండ్లు నోరు, ఫ్యారింగ్స్, క్యాన్సర్లను నివారణకు తోడ్పడతాయి. టొమాటోలోని లైకోపిన్ కూడా ఈ తరహా క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడుతుంది. అంతేకాదు... ఈ లైకోపిన్తో మరో ఉపయోగం కూడా ఉంది. ఇందులో యాంటీ క్యాన్సర్ గుణాలతోపాటు గుండెజబ్బులను నివారించే గుణం కూడా ఉంది.కంటి కేన్సర్ నివారణకు... ఒమెగా 3–ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ చేపలు, వాల్నట్లతోపాటు గ్రీన్–టీ, బెర్రీ పండ్లు, పసుపు, విటమిన్–ఇ, విటమిన్–సి, విటమిన్–ఏ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో కంటి కేన్సర్లను సమర్థంగా నివారించవచ్చు. సెలీనియమ్, పీచుపదార్థాలు ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉండే బ్రెజిల్–నట్స్ కూడా కంటి క్యాన్సర్ నివారణకు తోడ్పతాయి.రొమ్ము కేన్సర్ నివారణకు... దానిమ్మ పండులోని ఎలాజిక్ యాసిడ్ అనే పోషకంలోని పాలీఫినాల్స్ రొమ్ముక్యాన్సర్ను సమర్థంగా నివారిస్తాయి. అలాగే కెరొటినాయిడ్ అనే పోషకం ఎక్కువగా ఉండే పాలకూర, క్యారట్, బ్రాకలీలు కూడా రొమ్ముక్యాన్సర్ నివారణకు గణనీయంగా తోడ్పడతాయి. ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండే గ్రీన్–టీ కూడా రొమ్ము క్యాన్సర్ నివారణకు చాలావరకు తోడ్పడుతుంది.గాల్బ్లాడర్ కేన్సర్ నివారణకు... ఊబకాయం / స్థూలకాయం రాకుండా ఆరోగ్యకరమైన పరిమితిలో బరువును నియంత్రించుకోవడమన్నది గాల్బ్లాడర్ క్యాన్సర్ నివారణకు బాగా తోడ్పడే అంశం. ఇలా బరువును నియంత్రించుకోవడం అన్నది కేవలం ఒక్క గాల్బ్లాడర్ కేన్సర్ నివారణకు మాత్రమే కాకుండా పెద్దపేగు, ప్రోస్టేట్, ఎండోమెట్రియమ్, మూత్రపిండాలు, రొమ్ము కేన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది. ఇందుకోసం ఆరోగ్యకరంగా ఉండే కొవ్వులు తక్కువగా తీసుకుంటూ ఆకుకూరలు మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండాలి.మూత్రాశయ (బ్లాడర్) కేన్సర్ల నివారణకు... క్రూసిఫెరస్ వెజిటబుల్స్ జాతిగా పేరుపడ్డ క్యాబేజీ, బ్రాకలీ వంటి ఆహారాలతో మూత్రాశయ (బ్లాడర్) క్యాన్సర్ను సమర్థంగా నివారించవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్లోని యాండర్సన్ కేన్సర్ సెంటర్లో తేలిన అంశాలను బట్టి విటమిన్–ఇ లోని ఆల్ఫా టోకోఫెరాల్ అనే జీవరసాయనం బ్లాడర్ కేన్సర్ నివారణకు బాగా ఉపయోగపడుతుంది. పాలకూర, బాదాంలతోపాటు పొద్దుతిరుగుడునూనె, కుసుమ నూనెలోనూ విటమిన్–ఇ మోతాదులు ఎక్కువ. ఇక మిరియాలలో ఉండే పోషకాలు కూడా బ్లాడర్ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడతాయి. మూత్రపిండాల (కిడ్నీ) కేన్సర్ నివారణకు... నారింజ రంగులో ఉండే కూరగాయలు (ఉదాహరణ క్యారట్)తో పాటు టొమాటో, అల్లం, ఆప్రికాట్ వంటివి... మూత్రపిండాల (కిడ్నీ) క్యాన్సర్ నివారణకు బాగా తోడ్పడతాయి. కిడ్నీల ఇన్ఫ్లమేషన్ను బెర్రీ పండ్లు గణనీయంగా తగ్గిస్తాయి. ఫలితంగా కిడ్నీ జబ్బుల ముప్పు కూడా బాగా తగ్గిపోతుంది. ఇక పొట్టు తీయని ధాన్యాలు, నట్స్, బఠాణీ, చిక్కుళ్ల వంటి ఫైటేట్ అనే పోషకం ఉన్న ఆహారాలు మూత్రపిండాల క్యాన్సర్ నివారణకు సమర్థంగా తోడ్పడతాయి.గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) కేన్సర్ నివారణకు... ఆహారంలో విటమిన్–ఇ, విటమిన్–సి ఎక్కువగా ఉండేలా చూసుకోవడం అని చర్య సర్విక్స్ క్యాన్సర్ నివారణకు బాగా ఉపకరిస్తుంది. ఉదాహరణకు క్యారట్, చిలగడదుంప, గుమ్మడి వంటి ఆహారాలతో దీన్ని చాలాబాగా నివారించవచ్చు. ఎలాజిక్ ఆసిడ్స్ అనేవి క్యాన్సర్ పెరుగుదలను అరికడతాయి. ఈ పోషకం స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ, వాల్నట్, దానిమ్మ, ద్రాక్ష, ఆపిల్, కివీ పండ్లలో పుష్కలంగా ఉంటుంది కాబట్టి వాటిని తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వారా (సర్విక్స్) కేన్సర్ను సమర్థంగా నివారించవచ్చు. అయితే ఇక్కడ ఓ చిన్న జాగ్రత్త పాటించడం మేలు చేస్తుంది. అదేమిటంటే... చక్కెర మోతాదులు తక్కువగా ఉండే (లో–గ్లైసీమిక్) పండ్లైన దానిమ్మ, ఆపిల్ వంటి పండ్లతో ఈ క్యాన్సర్ నివారణ మరింత తేలిక.తల, మెడ (హెడ్ అండ్ నెక్) క్యాన్సర్ల నివారణకు... పసుపు, నారింజ, ఎరుపు, ఆకుపచ్చ, తెల్లటి తొక్క కలిగి ఉండే పండ్లు తల, మెడ క్యాన్సర్లను నివారిస్తాయి. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల నివారణకు తోడ్పడతాయి. అలాగే ఈ పండ్లలోనే మెరుపు కలిగి ఉండే (కొద్దిపాటి మెరుపుతో బ్రైట్గా ఉండే) తొక్కతో ఉండే పండ్లు ఈ హెడ్ అండ్ నెక్ కేన్సర్లను మరింత సమర్థంగా నివారిస్తాయి. ఉదాహరణకు... నారింజ, కివీ, జామ, పైనాపిల్ పండ్లు తల, మెడ క్యాన్సర్లను నివారణకు సమర్థంగా తోడ్పడతాయి.బ్రెయిన్ కేన్సర్ కణుతుల నివారణకు... ఉల్లి, వెల్లుల్లి జాతికి చెందిన రెబ్బలలో మెదడు (బ్రెయిన్) కేన్సర్ను నివారించే గుణం ఎక్కువ. (అన్నట్టు వీటిలోని యాంటీ క్యాన్సర్ ΄ోషకాలు కేవలం బ్రెయిన్ కేన్సర్నే కాదు... ఇతరత్రా చాలా రకాల క్యాన్సర్ల నివారణకూ ఉపయోగపడతాయి). ఇక ఒమెగా 3–ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే వాల్నట్, లిన్సీడ్ ఆయిల్తో మెదడు కేన్సర్లు తేలిగ్గా, సమర్థంగా నివారితమవుతాయి. ఇవి కేన్సర్ నివారణతోపాటు వ్యక్తుల్లో వ్యాధి నివారణ వ్యవస్థను (ఇమ్యూనిటీని) పటిష్టం చేసేందుకూ ఉపయోడపడతాయి.ఒవేరియన్ కేన్సర్ నివారణకు... క్యారట్ల వంటి వాటితో పాటు పసుపురంగూ, నారింజరంగుల్లో ఉండే వెజిటబుల్స్తో (ఉదాహరణకు బెల్పెప్పర్ వంటివాటితో) ఒవేరియన్ క్యాన్సర్ను సమర్థంగా నివారించవచ్చు. కెరటినాయిడ్స్ ఎక్కువగా ఉండే క్యారట్ వంటివి రోజూ అరకప్పు మోతాదులో రెండు సార్లు తీసుకోవడం వల్ల ఒవేరియన్ క్యాన్సర్ను సమర్థంగా నివారించవచ్చని అమెరికన్ కేన్సర్ సొసైటీ వంటి ప్రజోపయోగ, పరిశోధనల సంస్థల అధ్యయానాల్లో తేలింది.జీర్ణాశయ (స్టమక్) క్యాన్సర్ నివారణకు... జీర్ణాశయ (స్టమక్) కేన్సర్ నివారణకు కాప్సికమ్ (కూరగా వండటానికి ఉపయోగించే బెంగళూరు మిరప లేదా బెల్పెప్పర్)లో ఉండే ఫైటోకెమికల్స్ బాగా ఉపయోగపడతాయి. పరిమితంగా తీసుకునే మిరపకాయలు ’ మిర్చీ వంటి వాటితోపాటు మిరియాల పరిమిత వాడకం కూడా స్టమక్ క్యాన్సర్ను నివారిస్తాయి. ఆకుకూరలు, పొట్టుతో ఉండే ధాన్యాలు, తాజా పండ్లు అనేక కేన్సర్ల నివారణతో పాటు జీర్ణాశయ కేన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి. జీర్ణాశయ క్యాన్సర్ నివారణకు ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించడమూ అవసరమే.కాలేయ కేన్సర్ నివారణకు... పాలీఫీనాల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే బ్లూబెర్రీ పండ్లు, విటమిన్–ఇ పుష్కలంగా ఉండే బెల్పెప్పర్, పాలకూర, బాదం వంటి ఆహార పదార్థాలు కాలేయ క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి. ఇక నూనెల్లో పొద్దుతిరుగుడు నూనె, కుసుమ నూనెలు కూడా కాలేయ కేన్సర్ నివారణకు దోహదపడతాయి. అయితే ఈ నూనెలను పరిమితంగా మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.ఎముక కేన్సర్ నివారణకు... యాంటీ ఆక్సిడెంట్స్ అనే పోషకాలు ఆక్సిడేషన్ ప్రక్రియతో వెలువడే విషయాలను (టాక్సిక్ మెటీరియల్స్ను) విరిచేస్తాయి. ఇలాంటి యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు... ఉదాహరణకు బెర్రీలు, చెర్రీలు, టొమాటో, బ్రాకలీ వంటివి ఎముక కేన్సర్ను సమర్థంగా నివారిస్తాయి. అలాగే ఒమెగా 3–ఫ్యాటీ ఆసిడ్స్ అనేక పోషకాలు పుష్కలంగా ఉండే సాల్మన్ చేపలు, వాల్నట్లతోనూ ఎముక క్యాన్సర్లు బాగానే నివారితమవుతాయి. ఇక ప్రోటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారం, చేపలు, గుడ్లతోనూ ఎముక క్యాన్సర్ త్వరితంగా నివారితమవుతుంది.చివరగా... ఆహారం తీసుకోవడం అన్నది మన జీవక్రియల కోసం మనం రోజూ తప్పక చేసే పని అయినందున... ఆ ఆహారాన్నే తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్ల రూపంలో మరింత ఆరోగ్యకరంగా తీసుకోవడం వల్ల ఒకే సమయంలో రెండు సౌకర్యాలు సమకూరతాయి. అవి ఆరోగ్యంగా ఉండటం, అలా ఆరోగ్యంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధకత మన సొంతం కావడంతో ఈ ఇమ్యూనిటీ కూడా క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతుందని గుర్తుంచుకోవాలి. ఇలా తీసుకున్న ఆహారం వల్ల ఒళ్లు పెరగకుండా తగినంత వ్యాయామమూ చేయడం వల్ల ఈ మార్గంలో క్యాన్సర్ నివారణ మరింత సమర్థంగా చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ రాజేష్ బొల్లం, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్నిర్వహణ యాసీన్
అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయిన శబరిమల..! తొలిరోజే మెగా రికార్డు..
కేరళలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. మొన్న(ఆదివారం) సాయంత్రం నుంచే దర్శనాలు ప్రారంభం కావడంతో వేల సంఖ్యలో భక్తలు తరలివస్తున్నారు. కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉండటంతో దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతోంది. అయితే సరైన సౌకర్యాలు లేక భక్తులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. 41 రోజుల పాటు సాగే మండల పూజ కోసం..ఈ ఏడాది మండల- మకరవిళక్కు (Mandala Makaravilakku)మండల పూజ) ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమై.. డిసెంబర్27న ముగియనుంది. ఆ నేపేథ్యంలోనే శబరిమల భక్తులతో కిటకిటలాడింది. తొలిరోజే భక్తజన సందోహం మెగా రికార్డు(1 లక్ష 25 వేలమందికి) రేంజ్లో అయ్యప్ప దర్శనానికి తరలివచ్చారు. అదీగాక ప్రస్తుతం 22 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనం కోసం వర్చువల్గా బుక్ చేసుకున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఈ సందర్భంగా ట్రావెన్కోర్ దేవస్థానం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది కూడా. కాగా, మండల సీజన్ కోసం ఆదివారం శబరిమల ఆలయం తిరిగి తెరుచుకోగా.. సోమవారం ఉదయం నుంచి నెయ్యాభిషేకాలు మొదలయ్యాయి. దీంతో.. ముర్ము ఇరుముడిలోని ముద్ర టెంకాయలోని నేతితో తొలుత అయ్యప్పకు అభిషేకం చేశారు. అలా.. మండల సీజన్లో తొలి నెయ్యాభిషేకం రాష్ట్రపతి ముర్ము చేయించినట్లయిందని టీడీబీ పేర్కొంది.(చదవండి: శబరిమలలో భారీ వర్షాలు..అయ్యప్ప భక్తులకు అలర్ట్!)
అంతర్జాతీయం
షేక్ హసీనాకు మరణశిక్ష
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్రసమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కేటాయింపుతో మొదలైన విద్యార్థుల ఉద్యమం చివరకు పదవీచ్యుత మహిళా ప్రధాని షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్ మరణశిక్ష విధింపునకు దారితీసింది. జూలై 15న విద్యార్థుల సారథ్యంలో ఉవ్వెత్తున ఎగసిన ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేసి 1,400 మంది మరణాలకు హసీనా కారణమయ్యారంటూ దాఖలైన కేసులో ఆమెకు మరణశిక్ష విధిస్తూ ట్రిబ్యునల్ సంచలన తీర్పు వెలువరిచింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ మొహమ్మద్ గులామ్ మోర్తుజా మజూందార్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. కోర్టు గతంలోనే ఆమె పారిపోయిన నేరుస్తురాలిగా ప్రకటించింది. మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నిర్దయగా ఆదేశాలు జారీచేసి భద్రతబలగాల సాయంతో ఉద్యమాన్ని అణిచివేశారని, వందల మంది మరణాలకు ప్రధాన బాధ్యురాలు అని ప్రభుత్వం అందించిన సాక్ష్యాధారాలతో రూఢీ అయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ వందల మరణాలకు, ఉద్యమాన్ని అణచివేత వ్యూహాలకు కర్త, కర్మ, క్రియ హసీనాయే. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న విద్యార్థులపైకి ఆమెకు చెందిన పార్టీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడులకు తెగబడేలా ఆమె రెచ్చగొట్టే ప్రకటనలు ఇచ్చారు. దాడులు చేస్తున్న వారిని ఏమాత్రం కట్టడిచేయకుండా ఆమె మానవత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. నిరసనబాటపట్టిన వేలాది మంది విద్యార్థులపై మారణాయుధాలు, హెలికాప్టర్లతో దాడులు చేయించారు’’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఉద్యమకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం వంటి ఘటనలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నాటి హసీనా ప్రభుత్వంలో హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు సైతం కోర్టు మరణశిక్షను ఖరారుచేసింది. మాజీ పోలీస్ ఉన్నతాధికారి, ఇన్స్పెక్టర్ జనరల్ చౌదరి అబ్దుల్లా అల్–మమూన్కు ఐదేళ్ల శిక్ష విధించింది. ఆమెను అప్పగించాలన్న తాత్కాలిక సర్కార్గత ఏడాది ఆగస్ట్ 5న దేశం నుంచి పారిపోయి ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న అవామీ లీగ్ పార్టీ అధినేత్రి హసీనాను తమకు అప్పగించాలని భారత్ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ భారత్కు పారిపోయిన హసీనా, అసదుజ్జమాన్ ఖాన్ కమాల్లను వెంటనే బంగ్లాదేశ్ ఉన్నతాధికారులకు అప్పగించండి. గతంలో మన రెండు శాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒడంబడికను గౌరవించాల్సిందే. కోర్టు తీర్పుతో దోషులుగా నిర్ధారణ అయిన ఖైదీలను మాకు భారత ప్రభుత్వం అప్పగించాలి. దోషులు అని తేలాకకూడా వాళ్లను ఆశ్రయం కల్పించడం స్నేహపూర్వక చర్య అనిపించుకోదు. ఇలాంటి ధోరణి న్యాయబద్ధంకాదు’’ అని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. ‘‘ఈ మేరకు మరోసారి భారత్కు అధికారికంగ లేఖ రాస్తాం. ఊచకోత కారకులకు ఇంకా ఆశ్రయం కల్పిస్తామని భారత్ మొండికేస్తే రెండుదేశాల మధ్య విరోధం పెరుగుతుంది’’ అని ప్రభుత్వ న్యాయ సలహాదారు అసిఫ్ నజ్రుల్ స్పష్టంచేశారు. దీనిపై భారత్ స్పందించింది. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది.తీర్పు తర్వాత పలు చోట్ల ఘర్షణలుతమ పార్టీ చీఫ్ హసీనాకు మరణశిక్ష ఖరారుచేస్తూ తీర్పు వెలువడటంతో అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దేశవ్యాప్తంగా కీలక నగరాలు, పట్టణాల్లో ఆందోళనకు దిగారు. దీంతో పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. ఆపద్ధర్మ ప్రభుత్వ అనుకూల వర్గాలు సైతం రోడ్లమీదకొచ్చాయి. ఢాకాలో హసీనా తండ్రికి చెందిన భవనాన్ని కూల్చేందుకు యత్నించగా పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. లాఠీచార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు.ఉక్కు మహిళ నుంచి మరణశిక్ష దాకా..1947 సెప్టెంబర్ 28వ తేదీన నాటి తూర్పు పాకిస్తాన్లో హసీనా జన్మించారు. ఈమె తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ 1971లో బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడి తర్వాత బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం సిద్దించేలా కృషిచేవారు. తర్వాత బంగ్లాప్రజలు ఆయనను జాతిపితగా కీర్తించారు. ఢాకా యూనివర్సిటీలో ఈమె చదువుకున్నారు. 1968లో అణుశాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాను పెళ్లాడారు. 1975లో సైనిక తిరగుబాటు వేళ తండ్రి, తల్లి, ముగ్గురు సోదరులు, ఇతర కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు. ఈ హత్యోదంతం తర్వాత ఈమె దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అప్పటికే దివంగత దేశాధ్యక్షుడు జివుర్ రెహ్మాన్ భార్య ఖలీదా జియా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. వీరిద్దరినీ బంగ్లాదేశ్ రాజకీయాల్లో పోరాడే బేగమ్లు అని పిలిచేవారు. 1996లో హసీనా తొలిసారిగా ప్రధానమంత్రి అయ్యారు. 2001లో ఓడినా 2008లో మళ్లీ పీఠం అధిరోహించారు. స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా అంశం గతేడాది చిలికిచిలికి గాలివానగా, విద్యార్థి మహోద్యమంగా మారడంతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోనే రహస్య జీవితం గడుపుతున్నారు.చట్టానికి ఎవరూ అతీతులు కారుతీర్పును స్వాగతిస్తూ యూనుస్ వ్యాఖ్యఢాకా: హసీనాకు పడిన మరణశిక్షను ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. తీర్పును స్వాగతిస్తున్నట్లు యూనుస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ ఈరోజు బంగ్లాదేశ్ వ్యాప్తంగా, దేశానికి ఆవల సైతం ప్రతిధ్వనించేలా దేశ న్యాయస్థానాలు అత్యంత స్పష్టమైన సందేశానిచ్చాయి. అధికారంలో ఉన్నా, లేకున్నా చట్టానికి ఎవరూ అతీతులు కారు అనే ప్రాథమిక సూత్రం ఇక్కడ వర్తిస్తుందని న్యాయస్థానం మరోసారి గుర్తుచేసింది. గత జూలై, ఆగస్ట్లో ఉద్యమం వేళ ప్రాణాలు కోల్పోయిన, వేధింపులకు గురైన, ఇప్పటికీ మనోవ్యథను భరిస్తున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగేలా కోర్టు తీర్పు వెలువడింది. ఏళ్ల తరబడి కొనసాగిన అణిచివేతతో పెళుసుబారిన ప్రజాస్వామ్య పునాదుల పునరుద్ధరణకు మేం కృషిచేస్తాం’’ అని యూనుస్ వ్యాఖ్యానించారు.హసీనాపై మోపిన కీలక ఆరోపణలు1. హత్య, హత్యాయత్నం, నిరసనకారులను చిత్రహింసలకు గురి చేయడం. విద్యార్థులపై దాడులను ప్రోత్సహించడం, దాడులను ఏమాత్రం అడ్డుకోకపోవడం2. హలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో నిరాయుధ విద్యార్థులపైకి మారణాయుధాలతో సైన్యం దాడిచేసేలా ఆదేశాలు ఇవ్వడం3. రంగ్పూర్లో బేగమ్ వర్సిటీ విద్యార్థి అబూ సయీద్ను అత్యంత దారుణంగా చంపేయడం4. ఆగస్ట్ 5న ఛంకార్పూర్లో ఆరుగురిని హత్యచేయడం, విద్యార్థులపై దాడి చేయాలని ప్రసంగాలు ఇవ్వడం5. ఆగస్ట్ 5న అషూలియాలో ఆరుగురు విద్యార్థులపై బుల్లెట్ల వర్షం కురిపించడం, తర్వాత ఆధారాల్లేకుండా తగలబెట్టడం రాజకీయ ప్రేరేపిత తీర్పు ఇదితీర్పుపై ఘాటుగా స్పందించిన హసీనాతీర్పుపై 78 ఏళ్ల హసీనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత తీర్పు. ప్రజాతీర్పు పొందని ఎన్నికల్లో గెలవని ఒక అనామిక ప్రభుత్వం ఒత్తిడితో వెల్లడైన తీర్పు ఇది. ప్రస్తుత ప్రభుత్వంలో తీవ్రస్థాయి భావజాలం ఏ స్థాయిలో తీర్పు కళ్లకుకడుతోంది. తీర్పు పూర్తిగా పక్షపాతధోరణితో, రాజకీయ కక్షతో వెలువర్చారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రధానిగా ఎన్నికైన నన్ను, అవామీ లీగ్ రాజకీయశక్తిని నిర్వర్యీంచేసే కుట్ర ఇది. పారదర్శకంగా కేసు నడవని, సాక్ష్యాధారాలను పరిశీలించని ఇలాంటి ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులకు నేను అస్సలు భయపడను. మొహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వం తమ చేతగానితనాన్ని ఈ తీర్పును సాకుగా చూపి అస్తవ్యస్తపాలనను అద్భుతంగా ఉందని చెప్పుకునే దుస్సాహసంచేస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యా అల్లా!.. సౌదీలో మృత్యు ఘోష
న్యూఢిల్లీ/సాక్షి, నెట్వర్క్/సాక్షి,న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా, మదీనా సందర్శించుకోవాలనే తమ చిరకాల వాంఛను తీర్చుకునేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లిన 45 మంది ఉమ్రా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో 43 మంది నగరానికే చెందిన వారు కాగా, మరో ఇద్దరు కర్ణాటకకు చెందినవారు. వీరు ప్రయాణిస్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టగా మంటలు చెలరేగడంతో అంతా సజీవ దహనమయ్యారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున మదీనాకు సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఉదయాన్నే అందిన పిడుగుపాటు లాంటి వార్త నగర వాసుల్ని కలచివేసింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు, వారి కుమారులు, కుమార్తెలు, వారి పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మొత్తం 46 మంది బస్సులో ప్రయాణిస్తుండగా ఒక్కరు మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు సమాచారం. మరణించిన నగర వాసుల్లో 18 మంది పురుషులు, 26 మంది మహిళలు కాగా వీరిలో 10 మంది చిన్నారులు ఉన్నారు. వీరి మృతదేహాలను జెడ్డాలోని కింగ్ ఫహద్, కింగ్ సల్మాన్, అల్ మిఖత్ ఆస్పత్రులకు తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. జెడ్డాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మృతదేహాలను మదీనాలోనే స్థానిక సంప్రదాయాల మేరకు ఖననం చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల వద్ద జరిగిన రెండు ఘోర బస్సు ప్రమాదాలను మరిచిపోక ముందే మరో దుర్ఘటన జరగడం, ఏకంగా 44 మంది హైదరాబాదీలు మరణించడం నగరాన్ని కుదిపేసింది. సౌదీ ప్రమాదంలో బతికి బయటపడింది ఇతను ఒక్కడే.. ప్రయాణంలో డ్రైవర్ పక్కన కూర్చున్న అబ్దుల్ షోయబ్ మొత్తం 54 మంది యాత్రికులు ఉమ్రా యాత్ర కోసం నగరంలోని వివిధ ట్రావెల్ ఏజెన్సీల నుంచి మొత్తం 54 మంది ఈ నెల 9న బయలుదేరి వెళ్లారు. మక్కా సందర్శన అనంతరం నలుగురు అక్కడే ఆగిపోగా.. మరో నలుగురు కారులో మదీనాకు వెళ్లారు. మిగిలిన 46 మందీ బస్సులో మదీనా వెళ్తుండగా గమ్య స్థానానికి 25 కి.మీ దూరంలో, భారత కాలమానం ప్రకారం ఉదయం 1:30 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. బస్సు రోడ్డు పక్కన ఆగి ఉండగా, ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. అయితే ప్రమాదానికి కారణాలను సౌదీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జెడ్డాలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు త్రెలిపారు. 8002440003 (టోల్ ఫ్రీ), 00966122614093, 00966126614276 00966556122301 (వాట్సాప్) హెల్ప్లైన్ నంబర్లను ప్రకటించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జెడ్డా నుంచి అధికారుల బృందం ఘటనా స్థలికి, ఆస్పత్రులకు వెళ్లినట్లు అక్కడి కార్యాలయ వర్గాలు తెలిపాయి. రియాద్లోని ఎంబసీ కార్యాలయం కూడా సౌదీ అధికారులతో కలిసి పని చేస్తోంది. సౌదీ ప్రమాదం నేపథ్యంలో న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో కూడా అధికారులు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. (కాంటాక్ట్ నంబర్లు.. వందన, పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్ –+91 98719 99044, సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ – +91 99583 22143, రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ –+91 96437 23157). ఇలావుండగా షెడ్యూల్ ప్రకారం యాత్రికుల బృందం ఈనెల 23న జెడ్డా నుంచి హైదరాబాద్కు బయలుదేరాల్సి ఉంది. ఈ మేరకు వీరికి విమాన టిక్కెట్లు సైతం బుక్ అయ్యాయి. ఉమ్రా యాత్ర సందర్భంగా ఎయిర్పోర్ట్లో ఒకే కుటుంబంలోని 18 మంది గ్రూప్ ఫొటో ప్రధాని మోదీ సంతాపం ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘నేను తీవ్ర విచారంలో మునిగిపోయా. నా ఆలోచనలన్నీ ఆప్తుల్ని కోల్పోయిన వారి చుట్టూనే ఉన్నాయి. జెడ్డాలోని మన కాన్సులేట్, రియాద్లోని ఎంబసీ అవసరమైన సహాయ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాయి. ఇక్కడి మన అధికారులు కూడా సౌదీ అధికారులతో కలిసి పని చేస్తున్నారు..’ అంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. రష్యా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి జైశంకర్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి సౌదీ ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే స్థానిక అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలిపారు. ఢిల్లీలోని అధికారులు, సౌదీలోని రాయబారితోనూ మాట్లాడాలని, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని సహాయకచర్యలు తీసుకోవాలని సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డిని ఆదేశించారు. కాగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ శాఖ అధికారితో కూడిన ప్రతినిధి బృందం తక్షణమే సౌదీ అరేబియాకు బయలుదేరి వెళ్లనుంది. మృతుల కుటుంబాలను ముఖ్యమంత్రి సూచనల మేరకు అన్ని రకాలుగా అదుకుంటామని, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చెప్పాట్టాలని సౌదీ అధికారులను కోరినట్లు మంత్రి అజారుద్దీన్ తెలిపారు. మృతులకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని, వారి కుటుంబాల నుంచి ఇద్దరిని అక్కడికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎస్ ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్తో మాట్లాడి తగు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర సచివాలయంలో మృతుల కుటుంబసభ్యులకు అవసరమైన సమాచారం అందించేందుకు వీలుగా 79979 59754, 99129 19545 టోల్ ఫ్రీ నంబర్లతో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ప్రమాదానికి సంబంధించిన సహాయ సహకారాల కోసం పోలీసు విభాగం తరఫున సంయుక్త పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్ పని చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఎప్పుడూ ప్రమాదకరమే.. సౌదీ అరేబియాలోని పవిత్ర స్థలాల నుంచి యాత్రికుల తరలింపు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా హజ్ యాత్ర సమయంలో రోడ్లన్నీ బస్సులతో కిటకిటలాడుతుంటాయి. ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా ఉంటాయి. 2023లో మక్కా నుంచి వెళ్తున్న ఓ బస్సును బ్రిడ్జిని ఢీకొట్టి మంటల్లో చిక్కుకోవడంతో 20 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 25 మంది గాయపడ్డారు. 2019లో ఓ బస్సు మరో భారీ వాహనాన్ని ఢీకొట్టడంతో 35 మంది చనిపోయారు. సౌదీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం సాక్షి, అమరావతి: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్రా యాత్రకు వెళ్లిన వారు మరణించడం విచారకరమన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలన్నారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 45 మంది మృతి బాధాకరంఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది భారతీయులు దుర్మరణం చెందడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘మృతిచెందిన వారిలో అత్యధిక మంది హైదరాబాద్కు చెందిన ముస్లిం యాత్రికులు ఉన్నట్లు తెలిసింది. వారి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. దిగ్భ్రాంతికి గురి చేసింది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉమ్రా యాత్రలో దుర్ఘటన దురదృష్టకరం రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాద దుర్ఘటనపై రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు మనోస్థైర్యాన్ని ప్రసాదించాలని ప్రారి్థస్తున్నట్లు పేర్కొన్నారు.ఏపీ వక్ఫ్బోర్డు చైర్మన్ సంతాపంసౌదీ అరేబియా ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అదేవిధంగా సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో 45 మంది మృతి చెందడం బాధాకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు.
సౌదీ ప్రమాదం: మృతదేహాలకు అక్కడే ఖననం?
రియాద్: సౌదీఅరేబియాలోని మదీనా సమీపంలో చోటుచేసుకున్న ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతిచెందగా.. వారి మృతదేహాలు గుర్తించలేని విధంగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో మృతిచెందిన హైదరాబాదీల మృతదేహాలను వెనక్కి రప్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా.. సౌదీ చట్టాల ప్రకారం ఈ ప్రక్రియ కొంత క్లిష్టమైనదేనని తెలుస్తోంది. సౌదీలో మరణిస్తే.. పరిస్థితులు ఏమిటనేదానిపై ‘సాక్షి వెబ్’ ప్రత్యేక కథనం..సౌదీఅరేబియాతోపాటు.. ఇతర గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఒకేలా ఉంటాయి. అక్కడ ఎవరైనా మరణిస్తే.. వారి రక్తసంబంధీకుల అనుమతితోనే మృతదేహాల తరలింపు ఉంటుంది. లేనిపక్షంలో.. ఎన్ని సంవత్సరాలైనా అక్కడి ప్రభుత్వాలు మృతదేహాలను మార్చురీల్లో భద్రపరుస్తాయి. ఇటీవల బహ్రెయిన్లో ఇద్దరు తెలంగాణ, మరో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పౌరుల మృతదేహాలు ఐదేళ్లుగా అక్కడి మార్చురీల్లో ఉన్న వార్తలు పతాకశీర్షికలకెక్కిన విషయం తెలిసిందే..! రక్తసంబంధీకులు ప్రభుత్వాలను సంప్రదించాక.. భారతీయ ఎంబసీల నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) తప్పనిసరి. ఆ తర్వాతే గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు మృతదేహాల తరలింపునకు అనుమతినిస్తాయి. ఆ అనుమతులు ఉంటేనే.. విమానయాన సంస్థలు మృతదేహాలను తరలించేందుకు అంగీకరిస్తాయి.మదీనా ప్రమాదంలో..మదీనా ప్రమాదంలో బస్సు ఆయిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఐదారు గంటల పాటు అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయినట్లు సౌదీలోని భారతీయులు ‘సాక్షి’కి వివరించారు. ఇప్పుడు మృతదేహాలను గుర్తించాలంటే.. డీఎన్ఏ పరీక్షలు మాత్రమే మార్గంగా ఉన్నాయి. అయితే.. ముస్లింలు ఎంతో ఖర్చును భరించి ఉమ్రా, హజ్ యాత్రలు చేస్తుంటారు.అలాంటి పరిస్థితుల్లో డీఎన్ఏ పరీక్షల కోసం మృతుల సంబంధీకులు సౌదీ వరకు వెళ్లడం ఖర్చుతో కూడుకున్న విషయమే..! అయితే.. ఇక్కడ ఓ వెసులుబాటు ఉందని సౌదీలో పనిచేస్తున్న భారతీయులు చెబుతున్నారు. మన ప్రభుత్వాలు సౌదీ సర్కారును సంప్రదిస్తే.. మన దగ్గర ఉండే సౌదీఅరేబియా ఎంబసీ అధికారులు ఇక్కడే డీఎన్ఏ పరీక్షలు జరిపించి, వాటి నివేదికలను సౌదీకి పంపే అవకాశాలున్నాయంటున్నారు. సౌదీలో మరణించిన భారతీయుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది.అక్కడే అంత్యక్రియలు?ముస్లింల పంచసూత్రాల్లో రోజుకు ఐదుపూటలా నమాజు చేయడం, రంజాన్ మాసంలో ఉపవాసాలు, పేదలకు దానాలు(జకాత్)తోపాటు.. మక్కా యాత్ర కూడా ఒకటి. సౌదీ అరేబియాలోని మక్కా, మదీనాలను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలంతా అత్యంత పవిత్ర ప్రదేశాలుగా భావిస్తారు. అక్కడ మృతిచెందితే.. అది జన్నత్(స్వర్గం)కు మార్గంగా భావిస్తారు. ‘‘మక్కా యాత్ర సందర్భంగా అరాఫత్ పర్వతం వద్ద జరిగే తొక్కిసలాటలో ఎవరైనా మరణిస్తే.. మృతుల కుటుంబీకులు ఇక్కడే ఖననం చేయాలని నిర్ణయిస్తారు.90% మంది భావన ఇదే. నాకు తెలిసి.. గత మక్కా యాత్ర సందర్భంగా మృతిచెందిన వారిలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మృతదేహాలను వేర్వేరు దేశాలకు తరలించారు’’ అని సౌదీలో ఉంటున్న కరీంనగర్ వాసి ఒకరు తెలిపారు. మదీనా సమీపంలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో.. బంధుమిత్రులు మిగిలిన అవశేషాలను సౌదీలోనే ఖననం చేసే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘సౌదీలోనే ఖననం చేయాలంటే.. మృతుల బంధుమిత్రులు ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. సౌదీ అధికారులు ఖననం చేయవచ్చంటూ ఇక్కడి ప్రొఫార్మాలో సమ్మతిపత్రాన్ని సమర్పిస్తే సరిపోతుంది. ప్రభుత్వమే అన్ని లాంఛనాలతో ఖననాలు జరుపుతుంది’’ అని ఆయన వివరించారు.
షేక్ హసీనా భర్త ఎవరు, ఆయన దాచుకున్న అపురూపమైన గిఫ్ట్!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా (Sheikh Hasina) మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు సంబంధించి బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించడంతో ఆమె వార్తల్లో నిలిచింది. హసీనాను దోషిగా నిర్ధారించిన కోర్టు తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో హసీనా కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా భర్త డా.ఎం.ఎ. వాజెద్ మియా (Wazed Miah) గురించి తెలుసుకుందాం.షేక్ హసీనా పుట్టుక1947 సెప్టెంబరు 28న పాకిస్థాన్లోని తుంగిపారాలో షేక్ హసీనా జన్మించారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, తొలి అధ్యక్షుడు జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ ఆమె తండ్రి. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేది. హసీనా ఢాకా విశ్వవిద్యాలయం నుంచి బెంగాలీ సాహిత్యంలో హసీనా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1968లో అణు శాస్త్రవేత్త ఎం.ఎ.వాజెద్ మియాను వివాహం చేసుకున్నారు. వీరికి సజీబ్ వాజెద్ జాయ్ అనే కొడుకు, సైమా వాజెద్ పుతుల్ అనే కుమార్తె ఉన్నారు.2004 ఆగస్టులో దేశ రాజధాని ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీపై గ్రెనేడ్ దాడినుంచి తృటిలో తప్పించుకుంది హసీనా. 2006-2008 రాజకీయ సంక్షోభం మధ్య, హసీనా దోపిడీ ఆరోపణలపై అరెస్టైంది. విడుదలైన తర్వాత 2008 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 2014, 2018 ఎన్నికల్లోనూ అవామీ లీగ్ పార్టీని గెలిపించి ప్రధానిగా ఎన్నికై, ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన మహిళా నేతల్లో ఒకరిగా చరిత్ర సృష్టించిన ఘనతను దక్కించుకుంది హసీనా. 2024లో స్వాతంత్య్ర పోరాట వీరుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం సందర్భంగా అల్లర్లు, విద్యార్థులపై అణచివేత, హింస ఆరోపణల కారణంగా ఆమెను నిరంకుశ నేతగా, దోషిగా పేర్కొంటూ కోర్టు మరణ శిక్ష విధించింది.ఉక్కు మహిళగా, తిరుగులేని నేతగాతన తండ్రి స్థాపించిన రాజకీయ పార్టీ అయిన అవామీ లీగ్ను నడిపించి, దశాబ్దాల పాటు బంగ్లాదేశ్ను రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్న ‘ఉక్కు మహిళ’ గా పేరుగాంచిన హసీనా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది. తిరుగులేని నాయకురాలిగా నిలిచింది. ప్రతిపక్ష నాయకురాలిగా కూడా ప్రజాస్వామ్యం గొంతుకగా మారింది. పలు సార్లు గృహనిర్బంధాన్ని కూడా ఎదుర్కొంది. విద్యార్థి ఉద్యమం చిలికి చిలికి గాలివానలా ముదిరి బంగ్లాదేశ్లో అశాంతి నెలకొంది. అది చివరికి హసీనాను పదవి నుండి తొలగించే స్థాయికి చేరింది. దీంతో 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ నుండి పారిపోయి అప్పటి నుండి భారతదేశంలో తలదాచుకుంది. ఎవరీ ఎంఏ వాజెద్ మియాహసీనా భర్త వాజెద్ మియా సైన్స్ రంగంలో చాలా ప్రభావవంతమైన వ్యక్తి. తన కెరీర్ మొత్తంలో, అనేక ప్రభావవంతమైన పుస్తకాలను ప్రచురించారు. అణుశాస్త్రవేత్తగా ఎంతో కృషి చేశారు. 1942, ఫిబ్రవరి 16న రంగ్పూర్లోని పిర్గంజ్లో జన్మించారు వాజెద్ మియా. ఈయనను ప్రేమగా 'సుధా మియా' అని పిలుస్తారు. రంగ్పూర్లో విద్యను పూర్తి చేసిన తర్వాత, వాజెద్ మియా భౌతిక శాస్త్రంలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలు పొందారు , రెండింటిలోనూ టాప్గా నిలిచారు. తరువాత ఇంపీరియల్ కాలేజ్ లండన్ నుండి డిప్లొమా , UK లోని డర్హామ్ విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో PhD పొందారు.1963లో, మియా పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్లో ఉద్యోగంలో చేరారు. ఇటలీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియొరెటికల్ ఫిజిక్స్లో అసోసియేట్షిప్ తర్వాత, మియా పాకిస్తాన్కు తిరిగి వచ్చాడు. అనంతరం కరాచీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ప్రధాన శాస్త్రవేత్తగా చేరారు. అయితే, అతని భద్రతా అనుమతి రద్దు చేయడంతో అతను బంగ్లాదేశ్కు వలస వెళ్ళాడు.బంగ్లాదేశ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్గా బంగ్లాదేశ్కు తిరిగి వచ్చిన తర్వాత, మియాబంగ్లాదేశ్ అటామిక్ ఎనర్జీ కమిషన్లో గణనీయ మైన సేవలందించారు. వాటిలో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ , బంగబంధు షేక్ ముజిబ్కే ఘైర్ కిచ్చు ఘటానా ఓ బంగ్లాదేశ్ ఉన్నాయి. తరువాత బంగ్లాదేశ్ అణుశక్తి కమిషన్ ఛైర్మన్ అయ్యాడు. 1999లో పదవీ విరమణ చేశాడు.వాజెద్ మియా అరెస్టుఢాకా విశ్వవిద్యాలయంలో ఉన్న సమయంలో, వాజెద్ మియా రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు.. 1961 నుండి 1962 వరకు,ఫజ్లుల్ హక్ ముస్లిం హాల్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు.అయితే 1962 తూర్పు పాకిస్తాన్ విద్యా ఉద్యమంలో పాల్గొన్నందుకు కూడా అతను అరెస్టు అయ్యాడు. కాలేజీ రోజుల్లో రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ, విశ్వవిద్యాలయం తర్వాత అతను రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.వాజెద్ మియా - షేక్ హసీనాల వివాహం1967 నవంబర్ 17న వాజెద్ మియాను వివాహం చేసుకుంది హసీనా. అప్పటికి బంగ్లాదేశ్లోని ప్రతికూల రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ వివాహం చాలా సన్నిహితంగా జరిగింది. ఇదీ చదవండి: మరణ శిక్ష : మాజీ ప్రధాని షేక్ హసీనా తొలి స్పందనమామగారి బహుమతిని అపురూపంగావివాహ సమయంలో, హసీనా తండ్రి రెహమాన్ జైలులో ఉన్నారు. దీంతో జైలులోంచే కొత్త జంటను ఆశీర్వదించిన ఆయన తన అల్లుడు వాజెద్కు రోలెక్స్ గడియారాన్ని బహుమతిగా ఇచ్చాడు. దానిని వాజెద్ తన జీవితాంతం విలువైన ఆస్తిగా, అపురూపంగా దాచుకున్నాడట. వాజెద్ మియా అస్తమయంరాజకీయ కుటుంబంలోని వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ, షేక్ ముజిబుర్ రెహమాన్ అల్లుడు లేదా షేక్ హసీనా భర్త అని అతను ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అణు శాస్త్రవేత్తగా వాజెద్ తన తెలివితేటలతో ప్రత్యేకంగా నిలిచాడు. అయితే తీవ్ర గుండె సమస్యలతో పాటు మూత్రపిండ వైఫల్యం, మధుమేహం, ఉబ్బసం , అధిక రక్తపోటుతో బాధపడుతూ 66 ఏళ్ల వయసులో వాజెద్ 2009లో కన్నుమూశాడు. గొప్ప అణు శాస్త్రవేత్తగా మియా అందించిన సేవలను గొప్పగా, నిత్యం ప్రకాశించే లైట్హౌస్గా భావిస్తారు.
జాతీయం
భారత్లో మరోసారి ఆత్మాహుతి దాడికి జైషే కుట్ర
ఢిల్లీ: ఎర్రకోట బాంబు తరహాలో భారత్లో మరోసారి ఆత్మాహుతి దాడికి నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్- మహమ్మద్ ప్రయత్నిస్తుందని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఆదాడి కోసం పాకిస్థాన్లో విరాళాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నాయి.ఎర్రకోట బాంబు పేలుళ్లపై ఎన్ఐఏ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జైష్ ఉగ్ర సంస్థ ఎర్రకోట కారు బాంబు తరహాలో భారత్లో మరో ఆత్మాహుతి దాడి (ఫిదాయిన్)కు ప్రణాళికలు రచించిందని తెలుస్తోంది. అంతే కాకుండా ఆ దాడికోసం డిజిటల్ మార్గాల ద్వారా విరాళాలు సేకరిస్తుందని అందులో సదాపే అనే పాకిస్థాన్కు చెందిన యాప్ కూడా ఉందని తెలిపింది. ఫండ్ రుసుము పాకిస్థాన్ కరెన్సీలో 20వేలు భారత్(రూ.6400) ఉన్నట్లు పేర్కొంది. ఈ డబ్బులను ఉగ్రవాదుల ఖర్చులకోసం ఉపయోగిస్తున్నట్లు సమాచారం.వీటితో పాటు ఉగ్రవాదులకు చలికాలపు కిట్ ముజాహిద్ ఇచ్చే వారినెవరినైనా జిహాదీలుగా పరిగణిస్తారని జిహాదీల మరణానంతరం వారిపై శ్రద్ధ కనిపించేవారిని సైతం జిహాదీలుగానే గుర్తిస్తున్నట్లు దర్యాప్తులో వివరాలు తెలిసాయి. ఇటీవల ఎర్రకోటలో జరిగిన బాంబు దాడులలో టెర్రర్ డాక్టర్ గ్రూప్కు డిజిటల్ మార్గంలోనే నిధులు అంది ఉండవచ్చని దానిపై ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్నామని ఎన్ఐఏ బృందాలు పేర్కొన్నాయి.కాగా ఇటీవల ఫరీదాబాద్ అక్రమ పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన డాక్టర్. షహీన్ సయీద్ ఈ దాడికి ఫండ్ చేసిందని ఎన్ఐఏ బృందాలు అనుమానిస్తున్నాయి. ఈ బాంబు పేలుళ్ల కేసులో షహీన్ సయీద్ను మేడమ్ సర్జన్ అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. జమాత్ - ఉల్- ముమినాత్ అనే యూనిట్లో ఆమె సభ్యురాలిగా ఉన్నట్లు సమాచారం.
ఇన్వెస్టర్ల క్యూ : కొత్త ఐటీ నగరం వచ్చేస్తోంది!
కర్ణాటకలో మరో కొత్త ఐటీ నగరం రూపుదిద్దుకోబోతోంది. బిడది (Bidadi)లో కొత్త ఐటీ నగరాన్ని నిర్మించ నున్నామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకె శివకుమార్ (DK Shivakumar) చెప్పారు. అనేక దేశాల నాయకులు ఇటీవల బెంగళూరు సందర్శించారని, భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహంగా డిప్యూటీ సీఎం ఉన్నారని చెప్పారు. బెంగళూరు టెక్ సమ్మిట్ 2025 సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్వేలో ఉన్న బిడదిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఐటీ నగరాన్ని ప్లాన్ చేస్తోందని డీకే ప్రకటించారు. గ్రేటర్ బెంగళూరు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ (GBIT) ప్రాజెక్ట్ అంతర్జాతీయ వ్యాపారవేత్తలను ఆకర్షిస్తోందని, గణనీయమైన పెట్టుబడులకు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. ఈ పెట్టుబడులను తాము స్వాగతిస్తున్నట్టు చెప్పారు.చదవండి: ఎనిమిదేళ్లనాటి దారుణ హత్యలు : క్లూ ఇచ్చిన ల్యాప్ట్యాప్60 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమ్మిట్ మూడు రోజుల పాటు ఐటీ భవిష్యత్తుపై చర్చిస్తుందన్నారు. కర్ణాటకలోని నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి,అభివృద్ధి చెందుతున్న స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థ యొక్క బలాలను నొక్కిచెప్పారు. "స్థానిక ప్రతిభ, ఆవిష్కరణ, సాంకేతికత మరియు స్టార్ట్-అప్లను సరిగ్గా ప్రోత్సహిస్తే కర్ణాటకను కొత్త దిశలో తీసు కెళతాయన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని తానెపుడూ యువను కోరుతూ ఉంటానన్నారు. అలాగే అవకాశాలను కోరుతూ కర్ణాటకకు వచ్చే వారికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ఈ సందర్బంగా ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే , కియోనిక్స్ అధిపతి శరత్ బచ్చే గౌడల కృషిని ఆయన ప్రశంసించారు, బెంగళూరు నగరాన్ని ఈ రంగంలో అగ్రగామిగా మార్చడానికి నగర 25 లక్షల ఐటీ నిపుణుల సహకారాన్ని ఆయన కొనియాడారు.ప్రపంచంలో ఇంతటి ప్రతిభ మరెక్కడా లేదని పేర్కొన్నారు శివకుమార్.ఇదీ చదవండి: H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్లో ఆ కంపెనీల జోరు
అమెరికా నుంచి భారత్కు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్!
న్యూఢిల్లీ: పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా, మహారాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్య , బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రెండు కేసుల్లో ప్రధాన నిందితుడైన భారత్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, అన్మోల్ బిష్ణోయ్ను అమెరికా ప్రభుత్వం బుధవారం ప్రత్యేక విమానంలో భారత్కు తరలించింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అయిన తర్వాత భారత దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు అన్మోల్ బిష్ణోయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా ఢిల్లీ పాటియాలా కోర్టులో హాజరుపరిచారు. అనంతరం చట్టపరంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తమ ఆధీనంలో ఉన్న అన్మోల్ బిష్ణోయ్ ఫొటోను ఎన్ఐఏ తొలిసారి విడుదల చేసింది.పంజాబ్లోని ఫాజిల్కాకు చెందిన అన్మోల్ బిష్ణోయ్ తన నేర సామ్రాజ్యాన్ని విదేశాల నుంచి నడిపించాడు. 2022లో సిద్ధూ (Sidhu Moosewala) మూసేవాలాను మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా మార్గం మధ్యలో అడ్డగించిన దుండగులు అతడిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సిద్దూమూసేవాలా హత్యకేసులో అన్మోల్ ప్రధాన నిందితుడు.సిద్ధూమూసే వాలా హత్య అనంతరం అన్మోల్ బిష్ణోయ్ ఫేక్ పాస్పోర్టుతో భారత్ నుంచి అమెరికా వెళ్లాడు. అక్కడి పోలీసులు అన్మోల్ బిష్ణోయ్ను అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో పలు నేరాల్లో అన్మోల్ ప్రమేయం ఉండడంతో అమెరికా ప్రభుత్వం అతడికి జైలు శిక్ష విధించింది. నాటి నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో 18 కేసుల్లో ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో అన్మోల్ను విచారణ నిమిత్తం అతడిని తమకు అప్పగించాలని భారత్ సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో అమెరికా అన్మోల్ను బహిష్కరించడం, ఆపై భారత్కు తరలించడంతో మార్గం సుగమమైంది. ప్రస్తుతం తమ అదుపులో ఉన్న అన్మోల్ను ఎన్ఐఏ అతనిపై మొత్తం నమోదైన కేసులపై దర్యాప్తు చేపట్టనుంది. అన్మోల్తో పాటు మోస్ట్ వాటెండ్ లిస్టులో ఉన్న 199 మందిని సైతం అమెరికా భారత్కు అప్పగించింది.
సబ్మరతి జైల్లో ఉగ్రవాది అహ్మద్పై దాడి.. ఆస్పత్రికి తరలింపు
గుజరాత్లో ఉగ్ర కుట్రకు సూత్రధారి, హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్పై దాడి జరిగింది. ప్రస్తుతం అహ్మదాబాద్ శివారులోని సబర్మతి జైలులో ఉన్న అతడిపై తోటి ఖైదీలు దాడి చేసి చితకబాదారు. ఈ దాడిలో అతని ముఖానికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. జోన్ 2 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అహ్మద్ సయ్యద్ను జైల్లోని హైసెక్యూరిటీ సెల్లో ఉంచారు. అయితే ఈ కేసులో తనతో పాటే అరెస్టైన అజాద్, సుహాయిల్తో సయ్యద్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో ముగ్గురు ఖైదీలు అనిల్ కుమార్, శివమ్ శర్మ, అంకిత్ లోడీ జోక్యం చేసుకుని సయ్యద్పై ఓ కర్రతో దాడికి దిగారు. ఈ దాడిలో సయ్యద్ ముఖానికి గాయాలు కావడంతో చికిత్స కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు చెందిన ఓ బృందం సబర్మతి జైలుకు చేరుకుంది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి.. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంది. దాడికి పాల్పడిన ఖైదీలు ఒకరు హత్య కేసులో నిందితుడు కాగా.. మరొకర ఆర్థిక నేరంలో, ఇంకొకరు పోక్సో కేసులో శిక్ష అనుభవిస్తున్నారుఅసలు దాడి ఎందుకు జరిగిందనే అంశంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల అనగా నవంబర్ 8న, గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. మొహియుద్దీన్.. ఐసీస్కు చెందిన ఓ డిపార్ట్మెంట్ అయిన.. ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ)కు చెందిన ఉగ్రవాదిగా దాదాపు నిర్ధారణ అయ్యింది. ఆముదం గింజల నుంచి విషం తయారు చేసి.. దాన్ని ప్రసాదంలో కలిపి.. అమాయకుల ప్రాణాలు తీయాలని భావించిన మొహియుద్దీన్ స్కెచ్ గీశాడు. చైనాలో ఎంబీబీఎస్ చదవిన మొహియుద్దీన్.. అబుల్ ఖాదీమ్ ఆదేశాల మేరకు ఆముదం గింజల నుంచి ప్రమాదకరమైన రైసిన్ అనే ప్రమాదకరమైన విషాన్ని తయారు చేయడానికి ఇంట్లోనే అన్ని పరికరాలు ఏర్పాటు చేసుకున్నాడు. అహ్మదాబాద్ ఏటీఎస్ అహ్మద్తో పాటు అరెస్టైన మరో ఇద్దరిని విచారించింది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొహియుద్దీన్.. మరో ఉగ్రవాది అబూ ఖాదీమ్ ఆదేశాల మేరకు పని చేస్తుంటాడని విచారణలో తెలిసింది. అబూ ఖాదీమ్ పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లో ఉండి ఈ మాడ్యూల్ను నడిపిస్తున్నాడని.. దర్యాప్తులో వెల్లడైంది.
ఎన్ఆర్ఐ
బహ్రెయిన్లో మృతి చెందిన ఐదేళ్లకు గల్ఫ్ కార్మికుడి అంత్యక్రియలకు సన్నాహాలు
ఐదేళ్ల క్రితం బహ్రెయిన్లో మృతి చెందిన జగిత్యాల జిల్లా మెటుపల్లి కి చెందిన శ్రీపాద నరేష్ మృతదేహం అతిశీతల శవాగారంలో మగ్గుతోంది. భౌతికకాయాన్ని భారత్కు పంపించడం చేయడం సాధ్యం కాదని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేయడంతో... బహ్రెయిన్లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు సమ్మతిస్తూ, మృతుని భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి) నిరభ్యంతర పత్రంపై సంతకం చేశారుతదుపరి చర్యలకు కోసం కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట సంజయ్, మంగళవారం ప్రజా భవన్ లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణిని సందర్శించి మృతుడి సోదరుడు ఆనంద్ తో కలిసి నోటరీ అఫిడవిట్ (నిరభ్యంతర పత్రం) ను సీఎం ప్రజావాణి ఇంచార్జి డా. జి. చిన్నారెడ్డికి, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డికి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం, బహరేన్ లోని ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసి అక్కడే అంత్యక్రియలు జరిగేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ బహ్రెయిన్ వెళ్ళి అంత్యక్రియలకు హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్లు నంగి దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, సామాజిక సేవకులు మొరపు తేజ, ఆకుల ప్రవీణ్, బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బహరేన్ లోని సామాజిక కార్యకర్తలు డి.వి. శివకుమార్, కోటగిరి నవీన్ కుమార్, నోముల మురళి భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.
జుకర్బర్గ్కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకి
ముగ్గురు కళాశాల డ్రాపౌట్లు 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకి ప్రవేశించారు. తద్వారా మెటా అధిపతి మార్క్ జుకర్బర్గ్ రికార్డును చెరిపేశారు. ఫోర్బ్స్ ప్రకారం, మెర్కోర్ (Mercor )అనే AI-ఆధారిత రిక్రూటింగ్స్టార్టప్ వ్యవస్థాపకులైన ముగ్గురుస్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా,ప్రపంచంలోనే అతి చిన్న బిలియనీర్లుగా నిలిచారు. ఈ ముగ్గురూ, స్వయంకృషితో బిలయనీర్లుగా ఎదిగారు. వీరిలో హిరేమత్ భారతీయసంతతికి చెందినవాడు కావడం విశేషం. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన మెర్కోర్ కంపెనీ ప్రస్తుత విలువ రూ. 88,560.68 కోట్లకు (10 బిలియన్ డాలర్లు)గా ఉంది. 350 మిలియన్ల డాలర్ల తాజా నిధులతో కంపెనీ వాల్యుయేషన్ ఈ స్థాయికి ఎగిసింది. దీంతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కులైన సెల్ఫ్-మేడ్ బిలియనీర్లుగా ఈ ముగ్గురూ నిలిచారు. మెర్కోర్ సీఈవో బ్రెండన్ ఫుడీ, CTO ఆదర్శ్ హిరేమత్ , బోర్డు చైర్మన్ సూర్య మిధా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు.ఈ ముగ్గురి ప్రయాణంకాలిఫోర్నియాలోని శాన్జోస్లోని బెల్లార్మైన్ కాలేజ్ ప్రిపరేటరీ బోయిస్ స్కూలు నుంచే మొదలైంది.అక్కడ డిబేట్ టీమ్లో టాప్ మెంబర్స్గా పేరు తెచ్చుకున్నారు. ఒకే సంవత్సరంలో మూడు మేజర్ పాలసీ డిబేట్ టోర్నమెంట్స్ గెలుచు కున్న తొలి వ్యక్తులు.హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న సమయంలో మెర్కోర్పై పూర్తి సమయం దృష్టి పెట్టడానికి చదువును విడిచి పెట్టాల్సి వచ్చింది. మెర్కోర్లో పని చేయకపోతే, రెండు నెలల క్రితమే పట్టభద్రుడయ్యేవాడినని, ఇంతలోనే తన జీవితం 180-డిగ్రీల యు-టర్న్ తీసుకుందని పేర్కొన్నాడు. అలాగే సూర్య మిధా జార్జ్టౌన్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం చదువుతున్న సమయంలోనే బ్రెండన్ ఫుడీని కలిశాడు. దీంతో హిరేమత్తో పాటు మిధా, ఫుడీ ఇద్దరూ తమ చదువును వదిలేశారు. అలా వారి అభిరుచులు కలిసి, నైపుణ్యాన్ని మేళవించి మెర్కోర్ నాంది పలికింది. ప్రపంచ రికార్డుకు దారి తీసింది.
అంతర్జాతీయ న్యాయవాది డా. శ్రీనివాస్ రావుకి అరుదైన గౌరవం
ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది డా. శ్రీనివాస్ రావు కావేటిని ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. అంతర్జాతీయ న్యాయ సేవల్లో విశేష కృషి చేసినందుకు గాను డా. శ్రీనివాస్ రావు కావేటికి ప్రతిష్టాత్మకమైన ‘బెస్ట్ ఇంటర్నేషనల్ కౌన్సెల్ లీడర్షిప్ ఇన్ ది యూఎస్ ఆఫ్ 2025’ అవార్డు దక్కింది. ‘బెస్ట్ ఆఫ్ బెస్ట్ రివ్యూ’ సంస్థ డా. శ్రీనివాస్ రావు కావేటికి ఈ అవార్డును అందించింది.‘బెస్ట్ ఆఫ్ బెస్ట్ రివ్యూ’ సంస్థ అందించిన ఈ గౌరవం, భారతీయ చట్టాలను అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలతో సమన్వయం చేయడంలో డా. కావేటి చేసిన అసాధారణ కృషికి దక్కిన గుర్తింపు అని చెప్పవచ్చు. అంతర్జాతీయ న్యాయ సేవలలో కావేటి లా సంస్థ ఎంతో పేరొందింది. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా అడుగుపెట్టిన డాక్టర్ కావేటి శ్రీనివాస్ రావు ఆ తర్వాత ఆస్ట్రేలియా, యూకే, అమెరికా వంటి దేశాలలో సొలిసిటర్గా, నోటరీ పబ్లిక్గా సేవలందించారు.ఆయన స్థాపించిన కావేటి లా ఫర్మ్.. అమెరికా, భారతదేశం, యూకే, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో సేవలందిస్తోంది. కార్పొరేట్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, బిజినెస్ ఇమ్మిగ్రేషన్ వంటి కీలక రంగాలలో సరిహద్దులు దాటి క్లయింట్లకు సేవలను అందిస్తోంది. ఒకే గొడుగు కింద స్థానిక, అంతర్జాతీయ న్యాయ సేవలను అందించడం ఈ సంస్థ ప్రత్యేకత. నిజాం కాలేజ్ పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ కావేటి శ్రీనివాస్ రావు న్యాయ విద్యతో పాటు ఎంబీఏ, జర్నలిజంలో మాస్టర్స్ పట్టాలను కూడా పొందారు. న్యాయ విద్యార్థులకు, చార్టర్డ్ అకౌంటెన్సీ అభ్యర్థులకు మార్గనిర్దేశం చేస్తూ గ్లోబల్ ఎడ్యుకేటర్గా కూడా ఆయన గుర్తింపు పొందారు.(చదవండి: ఘనంగా 'ఆటా' 19 మహాసభలు కిక్ ఆఫ్ వేడుడ
తెలివైన వాళ్లు ఇండియాను ఎందుకు వీడుతున్నారు?
డాలర్ డ్రీమ్స్...బీటెక్ చదవాలి.. అమెరికాకో..కెనడాకో.. జర్మనీకో ఎగిరిపోవాలి..ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో చదువుకోవాలి. మంచి పేరు సంపాదించాలి. మంచి విజ్ఞనాన్ని ఆర్జించాలి. ఇలా ప్రతి సంవత్సరం లక్షలాది మంది తమ ఊరు, తమ నేల, తమ మనుషుల్ని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. ఎవరో కలల కోసం, ఇంకెవరో అవకాశాల కోసం, మరెవరో గౌరవం కోసం..! కానీ ఆ ప్రయాణం ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే ప్రశ్నను లేపుతోంది. మన దేశం మన కలలను ఎందుకు ఆపలేకపోతోంది? భారతదేశం ఒక నేల మాత్రమే కాదు.. ఒక అనుభూతి..! జ్ఞానం, ధైర్యం, సంస్కారం కలిసిన ఒక శ్వాస..! అయినా కూడా ఈ పవిత్ర గడ్డపైనే పుట్టినవాళ్లు బయటకు ఎందుకు పరుగెడుతున్నారు? ఇది కేవలం వలస కథ కాదు.. ఇది మనసుల వేదన.. ఇది ఆశల కొత్త దిశలో పుట్టిన తపన..! ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? భారతీయులు ఇండియాను ఎందుకు వదిలి వెళ్లిపోతున్నారు? నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడకుందాం.. కాసేపు దేశభక్తిని పక్కనపెడదాం.. దేశంపట్ల బాధ్యత కలిగిన వ్యక్తులగానే చర్చించుకుందాం.. అసలు ఈ సమస్యకు కారణమేంటి తెలుసుకుందాం. నిజానికి భారత్ నుంచి బయలుదేరే ఈ ప్రయాణం కొత్తది కాదు.. బ్రిటీష్ కాలం నుంచే విదేశాలకు వెళ్లే మార్గం తెరుచుకుంది.. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం సముద్రాలు దాటారు. తరువాతి కాలంలో బెంగళూర్, హైదరాబార్, గురుగ్రామ్ నగరాలనుంచి యువత విదేశాల తరలిపోయారు. చాలామంది అక్కడే స్థిరపడిపోయారు కూడా. మన దేశంలో చిన్న వయసు నుంచే పోటీ జీవితంలో ఒక భాగమవుతుంది.ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ సీటు కోసం పోటీ. ఇక చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం కొత్త పోరాటం. టాలెంట్ ఉన్నవాడికి తగిన గౌరవం దక్కడం అరుదుగా మారిపోయింది. ఇక్కడ పరిచయాలు చాలా సార్లు ప్రతిభ కంటే పెద్దవిగా మారుతాయి. అసలు కష్టపడి పనిచేసిన వాడే అవకాశాలు కోల్పోతున్నాడు. అదే మనసులో మిగిలిన నిరాశ ఆలోచనగా మారుతోంది. ఇక్కడ కష్టపడి పనిచేస్తే ఫలితం రాదని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. జీవన ప్రమాణాలూ కారణమా?అంతేకాదు.. ఇండియాలో జీవన ప్రమాణాలు కూడా చాలా నాసిరకంగా ఉంటాయి. నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. వాతావరణం, పరిశుభ్రత, నకిలీ మందులు. కచ్చిత పనిగంటల పనివిధానం. మరోవైపు విదేశాల్లో జీవన విధానం మనకు కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. నిబంధనలు స్పష్టంగా ఉంటాయి.. ప్రతి ఒక్కరి శ్రమకు గౌరవం ఉంటుంది. ఎవరైనా కష్టపడి పనిచేస్తే, ఆ కష్టం వృథా కాదనే నమ్మకం అక్కడ బలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలూ ఎక్కువే. టెక్నాలజీ, హెల్త్కేర్, ఫైనాన్స్, పరిశోధన లాంటి రంగంలో ప్రపంచం తలుపులు తెరుస్తోంది. సమాన అవకాశాలు, సమాన గౌరవం అనే వాతావరణం విదేశాల్లో కనిపిస్తోంది. మరోవైపు భారతీయులు విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక భద్రత కూడా ఒక పెద్ద కారణం. నిజానికి ఇతర దేశాల్లో కూడా పన్నులు ఎక్కువే ఉంటాయి. అయితే అవి ఎక్కువగా ఉన్నా వాటి వినియోగాన్ని ప్రజలు చూస్తారు. ఇక్కడ పన్నులు చెల్లించినా అభివృద్ధి కనిపించదు. రోడ్లకు గుంతలే కనిపిస్తాయి. విద్యుత్ కోతలు కూడా వేధిస్తాయ్.. ఆస్పత్రుల సేవల్లో ఆలస్యం ఉంటుంది. చెప్పాలంటే ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేస్తున్న వాళ్లలో చాలామందికి బాధ్యత ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. ఇటు కొంతమంది నిబద్ధతతో పనిచేయాలన్న ఆసక్తి ఉన్నా వ్యవస్థ దాన్ని అడ్డుకుంటుంది. ప్రతిభకు గౌరవం దక్కకపోవడం, అవినీతి పెరగడం, భవిష్యత్తుపై అనిశ్చితి లాంటివి భారతీయులను విదేశాలవైపు వెళ్లేలా చేస్తున్నాయి.ఒక్కసారి మీరే ఆలోచించండి... మన దగ్గర మంచి చదువు చదివిన వాళ్లు, తెలివైన వాళ్లు బ్యాగ్ వేసుకుని విదేశాలకు ఎందుకు వెళ్లిపోతున్నారు? అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా.. ఇలా ఎక్కడైనా ఛాన్స్ దొరికితే వెళ్లిపోతున్నారు. వారి తెలివితేటలు, విజ్ఞానం మనకెందుకు దూరంగా పోతున్నాయి? ఇది చూసి చాలామందికి 'అబ్బే డబ్బుల కోసం వెళ్లిపోతున్నారు' అని అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. చదువుల్లో టాపర్స్, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి సంస్థల్లో సీట్లు సాధించిన వారు, చదువు పూర్తి చేసిన వెంటనే అమెరికా అనీ, యూరప్ అనీ, ఆస్ట్రేలియా అంటూ పక్క దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారంటే దీనికి కారణం కేవలం విలాసంగా బతకాలన్న కోరికా కాదండి. అలా వెళ్లేవాళ్లని అడిగితే 'ఇండియాలో నేను ఎంత పని చేసినా గుర్తింపు లేదు', 'రీసెర్చ్ చేయాలన్నా ఫ్రీడమ్ లేదు', 'నన్ను నమ్మే వాతావరణమూ లేదు' అని చెబుతున్నారు. వాస్తవానికి చాలామంది మేధావులు తమ టాలెంట్ను ఉపయోగించుకోవటానికి, అభివృద్ధి చేసుకోవటానికి సరైన ప్లాట్ఫామ్ కోసం వెతుకుతుంటారు. వారి పరిశోధనలకు అవసరమైన వనరులు, స్వేచ్ఛ, ప్రోత్సాహం లాంటివి ఇండియాలో లేవన్నది ఎక్కువగా వినిపిస్తున్న విమర్శ. ఇదీ చదవండి: క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీఎంతమంది?ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2022లో 2,25,260 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. 2023లో కూడా దాదాపు 2,16,219 మంది అదే పని చేశారు. 2014లో ఈ సంఖ్య 1,29,234 మాత్రమే ఉండగా, 2011 నుంచి 2023 మధ్య మొత్తం 19 లక్షల మంది భారతీయులు ఇండియా పాస్పోర్ట్ను వదిలేశారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 23,000 మంది భారతీయ మిలియనీర్లు దేశం వదిలి వెళ్లిపోయారు. ఇదే సమయంలో, 2014 నుంచి 2022 మధ్యలో భారత బిలియనీర్ల ఆస్తులు 280శాతం పెరిగాయి, అంటే దేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటుకంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఒకవైపు మధ్యతరగతి, ప్రతిభావంతులు అవకాశాల కోసం దేశం వదిలిపెడుతుంటే, మరోవైపు అత్యంత ధనవంతులు తమ భవిష్యత్ భద్రత కోసం విదేశాల్లో స్థిరపడుతున్నారు.ఇక బ్రెయిన్ డ్రెయిన్ అంటే కేవలం ఒక గణాంకం కాదు.. ఇది దేశం కోల్పోతున్న మేధస్సు! ప్రతి ప్రతిభావంతుడు బయటకు వెళ్లినప్పుడల్లా మన భవిష్యత్తు కొంత వెనుక్కు వెళ్లిపోతుంది. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే.. మన దేశం ఇలా మేధస్సును పోగొట్టుకోవడం ఆపాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా, ఇక్కడే ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించాలి. పరిశోధనకు పెట్టుబడి పెట్టాలి. యువతను ప్రోత్సహించే విధానాన్ని అభివృద్ధి చేయాలి. టాలెంట్ను గుర్తించి, ప్రోత్సహించాలి. అవార్డులు, గ్రాంట్లు, రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. సొంతదేశంలోనే అందరూ గర్వంగా ఎదిగేలా చేయాలి. ఎందుకంటే.. ఒకరు దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు, అది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు. అది సమాజం, వ్యవస్థ ఇచ్చిన సిగ్నల్ కూడా. ఈ సిగ్నల్ను మార్చేది మనమే..కానీ అది ఎప్పటికి సాధ్యమవుతుందో కాలమే నిర్ణయించాలి.
క్రైమ్
ఇంకా గర్బం దాల్చ లేదంటూ భర్త, అత్త వేధింపులు..
హైదరాబాద్: గర్భందాల్చలేదని, ఉద్యోగం చేయాలని భర్త, అత్త వేధింపులకు గురిచేయడంతో ఓ గృహిణి ఉరి వేసుకొని తనువు చాలించిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..జగిత్యాలకు చెందిన సౌజన్య(27)కు పెద్దపల్లికి చెందిన బోగ కిరణ్తో గత మార్చి 22న వివాహం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ భార్య సౌజన్యతో కలిసి టీఎన్జీఓస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కిరణ్ సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లాడు. భర్త సాయంత్రం 4 గంటలకు రాగా తలుపులు తెరువలేదు. ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపు గడియ విరగ్గొట్టి చూడగా సౌజన్య ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకొని చనిపోయి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహన్ని స్వా«దీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా ఉద్యోగం చేయమని, గర్భం దాల్చలేదని భర్త, అత్త మల్లేశ్వరి వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని సౌజన్య తల్లి రాజేశ్వరి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
లడ్డూ ఇస్తానని చెప్పి బంధువు అత్యాచారయత్నం
హిందూపురం: పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. లడ్డూ ఇస్తానని ఆశ చూపి పసిమొగ్గపై కామాంధుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. స్థానికులు విషయం తెలుసుకుని కామాంధునికి దేహశుద్ధి చేసి, అనంతరం పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఓ కాలనీలో చేనేత కార్మికుడు నివాసం ఉంటున్నాడు. ఈయన భార్య రెండేళ్ల క్రితం మృతి చెందింది. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తె నాలుగో తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాల ముగించుకుని పెద్దనాన్న ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి సొంతింటికి వస్తుండగా వరుసకు తాత అయిన గోపీ అనే 55 ఏళ్ల వ్యక్తి బాలికను పిలిచి.. లడ్డూ ప్రసాదమిస్తానని ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం తలుపు వేసి.. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించబోయాడు. బాలిక భయపడిపోయి గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో ఎవరో బయట నుంచి పిలవడంతో గోపీ తలుపు కొద్దిగా తెరవగానే సందులోంచి బాలిక బయటకు పరుగులు తీసి ఇంటికి చేరుకుంది. తల్లిలేని ఆ బాలిక ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏడ్చుకుంటూ కూర్చుండిపోయింది. పొరుగింటి మహిళ దగ్గరకు తీసుకుని విషయం ఆరా తీసింది. పాపను సముదాయించి కాలనీవాసులతో కలిసి గోపీ ఇంటికి వెళ్లి నిలదీశారు. స్తంభానికి కట్టేసి చితకబాది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే రోజు రాత్రి గోపీని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం అస్వస్థతకు గురైన బాలికను వైద్య పరీక్షలకు పంపాల్సిన పోలీసులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. మంగళవారం ఉదయం విషయం తెలుసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు, సీపీఎం, కేవీపీఎస్ నాయకులతో కలిసి చిన్నారిని ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. కామాంధున్ని కఠినంగా శిక్షించాలి బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సీఐటీయూ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బాలికకు న్యాయం చేయాలని మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా సహాయ కార్యదర్శి వీఆర్ రాము, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రమణ, ఉపాధ్యక్షురాలు జ్యోతమ్మ మాట్లాడుతూ బాధితురాలిని ఆస్పత్రికి తరలించడంలో పోలీసులు, చికిత్స అందించడంలో వైద్య సిబ్బంది చేసిన నిర్లక్ష్యంపై మండిపడ్డారు. పసిపిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేకు ఇన్చార్జ్ తహసీల్దార్ మైనుద్దీన్కు వినతిపత్రం అందించారు.
భర్తను కాదని.. ఎల్రక్టీషియన్తో వివాహేతర సంబంధం
మంగళగిరి టౌన్: వేరే వ్యక్తితో కలిసి ఉంటున్న భార్యను భర్త గొంతునులిమి హత్య చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... పెనమలూరు మండలం పెదపులిపాకలో శంకరరెడ్డి తన భార్య లక్ష్మీపార్వతి (29)తో ఉంటున్నాడు. మిఠాయి కార్కానాలో మేస్త్రీగా పనిచేస్తున్నాడు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఎనిమిది నెలల క్రితం మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. అయిదు నెలల క్రితం మంగళగిరి మండల పరిధిలోని చినకాకాని గ్రామానికి లక్ష్మీపార్వతి వచ్చింది. స్థానికంగా ఎల్రక్టీషియన్గా పనిచేసే మహేష్తో పరిచయం ఏర్పడింది. మంగళగిరి మండలం పరిధిలోని యర్రబాలెంలో ఇద్దరు కలిసి నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న శంకరరెడ్డి మంగళవారం మధ్యాహ్నం లక్ష్మీపార్వతి నివాసానికి వెళ్లి గొడవ పడ్డాడు. పెద్దగా వాగ్వాదం జరిగింది. లక్ష్మీపార్వతి పరిగెత్తుకుంటూ వచ్చి పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్లింది. శంకరరెడ్డి కూడా ఆమెను వెంబడించి లోపలికి వెళ్లి గడి పెట్టాడు. భార్య గొంతు నులిమి హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు రూరల్ సీఐ బ్రహ్మం సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని వైద్యశాలకు పంపారు. శంకరరెడ్డి పరారీలో ఉన్నాడని, ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదేం అఘాయిత్యం నాన్నా?
పశ్చిమ గోదావరి జిల్లా: కన్నతండ్రే కూతురిపై రెండేళ్లుగా లైంగిక దాడి చేస్తున్నాడు. ఈ విషయం బయటపెడితే తాను పురుగు మందు తాగి చనిపోతానని బెదిరించాడు. పెరవలి మండలం పిట్టల వేమవరం గ్రామంలో ఈ దారుణం జరుగగా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ మంగళవారం విచారణ చేపట్టారు. నిందితుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండేళ్లుగా పెద్ద కుమార్తెను బెదిరిస్తూ అఘాయిత్యం చేస్తుండగా ఇటీవల కుమార్తెలో మార్పు రావటంతో తల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లింది.అక్కడ పరీక్షల్లో కుమార్తె గర్భ నిరోధక మాత్రలు వాడినట్లు తేలటంతో ఇంటికి వచ్చి కుమార్తెను నిలదీయగా తండ్రే ఈ దురాగతానికి పాల్పడినట్లు చెప్పింది. దీనితో భర్తను నిలదీయగా ఈ విషయం బయట చెబితే తాను పురుగు మందు తాగుతానని బెదిరించాడు. నువ్వు చచ్చినా ఫర్వాలేదు అని చెప్పి ఆమె కుమార్తెలతో సహా ఈ నెల 12వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో విషయం ఎక్కడ బయటపడుతోందనని డ్రైవర్ పురుగు మందు తాగాడు. స్థానికులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూతుర్లతో సహా పుట్టింటికి వెళ్లిన నిందితుడి భార్య ఈ నెల 15వ తేదీన పెనుమంట్ర పోలీసులను ఆశ్రయించింది. అక్కడ జీరో ఎఫ్ఆర్ఐ నమోదు చేసి పెరవలి పోలీసు స్టేషన్కు 16వ తేదీన పంపించారు. దీంతో ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన నిందితుడు ఆసుపత్రి నుంచే పరారీ అయ్యాడని అధికారులు చెబుతున్నారు. భార్య, బాధిత బాలిక, నాన్నమ్మ, చుట్టుపక్కల కుటుంబాలను డీఎస్పీ దేవకుమార్ విచారించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడని, మద్యానికి బానిసైన అతను కుటుంబ సభ్యులను రోజూ ఏదో రకంగా బాధపెడుతూ, చిత్రహింసలకు గురిచేసేవాడని తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. అతన్ని త్వరలోనే అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
వీడియోలు
మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలకు చెల్లుబోయిన అదిరిపోయే కౌంటర్
నల్గొండ జిల్లా దేవరకొండలో ఇద్దరు శిశువుల విక్రయం
రంపచోడవరం ఆసుపత్రికి మావోయిస్టుల మృతదేహాలు
Kanna Babu: ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామన్నారుగా ఎక్కడ బాబు?
Visakhapatnam: రైలుపై పడ్డ కరెంటు స్తంభం..
చిన్నారికి నామకరణం చేసిన వైఎస్ జగన్
న్యాయం చేస్తావని నిన్ను నమ్మితే.. సంబరాలు చేసుకుంటున్నావా..
విజయవాడ కోర్టుకు 28 మంది మావోయిస్టులు
స్వాములపైకి దూసుకెళ్లిన కారు
Bandi Sanjay: మా లక్ష్యం మావోయిస్టుల అణచివేతే..!

