పిఠాపురం: కర్పూరం వెలిగించి.. హుండీలో వేసి..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురంలో భక్తురాలు అత్యుత్సాహం ప్రదర్శించింది. కర్పూర హారతి వెలిగించి హుండీలో వేసింది. దీంతోహుండీలో నోట్లకు నిప్పు అంటుకుంది. శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో ఘటన జరిగింది. హుండీ నుండి పొగలు రావడాన్ని గమనించిన ఆలయ సిబ్బంది.. నీళ్లు పోసి మంటల్ని ఆర్పివేశారు. కాలిన నోట్లను వేరు చేసిన సిబ్బంది.. నోట్లను హెయిర్ డ్రైయర్తో ఆరబెట్టారు.శృంగార వల్లభస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులుతొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి అనేక మంది భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకోవడానికి ఆలయానికి తరలివచ్చారు. సుమారు 20 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు.ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2,45,750, అన్నదాన విరాళాలకు రూ.78,315, కేశ ఖండన ద్వారా రూ.5,920, తులాభారం ద్వారా రూ.450, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.29,895లతో రూ.3,60,330 ఆదాయం వచ్చిందని చెప్పారు. 4,200 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజలు నిర్వహించారు. దేవస్తాన సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు.
అత్యంత అరుదైన వ్యాధి: కంటి రెప్పల్లో పేలు..!
తల్లో పేలు గురించి విన్నాం కానీ, కనురెప్పల్లో పేలు ఉండటం గురించి వినలేదు కదా..!. కనురెప్పల్లో చుండ్రు ఉంటుందని తెలుసగానీ ఇదేంటీ..పేలు ఉండటం అని విస్తుపోకండి. ఎందుకంటే..నిజంగానే ఓ మహిళ కంట్లో ఏకంగా 250 పేలను గుర్తించారు వైద్యులు. తొలుత వైద్యులు సైతం ఆశ్యర్యపోయారు. ఆ తర్వాత ఈ వ్యాధి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మరి చికిత్స అందించి ఆమెకు చక్కటి ఉపశమనం అందించారు. అసలేంటి ఈ సమస్య? ఎందుకు వస్తుంది వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!గుజరాత్లోని ఆమ్రేలి జిల్లా సావర్ కుండ్ల ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 66 ఏల్ల గీతాబెన్ కంటిలో తీవ్రమైన దురద, నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చింది. సూరత్కు చెందిన గీతాబెన్కు ఈ సమస్య గత రెండున్నర నెలలుగా వేధిస్తోంది. కళ్లు ఎర్రబారిపోవడం, సరిగా నిద్రపట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమైంది. దీంతో కంటి డాక్టర్ మృగాంక్ పటేల్ ఆమె కళ్లను పరీక్షించగా.. రెప్పల్లో ఏకంగా పేలు ఉన్నట్లు గుర్తించారు. మొదట ఆయన కూడా ఇదేంటని విస్తుపోయారు. ఆ తర్వాత వివిధ అధ్యయన పత్రాలను శోధించి.. ఇలాంటి వింత కేసు గురించి తెలుసుకున్నట్లు తెలిపారు. దీన్ని వైద్య పరిభాషలో ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అంటారని చెప్పారు. తాము మాగ్నిఫికేషన్ కింద కనురెప్పల్ని పరిశీలించినప్పుడు, పేలు కదులుతున్నట్లు గుర్తించామని అన్నారు. వాటి తోపాటు గుండ్రని పేను గుడ్లను కూడా కనిపించాయని వెల్లడించారు. వీటిని తొలగించాలంటే చాలా సమయం పడుతుందని ముందుగానే బాధిత మహిళకు తెలియజేసి మరి ఆపరేషన్కి సిద్ధం చేశారామెను. అయితే ఆమెకున్నవైద్య పరిస్థితుల రీత్యా ఎలాంటి ఇంజెక్షన్లు ఇవ్వకుండా ఒక్కొక్కపేనుని ఓపికగా తొలగించారు వైద్యులు. ఈ పరాన్న జీవి కంటి రెప్ప మూయగానే అమాంతం రక్తం తాగేస్తుందట. ఎందుకంటే అక్కడ కణజాలాం చాలా పల్చగా ఉండి, సులభంగా రక్తాన్ని పీల్చేయగలదని అన్నారు. పైగా అక్కడ కనురెప్పలకు అతుక్కుపోయి ఉంటాయట. దీని కారణంగా పేషెంట్కి దురద, మంట వస్తుందట. అదీగాక ఇవి తొలగించాలనుకున్నా..అంత తేలిగ్గా రావట కూడా. ప్రత్యేక పరికరంతో తొలగింపు ప్రక్రియ..ఈ పేలు వెలుతురు పడినప్పుడూ కదులుతుంటాయట. కాబట్టి వాటిని తొలగించడానికి మెక్ఫర్సన్ అనే ప్రత్యేక పరికరం ఉపయోగించి ప్రతీ పేనుని పట్టుకుని బయటకు తీసినట్లు వివరించారు. అలాగే ఆ మహిళకు నొప్పి తెలియకుండా అనస్థీషియా ఇచ్చాం అని వైద్యుడు మృగాంక్ వెల్లడించారు. తన 21 ఏళ్ల అనుభవంలో ఇలాంటి కేసు మొట్టమొదటిదని, అస్సలు ఎప్పుడూ ఇలాంటి కేసు ఎదురవ్వలేదని అన్నారు. బాధిత మహిళ కంటి రెప్పల్లోంచి ఏకంగా 250 పేలు, 85 గుడ్లు(లార్వా)లు తొలగించినట్లు తెలిపారు.ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అంటే..యుఎస్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అనేది అరుదైన వైద్య పరిస్థితి. దీనివల్ల పేలు, వాటి గుడ్లు కనురెప్పలలో చేరుతాయి. దాంతో తీవ్రమైన దురద, కళ్లు ఎర్రబారడం, నిద్రలేమి వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయట. అయితే ఇది సాధారణ కంటి ఇన్ఫెక్షన్కానందున నిర్థారించడం కష్టమని అన్నారు. వీటి లార్వాలు అచ్చం దోమ లార్వాలనే ఉంటాయని చెప్పారు.ఈ పరిస్థితి ఎందుకొస్తుందంటే..ఇన్ఫెక్షన్ కారణంగా లేదా పరిశుభ్రత లోపించినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు వైద్యులు. పేలు రావడానికి కొన్ని రకాల వాతావరణాలు, ఇంట్లోని దిండ్లు కారణం కావొచ్చని అన్నారు. ఈ వ్యాధి మనుషులతోపాటు పశువుల్లో కూడా కనిపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా అడవుల్లో తిరిగే వాళ్లకు, పశువులకు దగ్గరగా ఉండేవాళ్లకు ఇవి వెంటనే అటాక్ అవుతాయట. వెంటనే కనురెప్పలకు చేరి అక్కడ తిష్టవేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇవి కాంతి పడినప్పుడూ పారిపోతాయి కాబట్టి లైట్ లేకుండా తొలగించాలని చెబుతున్నారు వైద్యులు. పైగా ఈ పరాన్నజీవి లార్వాలను ఏ ఔషధం చంపలేదని అన్నారు. వాటిని ఒక్కొక్కటిగా పట్టుకుని కంటి నుంచి తొలగించడం ఒక్కటే మార్గం అని అన్నారు.'తలలో ఉండే పేలు కంటి పేలు భిన్నంగా ఉంటాయి. కంటి పేలు, కంట్లోని తెల్లటి భాగంలో తిరుగుతూ వెలుతురు నుంచి పారిపోతాయి. అవి కంటి రెప్ప లోపల, చీకటిగా ఉండే భాగంలో జీవిస్తాయి. అక్కడే ఉంటాయి' అని చెప్పుకొచ్చారు డాక్టర్ మృగాంక్. లక్షణాలు కంటి నొప్పి, కళ్ళలో ఎప్పుడూ దురద, నిద్రలేమి కనురెప్పల వాపు, నీరు కారడం వంటివి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని సూచించారు. చేతులను క్రమం తప్పకుండా శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని, యువతలో ఈ పరిస్థితి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు.(చదవండి: కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం... అమర్యాద...అనారోగ్యకరం కూడానా?)
ఇచ్చిన మాట కోసం ఎన్నో త్యాగాలు చేశాం: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతీ పథకాన్ని పక్కాగా అమలు చేసినట్టు తెలిపారు. ఇదే సమయంలో రేండేళ్ల కాంగ్రెస్ పాలనను, పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చవద్దన్నారు. బీఆర్ఎస్ కారణంగా తెలంగాణ పూర్తిగా దివాలా తీసిందని ఘాటు విమర్శలు చేశారు.తాజాగా మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగింది. ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిదే. రూ.1300 కోట్ల బకాయిలు రద్దు చేసిన ఘటన వైఎస్సార్దే. వ్యవసాయాన్ని పండుగ చేసిన గొప్ప నేత వైఎస్సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా నిలిచింది. రైతుల సంక్షేమం కోసం అనేక ప్రాజెక్ట్లు నిర్మించింది. కాంగ్రెస్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాం. ప్రతీ పథకాన్ని పక్కాగా అమలు చేశాం.వృద్ధిరేటులో దేశంలోనే రంగారెడ్డి టాప్.. ప్రపంచాన్ని శాసించే సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. ఇవన్నీ తెలంగాణ గ్రోత్ ఇంజిన్గా మారాయి. వృద్ధిరేటులో దేశంలోనే రంగారెడ్డి జిల్లాలో మొదటి స్థానంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక ఆదాయం హైదరాబాద్ నుంచే వచ్చింది. బీఆర్ఎస్ పాలనలో సచివాలయం, కమాండ్ కంట్రోల్, ప్రగతి భవన్తో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా?. కాళేశ్వరంలో ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా?. కాళేశ్వరం లేకున్నా దేశంలో అత్యధిక వరి దిగుబడి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో వరి ఉత్పత్తి లేదు. రూ.20లక్షల కోట్లతో నికరంగా ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా?.సంక్షేమం ఇదే కదా..రేండేళ్ల కాంగ్రెస్ పాలనను, పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చకండి. అన్ని రంగాల్లో బకాయిలు పెట్టి రూ.8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని మాకు అప్పగించారు. వందేళ్లు పూర్తి అయిన ఉస్మానియా ఆసుపత్రిని కూడా కట్టలేదు. తెలంగాణను పూర్తిగా దివాలా తీశారు. తాడు తెగితే పాతాళంలో పడే పరిస్థితికి తెచ్చారు. వాళ్లు దొడ్డు బియ్యం ఇస్తే, మేము సన్న బియ్యం ఇస్తున్నాం. కొత్త రేషన్కార్డులు ఇచ్చాం. రైతు రుణమాఫీ చేశాం. రైతు భరోసా పెంచాం. షాద్ ముబారక్ కొనసాగించాం. రూ.500లకే సిలిండర్ ఇచ్చాం. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఆపలేదు. వాటిని కొనసాగిస్తున్నాం. ఎర్రగడ్డ, అల్వాల్, ఎల్బీనగర్, వరంగల్ ఆసుపత్రులను ఏడాదిన్నరలోగా పూర్తి చేస్తాం.తెలంగాణలో అభివృద్ధి జరగవద్దా?బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే అభివృద్ధి జరగాలా?. తెలంగాణలో మాత్రం అభివృద్ధి జరగవద్దా?. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్కు తీసుకువచ్చాం. మూసీ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పారదర్శకంగా జరుగుతోంది. ప్రతీ రూపాయిని పారదర్శకంగా ఖర్చు చేస్తున్నాం. తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తోంది. ఐటీఐఆర్ కారిడార్ వస్తే హైదరాబాద్కు లక్షల ఉద్యోగాలు వచ్చేవి. ఐటీఐఆర్ కారిడార్ను కేసీఆర్, మోదీ కలిసి రద్దు చేశారు. కిషన్రెడ్డి.. గుజరాత్కు ఎన్నాళ్లు గులాంగా ఉంటావు. తెలంగాణ అభివృద్ధి నీకు అవసరం లేదా?. తెలంగాణ అభివృద్ధికి ఎందుకు సహకరించడం లేదు అని ప్రశ్నించారు. కేటీఆర్, కిషన్ రెడ్డి తోడు దొంగలు. మూసీ వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఎందుకు పర్యటించలేదు?. మూసీ ప్రక్షాళన చేస్తానంటే అడ్డుకున్న వారు, వరదలు వచ్చినప్పుడు ఎందుకు అడ్డుగా పడుకోలేదు? అని ప్రశ్నించారు. చరిత్ర ఇదే.. జైపాల్ రెడ్డి కృషి వల్లే హైదరాబాద్కు మెట్రో వచ్చింది. ఇది చరిత్ర.. ఇది కేసీఆర్ చెరిపేస్తే చెరిగేది కాదు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క కొత్త యూనివర్సిటీనైనా తీసుకొచ్చారా.. కనీసం వీసీలను నియమించలేదు. ఐదువేల పాఠశాలలు మూసేశారు. పేదలకు విద్య, రైతులకు వ్యవసాయాన్ని, మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేశారు. దశ సరిగ్గా లేని వాడి కోసం వాస్తు పేరుతో దిశ మారిస్తే ప్రయోజనం ఉంటుందా?. మా ప్రభుత్వంలో 7100 కోట్లు ఉచిత బస్సు కోసం ఖర్చు చేశాం. ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల వైపు నడిపించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచాం. 3 వేల కోట్లతో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నాం. 100 ఎకరాల్లో హైకోర్టు నిర్మిస్తున్నాం. బీసీ కుల గణన చేసి కేంద్రం జనగణనతోపాటు కుల గణన చేసేలా చేశాం. ఎస్సీ వర్గీకరణ చేసి చూపించాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్ ఏర్పాటు చేశాం. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. హైదరాబాద్ నగరానికి పదేళ్లలో ఒక్క చుక్క అదనంగా తాగునీరు తీసుకొచ్చారా. మేం వచ్చాక 20 టీఎంసీల గోదావరి జలాలు తెచ్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చాక 20 వేలకు పైగా నోటిఫికేషన్లు వేశాం, 60 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తీ చేశాం. ఎవరిది అగ్రికల్చర్.. ఎవరిది డ్రగ్స్ కల్చర్ మీరే ఆలోచించండి. ఎవరిది పబ్ కల్చర్.. ఎవరిది సామాన్యులతో కలిసే కల్చర్. ఎవరు సినీ తారలతో తిరిగే కల్చర్.. ఎవరిది సినీ కార్మికుల కోసం కృషి చేసే కల్చర్ మీరు ఆలోచించండి.జూబ్లీహిల్స్ కాంగ్రెస్దే.. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది.. ప్రాధాన్యత వారీగా పరిష్కరిస్తాం. నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాపై ఉంది. జూబ్లీహిల్స్ గెలవాల్సిందే అభివృద్ధి జరగాల్సిందే. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుస్తోంది. బీఆర్ఎస్కు గతమే తప్ప.. భవిష్యత్ లేదు. పంతులు లేని బడిలాగా బీఆర్ఎస్ తయారైంది. జాబ్లీహిల్స్లో బీఆర్ఎస్కు బీజేపీ సాయం చేస్తోంది. నాది లీడర్ మైండ్ సెట్ కాదు. కేడర్ మైండ్ సెట్, అందుకే నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా. నేను గల్లీలోనే కాదు.. ఇంటింటికీ తిరుగుతాను. బీజేపీ డిపాజిట్ కూడా రాదు’ అని జోస్యం చెప్పారు.
‘శివ’లో చిరంజీవి హీరో అయితే.. ఆర్జీవీ ఏం చెప్పారంటే...
‘శివ’.. టాలీవుడ్ హిస్టరీలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన కల్ట్ క్లాసిక్ చిత్రం ఇది. రాజమౌళి మొదలు సందీప్రెడ్డి వంగా వరకు చాలా మంది దర్శకులకు ‘శివ’ఒక భగవద్గీత లాంటిది. ఆ సినిమా నుంచే చాలా నేర్చుకున్నామని పలువురు దర్శకులు చెప్పారు. 36 ఏళ్ల కిత్రం(1989) రామ్ గోపాల్వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం.. ఇప్పుడు మరోసారి థియేటర్స్లో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. సరికొత్త సాంకేతిక హంగులతో నవంబర్ 14న ఈ చిత్రం రీరిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆర్జీవీ తాజాగా ‘సాక్షి’తో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.నాగార్జున కోసమే ‘శివ’ పేరుశివ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఈ సినిమా తీసినప్పుడు నా వయసు 26 ఏళ్లు మాత్రమే. ఒకటి రెండు హాలీవుడ్ సినిమాలు చూసి మనం ఎందుకు ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని శివ కథ రాసుకున్నా. అప్పటికీ తెలుగు తెరపై ఇలాంటి సినిమాలు రాలేదు. ముద్దుల మామయ్య లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఆడుతున్న రోజులవి. ఒక రియలిస్టిక్ కథలా చెబితే జనాలు చూస్తారనే నమ్మకం కూడా లేదు. కానీ నా కోసమే ఈ సినిమా తీశా. నాకు నచ్చినట్లుగా తెరకెక్కించా. హిట్ కోసం తీయాలనుకుంటే.. ఇప్పటికే హిట్ అయిన సినిమాలను కాపీ చేసి తీయాలి. ఆ పని నేను చేయలేదు. ఇలాంటి కథలు ఆడవని అంతా చెప్పేవారు.కానీ తీస్తే కదా ఆడుతుందో లేదో తెలిసేదని నేను శివ తీశాను. వాస్తవంగా ఈ సినిమాలో ‘శివ’ పేరు ముందుగా విలన్ రఘువరన్కి పెట్టాను. కానీ నాగార్జున కథ విని.. శివ పేరు బాగుంది కదా.. నా పాత్రకు పెట్టొచ్చు కదా అన్నాడు. అప్పుడు హీరో పాత్రకి శివ పేరు మార్చాను. విలన్కి భవానీ పేరు పెట్టాను. తక్కువ బడ్జెట్ఈ సినిమా రిలీజై 36 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ ఈ చిత్రం గురించి మాట్లాడుతున్నారంటే.. ఇదేదో బాహుబలి చిత్రం అని కాదు. కానీ అప్పటికీ ఇలాంటి కథతో సినిమా తీసిన దాఖలాలు లేవు. నిజం చెప్పాలంటే శివలో అసలు కథే లేదు. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కొత్తగా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు వాస్తవికంగా ఉంటాయి. ఆడియన్స్కి కొత్త సౌండ్స్తో సినిమా చూపించాం. నాతో పాటు అందరూ కొత్తవాళ్లే కాబట్టి.. ఇళయరాజా లాంటి సీనియర్ సంగీత దర్శకుడు ఉండాలని పట్టుపట్టి మరీ ఆయనను ఒప్పించాను. కారు బురలో పడిన సౌండ్స్ తో, హీరో-విలన్ షర్ట్ పట్టుకొని కొట్టుకునే సౌండ్స్ అన్ని రికార్డు చేసి మరీ వాడాం. అంతకు ముందు అన్ని సినిమాల్లో యాక్షన్ సీన్లలో అరుపులు వినిపించేవి.కానీ శివలో మాత్రం ఎవరూ కూడా నోటితో అరవొద్దని ముందే చెప్పా. సౌండ్స్తో యాక్షన్ సీన్స్ తీశాం.చిరంజీవితో తీస్తే.. శివ రిలీజ్ అయిన తర్వాత టాక్ ఎలా ఉందనే విషయం నాతో పాటు నాగార్జునకు కూడా పూర్తిగా తెలియదు. రిలీజ్ అయిన రెండు రోజుల తర్వాత నాగేశ్వరరావుతో నాగార్జున కారులో వెళ్తుంటే.. ‘సినిమాకు హిట్ టాక్ వచ్చింది...ఎంత పెద్ద విజయం అవుతుందో చెప్పలేం’అని అంటున్నారని చెప్పారట. అప్పుడు కానీ ఈ సినిమా హిట్ అయిందనే విషయం నాగార్జునకు తెలియలేదట. నేను కూడా ఇంత హిట్ అవుతుందని ఊహించలేదు’ అని ఆర్జీవి చెపుకొచ్చాడు. ఇక ఈ సినిమా హిట్ అయిన తర్వాత ‘చిరంజీవి’ అనే మ్యాగజైన్లో ఈ సినిమాలో నాగార్జున కాకుండా చిరంజీవి హీరో అయితే ఎలా ఉండేది అనే శీర్షికతో ఓ స్టోరీ ముద్రించారని.. నిజంగానే చిరంజీవితో తీస్తే ఎలా ఉండేది?’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆర్జీవీ సమాధానం చెబుతూ.. ‘అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఒక చిన్న హీరో సినిమా హిట్ అయితే.. ఇదే సినిమాను పెద్ద హీరోతో చేస్తే బ్లాక్ బస్టర్ అయ్యేది అని చెబుతుంటారు. కానీ ఆ పాత్రకు నాగార్జున సెట్ అయ్యాడు కాబట్టే హిట్ అయింది. చిరంజీవితో అయితే ఎలా ఉండేదో చెప్పలేం’ అని ఆర్జీవీ అన్నారు.
జేఎస్డబ్ల్యూ సిమెంట్ లాభం రూ.75.36 కోట్లు
చాన్నాళ్ల తర్వాత ఈ హీరోయిన్ల 'తెలుగు' సినిమాలు
టీ20 వరల్డ్కప్కు సంబంధించి బిగ్ అప్డేట్
నోరెత్తితే నోటీస్ పంపించడమే కూటమి పాలన: శైలజానాథ్
30 ఏళ్లుగా ఇదే పని: ఇష్టమొచ్చినట్టు గడుపుతా..
స్టార్ హీరోలు ఇకపై అదీ భరించాల్సిందే.. నిర్మాతల మండలి
తాలిబాన్లతో మోదీ దోస్తీ.. ఇప్పుడే ఎందుకు?
బాబోయ్ చలి.. అప్పటి దాకా అంతే.. తెలంగాణకు హెచ్చరిక
ఎంఎస్ఎంఈలపై మరింత దృష్టి: వినేష్ మెహతా
పగలు మద్యం తాగితే భారీ ఫైన్.. అమల్లోకి కొత్త చట్టం..ఎక్కడంటే?
మంగళగిరిలో టిఫిన్.. తిరుపతిలో లంచ్.. హైదరాబాద్లో డిన్నర్
మాపై చిన్నచూపు.. బతకాలనిపించలేదు: రాము తల్లి భావోద్వేగం
అఫ్గానిస్తాన్ సంచలనం.. 6 ఓవర్లలో 148 పరుగులు
నూయార్క్ మేయర్గా మమ్దానీ - ట్రంప్ పిలుపును తిప్పికొట్టిన జనం
'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే..
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఈ రాశి వారికి సంఘంలో గౌరవమర్యాదలు.. వస్తులాభాలు
బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. తప్పిన జ్యోతిషం
ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ రివ్యూ
ఈ విషయంలో బాగా నోరు పారేసుకుంటున్నాడు!
ఘనంగా నటి సీమంతం.. వీడియో షేర్ చేసిన సాయికిరణ్
నిలబడిన కేఎల్ రాహుల్.. ఆధిక్యంలో టీమిండియా
ఆ నాటుకోళ్లను అస్సలు తినొద్దు!
పెద్ది 'చికిరి' బాగుంది.. కానీ, బిగ్ డౌట్
షమీకి సుప్రీంకోర్టు నోటీసులు
హైకోర్టులో టీవీ5 మూర్తికి చుక్కెదురు
లేచి పడిన పసిడి.. తులం ఎంతంటే..
బంగారం.. బీకేర్ఫుల్
జేఎస్డబ్ల్యూ సిమెంట్ లాభం రూ.75.36 కోట్లు
చాన్నాళ్ల తర్వాత ఈ హీరోయిన్ల 'తెలుగు' సినిమాలు
టీ20 వరల్డ్కప్కు సంబంధించి బిగ్ అప్డేట్
నోరెత్తితే నోటీస్ పంపించడమే కూటమి పాలన: శైలజానాథ్
30 ఏళ్లుగా ఇదే పని: ఇష్టమొచ్చినట్టు గడుపుతా..
స్టార్ హీరోలు ఇకపై అదీ భరించాల్సిందే.. నిర్మాతల మండలి
తాలిబాన్లతో మోదీ దోస్తీ.. ఇప్పుడే ఎందుకు?
బాబోయ్ చలి.. అప్పటి దాకా అంతే.. తెలంగాణకు హెచ్చరిక
ఎంఎస్ఎంఈలపై మరింత దృష్టి: వినేష్ మెహతా
పగలు మద్యం తాగితే భారీ ఫైన్.. అమల్లోకి కొత్త చట్టం..ఎక్కడంటే?
మంగళగిరిలో టిఫిన్.. తిరుపతిలో లంచ్.. హైదరాబాద్లో డిన్నర్
మాపై చిన్నచూపు.. బతకాలనిపించలేదు: రాము తల్లి భావోద్వేగం
అఫ్గానిస్తాన్ సంచలనం.. 6 ఓవర్లలో 148 పరుగులు
నూయార్క్ మేయర్గా మమ్దానీ - ట్రంప్ పిలుపును తిప్పికొట్టిన జనం
'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే..
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఈ రాశి వారికి సంఘంలో గౌరవమర్యాదలు.. వస్తులాభాలు
బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. తప్పిన జ్యోతిషం
ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ రివ్యూ
ఈ విషయంలో బాగా నోరు పారేసుకుంటున్నాడు!
ఘనంగా నటి సీమంతం.. వీడియో షేర్ చేసిన సాయికిరణ్
నిలబడిన కేఎల్ రాహుల్.. ఆధిక్యంలో టీమిండియా
ఆ నాటుకోళ్లను అస్సలు తినొద్దు!
పెద్ది 'చికిరి' బాగుంది.. కానీ, బిగ్ డౌట్
షమీకి సుప్రీంకోర్టు నోటీసులు
హైకోర్టులో టీవీ5 మూర్తికి చుక్కెదురు
లేచి పడిన పసిడి.. తులం ఎంతంటే..
బంగారం.. బీకేర్ఫుల్
సినిమా
'గర్ల్ఫ్రెండ్' కోసం రష్మిక రెమ్యునరేషన్ ఎంత?
హీరోహీరోయిన్లు అన్నాక సినిమాలు చేస్తారు. రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ గత కొన్నాళ్లలో కొందరు సెలబ్రిటీలు.. ముందు మూవీస్ చేస్తున్నారు. రిలీజ్ తర్వాత పారితోషికాలు అందుకుంటున్నారు. పాన్ ఇండియా లేటెస్ట్ సెన్సేషన్ రష్మిక కూడా 'ద గర్ల్ఫ్రెండ్' విషయంలో ఇలానే చేసినట్లు తెలుస్తోంది. మూవీ విడుదలకు ముందు ఓ ఈవెంట్లో నిర్మాత ధీరజ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రిలీజ్ తర్వాత తనకు డబ్బులివ్వాలని రష్మిక చెప్పిన సంగతి బయటపెట్టారు.'గర్ల్ఫ్రెండ్' రీసెంట్గానే (నవంబరు 07న) థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రోజురోజుకీ కలెక్షన్ నంబర్స్ పెరుగుతున్నాయి. దీంతో రష్మిక రెమ్యునరేషన్ ఎంత తీసుకుందా అనే విషయం మరోసారి చర్చకు వచ్చింది. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తున్న రష్మిక.. ఒక్కో ప్రాజెక్ట్ కోసం రూ.5-6 కోట్ల వరకు అందుకుంటోందట. 'గర్ల్ఫ్రెండ్' కోసం మాత్రమే రూ.3 కోట్లు చాలానే అందట. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: 'జటాధర' సినిమాకు నెగిటివ్ టాక్.. కలెక్షన్స్ మాత్రం ఇలా)కొన్నిసార్లు కొన్ని సినిమాలు.. ఆయా హీరోహీరోయిన్లకు కిక్ ఇస్తుంటాయి. బహుశా రష్మికకు కూడా 'గర్ల్ఫ్రెండ్'తో ఇలాంటి సంతృప్తి లభించినట్లు ఉంది. అందుకే సాధారణంగా తీసుకునే దానికంటే తక్కువగానే తీసుకుందని మాట్లాడుకుంటున్నారు. దీంతో రష్మిక మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. అలానే ప్రస్తుతం ఎక్కడ చూసినా రష్మిక పేరే వినిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది కాలంలో ఈమె నుంచి ఐదు వైవిధ్య భరిత సినిమాలు రావడం విశేషం.'ద గర్ల్ఫ్రెండ్' విషయానికొస్తే.. భూమా(రష్మిక) ఎం.ఏ లిటరేచర్ స్టూడెంట్. తండ్రి(రావు రమేశ్)ని ఒప్పించి హస్టల్లో చేరుతుంది. కానీ కాలేజీలో చేరిన తొలిరోజే భూమా, విక్రమ్ (దీక్షిత్ శెట్టి) ప్రేమలో పడతారు. విక్రమ్ని దుర్గ(అను ఇమ్మాన్యుయేల్) కూడా ఇష్టపడుతుంది. కానీ విక్రమ్ మాత్రం భూమానే ప్రేమిస్తాడు. రిలేషన్లో మానసికంగా, శారీరకంగా చాలానే దూరం వెళ్తారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే..)
‘శివ’లో చిరంజీవి హీరో అయితే.. ఆర్జీవీ ఏం చెప్పారంటే...
‘శివ’.. టాలీవుడ్ హిస్టరీలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన కల్ట్ క్లాసిక్ చిత్రం ఇది. రాజమౌళి మొదలు సందీప్రెడ్డి వంగా వరకు చాలా మంది దర్శకులకు ‘శివ’ఒక భగవద్గీత లాంటిది. ఆ సినిమా నుంచే చాలా నేర్చుకున్నామని పలువురు దర్శకులు చెప్పారు. 36 ఏళ్ల కిత్రం(1989) రామ్ గోపాల్వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం.. ఇప్పుడు మరోసారి థియేటర్స్లో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. సరికొత్త సాంకేతిక హంగులతో నవంబర్ 14న ఈ చిత్రం రీరిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆర్జీవీ తాజాగా ‘సాక్షి’తో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.నాగార్జున కోసమే ‘శివ’ పేరుశివ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఈ సినిమా తీసినప్పుడు నా వయసు 26 ఏళ్లు మాత్రమే. ఒకటి రెండు హాలీవుడ్ సినిమాలు చూసి మనం ఎందుకు ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని శివ కథ రాసుకున్నా. అప్పటికీ తెలుగు తెరపై ఇలాంటి సినిమాలు రాలేదు. ముద్దుల మామయ్య లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఆడుతున్న రోజులవి. ఒక రియలిస్టిక్ కథలా చెబితే జనాలు చూస్తారనే నమ్మకం కూడా లేదు. కానీ నా కోసమే ఈ సినిమా తీశా. నాకు నచ్చినట్లుగా తెరకెక్కించా. హిట్ కోసం తీయాలనుకుంటే.. ఇప్పటికే హిట్ అయిన సినిమాలను కాపీ చేసి తీయాలి. ఆ పని నేను చేయలేదు. ఇలాంటి కథలు ఆడవని అంతా చెప్పేవారు.కానీ తీస్తే కదా ఆడుతుందో లేదో తెలిసేదని నేను శివ తీశాను. వాస్తవంగా ఈ సినిమాలో ‘శివ’ పేరు ముందుగా విలన్ రఘువరన్కి పెట్టాను. కానీ నాగార్జున కథ విని.. శివ పేరు బాగుంది కదా.. నా పాత్రకు పెట్టొచ్చు కదా అన్నాడు. అప్పుడు హీరో పాత్రకి శివ పేరు మార్చాను. విలన్కి భవానీ పేరు పెట్టాను. తక్కువ బడ్జెట్ఈ సినిమా రిలీజై 36 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ ఈ చిత్రం గురించి మాట్లాడుతున్నారంటే.. ఇదేదో బాహుబలి చిత్రం అని కాదు. కానీ అప్పటికీ ఇలాంటి కథతో సినిమా తీసిన దాఖలాలు లేవు. నిజం చెప్పాలంటే శివలో అసలు కథే లేదు. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కొత్తగా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు వాస్తవికంగా ఉంటాయి. ఆడియన్స్కి కొత్త సౌండ్స్తో సినిమా చూపించాం. నాతో పాటు అందరూ కొత్తవాళ్లే కాబట్టి.. ఇళయరాజా లాంటి సీనియర్ సంగీత దర్శకుడు ఉండాలని పట్టుపట్టి మరీ ఆయనను ఒప్పించాను. కారు బురలో పడిన సౌండ్స్ తో, హీరో-విలన్ షర్ట్ పట్టుకొని కొట్టుకునే సౌండ్స్ అన్ని రికార్డు చేసి మరీ వాడాం. అంతకు ముందు అన్ని సినిమాల్లో యాక్షన్ సీన్లలో అరుపులు వినిపించేవి.కానీ శివలో మాత్రం ఎవరూ కూడా నోటితో అరవొద్దని ముందే చెప్పా. సౌండ్స్తో యాక్షన్ సీన్స్ తీశాం.చిరంజీవితో తీస్తే.. శివ రిలీజ్ అయిన తర్వాత టాక్ ఎలా ఉందనే విషయం నాతో పాటు నాగార్జునకు కూడా పూర్తిగా తెలియదు. రిలీజ్ అయిన రెండు రోజుల తర్వాత నాగేశ్వరరావుతో నాగార్జున కారులో వెళ్తుంటే.. ‘సినిమాకు హిట్ టాక్ వచ్చింది...ఎంత పెద్ద విజయం అవుతుందో చెప్పలేం’అని అంటున్నారని చెప్పారట. అప్పుడు కానీ ఈ సినిమా హిట్ అయిందనే విషయం నాగార్జునకు తెలియలేదట. నేను కూడా ఇంత హిట్ అవుతుందని ఊహించలేదు’ అని ఆర్జీవి చెపుకొచ్చాడు. ఇక ఈ సినిమా హిట్ అయిన తర్వాత ‘చిరంజీవి’ అనే మ్యాగజైన్లో ఈ సినిమాలో నాగార్జున కాకుండా చిరంజీవి హీరో అయితే ఎలా ఉండేది అనే శీర్షికతో ఓ స్టోరీ ముద్రించారని.. నిజంగానే చిరంజీవితో తీస్తే ఎలా ఉండేది?’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆర్జీవీ సమాధానం చెబుతూ.. ‘అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఒక చిన్న హీరో సినిమా హిట్ అయితే.. ఇదే సినిమాను పెద్ద హీరోతో చేస్తే బ్లాక్ బస్టర్ అయ్యేది అని చెబుతుంటారు. కానీ ఆ పాత్రకు నాగార్జున సెట్ అయ్యాడు కాబట్టే హిట్ అయింది. చిరంజీవితో అయితే ఎలా ఉండేదో చెప్పలేం’ అని ఆర్జీవీ అన్నారు.
సినిమాకు నెగిటివ్ టాక్.. కలెక్షన్స్ మాత్రం ఇలా
తెలుగులో ఈ వీకెండ్ చాలా సినిమాలు రిలీజయ్యాయి. రష్మిక 'గర్ల్ఫ్రెండ్'తో పాటు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ప్రేమిస్తున్నా చిత్రాలతో పాటు ఆర్యన్, డీయస్ ఈరే లాంటి డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటన్నింటికి పాజిటివ్ టాక్ వచ్చింది. వీటితోనే రిలీజైన సుధీర్ బాబు 'జటాధర'కు మాత్రం తొలి షో నుంచే తెలుగు రాష్ట్రాల్లో నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం షాకింగ్ అనిపిస్తున్నాయి.ఈ వారాంతం రిలీజైన సినిమాల్లో గర్ల్ ఫ్రెండ్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ చిత్రాలు ఉన్నంతలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. జనాలు థియేటర్లకు వస్తున్నారు గానీ వీటికి చెప్పుకోదగ్గ వసూళ్లు రావట్లేదా అనిపిస్తుంది. ఎందుకంటే మేకర్స్ వైపు నుంచి ఎలాంటి పోస్టర్స్ బయటకు రాలేదు. మరోవైపు తెలుగు-హిందీలో రిలీజైన 'జటాధర' టీమ్ మాత్రం కలెక్షన్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే..)తొలిరోజు రూ.1.47 కోట్ల గ్రాస్ సాధించగా.. రెండు రోజులకు కలిపి రూ.2.91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. పాజిటివ్ టాక్ ఏ మాత్రం రాని 'జటాధర'కు ఈ రేంజు వసూళ్లు రావడం అంటే ఓ రకంగా షాకింగ్ అని చెప్పొచ్చు. వీకెండ్ పూర్తయ్యేసరికి మరి ఏ మూవీ రేసులో ముందు ఉంటుందో చూడాలి?'జటాధర' విషయానికొస్తే.. రుద్రారం అనే ఊరిలోని ఓ ఇంట్లో దాచిన లంకె బిందెలకు ఓ ధన పిశాచి (సోనాక్షి సిన్హా) కాపలా ఉంటుంది. ఓసారి బంధనానికి విఘాతం కలిగి ధనపిశాచి రక్తాన్ని మరుగుతుంది. దీంతో ఊరంతా ఖాళీ అయిపోతుంది.. మరోవైపు శివ(సుధీర్ బాబు) అనే ఘోస్ట్ హంటర్.. సైంటిఫిక్గా దెయ్యాలు లేవని నిరూపిస్తూ ఉంటాడు. శివకు తరుచుగా ఓ బాబుని అతడి తల్లి చంపుతున్నట్లు పీడకల వస్తూ ఉంటుంది. ఈ పీడకలకు, ధనపిశాచికి, శివకు మధ్య సంబంధమేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 20 ఏళ్ల యువతిపై 'అనుపమ పరమేశ్వరన్' ఫిర్యాదు)
20 ఏళ్ల యువతిపై 'అనుపమ పరమేశ్వరన్' ఫిర్యాదు
ఇటీవల బైసన్, కిష్కింధపురి, ది పెట్ డిటెక్టివ్ చిత్రాలతో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ట్రెండింగ్లో ఉంది. అయితే, కొన్ని రోజులుగా తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి చెబుతూ తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. తమిళనాడుకు చెందిన ఒక యువతి తన ఫోటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా తన కుటుంబం గురించి అనుచితమైన పోస్టులు షేర్ చేస్తున్నట్లు ఆమె పేర్కొంది. దీంతో తాను పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపింది.అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఇలా పేర్కొంది. 'కొద్దిరోజులుగా ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా నా గురించి తప్పుగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటివి సర్వసాధారణమేనని మొదట పట్టించుకోలేదు. అయితే, నా ఫోటోలను మార్ఫింగ్ చేసి ఏకంగా నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సహ నటీనటులకు కూడా ట్యాగ్ చేస్తున్నారు. దీంతో చాలా బాధపడ్డాను. ఆపై ఎలాంటి ఆధారాలు లేకుండానే నా గురించి తప్పుడు సమాచారం వైరల్ చేస్తున్నారు. వాటిని చూస్తుంటే ఎవరో కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నట్లు అర్థమైంది. దీంతో ఈ విషయం గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేశాను. ఒకే వ్యక్తి చాలా అకౌంట్లతో ఈ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు ఫైనల్గా తెలిసింది. నేను ఏదైనా పోస్ట్ చేసినా కూడా ఫేక్ అకౌంట్ల నుంచి తప్పుడు కామెంట్లు చేస్తున్నారు. దీంతో వెంటనే కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాను.' అని అనుపమ తెలిపింది.యువతి వివరాలు గోప్యంగా ఉంచండిసైబర్ క్రైమ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఆశ్యర్యపోయే విషయం వెలుగులోకి వచ్చిందని అనుపమ ఇలా చెప్పింది. ' ఇదంతా చేసింది తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల యువతి అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆమె వయసులో చాలా చిన్నది. తన భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఆమె ఐడెంటిటీని బయటి ప్రపంచానికి చెప్పదలుచుకోలేదు. అయితే, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది. ఇప్పుడు కూడా ఈ ఘటన గురించి చెప్పాలని నాకు లేదు. కానీ, యువత మేలుకోవాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని చెబుతున్నాను. చేతిలో ఫోన్ ఉందని, సోషల్ మీడియా అకౌంట్ ఉందని ఒకరి పరువు తీసే హక్కు మీకు లేదు. ఇతరులను ద్వేషిస్తూ ఆన్లైన్లో మేరు చేసే ప్రతిదీ ట్రాక్ అవుతుంది. ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలి. సెలబ్రిటీలు అయినంత మాత్రానా మాకు కూడా సామాన్యులకు ఉండే హక్కులు ఉంటాయి. చట్టం అందరికీ సమానమే.' అని తెలిపారు. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)
న్యూస్ పాడ్కాస్ట్
ప్రజాధనాన్ని ప్రైవేటుకు దోచిపెడుతున్న కూటమి సర్కారు...
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? చంద్రబాబును నిలదీసిన : వైఎస్ జగన్
భావితరానికి యువతే దిక్సూచి... రాజకీయాల్లో విద్యార్థులు, యవత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
న్యూయార్క్ మేయర్గా జొహ్రాన్ మమ్దాని విజయం... చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు... తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్గా రికార్డు
ఏపీ సీఎం చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి... ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున పోరాటం సాగిస్తాం... మోంథా తుపాను ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఘోర ప్రమాదం..ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ 19 మంది మృతి.
కూటమి ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం
Chevella Bus Incident: రెప్పపాటులో ప్రమాదం అతివేగం వల్లే జరిగింది
మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట... తొమ్మిది మంది భక్తులు మృతి... 20 మందికి పైగా గాయాలు
క్రీడలు
వరుసగా 8 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డు నమోదైంది. రంజీ ట్రోఫీ 2025-26లో మేఘాలయ ఆటగాడు ఆకాశ్ చౌదరి (Akash Choudhary) వరుసగా 8 బంతుల్లో సిక్సర్లు బాదాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఓ ఆటగాడు వరుసగా 8 సిక్సర్లు బాదడం ఇదే మొదటిసారి. గతంలో క్రికెట్ దిగ్గజాలు రవిశాస్త్రి, గ్యారీ సోబర్స్ వరుసగా 6 సిక్సర్లు మాత్రమే బాదగలిగారు.అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో (తొలి ఇన్నింగ్స్) ఆకాశ్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఆకాశ్ తొలి బంతిని వృధా చేశాడు. ఆతర్వాతి బంతికి సింగిల్ తీశాడు. ఆతర్వాత వరుసగా 8 బంతుల్లో 8 సిక్సర్లు బాదాడు. మొత్తంలో 11 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (Fastest Half Century) రికార్డును కూడా నమోదు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ 6 వికెట్ల నష్టానికి 628 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అర్పిత్ భటేవారా (207) డబుల్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ కిషన్ లింగ్డో (119), దలాల్ (144) సెంచరీలతో కదంతొక్కారు. ఆఖర్లో ఆకాశ్ చౌదరీ మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసి అజేయంగా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్లో అరుణాచల్ ప్రదేశ్ 73 పరుగులకే కుప్పకూలింది. ఆర్యన్ బోరా 4 వికెట్లు తీసి ఏపీ పతనాన్ని శాసించాడు. అరుణాచల్ ఇన్నింగ్స్లో నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ప్రస్తుతం రెండో రోజు చివరి సెషన్ ఆట కొనసాగుతుంది. మేఘాలయ 555 పరుగుల లీడ్ను సాధించింది.చదవండి: టీమిండియాకు మరో షాక్
టీమిండియాకు మరో షాక్
మరో ఐదు రోజుల్లో (నవంబర్ 14 నుంచి) స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. సౌతాఫ్రికా-ఏతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్లో భారత ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు.తొలుత కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant).. ఆతర్వాత ధృవ్ జురెల్ (Dhruv Jurel), తాజాగా మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) గాయపడ్డ ఆటగాళ్ల జాబితాలో చేరారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో పంత్ బ్యాటింగ్ చేస్తూ చాలా దెబ్బలు తిన్నాడు. అయినా అతడు రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఆట నాలుగో రోజైన ఇవాళ (నవంబర్ 9) మరో వికెట్ కీపర్ బ్యాటర్, రెండు ఇన్నింగ్స్ల్లో సెంచూరియన్ ధృవ్ జురెల్ చేతి వేలి గాయానికి గురయ్యాడు. తాజాగా పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా ఫీల్డింగ్ చేస్తూ చేతి వేలికి గాయం చేసుకున్నాడు. నొప్పితో విలవిలలాడిన సిరాజ్ మైదానాన్ని వీడాడు. సిరాజ్ గాయం పెద్దదేమీ కానప్పటికీ.. ముందు జాగ్రత్తగా అతనికి విశ్రాంతి కల్పించారు.ఇదిలా ఉంటే, భారత్-ఏ, సౌతాఫ్రికా-ఏ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా లక్ష్యానికి మరో 70 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. ఇవాళ ఆట చివరి రోజు. 4:35 నిమిషాల సమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 347 పరుగుల వద్ద ఉంది. టెంబా బవుమా (57), కాన్నర్ ఎస్టర్హ్యూజన్ (5) క్రీజ్లో ఉన్నారు.ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 255, రెండో ఇన్నింగ్స్లో 382/7 డిక్లేర్ స్కోర్లు చేసింది. రెండు ఇన్నింగ్స్ల్లో వికెట్కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ సెంచరీలు చేశాడు. సౌతాఫ్రికా తరఫున కెప్టెన్ అకెర్మన్ తొలి ఇన్నింగ్స్ల్లో (134) శతక్కొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో జోర్డన్ హెర్మన్ (91), సెనోక్వానే (77), జుబేర్ హంజా (77), బవుమా (57 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. చదవండి: లేడీ ధోనికి బంపరాఫర్
లేడీ ధోనికి బంపరాఫర్
భారత మహిళా క్రికెట్ జట్టులో లేడీ ధోనిగా పిలువబడే రిచా ఘోష్కు (Richa Ghosh) బంపరాఫర్ లభించింది. ప్రపంచకప్ విధ్వంసాల గౌరవార్దం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం (west Bengal) ఆమెను డీఎస్పీగా (DSP) నియమించింది. భారత్, శ్రీలంక ఇటీవల సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్లో (Women' Cricket World Cup 2025_ రిచా వీరవిహారం చేసింది. ఫైనల్, సెమీఫైనల్స్లో విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడి భారత్ ఛాంపియన్గా నిలవడంలో కీలకపాత్ర పోషించింది. ఫలితంగా ఆమెను డీఎస్పీ ఉద్యోగం వరించింది. గతంలో రిచా తరహాలోనే ఇద్దరు భారత క్రికెటర్లను వారివారి సొంత రాష్ట్రాలు డీఎస్పీలుగా నియమించాయి. 2024లో తెలంగాణ ప్రభుత్వం టీమిండియా పేసు గుర్రం మహ్మద్ సిరాజ్ను డీఎస్పీగా నియమించింది. ఇటీవలే ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ విజేత దీప్తి శర్మను కూడా ఆమె సొంత రాష్ట్రం ఉత్తర్ప్రదేశ్లో డీఎస్పీగా నియమించారు.ప్రపంచకప్ గెలిచిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన రిచాను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) మరియు సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్ ఘనంగా సత్కరించాయి. బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం రిచాకు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వడంతో పాటు బంగ భూషణ్ బిరుదుతోనూ సత్కరించింది. రిచా 2025 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 24 బంతుల్లో 34 పరుగులు చేసి భారత్ 298 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించింది. అంతకుముందు ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లోనూ రిచా మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఛేదనలో కీలక సమయంలో 16 బంతుల్లో 26 పరుగులు చేసి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించింది.లీగ్ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లోనూ రిచా చెలరేగింది. 77 బంతుల్లోనే 94 పరుగులు చేసింది. ప్రపంచకప్ మొత్తంలో రిచా మెరుపు ఇలాగే కొనసాగాయి. 8 ఇన్నింగ్స్ల్లో 133.52 స్ట్రయిక్రేట్తో 235 పరుగులు చేసింది. కాగా, నవంబర్ 2న జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ఆరోసారి ఛాంపియన్
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ఆరోసారి ఛాంపియన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan) హాంగ్ కాంగ్ సిక్సస్ (Hong Kong Sixes-2025) ట్రోఫీని కైవసం చేసుంది. ఇవాళ (నవంబర్ 9) జరిగిన 2025 ఎడిషన్ ఫైనల్లో కువైట్పై 43 పరుగుల తేడాతో గెలుపొంది, ఆరో సారి ఛాంపియన్గా నిలిచింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 135 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది (Abbas Afridi) (11 బంతుల్లో 52 రిటైర్డ్ హర్ట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) కువైట్ బౌలర్లను చీల్చి చెండాడు. ఓపెనర్లు అబ్దుల్ సమద్ (13 బంతుల్లో 42; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), ఖ్వాజా నఫే (6 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సైతం చెలరేగిపోయారు. మిగతా బ్యాటర్లలో షాహిద్ అజీజ్ డకౌట్ కాగా, మాజ్ సదాకత్ 10, షెహజాద్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. కువైట్ బౌలర్లలో మీట్ భావ్సర్ 3 వికెట్లు తీశాడు.భారీ లక్ష్య ఛేదనలో కువైట్కు మెరుపు ఆరంభం లభించినప్పటికీ.. ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో 5.1 ఓవర్లలో 6 వికెట్లూ కోల్పోయి 92 పరుగులకే పరిమితమైంది. మాజ్ సదాకత్ 3 వికెట్లు తీసి కువైట్ వెన్ను విరిచాడు. ముహమ్మద్ షెహజాద్, అబ్బాస్ అఫ్రిది, అబ్దుల్ సమద్ తలో వికెట్ తీశారు. కువైట్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు అద్నాన్ ఇద్రీస్ (8 బంతుల్లో 30; 5 సిక్సర్లు), మీట్ భావ్సర్ (12 బంతుల్లో 33; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఆతర్వాత వచ్చిన బిలాల్ తాహిర్ (6), రవీజా సందరువన్ (1), కెప్టెన్ యాసిన్ పటేల్ (14) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. మొహమ్మద్ షఫీక్ డకౌటయ్యాడు. కాగా, ఈ టోర్నీలో భారత్ నేపాల్, యూఏఈ, కువైట్, శ్రీలంక వంటి పసికూన చేతుల్లో ఓడి క్వార్టర్ ఫైనల్కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. చదవండి: IND vs SA: టీమిండియాకు ఊహించని షాక్..
బిజినెస్
నైకా లాభాల కేక.. ఏడాదిలో త్రిబుల్
ఎఫ్ఎస్ఎన్ ఈ–కామర్స్ (నైకా మాతృ సంస్థ) సెప్టెంబర్ క్వార్టర్లో పటిష్ట పనితీరు నమోదు చేసింది. లాభం రూ.34.4 కోట్లకు దూసుకుపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.10 కోట్లతో పోల్చి చూస్తే మూడింతలైంది. ఆదాయం 25 శాతం పెరిగి రూ.2,346 కోట్లకు చేరుకుంది.క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.1,875 కోట్లుగా ఉంది. జూన్ త్రైమాసికంతో పోల్చి చూస్తే లాభం 47 శాతం, ఆదాయం 9 శాతం చొప్పున పెరిగాయి. స్థూల వస్తు విక్రయ విలువ (జీఎంవీ) 30 శాతం పెరిగి రూ.4,744 కోట్లకు చేరింది. వివిధ విభాగాల్లో వృద్ధి వేగాన్ని అందుకున్నట్టు నైకా వ్యవస్థాపకురాలు, సీఈవో ఫాల్గుణి నాయర్ తెలిపారు.సెప్టెంబర్ త్రైమాసికంలో 19 కొత్త స్టోర్లను ప్రారంభించినట్టు, దీంతో తమ ఓమ్ని ఛానల్ నెట్వర్క్ (ఆన్లైన్/ఆఫ్లైన్) మరింత బలపడినట్టు చెప్పారు. ఫ్యాషన్ విభాగం జీఎంవీ 37 శాతం పెరిగి రూ.1,180 కోట్లుగా, బ్యూటీ జీఎంవీ 28% పెరిగి రూ.3,551 కోట్లుగా ఉన్నాయి.కలిసొచ్చిన కత్రినా, రిహన్నా యాడ్స్త్రైమాసిక ఫలితాలు నైకా తన ప్రధాన సౌందర్య వ్యాపారాన్ని రెట్టింపు చేయడం ద్వారా లాభదాయకతపై దృష్టి పెట్టినట్లు చూపిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్, హాలీవుడ్ బ్యూటీ రిహన్నా చేసిన యాడ్స్ కలిసొచ్చాయి. అలాగే వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంచడం, ఆఫ్ లైన్ ఉనికిని విస్తరించడం వంటి బ్రాండ్ ఉత్పత్తుల అమ్మకానికి దోహదపడ్డాచయి.
కంపెనీల కక్కుర్తి.. ‘చంపేస్తోంది’!
పారిశ్రామిక వ్యర్థాలు పర్యావరణానికి, ప్రజారోగ్యానికి, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాలను కలిగిస్తున్నాయి. భారతదేశంలో పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్న రసాయనిక, లోహాలు, ప్లాస్టిక్, బయోమెడికల్ వ్యర్థాలు సరైన శుద్ధి లేకుండా నీటిలో, భూమిలో, గాలిలో కలవడం వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి.దేశంలోని చాలా పరిశ్రమలు వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం లేదని, హానికరమైన రసాయనిక వ్యర్థాలను ఎటువంటి సంస్కరణ లేకుండా అలాగే బయటకు వదిలేస్తున్నాయని, దీంతో నదీ జలాలు కలుషితమవుతున్నాయని ఎప్పటి నుంచో ఫిర్యాదు ఉన్నాయి. ఈ విషయంలో కాలుష్య నియంత్రణ బోర్డులు సైతం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయన్న విమర్శలు ఉన్నాయి.ఇదే విషయంగా శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థాలను నీటి వనరులలోకి విడుదల చేస్తున్న పరిశ్రమలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కొరడా ఝుళిపించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న 1,700 కి పైగా స్థూల కాలుష్య పరిశ్రమలపై (జీపీఐలు) సత్వరమే చర్యలు తీసుకోవాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)తోపాటు ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా, బీహార్ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డులకు గట్టి ఆదేశాలు జారీ చేసింది.వందలాది స్థూల కాలుష్య పరిశ్రమలు వ్యర్థాల విడుదలను పర్యవేక్షించే ఆన్లైన్ కంటిన్యూయస్ ఎఫ్లూయెంట్ మానిటరింగ్ సిస్టమ్స్ (OCEMS)ను ఏర్పాటు చేసుకోవడంలో విఫలమయ్యాయంటూ ధాఖలైన పిటిషన్పై విచారించిన ఎన్జీటీ ఈ ఆదేశాలు ఇచ్చింది. చర్యలు తీసుకుంటున్న ఈ 1700 పరిశ్రమల్లో అత్యధికంగా హర్యానాలో 812, ఉత్తర ప్రదేశ్లో 704, ఢిల్లీలో 149, బిహార్లో 21 ఉన్నాయి.కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. రోజుకు 10 కిలో లీటర్ల వ్యర్థాలను విడుదల చేసే పరిశ్రమలు తప్పనిసరిగా ఓసీఈఎంఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అదే తక్కువ స్థాయిలో వ్యర్థాలను విడుదల చేసే పరిశ్రమలైతే ఫ్లో మీటర్లను, వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.ఎంత తేడా?వ్యర్థాల నిర్వహణలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతదేశంలోని పరిశ్రమలు చాలా తక్కువ ఖర్చు చేస్తున్నాయి. సాంకేతికతలను వినియోగించడంలోనూ వెనుకబడ్డాయి. ఖర్చును తగ్గించుకునేందుకు అంతగా శిక్షణలేని శ్రామిక శక్తితో నెట్టుకొస్తున్నాయి. వ్యర్థాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం అభివృద్ధి చెందిన దేశాల్లోని పరిశ్రమలు అధునాతన ఆటోమేషన్, ఏఐ-ఆధారిత సెగ్రిగేషన్, జీపీఎస్ ట్రాకింగ్ సాంకేతికతలను వినియోగిస్తుంటే భారత్లోని పరిశ్రమలు పాక్షిక యాంత్రిక వ్యవస్థలతో మానవ శ్రమపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి.ఇక వ్యర్థాల నిర్వహణకు అభివృద్ధి చెందిన దేశాల్లో చేస్తున్న ఖర్చు, భారత్లో పరిశ్రమలు వెచ్చిస్తున్న మొత్తాన్ని పరిశీలిస్తే గణనీయమైన వ్యత్యాసం కనపడుతుంది. వ్యర్థాల నిర్వహణ, సంస్కరణకు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఒక టన్నుకు రూ.8 వేల నుంచి రూ.25 వేల వరకూ ఖర్చు చేస్తుంటే మన దేశంలో పరిశ్రమలు చేస్తున్న ఖర్చు కేవలం రూ.1,500 నుంచి రూ.3వేలు మాత్రమే.పారిశ్రామిక వ్యర్థాలతో ప్రధాన నష్టాలుగంగా, యమునా వంటి నదుల్లో శుద్ధి చేయని వ్యర్థాల కలవడం వల్ల నీటి నాణ్యత తీవ్రంగా తగ్గుతోంది. ఇది తాగునీటి, వ్యవసాయ నీటి వినియోగాన్ని ప్రమాదంలోకి నెట్టుతోంది. పారిశ్రామిక ఘన వ్యర్థాలు (లోహపు స్క్రాప్ లు, నిర్మాణ శిధిలాలు) భూమిలోకి చేరడం వల్ల మట్టిలో విషపదార్థాలు చేరి, వ్యవసాయ ఉత్పాదకత తగ్గుతోంది. పరిశ్రమలు నుండి వెలువడే వాయువులు శ్వాస సంబంధిత వ్యాధులకు దారితీస్తున్నాయి. చర్మ రుగ్మతలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, నాడీ సంబంధిత రుగ్మతలు వంటి వ్యాధులు పరిశ్రమల చుట్టుపక్కల నివసించే ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. నదుల్లోని జీవరాశి విషపూరిత రసాయనాల వల్ల మరణిస్తోంది. ఇది ఆహార గొలుసు అసమతుల్యతకు దారితీస్తోంది. పర్యావరణ నాశనం వల్ల పర్యాటకం, వ్యవసాయం, మత్స్య రంగాలు తీవ్రంగా ప్రభావితమై ఆర్థిక వ్యవస్థకూ చేటు కలిగిస్తోంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 62 మిలియన్ టన్నుల ఘన వ్యర్థాల ఉత్పత్తి అవుతోంది. ఇందులో ఎక్కువ భాగం పారిశ్రామిక వ్యర్థాలే.
డిజిటల్ గోల్డ్తో జాగ్రత్త.. సెబీ హెచ్చరిక
డిజిటల్ గోల్డ్ను విక్రయించే సంస్థలు, ఆయా ఉత్పత్తులు నియంత్రణ పరిధిలో లేవని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తెలిపింది. కాబట్టి, డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయడం రిస్క్తో కూడుకున్న వ్యవహారమని, జాగ్రత్త వహించాలని హెచ్చరించింది. సెబీ నియంత్రించే పసిడి ఉత్పత్తులతో పోలిస్తే ఇవి భిన్నమైనవని పేర్కొంది.డిజిటల్ గోల్డ్ లేదా ఈ–గోల్డ్ ప్రోడక్టుల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యంత్రాంగంపరమైన హామీ ఉండబోదని వివరించింది. ప్రస్తుతం పసిడికి డిమాండ్ భారీగా పెరగడం, ఆన్లైన్లో అత్యంత తక్కువగా రూ. 10 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చంటూ పలు సంస్థలు ఊరిస్తుండటం తదితర పరిణామాల నేపథ్యంలో సెబీ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యే కమోడిటీ డెరివేటివ్ కాంట్రాక్ట్లు, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ మొదలైన సాధనాల ద్వారా నియంత్రణ సంస్థ పరిధిలో పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని సెబీ తెలిపింది.ఏమిటీ గోల్డ్ ఈటీఎఫ్లు?గోల్డ్ ఈటీఎఫ్లు బంగారంపై పెట్టుబడి పెట్టే డిజిటల్ మార్గం. ఇవి భౌతిక బంగారాన్ని కొనకుండా, స్టాక్ మార్కెట్ ద్వారా బంగారం ధరలపై పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తాయి. గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF) అంటే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది మ్యూచువల్ ఫండ్ల తరహాలో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడయ్యే ఒక ఫండ్. బంగారం ధరల ఆధారంగా దీని విలువ మారుతూ ఉంటుంది. దీంతో భౌతిక బంగారం కొనకుండా డిజిటల్ రూపంలో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు.ముఖ్యమైన ప్రయోజనాలుభౌతిక బంగారానికి ఉన్న భద్రతా సమస్యలు గోల్డ్ ఈటీఎఫ్లకు ఉండవు.స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా కొనుగోలు లేదా అమ్మకం చేయవచ్చు.గోల్డ్ ఈటీఎఫ్లపై తక్కువ మొత్తాలతో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు.లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఇది మ్యూచువల్ ఫండ్లకు సమానం.భౌతికంగా నిల్వ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి స్టోరేజ్ ఖర్చులు ఉండవు.పెట్టుబడి ఎలా పెట్టాలంటే..గోల్డ్ ఈటీఎఫ్లపై పెట్టుబడి పెట్టాలంటే డీమాట్ ఖాతా (Demat Account) అవసరం. స్టాక్ బ్రోకర్ ద్వారా గోల్డ్ ఈటీఎఫ్లు కొనుగోలు చేయవచ్చు. నిర్దిష్ట ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఈ ఫండ్లను నిర్వహిస్తాయి.
ఇల్లు కొనే ముందు జాగ్రత్త.. ఇవి తప్పనిసరి!
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. పొదుపు, రుణం, పెట్టుబడులతో కూడుకున్న అంశం. జీవితంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన స్థలం లేదా ఇల్లు కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా లేకుంటే అటు ఆర్థికంగా ఇటు మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయ్యో.. ఈ ఇల్లు కొని తప్పు చేశానే.. అని జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.రియల్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఎన్నో చట్టాలు, నిబంధనలు ఉన్నా.. సామాన్యుడి సొంతింటి కలను క్యాష్ చేసుకోవాలనే అక్రమార్కులు కనిపిస్తూనే ఉన్నారు. ప్రీలాంచ్ మోసాలతో పాటు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టి, వాటిని విక్రయించడం వంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఇల్లు కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. వారు సూచిస్తున్న పలు జాగ్రత్తలివీ..టైటిల్ డీడ్డెవలపర్కు కన్వేయన్స్ రూపంలో భూమికి స్పష్టమైన, మార్కెట్ చేయదగిన టైటిల్ ఉండాలి. గృహ కొనుగోలుదారులు దీని కోసం అడగాలి. స్థానిక సబ్ రిజి్రస్టార్ కార్యాలయానికి వెళ్లి సదరు భూమిపై ఎలాంటి వివాదాలు, లిటిగేషన్లు లేవని నిర్ధారించుకోవాలి. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ రసీదుల వంటి ఇతర కీలక పత్రాలను కూడా పరిశీలించాలి.అనుమతులుప్రాజెక్ట్ లేఅవుట్, భవన నిర్మాణ ప్రణాళికకు మున్సిపల్ అధికారుల ఆమోదం ఉండాలి. ఇవి లేకుంటే అది అక్రమ నిర్మాణం కిందే లెక్క. ఈ నేపథ్యంలో ఇళ్ల కొనుగోలుదారులు సదరు ప్రాజెక్ట్కు అన్ని రకాల అనుమతులు ఉన్నాయో లేవో క్రాస్ చెక్ చేసుకోవాలి.సర్టిఫికెట్లుప్రాజెక్ట్ ప్రారంభానికి సంబంధించి కమెన్స్ సర్టిఫికెట్, అది పూర్తయ్యాక కంప్లీషన్ సర్టిఫికెట్ చాలా ముఖ్యం. ప్రాజెక్ట్ నిబంధనల ప్రకారమే నిర్మించిందని చెప్పడానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. అలాగే ప్రతీ ప్రాజెక్ట్కు అగ్నిమాపక, పర్యావరణం, నీటి సరఫరా, విద్యుత్ సహా బహుళ విభాగాల నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం(ఎన్ఓసీ) సరి్టఫికెట్లు అవసరం. ఇవన్నీ పునఃపరిశీలించిన తర్వాతే గృహ కొనుగోలు నిర్ణయం తీసుకోవాలి.రిజిస్ట్రేషన్రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) చట్టం కింద ప్రతీ ప్రాజెక్ట్ను నమోదు చేయాలి. రెరా ఆమోదం పొందకుండా ప్రాజెక్ట్ నిర్మాణం, అమ్మకం వంటివి చేయకూడదు. అందువల్ల ఆయా ప్రాజెక్ట్కు రెరా అనుమతి ఉందా లేదా అనేది తనిఖీ చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.ఇదీ చదవండి: హైదరాబాద్లో పెరుగుతున్న హౌసింగ్ ఇన్వెంటరీ
ఫ్యామిలీ
మా అమ్మే నా శత్రువు
ఆ టెలిగ్రామ్ చూడగానే రామ్ సదై బాబులో ఆందోళన మొదలైంది. గబుక్కున స్టూలుమీద నుంచి లేచి, ‘‘ఈ ఉద్యోగం మానేయాలి. నా వల్ల కాదు’’ అనుకుంటూ భార్య ఉన్న గదిలోకి ప్రవేశించాడు.ఆమె గర్భవతి. మంచం మీద విశ్రాంతి తీసుకుంటోంది. భర్త చేతిలో టెలిగ్రామ్ చూడగానే ఆమెకు విషయం అర్థమైంది. ‘‘ఇంతకీ ఏమైంది?’’ భర్తను ఆత్రంగా అడిగింది.‘‘నా సెలవుకు అనుమతి లభించలేదు’’ నిస్పృహగా అన్నాడు రామ్ సదై. ‘‘నీ పరిస్థితి గురించి అంతా పూసగుచ్చినట్టు వివరించాను. వాళ్లకు కనీసం కనికరం కలగలేదు. రేపు మధ్యాహ్నం నేను బయలుదేరాలి’’ అని ఒక నిముషం ఆగి మళ్లీ చెప్పాడు. ‘‘ఉద్యోగానికి రాజీనామా చేసి ఉన్న పొలాన్ని సాగు చేసుకోవటం మంచిదనిపిస్తోంది’’.శశిముఖి మధ్యలోనే అందుకుంది. ‘‘మనిద్దరమే అయితే మీకు ఉద్యోగం ఉన్నా, లేకపోయినా ఫరవాలేదు. కానీ ఇప్పుడు..’’ అర్ధోక్తితో ఆగిపోయింది.ఆమె పూర్తిగా చెప్పవలసిన పనేం లేదు. తమ ఆర్థిక పరిస్థితి గురించి రామ్ సదైకి పూర్తి అవగాహన ఉంది. అందుకే వెంటనే స్పృహలోకి వచ్చి, కోపాన్ని అదుపు చేసుకున్నాడు. తర్వాత కోర్టు పని మీద బయటకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చిన తర్వాత భార్య అడిగింది. ‘‘ఇంతకీ మీరేం నిర్ణయించుకున్నారు?’’. ‘‘నేనేం చేయాలో నువ్వే చెప్పు?’’ అన్నాడు రామ్ సదై. ‘‘ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలేసి నేను ఎలా వెనక్కి తిరిగి వెళ్లేది? ఒకవేళ తీసికెళదామనుకున్నా అది దగ్గరా దాపూ కాదు. డాక్టర్లు నిన్ను ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించారు. పోనీ మనకు తెలిసిన వాళ్లను సాయం చేయమని అడుగుదామా?’’‘‘హాస్పిటల్లో పనిచేసే మంత్రసానిని రోజూ రమ్మనమని చెబుతాను. అవసరమైతే తను నీతోనే ఉంటుంది. ఎలాగూ ఏడెనిమిది రోజుల్లో మథుర్ కాకా వచ్చేస్తారు. ఈలోపు నీకు ఇబ్బంది ఉండదు..’’.అతని మాటలను మధ్యలోనే అడ్డుకుంటూ.. ‘‘నయన్ దీదీని రమ్మని పిలవకూడదూ.. ఇక్కడికి దగ్గరేగా. తనొచ్చి నాకు తోడుగా ఉంటుంది’’ అంది శశి. ‘‘నువ్వు భలే చెప్పావు. నీకు సాయం చేయటానికి ఎవరెవరిని పిలవాలా అని సతమతమవుతున్నాను. నాకెందుకు నయన్ పేరు తట్టలేదో? ఈ మధ్య నా బుర్ర పనిచేయటంలేదు’’తలకొట్టుకుంటూ అన్నాడు రామ్ సదై.నయనతార భర్త హరిపాద గంగూలీ. దర్భంగాలో రైల్వేలో పనిచేస్తున్నాడు. తనకి వచ్చే అరకొర జీతంతో కుటుంబాన్ని నెట్టుకు రావటానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈ మధ్యనే వాళ్లకు ఒక బాబు పుట్టాడు.రామ్ సదై తన భార్య పరిస్థితిని పూర్తిగా వివరించి నయనతారను వెంటనే బయలుదేరి రావలసిందిగా లేఖ రాశాడు. ఆమె ఖర్చులకు డబ్బులు కూడా పంపాడు. ఆమె శశిముఖికి దూరపు చుట్టం. వరసకు అక్క అవుతుంది. ఓ వైపు డబ్బుకు కటకటలాడటం, మరో వైపు తన కంటే డబ్బు ఉన్న చెల్లెలి కుటుంబానికి సాయపడితే కొంతయినా ఉపయోగపడుతుందన్న ఆలోచనతో వెనకా ముందు ఆలోచించకుండా ముజారఫ్పూర్ బయలుదేరింది నయన.రామ్ సదై వెళ్లే రైలులోనే ఆమె దిగింది. తల మీద నుంచి మోకాళ్ల వరకూ షాల్ కప్పుకుని పసిపిల్లవాడిని చేతిలో ఉంచుకున్న నయనతారను చూడగానే అతనికి సంతోషం కలిగింది. ‘‘నువ్వొచ్చావు. నాకు కొంచెం ఆందోళన తగ్గింది. ఇద్దరు ఆడవాళ్లను ఒంటరిగా వదిలేసి వెళుతున్నందుకు దిగులుగానే ఉంది. ఏం చేయను తప్పటం లేదు. కాకా త్వరలోనే వచ్చేస్తాడు. ఈలోపు ఎలాంటి ఇబ్బంది ఉండదనే అనుకుంటున్నాను’’ అని జాగ్రత్తలు చెప్పాడు. ఆ తర్వాత తన దగ్గర పనిచేసేవాడిని పిలిచి ఆమెకి వాహనం సిద్ధం చేయమని చెప్పి రైలెక్కేశాడు. ఆ మర్నాడే శశిముఖికి ప్రసవం అయ్యింది. మరి కాసేపటికే ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. నయనతారకి ఆమెను ఎలా ఊరడించాలో అర్థం కాలేదు.తన పరిస్థితి అర్థం చేసుకున్న శశిముఖి ‘‘అక్కా, ఖోకాను ఒక్కసారి నాకు చూపిస్తావా? అనడిగింది.వెంటనే నయనతార పసిబిడ్డను తీసుకొచ్చి ఆమె పక్కలో ఉంచింది. ‘‘దీదీ.. నాకు ఇంకా ఎక్కువ సమయం లేదు. ఈ బిడ్డను నీ చేతుల్లో పెడుతున్నాను. నీ బిడ్డ మాదిరిగానే వాడిని సాకుతానని మాటివ్వు’’. అంది శశిముఖి. ‘‘వీడొకటి.. నా బిడ్డకొకటి వేర్వేరు కాదు. ఇద్దరూ నాకు సమానమే.. పైగా ఇప్పడు ఈ మాటలన్నీ ఎందుకు? నీకేం కాదు. నువ్వు బాగానే ఉంటావు. భయపడకు. ఒకవేళ భగవంతుడు అలా రాసిపెట్టి ఉండి ఏదయినా అనుకోనిది జరిగితే, మీ అబ్బాయికి తల్లి లేని లోటు ఉండదు.’’ ధైర్యం చెప్పింది నయన.కానీ అర్ధరాత్రి గడిచేసరికి శశిముఖి ప్రాణాలు విడిచింది. రామ్ సదై బాబుకు రెండు టెలిగ్రామ్లు వెంట వెంటనే అందాయి. తన భార్య ఆరోగ్య పరిస్థితి సరిగా లేదనే సమాచారంతో ఒకటి, హఠాత్తుగా ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిందన్న విషాదకర వార్తతో మరొకటి. అంతగా వెలుతురు లేని గదిలో ఉంది నయన. శశిముఖికి పరిచయం ఉన్న వాళ్లెవరో పరామర్శకని ఇంటికి వచ్చారు. ఆ సమయంలో తన బిడ్డను మంచం మీద పడుకోబెట్టి శశిముఖి బిడ్డకు పాలిస్తోంది నయన. అదే మంచం మీద వచ్చిన అతిథులను సర్దుకుని కూర్చోమని చెప్పింది. లాంతరు ఒత్తిని కొంచెం పెద్దది చేసింది. గదిలో కొంచెం వెలుతురు ఎక్కువయ్యింది.అక్కడికొచ్చిన వినోద్ బాబు భార్య.. ‘‘ఈ పిల్లవాడు దీదీ బిడ్డ అన్న మాట. అచ్చం అమ్మలాగా ఎంత అందంగా ఉన్నాడు. కనీసం అమ్మను చూసుకోలేకపోయాడు పాపం’’ అంది. అంతలోనే ఆమె పక్కన కూర్చున్న మరో ఆమె అందుకుంది. ‘‘వాడి మొహం చూడు. అచ్చు వాళ్లమ్మలా మిసమిసా మెరిసిపోతుంది. తను ఎంత మంచిది! ఆరోగ్యం సరిగ్గా లేదని మాకు ముందే చెప్పి ఉంటే ఎలాగోలా కాపాడుకునేవాళ్లంగా ’’ ఇలా చెప్పుకుపోతోంది.ఆ బిడ్డ శశిముఖి సంతానం కాదని, తన బిడ్డ అని చెప్పబోయి నయనతార ఆగిపోయింది. ఇద్దరు పిల్లల్లో ఎవరు ఎవరి బిడ్డ అని తేల్చి చెప్పటం ఇతరులకు చిక్కు సమస్యే! నల్లగా బలహీనంగా ఉన్న బిడ్డను నయనతార బిడ్డగానూ, అప్పుడే పుట్టిన వాడికంటే బాగా పుష్టిగా ఉన్న నయనతార బిడ్డను శశి బిడ్డగానూ వాళ్లు భావించారు. అందరూ వెళ్లిపోయాక తీరిగ్గా చాలాసేపు ఆలోచించింది నయన. అసలు చిక్కుముడిని విడతీయకపోతే పోయేది ఏం ఉంది అన్న ఆలోచన చేసింది. తన బిడ్డకు తల్లి లేని లోటు లేకుండా చేస్తానని శశిముఖికి మాటిచ్చాను. దానిని కాపాడుకోవచ్చు.అలాగే మరో వైపు డిప్యూటీ బాబు సంపదతో తన బిడ్డ పెరిగి పెద్దవాడవుతాడు. దానికి అడ్డుకోవటం ఎందుకు? తల్లి లేని బిడ్డకు తల్లినవుతున్నాను కదా..? అని తనను తాను సమాధానపరుచుకుంది. శశిముఖి వార్త తెలియగానే పదిరోజులు సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు రామ్ సదై. ఆమె మరణించిందన్న వాస్తవాన్ని జీర్ణించుకో లేకపోయాడు. ఆమె ఉన్నదనే భావనతోనే ఇంట్లో కలియతిరుగుతున్నాడు. డాబా మీద, వంటింట్లో, స్నానాల గదిలో ఇలా ఆమె కోసం వెతుక్కుంటున్నాడు. గుండె బద్దలై పిచ్చివాడిలా వ్యవహరిస్తున్నాడు.ఇదంతా చూసి కదిలిపోయినట్టుగా నటించింది నయనతార. రాని కన్నీళ్లను తుడుచుకుంటూ.. ‘‘జరిగిందేదో జరిగిపోయింది. ఆమె ఇక తిరిగి రాదు. ఆ విషయాన్ని అర్థం చేసుకో. లోపలికి వచ్చి కాస్త ఎంగిలిపడి ఆ తర్వాత విశ్రాంతి తీసుకో’’ అంది.ఆమెను చూడగానే స్పృహలోకొచ్చాడు. ఆమె చెప్పినట్టే స్నానం చేసి, భోజనం చేసి ఆ తర్వాత వాలు కుర్చీలో కూర్చున్నాడు. పనివాడు అందించిన హుక్కాను పీలుస్తూ ఆలోచనల్లోకి జారుకున్నాడు. నయన్ చేతిలో పసిపిల్లవాడితో అక్కడకి వచ్చింది. ‘‘పిల్లవాడు కాస్త సన్నగా ఉన్నాడు. కానీ మీ ఇద్దరికి బాగా పోలికలున్నాయి’’ అని చెప్పి పిల్లవాడిని అతని పొత్తిళ్లలో ఉంచబోయింది.రామ్ సదైకి వాడిని చూడాలనిపించలేదు. ‘‘తల్లిని మింగేసిన రాక్షసుడు’’ అన్నాడు పరుషంగా. ‘‘నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. కానీ వాడిని వదిలేస్తే..’’రామ్ సదై ఆ చిన్నారిని సరిగా ఒడిలో పడుకోబెట్టుకోలేదు. దాంతో అసౌకర్యంగా అనిపించి ఆ పిల్లవాడు ఏడుపు అందుకున్నాడు. ‘‘ఏమిటో ఈ పిల్లాడు.. పెద్దమ్మ అయిన నా దగ్గరకి తప్ప ఎవరి దగ్గరకీ వెళ్లడు’’ అంటూ నయన ఆ పిల్లవాడిని తీసుకుని భుజం మీద వేసుకుంది. ఆ తర్వాత చెల్లెలి భర్తతో భవిష్యత్తు గురించి చర్చించటం మొదలుపెట్టింది.‘‘నువ్వొచ్చేశావ్ కదా? నేను మా ఊరు బయలుదేరతాను. నేను సర్దుకోవలసిన చాలా ఉన్నాయి’’ అంది. ‘‘వద్దొద్దు ఆ పని మాత్రం చేయొద్దు. ఈ పిల్లవాడిని నేను పెంచి పెద్ద చేయలేను. ఉద్యోగంలో టూర్లు చేస్తూ వీడిని చూసుకోవటం కాని పని. నువ్విక్కడే ఉండు. మీ ఆయనకు కూడా ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూస్తాను’’ అన్నాడు. అది చాలా భారమైన పని అన్నట్టు ప్రవర్తించింది నయనతార. ‘‘ఇతరుల పిల్లలను సొంత పిల్లల్లా పెంచటం కష్టం. అదీగాక సమాజం కూడా ఏదో ఒక తప్పు ఎంచుతూ ఉంటుంది. కానీ నీ ఇబ్బందిని చూసిన తర్వాత కాదనాలనిపించటం లేదు. నాకు శక్తికి మించిన పనే అయినా చేస్తాను’’ అంటూ రామ్ సదై కి తన పట్ల సానుభూతి కలిగేలా జీవితాంతం అతను తన మీద కృతజ్ఞత చూపేలా మాట్లాడింది. ‘‘శశిముఖి బిడ్డను తన బిడ్డలా సాకుతోంది. అంతే కాదు. తనకు కూడా ఓ పసిబిడ్డ ఉన్నాడన్న స్పృహనే ఆమెకు లేదు’’.చాలామంది నయనతార గురించి గొప్పగా చెప్పటం ప్రారంభించారు. రామ్ సదైలో కూడా ఇదే అభిప్రాయం ఏర్పడింది. తన బిడ్డకు లోటు లేకుండా చూస్తున్న ఆమె సాధారణ వ్యక్తి కాదు అనుకునేవాడు. గుండ్రంటి అందమైన తన పిల్లవాడిని అతని బిడ్డగా చెప్పేది. అది అతనూ నిజమేనని భావించేవాడు. రామ్ సదై టూర్కి వెళ్లి వచ్చినప్పుడల్లా ఇద్దరు పిల్లలకు కొత్త బట్టలు కొని తెచ్చేవాడు.తన బిడ్డగా ఆమె చెప్పుకుంటున్న పిల్లవాడికి కొత్త బట్టలు ఇచ్చినప్పుడు, ‘‘వాడికి ఇదంతా అలవాటు చేయకు. వాడు పేద ఇంటి పిల్లాడు. అలాగే పెరగనివ్వు. లేకపోతే వాడు పరిస్థితులకు సర్దుకోవటం కష్టం’’ అని వారించేది. దాంతో నయన తారపైన రామ్ సదైకి మరింత అభిమానంపెరిగింది. ఎంత ఆత్మగౌరవం ఉన్న మనిషి అనుకుని ముచ్చటపడేవాడు. దాంతో మరింత ఎక్కువగా అతనికి బహుమతులు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఈ రకంగా డిప్యూటీ బాబు కుమారుడు జతిన్, నయనతార కుమారుడు ఉపేన్లు స్థానాలు మార్చుకుని భిన్నమైన పాత్రల్లో పెరగటం మొదలుపెట్టారు. ప్రతిరోజూ పాఠాలు చెప్పటానికి ట్యూటర్ ఇంటికి వచ్చేవాడు. జతిన్ చిన్నతనంలోనే ఓ విషయం గ్రహించాడు. తను పేదింటి బిడ్డ కావటంతో ప్రపంచం పెద్దగా తన పట్ల ఆసక్తిని చూపదు అని సరిపెట్టుకున్నాడు. స్కూలులో అతను ఎంతగా ప్రయత్నించినా కూడా ప్రధానోపాధ్యాయుల ప్రశంసలన్నీ ఉపేన్ వైపే ఉండేవి. జతిన్ ప్రయత్నాలను, తెలివితేటలను గుర్తించి ట్యూటర్ అతనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం ప్రారంభించాడు. ఉపేన్ ఒక క్లాసులో తప్పితే అతన్ని అదే క్లాసులో ఉంచేందుకు ప్రయత్నించారు. కానీ నయనతార పోరాడి అతను పై తరగతిలో అడుగుపెట్టేలా చేయగలిగింది. దాని వల్ల అతనికి బహుమతులు లభించాయి. జితిన్ ఇలాంటి అడ్డదారులను నమ్ముకోలేదు.తల్లి ప్రేమకు నోచుకోకుండానే పెరిగి పెద్దవాడయ్యాడు జతిన్. కానీ సరస్వతీదేవి అనుగ్రహం మాత్రం అతనికి పుష్కలంగా ఉండేది. దాంతో అతనికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు అతని సొంతమయ్యాయి. అతనికి ఫీజులు చెల్లించటం మానేయమని, ఏదయినా చిన్న ఉద్యోగంలో అతన్ని చేర్చమని నయనతార అప్పుడప్పుడు రామ్ సదైతో అనేది. అతను ఈ మాటలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. దాంతో జతిన్ను పిలిచి మందలించింది. ‘‘ఇంకోళ్ల డబ్బుతో చదువుకోవటానికి సిగ్గులేదా నీకు. ఇప్పటికి చదివింది చాలు. రామ్ సదై మంచివాడు కాబట్టి ఇంతకాలం నిన్ను బాగా చూసుకున్నాడు. ఇంకొకళ్లయితే నిన్ను వీధిలోకి విసిరేవాళ్లు’’.తల్లి మాటలకు బాగా నొచ్చుకున్న జతిన్– రామ్ సదైని కలిశాడు. తాను కోల్కత్తా వెళుతున్నానని, స్కాలర్ షిప్పు డబ్బులతో చదువుకుంటానని చెప్పాడు. ‘‘ఏమైంది. ఇక్కడ ఏదయినా ఇబ్బంది అనిపిస్తోందా?’’ అడిగాడు రామ్ సదై.‘‘అదేం లేదు. పై చదువులు చదువుకోవటానికి కోల్కత్తా అనుకూలంగా ఉంటుందని..’’ జవాబు చెప్పాడు జతిన్.ఆ తర్వాత కోల్కత్తా వెళ్లి అక్కడ ఒక మెస్సులో ఉన్నాడు. ఎవరి నుంచి పైసా సాయం ఆశించకుండా తన సొంత డబ్బుతో కష్టపడి చదువుకున్నాడు. ముందు బీఏ డిగ్రీ పూర్తి చేసి, ఆ తర్వాత లాయర్ అయ్యాడు.ఉపేన్ అతనికి దరిదాపుల్లో లేడు. చదువులోగానీ, పేరు ప్రఖ్యాతుల్లో గానీ.కానీ అతని పెద్దమ్మగా నయనతార అన్ని విషయాల్లో అతన్ని పొగుడుతూండేది. ఇది ఇంకెంత కాలం కొనసాగేదో గానీ, ఇంతలోనే అనుకోని పరిణామం సంభవించింది.హఠాత్తుగా కలరా వ్యాపించటంతో పనిచేస్తున్న చోటే మృత్యువు పాలయ్యాడు రామ్ సదై. ∙∙ ‘‘ఉపేన్, మనకి ఏమవుతుంది? మీ నాన్న వదిలేసిన దాన్ని ఎలా మేనేజ్ చేస్తావో కూడా తెలియటం లేదు’’ నయనతార ఆందోళనగా అంది.‘‘ఫరవాలేదు పెద్దమ్మా.. మనం ఉన్నదానితో సర్దుకోగలం’’ జవాబిచ్చాడు ఉపేన్.‘‘అది వీలుకాని పని. మనకు అప్పు ఇచ్చే వాళ్లు కూడా కనిపించటం లేదు’’ దీనంగా చెప్పింది నయన.‘‘ఒకసారి తాతగారిని కలుద్దాం. ఆయన మనకు ఏమైనా సలహా ఇస్తారు’’ అన్నాడు ఉపేన్.ఈ సమయానికి జతిన్ లాయర్గా దర్భంగాలో మంచి పేరు ప్రఖ్యాతులు గడించాడు. సంపాదన బాగా పెరిగింది. ఉపేన్ని తన సొంత తమ్ముడిలా ప్రేమించేవాడు. వాళ్ల పరిస్థితి తెలిసిన తర్వాత అప్పులన్నీ తీర్చేశాడు. అంతే కాదు. వాళ్లను తనతో వచ్చెయ్యమని కోరాడు.జతిన్ ఆస్తిపాస్తులన్నీ చూసిన తర్వాత నయనతార అసూయ కలిగింది. మాటల్లో వర్ణించలేనంత పశ్చాత్తాపానికి లోనయ్యింది. పిల్లలను అటూ ఇటూ మార్చటం వల్ల తాను సాధించింది ఏమీ లేదని గుర్తించింది. కనీసం తనే అతని తల్లిని అనే మాటను కూడా జతిన్కు చెప్పుకోలేని స్థితిలో ఉన్నందుకు చింతించింది. ఉపేన్కు చెడ్డ స్నేహితులు ఎక్కువయ్యారు. ఎక్కువ సమయం వాళ్లతో గడుపుతూ జులాయిగా తిరిగేవాడు. ‘‘నీకోసం మంచి ఉద్యోగం చూశాను. అందులో చేరావంటే అంతా సక్రమంగా సాగుతుంది. నీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది’’ అతనికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు జతిన్.ఉపేన్కి ఈ సలహా నచ్చలేదు. నయనతార చాలా రోజులుగా అతనికి బ్రెయిన్ వాష్ చేస్తోంది. జతిన్ తమకు రుణపడ్డాడని. ఉపేన్ అతన్ని ఏమైనా అని సాధించవచ్చని సలహా ఇచ్చింది. ‘‘నువ్వు నన్ను వదుల్చుకోవాలనుకుంటున్నావా?’’ అడిగాడు ఉపేన్.ఈ మాటలకు జతిన్ మనసు గాయపడింది. ‘‘ఇంకెప్పుడూ నిన్ను పనిచేయమని నేను అడగను’’ అని అక్కడ నుంచి చకచకా కదిలి వెళ్లిపోయాడు. హరిపాద, అతని భార్య తీవ్రస్థాయిలో తగువు పడ్డారు. జతిన్కి అతను మంచి సంబంధం తెచ్చాడు. అమ్మాయి పేరు సరోజిని. ప్రభుత్వ ప్లీడరు కార్తీకబాబు కుమార్తె. అతను బాగా ఆస్తిపరుడు. జతిన్, సరోజినిల జంట బావుంటుందని, స్వర్గంలో కుదిరిన సంబంధం అని ఎంతగానో భావించాడు. అతను వంశచరిత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. నయనతార ఈ మాట వినగానే ఇంతెత్తున ఎగిరింది. ‘‘మన జీవితాలను తీర్చిదిద్దిన వ్యక్తిని ఆయన లేనంత మాత్రాన మరచిపోతామా? పాపం ఆయన బిడ్డను అలాగే వదిలేస్తామా? నా కంఠంలో ప్రాణం ఉండగా అలా ఎప్పటికీ జరగనివ్వను. మీరు ఆ అమ్మాయిని ఉపేన్కి ఇచ్చి వివాహం చేయండి. లేకపోతే నేను ఉరిపోసుకుని చస్తా’’ అని హెచ్చరించింది.భార్య ప్రవర్తనతో కంగుతిన్నాడు హరిపాద. ఆమెతో వాదించి ప్రయోజనం లేదనిపించి అక్కడ నుంచి మాయమయ్యాడు.ఎలాగయినా ఈ పెళ్లిని అడ్డుకోవాలని నిర్ణయించుకున్న నయన ముందుగా జతిన్కి కబురు పెట్టింది. ఉపేన్కి అతను ఎలా రుణపడ్డాడో చెప్పుకొచ్చింది.అతను అనుభవిస్తున్న సంపద అంతా రామ్ సదై బాబు దయ వల్లనే సాధ్యపడిందని, వాళ్లిద్దరి రుణం తీర్చుకునే సందర్భం వచ్చిందని వివరించింది. ‘‘ఇప్పుడు అంత దుర్మార్గంగా ఎలా వ్యవహరించగలుగుతున్నావ్’’ అని నిలదీసింది. ‘‘అమ్మా, ఈ పెళ్లి సంబంధం కుదిర్చింది నాన్న కదా? ఆయనతోనే నువ్వు మాట్లాడు’’ అని జతిన్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత కోర్టుకు వెళ్లిపోయాడు.దాంతో నయనతారకు మరే ప్రత్యామ్నాయం కనిపించలేదు. ఉపేన్ను కలుసుకుని, ‘‘బాబూ, నీతో మాట్లాడాలి’’ అంది.‘‘జతిన్ పెళ్లి గురించి నువ్వు వినే ఉంటావు. నువ్వేం కంగారు పడకు. కిందా మీదా పడయినా సరే, అదే అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తా’’ అని ప్రకటించింది. దాంతో కంగుతిన్నాడతను.‘‘పెద్దమ్మా? ఏమిటి నువ్వు అంటున్నది?’’ గట్టిగా అరిచాడు. ‘‘పూర్వీకులు, వంశ చరిత్ర, సామాజిక స్థితి అన్నింటిని పరిశీలించారు. వాళ్లిద్దరి జాతకాలు కుదిరాయి. ముహూర్తం నిశ్చయించారు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు తన కూతురిని తమ్ముడికి కాకుండా నాలాంటి మూర్ఖుడికివ్వటానికి సిద్ధపడే వాళ్లు ఎవరు ఉంటారు చెప్పు’’ అనడిగాడు. ‘‘నువ్వు ఏ వంశచరిత్ర, పూర్వీకుల గురించి మాట్లాడేది?’’ ఎన్నో సంవత్సరాలుగా గుండెల్లో దాచుకున్న రహస్యాన్ని బట్టబయలు చేయటానికి సిద్ధమవుతూ అంది నయన. ‘‘నువ్వు గొప్పగా చెప్పే వంశవృక్షాన్ని జతిన్ నీ దగ్గర నుంచి గుంజుకున్నాడు. ఇప్పుడు నేను ఆ రహస్యాన్ని బట్టబయలు చేస్తే జతిన్ పెళ్లి ఎలా అవుతుందో చూస్తాను’’ సవాల్ చేస్తున్నట్టుగా అంది.ఉపేన్ మళ్లీ అరిచాడు. ‘‘నీకేమయినా పిచ్చి పట్టిందా? తను నా వంశచరిత్రను ఎలా గుంజుకోగలుగుతాడు?’’ అన్నాడు.‘‘పిచ్చోడా? నీ వంశచరిత్రకు నువ్వు విలువ ఇవ్వాలి. వంశచరిత్ర ముందు సంపద, సామాజిక స్థాయి ఎందుకూ కొరగావు అనేది నేను అనుకుంటే, నా కొడుకుని ఇంకొకరితో మార్చే దానినా?’’ఉపేన్ మంచం మీద ఎగిరి దూకాడు. ‘‘పెద్దమ్మా..?’’‘‘ఇంకా పెద్దమ్మా ఏమిటి? అమ్మా అని పిలువు. నువ్వెప్పుడూ నన్ను నువ్వు అలా పిలవలేదు. నాకు ఆ అదృష్టం లేకుండా పోయింది. నేను నీ కోసం ఎంతో చేశాను. చివరికి దీని వల్ల నాకేం మిగిలింది? ఇప్పుడు నేను అందరికీ చెబుతాను. పుట్టినప్పుడు మీ ఇద్దరిని నేను ఎలా మార్చానో? ఈ రోజు వాడికి రెండు డిగ్రీలు ఉన్నందుకు అహంకారం, తలపొగరు నెత్తికెక్కి హద్దులు లేకుండా వ్యవహరిస్తున్నాడు. వంశచరిత్ర.. దాన్ని ఇప్పడే నాశనం చేస్తా. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి దొరికేలా లేదు’’ అంది గట్టిగా నిట్టూర్పు విడుస్తూ. ‘‘నువ్వు ఇంకేం మాట్లాడకు. ఇంకొక్క మాట మాట్లాడినా నిన్ను నేను చంపేస్తా’’ ఉగ్రుడయ్యాడు ఉపేన్..ఆ రోజు మధ్యాహ్నం భోజనాల సమయంలో అతని జాడ కనిపించలేదు. అలా అప్పుడప్పుడు అతను మాయం కావటం మామూలే. అందుకే ఎవరూ అంతగా పట్టించుకోలేదు.సాయంత్రం జతిన్కి అతని పేరుతో ఓ టెలిగ్రామ్ వచ్చింది. ‘‘దాదా, నేను రంగూన్ వెళ్లిపోతున్నాను. మీరంతా సుఖసంతోషాలతో జీవించాలి. అదే నేను మీ నుంచి కోరుకుంటాను. ఇకపోతే నేను చేసిన తప్పులను నువ్వు క్షమిస్తావనే అనుకుంటున్నాను. ఉంటున్నాను– ఉపేన్’’ అని ఉంది అందులో. బెంగాలీ మూలం: మాధురీలతా దేవి అనువాదం: డాక్టర్ పార్థసారథి చిరువోలు
ఎక్స్ప్రెస్ ది ఫ్యాషన్
ఔట్ఫిట్లో ఆత్మవిశ్వాసం, లుక్లో నేచురల్ ఎలిగెన్స్ చూపించే శ్రద్ధా శ్రీనాథ్, స్టయిల్ ఆమె వ్యక్తిత్వంలాగే క్లాసీ, బాలెన్స్డ్, రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఆ సీక్రెట్సే ఇప్పుడు మీకోసం!చీర.. బ్రాండ్: అనిల్ హోసమాని ధర: రూ. 80,000జ్యూలరీ బ్రాండ్: బబుల్ లవ్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.ఫ్యాషన్ అంటే ట్రెండ్స్ కంటే ముందు మనసుకు నచ్చే ఎక్స్ప్రెషన్ ! ఎలాంటి దుస్తులు వేసుకున్నా, సౌకర్యంగా ఉండటం, నన్ను ప్రతిబింబించేలా ఉండటమే ముఖ్యం. ట్రెడిషనల్ లుక్కి మినిమల్ జ్యువెలరీ జోడించడం, లేక మోడర్న్ వేర్కి ఎథ్నిక్ టచ్ ఇవ్వడం నాకు బాగా నచ్చుతుంది. – శ్రద్ధా శ్రీనాథ్.
శతాయుష్మాన్ భవ!
జపాన్ సంస్కృతిలో నవంబర్ నెల ఎంతో ప్రత్యేకమైనది. ఈ సమయంలో జపాన్ దేవాలయాలను సందర్శిస్తే, అందమైన కిమోనో వస్త్రధారణలో మెరిసే చిన్నచిన్న పిల్లలను చూడవచ్చు. ఇది జపాన్ సంప్రదాయ వేడుక. ఈ వేడుకని షిచి–గో–సాన్ పండుగ(Shichi-Go-San festival) అని పిలుస్తారు. ఆ పదాలకు అక్షరాలా ‘ఏడు, ఐదు, మూడు’ అని అర్థం. ఈ పండుగను ఈ మూడు నిర్దిష్ట వయస్సుల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు– తమ పిల్లల పెరుగుదలకు దీవెనలందించిన దేవుళ్లకు కృతజ్ఞతలు తెలియజేయడానికి, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం దేవుళ్లను ప్రార్థించడానికి జరుపుకుంటారు.మూడు సంవత్సరాల వయసు ఉన్న బాలుడు లేదా బాలిక, ఐదు సంవత్సరాల వయసు ఉన్న బాలుడు, ఏడు సంవత్సరాల వయసు ఉన్న బాలిక ఈ వేడుకలో పాల్గొంటారు. ఈ పండుగ సందర్భంగా నవంబర్ 15న చాలామంది జపాన్ తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి షింటో దేవాలయాలు లేదా బౌద్ధ దేవాలయాలను సందర్శిస్తారు.షిచి–గో–సాన్ పండుగ చరిత్ర– హీయాన్ కాలం (794–1185) నాటిది. అప్పటి నుంచి, ఉన్నత వర్గాల, సమురాయ్ కుటుంబాలు తమ పిల్లలు ఆరోగ్యంగా పెరిగినందుకు వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పాత రోజుల్లో, వైద్య సంరక్షణ అంతగా అభివృద్ధి చెందనందున, శిశు మరణాల రేటు చాలా ఎక్కువగా ఉండేది. అందుకే ఏడేళ్ల వయస్సు వచ్చే వరకు పిల్లలను ‘కామి నో ఉచి’ అంటే– దేవుని పిల్లలుగా పరిగణించేవారు. ఏడేళ్ల వయస్సు దాటితేనే వారిని మానవ లోకంలోకి ప్రవేశించినట్లుగా భావించేవారు.ఈ వేడుకల కోసం నవంబర్ 15వ తేదీని ఎంచుకోవడానికి ఒక ప్రధాన కారణం ఉంది. అదేంటంటే 1603–1867 మధ్య కాలంలో టోకుగావా సునాయోషి అనే పాలకుడు తన కన్నబిడ్డ ఆరోగ్యం కోసం అదేరోజు ప్రార్థించాడట. ఈ వేడుకలో పాల్గొనే పిల్లలకు తల్లిదండ్రులు ‘చిటోసియామే’ అనే మిఠాయిని ప్రత్యేకంగా తినిపిస్తారు. ఎందుకంటే ‘చిటోసె’ అంటే దీర్ఘాయుష్షు అని అర్థం. ఈ క్యాండీని ‘వెయ్యేళ్ల క్యాండీ’ అని కూడా పిలుస్తారు. ఈ క్యాండీల ప్యాకింగ్పైన కొంగలు, తాబేళ్లు ఇలా దీర్ఘాయుష్షుకు చిహ్నమైన బొమ్మలు ఉంటాయి.
ఫిట్నెస్కి పప్పీ టచ్!
జిమ్కి వెళ్లడం బోర్గా అనిపిస్తోందా? అయితే ఈ కొత్త ఫిట్నెస్ ట్రెండ్ మీకు ఒక ‘ఫన్ వర్కౌట్’లా అనిపించొచ్చు! ఎందుకంటే ఇందులో మనుషులు జంతువుల్లా చేతులు, కాళ్లు నేల మీద వేసుకుని పరుగెడతారు. పేరు ‘క్వాడ్రోబిక్స్(Quadrobics)’! కాని, ఫిట్నెస్ ప్రేమికులు దీన్ని ‘ఫుల్ బాడీ ఫన్నీ వర్కౌట్’ అంటున్నారు. అంతే కాదు, సాధారణ వర్కౌట్స్ మాదిరి గంటల తరబడి కాకుండా, కేవలం ఐదు నిమిషాలే చేస్తే ఊపిరి బిగుసుకుంటుంది! అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే, వైద్యులు మాత్రం ‘ఇది కాస్తా జంతువుల్లా ప్రవర్తించే అలవాటుగా మారితే ప్రమాదం!’అని హెచ్చరిస్తున్నారు. చేతులు, మణికట్టు, భుజాలు ఇవన్నీ మన బాడీకి ఈ లోడ్కి అలవాటు ఉండవు. కాబట్టి ఫిట్నెస్ కన్నా ఫ్రాక్చర్ ఫాస్ట్గా రావచ్చు! అని చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ‘ఫోర్ లెగ్ ఫిట్నెస్’ శరీరానికి కాకపోయినా, లైక్స్కి మాత్రం బాగా పని చేస్తోంది!
ఫొటోలు
ఏఆర్ రెహమాన్ కన్సర్ట్లో 'పెద్ది' టీమ్ సందడి (ఫొటోలు)
'కాంతార 1' టీమ్ గెట్ టూ గెదర్.. అలానే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
అనసూయ కొడుకు పుట్టినరోజు.. ఆఫ్రికన్ దేశంలో సెలబ్రేషన్ (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 09-16)
తిరుమలలో రిలయన్స్ అధినేత: శ్రీవారిని దర్శించుకున్న అంబానీ (ఫోటోలు)
చీరలో కిక్ ఇచ్చే ఫోజులతో బిగ్బాస్ 'అశ్విని శ్రీ ' (ఫోటోలు)
హైదరాబాద్ : పెట్ షో అదరహో (ఫొటోలు)
అను ఇమ్మాన్యుయేల్ 'ద గర్ల్ఫ్రెండ్' జ్ఞాపకాలు (ఫొటోలు)
ఫ్రెండ్ పెళ్లిలో అనన్య సందడే సందడి (ఫొటోలు)
'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి పెళ్లి (ఫొటోలు)
అంతర్జాతీయం
మాలీలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ కలకలం
పశ్చిమ ఆఫ్రికా దేశం ఐదుగురు భారతీయుల కిడ్నాప్ వార్త కలకలం రేపింది. ఈ విషయాన్ని భద్రతా వర్గాలు శుక్రవారం ధృవీకరించాయి. ఒక పక్క అశాంతి, జిహాదీ హింసతో అల్లాడి పోతుండగా మరోపక్క కోబ్రీ సమీపంలో ఉగ్రవాదుల చేతిలో భారతీయుల కిడ్నాప్ మరింత ఆందోళన రేపింది. పశ్చిమ మాలిలోని కోబ్రీ సమీపంలో గురువారం కార్మికులను ముష్కరులు కిడ్నాప్ చేశారని, వారు విద్యుదీకరణ ప్రాజెక్టులపై పనిచేస్తున్న కంపెనీలో పనిచేస్తున్నారని భద్రతా వర్గాలు AFPకి తెలిపాయి. మరోవైపు బాధితులు పనిచేస్తున్న కంపెనీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ముందుజాగ్రత్త చర్యగా మిగిలిన వారిని రాజధాని బమాకోకు సురక్షితంగా తరలించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే తామే ఈ కిడ్నాప్ చేసినట్టు ఇప్పటివరకు ఏ గ్రూపు ప్రకటించలేదు.2012 నుండి తిరుగుబాట్లు, ఘర్షణలతో అట్టుడుడుతున్న దేశంలో విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్లు సర్వసాధారణంగా మారిపోయాయి. అల్ఖైదాదీ సంబంధిత గ్రూప్ ఫర్ ది సపోర్ట్ ఆఫ్ ఇస్లాం అండ్ ముస్లింస్ (JNIM) జిహాదీలు సెప్టెంబర్లో బమాకో సమీపంలో ఇద్దరు ఎమిరాటీ జాతీయులను మరియు ఒక ఇరానియన్ను కిడ్నాప్ చేశారు.50 మిలియన్ల డాలర్ల చెల్లింపు తరువాత వారిని గత వారం విడుదల చేశారు.
లెస్స పలికితివి మామా..
హైలెస్స రికార్డు..భారీ నౌక.. అందులో 130 మంది ప్రయాణికులు.. మొత్తంగా 1.18 లక్షల కిలోల బరువు. అయితే, కెనడాకు చెందిన వెస్లీ మూస్.. నౌకకు అలా తాడుకట్టి ఇలా ఒడ్డుకు(65 అడుగుల దూరం) లాక్కొచ్చేశాడు. తద్వారా అమెరికాలో జరిగిన స్ట్రాంగ్మన్ చాంపియన్స్ లీగ్ను గెలుచుకోవడంతోపాటు గిన్నిస్ బుక్లోకి కూడా ఎక్కాడు. ఇందుకోసం 81 సెకన్ల సమయం తీసుకున్నాడు. తన క్రేజీ కలలను నెరవేర్చుకోవడంలో తన భార్య ఎంతగానో సహకరించిందంటూ కృతజ్ఞతలు చెప్పాడు. గుండమ్మ కథ ఆయన రికార్డులను ఊదిపారేస్తే.. ఈవిడ ఎత్తిపారేస్తుంది. గుండ్లు ఎత్తడంలో ఈ గుండమ్మ ఫేమస్ అట. ఆస్ట్రేలియాకు చెందిన నికోల్ ఏకంగా 180 కిలోల గుండును ఎత్తడం ద్వారా అంతటి బరువున్న గుండును ఎత్తిన మహిళగా గిన్నిస్ రికార్డును సాధించింది. చిన్నప్పుడు అద్భుతాలు సాధించిన మనుషుల కథలను చదివి.. తానూ ఒక రోజు అలా అవ్వాలని నికోల్ కలలుగనేదట. మనకీ అబ్దుల్ కలాం చెప్పారు. కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అని. మనం మొదటి సగం దగ్గరే ఆగిపోతున్నాం.. మారుదామా మరి.. బబుల్ను చూస్తే.. గమ్నుండడు..బబుల్ గమ్లను చూస్తే అమెరికాకు చెందిన చాడ్ ఫెల్ అస్సలు గమ్మునుండడు. వాటితో రికార్డులను ఊదిపారేస్తాడు. ఎంతలా అంటే ఆయన రికార్డును మరెవరూ బద్దలు కొట్టలేనంతగా.. ఇంతకీ ఆ గిన్నిస్ రికార్డు ఎందులోనో తెలుసా? అతిపెద్ద బబుల్ గమ్ బుడగను ఊది పేల్చడంలో.. ఈయన ఏకంగా 20 అంగుళాల బబుల్గమ్ బుడగను ఊది.. ఇదిగో ఇలా పేల్చేశాడు. ఏదైతేనేం.. ఫెల్ రికార్డు సాధించి 20 ఏళ్లు దాటుతున్నా.. ఇప్పటివరకూ ఎవరూ దాన్ని బద్దలు కొట్టలేదట.. మీరు ట్రై చేసి చూస్తారా?
జీ-20 సదస్సును బహిష్కరిస్తున్నాం: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ-20 సదస్సును అమెరికా బాయ్కాట్ చేస్తున్నట్టు ట్రంప్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే సమయంలో జీ-20 గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికాను తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే, ఇందుకు గల కారణాలను ట్రంప్ వెల్లడించారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా..‘జీ-20 సదస్సు దక్షిణాఫ్రికాలో జరగడం పూర్తిగా అవమానకరం. ఆ దేశంలో మైనార్టీలు అయిన తెల్లజాతి రైతులపై హింస, ఆస్తుల స్వాధీనం, హత్యలు జరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్న దారుణాలు ప్రపంచానికి తెలియాలి. అందుకే అమెరికా జీ-20 సదస్సుల్లో అమెరికా పాల్గొనడం లేదు. జీ-20 దేశాల అధినేతల సదస్సుకు అమెరికా నుంచి ఎవరూ హాజరు కావడం లేదు. ఈ సదస్సును బహిష్కరిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.అయితే, ఇటీవల మియామిలో చేసిన ప్రసంగంలో దక్షిణాఫ్రికాను జీ-20 గ్రూప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన ట్రంప్, తాజాగా అక్కడ జరిగే సదస్సును బహిష్కరించాలని నిర్ణయించారు. కాగా, తెల్లజాతి ఆఫ్రికన్ రైతులు దక్షిణాఫ్రికాలో దాడులకు గురవుతున్నారని, అక్కడి సర్కారు వారిని రక్షించడంలో విఫలమైందంటూ ఆరోపించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాకు చెందిన తెల్లజాతీయుల కోసం ట్రంప్ ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది. వలసదారులకు ఆశ్రయం ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.ట్రంప్కు దక్షిణాఫ్రికా కౌంటర్.. అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమ దేశంలో తెల్లజాతి ప్రజలు ఇప్పటికీ నల్లజాతి ప్రజల కంటే ఎక్కువ స్థాయి జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారని స్పష్టం చేసింది. తెల్లజాతి రైతులపై వివక్ష, హింస జరుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తప్పుడు సమాచారం అందినట్లు తెలిపింది.నవంబర్ 22-23 తేదీల్లో సదస్సు.. ఇక, జీ-20 సదస్సు ఈ ఏడాది నవంబర్ 22-23 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరగనుంది. ఈ సదస్సు ఆఫ్రికా ఖండంలో జరగడం ఇదే మొదటిసారి. వాస్తవానికి ట్రంప్ ఇప్పటికే తాను జీ-20 సదస్సుకు హాజరు కావట్లేదని ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు వాన్స్ కూడా తన ప్రయాణాన్ని రద్దు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ప్రారంభంలో జీ-20 విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశాన్ని కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బహిష్కరించారు.
చైనా అమ్ముల పొదిలో అత్యాధునిక నౌక
బీజింగ్: వాణిజ్యంలోనూ, సైనిక శక్తిలోనూ అమెరికాను ఢీకొడుతున్న చైనా.. తన నౌకాదళాన్ని మరింత శక్తిమంతం చేసే చర్యల్లో మరో ముందడుగు వేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఫుజియాన్ విమాన వాహక నౌకను నౌకాదళానికి అందించింది. ఇందులో అత్యంత ఆధునికమైన ఎలక్టోమ్య్రాగ్నటిక్ వ్యవస్థ (ఈమల్స్)ను అమర్చారు. ఈ వ్యవస్థ ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికా విమాన వాహకనౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్లో మాత్రమే ఉంది. ఇటీవల హైనాన్ ప్రావిన్స్లోని సన్యా పోర్టులో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్వయంగా ఈ నౌకను నౌకాదళానికి అందించినట్టు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ జిన్హువా పేర్కొంది. అయితే, ఈ నౌకలో ఇంకా ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం వాడారన్న విషయాన్ని చైనా అత్యంత గోప్యంగా ఉంచుతోంది. అయితే, ఆ దేశ మీడియా రిపోర్టుల ప్రకారం ఈ నౌకపై జే–15టీ, జే–35, కాంగ్జింగ్–600 వంటి యుద్ధ విమానాలను మోహరించనున్నట్టు తెలిసింది. నౌకపై ఈ విమానాల టేకాఫ్, ల్యాండింగ్ టెస్టులు పూర్తయ్యాకే కమిషనింగ్ చేశారని జిన్హువా పేర్కొంది. ఈ నౌక బరువు 80 వేల టన్నులు. ఎమిటీ ఈమల్స్? విమాన వాహక నౌక పైనుంచి యుద్ధ విమానాలు రాకపోకలు సాగించటమే అత్యంత కీలకమైన అంశం. చాలా తక్కువ నిడివి ఉండే రన్వే పై టేకాఫ్ కావటం, ల్యాండింగ్ చేయటం క్లిష్టమైన పని. సంప్రదాయ విమానవాహక నౌకలో ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో విమానాన్ని బయటి నుంచి నియంత్రించేందుకు టర్బైన్ టెక్నాలజీని వాడుతారు. గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, ఫుజియాన్లో ఎలక్ట్రోమ్యాగ్నటిక్ టెక్నాలజీని వాడారు. ఈ వ్యవస్థ ద్వారా యుద్ధ విమానం తక్కువ సమయంలో ఎక్కువ శక్తి పుంజుకుని గాల్లోకి ఎగిరేందుకు బయటి నుంచి శక్తిని అందిస్తారు. ల్యాంగింగ్ సమయంలోనూ విమానం నిర్దేశిత ప్రదేశాన్ని దాటి ముందుకు వెళ్లి సముద్రంలో పడిపోకుండా ఈ అయస్కాంత శక్తి నియంత్రిస్తుంది. సంప్రదాయ టెక్నాలజీలతో పోల్చితే ఎలక్టోమ్య్రాగ్నటిక్ వ్యవస్థ సాంకేతికంగా క్లిష్టమైనదే అయినప్పటికీ.. దాని నిర్వహణ సులభం. అయితే, ఏవైనా సమస్యలు వస్తే మాత్రం రిపేర్లకు చాలా ఖర్చవుతుంది. అమెరికాను మించి చైనా నౌకాశక్తి ప్రపంచంలో అత్యంత భారీ నౌకాదళం ఉన్న దేశంగా అమెరికాను వెనక్కు నెట్టి చైనా అవతరించింది. అమెరికా వద్ద ప్రస్తుతం 219 యుద్ధ విమానాలు ఉండగా, చైనా వద్ద 234 ఉన్నాయి. చైనా వద్ద ఇప్పటికే ఉన్న మూడు విమాన వాహక నౌకలు సంప్రదాయ ఇంధన శక్తితో పనిచేస్తాయి. దీంతో ఆ దేశం కొత్తగా అణుశక్తితో నడిచే దలియాన్ అనే నాలుగో విమాన వాహక నౌకను నిర్మిస్తోంది. భారత్ వద్ద ఐఎస్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే రెండు విమాన వాహక నౌకలు ఉన్న సంగతి తెలిసిందే. దక్షిణ చైనా సముద్రంతోపాటు సుదూర సముద్ర ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని చాటుకొనేందుకు చైనా నౌకా శక్తిని భారీగా పెంచుతోందని చైనా మిలిటరీ వ్యవహారాల నిపుణుడు ఝాంగ్ జున్షే ఆ దేశ వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్తో తెలిపారు.
జాతీయం
బీహార్ స్ట్రాంగ్ రూమ్ కెమెరాలు ఆఫ్.. ఆర్జేడీ సంచలన వీడియో
పాట్నా: బీహార్లో ఏం జరుగుతోంది?. స్ట్రాంగ్ రూమ్ వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియా కూటమికి చెందిన ఆర్జేడీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా బీహార్లో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి భారీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ ఆర్జేడీ ఆరోపించింది. దీంతో, ఈ వీడియో సంచలనంగా మారింది. మరోవైపు.. ఆర్జేడీ ఆరోపణలను ఈసీఐ తీవ్రంగా ఖండించింది. దీనిపై క్లారిటీ ఇచ్చింది.ఆర్జేడీ ట్విట్టర్లో పోస్టు చేసిన వీడియో ప్రకారం.. సమస్తిపూర్లోని మొహియుద్దీన్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని స్ట్రాంగ్ రూమ్లోకి కొందరు వ్యక్తులు ప్రవేశించడం కనిపించింది. వారంతా ఎవరు? స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏం చేస్తున్నారు?. అక్కడి పరిస్థితులపై వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్, అధికారులను ఆర్జేడీ డిమాండ్ చేసింది. బీహార్ నుండి ఓట్లను దొంగిలించడానికి కొంతమంది బీహార్ వ్యతిరేక వ్యక్తులతో కలిసి ఒక దొంగ పనిచేయాలనుకుంటున్నాడు అని సంచలన ఆరోపణలు చేసింది. ఇదే సమయంలో స్ట్రాంగ్ వద్ద భద్రత పెంచాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.समस्तीपुर के स्ट्रॉंग रूम में आधे घंटा बंद रहा CCTV कैमरा!चुनाव आयोग और स्थानीय प्रशासन भ्रष्टाचार ग्रसित फालतू बहाने जैसे बिजली कट गई, बैटरी डाउन हो गया, TV स्लीप मोड में चला गया, जेनरेटर नहीं था... नहीं बनाए!आप लोगों की विश्वसनीयता और शुचिता शून्य है!#VoteChori के हथकंडे बंद… pic.twitter.com/wlacKl4Ltv— Rashtriya Janata Dal (@RJDforIndia) November 8, 2025మరో వీడియోలో.. ఆర్ఎన్ కాలేజీలో కౌంటింగ్ కోసం భద్రపరిచిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని ఆర్జేడీ ఆరోపణలు చేసింది. ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మేనేజ్ చేస్తున్నారని.. దీంతో ఈవీఎం ట్యాంపరింగ్కు పాల్పడినట్లు అనుమానంగా ఉందని కామెంట్స్ చేసింది. మహ్నార్-129 అసెంబ్లీ స్థానంలో ఉన్న ఈ ఆర్ఎన్ కాలేజ్ కౌంటింగ్ సెంటర్లో సీసీటీవీలను ఆఫ్ చేశారని అందుకు సంబంధించి ఆర్జేడీ నాయకులు వీడియో రిలీజ్ చేశారు.వైశాలి జిల్లాలోని హాజీపూర్లో స్ట్రాంగ్ రూమ్ దగ్గర అనుమానాస్పద పరిస్థితులు నెలకొన్నాయని మరో వీడియోలో తెలిపారు. రాత్రి వేళ పికప్ వ్యాన్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే, ఆ వ్యాన్ వెళ్లేటప్పుడు సీసీ టీవీ కెమెరాలు స్విచ్ ఆఫ్ అయినట్లు చూపిస్తోంది. అక్కడున్న పెద్ద సీసీకెమెరా ఆఫ్ అయి ఉంది. మిగతావి ఆన్లో ఉన్నాయి. ఇది అనుమానాలకు తావిస్తోందని ఆర్జేడీ ఆరోపిస్తోంది.अब समस्तीपुर की मोहिउद्दीन नगर विधानसभा के स्ट्रांग रूम में घुसते कुछ संदिग्ध दिखे।@ECISVEEP @CEOBihar स्थिति स्पष्ट करे कि ब्रजगृह के अंदर ये संदिग्ध लोग कौन थे और क्या कर रहे थे? जागते रहो, सतर्क रहो। एक बाहरी वोट डकैत बीते कई दिनों से बिहार में बैठकर बिहार विरोधी कुछ… pic.twitter.com/DXprL4nPzW— Rashtriya Janata Dal (@RJDforIndia) November 8, 2025కౌంటింగ్ ఏరియాలోకి వాహనాలు.. కౌంటింగ్ చేసేందుకు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఉన్న స్థలంలోకి వెహికిల్స్ ఎందుకు వెళ్తున్నాయని వీడియో రికార్డు చేసిన వ్యక్తి ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో అధికార జేడీయూ-బీజేపీ కూటమి అక్రమ మార్గంలో గెలిచేందుకు కుట్రలు చేస్తున్నట్టు ఆర్జేడీ నేతలు ఆరోపిస్తున్నారు.ఈసీ స్పందన.. ఈ నేపథ్యంలో ఆర్జేడీ ఫిర్యాదుపై ఈసీ స్పందిస్తూ ప్రాథమిక విచారణ నిర్వహించినట్లు తెలిపింది. కంట్రోల్ రూమ్లోని నుంచి స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారికంగా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఐదు అసెంబ్లీ విభాగాలలో ఒకటైన 129 మహానార్ వద్ద డిస్ప్లే స్క్రీన్ ఆటో టైమ్ అవుట్ కారణంగా కొంతకాలం ఆపివేయబడింది. త్వరగా పునఃప్రారంభించబడిందని పేర్కొంది. ఇది అంతరాయం లేకుండా జరిగాయని కమిషన్ స్పష్టం చేసింది. మహానార్ ప్రధాన కంట్రోల్ రూమ్ ఫీడ్ ఏమాత్రం ప్రభావితం కాలేదని కూడా తెలిపింది.పికప్ వ్యాన్ ఆరోపణలపై స్పందిస్తూ.. వాహనం స్ట్రాంగ్ రూమ్లో నియమించబడిన భద్రతా సిబ్బందికి చెందినది. వారు కళాశాల క్యాంపస్కు ఆలస్యంగా బెడ్డింగ్, సామాగ్రిని తీసుకువచ్చారని ఈసీఐ తెలిపింది. వాహనం 15 నిమిషాల్లోనే వెళ్లిపోయింది. దాన్ని ఎంట్రీ గార్డు రిజిస్టర్లో నమోదు చేశారు అని పేర్కొంది. స్ట్రాంగ్ రూమ్ మూడు అంచెల భద్రతా వ్యవస్థ కింద పనిచేస్తుందని కమిషన్ స్పష్టం చేసింది. చివరగా.. నిరాధారమైన, తప్పుదారి పట్టించే పోస్ట్ను ఖండిస్తున్నట్టు ఈసీఐ తెలిపింది.ఇది కూడా చదవండి: చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు
‘హెచ్చరించినా పట్టించుకోలేదు’.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తాజాగా తలెత్తిన సాంకేతిక సమస్యలపై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ గిల్డ్(ఏటీసీ గిల్డ్ ఇండియా) తీవ్రంగా స్పందించింది. ఈ సమస్యలపై గత జూలైలోనే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి తెలియజేశామని, సిస్టమ్ అప్గ్రేడ్ చేయవలసిన అవసరం గురించి ముందుగానే హెచ్చరించామని ఏటీసీ గిల్డ్ ఇండియా పేర్కొంది.ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం తలెత్తిన సిస్టమ్ వైఫల్యాన్ని నివారించవచ్చని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సంస్థ ఏటీసీ గిల్డ్ తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఏటీసీ అప్గ్రేడ్ల ఆవశ్యకత గురించి ముందుగానే తెలియజేశారని, అయితే అధికారులు వారి సూచనలను స్వీకరించి, చర్యలు చేపట్టలేదని ఆరోపించింది. అహ్మదాబాద్లో 260 మందిని బలిగొన్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ ప్రమాదం తర్వాత జూలై 8న ఎంపీలకు కూడా లేఖ రాశామని, ఎయిర్ నావిగేషన్ సేవల్లో ఉపయోగించే ఆటోమేషన్ వ్యవస్థలను సమీక్షించి, కాలానుగుణంగా అప్గ్రేడ్ చేయడం చాలా అవసరమని తెలియజెప్పామని గిల్డ్ వివరించింది.భారతదేశంలోని ఆటోమేషన్ వ్యవస్థ యూరప్లోని యూరోకంట్రోల్, యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) మాదిరిగా ఉండాలని ఆ లేఖలో గిల్డ్ పేర్కొంది. ఈ దేశాలలో ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణలు ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధస్సు (ఏఐ)తో తలెత్తే ముప్పును గుర్తించడం, రియల్-టైమ్ డేటా షేరింగ్ కలిగి ఉన్నాయని గిల్డ్ తెలిపింది. ఇటువంటి భద్రతా సమస్యలను ఏఏఐ ముందు పలుమార్లు లేవనెత్తామని, అయితే దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని గిల్డ్ ఆరోపించింది.ఢిల్లీ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సర్వర్ శుక్రవారం పనిచేయలేదు. ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (ఏఎంఎస్ఎస్)లో సాంకేతిక లోపం కారణంగా విమాన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఇది 800కు పైగా విమానాలను ప్రభావితం చేసిందని అధికారులు తెలిపారు. దీంతో పలు విమానయాన సంస్థలు తమ విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ సమస్య ప్రభావం అంతర్జాతీయ విమాన రాకపోకలకు కూడా పడింది. ఇది కూడా చదవండి: డిసెంబర్ 1 నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
‘చంద్రయాన్–2’ నుంచి విలువైన సమాచారం: ఇస్రో
బెంగళూరు: చందమామ ధ్రువపు ప్రాంతాలకు సంబంధించి చంద్రయాన్–2 లూనార్ ఆర్బిటార్ నుంచి విలువైన సమాచారాన్ని సేకరించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ డేటాతో చంద్రుడి వాతావరణం, అక్కడి స్థితిగతుల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి వీలవుతుందని స్పష్టం చేసింది. జాబిల్లి ఉపరితలానికి చెందిన ఫిజికల్, డైఎలక్ట్రిక్ లక్షణాలు తెసుకోవచ్చని పేర్కొంది. భవిష్యత్తులో చంద్రుడిపై చేపట్టబోయే కీలక ప్రయోగాలకు ఈ సమాచారం ఎంతగానో తోడ్పడుతుందని ఇస్రో తేల్చిచెప్పింది.చంద్రయాన్–2 ఆర్బిటార్ 2019 నుంచి చంద్రుడి చుట్టూ కక్ష్యలోకి తిరుగుతోంది. నాణ్యమైన డేటాను భూమిపైకి చేరవేస్తోంది. ఇందులోని డ్యుయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్(డీఎఫ్ఎస్ఏఆర్) అనే పేలోడ్ చంద్రుడి ఉపరితలాన్ని స్పష్టంగా చిత్రీకరించింది. ఈ అడ్వాన్స్డ్ రాడార్ సంకేతాలను నిలువు దిశ, అడ్డం దిశల్లో పంపగలదు, స్వీకరించగలదు. చందమామ ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి దోహదపడుతోంది. చంద్రుడి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువానికి సంబంధించిన సమాచారాన్ని చంద్రయాన్–2లోని 1,400 రాడార్ డేటాసెట్లు సేకరించి, విశ్లేషించాయి. ఈ సమాచారం ఆధారంగా అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్(ఎస్ఏసీ) సైంటిస్టులు అడ్వాన్స్డ్ డేటా ప్రొడక్ట్లను అభివృద్ధి చేశారు. చంద్రుడిపై మంచు రూపంలోని నీరు, ఉపరితలం పరిస్థితులను సరిగ్గా అంచనా వేయడానికి ఈ ప్రొడక్ట్లు సహకరిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు.
బిహార్ బరిలో ఫైనల్ రౌండ్!
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల అధ్యాయం తుది దశకు చేరుకుంది. రెండో దశలో ఈ నెల 11వ తేదీన 122 అసెంబ్లీ స్థానాలకు తుదిదశ పోలింగ్ జరగనుంది. ఇది సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి, తేజస్వీ యాదవ్ సారథ్యంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి రాజకీయ ఎత్తుగడలకు అసలు సిసలు పరీక్షగా మారింది. చంపారన్ కంచుకోటల నుంచి సీమాంచల్ సంక్లిష్ట సమీకరణాల వరకు అరడజనుకు పైగా మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతల తలరాతలు ఈవీఎంలలో నిక్షిప్తం కానున్నాయి. తొలి దశ హోరాహోరీగా ముగియగా, ఈ ఫైనల్ రౌండ్లో గెలిచి గద్దెనెక్కేదెవరన్న దానిపై నరాలు తెగే ఉత్కంఠ నడుస్తోంది. అందరి దృష్టి వీరిపైనే... రెండో దశ పోలింగ్ నితీశ్ కుమార్ కేబినెట్ సహచరులకు, మహాగఠ్బంధన్ ప్రభుత్వంలోని మాజీ మంత్రులకు చావోరేవోగా మారింది. వీరి గెలుపోటములు కూటముల భవిష్యత్తును శాసించనున్నాయి. అందరి దృష్టీ వీఐపీలపైనే ఉంది. వారెవరంటే..⇒ రేణు దేవి (బీజేపీ, బెట్టియా): రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె పశ్చిమ చంపారన్లో బీజేపీకి అత్యంత కీలకమైన, బలమైన నాయకురాలు. ఈమె గెలుపు కూటమికి అత్యంత ప్రతిష్టాత్మకం.⇒ లేషి సింగ్ (జేడీయూ, ధమ్దాహా): నితీశ్ కేబినెట్లో ప్రస్తుత ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి. సీమాంచల్ ప్రాంతంలో జేడీయూకి బలమైన మహిళా నాయకురాలు. 2020లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన ఈమె, ఈసారి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.⇒ లలిత్ కుమార్ యాదవ్ (ఆర్జేడీ, దర్భంగా గ్రామీణ): గత మహాగఠ్బంధన్ ప్రభుత్వంలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ మంత్రి. దర్భంగా ప్రాంతంలో ఆర్జేడీకి బలమైన యాదవ నేతగా ఈమెను భావిస్తున్నారు.⇒ మదన్ సహాని (జేడీయూ, బహదూర్పూర్): సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. అత్యంత వెనుకబడిన వర్గాల (ఈబీసీ) నుంచి వచ్చిన బలమైన నాయకుడు. ఈయన గెలుపు ఎన్డీయేకు ముఖ్యం.⇒ సమీర్ కుమార్ మహాసేఠ్ (ఆర్జేడీ, మధుబని): గత మహాగఠ్బంధన్ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి. మిథిలాంచల్ ప్రాంతంలో, ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో మంచి పట్టున్న నేత.⇒ ప్రమోద్ కుమార్ (బీజేపీ, మోతిహరి): మోతిహరి నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి. ఈయన గెలుపు బీజేపీకి నల్లేరుపై నడకేనని భావిస్తున్నా, ఆర్జేడీ మాత్రం గట్టి పోటీ ఇస్తోంది.⇒ అక్తరుల్ ఇమాన్ (ఎంఐఎం, అమౌర్): ఈయన అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు. సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా ఈయన మహాగఠ్బంధన్ అభ్యర్థుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చంపారన్ కోటలో హోరాహోరీ.. ఈ నాలుగింటిపైనే ఫోకస్! 2020 ఎన్నికల్లో చంపారన్ ప్రాంతం (తూర్పు, పశ్చిమ) ఎన్డీయేకు కంచుకోటగా నిలిచింది. ఈసారి ఈ కోటను బద్దలుకొట్టాలని మహాగఠ్బంధన్, నిలబెట్టుకోవాలని ఎన్డీయే సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇక్కడ నాలుగు నియోజకవర్గాలు రాష్ట్రవ్యాప్త ఆసక్తిని రేపుతున్నాయి.⇒ బెట్టియా (పశ్చిమ చంపారన్): ఇక్కడ మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవి (బీజేపీ) బరిలో ఉన్నారు. 2020లో 18 వేల మెజారిటీతో గెలిచిన ఈమెకు.. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి వాషి అహ్మద్, జన్ సురాజ్ అభ్యర్థి అనిల్ కుమార్ సింగ్ల నుంచి త్రిముఖ పోటీ ఎదురవుతోంది. క్షేత్రస్థాయి సమస్యలు, నిరుద్యోగం ఇక్కడ ప్రభావం చూపే అంశాలు.⇒ మోతిహరి (తూర్పు చంపారన్): బీజేపీకి ఇది అత్యంత పటిష్టమైన కోట. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రమోద్ కుమార్ (బీజేపీ) మరోసారి ఆర్జేడీ అభ్యర్థి ఓం ప్రకాష్ చౌదరితో తలపడుతున్నారు. 70% గ్రామీణ ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ప్రమోద్ కుమార్ వ్యక్తిగత ఇమేజ్, బీజేపీ సంస్థాగత బలం ఎన్డీయేకు కొండంత అండగా నిలుస్తున్నాయి.⇒ నర్కటియాగంజ్ (పశ్చిమ చంపారన్): ఇక్కడ మహాగఠ్బంధన్ వ్యూహం బెడిసికొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కూటమిలో ఏకాభిప్రాయం కుదరక, ఆర్జేడీ (దీపక్ యాదవ్), కాంగ్రెస్ (శాశ్వత్ కేదార్) ఇద్దరూ బరిలో నిలిచారు. ఇది ’ఫ్రెండ్లీ ఫైట్’అని పైకి చెబుతున్నా, మహాగఠ్బంధన్ ఓటు బ్యాంకు స్పష్టంగా చీలిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిణామం నేరుగా బీజేపీ (సంజయ్ పాండే) విజయానికి బాటలు వేసేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.⇒ వాల్మికి నగర్ (పశ్చిమ చంపారన్): ఇది జేడీయూకి బలమైన స్థానం. సిట్టింగ్ ఎమ్మెల్యే ధీరేంద్ర ప్రతాప్ సింగ్ (జేడీయూ)కు వ్యక్తిగతంగా మంచి పట్టు ఉంది. 2015లో ఇండిపెండెంట్గా గెలిచిన ఈయనే, 2020లో జేడీయూ తరపున గెలిచారు. ఈసారి కాంగ్రెస్ తరపున ప్రియాంకా గాంధీ స్వయంగా ప్రచారం చేసినా, ఇక్కడ జేడీయూ అభ్యరి్థదే పైచేయిగా కనిపిస్తోంది.
ఎన్ఆర్ఐ
ఒకేసారి రెండు ఉద్యోగాలు : డాలర్లకు కక్కుర్తి పడితే ముప్పు తప్పదు!
మూన్లైటింగ్ ఆరోపణలపై భారత సంతతికి చెందిన వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన వార్త ఇంటర్నెట్లో దావాలనంలా వ్యాపించింది. న్యూయార్క్ స్టేట్ ఆఫీస్లో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన మెహుల్ గోస్వామిని యుఎస్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్నగోస్వామి మాల్టా పట్టణంలో మరో కాంట్రాక్ట్ ఉద్యోగం చేయడాన్ని నేరంగా పరిగణించింది. 2022 మార్చిలో గోస్వామి న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్లో రిమోట్ వర్క్(work from home) తోపాటు, మాల్టాలోని సెమీకండక్టర్ కంపెనీకి కాంట్రాక్టర్గా పనిచేసేవాడు. గోస్వామిపై అందిన ఫిర్యాదును విచారణ చేపట్టిన మోహుల్ గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. గోస్వామి మూన్ లైటింగ్ కారణంగా రాష్ట్రఖజానాకు రూ.44 లక్షల నష్టం జరిగిందని అధికారులు భావించారు. డ్యూయల్ ఎంప్లాయ్ మెంట్ రూల్ ప్రకారం అమెరికాలో రెండు ఉద్యోగాలు చేయడం నేరంగా పరిగణించిన దర్యాప్తు సంస్థప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడం ప్రజలను మోసం చేయడమే అని, ప్రజా వనరుల దుర్వినియోగం అని పేర్కొంది.ప్రభుత్వ ఉద్యోగులకు నిజాయితీతో సేవ చేసే బాధ్యత ఉంది కానీ గోస్వామి ఆ నమ్మకాన్ని తీవ్రంగా ఉల్లంఘించాడని న్యూయార్క్ స్టేట్ ఇన్స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ అన్నారు.ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే రెండో పూర్తికాలం ఉద్యోగం చేయడం అంటే ప్రజల డబ్బుతోపాటు ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడమే అవుతుందని లూసీ లాంగ్ పేర్కొన్నారు.ఏంటీ నేరం; ఏలాంటి శిక్షసరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ,రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం ఈ విషయంపై సంయుక్త దర్యాప్తు చేపట్టి,గోస్వామి అరెస్టు చేసింది. సొంత పూచీకత్తుపై విడుదలయ్యాడు. ఈ కేసు ప్రస్తుతం తదుపరి చట్టపరమైన చర్యలు పెండింగ్లో ఉంది. రెండవ డిగ్రీలో గ్రాండ్ చోరీ అభియోగం మోపబడింది, ఇది న్యూయార్క్లో తీవ్రమైన క్లాస్ సి నేరం. ఈ నేరం రుజువైతే గోస్వా మికి గరిష్టంగా 15 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.13 లక్షల వరకు లేదా పొందిన ఆర్థిక ప్రయోజనాలకు రెట్టింపు మొత్తంలో జరిమానా విధించే అవకాశముంది.చదవండి: ఇషా, ఆకాష్ అంబానీ బర్త్డే: తరలి వెళ్లిన తారలుడాలర్లకు కక్కుర్తిపడితేడాలర్లకు ఆశ పడి విదేశాల్లో ఉద్యోగాలు చేసకుంటున్న నిపుణులైన ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షలకోసం ఆశపడితే దేశం పరువు ప్రతిష్టలకు భంగం కలగడంతో పాటు,వ్యక్తిగతంగా కూడా భారీ నష్టం తప్పదని, ఉద్యోగులు నిబద్దతగా నిజీయితీగా ఉండాలని సూచిస్తున్నారు.గతంలో అమెరికా సంస్థలతో మూన్లైట్ చేస్తూ మరో భారతీయుడు పరేఖ్, పట్టుబడ్డాడు. మూన్ లైటింగ్ ద్వారా ఐదు యుఎస్ స్టార్టప్లను మోసం చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారాన్ని మొదట మిక్స్ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు మరియు మాజీ CEO సుహైల్ దోషి సోషల్మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. (రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్)
మనోళ్ల దీపావళి ఎఫెక్ట్: వెల్లువెత్తిన ఫిర్యాదులు
భారత్తో పాటు ప్రపంచంలోని నలుమూలలా భారతీయులు, మన మూలాలు ఉన్నవాళ్లు దీపావళి వేడుకలు ఘనంగా చేసుకున్నారు. అయితే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వేడుకల్లోనూ పలు చోట్ల అపశ్రుతి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తగా.. అదే సమయంలో విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. దీపావళి వేడుకల్లో.. గాయాలు, ప్రమాదాలు, చివరాఖరికి మరణాలు కూడా సంభవించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అమెరికాలో ఈ ఏడాది జరిగిన వేడుకల్లో ‘నష్టం’ కాస్త ఎక్కువే జరిగిందని పరిస్థితులు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా.. అర్ధరాత్రి పూట అక్కడి భారతీయులు చేసిన హంగామాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో జరిగిన డ్యామేజ్ ఉదాహరణంగా నిలిచింది!.న్యూయార్క్ నగరం క్వీన్స్ ప్రాంతంలో.. బాణాసంచా కారణంగా లింకన్ స్ట్రీట్లోని మూడు నివాసాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇక్కడి దీపావళి వేడుకలకు.. అదీ కూడా అర్ధరాత్రి పూట నిర్వహణకు అసలు అనుమతే లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఫైర్వర్క్స్ గాల్లోకి ఎగసి ఓ ఇంట్లోకి నేరుగా దూసుకెళ్లిన తర్వాత మంటలు వ్యాపించాయి. మరోపక్క.. Your #Diwali celebration? My house is gone!What a sad incident, disappointing beyond words.Indians in the U.S., wake up before it's too late!! pic.twitter.com/7SQjiVBgfV— M9 USA🇺🇸 (@M9USA_) October 24, 2025UPDATE: We have received video from the homeowner showing the damage caused by the illegal and irresponsible Diwali fireworks.In addition, a vehicle and the garage were completely burned and damaged. https://t.co/vOh5Oa58o3 pic.twitter.com/436GvhB9KD— YEGWAVE (@yegwave) October 24, 2025న్యూజెర్సీలో ఒక్క ఎడిసన్ నుంచే 40 ఎమర్జెన్సీ కాల్స్ అధికారులకు వెళ్లాయట. ఆస్తి నష్టంతో పాటు ముందస్తు జాగ్రత్తగా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారట. తమ నిద్రకు భంగం వాటిల్లిందనే ఫిర్యాదులు చేసిన వాళ్లు ఉన్నారట. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి వేడుకలను జరగనివ్వకుండా ఆపేశారు కూడా. ఇంకోపక్క.. Look at the aftermath of these Diwali celebrations.It’s chaos. Litter everywhere. Police holding people back. Indians hanging out of cars speeding by.And these people have the audacity to compare Christmas parades to this.I’m fed up.pic.twitter.com/2gX57IcKW3— Anti-Taxxer (@mapleblooded) October 23, 2025దీపావళి వేడుకల కారణంగా అగ్నిప్రమాదాలు సంభవించి కొందరి నివాసాలు పూర్తిగా ధ్వంసమై అయ్యాయని.. కట్టుబట్టలతో వాళ్లు రోడ్డు మీద పడ్డారని కొన్ని వీడియోలు, కథనాలు బయటకు వచ్చాయి. ‘‘ఇలా జరుగుతుందని అనుకోలేదు. మాకేం మిగల్లేదు. నా కొడుకు ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు. హోటల్ గదిలో జీవించాల్సి వస్తోంది’’ అని బాధితురాలు జువానిటా కొలన్ ఓ మీడియా సంస్థతో పేర్కొనడం గమనార్హం. దీంతో.. Indians were celebrating Diwali in US. Their police and fire department came to join the celebration and played Holi. pic.twitter.com/nLLlnFlh8p— Joy (@Joydas) October 23, 2025అమెరికా దీపావళి వేడుకలపై మునుపెన్నడూ లేనిస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అందుకు ఆ స్థాయిలో జరిగిన నష్టమే కారణమని స్పష్టమవుతోంది. దీంతో అధికారులు ఇలాంటి వేడుకలను అనుమతించొద్దని.. ఒకవేళ అనుమతించినా.. సురక్షిత నిబంధనలు పాటించేలా కఠిన మార్గదర్శకాలను తీసుకురావాలని పలువురు అమెరికన్లు కోరుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించి.. పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని సమాచారం.Indians have been living a respectful life in USA, UK, Canada and other Countries for over a century. What has really changed with the current expats creating such a ruckus, nuisance, civic garbage, displaying absolute lack of civic sense, cultural bankruptcy, this Diwali❓… pic.twitter.com/dGzt3SrtIs— Raju Parulekar (@rajuparulekar) October 24, 2025
అమెరికాలో భార్యకు వేధింపులు ఎన్నారై భర్త అరెస్టు
భార్యపై గృహ హింసకు పాల్పడిన ఆరోపణలతో తిరుపతికి చెందిన NRI . జెస్వంత్ మనికొండ (36) ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ హింస మరియు కోర్టు రక్షణ ఉత్తర్వు ఉల్లంఘన ఆరోపణలపై కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్మెంట్ (Milpitas Police Department–MPD) సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం అతణ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఎల్మ్వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. తరువాత బెయిల్పై విడుదలయ్యాడు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది.గృహ హింస కేసుల్లో పోలీసులు, కోర్టులు వేగంగా స్పందిస్తేనే సత్వర న్యాయం జరుగుతుందని ఎన్జీవో ప్రతినిధి తరుణి పేర్కొన్నారు. ఇటువంటి కేసుల్లో బాధితులు ఆలస్యం చేయకుండా ధృవీకరించబడిన సహాయ సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఎన్ఆర్ఐ కుటుంబాలలో గృహ హింస బాధితులకు చట్టపరమైన సహాయం, రక్షణ వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గోల్డెన్ వీసా యువకుడి హఠాన్మరణం
చిన్న వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా దుబాయ్లో భారతీయ విద్యార్థి (Indian Student) ఒకరు గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. దీపావళి వేడుకల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అతడు మరణించినట్టు స్థానిక మీడియా 'గల్ఫ్ న్యూస్' వెల్లడించింది. మృతుడు కేరళకు చెందిన వైష్ణవ్ కృష్ణకుమార్ (18)గా గుర్తించారు. దుబాయ్లోని మిడిల్సెక్స్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం బీబీఏ మార్కెటింగ్ చదువుతున్నాడు. అతడికి యూఏఈ గోల్డెన్ వీసా (Golden Visa) ఉందని సమాచారం.దుబాయ్ ఇంటర్నేషనల్ అకడమిక్ సిటీలో మంగళవారం జరిగిన దీపావళి వేడుకల్లో వైష్ణవ్ పాల్గొన్నాడు. సంబరాల్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండెపోటు కారణంగా మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే వైష్ణవ్కు ఎటువంటి గుండె సమస్యలు లేవని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దుబాయ్ పోలీస్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తదుపరి దర్యాప్తు జరుపుతోందని చెప్పారు.వైష్ణవ్ మృతదేహాన్ని కేరళకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని అతడి తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు తాను చూసుకుంటున్నట్టు దుబాయ్లోని వైష్ణవ్ బంధువు నితీశ్ 'ఖలీజ్ టైమ్స్'తో చెప్పారు. శుక్రవారం నాటికి వైష్ణవ్ మృతదేహం కేరళకు చేరుకుంటుందని భావిస్తున్నారు.రెండేళ్ల క్రితం స్వస్థలానికి..అలప్పుజ జిల్లా చెన్నితల పంచాయతిలోని కరాజ్మా ప్రాంతానికి చెందిన వైష్ణవ్ కుటుంబంలో దుబాయ్లో సెటిలయింది. వైష్ణవ్ తండ్రి కృష్ణకుమార్ 20 ఏళ్లుపైగా దుబాయ్లోని ఉద్యోగం చేస్తున్నారు. వైష్ణవ్, అతడి చెల్లెలు దుబాయ్లోనే పుట్టిపెరిగారని వారి బంధువు గోపి కర్ణవర్ తెలిపారు. అలప్పుజలో ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. వైష్ణవ్ చాలా తెలివైన కుర్రాడని చెప్పారు. వైష్ణవ్ కుటుంబం చాలా అరుదుగా స్వస్థలానికి వస్తుందని, రెండేళ్ల క్రితం వారు కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ వేడుక కోసం చివరిసారిగా ఇక్కడికి వచ్చారని వెల్లడించారు. చదవండి: ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. కానీ పక్కా పల్లెటూరు!సంతాప ప్రకటనవైష్ణవ్ కృష్ణకుమార్ మరణం పట్ల మిడిల్సెక్స్ యూనివర్సిటీ సంతాపం తెలిపింది. చిన్న వయసులోనే అతడు చనిపోవడం ఎంతో కలచివేసిందని సంతాప ప్రకటనలో పేర్కొంది. వైష్ణవ్ చదువుకున్న జెమ్స్ అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ కూడా సంతాపం ప్రకటించింది. వైష్ణవ్ ప్రతిభావంతుడైన విద్యార్థి అని కొనియాడింది. వైష్ణవ్ మరణంతో అతడి తండ్రి కృష్ణకుమార్, తల్లి విధు, చెల్లెలు వృష్టి విషాదంలో మునిగిపోయారు.
క్రైమ్
బాలికపై అత్యాచారం
ఇబ్రహీంపట్నం రూరల్: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడిపై ఆదిబట్ల పీఎస్లో శనివారం పోక్సో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. నాదర్గుల్లో నివాసం ఉండే బాలిక(17) తల్లిదండ్రులతో కలిసి ఓ ఫంక్షన్ హాల్లో పనిచేస్తోంది. ఇదే ఫంక్షన్ హాల్లో చంపాపేట్కు చెందిన నేనావత్ శ్రీకాంత్ (19) సైతం పని చేస్తున్నాడు. బాలికను పరిచయం చేసుకొని స్నేహంగా మెలిగేవాడు. ఈక్రమంలో ఆమెకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిపై పోక్సో కేసు..మొయినాబాద్: ఇంటి దగ్గర ఒంటరిగా ఆడుకుంటున్న ఆరేళ్ల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ బాలుడిపై ఠాణాలో కేసు నమోదైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నారాయణపేట్ జిల్లాకు చెందిన దంతపతులు బతుకుదెరువుకోసం మొయినాబాద్కు వలస వచ్చారు. అద్దె ఇంట్లో ఉంటూ కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఆరేళ్ల కూతురు ఒకటో తరగతి చదువుతుంది. రెండో శనివారం సెలకు కావడంతో ఇంటి వద్దే ఉంది. తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న బాలిక పట్ల ఇదే ప్రాంతంలో ఉండే బాలుడు(15) అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక దాడికి యత్నించినట్లు సమాచారం. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు బాలున్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
దొంగా పోలీస్ ఆటాడించి.. అత్త దారుణ హత్య
విశాఖపట్నం జిల్లా: పెళ్లి నాటినుంచీ పొసగని అత్తను ఒక కోడలు అత్యంత కిరాతకంగా.. అచ్చం హర్రర్ క్రైం సినిమా స్టోరీని తలపించే రీతిలో హతమార్చిన ఘటన ఇది. విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేపగుంట సమీపాన అప్పన్నపాలెంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై విశాఖ వెస్ట్ జోన్ ఏసీపీ పృద్వితేజ తెలిపిన వివరాల ప్రకారం.. అప్పన్నపాలెంలో వర్షిణి అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో జయంతి సుబ్రహ్మణ్యం, ఆయన భార్య లలితాదేవి (30), తల్లి జయంతి కనకమహాలక్ష్మి (63), పిల్లలు ఈశ్వర్చంద్ర, శ్రీనయన, మేనల్లుడు శరత్తో నివాసం ఉంటున్నారు. సుబ్రహ్మణ్యం–లలితాదేవికి 12 ఏళ్ళ క్రితం పెళ్లయ్యింది. అత్తాకోడళ్లు లలితాదేవి, కనకమహాలక్ష్మికి పెళ్లయిన తొలినాళ్ల నుంచే విభేదాలు తలెత్తాయి. ఇద్దరికి రోజూ ఏదో విషయంలో గొడవలు జరిగేవి. ఈ క్రమంలో అత్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని లలిత నిర్ణయించుకుంది. హత్యచేసి ఎలా తప్పించుకోవాలన్నది తెలుసుకోడానికి యూట్యూబ్లో క్రైమ్ వీడియోలు చూసింది. తద్వారా ఒక పథకం సిద్ధం చేసుకుంది. ఈ నెల 6న సింహచలం గోశాల వద్ద ఉన్న బంక్లో సీసాలో లీటరు పెట్రోలు తీసుకుని ఇంట్లో దాచిపెట్టింది. శుక్రవారం ఉదయం భర్త సుబ్రహ్మణ్యం, మేనల్లుడు శరత్ పనిమీద బయటకు వెళ్లారు. అత్తను హత్య చేసేందుకు అదే తగిన సమయమని భావించింది. ‘నాన్నమ్మతో దొంగాపోలీస్ ఆట ఆడి.. ఆమెను తాళ్లతో కట్టేసి కళ్లకు గంతలు కట్టండి’ అని పిల్లలకు పురమాయించింది. విషయం తెలియని పిల్లలు నాన్నమ్మను అడగ్గా.. కనకమహాలక్ష్మి పిల్లల సరదా కోసం ఒప్పుకుంది. అంతే పిల్లలు తాళ్లతో కట్టేసి, కళ్లకు గంతలు వేయడంతో కనకమహాలక్ష్మిపై అప్పటికే సిద్ధం చేసుకున్న పెట్రోల్ను క్షణాల్లో ఆమెపై పోసి, దేవుడి పటాల వద్ద ఉన్న దీపాన్ని ఆమె మీదకు విసిరింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని కనకమహాలక్ష్మి పెద్దగా కేకలు వేయడంలో చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే శరీరం పూర్తిగా కాలిపోయిన కనకమహాలక్ష్మి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. కాగా, దీపం జారిపడటంతో మంటలు అంటుకుని తన అత్త ప్రమాదానికి గురైనట్టు ప్రజలతో పాటు పోలీసులను లలిత నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, పోలీసులు పెట్రోల్ వాసన గమనించి తమదైన శైలిలో విచారణ చేయగా నిందితురాలు నేరం ఒప్పుకుంది. హతురాలి కుమారుడు సుబ్రహ్మణ్యం ఇచి్చన ఫిర్యాదు మేరకు నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రమాదంలో సుబ్రహ్మణ్యం కుమార్తె శ్రీనయనకు స్వల్ప గాయాలయ్యాయి.
ఇంటి ఓనర్తో వివాహేతర సంబంధం.. కొడుకు ముందే..
హైదరాబాద్: కన్న కొడుకు ముందే తల్లి గొంతు కోస్తుంటే ఆ పసి హృదయం తల్లడిల్లిపోయింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ వివాహితను దారుణంగా హత్య చేసిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వాతి(28)కి రమేశ్తో 2015లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. సంవత్సరన్నర నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్దలు ఏర్పడ్డాయి. రమేశ్ తన పెద్ద కుమారుడితో వేరుగా ఉంటుండగా స్వాతి తన చిన్న కొడుకు(8)తో కలిసి బహదూర్పల్లిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. కాగా స్వాతికి ఇంటి యజమాని అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బోయ కిషన్తో వివాహేతర సంబంధం ఉంది. అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న కిషన్ను తనను రెండవ వివాహం చేసుకోవాలని స్వాతి ఒత్తిడి తీసుకు వచి్చంది. దీంతో కిషన్ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. స్వాతి కారణంగానే గొడవలు జరగడడంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించి హత్యకు పథకం రచించాడు కిషన్. ఇందులో భాగంగా బౌరంపేటలోని కేఎల్ యూనివర్సిటీ వద్ద ఫుడ్ కోర్ట్ నిర్వహిస్తున్న తన అల్లుడు రాజేష్, తన రియల్ ఎస్టేట్ కార్యాలయంలో పని చేసే వంశీని పురమాయించాడు. శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో రాజేష్, వంశీలు గ్రీన్ హిల్స్ కాలనీలోని స్వాతి ఇంటికి వచ్చి ఆమెను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. తన కుమారుడి కళ్ల ముందే తల్లిని అతి కిరాతకంగా హత్య మార్చారు. విషయం తెలుసుకున్న దుండిగల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా హత్య చేసిన నిందితులు నేరుగా దుండిగల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.
దెయ్యం పట్టిందని మద్యం, బీడీ తాగించి, మహిళకు చిత్రహింసలు
కేరళలో దారుణం చోటు చేసుకుంది. 21వ శతాబ్ధంలో శరవేగంగా పరుగులు పెడుతున్న అత్యాధునిక సమాజంలో మూఢనమ్మకాల ఆనవాళ్లు ఇంకా బలంగానే ఉన్నాయి అనడానికి ఊతమిచ్చే ఒక అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను దెయ్యం పేరుతో చిత్రహింసలకు గురి చేసిన వైనం దిగ్భ్రాంతి రేపింది.కేరళలోని కొట్టాయం జిల్లాలో ఒక యువతికి దెయ్యం పట్టిందంటూ మాంత్రికుడిని తమ ఇంటికి తీసుకొచ్చారు ఆమె అత్తింటి వారు, భర్త, ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాలంటూ మంత్రాలు, దెయ్యాలు పేరుతో గంటల తరబడి శారీరక, మానసిక హింసకు గురి చేశాడా మాంత్రికుడు బలవంతంగా మద్యం తాగించి, బీడీ తాగిస్తూ నానా చిత్రహింసలకు గురి చేశారు. దీంతో ఆమె మానసిక పరిస్థితి మరింత దిగజారిపోయింది. దుష్టశక్తి ఆవరించిందంటూ ఉదయం 11.00గంటల నుంచి రాత్రివరకు చిత్ర హింసలు పెట్టారని, చివరికి స్పృహ కోల్పోయానని బాధితురాలు వాపోయింది. బలవంతంగా మద్యం ఇచ్చారని, బలవంతంగా బీడీ తాగించారని, "పవిత్ర బూడిద" తాగించారని, కాల్చడం సహా ఇతర రకాల శారీరక హింసలు పెట్టారని తెలిపింది.చదవండి: ఎంపీకి స్కామర్ల షాక్ : ఎస్బీఐ నుంచి రూ.56 లక్షలు మాయంబాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత మహిళ భర్త, అత్తింటివారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన తర్వాత ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎట్టకేలకు ప్రధాన నిందితుడైన మంత్రగాడు శివదాస్ (54)ని తిరువల్లలోని ముత్తూర్ ప్రాంతం నుండి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే అరెస్ట్ అయినవారిలో మహిళ భర్త అఖిల్ దాస్ (26) , తండ్రి దాస్ (54) ఉన్నారు.ఇదీ చదవండి: నగల దుకాణంలో ‘అమ్మగారికి’ దేహశుద్ధి
వీడియోలు
కళ్ళ ముందే కుప్పకూలిన రష్యన్ ఆర్మీ హెలికాప్టర్
భక్తురాలి అత్యుత్సాహం.. హుండీలో డబ్బులన్నీ బూడిద
నేను అండగా ఉంటా బాధపడొద్దు.. కార్యకర్తల కుటుంబాలకు కొడాలి నాని భరోసా
బాహుబలి ఎపిక్ రికార్డ్స్ పై కన్నేసిన పుష్ప ఎపిక్
రామచంద్రాపురంలో బాలిక కేసులో వీడిన మిస్టరీ
కూకట్ పల్లిలో YSRCP నేతల కోటిసంతకాల సేకరణ
ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉంది: అరుంధతి
నారా లోకేష్ పై గోరంట్ల మాధవ్ ఫైర్
షూ చూశారా.. నన్ను టచ్ చేస్తే.. ఒక్కొక్కడికీ..
రైతును రాజు చేసింది YSR.. అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ హయాంలో

