వైఎస్ జగన్ ప్రజాదర్బార్
వైఎస్సార్ కడపలో కొనసాగుతోన్న వైఎస్ జగన్ రెండోరోజు పర్యటనపర్యటనలో భాగంగా ఉదయం 9 గంటలకు పులివెందుల వాసవి ఫంక్షన్ హాల్లో వివాహ కార్యక్రమానికి హాజరుఅనంతరం బ్రాహ్మణపల్లె అరటి తోటల పరిశీలన, రైతులతో మాట్లాడటంపులివెందులలో లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శవేల్పులలో లింగాల రామలింగారెడ్డి నివాస సందర్శనసాయంత్రం 7 గంటల వరకు పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్రాత్రి పులివెందులలోనే బసగురువారం ఉదయం 8 గంటలకు తిరుగు ప్రయాణం
Pak: ఇమ్రాన్ఖాన్ను హత్య చేశారా?
అల్ ఖదీర్ ట్రస్ట్ భూ అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఎపిసోడ్ ఇప్పుడు కాక పుట్టిస్తోంది. ఇమ్రాన్ఖాన్ను జైల్లోనే హత్య చేశారని బలూచిస్థాన్ విదేశంగ శాఖ ఆరోపించిన నేపథ్యంలో పాకిస్తాన్లో ఇది ఆందోళన రేకెత్తిస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునిర్ బృందం ఇమ్రాన్ఖానను హత్య చేశారనేది ప్రధాన ఆరోపణ. రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్న ఇమ్రాన్ను, అక్కడే చంపేశారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పీటీఐ పార్టీ పెట్టి పాక్కు ప్రధానిగా సేవలందించిన ఇమ్రాన్.. అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే గత కొంతకాలం వరకూ పాకిస్తాన్లో జరిగే పరిణామాలపై ఇమ్రాన్ ఖాన్ ఏదొక సందర్భంలో మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఇటీవల కాలంలో ఇమ్రాన్ ఖాన్ మాట ఎక్కడా వినబడటం లేదు. ఇప్పుడు ఇది కూడా ఇమ్రాన్ హత్య చేశారనే వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. జైలు వద్ద ఇమ్రాన్ సిస్టర్స్.. అనుమతి ఇవ్వని పోలీసులు..ఈ వార్తలు ఒక్కసారిగా పాకిస్తాన్లో అగ్గి రాజేసేలా ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఉంటే.. అడియాలా జైల్లోనే ఉంటాడు.. లేకపోతే జైలు మార్చి ఉంటారు. జైలు మార్చితే సమాచారం ఇవ్వాలి కదా. కనీసం కుటుంబ సభ్యులకు అయినా జైలు మార్చే అంశం చెప్పాలి. ఇప్పుడు ఇదే అనుమానంపై ఇమ్రాన్ సోదరీమణులు అడియాలా జైలుకు వెళ్లారు. అయితే వారికి నో ఎంట్రీ. వారిని జైలు లోపలికి వెళ్లడానికి అనుమతించలేదు. దాంతో పాటు తమ పట్ల పోలీసులు చాలా అవమానకరంగా ప్రవర్తించారని ఇమ్రాన్ సిస్టర్స్ నోరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్లు ఆరోపిస్తున్నారు. ‘మా సోదరుడు బ్రతికి ఉన్నాడా.. లేక వార్తలు వ్యాపించిన విధంగానే చంపేశారా? అనేది తెలుసుకోవడానికి జైలుకు వచ్చాం. కానీ పోలీసులు మాకు అనుమతి ఇవ్వలేదు. మాతో చాలా దారుణంగా ప్రవర్తించారు. ఏం జరిగిందో మాకు తెలియడం లేదు’ అని అంటున్నారు. మరొకవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ శ్రేణులు కూడా కదం తొక్కాయి. ఇమ్రాన్ ఖాన్ ఆచూకీ తమకు తెలపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. ఆన్లైన్ వస్తున్న ఫోటోలు, వీడియోలు చూస్తే తమకు ఆందోళనగా ఉందని పీటీఐ శ్రేణులు పేర్కొన్నాయి. కనీసం ఇమ్రాన్ఖాన్కు వీడియో కాల్లో అయినా చూపించాలని డిమాండ్ చేస్తున్నాయి. జైలుకు వెళ్లిన పీటీఐ శ్రేణులని కూడా పోలీసులు లోపలికి అనుమతించడం లేదు. ఏం జరిగింది అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేల ఇమ్రాన్ఖాన్ సేఫ్గా ఉంటే జైల్లోనే ఉంటారు.. ఒకవేళ జైల్లో లేకపోతే ఇమ్రాన్ను హత్య చేశారనే ఆరోపణకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది. Reports are now surfacing from inside the prisons of PUnjabi Pakistan that Imran Khan, who was being held in custody, has been killed by Asim Munir and his ISI administration according to several news outlets. If this information is confirmed to be true, it marks the absolute end… pic.twitter.com/SbbVB5uJll— Ministry of Foreign Affairs Baluchistan (@BaluchistanMFA) November 26, 2025
అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం: గంభీర్
స్వదేశంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత జట్టు సౌతాఫ్రికా (IND vs SA) చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో భారత బ్యాటర్ల వైఫల్యం కారణంగా.. పాతికేళ్ల తర్వాత తొలిసారి ప్రొటిస్ జట్టుకు టెస్టు సిరీస్ సమర్పించుకోవడమే గాకుండా.. క్లీన్స్వీప్నకు గురైంది.అశూ, రో-కోలను పంపించేశాడు!ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లతో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, లెజెండరీ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలను పొమ్మనలేక పొగబెట్టాడని.. బ్యాటింగ్ ఆర్డర్లోనూ పిచ్చి ప్రయోగాలతో భారత జట్టు ఘోర పరాభవానికి కారణమయ్యాడని అభిమానులు సైతం మండిపడుతున్నారు. వెంటనే అతడిని పదవి నుంచి తొలగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.బీసీసీఐదే తుది నిర్ణయంఈ విషయంపై గంభీర్ స్పందించాడు. సఫారీల చేతిలో గువాహటి టెస్టులో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ నేను కాదు.. టీమిండియానే అందరికీ ముఖ్యం. నా మార్గదర్శనంలోనే ఇంగ్లండ్లో టీమిండియా టెస్టు సిరీస్ 2-2తో సమం చేసింది.చాంపియన్స్ ట్రోఫీతో పాటు.. ఆసియా కప్ కూడా గెలుచుకుంది. ఈ జట్టు ఇంకా నేర్చుకునే దశలోనే ఉంది. ఏదేమైనా కోచ్గా నా బాధ్యత కూడా ఉంటుంది. ముందుగా నన్నే అందరూ నిందిస్తారు. ఆ తర్వాత జట్టును విమర్శిస్తారు.అందరూ నన్నే నిందిస్తారుఈ మ్యాచ్లో మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. 95/1 నుంచి 122/7కు పడిపోవడం ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. ఏదో ఒక షాట్ను సాకుగా చూపి వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయలేము. ప్రతి ఒక్కరిపై విమర్శలు వస్తాయి. నేను మాత్రం వ్యక్తిగతంగా ఎవరినీ నిందించను. నా విధానం ఇదే’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా గంభీర్ కోచింగ్లో టీమిండియాకు టెస్టుల్లో సొంతగడ్డపై ఇది రెండో ఘోర పరాభవం.దారుణ వైఫల్యాలుగతేడాది న్యూజిలాండ్తో స్వదేశంలో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ 3-0తో వైట్వాష్ అయింది. తాజాగా కోల్కతాలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. గువాహటిలోని బర్సపరా స్టేడియంలో మరీ దారుణంగా 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సఫారీలు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 140 పరుగులకే ఆలౌట్ అయి.. మరో వైట్వాష్ను ఎదుర్కొంది.అంతకు ముందు స్వదేశంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్లను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్లో ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. అయితే, అంతకంటే ముందుగా ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వేళ్లన్నీ గంభీర్ వైపే చూపిస్తున్నాయి. చదవండి: కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్పై మండిపడ్డ కుంబ్లే, డేల్ స్టెయిన్
మా కోచ్ ఒక్కడేనా?.. వాళ్లూ హద్దు దాటారు: బవుమా కౌంటర్
సౌతాఫ్రికా కెప్టెన్గా తెంబా బవుమా (Temba Bavuma) మరో చారిత్రాత్మక విజయం అందుకున్నాడు. పాతికేళ్ల తర్వాత టీమిండియాను సొంతగడ్డపై టెస్టుల్లో వైట్వాష్ చేసిన ప్రొటిస్ సారథిగా నిలిచాడు. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2025 టైటిల్ గెలిచిన బవుమాకు.. భారత పర్యటన రూపంలో ఈ మేరకు మరో అపురూపమైన విజయం దక్కింది.సాష్టాంగపడేలా చేస్తాంగువాహటి వేదికగా రెండో టెస్టులో టీమిండియాను 408 పరుగుల తేడాతో చిత్తు చేసిన తర్వాత సౌతాఫ్రికా సంబరాలు అంబరాన్నంటాయి. అయితే, అంతకంటే ముందు.. అంటే మంగళవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా సౌతాఫ్రికా హెడ్కోచ్ షుక్రి కాన్రాడ్ టీమిండియాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.తాము ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి.. ఆఖరి రోజు టీమిండియాను సాష్టాంగపడేలా చేస్తామన్న అర్థంలో కాన్రాడ్ మాట్లాడాడు. అతడి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. ఈ విషయంపై భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil Kumble), సౌతాఫ్రికా లెజెండరీ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) హుందాగా ఉండాలంటూ అతడికి హితవు పలికారు.కోచ్ కామెంట్స్పై బవుమా స్పందన ఇదేఈ నేపథ్యంలో భారీ విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన బవుమాకు.. సౌతాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ వ్యాఖ్యల గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘మా కోచ్ మాట్లాడిన మాటల గురించి నాకు ఈరోజు ఉదయమే తెలిసింది. నా దృష్టి మొత్తం మ్యాచ్ మీదే కేంద్రీకృతమై ఉంది. అందుకే పెద్దగా పట్టించుకోలేదు.అసలు ఆయనతో మాట్లాడే తీరికే దొరకలేదు. షుక్రి అరవై ఏళ్ల వయసుకు దగ్గరపడ్డారు. ఆయన తన వ్యాఖ్యలను పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది’’ అని బవుమా విమర్శించాడు.హద్దు మీరి ప్రవర్తించారుఅదే సమయంలో తనపై టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేసిన వ్యాఖ్యలను కూడా బవుమా ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘‘అయినా.. ఈ సిరీస్లో మా కోచ్ ఒక్కరే కాదు.. చాలా మంది ఆటగాళ్లు కూడా హద్దు మీరి ప్రవర్తించారు. అయితే, మా కోచ్ లైన్ క్రాస్ చేశారని నేను అనడం లేదు. కానీ ఆయన తన వ్యాఖ్యల గురించి మరోసారి ఆలోచించుకోవాలి’’ అని పేర్కొన్నాడు.కాగా కోల్కతాలో జరిగిన తొలి టెస్టు సందర్భంగా బవుమా షాట్ గురించి రివ్యూ తీసుకునే విషయంలో బుమ్రా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘అతడు మరుగుజ్జు’ కదా అంటూ బవుమాను హేళన చేశాడు. ఇక కోల్కతాలో భారత్పై 30 పరుగుల తేడాతో గెలుపొందిన సౌతాఫ్రికా.. గువాహటిలో 408 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తుగా ఓడించింది.చదవండి: ఇండియా టెస్ట్ క్రికెట్ చచ్చిపోయింది.. ఫ్యాన్స్ ఫైర్
ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను ఆహ్వానించాలి: సీఎం రేవంత్
ఐరాస సంస్థ ‘సైట్స్’ మెచ్చిన వంతారా
వాస్తవాలు నేను నిరూపిస్తా: కౌశిక్రెడ్డి
ఇలాగైతే స్మృతిని ఎవరూ పెళ్లి చేసుకోరు!.. తండ్రికి వేధింపులు.. ఇప్పుడిలా!
బోల్డ్ సీన్.. ఆ విషయం డైరెక్టర్ ముందే చెప్పారు.. కానీ..: ఆండ్రియా జెరెమా
రోడ్డు ప్రమాదం దంపతులు మృతి
ఎన్వీడియాకు గూగుల్ గట్టి దెబ్బ
AP: ఆరోగ్య శ్రీ దొంగ బిల్లులతో దోపిడీ..
26/11 "ప్రజలపై కాల్పులు జరుపుతూ ఆనందిస్తున్నాడు"
సోషియో ఫాంటసీ కథతో ‘వానర’
చలిలో వెచ్చని టీ తాగుతున్న స్టార్ హీరోలు (ఫోటోలు)
స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి
బంగారం ధరలు: ‘కొత్త’ మార్క్ తప్పదా?
ఈ రాశివారికి కొత్త అవకాశాలు, సంఘంలో గౌరవమర్యాదలు
జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు
మనకు అమరావతి కంటే వైజాగ్ బాగా గిట్టుబాటు అయ్యేలా ఉంది!
ముందు మనం రైతులకు ఏం చేశామో చెప్పమంటున్నారు ‘సార్’!
ఈ రాశివారు ఊహలు నిజం చేసుకుంటారు, ఆస్తిలాభం
అసలు సెన్స్ ఉందా?.. .. గంభీర్ తీరుపై రవిశాస్త్రి ఆగ్రహం
తనూజ, దివ్యలను చూస్తుంటే.. భరణి చెల్లెలు కామెంట్స్ వైరల్
రైతన్న కోసం ఎంతో చేశానని అలా శూన్యంలోకి చూపిస్తున్నాడేంటీ!!
శాంతంగా ఉన్న సింహాన్ని గెలికితే ఏమవుతుందో చూడండి
కెప్టెన్గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన
డోంట్ వర్రీ సార్! అవి మీ దగ్గరకు రావడానికి భయపడతాయ్లేండి!!
...మేనిఫెస్టోలో చెప్పినవే చేయలేదు!!
మరీ ఇంత అజ్ఞాత విరాళాలు ఇస్తుంటే అనుమానాలెందుకు రావ్ సర్!
బెస్ట్ హారర్ సినిమా.. ఎట్టకేలకు తెలుగులో స్ట్రీమింగ్
కల్యాణ్ పీక పట్టుకున్న పవన్.. నోరు జారిన సంజన
ఐ బొమ్మ క్లోజ్ కావడం మాకు కలిసొచ్చింది
మంటకలిసిపోతున్న బంధుత్వాలు
ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను ఆహ్వానించాలి: సీఎం రేవంత్
ఐరాస సంస్థ ‘సైట్స్’ మెచ్చిన వంతారా
వాస్తవాలు నేను నిరూపిస్తా: కౌశిక్రెడ్డి
ఇలాగైతే స్మృతిని ఎవరూ పెళ్లి చేసుకోరు!.. తండ్రికి వేధింపులు.. ఇప్పుడిలా!
బోల్డ్ సీన్.. ఆ విషయం డైరెక్టర్ ముందే చెప్పారు.. కానీ..: ఆండ్రియా జెరెమా
రోడ్డు ప్రమాదం దంపతులు మృతి
ఎన్వీడియాకు గూగుల్ గట్టి దెబ్బ
AP: ఆరోగ్య శ్రీ దొంగ బిల్లులతో దోపిడీ..
26/11 "ప్రజలపై కాల్పులు జరుపుతూ ఆనందిస్తున్నాడు"
సోషియో ఫాంటసీ కథతో ‘వానర’
స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి
బంగారం ధరలు: ‘కొత్త’ మార్క్ తప్పదా?
ఈ రాశివారికి కొత్త అవకాశాలు, సంఘంలో గౌరవమర్యాదలు
జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు
మనకు అమరావతి కంటే వైజాగ్ బాగా గిట్టుబాటు అయ్యేలా ఉంది!
ముందు మనం రైతులకు ఏం చేశామో చెప్పమంటున్నారు ‘సార్’!
ఈ రాశివారు ఊహలు నిజం చేసుకుంటారు, ఆస్తిలాభం
అసలు సెన్స్ ఉందా?.. .. గంభీర్ తీరుపై రవిశాస్త్రి ఆగ్రహం
తనూజ, దివ్యలను చూస్తుంటే.. భరణి చెల్లెలు కామెంట్స్ వైరల్
రైతన్న కోసం ఎంతో చేశానని అలా శూన్యంలోకి చూపిస్తున్నాడేంటీ!!
కెప్టెన్గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన
డోంట్ వర్రీ సార్! అవి మీ దగ్గరకు రావడానికి భయపడతాయ్లేండి!!
...మేనిఫెస్టోలో చెప్పినవే చేయలేదు!!
మరీ ఇంత అజ్ఞాత విరాళాలు ఇస్తుంటే అనుమానాలెందుకు రావ్ సర్!
బెస్ట్ హారర్ సినిమా.. ఎట్టకేలకు తెలుగులో స్ట్రీమింగ్
కల్యాణ్ పీక పట్టుకున్న పవన్.. నోరు జారిన సంజన
ఐ బొమ్మ క్లోజ్ కావడం మాకు కలిసొచ్చింది
ఇమ్మడి రవి ఒక్కడే ఐబొమ్మతో..
మంటకలిసిపోతున్న బంధుత్వాలు
కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం పోరు
ఫొటోలు
కీర్తి సురేశ్ రివాల్వర్ రీటా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో మెరిసిన గీతా బస్రా, హర్భజన్ దంపతులు (ఫొటోలు)
హీరోయిన్ జెనీలియా ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
దుబాయి మ్యూజియంలో అల్లు స్నేహ (ఫొటోలు)
రుక్మిణి వసంత్ ఆలోచన ఎప్పుడూ వీటి గురించే (ఫొటోలు)
పెద్ద ముక్కెరతో 'బలగం' బ్యూటీ కావ్య (ఫొటోలు)
బ్రాహ్మణపల్లి అరటి రైతులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
పులివెందులలో వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన (ఫొటోలు)
‘16 రోజుల పండుగ’ సినిమా ఓపెనింగ్.. కీలక పాత్రలో రేణు దేశాయ్ (ఫొటోలు)
హీరోయిన్ రాశి సింగ్ అందాలు... శారీ ఫోటోషూట్ చూశారా? (ఫొటోలు)
సినిమా
గుడ్ న్యూస్ చెప్పిన తెలుగు యంగ్ హీరో
తండ్రి సాయికుమార్ అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఆది.. తొలి రెండు సినిమాలతోనే అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. అప్పటినుంచి వరసగా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. వచ్చే నెలలో 'శంభాల' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఆ బిజీలో ఉన్నాడు. మరోవైపు తాను మళ్లీ తండ్రి కాబోతున్నాననే శుభవార్త కూడా చెప్పేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: మహేశ్తో సినిమా ఫ్లాప్.. తొలిసారి ఆ విషయం అర్థమైంది: రకుల్)2011లో 'ప్రేమకావాలి' సినిమాతో హీరోగా పరిచయమైన ఆది.. అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. రెండో మూవీ 'లవ్ లీ' కూడా హిట్ అయింది. తర్వాత నుంచి వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు గానీ అవన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. గతేడాది ఎలాంటి చిత్రంతోనూ రాలేదు. ఈ సంవత్సరం మాత్రం 'షణ్ముఖ' అనే మూవీతో వచ్చాడు. త్వరలో క్రిస్మస్ సందర్భంగా 'శంభాల' అనే సినిమాని రిలీజ్ చేస్తున్నాడు.వ్యక్తిగత జీవితానికొస్తే.. 2014లో అరుణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ని పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకే వీళ్లకు ఓ కూతురు పుట్టింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆది.. మరోసారి తండ్రి కాబోతున్నాడు. వచ్చే జనవరిలో తన భార్య, బిడ్డని ప్రసవించనుందని.. తాము ముగ్గురు నుంచి నలుగురుం కాబోతున్నామని ఆది.. తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలోనే నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by ActorAadi (@aadipudipeddi)
నలుగురిలో నవ్వులు.. నాలుగోడల మధ్య నరకం
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం... తెరపై హీరోయిన్లు మెరిసే నక్షత్రాల్లా కనిపిస్తారు. అందం, గ్లామర్, అభిమానుల ఆరాధన – ఇవన్నీ వారి జీవితంలో బయటి ముఖం మాత్రమే. కానీ ఆ కెమెరాలు ఆఫైన తర్వాత, ఆ లైట్లు ఆరిపోయిన తర్వాత... చాలా మంది తారలు తమ ఇంటి నాలుగు గోడల్లో తీవ్రమైన గృహహింసకు గురవుతున్నారు.సాధారణ గృహిణులతో పోల్చితే వీరి బాధ రెట్టింపు – ఎందుకంటే వారి నొప్పి ప్రైవేట్గా మిగలకుండా, మీడియా ట్రయల్గా మారుతుంది. అందుకే కొందరు కెరీర్ నాశనం అవుతుందనే భయంతో ఆ బాధను భరిస్తున్నారు... మరికొందరు మాత్రం ధైర్యంగా న్యాయస్థానాలను ఆశ్రయించి, తమ భర్తలపై గృహహింస కేసులు పెట్టి ఇతర మహిళలకు ప్రేరణగా నిలుస్తున్నారు.తాజాగా బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. గృహహింస, క్రూరత్వం, మోసపూరిత చర్యలకు పాల్పడినందుకు గాను ఆమె ఈ కేసు పెట్టి.. రూ. 50 కోట్ల నష్ట పరిహారం అడిగారు. సెలీనా జైట్లీ మాదిరే గతంలోనూ పలువురు బాలీవుడ్ తారలు తమ భర్తలు పెట్టే హింసను భరించలేక న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఆ తారలపై ఓ లుక్కేద్దాం.రతి అగ్నిహోత్రి1980లలో బాలీవుడ్లో హీరోయిన్గా రాణించిన రతి, 1985లో అనిల్ విర్వానీని వివాహం చేసుకున్న తర్వాత 30 సంవత్సరాలు శారీరక, మానసిక హింసకు గురయ్యారు. 2015లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసి, గృహ హింస కేసు దాఖలు చేశారు. ఆమె కుమారుడు వితర్ణ్ సహాయంతో ఈ అంశాన్ని బయటపెట్టారు.కరిష్మా కపూర్సూపర్స్టార్ కరణ్ జోహర్ సోదరి కరిష్మా తన మాజీ భర్త సంజయ్ కపూర్తో విడాకుల సమయంలో భావోద్వేగ, శారీరక హింసను ఆరోపించింది. "నన్ను వస్తువులా చూశారు" అని చెప్పుకుంది. డైవోర్స్ తర్వాత కూతుళ్ల కస్టడీ కోసం ఇంకా లీగల్ ఫైట్ లో ఉంది. కాగా, కరిష్మా, సంజయ్ల వివాహం 2003లో జరగ్గా.. పదేళ్ల తర్వాత 2014లో విడాకులు తీసుకున్నారు.యుక్తా మూక్కే:మిస్ వరల్డ్ 1999 యుక్తా తన భర్త ప్రిన్స్ తులి మీద 2013లో గృహహింస కేసు పెట్టింది. కొట్టడంతో పాటు మాటలతో మానసికంగా వేధించాడంటూ భర్తపై కేసు పెట్టింది. ‘పిల్లల కోసం సహించాను, కానీ ఇక భరించలేను’ అంటూ అప్పట్లో యుక్తా ఎమోషనల్ అయింది.శ్వేతా తివారీ టీవీ సీరియల్స్లో ప్రసిద్ధి చెందిన శ్వేతా, మొదటి భర్త్ రాజా చౌధరీ మీద 2009లో గృహ హింస కేసు పెట్టి విడాకులు తీర్చుకున్నారు. రెండో భర్త్ అభినవ్ కోహ్లీ మీద కూడా హింస ఆరోపణలు చేశారు. ఆమె కథ ధైర్యానికి చిహ్నం.రాఖీ సావంత్ బిగ్ బాస్ స్టార్ రాఖీ, 2023లో భర్త్ అదిల్ ఖాన్ దుర్రానీ మీద గృహ హింస, మోసం కేసులు దాఖలు చేశారు. వివాహం తర్వాత 8 నెలల పాటు తనను శారీరకంగా వేధించాడని, ప్రైవేట్ ఫోటోలు లీక్ చేశారని ఆరోపించారు. ఈ కేసులో అదిల్ అరెస్టయ్యారు.డింపీ గంగూలీ'బిగ్ బాస్' ఫైనలిస్ట్ డింపీ, 2014లో భర్త్ రాహుల్ మహాజన్ మీద శారీరక హింస కేసు దాఖలు చేశారు. చేతులు, కాళ్లు గాయపడిన ఫోటోలు వైరలయ్యాయి. గన్ చూపించి బెదిరించాడని ఆరోపించారు.
సినిమాల్లో ఫెయిల్.. ఒక్క హిట్ కూడా లేదు.. ఇప్పుడేమో వేలకోట్ల సామ్రాజ్యం..!
సినిమా రంగం అందరికీ కలిసి రావడం అనేది చాలా అరుదు. ఒక్క మూవీ డిజాస్టర్ అయిందంటే చాలు కెరీర్ కొనసాగించడం చాలా కష్టమే. అలా అని అందరికీ పరిస్థితి ఇలానే ఉంటుందని కాదు. కొందరికీ మొదటి సినిమానే సూపర్ హిట్ కావొచ్చు.. మరికొందరికీ డిజాస్టర్ కావొచ్చు. కానీ ఒకట్రెండు సినిమాలు ఫెయిల్ అయినా కూడా.. తర్వాత సక్సెస్ బాట పట్టొచ్చు. మరి ఎన్ని సినిమాలు చేసిన సక్సెస్ తలుపు తట్టలేదంటే కారణం.. మనకు ఈ రంగం సెట్ కాదని ఫిక్సయిపోవచ్చు. అలాంటి హీరో కథే ఈ స్టోరీ. ఇలా జరగడం చాలా అరుదనే చెప్పాలి. కానీ ఇదే అతన్ని ఈ రోజు మరో స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టింది. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ కథేంటో తెలుసుకుందామా?తొలి మూవీనే కొత్త కథతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు. కానీ గిరీశ్ కుమార్ తౌరానీ మాత్రం టాలీవుడ్ రీమేక్తో తన జర్నీ మొదలెట్టారు. అయితే ఆయన తొలి సినిమాకే స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహించారు. తెలుగులో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే మూవీ రీమేక్తో బాలీవుడ్ హీరో గిరీశ్ కుమార్ తౌరానీ ఎంట్రీ ఇచ్చారు. హిందీలో ఈ మూవీని జూనియర్ ఎన్టీఆర్ చిత్రం రామయ్యా.. వస్తావయ్యా అనే టైటిల్తో తెరకెక్కించారు. అయినా కూడా గిరీశ్ కుమార్ లక్ కలిసి రాలేదు. తన మొదటి చిత్రం కొత్త కథతో చేసి ఉంటే బాగుండేది. అంతేకాకుండా ఈ చిత్రంలో గిరీశ్ సరసన కోలీవుడ్ స్టార్ శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. 2013లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా డిజాస్టర్గా నిలిచి గిరీశ్కు తీవ్ర నిరాశను మిగిల్చింది.ఆ తర్వాత గిరీశ్ కుమార్ 2016లో విడుదలైన 'లవేష్ షుదా' అనే రొమాంటిక్ కామెడీ సినిమాలో హీరోగా కనిపించారు. ఇది కూడా గిరీశ్కు కలిసి రాలేదు. ఈ సినిమా విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విఫలం కావడంతో గిరీశ్ తన కెరీర్లో కఠిన నిర్ణయం తీసుకునే పరిస్థితికి దారితీసింది. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. కేవలం రెండు సినిమాల్లో మాత్రమే హీరోగా చేసిన గిరీశ్.. సినిమాలు తనకు సెట్ కావని డిసైడ్ అయిపోయాడు. తన రెండో సినిమా రిజల్ట్తోనే బయటకొచ్చేశాడు.బిజినెస్లో సక్సెస్..సినీ నిర్మాత కుమార్ ఎస్ తౌరానీ కుమారుడైన గిరీశ్ బిజినెస్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తన తండ్రితో పాటు మేనమామ రమేష్ ఎస్ తౌరానీ ఆధ్వర్వంలో నడుస్తోన్న టిప్స్ ఇండస్ట్రీస్లో అడుగుపెట్టారు. కుటుంబ వ్యాపారంలోకి ప్రవేశించిన గిరీశ్ టిప్స్ కంపెనీ నడపడంలో సక్సెస్ అయ్యారు. సినిమాల్లో ఫెయిల్ అయినప్పటికీ.. టిప్స్ ఇండస్ట్రీస్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(COO) స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఆ కంపెనీ మార్కెట్ విలువు దాదాపు పదివేల కోట్లకు పైమాటే. డిసెంబర్ 2024 నాటికి మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. రూ.10,517 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలో గిరీశ్ షేరింగ్ దాపు రూ.2164 కోట్లుగా ఉంది. ఈ క్రమంలోనే సంపాదనలో రణబీర్ కపూర్ (రూ.400 కోట్లు), రణవీర్ సింగ్ (రూ.245 కోట్లు), వరుణ్ ధావన్ (రూ.380 కోట్లు), ఆమిర్ ఖాన్ (₹రూ.1900 కోట్లు) లాంటి సూపర్ స్టార్స్ను అధిగమించారు.బిజినెస్లో సక్సెస్ అయిన గిరీష్ తన చిన్ననాటి ప్రియురాలు కృష్ణ మంగ్వానీని వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ బిడ్డ ఉంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబయిలో నివసిస్తున్నారు. గిరీశ్ ప్రస్తుతం టిప్స్ కంపెనీలో ప్రమోటర్ అండ్ ఎగ్జిక్యూటివ్గా కొనసాగుతున్నారు.
ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఒకప్పటి జనరేషన్తో పోలిస్తే ఇప్పటి పెళ్లి జీవితం చాలామందికి గందరగోళంగానే ఉంటోంది. సర్దుకుపోవడం అనేది అస్సలు కనిపించట్లేదు. అటు అబ్బాయి గానీ ఇటు అమ్మాయి గానీ ఎవరికి వాళ్లే తగ్గేదే లే అన్నట్లు ఉంటున్నారు. దీంతో లేనిపోని సమస్యలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే కాన్సెప్ట్తో తీసిన తమిళ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో నేరుగా రిలీజ్)రెండేళ్ల క్రితం 'జో' అనే డబ్బింగ్ మూవీ ఓటీటీలో రిలీజైంది. రియో రాజ్ అనే నటుడు.. ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'ఆన్ పావమ్ పొల్లతత్తు'. అక్టోబరు 31న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు రాబట్టుకుంది. ఇప్పుడు నెలలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ శుక్రవారం(నవంబరు 28) నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.ట్రైలర్ బట్టి చూస్తే ఇదో కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. శివ(రియో రాజ్), శక్తి (మాళవిక మనోజ్)ది పెద్దల కుదిర్చిన సంబంధం. పెళ్లయిన కొన్నిరోజులు బాగానే ఉంటుంది. కానీ తర్వాత నుంచి శక్తి.. చీటికిమాటికి అలగడం, ఇంట్లో పనులు చేయకపోవడం చేస్తుంది. దీంతో విడాకులు కోసం వీళ్లిద్దరూ కోర్టుని ఆశ్రయిస్తారు. తర్వాత ఏమైంది? చివరకు శివ-శక్తి పెళ్లి జీవితం గాడిన పడిందా? లేదా అనేది స్టోరీలా అనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చూపిస్తూనే ఎంటర్టైన్ చేసినట్లున్నారు. కుదిరితే ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా)
క్రీడలు
మా కోచ్ ఒక్కడేనా?.. వాళ్లూ హద్దు దాటారు: బవుమా కౌంటర్
సౌతాఫ్రికా కెప్టెన్గా తెంబా బవుమా (Temba Bavuma) మరో చారిత్రాత్మక విజయం అందుకున్నాడు. పాతికేళ్ల తర్వాత టీమిండియాను సొంతగడ్డపై టెస్టుల్లో వైట్వాష్ చేసిన ప్రొటిస్ సారథిగా నిలిచాడు. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2025 టైటిల్ గెలిచిన బవుమాకు.. భారత పర్యటన రూపంలో ఈ మేరకు మరో అపురూపమైన విజయం దక్కింది.సాష్టాంగపడేలా చేస్తాంగువాహటి వేదికగా రెండో టెస్టులో టీమిండియాను 408 పరుగుల తేడాతో చిత్తు చేసిన తర్వాత సౌతాఫ్రికా సంబరాలు అంబరాన్నంటాయి. అయితే, అంతకంటే ముందు.. అంటే మంగళవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా సౌతాఫ్రికా హెడ్కోచ్ షుక్రి కాన్రాడ్ టీమిండియాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.తాము ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి.. ఆఖరి రోజు టీమిండియాను సాష్టాంగపడేలా చేస్తామన్న అర్థంలో కాన్రాడ్ మాట్లాడాడు. అతడి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. ఈ విషయంపై భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil Kumble), సౌతాఫ్రికా లెజెండరీ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) హుందాగా ఉండాలంటూ అతడికి హితవు పలికారు.కోచ్ కామెంట్స్పై బవుమా స్పందన ఇదేఈ నేపథ్యంలో భారీ విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన బవుమాకు.. సౌతాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ వ్యాఖ్యల గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘మా కోచ్ మాట్లాడిన మాటల గురించి నాకు ఈరోజు ఉదయమే తెలిసింది. నా దృష్టి మొత్తం మ్యాచ్ మీదే కేంద్రీకృతమై ఉంది. అందుకే పెద్దగా పట్టించుకోలేదు.అసలు ఆయనతో మాట్లాడే తీరికే దొరకలేదు. షుక్రి అరవై ఏళ్ల వయసుకు దగ్గరపడ్డారు. ఆయన తన వ్యాఖ్యలను పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది’’ అని బవుమా విమర్శించాడు.హద్దు మీరి ప్రవర్తించారుఅదే సమయంలో తనపై టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేసిన వ్యాఖ్యలను కూడా బవుమా ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘‘అయినా.. ఈ సిరీస్లో మా కోచ్ ఒక్కరే కాదు.. చాలా మంది ఆటగాళ్లు కూడా హద్దు మీరి ప్రవర్తించారు. అయితే, మా కోచ్ లైన్ క్రాస్ చేశారని నేను అనడం లేదు. కానీ ఆయన తన వ్యాఖ్యల గురించి మరోసారి ఆలోచించుకోవాలి’’ అని పేర్కొన్నాడు.కాగా కోల్కతాలో జరిగిన తొలి టెస్టు సందర్భంగా బవుమా షాట్ గురించి రివ్యూ తీసుకునే విషయంలో బుమ్రా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘అతడు మరుగుజ్జు’ కదా అంటూ బవుమాను హేళన చేశాడు. ఇక కోల్కతాలో భారత్పై 30 పరుగుల తేడాతో గెలుపొందిన సౌతాఫ్రికా.. గువాహటిలో 408 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తుగా ఓడించింది.చదవండి: ఇండియా టెస్ట్ క్రికెట్ చచ్చిపోయింది.. ఫ్యాన్స్ ఫైర్
అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం: గంభీర్
స్వదేశంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత జట్టు సౌతాఫ్రికా (IND vs SA) చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో భారత బ్యాటర్ల వైఫల్యం కారణంగా.. పాతికేళ్ల తర్వాత తొలిసారి ప్రొటిస్ జట్టుకు టెస్టు సిరీస్ సమర్పించుకోవడమే గాకుండా.. క్లీన్స్వీప్నకు గురైంది.అశూ, రో-కోలను పంపించేశాడు!ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లతో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, లెజెండరీ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలను పొమ్మనలేక పొగబెట్టాడని.. బ్యాటింగ్ ఆర్డర్లోనూ పిచ్చి ప్రయోగాలతో భారత జట్టు ఘోర పరాభవానికి కారణమయ్యాడని అభిమానులు సైతం మండిపడుతున్నారు. వెంటనే అతడిని పదవి నుంచి తొలగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.బీసీసీఐదే తుది నిర్ణయంఈ విషయంపై గంభీర్ స్పందించాడు. సఫారీల చేతిలో గువాహటి టెస్టులో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ నేను కాదు.. టీమిండియానే అందరికీ ముఖ్యం. నా మార్గదర్శనంలోనే ఇంగ్లండ్లో టీమిండియా టెస్టు సిరీస్ 2-2తో సమం చేసింది.చాంపియన్స్ ట్రోఫీతో పాటు.. ఆసియా కప్ కూడా గెలుచుకుంది. ఈ జట్టు ఇంకా నేర్చుకునే దశలోనే ఉంది. ఏదేమైనా కోచ్గా నా బాధ్యత కూడా ఉంటుంది. ముందుగా నన్నే అందరూ నిందిస్తారు. ఆ తర్వాత జట్టును విమర్శిస్తారు.అందరూ నన్నే నిందిస్తారుఈ మ్యాచ్లో మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. 95/1 నుంచి 122/7కు పడిపోవడం ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. ఏదో ఒక షాట్ను సాకుగా చూపి వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయలేము. ప్రతి ఒక్కరిపై విమర్శలు వస్తాయి. నేను మాత్రం వ్యక్తిగతంగా ఎవరినీ నిందించను. నా విధానం ఇదే’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా గంభీర్ కోచింగ్లో టీమిండియాకు టెస్టుల్లో సొంతగడ్డపై ఇది రెండో ఘోర పరాభవం.దారుణ వైఫల్యాలుగతేడాది న్యూజిలాండ్తో స్వదేశంలో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ 3-0తో వైట్వాష్ అయింది. తాజాగా కోల్కతాలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. గువాహటిలోని బర్సపరా స్టేడియంలో మరీ దారుణంగా 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సఫారీలు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 140 పరుగులకే ఆలౌట్ అయి.. మరో వైట్వాష్ను ఎదుర్కొంది.అంతకు ముందు స్వదేశంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్లను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్లో ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. అయితే, అంతకంటే ముందుగా ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వేళ్లన్నీ గంభీర్ వైపే చూపిస్తున్నాయి. చదవండి: కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్పై మండిపడ్డ కుంబ్లే, డేల్ స్టెయిన్
అందుకే ఓడిపోయాం.. ఓటమి కాస్త నిరాశపరిచింది: పంత్
సొంతగడ్డపై టీమిండియాకు ఘోర అవమానం జరిగింది. సౌతాఫ్రికాతో రెండో టెస్టులో భారత జట్టు చేదు ఫలితం చవిచూసింది. గువాహటిలో సఫారీలు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 140 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 408 పరుగుల భారీ తేడాతో పరాభవాన్ని మూటగట్టుకుంది.కాస్త నిరాశకు లోనయ్యాంఈ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఓటమిపై స్పందించాడు. ‘‘కాస్త నిరాశకు లోనయ్యాం. జట్టుగా మేము సమిష్టిగా రాణించి ఉండాల్సింది. అదే మా ఓటమికి కారణమైంది. ఏదేమైనా ఈ విజయంలో ప్రత్యర్థికి క్రెడిట్ ఇవ్వకతప్పదు. ఈ ఓటమి నుంచి మేము చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది.సిరీస్ ఆరంభం నుంచే సౌతాఫ్రికా ఆధిపత్యం కనబరిచింది. మేము ఓడిపోయాం. ఇప్పటికైనా స్పష్టమైన ఆలోచనా విధానం, వ్యూహాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మాకిది గుణపాఠంగా నిలిచిపోతుంది.భారీ మూల్యమే చెల్లించాముఏదేమైనా మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. వాల్లు అద్భుతంగా ఆడి సిరీస్ గెలుచుకున్నారు. క్రికెట్లో జట్టుగా భాగస్వామ్యాలు నెలకొల్పడం ముఖ్యం. మా విషయంలో అది లోపించింది. అందుకే సిరీస్ రూపంలో భారీ మూల్యమే చెల్లించాము. ఇక ముందైనా సరైన ప్రణాళిక, వ్యూహాలతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం’’ అని పంత్ పేర్కొన్నాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ సౌతాఫ్రికాతో సొంతగడ్డపై టీమిండియా రెండు మ్యాచ్లు ఆడింది. కోల్కతాలో తొలి టెస్టులో 30 పరుగుల స్వల్ప తేడాతో ఓడిన భారత్.. తొలిసారి టెస్టుకు ఆతిథ్యం ఇచ్చిన గువాహటిలో ఏకంగా 408 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఇరవై ఐదేళ్ల తర్వాతఫలితంగా ఇరవై ఐదేళ్ల తర్వాత సౌతాఫ్రికా తొలిసారి టెస్టుల్లో టీమిండియాను వైట్వాష్ చేసింది. అంతకు ముందు 2000 సంవత్సరంలో ఈ ఘనత సాధించింది.ఇక గువాహటిలో జరిగిన రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయం వల్ల దూరం కాగా.. పంత్ పగ్గాలు చేపట్టాడు. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా పంత్ (7, 13) తీవ్రంగా నిరాశపరచగా.. ఆఖరి రోజైన బుధవారం నాటి ఆటలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (54) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారి నుంచి అతడికి కాస్తైనా సహకారం లభిస్తే మ్యాచ్ను డ్రా చేసుకోవచ్చనే ఆశలను ప్రొటిస్ బౌలర్లు అడియాసలు చేశారు.ఇక సఫారీ స్పిన్నర్లలో సైమన్ హార్మర్ ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్ రెండు, సెనూరన్ ముత్తుస్వామి ఒక వికెట్ తీశారు. పేసర్ మార్కో యాన్సెన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా యాన్సెన్ తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసి భారత్ను 201 పరుగులకు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. హార్మర్ (మొత్తంగా 27 వికెట్లు)కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.చదవండి: Sai Sudharsan: సూపర్ స్లో బ్యాటింగ్!
సాయి సుదర్శన్.. సూపర్ స్లో బ్యాటింగ్!
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan) ఓర్పుతో బ్యాటింగ్ చేశాడు. వికెట్ కాపాడుకునేందుకు చాలాసేపు క్రీజులో పాతుకుపోయాడు. సఫారీల పదునైన బంతులను ఎదుర్కొనేందుకు బాగా కష్టపడ్డాడు. వికెట్ పడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించి విజయవంతం కాలేకపోయాడు. ముత్తుసామి బౌలింగ్లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్గా అవుటయ్యాడు.27/2 ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన టీమిండియా లంచ్ విరామానికి ముందు 31 పరుగులు మాత్రమే జోడించి మరో మూడు వికెట్లు చేజార్చుకుంది. కుల్దీప్ యాదవ్ (5), ధ్రువ్ జురేల్(2), రిషబ్ పంత్(13) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.మరో ఎండ్లో సాయి సుదర్శన్ మాత్రం క్రీజులో పాతుకు పోయాడు. 2 పరుగులతో చివరి రోజు ఆట మొదలు పెట్టిన ఈ ఎడంచేతి వాటం బ్యాటర్ ఆత్మరక్షణ ధోరణిలో సఫారీ బౌలర్లను ఎదుర్కొన్నాడు. పరుగులు రాబట్టకపోయినా వికెట్ కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ సిరీస్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత బ్యాటర్గా నిలిచాడు. 139 బంతుల్లో ఒకే ఒక్క ఫోర్తో 14 పరుగులు మాత్రమే చేశాడు. దీన్ని బట్టే అర్థమవుతోంది సాయి ఎంత స్లోగా ఆడాడో. మ్యాచ్ ఎలాగూ ఓడిపోతాం కాబట్టి.. వికెట్లు పడకుండా ఉంటే డ్రా అవుతుందన్న ఉద్దేశంతో అతడు ఇలా బ్యాటింగ్ చేశాడని విశ్లేషకులు అంటున్నారు. టీమిండియా చిత్తుమ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా 408 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. రెండో 549 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ 140 పరుగులకు ఆలౌటయింది. అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచిన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 9వ వికెట్గా వెనుదిరిగాడు. జడేజా 87 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసి కేశవ మహరాజ్ బౌలింగ్లో అవుటయ్యాడు.చదవండి: దక్షిణాఫ్రికా కోచ్పై మండిపడ్డ దిగ్గజాలు
న్యూస్ పాడ్కాస్ట్
తెలంగాణలో వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు. షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
ఆంధ్రప్రదేశ్లో ఐటీ ముసుగులో రియల్ దందా...
ఈ 18 నెలల కాలంలో రైతుల కోసం నిలిచిందెక్కడ?... ఏపీ సీఎం చంద్రబాబుపై ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు మార్గదర్శకాలు విడుదల, జీవో జారీ చేసిన ప్రభుత్వం
కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యమా?... సీఎం చంద్రబాబు
ఉప్పొంగిన అభిమానం... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి హైదరాబాద్లో ఘన స్వాగతం
మనమంతా సాయి మార్గంలో నడుద్దాం... శ్రీసత్యసాయి శత జయంత్యుత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
భద్రతాబలగాల ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మడివి హిడ్మా. ఆయన భార్య రాజే, మరో నలుగురు మావోలు సైతం మృతి
ఎమ్మెల్యేల అనర్హతపై వారంలోగా నిర్ణయం తీసుకోండి. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్దంగ ఉండండి.
ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తున్నది కేవలం అప్పుల్లోనే... సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
బిజినెస్
ఇండియాలో ‘గూగుల్ మీట్’ డౌన్
ప్రపంచవ్యాప్తంగా వృత్తిపరమైన, వ్యక్తిగత కమ్యూనికేషన్కు కీలకంగా ఉన్న ఆన్లైన్ వీడియో కాలింగ్, మీటింగ్ ప్లాట్ఫామ్ గూగుల్ మీట్ (Google Meet) సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. బుధవారం భారతదేశంలో చాలా మంది వినియోగదారులు గూగుల్ మీట్ సేవలు సరిగా పని చేయడంలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా రిమోట్ వర్క్, ఆన్లైన్ సమావేశాల్లో పాల్గొనే వినియోగదారులు ఈ అంతరాయం వల్ల సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు.ఆన్లైస్ సేవల అవుటేజ్ మానిటరింగ్ ప్లాట్ఫామ్ డౌన్ డిటెక్టర్ (Downdetector) ప్రకారం, మధ్యాహ్నం 12:29 గంటల వరకు భారతదేశంలో కనీసం 1,760 మంది వినియోగదారులు గూగుల్ మీట్తో సమస్యల ఎదుర్కొన్నట్లు చెప్పారు. చాలా మంది వినియోగదారులు వెబ్సైట్ ద్వారా ముఖ్యమైన సమావేశాల్లో జాయిన్ అవ్వలేకపోయామని ఆందోళన వ్యక్తం చేశారు.ఎర్రర్ ఇదే..ఆన్లైన్ కాల్స్లో చేరడానికి ప్రయత్నించిన వినియోగదారులకు స్క్రీన్పై ఒక ఎర్రర్ మెసేజ్ దర్శనమిచ్చింది. ‘502. దిస్ ఈస్ యాన్ ఎర్రర్. మీ రెక్వెస్ట్ను యాక్సెప్ట్ చేయడానికి దయచేసి 30 సెకన్లలో మళ్లీ ప్రయత్నించండి. మాకు తెలిసింది అంతే’ అనే మెసేజ్ చూపించింది.నెటిజన్ల స్పందనగూగుల్ మీట్ అంతరాయంపై నెజినట్లు ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా స్పందించారు. ‘పని చేయడానికి ఎంతో ఆశగా ఉన్న నాకు గూగుల్ మీట్ చుక్కలు చూపించింది’ అని ఒక నెటిజన్ రాశారు. మరొక వినియోగదారు స్పందిస్తూ.. ‘మా సంస్థలో గూగుల్ మీట్ అందరికీ డౌన్ అయింది’ అని రాశారు. కొంతమంది యూజర్లు మాత్రం టీమ్ సభ్యుల మధ్య సమస్యలు వేర్వేరుగా ఉన్నాయని తెలిపారు. ‘గూగుల్ మీట్? నాకు సరిగానే ఉంది. కానీ మా బృందంలో ఇతర సభ్యులు సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: 1980 తర్వాత పుట్టిన వారికి అలర్ట్!
UPI: ఇదిగో యాప్.. యాడ్ చేశా.. ఖర్చు పెట్టుకోండి!
మనం ఖర్చు పెట్టుకోవడానికి ఇంట్లో పెద్దవారు కానీ, యజమానులు కానీ నగదు కాకుండా బ్లాంక్ చెక్లు ఇచ్చేవాళ్లు. ఆ తర్వాత క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇస్తున్నారు. ఇప్పుడు ‘ఇదిగో యాప్.. ఖర్చు పెట్టుకోండి’ అని ఇచ్చే పరిస్థితి వచ్చింది.ఎన్పీసీఐ అనుబంధ సంస్థ అయిన ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (NBSL).. తన భీమ్ పేమెంట్స్ యాప్ లో ‘యూపీఐ సర్కిల్ ఫుల్ డెలిగేషన్’ ఫీచర్ను ప్రారంభించింది. దీంతో కుటుంబ సభ్యులు, మిత్రులు లేదా కావాల్సినవారిని సర్కిల్లోకి తీసుకుని మన అకౌంట్ నుంచి వాళ్లు డబ్బులు వాడుకునేలా చేయొచ్చు. నెలకు ఇంత అని రూ .15,000 వరకు ప్రీసెట్ చేస్తే ఇక వారు తమకు కావాల్సినప్పుడల్లా సలువుగా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. ఇందుకు వారికి సొంత యూపీఐ-లింక్డ్ బ్యాంక్ ఖాతా కూడా అవసరం లేదు. ఇలా ఎన్నికాలం వాడుకోవచ్చు (1 నెల నుండి 5 సంవత్సరాల వరకు) అన్నది కూడా సెట్ చేయొచ్చు.ఎన్బీఎస్ఎల్ ఎండీ, సీఈవో లలిత నటరాజ్ మాట్లాడుతూ, ఈ ఫీచర్ సామాన్య కుటుంబాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు తమ ఆర్థిక కార్యకలాపాలను సులభంగా నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటుందని, డిజిటల్ చెల్లింపులను మరింత చేరువ చేస్తుందని పేర్కొన్నారు.యూపీఐ సర్కిల్ను ఎలా ఉపయోగించాలంటే..భీమ్ యాప్లోకి వెళ్లి యూపీఐ సర్కిల్ ఓపెన్ చేయండి.'ఇన్వైట్ టు సర్కిల్'ను ఎంచుకుని కాంటాక్ట్ ని యాడ్ చేయండి.వారి యూపీఐ ఐడీని ఎంటర్ చేయండి లేదా క్యూఆర్ స్కాన్ చేయండి.'అప్రూవ్ ఎ మంత్లీ లిమిట్'ను ఎంచుకోండిరిలేషన్ షిప్ సెట్ చేసి గుర్తింపును (ఆధార్/ఇతర డాక్యుమెంట్ లు) వెరిఫై చేయండిఖర్చు పరిమితి (రూ.15,000 వరకు), వ్యాలిడిటీ (1 నెల నుంచి 5 సంవత్సరాలు) సెట్ చేయండి.ఖాతాను ఎంచుకుని యూపీఐ పిన్తో ప్రమాణీకరించండి.ఇప్పుడు అవతలివారు అంగీకరించిన తర్వాత కొద్దిసేవటికి చెల్లింపులను ప్రారంభించవచ్చు.
ధనికులను వణికిస్తున్న వెల్త్ ట్యాక్స్!
కొంత మందికి ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. వేలు.. లక్షల కోట్లు పోగేసి అపర కుబేరులుగా ఎదిగిపోతుంటారు. కానీ సంపాదించింది కాస్త వదులుకోవాలంటే మాత్రం అస్సలు వదులుకోలేరు. సంపదను కాపాడుకోవడం కోసం దేశాలు సైతం మారుస్తూ ఉంటారు.ప్రపంచవ్యాప్తంగా ధనికుల ఆస్తులు పెరుగుతూనే ఉండటం, భారీ ఆర్థిక అసమానత పెరుగుతున్న నేపథ్యంలో పలు దేశాలు "వెల్త్ ట్యాక్స్" లేదా "నెట్వర్త్ ట్యాక్స్" విధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఒక వ్యక్తి వద్ద ఉన్న సంపదపై (ఆస్తి, షేర్లు, డిపాజిట్లు, ఖరీదైన ఆభరణాలు మొదలైనవి) నేరుగా పన్ను విధించే ఈ విధానం కొన్ని దేశాల్లో ఇంకా అమల్లో ఉండగా, మరికొన్ని దేశాలు దానిని రద్దు చేశాయి.ఏమిటీ వెల్త్ ట్యాక్స్?కొందరి వద్ద సంపద భారీగా పెరిగిపోయి తీవ్ర ఆర్థిక అసమానతలు తలెత్తినప్పుడు ఆ అంతరాన్ని తగ్గించడానికి, పేదల సంక్షేమాన్ని పెంచడానికి అత్యంత ధనికుల సంపదపై విధించేదే వెల్త్ ట్యాక్స్ లేదా నెట్వర్త్ ట్యాక్స్. ఒక నిర్ణీత మొత్తం సంపద దాటిన అతి సంపన్నుల నుంచి నిర్ణీత శాతం పన్ను వసూలు చేస్తారు. ఇది ఆయా దేశాలు తమ ఆర్థిక, సామాజిక పరిస్థితులను బట్టి నిర్ణయిస్తాయి.వివిధ దేశాల్లో వెల్త్ ట్యాక్స్ పరిస్థితిస్విట్జర్లాండ్: ప్రపంచంలోకెల్లా వెల్త్ ట్యాక్స్ అత్యధికంగా వసూలు చేసేది స్విట్జర్లాండ్. ఈ పన్ను రేట్లు (0.1% నుంచి 1% వరకు) క్యాంటన్ (స్థానిక పరిపాలన విభాగాలు) ఆధారంగా మారతాయి. అలాగే ప్రపంచంలోని అత్యంత పారదర్శక వెల్త్ ట్యాక్సింగ్ సిస్టమ్ కూడా ఇదే.నార్వే: ఈ దేశంలో వ్యక్తిగత నెట్వర్త్పై సుమారు 0.85% వరకు వెల్త్ ట్యాక్స్ విధిస్తారు. ప్రపంచంలో అత్యధిక వెల్త్ ట్యాక్స్ ఉన్న దేశాల్లో ఇది రెండవ స్థానంలో ఉంది.స్పెయిన్: ఇక్కడ వ్యక్తిగత సంపద 7 లక్షల యూరోలు దాటితే వెల్త్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ట్యాక్స్ రేటు ప్రాంతాలవారీగా 0.2%–3.5% వరకు ఉంటుంది. ఈ కారణంగా ధనికులు దేశం వీడి వెళ్తుండటంతో ఈ ట్యాక్స్పై దేశంలో పెద్ద చర్చ జరుగుతోంది.ఫ్రాన్స్: ఈ దేశంలో ముందునుండి 1.5% వరకూ వెల్త్ ట్యాక్స్ ఉండేది. కానీ ధనికులు దేశం విడిచిపోతున్నారు అనే కారణంతో ప్రభుత్వం దాన్ని రద్దు చేసి ఇప్పుడు కేవలం రియల్ ఎస్టేట్ వెల్త్ ట్యాక్స్ మాత్రమే విధిస్తోంది.నెదర్లాండ్స్: ఇది సాంప్రదాయ వెల్త్ ట్యాక్స్ కాకపోయినా, ఆటోమేటిక్గా ఆస్తులపై “ఫిక్స్డ్ రిటర్న్ ట్యాక్స్” విధిస్తుంది. అంటే దాదాపు వెల్త్ ట్యాక్స్ లాంటిదే అనుకోవాలి.భారత్: భారత్లో కూడా 2015 వరకు వెల్త్ ట్యాక్స్ ఉండేది. అప్పుడు 1% రేటుతో అమలులో ఉండేది. తరువాత ప్రభుత్వం దాన్ని రద్దు చేసి, అధిక ఆదాయం ఉన్నవారిపై సర్చార్జ్ విధించే విధానాన్ని తీసుకొచ్చింది.ఎన్ఆర్ఐలపై ప్రభావంప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అక్కడి అత్యంత ధనవంతుల్లో భారతీయులూ కనిపిస్తుంటారు. విదేశాల్లో వ్యాపారాలతో విజయం సాధించి బాగా సంపాదించి అక్కడి అత్యంత సంపన్నులుగా ఎదిగినవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఉక్కు వ్యాపారి లక్ష్మీ ఎన్ మిట్టల్ కూడా ఒకరు.మూడు దశాబ్దాలు బ్రిటన్లో ఉంటూ.. అత్యంత ధనవంతులైన బిలియనీర్ల జాబితాలో ఒకరుగా నిలిచిన ఆయన ఆ దేశానికి వీడ్కోలు పలికినట్లుగా వార్తలు వచ్చాయి. 30ఏళ్లు యూకేలో ఉన్న ఈయన ఇప్పుడు ఆ దేశాన్ని వీడటానికి కారణం అక్కడ సూపర్ రిచ్ అంటే అపర కుబేరులపై భారీ ట్యాక్స్ విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండటమేనని తెలుస్తోంది.ఎన్ఆర్ఐలపై వెల్త్ ట్యాక్స్ ప్రభావం అనేది వారు ఏ దేశంలో నివసిస్తున్నారో, అక్కడి ట్యాక్స్ చట్టాలు ఎలా ఉన్నాయో అనేదాని ఆధారంగా ఉంటుంది. ఆ దేశంలో వారు ట్యాక్స్ రెసిడెంట్ కింద వస్తున్నారా? ఆస్తులు ఏ దేశంలో ఉన్నాయి? ఆ దేశంలో ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందం (DTAA) ఉందా? వంటివి చూడాలి.
హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాల రిపేరీ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి అంతర్జాతీయ విమానాల మరమ్మతు కేంద్రం హైదరాబాద్లో ఏర్పాటవుతోంది. శంషాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఏరోపార్క్ (SEZ)లో ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ సంస్థ సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) నెలకొల్పుతున్న లీప్ ఇంజిన్ ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ - MRO) సెంటర్ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు.రఫేల్ విమానాల్లో ఉపయోగించే M88 ఇంజిన్ కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త ఎంఆర్వో యూనిట్కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు.ఈ కొత్త సదుపాయం ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఇది భారతదేశంలో లీప్ ఇంజిన్ ల మొట్టమొదటి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (MRO) సెంటర్. రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సదుపాయంతో 1,000 మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుంది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్ ను ఎంచుకున్న సఫ్రాన్ కు అభినందనలు తెలిపారు. ఇది మన స్థానిక ఎంఎస్ఎంఈలకు, ఇంజనీరింగ్ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలను కల్పిస్తుందన్నారు.ఈ విమానాల మరమ్మతు కేంద్రం భారత వైమానిక, నావికాదళానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్ దేశంలోని ప్రధాన ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్ నిలిచిందన్నారు. తెలంగాణలో 25 కంటే ఎక్కువ ప్రధాన ప్రపంచ కంపెనీలు, 1,500 కి పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.తమ ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఎంఎస్ఎంఈ విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచిందన్నారు. తమ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్ పార్కులు, SEZలు ప్రముఖ ప్రపంచ కంపెనీల నుండి అనేక భారీ పెట్టుబడులను ఆకర్షించాయన్నారు.సఫ్రాన్, బోయింగ్, ఎయిర్ బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు హైదరాబాద్ ను తయారీ, పరిశోధన, అభివృద్ధి కోసం ఎంచుకున్నాయని, హైదరాబాద్ భారతదేశంలోని ప్రముఖ ఎంఆర్వో, ఏరో ఇంజిన్ హబ్ లలో ఒకటిగా నిలిచిందన్నారు.ఏరోస్పేస్, రక్షణ రంగంలో మన ఎగుమతులు గత ఏడాది రెట్టింపు అయ్యాయని, 9 నెలల్లో రూ.30,742 కోట్లకు చేరుకున్నాయని, మొదటిసారిగా మన ఫార్మా ఎగుమతులను అధిగమించాయని వివరించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి తెలంగాణ ఏరోస్పేస్ అవార్డును పొందిందన్నారు. ఏరోస్పేస్ పెట్టుబడులను ఆకర్షించడానికి నైపుణ్యం చాలా ముఖ్యమైన ప్రమాణమన్న రేవంత్ రెడ్డి టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో తెలంగాణ 100 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లను (ఐటీఐఎస్) అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసిందన్నారు.తమ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ విమానాల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణపై దృష్టి పెడుతుందన్నారు.30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, తమ విజన్ ను ఆవిష్కరించడానికి డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ 2047 – గ్లోబల్ సమ్మిట్ కు అందరినీ ఆహ్వానిస్తున్నానన్నారు. 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని తాము ప్రయత్నిస్తున్నామని, బెంగళూరు-హైదరాబాద్ ను డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కారిడార్ గా ప్రకటించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని వెల్లడించారు.
ఫ్యామిలీ
ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడొద్దు !
యాంటీబయాటిక్ మందులు వేసినా కూడా సూక్ష్మజీవులు చనిపోవడానికి బదులు ఇంకా పెరుగుతూనే ఉండే పరిస్థితిని యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారు. దీని గురించి ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన ఇన్ఫెక్షన్ నియంత్రణ నిపుణురాలు, కన్సల్టెంట్ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ ఆర్సీ బిలోరియా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వరల్డ్ ఏఎంఆర్ అవగాహన వారోత్సవాన్ని (వావ్) ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా నవంబర్ 18 నుంచి 24 వరకు జరుపుకుంటారు. ఈ ఏడాది థీమ్ “ఇప్పుడే స్పందించండి: మన వర్తమానాన్ని రక్షించి, భవిష్యత్తును కాపాడుకోండి’’. ఈ థీమ్ ఏఎంఆర్ను ఎదుర్కొనేందుకు ధైర్యవంతమైన, సమన్వయపూర్వక, విభాగాల వ్యాప్తంగా చర్యల అవసరాన్ని చెబుతోంది. ఏఎంఆర్ అనేది ఇప్పటికే మన ఆరోగ్యం, ఆహార వ్యవస్థలు, పరిసరాలు, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతున్న ఒక ప్రపంచవ్యాప్త ముప్పు.యాంటీబయాటిక్స్ అనేవి ప్రాణాధార మందులు. కానీ, అవి ఇన్ఫెక్షన్ కలగజేసే సూక్ష్మజీవుల మీద పనిచేస్తేనే ప్రాణాలను కాపాడతాయి. యాంటీబయాటిక్స్ మందులు సమర్థంగా ఇన్ఫెక్షన్లను నియంత్రించలేకపోతే ప్రాణాధార చికిత్సలైన కేన్సర్ చికిత్స, అవయవ మార్పిడి లాంటి వాటిపై ఏఎంఆర్ ప్రభావం చూపుతుంది. యాంటీబయాటిక్స్ మందులను చెప్పిన డోస్ కంటే తక్కువ కాలం వాడడం, లేదా తగిన డోసేజిలో వాడకపోవడం, ఒక వ్యాధికి సరిపడని మందు వాడడం లాంటివే వాటిని సరిగా వాడకపోవడం అవుతుంది. వైద్యులు చెప్పినట్లే వీటిని వాడాలి. మన సమస్యకు వైద్యులు యాంటీబయాటిక్స్ రాయకపోతే, అవి కావాలని వారిపై ఒత్తిడి చేయకూడదు . వేరేవారికి రాసిన మందులు వాడితే నయమైపోతుందని అనుకోకూడదు. ఆయా వ్యక్తులు ఆరోగ్యరీత్యా తగిన మందులను సరైన డోసులోనే తీసుకోవాలి. మన దేశంలో నేరుగా దుకాణాలకు వెళ్లి ఏదిపడితే ఆ యాంటీబయాటిక్ కొనుక్కునే అవకాశం ఉండడం కూడా వీటి దుర్వినియోగానికి కారణం అవుతోంది. కొత్త యాంటీబయాటిక్స్ తయారీ చాలా సమస్యాత్మకం, ఖర్చుతో కూడుకున్నది. మార్కెట్లోకి రావడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల కొత్త యాంటీబయాటిక్స్ తగ్గుతున్నాయి. అందుకని ఉన్నవాటినే జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలావరకు టీకాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి కాబట్టి ఏఎంఆర్ సమస్య పరిష్కారానికి పిల్లలు, పెద్దలు, వృద్ధులందరూ టీకాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎవరికైనా ఇన్ఫెక్షన్ రాకపోతే యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరమే ఉండదు. ఏఎంఆర్ నిరోధానికి ప్రతి ఒక్కరూ కృషిచేయగలరు. ఈ కింది పద్ధతుల ద్వారా మీ వంతు ప్రయత్నించండి.వైద్యులు సూచించకపోతే యాంటీబయాటిక్స్ కావాలని ఒత్తిడిచేయకండి.మందుల దుకాణం నుంచి యాంటీబయాటిక్స్ కొనాలంటే వైద్యుల ప్రిస్క్రిప్షన్తోనే వెళ్లండి. నేరుగా వెళ్లి కొనొద్దు. యాంటీబయాటిక్స్ వాడడానికి ఎప్పుడూ వైద్యుల సలహా పాటించండి. వాడాల్సినంత కాలం వాడాలి తప్ప మధ్యలో ఆపకూడదు.మిగిలిపోయిన యాంటీబయాటిక్స్ వాడద్దు, ఎవరికీ ఇవ్వద్దు.రోజూ చేతులు కడుక్కోవడం, ఆహారాన్ని శుభ్రంగా వండడం, అనారోగ్య బాధితులకు దగ్గరగా ఉండకపోవడం, దగ్గువచ్చినప్పుడు నోరు చేత్తో మూసుకోవడం, ఎప్పటికప్పుడు టీకాలు వేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లను నియంత్రించండి. చదవండి: లోపం ఐరన్.. అదే సైరన్..వైద్యులు సరైన యాంటీబయాటిక్, సరైన డోసులో, సరైన కాలం పాటు, సరైన సమయంలో ఇవ్వాలి. వీలైనంత తక్కువకాలం పాటు యాంటీబయాటిక్స్ వాడడమే సరైన వ్యూహం. ఇన్ఫెక్షన్లకు సరైన చికిత్స చేయడం వల్ల యాంటీబయాటిక్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయి, యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ రాదు.- డాక్టర్ ఆర్సీ బిలోరియా
లక్షల్లో వేతనం.. రోబోటిక్ లైఫ్ వద్దనుకున్నాడు..! కట్చేస్తే..
బిందాస్ లైఫ్.. మంచి కంపెనీలో లక్షల్లో జీతం, గుర్తింపు ఉన్నాయి. అయినా ఏదో తెలియని వెలితి..తన చుట్టూ ఉన్న వాళ్లు 30 ఏళ్లకే వైస్ప్రెసిడెంట్ హోదాను అనుభవిస్తుంటే..తాను 26 ఏళ్లు వచ్చినా..ఇదే 9 టు 5 జాబ్..రొటీన్ లైఫ్. రోబోటిక్గా పనిచేస్తూ..ప్రమోషన్లు,గుర్తిపుతోనే బతికేయాలా అనే ఆలోచన నిద్రపట్టనివ్వలేదు. అలాగని ఈ ఉద్యోగం వదులుకునే సాహసం కూడా లేద అతనికి. చివరికి ఏదోలా ఉద్యోగం వదిలేస్తే..ఊహించని విధంగా ఆ జాబ్ కాస్త ఊడిపోయింది. తలకిందులైన తన పరిస్థితికి కుమిలిపోయి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఓటమికి అవకాశం ఇవ్వనంటూ పడిలేచిన కెరటంలా సొంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి గొప్ప సక్సెస్ అందుకుని స్ఫూర్తిగా నిలిచాడు. అతడే ముంబైకి సెమ్లానీ. కామర్స్ అండ్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తాత్కలిక వర్క్ వీసాపై యూఎస్ వెళ్లాడు. అలా 2015లో జేపీ మోర్గాన్ యూఎస్ వీసాపై ఇంటర్న్గా పనిచేశాడు. తర్వాత భారత్కు తిరిగి వచ్చి..అదే కంపెనీకి సంబంధించి.. ఆస్తినిర్వహణ విభాగంలో అసోసియేట్గా విధులు నిర్వర్తించేవాడు. అయితే ఆ ఉద్యోగంలో ఆనందం లేదనే ఫీలింగ్ వెంటాడేది సెమ్లానికి. తన చుట్టూ ఉన్నవాళ్లు చకచక వైస్ ప్రెసిడెంట్ హోదా పొందేస్తుంటే..నేను మాత్రం ఇలా మెకానికల్గా 9 టు 5 జాబ్ చేస్తున్నాననే బాధ వెంటాడేది. ఈ ఉద్యోగంలో లక్షల్లో వేతనం, మంచి గుర్తింపు ఉన్నాజజ ఏదో అసలైన సక్సెస్ని అందుకోలేదనే అసంతృప్తి తీవ్రంగా ఉండేది. పోనీ జాబ్ని వదిలేద్దామంటే..అంత మంచి ఉద్యోగాన్ని వదులుకునే ధైర్యం రావడం లేదు.ఎందుకంటే అద్దె కూడా చెల్లించని విధంగా మంచి సౌకర్యాలు, ప్రతి ఏడాది మంచి వేతనంతో కూడిన ప్రమోషన్లు, చక్కటి గుర్తింపు ఉన్నాయి. ఇవన్నీ వదులుకుని వెళ్లడం అంటే గుండెల్లో ఏదో తెలియని గుబులు వెంటాడింది. ఏం చేయాలో తెలియక ధ్యానం, డిజటల్డిటాక్స్ వంటి మానసిక థెరపీలు తీసుకుని..తనకేం కావలి అనేదానిపై స్పష్టత తెచుకున్నాడు. అలా ఈ జాబ్ వద్దనే నిశ్చయానికి రావడమేగాక మంచి జాబ్లో తక్కువ వేతనానికి చేరిపోయాడు. తాను కోరుకున్న మానసికి ఆనందం దొరికింది చాలు..ఇక ఖర్చులు విషయమైతే..తన జీవినశైలిని సర్దుబాటు చేసుకుంటే సరి అనుకున్నాడు. అలా సాగిపోతున్న తరుణంలో కరోనా మహమ్మారి లాక్డౌన్ రావడం..సంపాదించిన ఆ ఉద్యోగం కాస్తా పోవడం అన్ని చకచక జరిగిపోయాయి.తీవ్ర నిరాశ, నిస్పృహ..తప్పు చేసిన ఫీలింగ్..అనవసరంగా జేపీ మోర్గాన్లో ఉద్యోగాన్ని వదులుకున్నానా..తప్పు నిర్ణయం తీసుకున్నానా అంటూ..నిద్రలేని రాత్రుల గడిపేవాడు. తన మీద తనకే జాలేసిది. అలా..పూర్తిగా డిప్రెషన్లోకి కూరుకుపోయాడు. కానీ తను చేసే మెడిటేషన్, మానసిక థెరపీల సాయంతో మళ్లీ రీచార్జ్ అయ్యి..స్టార్టప్ దిశగా అడుగులు కదిపాడు. ఆ విధంగా రూ. 53 కోట్లు టర్నోవర్ చేసే టార్టన్ స్టార్టప్ని నెలకొల్పి గొప్ప సక్సెస్ని అందుకున్నాడు. తాను కోరుకున్న జీవితాన్ని ఆస్వాదించడమే కాకుండా..పరిస్థితులు తలికిందులైనప్పుడూ ఎలా సంయమనంగా ఉండాలో నేర్చుకున్నాడు. అంతేగాదు విజయం అంటే పెద్దమొత్తంలో జీతం కాదు..అంతకుమించిన ఆనందం., సంతృప్తి అని చెబుతున్నాడు సెమ్లానీ.(చదవండి: Inspiring Story: సక్సెస్ అంటే కోట్లు గడించడం కాదు..! కష్టానికి తలవంచకపోవడమే..)
లోపం ఐరన్.. అదే సైరన్..
నగరవాసుల్లో ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు ఐరన్ లోపంతో బాధపడుతున్నారని అధ్యాయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కలంగా ఐరన్ అందించే ఉత్పత్తులు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని ప్రాక్టర్ అండ్ గాంబుల్ (పీ అండ్ జీ) హెల్త్ లిమిటెడ్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ పాపన అన్నారు. ఐరన్ లోపానికి పరిష్కారం అందించే లివోజెన్ ఐరన్ గమ్మీస్ నగర మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐరన్ తక్కువగా ఉండడం వల్ల అలసట, వెంట్రుకలు రాలడం వంటి సమస్యలు భారీగా పెరిగాయని, వీటి నివారణకు వీలుగా మహిళల రోజువారీ ఐరన్ అవసరాలు తీర్చే విధంగా ఈ గమ్మీస్ రూపొందించినట్లు వివరించారు. (చదవండి: Smriti Mandhanas Father: ఆ లక్షణాలు గుండెపోటుకి సంకేతమా..? యాంజియోప్లాస్టీ ఎందుకు?)
ప్రెషర్..టెన్షన్! మానసిక భాషలో భాగమైన ఒత్తిడి
హైదరాబాద్ మహా నగరం.. టెక్ సిటీ, ఫుడ్ హబ్, కల్చర్ సెంటర్ మాత్రమే కాదు ఈ జనరేషన్ మెంటల్ హెల్త్ను అత్యంత సీరియస్గా తీసుకుంటున్న నగరం కూడా. వేగంగా మారుతున్న లైఫ్స్టైల్, టార్గెట్స్, హడావిడిగా నడిచే టైమ్లైన్.. ఇవన్నీ ప్రస్తుత రోజుల్లో ఒత్తిడిని అందరికీ దగ్గర చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆందోళన, నిరాశ, కోపం వంటి భావోద్వేగాలు నేటి ఆధునికుల్లో సర్వసాధారణం అవుతున్నాయి. ఇది మానసిక, శారీరక ఒత్తిడిని సూచించే మానసిక భాషల్లో ఒక భాగం. అయితే ఇది మోతాదుకు మించి ఉంటే ప్రతికూల ప్రభావాలను కలిగించే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతం హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో తరచూ వినిపించే ‘డెడ్లైన్’, ‘రోలౌట్’, ‘క్లయింట్ ప్రెషర్’ వంటి మాటలు ఈ తరానికి అలవాటైపోతున్నాయి. దీంతో అనేక మానసిక, శారీరక రుగ్మతలకు లోనవుతున్నారు. ఆయా సమస్యల నుంచి బయటపడేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుత తరంలో ఉరుకుల పరుగుల జీవితం మామూలే. మరీ ముఖ్యంగా నిమిషాలను, సెకన్లను లెక్కబెట్టుకుంటూ.. డెడ్లైన్ పేరుతో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ తరం ఒత్తిడిని అర్థం చేసుకోడానికి, వారికి బాసటగా నిలవడానికి, సరైన క్రమంలో గైడ్ చేయడానికి వ్యక్తులు లేదా వ్వవస్థలు వంటి సాంకేతిక వేదికల కోసం వెతుకుతున్నారు. ఇలాంటి తరుణంలో మెంటల్ హెల్త్ కోసం సపోర్ట్ సిస్టమ్లు వినూత్న సాంకేతిక వేదికలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లో గివ్ మీ ఫైవ్ (జీఎం–5) అనే టెక్నికల్ ప్లాట్ఫాం అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవల ఇంటర్నేషనల్ స్ట్రెస్ అవేర్నెస్ వీక్ నేపథ్యంలో సంస్థ ఆధ్వర్యంలో ఐదువేల మంది యువత, విద్యార్థులపై ఒత్తిడి ప్రభావంపై సర్వే నిర్వహించింది. ఈ ఒత్తిడి సమస్యల పరిష్కారానికి జీఎం–5 టెక్నాలజీ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.పలు నగరాల్లో అధ్యయనం.. హైదరాబాద్ వంటి నగరాల్లో యువతలో ఒత్తిడి విపరీతంగా పెరుగుతోందని పలు అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ నేపథ్యంలో గివ్ మీ ఫైవ్ (జీఎం–5) బృందం తెలంగాణ, కర్ణాటకలోని ఐదువేల మంది యువత, విద్యార్థులపై ప్రత్యేక సర్వే చేపట్టింది. ఈ సర్వేలో భాగంగా ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు ఏదో ఒక మెంటల్ హెల్త్ సమస్యతో బాధపడుతున్నారని తేలింది. ఇలాంటి వారిలో నిద్రలేమి, పరీక్షల ఒత్తిడి, తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ వంటి కారణాలతో చదువులపై ఇతర అంశాలపై దృష్టి సారించలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్తో పాటు దేశంలోని ప్రతి నగరంలోనూ యువతలో ఇలాంటి ఒత్తిడి సమస్యల సర్వసాధారణం అయిపోయింది. థెరపీల కోసం విదేశాలకు.. ప్రస్తుత తరం, మరీ ముఖ్యంగా నగరవాసుల్లో ఒత్తిడికి లోనయ్యేవారు బ్రెజిల్ వంటి కొన్ని విదేశాల్లో థెరపీలకు వెళ్లడం సాధారణ విషయం. అంతేకాకుండా వ్యక్తిగత స్పేస్కు ప్రాధాన్యం ఎక్కువ. కానీ దేశంలో మానసిక ఆరోగ్యంలో కుటుంబం, సమాజం, అంచనాలు, బాధ్యతలు వంటి పలు అంశాలు భాగమేనని ఈ బృందం చెబుతోంది. ఇది మనల్ని బలంగా నిలబెట్టినా, కొన్నిసార్లు ఒత్తిడిని తెచ్చిపెడుతుంది. ఈ మిక్స్డ్ ఎకోసిస్టమ్లో టెక్నాలజీ ఆధారిత ఫ్యామిలీ–ఇన్క్లూజివ్ సొల్యూషన్ చాలా అవసరమని వారు పేర్కొన్నారు. అదే సమయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రోగ్రెసివ్ దారి ఎంచుకుంటున్న నగరం హైదరాబాద్. కాస్తో కూస్తో వెల్నెస్ మీద శ్రద్ధ పెరుగుతుంది. సైకిల్ ట్రాక్స్, మారి్నంగ్ వాక్స్, హెల్దీ కెఫేలు, మెంటల్ హెల్త్ ఔట్రీచ్ ప్రోగ్రామ్లు వంటివి ప్రస్తుతం యువతలో ట్రెండ్ అవుతున్నాయి. కానీ పూర్తిస్థాయిలో ఫలితాలను అందించట్లేదనేది వాస్తవ సత్యం. భావోద్వేగాలను ట్రాక్ చేస్తుంది.. టెక్నాలజీ – వెల్నెస్ కలిసిన అద్భుత స్థలం భాగ్యనగరం. ఇందులో భాగంగానే గివ్ మీ ఫైవ్ యాప్ భారత బీటా లాంచ్ కోసం హైదరాబాద్ను ఎంచుకుంది. ఇక్కడి కుటుంబ బంధాలు, ఆతీ్మయత బాగుంటాయి. ఇదే మెంటల్ హెల్త్కు పెద్ద సపోర్ట్ సిస్టమ్. నర్వేలో భాగంగా రూపొందించిన ఈ యాప్ వచ్చే యేడాది జనవరి–ఫిబ్రవరిలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. 10 నుంచి 50 ఏళ్ల వరకూం అందుబాటులో ఉంటుంది. రోజూ ఐదు సులభమైన ప్రశ్నలకు సమాధానాలిచ్చి వారి సోషల్ గ్రాఫ్ను అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకమైన ఫీచర్గా కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్ ‘కంపానియన్’లో జాయిన్ అవ్వచ్చు. ఇది ఇంట్లో, ఆఫీసులో, ఫ్రెండ్స్ మధ్య ఒక సెన్స్ ఆఫ్ కేర్, రెగ్యులర్ చెక్కిన్కు దోహదపడుతుంది. సమాధానాల ఆధారంగా భావోద్వేగాలను అర్థం చేసుకుని పరిష్కారాలను సూచిస్తుంది. ఏఐ ఆధారిత సూచనలు, ఫ్యామిలీ–ఫ్రెండ్స్తో కమ్యూనిటీ సపోర్ట్ ఇస్తుంది. – డాక్టర్.లీసా ఫాహే, సైకాలజిస్ట్ ఆస్ట్రేలియా పర్సనల్ స్పేస్ తప్పనిసరి.. ఒత్తిడిని జయించాలంటే ప్రతిఒక్కరికీ పర్సనల్ స్పేస్ తప్పనిసరి అని, ఇది మానసకి, శారీరక ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో యువత చాట్ జీపీటీ వంటి ప్లాట్ఫామ్స్లో తమ భావాలను పంచుకుంటున్న తరుణంలో మెంటల్ హెల్త్కు ఒక సేఫ్ డిజిటల్ స్పేస్ ఉండటం ఎంతో అవసరమని నిపుణులు అంటున్నారు. ఈ తరుణంలో ఓఏఎమ్ (ఓమ్) రూపొందించిన గివ్ మీ ఫైవ్ (జీఎం–5) యాప్ ఒత్తిడి నియంత్రణకు దోహదపడనుందని భావిస్తున్నారు. భావోద్వేగాలు వ్యక్తం చేయలేనివారు, గిల్టీ ఫీల్ ఉన్నవారు.. బిజీగా ఉండి వ్యక్తిగత, మానసిక స్థిరత్వంపై చొరవ చూపని వారికి ఈ యాప్ కొత్త సపోరి్టవ్ స్పేస్ అందించనుందని భావిస్తున్నారు. (చదవండి: హై రిస్క్ ప్రెగ్నెన్సీస్..ఇవీ జాగ్రత్తలు..!)
అంతర్జాతీయం
ఇండియాకు బూడిద మేఘాలు : డీజీసీఏ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: Ethiopia volcano eruption: ఇథియోపియాలో అకస్మాత్తుగా పేలిన బాంబుల అగ్నిపర్వత విస్ఫోటనం ప్రపంచ వ్యాప్తంగా దిగ్భ్రాంతిని రేపింది.దాదాపు 500 మీటర్ల ఎత్తులో ఉన్నహేలీ గుబ్బి అగ్నిపర్వతం 12,000 సంవత్సరాల తర్వాత పేలింది. దీంతో దాదాపు 14 కి.మీ (45,000 అడుగులు) ఎత్తులో పెద్ద బూడిద మేఘాన్ని ఉత్పత్తి చేసి ఎర్ర సముద్రం మీదుగా తూర్పు వైపు వ్యాపించింది. ఫలితంగా సమీపంలోని పర్యాటక ఆకర్షణ అయిన అఫ్దేరా గ్రామం బూడిదలో కూరకుపోయింది. అగ్నిపర్వతం పేలిన తర్వాత తనకు పెద్ద శబ్దం వినిపించిందని, దానిని షాక్ వేవ్ అని అభివర్ణించానని అఫర్ ప్రాంత నివాసి అహ్మద్ అబ్దేలా అన్నారు.ఇది ఇతర ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా యెమెన్, ఒమన్, పాకిస్తాన్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలపైకి కదులుతోంది. అసలే కాలుష్య కాసారంగా మారిపోయిన దేశ రాజధాని నగరం ఢిల్లీని కూడా తాకవచ్చని వాతావరణ (IMD) నిపుణులు అంచనా. బూడిద మేఘాలు ఇండియా మీదుగా చైనా వైపు పయనిస్తాయని, మంగళవారం రాత్రి 7.30 గంటలకు భారతదేశ గగనతలం నుండి నిష్క్రమిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవి గుజరాత్, ఢిల్లీ-ఎన్సిఆర్, రాజస్థాన్, పంజాబ్ మరియు హర్యానాపై తాకవచ్చని, దీంతో అక్కడి కాలుష్య నాణ్యత మరింత దిగజారిపోవచ్చని IMD తెలిపింది.DGCA కీలక ఆదేశాలువిమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింంది. అగ్నిపర్వత బూడిద ప్రభావిత ప్రాంతాలు , విమాన ఎత్తులను ఖచ్చితంగా నివారించాలని అత్యవసర కార్యాచరణ హెచ్చరికను జారీ చేసింది. విమాన ప్రణాళిక, రూటింగ్ , ఇంధన పరిగణనలను తదనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలని సంస్థలను కోరింది. "ఇంజిన్ పనితీరు క్రమరాహిత్యాలు లేదా క్యాబిన్ పొగ/వాసనతో సహా" ఏదైనా అనుమానిత బూడిద సంఘటనను వెంటనే నివేదించాలని విమానయాన సంస్థలకు ఆదేశించింది.ఇదీ చదవండి: లైంగిక సమస్య : లోన్ తీసుకుని మరీ రూ. 48 లక్షలు, కట్ చేస్తే!ముందు జాగ్రత్తగా ఎయిరిండియా, ఆకాశ ఎయిర్ తమ విమానాలను రద్దు చేశాయి. కొన్ని ప్రదేశాలకు ఎయిరిండియా సోమ, మంగళవారం 11 విమానాలను రద్దు చేసింది. అలాగే జెడ్డా, కువైట్ ,అబుదాబి వంటి మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రదేశాలకు షెడ్యూల్ చేసిన విమానాలను అకాసా రద్దు చేసింది.
ఘోరం: బాంబుదాడిలో 9మంది చిన్నారుల మృతి
అఫ్గానిస్థాన్ లో నిన్న అర్థరాత్రి జరిగిన బాంబుదాడిలో తొమ్మిది మంది చిన్నారులతో సహా ఒక మహిళ మృతి చెందారు. ఈ దాడులకు పాకిస్థానే కారణమని అఫ్గాన్ తాలిబన్లు ప్రకటించారు. పాకిస్థాన్ తమ దేశంలోని పౌరుల ఇళ్లే టార్గెట్గా దాడి చేసిందని పేర్కొన్నారు. కాగా ఈ దాడిపై పాక్ ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.పాక్- అఫ్గాన్ల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. పాకిస్థాన్ సేనలు తమ దేశంలోని కోస్ట్ ప్రావిన్స్ గుర్బుజ్ జిల్లాలోని ఓ పౌరుడి ఇంటిపై దాడి చేశాయని మంగళవారం తాలిబన్లు ప్రకటించారు. ఈ దాడిలో 9 మంది చిన్నారులతో పాటు ఒక మహిళ మృతి చెందిందని తెలిపారు. అంతేకాకుండా కూనార్ తో పాటు మరో ప్రాంతంలో వైమానిక దాడులు జరిగాయని పేర్కొన్నారు. కాగా నిన్న పాకిస్థాన్ పెషావర్లో పాక్ పారామిలటరీ కేంద్రం టార్గెట్గా దాడులు జరుగగా అందులో ఆరుగురు మృతిచెందారు. ఆ మరునాడే ఆప్గానిస్థాన్లో దాడులు జరుగడంతో ఈ ఘటన పాకిస్థాన్ చర్యేనని ఆప్గాన్ ఆరోపిస్తు్ంది.అయితే ఈ దాడిపై పాకిస్థాన్ ఇప్పటివరకూ స్పందించలేదు. కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 12మంది పౌరులు మృతి చెందారు. ఆ ఘటనకు టీటీపీ కారణమని ప్రకటించారు. కాగా అఫ్గాన్ టీటీపీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పింస్తుందని పాక్ నిందిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్తో ప్రత్యక్ష యుద్ధానికి వెనుకాడబోమని ఆ దేశ మంత్రి ఖవాజా ప్రకటించారు. ఈ బాంబుదాడులతో ప్రస్తుతం రెండు దేశాల మధ్య సందిగ్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి.
నెతన్యాహు భారత పర్యటన రద్దు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ పర్యటన రద్దైంది. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుళ్ల నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా నెతన్యాహు తన పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. నెతన్యాహు భారత్ పర్యటన రద్దవడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి.భారత్- ఇజ్రాయెల్ మధ్య మైత్రి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ ఆపదలో ఉన్న ప్రతీసారి నేనున్నానంటూ ఇజ్రాయెల్ ఆపన్న హస్తం అందించడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ఆ దేశ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహు ఈ ఏడాది చివర్లో భారత్ రావాల్సి ఉండగా కొద్దిరోజుల క్రితం ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో తన పర్యటన రద్దు చేసకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో బెంజిమెన్ పర్యటన రద్దుకావడం ఇది మూడోసారి. గతంలో సెప్టెంబర్ 19న ఒకరోజు పర్యటన నిమిత్తం భారత్ రావాల్సి ఉండగా ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. అంతకు ముందు ఏప్రిల్లో సైతం బెంజిమిన్ పర్యటన రద్దైంది.బెంజిమిన్ నెతన్యాహు చివరిసారిగా 2018లో భారత్ లో పర్యటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది ఆయన ఇండియా వచ్చే అవకాశాలు లేనట్లే కనిపిస్తుంది. 2026లో నెతన్యాహు భారత్ లో పర్యటించి ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశముంది. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారుబాంబు దాడిలో 13మంది మృతి చెందగా పలువురు గాయపడ్డ సంగతి తెలిసిందే.
భారత్కు తాలిబాన్ల భారీ ఆఫర్
న్యూఢిల్లీ: పాకిస్తాన్తో సరిహద్దు సంక్షోభం కారణంగా వాణిజ్య మార్గాలు మూసుకుపోవడంతో భారత్తో దోస్తీ కోసం ఆఫ్ఘనిస్తాన్ తహతహలాడుతోంది. ఆ దేశానికి చెందిన వాణిజ్య, పరిశ్రమల మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, దౌత్య సంబంధాలను విస్తరించాలని పిలుపునివ్వడం ప్రత్యేకతను సంతరించుకుంది. పాకిస్తాన్తో దౌత్య అంతరం పెరుగుతున్న తరుణంలో భారత్ పర్యటనకు వచ్చిన అజీజీ ‘ఎన్డీటీవీ’తో మాట్లాడారు.భారతదేశంతో వ్యాపారానికి ఆఫ్ఘనిస్తాన్ తలుపులు తెరిచిందని ఈ సందర్భంగా అజీజీ అన్నారు. 2021 తర్వాత భారతదేశంలో తాజాగా మొదటి ఉన్నత స్థాయి తాలిబాన్ సమావేశం జరిగింది. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు ఏర్పడిన తరుణంలో ఆ దేశం నుంచి ఔషధాల దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. భారత పర్యటనలో ఉన్న అజీజీ..భారత్తో వాణిజ్యానికి కొత్త మార్గాలను కనుగొనడం, ఆర్థిక సహకారాన్ని పునరుద్ధరించడం తన పర్యటన ముఖ్య ఉద్దేశమని అన్నారు.తాజాగా ఆఫ్ఘనిస్తాన్ తమ అరియానా ఆఫ్ఘన్ ఎయిర్లైన్స్కు సబ్సిడీ ఇవ్వడం, ఇతర ప్రైవేట్ క్యారియర్లకు ప్రోత్సాహం అందించడం ద్వారా సరుకు రవాణా ఖర్చులను తగ్గించాలని యోచిస్తోంది. అంతేకాకుండా ఆఫ్ఘన్ డ్రై ఫ్రూట్స్, భారతీయ ఔషధాలతో సహా ఇరువైపులా ఎగుమతులను పెంచడానికి సుంకాలను తగ్గించాలని అనుకుంటోంది. పాకిస్తాన్కు ప్రత్యామ్నాయంగా ఇరాన్ ద్వారా సముద్ర మార్గాలు, ఆసియా ద్వారా భూ మార్గాలను వినియోగించుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది. తమ దేశంలోని విస్తారమైన ఖనిజ నిక్షేపాలు, అరుదైన భూములపై భారతదేశం ఆసక్తి చూపుతున్నదని అజీజీ పేర్కొన్నారు.భారతీయ కంపెనీలు ఆఫ్ఘన్ నిబంధనలను అనుసరించినంతవరకు వారికి తమ దేశంలో వాణిజ్యానికి సమాన అవకాశాలు ఇస్తామని అజీజీ హామీ నిచ్చారు. ఇటువంటి సానుకూల వాతావరణాన్ని బలోపేతం చేయడానికి త్వరలో ఆఫ్ఘనిస్తాన్.. భారత్కు ఒక వాణిజ్య ప్రతిపాదనను పంపుతుందని తెలిపారు. కాబూల్లోని భారత దౌత్యవేత్తలకు, రాయబార కార్యాలయానికి పూర్తి భద్రత కల్పిస్తామని హామీనిచ్చారు. భారత మహిళా వ్యవస్థాపకులకు ఆఫ్ఘనిస్తాన్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా సహకారం అందిస్తామని అన్నారు. వచ్చే ఏడాది జూన్ లేదా జూలైలో ఆఫ్ఘనిస్తాన్ను సందర్శించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్లను ఆఫ్ఘనిస్తాన్ మంత్రి అజీజీ ఆహ్వానించారు. ఇది కూడా చదవండి: Delhi pollution: ఆఫీసులో ఫిఫ్టీ.. ఇంటిలో ఫిఫ్టీ!
జాతీయం
రాజ్యాంగం జాతీయవాద మార్గదర్శి: రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ: నేడు(బుధవారం) 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆమె భారత రాజ్యాంగాన్ని తొమ్మిది భారతీయ భాషలలో (మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కాశ్మీరీ, తెలుగు, ఒడియా, అస్సామీ) రూపొందించిన డిజిటల్ వెర్షన్ను, ఒక స్మారక బుక్లెట్ను విడుదల చేశారు. రాజ్యాంగం దేశ ఆత్మగౌరవాన్ని నిర్ధారించిందని, వలసవాద మనస్తత్వాన్ని విడిచిపెట్టి, జాతీయవాద ఆలోచనలను స్వీకరించడానికి రాజ్యాంగం మార్గదర్శక పత్రమని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.రాజ్యాంగ నిర్మాతలు దేశ పౌరుల వ్యక్తిగత, ప్రజాస్వామ్య హక్కులను ఎల్లప్పుడూ పరిరక్షించాలని కోరుకున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ముసాయిదా కమిటీ ఛైర్మన్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్కు నివాళులర్పించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మహిళలు, యువత, ఎస్సీలు, ఎస్టీలు, రైతులు, మధ్యతరగతి ప్రజలు.. అందరూ బలోపేతం చేస్తున్నారని రాష్ట్రపతి ప్రశంసించారు. దేశం సాధించిన అతిపెద్ద విజయాలలో 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకురావడం ఒకటని రాష్ట్రపతి ముర్ము అన్నారు.లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, రాజ్యాంగ సభ సభ్యులందరికీ గౌరవపూర్వక నివాళులు అర్పించారు. వారి అవిశ్రాంత కృషి ఫలితంగానే దేశంలోని ప్రతి పౌరునికి న్యాయం, సమానత్వం, సోదరభావం, గౌరవాన్ని అందించే అద్భుతమైన రాజ్యాంగం ఏర్పడిందని అన్నారు. గత ఏడు దశాబ్దాలుగా రాజ్యాంగ మార్గదర్శకత్వంలోనే అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు విధానాలు, చట్టాలను రూపొందించామని బిర్లా వివరించారు. సుపరిపాలన, సామాజిక-ఆర్థిక అభివృద్ధి ప్రయాణం రాజ్యాంగం ద్వారానే సాధ్యమైందని తెలిపారు. ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ మన రాజ్యాంగపు ఆత్మ.. భారత్ ఒక్కటేనని నిరూపించిందని, అది ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుందన్నారు. రాజ్యాంగం సామాజిక న్యాయం, బలహీన వర్గాల ఆర్థిక సాధికారతపై నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తితో వికసిత్ భారత్ లక్ష్యం వైపు అందరూ అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. VIDEO | Delhi: President Droupadi Murmu (@rashtrapatibhvn) releases digital version of the Constitution of India in 9 languages during Constitution Day celebrations at Samvidhan Sadan.(Source: Third Party)#Constitution (Full video available on PTI Videos -… pic.twitter.com/rR9DIfmkX6— Press Trust of India (@PTI_News) November 26, 2025
ఢిల్లీ పేలుడు: ఎన్ఐఏ చేతికి కీలక ఆధారం
న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి మరో కీలక ఆధారం లభ్యమయ్యింది. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వెలుపల కారు బాంబు దాడికి పాల్పడిన కేసులో మరో ముందడుగు పడింది. ఈ ఘటనలో కీలకంగా ఉన్న సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి ఆశ్రయం కల్పించిన హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన సోయాబ్ను తాజాగా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.ఇండియా టీవీ అందించిన కథనం ప్రకారం సోయాబ్ ఉగ్రవాది ఉమర్కు లాజిస్టికల్(రవాణా) సాయాన్ని అందించాడు. ఈ పేలుడులో 15 మంది మృతిచెందగా, 20 మందికి పైగా జనం గాయపడ్డారు. ఇది యావత్ దేశాన్నీ భయభ్రాంతులకు గురిచేసింది. కాగా సోయాబ్ అరెస్టుతో ఈ కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన నిందితుల సంఖ్య ఏడుకు చేరింది. షోయబ్.. జమ్ముకశ్మీర్ పోలీసులు గతంలో ఛేదించిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో భాగమని విచారణలో తేలింది. అలాగే ఈ కేసులో సోయాబ్ పాత్ర ఉగ్రవాది ఉమర్కు బస కల్పించడం వరకూ మాత్రమే పరిమితం కాలేదని తేలింది.ఫరీదాబాద్లోని అల్ఫాలా విశ్వవిద్యాలయంలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేసిన సోయాబ్, ఆ విశ్వవిద్యాలయ ప్రయోగశాల నుండి పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన రసాయనాలను సేకరించేందుకు ఉమర్కు సహాయం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే సోయాబ్.. హర్యానాలోని నుహ్లోని హిదాయత్ కాలనీలో ఉమర్ కోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఈ ఇంటిని ఉమర్ తాను తప్పించుకునే సమయంలో ఉపయోగించాడు. అలాగే ఇక్కడే పేలుడు పదార్థాలను కూడా నిల్వ చేశాడని అధికారులు వెల్లడించారు.ఈ అద్దె ఇంటిని హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) నవంబర్ 16న తనిఖీ చేసి, ఆ తర్వాత సీలు చేసింది. ఇక్కడి నుంచే ఉమర్ కారులో ప్రయాణించాడు. ఈ ప్రయాణ మార్గాన్ని కూడా అధికారులు గుర్తించారు. ఫిరోజ్పూర్ ఝిర్కాలో ఏటీఎం నుండి డబ్బు విత్డ్రా చేసుకున్న తరువాత, ఉమర్ ముంబై ఎక్స్ప్రెస్వే పైనుంచి బాదర్పూర్ మీదుగా ఐ20 కారులో ఢిల్లీలోకి ప్రవేశించాడు. తరువాత ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో ఆ కారు పేలిపోయింది. దీంతో మంటలు చెలరేగి సమీపంలోని ఇతర వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. ఈ దాడిని కేంద్ర మంత్రివర్గం ఉగ్రవాద ఘటనగా పేర్కొంది. దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించేందుకు దర్యాప్తు సంస్థలు కృషి చేయాలని ఆదేశించింది. ఎన్ఐఏ ప్రస్తుతం ఆత్మాహుతి బాంబు దాడికి సంబంధించిన వివిధ ఆధారాలను సేకరిస్తోంది. ఈ దాడిలో భాగస్వామ్యమున్న ఇతరులను గుర్తించేందుకు పోలీసు బలగాలతో సమన్వయంతో వివిధ రాష్ట్రాలలో సోదాలు కొనసాగుతున్నాయి.ఇది కూడా చదవండి: కమ్రా టీ షర్టు వివాదం: ఉతికి ఆరేసిన బీజేపీ, శివసేన
భారత రాజ్యాంగం ఎందుకు ప్రత్యేకం?
భారత రాజ్యాంగం కేవలం చట్టాల సంపుటి కాదు.. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన లిఖిత దస్తావేజు. దీని నిర్మాణ లక్షణాలు, రాజకీయ సూత్రాలు, సంస్థాగత ఏర్పాటు ప్రపంచంలోని ఇతర రాజ్యాంగాల కన్నా ఎంతో భిన్నమైనవి. 448 అధికరణలు, 12 షెడ్యూళ్లు, పలు సవరణలతో మన రాజ్యాంగం ఎంతో వైవిద్యాన్ని కలిగివుంది. ఈ రోజు(నవంబర్ 26) భారత రాజ్యాంగ దినోత్సవం. ఈ సందర్భంగా మన రాజ్యాంగంలోని ప్రత్యేకతలను గుర్తు చేసుకుందాం.సమాఖ్య నిర్మాణంలో ఐక్యతా స్ఫూర్తిభారత రాజ్యాంగం దేశంలోని వివిధ ప్రాంతాలు, సంస్కృతులు, భాషా సమూహాల వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా వివరణాత్మకంగా రూపొందించారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కాకుండా, రాష్ట్రాలకు కూడా ఒకే ఏకీకృత రాజ్యాంగాన్ని కలిగి ఉన్న ఏకైక వ్యవస్థ. ఇది సమాఖ్య నిర్మాణంలోనూ ఏకత్వ స్ఫూర్తిని చాటుతుంది.సవరణలకు అవకాశంనిర్మాణపరంగా భారత రాజ్యాంగం దృఢత్వం (Rigidity), అనుకూలత (Flexibility)ల అద్భుత మిశ్రమం. కొన్ని నిబంధనలను సవరించడానికి పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ, రాష్ట్రాల ఆమోదం అవసరం అవుతుంది. కొన్నింటిని సాధారణ చట్టాల మాదిరిగానే మెజారిటీతో సులభంగా సవరించవచ్చు.బ్రిటీష్ తరహాలో..ఇక రాజకీయ లక్షణాల విషయానికి వస్తే, ఇది బ్రిటీష్ తరహా పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థను స్వీకరించింది. ఇక్కడ రాష్ట్రపతి నామమాత్రపు అధిపతి అయితే, ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రి నిజమైన కార్యనిర్వాహక అధికారాన్ని నిర్వహిస్తారు. ఇది దేశంలో ప్రజల సార్వభౌమత్వాన్ని, కార్యనిర్వాహక వ్యవస్థ చట్టసభకు బాధ్యత వహించే విధానాన్ని నిర్ధారిస్తుంది.పౌరులందరికీ సమాన అవకాశాలురాజ్యాంగం.. కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాలను స్పష్టంగా విభజించినప్పటికీ, యూనియన్ ప్రభుత్వం (కేంద్రం) అత్యవసర పరిస్థితుల్లో లేదా రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చినప్పుడు కీలక పాత్రను పోషిస్తుంది. మన రాజ్యాంగం కేవలం రాజకీయ సమానత్వాన్ని మాత్రమే కాకుండా, సార్వత్రిక వయోజన ఓటు హక్కు (18 ఏళ్లు పైబడిన ప్రతి పౌరునికి ఓటు హక్కు) ద్వారా పౌరులందరికీ సమాన అవకాశాన్ని ఇస్తుంది.ఏక పౌరసత్వానికి పెద్దపీటఅంతేకాకుండా అమెరికా మాదిరిగా కాకుండా, భారతదేశం ఒకే పౌరసత్వాన్ని (Single Citizenship) మాత్రమే కలిగి ఉంది. ఇది దేశ పౌరులలో జాతీయ సమగ్రతను, ఐక్యతను పెంపొందిస్తుంది.లౌకికవాద సిద్ధాంతంప్రపంచానికి ఆదర్శంగా నిలిచే మరో విశిష్ట లక్షణం లౌకికవాద (Secular) సిద్ధాంతం. భారత దేశానికి అధికారిక మతం అంటూ ఏదీ లేదు. రాజ్యాంగం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది. వాటిని అనుసరించే స్వేచ్ఛపై పౌరులకు హామీనిస్తుంది.ఐరిష్ రాజ్యాంగం నుండి..హక్కులు, సూత్రాల విభాగంలో రాజ్యాంగం పౌరులకు ఆరు ప్రాథమిక హక్కుల హామీనిచ్చింది. ఇవి సమానత్వం, స్వేచ్ఛ, రక్షణ కల్పిస్తాయి. దీనికితోడు, ఐరిష్ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందిన విధాన నిర్దేశక సూత్రాలు సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి.స్వతంత్ర న్యాయవ్యవస్థకు హామీసంస్థాగత స్థాయిలో రాజ్యాంగం ఒక స్వతంత్ర న్యాయవ్యవస్థకు హామీనిస్తుంది. దీనికి న్యాయ సమీక్ష (Judicial Review) అధికారం ఉంది. తద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టులు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలను రద్దు చేసే అధికారాన్ని కలిగి ఉన్నాయి. ఇది చట్టసభల నియంతృత్వాన్ని నిరోధిస్తుంది.జర్మనీ ప్రేరణతో..రాజ్యాంగంలోని అత్యవసర నిబంధనలు (జర్మనీ నుండి ప్రేరణ పొందినవి) జాతీయ సంక్షోభ సమయాల్లో యూనియన్ ప్రభుత్వం తాత్కాలికంగా అధిక అధికారాలను చేపట్టడానికి అనుమతిస్తాయి. 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలు, మునిసిపాలిటీలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు ఇచ్చారు. దీంతో స్థానిక స్వపరిపాలనను బలోపేతం అవుతుంది. ఈ వ్యవస్థ ప్రజాస్వామ్య దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తుంది.స్వదేశీ సూత్రాలతో మిళితంభారత రాజ్యాంగం ప్రపంచంలో వివిధ రాజ్యాంగాల ప్రేరణలను స్వదేశీ సూత్రాలతో మిళితం చేసింది. ఇందులో ప్రాథమిక హక్కులు యుఎస్ రాజ్యాంగం నుండి, పార్లమెంటరీ వ్యవస్థను యూకే నుండి, ఐర్లాండ్ నుండి ప్రాథమిక విధులను అనుసరించింది.ప్రజాస్వామ్య ప్రక్రియల సమగ్రతఎన్నికల కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తదితర ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా, రాజ్యాంగం ప్రజాస్వామ్య ప్రక్రియల సమగ్రతను చాటుతుంది. అలాగే పాలనలో జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది. ఇంతటి విశిష్ట లక్షణాలున్న భారత రాజ్యాంగం.. దేశ సాంస్కృతిక, రాజకీయ, సామాజిక ఆకాంక్షలకు దర్పణంగా నిలుస్తున్నది.
సైక్లోన్ సెన్యార్: తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం
మలక్కా జలసంధి ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం.. ఇది వేగంగా ముందుకు కదులుతూ 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సహా పలు తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ తుపానుగా సెన్యార్గా(Cyclone Senyar) పేరు పెట్టారు.మలక్కా జలసంధి (Strait of Malacca).. దక్షిణ ఆండమాన్ సముద్రం ప్రాంతంలో తక్కువ పీడన ప్రాంతం ఏర్పడిన వాయుగుండం ఈ ఉదయం తుఫానుగా మారింది. మలేషియా జార్జ్టౌన్కు సుమారు 260 కి.మీ. పశ్చిమ-దక్షిణ పశ్చిమ దూరంలో, నికోబార్ దీవులకు 600 కి.మీ. తూర్పు-దక్షిణ తూర్పున కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ దిశగా గంటకు సుమారు 10 కి.మీ. వేగంతో కదులుతోంది. కాగా.. యూఏఈ దీనికి సెన్యార్ అని సూచించింది. దీనర్థం "సింహం" అని.IMD అంచనా ప్రకారం.. సెన్యార్ తుఫాను మొదట పశ్చిమ-దక్షిణ పశ్చిమ దిశగా కదిలి, తర్వాతి 48 గంటల్లో తిరిగి తూర్పు దిశగా మళ్లనుంది. ఇండోనేషియా సమీపంలో తీరం తాకే అవకాశం ఉందని.. 24 గంటలపాటు తుఫాను తీవ్రతను కొనసాగించి, తర్వాత క్రమంగా బలహీనపడనుందని పేర్కొంది.సెన్యార్ ప్రభావంతో.. అండమాన్ & నికోబార్ దీవులు, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రంలో అలలు ఎత్తుగా ఎగసే అవకాశం ఉండటంతో, మత్స్యకారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఎన్ఆర్ఐ
ఫీనిక్స్లో సాంస్కృతిక వేడుకలు.. శంకర నేత్రాలయ యూఎస్ఏకు భారీ విరాళం
మెసా(అరిజోనా): ఫీనిక్స్లోని భారతీయ యువత ఆధ్వర్యంలో మెసా ఆర్ట్స్ సెంటర్లోని వర్జీనియా జి. పైపర్ రిపర్టరీ థియేటర్ వేదికగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం, హాస్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. సేవా సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుక ద్వారా శంకర నేత్రాలయ యూఎస్ఏ నిర్వహించే గ్రామ దత్తత కార్యక్రమం కోసం 1,45,000 డాలర్లు విరాళంగా సమీకరించబడ్డాయి.“డాన్స్ ఫర్ విజన్” కార్యక్రమంలో 160 మంది యువ కళాకారులు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల నృత్య రూపకాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. యువ నాయకులు యోగాంశ్, విశాల్, జోషిత, ఆదిత్య తదితరులు సమర్థంగా కార్యక్రమాన్ని నడిపారు. మహిళా కమిటీ సమన్వయంతో నిర్వహణ విజయవంతమైంది. నృత్య గురువులకు సన్మాన పతకాలు, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.దాతలకు సన్మానంగ్రామ దత్తత కార్యక్రమానికి ముఖ్యంగా పది మంది దాతలు తమ విరాళాలతో మద్దతు అందించారు. వీరిని వేదికపై ఘనంగా సన్మానించారు. వారి సేవా దృక్పథం, అరిజోనా బృందం సమిష్టి కృషికి పలువురు అభినందనలు తెలిపారు.హాస్యంతో హృదయాల హరివిల్లు“విజన్ కోసం నవ్వులు” పేరుతో రామ్కుమార్ నిర్వహించిన తమిళ స్టాండ్అప్ హాస్య ప్రదర్శన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. కార్యక్రమం అనంతరం ఆయన అభిమానులతో ఫొటోలు దిగారు, శాలువా, సత్కార పతకంతో సన్మానితులయ్యారు.శంకర నేత్రాలయ సేవా లక్ష్యం1978లో ప్రారంభమైన శంకర నేత్రాలయం, గ్రామీణ భారతదేశంలో కంటి చికిత్స అందించడంలో అగ్రగామిగా నిలుస్తోంది. 1988లో స్థాపితమైన శంకర నేత్రాలయ యూఎస్ఏ, మెసు ద్వారా మొబైల్ నేత్ర శిబిరాలు నిర్వహిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది.నిర్వాహకుల కృషివంశీ కృష్ణ ఇరువారం, ఆది మోర్రెడ్డి, శ్రీని గుప్తా, డాక్టర్ రూపేష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమ విజయానికి కీలకంగా వ్యవహరించారు. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సేవకులు, కళాకారులు, గాయకులు, నృత్య పాఠశాలలు అందరూ తమదైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా.. టికెటింగ్, ప్రచారం, ఫోటోగ్రఫీ, ఫ్లయర్ రూపకల్పన వంటి విభాగాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చివరగా, పాల్గొన్నవారందరికీ భోజన పెట్టెలు అందజేయడం ద్వారా కార్యక్రమాన్ని ముగించారు.
శ్రీ శ్రీ రవిశంకర్కు వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు
బోస్టన్ గ్లోబల్ ఫోరం (The Boston Global Forum (BGF) , AI వరల్డ్ సొసైటీ (AIWS) నుంచి 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును శ్రీ శ్రీ రవిశంకర్ ప్రదానం చేశారు.. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన, వివాదాల పరిష్కారం, మానవతా సేవలలో ఆయన చేసిన అసామాన్య సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం లభించింది. ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్తలు, విశిష్ట అతిథుల సమక్షంలో జరిగింది.గత సంవత్సరం ఈ అవార్డు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్కు యూరప్ లోను , ప్రపంచవ్యాప్తం గాను శాంతి మరియు భద్రతను ప్రోత్సహించే దిశగా చేసిన నాయకత్వ కృషికి గుర్తింపుగా ప్రదానం చేశారు. ఇంతకుముందు ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నవారు:జర్మనీ ఛాన్సలర్ ఆంగెలా మెర్కెల్ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబేఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్టోఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోడిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రజలతోఈ అవార్డు ప్రపంచ శాంతి కోసం కృషి చేసే అత్యున్నత గ్లోబల్ నాయకులకు అందించే అరుదైన గౌరవాల్లో ఒకటి.
ఆటా, ఎస్ఏఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా (American Telugu Association ATA) అమెరికాలోని తెలుగు విద్యార్థులకు మద్దతుగా మరో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా -SAI తో కలిసి స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను నిర్వహించింది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మిల్వాకీలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్కు స్టూడెంట్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. విద్యార్థుల అవగాహన, భద్రత, మరియు భవిష్యత్తు అవకాశాలపై దృష్టి సారిస్తూ ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పలువురు నిపుణులు, కమ్యూనిటీ నాయకులు, ప్రొఫెసర్స్ తో పాటు పలువురు ప్రముఖులు పలు అంశాలపై ప్రసంగించారు. డీన్ , ప్రొఫెసర్ అరోరా.. విద్యార్థి జీవితాన్ని నావిగేట్ చేయడంతో పాటు విద్యార్థుల అకడమిక్ మరియు వ్యక్తిగత జీవితంలో విజయవంతం కావడానికి అవసరమైన మార్గదర్శకత్వం చేశారు. విద్యార్థుల భద్రత మరియు సెక్యూరిటీ వంటి ముఖ్యమైన అంశాలపై మిల్వాకీ పోలీస్ లెఫ్టినెంట్ కీలక సూచనలు చేశారు. హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ నిపుణులు కృష్ణ రంగరాజు వివరించారు. ప్రముఖ అటార్నీ సంతోష్ రెడ్డి సోమిరెడ్డి, ప్రముఖ అటార్నీ ప్రశాంతి రెడ్డి, ఇమ్మిగ్రేషన్ పాలసీలపై కీలక సూచనలు చేశారు. ఇమిగ్రేషన్ విషయంలో చేయవలసినవి, చేయకూడనవి విద్యార్థులకు చాలా చక్కగా వివరించారు.అమెరికా సాంస్కృతిక వాతావరణంలో ఎలా కలవాలి, స్థానిక కమ్యూనిటీలతో అనుసంధానం ఎలా పెంచు కోవాలి వంటి అంశాలపై ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లాతో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించారు. యూనివర్సిటీ క్యాంపస్ లైఫ్ని ఎలా సమర్థంగా ఎదుర్కోవాలి, ఇంటర్న్షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాల గురించి ప్రముఖులు రవి కాకి రెడ్డి, కె.కె. రెడ్డి వివరించారు. అలాగే కిరణ్ పాశం జూమ్ కాల్ ద్వారా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆటా సెక్రటరీ సాయినాథ్, ఆటా చికాగో సభ్యులు భాను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఆటా విస్కాన్సిన్ రీజినల్ డైరెక్టర్స్ పోలిరెడ్డి గంట, చంద్ర మౌళి సరస్వతి, ఆట విస్కాన్సిన్ రీజినల్ కోఆర్డినేటర్స్ తో పాటు నిఖిల, కీర్తిక తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఆటా మిల్వాకీ టీమ్ మరియు SAI సహకారంతో నిర్వహించిన ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్గా నిలిచింది. విద్యార్థుల అవగాహన, ఆత్మవిశ్వాసం, భద్రత వంటి అంశాల్లో బలమైన పునాది వేస్తూ.. ఇటువంటి కార్యక్రమం ఆటా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మార్గదర్శకంగా, ప్రేరణగా ఆటా నిలబడుతుందనడంలో సందేహం లేదు.
బహ్రెయిన్లో మృతి చెందిన ఐదేళ్లకు గల్ఫ్ కార్మికుడి అంత్యక్రియలకు సన్నాహాలు
ఐదేళ్ల క్రితం బహ్రెయిన్లో మృతి చెందిన జగిత్యాల జిల్లా మెటుపల్లి కి చెందిన శ్రీపాద నరేష్ మృతదేహం అతిశీతల శవాగారంలో మగ్గుతోంది. భౌతికకాయాన్ని భారత్కు పంపించడం చేయడం సాధ్యం కాదని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేయడంతో... బహ్రెయిన్లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు సమ్మతిస్తూ, మృతుని భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి) నిరభ్యంతర పత్రంపై సంతకం చేశారుతదుపరి చర్యలకు కోసం కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట సంజయ్, మంగళవారం ప్రజా భవన్ లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణిని సందర్శించి మృతుడి సోదరుడు ఆనంద్ తో కలిసి నోటరీ అఫిడవిట్ (నిరభ్యంతర పత్రం) ను సీఎం ప్రజావాణి ఇంచార్జి డా. జి. చిన్నారెడ్డికి, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డికి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం, బహరేన్ లోని ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసి అక్కడే అంత్యక్రియలు జరిగేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ బహ్రెయిన్ వెళ్ళి అంత్యక్రియలకు హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్లు నంగి దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, సామాజిక సేవకులు మొరపు తేజ, ఆకుల ప్రవీణ్, బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బహరేన్ లోని సామాజిక కార్యకర్తలు డి.వి. శివకుమార్, కోటగిరి నవీన్ కుమార్, నోముల మురళి భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.
క్రైమ్
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ముస్కాన్ రస్తోగి
బ్లూ డ్రమ్.. ఈ పేరు వింటేనే భర్తల వెన్నులో వణకు పుడుతోంది. అందుకు కారణం.. మీరట్లో జరిగిన ఓ ఘటన. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్తను ప్రియుడి సాయంతో గంజాయి మత్తులో కిరాకతంగా హతమార్చింది ఓ భార్య. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కూడా. అయితే.. భర్త సౌరభ్ రాజ్పుత్ (మర్చంట్ నేవీ ఆఫీసర్)ను అత్యంత కిరాతకంగా కడతేర్చిన ముస్కాన్ రస్తోగి మళ్లీ తల్లైంది. ఆదివారం సాయంత్రం మీరట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సయమంలో ముస్కాన్ ప్రియుడు, ఈ కేసు సహ నిందితుడు సాహిల్ శుక్లా కూడా పక్కనే ఉన్నాడు. ఒకవేళ ఆ బిడ్డ తమ కొడుకుకే పుట్టినట్లు డీఎన్ఏ పరీక్షల్లో తేలితే.. తమ మనవడిగా స్వీకరిస్తామని సౌరబ్ కుటుంబం ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.మీరట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బ్లూ డ్రమ్ హత్యకేసు మరోసారి వార్తల్లో నిలిచింది. భర్త సౌరభ్ రాజ్పుత్ను క్రూరంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా అరెస్టైన ముస్కాన్ రస్తోగి, ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న ఆమె.. ఆదివారం సాయంత్రం జైలు అధికారుల పర్యవేక్షణలో మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ప్రియుడు సాహిల్ శుక్లా మోజులో పడి భర్త సౌరభ్ గుప్తను హత్య చేయించిన కేసులో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ముస్కాన్ రస్తోగి అరెస్టు సమయంలోనే ఆమె గర్భవతిగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆమెకు ప్రత్యేక వైద్య పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. గర్భధారణ చివరి దశకు చేరుకోవడంతో, భద్రతా ఏర్పాట్ల మధ్య ఆమెను మీరట్ మెడికల్ కాలేజీకి తరలించారు.ముస్కాన్ సాధారణ ప్రసవం ద్వారా ఆరోగ్యవంతమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రసవం అనంతరం, భద్రతా కారణాల వల్ల వారిని ప్రత్యేక వార్డులో ఉంచారు. ఈ కేసు 2024లో వెలుగులోకి వచ్చింది.సౌరభ్ రాజ్పుత్ హత్య అనంతరం, అతని శవాన్ని బ్లూ డ్రమ్లో నింపి మాయం చేసిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులు విచారణలో ముస్కాన్ రస్తోగి, ఆమె స్నేహితుడు సహా పలువురిని అరెస్టు చేశారు. శిశువు భవిష్యత్తుపై చర్చ ముస్కాన్ జైలులో శిశువుకు జన్మనివ్వడంతో, బిడ్డను ఎక్కడ ఉంచాలి? ఎవరు చూసుకుంటారు? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. చట్టం ప్రకారం, మహిళా ఖైదీలు తమ పిల్లలను ఆరు సంవత్సరాల వయస్సు వరకు జైలులోనే ఉంచుకునే అవకాశం ఉంది. ముస్కాన్ రస్తోగిపై హత్య, శవాన్ని మాయం చేయడం, కుట్ర వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ప్రసవం అనంతరం ఆమెను తిరిగి జైలుకు తరలించే ప్రక్రియను అధికారులు పరిశీలిస్తున్నారు.
పోలీస్ శాఖకే మచ్చ తెచ్చిన ఎస్సై భాను ప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: నగర పోలీస్ శాఖలో ఓ ఎస్సై నిర్వాకం తీవ్ర కలకలం రేపుతోంది. బెట్టింగ్ వ్యసనంతో చేసిన అప్పులు తీర్చేందుకు ఏకంగా తన సర్వీస్ తుపాకీతో పాటు, ఓ కేసులో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై భాను ప్రకాశ్ బరితెగింపు పోలీస్ శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా మారింది.వివరాల్లోకి వెళ్తే, ఎస్సై భాను ప్రకాశ్ బెట్టింగ్లకు బానిసై భారీగా అప్పుల పాలైనట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అడ్డదారులు తొక్కాడు. ఓ రికవరీ కేసులో(ఈ ఏడాది జనవరిలో జరిగింది) భాగంగా స్వాధీనం చేసుకున్న ఐదు తులాల బంగారాన్ని తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు విచారణలో తేలింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.అంతేకాకుండా, భాను ప్రకాశ్ వద్ద ఉండాల్సిన సర్వీస్ గన్ కనిపించకపోవడంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. ఈ విషయంపై వారు నిలదీయగా, ఎస్సై నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో లోతుగా విచారించగా, బంగారంతో పాటే తుపాకీని కూడా ఓ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి పనులకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఎస్సై భాను ప్రకాశ్ను టాస్క్ఫోర్స్ పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
అత్తింటి వేధింపులకు అల్లుడు బలి
వెల్దుర్తి(తూప్రాన్): భార్య కాపురానికి రాకపోవడంతో పాటు అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన అల్లుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్ (32)కు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన పూజతో సుమారు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కూతురు ఉంది. వివాహం అయినప్పటినుంచి వేరుకాపురం పెట్టాలని భార్య, అత్తమామలు ఒత్తిడి తెచ్చారు.ఈ విషయంలో దంపతులిద్దరి మధ్య గొడవలు కావడంతో తరచూ కూతురును తీసుకొని పూజ తన పుట్టింటికి వెళ్లిపోయేది. ఈ క్రమంలోనే ఈ నెల 2న పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా అందరి సమక్షంలోనే తన కుమారుడిని దుర్భాషలాడి, పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని రెచ్చగొట్టారని ఆరోపించారు. పంచాయితీ అనంతరం పూజ కూతురుతో వెల్దుర్తిలో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది.ఈ క్రమంలో హరిప్రసాద్ ఈ నెల 18న వెల్దుర్తిలోని అత్తారింటిముందు పురుగులమందు తాగా డు. చుట్టుపక్కల వారి సాయంతో కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. తన కుమారుడి మృతికి అతని భార్య పూజ, అత్తమామలు వరలక్ష్మి, కిషన్లతో పాటు బంధువులు రామాంజనేయులు, కిరణ్, శ్రీవాణిలు కారణమంటూ మృతుడి తండ్రి మల్లేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ట్రెయినీ ఎస్ఐ తెలిపారు.
రోడ్డు లేక.. ఫోన్ సిగ్నల్ రాక..
ఉట్నూర్ రూరల్: రోడ్డు సౌకర్యం లేక, ఫోన్ సిగ్నల్స్ రాక ఓ గర్భిణి నరకయాతన అనుభవించింది. ప్రసవంకోసం ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా వాహనం సహకరించకపోవడంతో అతికష్టంగా తిరిగి గ్రామానికి చేరుకుని కవలలకు జన్మనిచి్చంది. అయితే పుట్టిన శిశువు తో ఆమె కూడా ప్రాణాలు వదిలింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉ ట్నూర్ మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కన్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధి రాజులమడుగు గ్రామానికి చెందిన గిరిజన మహిళ జంగుబాయి (37)కి సోమవారం ఉదయం పురిటి నొప్పులు మొదలయ్యాయి. రోడ్డు సౌకర్యం, మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆటోలో ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో ఆటో చెడిపోయింది. తిరిగి ఆ మహిళను గ్రామానికి తరలించారు. అప్పటికే నొప్పులు ఎక్కువై ఇద్దరు మగ శిశువులకు జన్మనిచి్చంది. ప్రసవ సమయంలో ఒక శిశువు ప్రాణాలతో ఉండగా మరో శిశువుతో పాటు తల్లి అస్వస్థతకు గురై మృతి చెందింది. ఘటనపై విచారణ జరిపిస్తామని అదనపు డీఎంహెచ్వో మనోహర్ తెలిపారు.
వీడియోలు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మృతి చెందినట్టు వార్తలు
Sudhakar Reddy: సుద్దపూస అని నిరూపించుకోవాలంటే నీకు దమ్ముంటే ఈ పని చెయ్
ఏం సమాధానం చెప్తావ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగిన జడ శ్రవణ్ కుమార్
మంత్రి సవిత ఇలాఖాలో విద్యార్థులకు పురుగుల భోజనం..
కోకాపేట, రాయదుర్గం ప్రాంతాల్లో భూములకు భారీ డిమాండ్
Hong Kong: భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి
బయటపడ H1B వీసా కుంభకోణం
రామలింగారెడ్డి కుటుంబసభ్యులతో మాట్లాడిన వైఎస్.జగన్
వాడుకున్న నీచుడు... లోకేష్, పవన్ పై సుగాలి ప్రీతీ తల్లి సంచలన వ్యాఖ్యలు
Varudu Kalyani: నాలుగు సార్లు సీఎంగా చేశావ్ ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా చంద్రబాబు..

