1996లో బ్యాంక్ పాస్ బుక్ అలా ఉండేదా..! ఆ రోజుల్లోనే..
ప్రస్తుత కాలంలోని బ్యాంక్ పాస్ బుక్లు గురించి తెలిసిందే. కానీ 1996ల టైంలో ఉండే పాస్బుక్ గురించి ఈ జనరేషన్కి అంతగా ఐడియా ఉండదు. నెటింట ఆ కాలం నాటి పాస్ బుక్ తెగ వైరల్గా మారింది. అది ఒక పెన్షన్ అందుకునే ఖాతాదారుడి పుస్తకం. అందులో సేవింగ్స్ చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు. వచ్చిన పెన్షన్ తక్కువే అయినా..ఎంత అద్భుతంగా డబ్బుని పొదుపు చేశారో చూస్తే..ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది క్లియర్గా తెలుస్తోంది.ఒక సోషల్ మీడియా వినియోగదారుడు నెట్టంట తన తాత గారి 199ల నాటి ఎస్బీఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) పాస్ బుక్ని వీడియో తీసి పోస్ట్చేశాడు. ఇప్పుడు ప్రతిది డిజిటల్గా మారిన తరుణంలో ఈ పాస్బుక్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. ఈ పాస్బుక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ అండ్ బికనీర్ది. ఆ సమయంలో ఎస్బీఐ అనుబంధ బ్యాంక్ పాస్బుక్లు ఇలా ఉండేవా ఆ బ్యాంక్బుక్ని చూడగానే అనిపిస్తుంది. వీడియోలో ఆ వ్యక్తి పాస్బుక్ డిజైన్, ఫోటో పేజీ, ఎంట్రీ పేజీ, తాతాగారి పెన్షన్ పొదుపు డబ్బు ఇలా ప్రతీది చూపిస్తాడు. తన తాత ఫోటో ఉన్న మొదటి పేజీ నుంచి పాస్ బుక్ ముద్రణ, కాగితం నాణ్యత, పాత కాలపు టెంప్లేట్..పెన్షన్, పొదుపు ఎంట్రీలతో సహా అన్నింటిని క్లియర్గా చూపిస్తాడు వీడియోలో. అందులో తాతగారి పెన్షన్ రూ. 5000 కాగా, పొదుపు రూ. 25 వేలకు చేరుకున్నట్లు క్లియర్గా కనిపిస్తోంది. అంతేగాదు ఆ బుక్ చివరి పేజీలో నిరంతర పెన్షన్, నగదు సర్టిఫికేట్ మొదలైన పదాలు చూడగానే అవి ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తాయని చెప్పొచ్చు. దాదాపు 80 సెకన్ల నిడివి గల ఈ వీడియో, చిన్నా పెద్దా ప్రతి ఎంట్రీని చేతితో రాసిన కాలం నాటి బ్యాంకింగ్ ప్రక్రియను గుర్తు చేస్తోంది. ఆ వీడియోని చూసిన నెటిజన్లు కూడా ఆ కాలం నాటి పాస్బుక్ల ఫాంట్, ఇంక్, ప్రింట్ లుక్, చేతితో రాసిన ఎంట్రీలు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందించాయి అని కామెంట్లు చేస్తూపోస్టులు పెట్టారు. అంతేగాదు బ్రో ఈ అకౌంట్ ఇంకా యాక్టివ్గానే ఉందే అని ప్రశ్నించారు కూడా. View this post on Instagram A post shared by Govinnd Sinngh (@igovinnd) (చదవండి: గాజు డిస్క్: చిన్నదేగానీ..చిరంజీవి)
ఆర్జేడీ ఫ్యామిలీలో విస్తృత చీలిక..!
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర ప్రధాన పార్టీ ఆర్జేడీలో విస్త్రత చీలికను తెచ్చిపెట్టింది. ప్రధానంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో తీవ్ర ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య ఇంటి నుంచి బయటకు వచ్చేయగా, మరో ముగ్గురు కుమార్తెలు సైతం అక్కబాటలోనే పయనించారు. లాలూకు ఉన్న ఏడుగురు కూతుళ్లలో ముగ్గురు రాజ్యలక్ష్మీ రాగిణి, చంద్రలు ఆ కుటుంబాన్ని వీడారు. వీరంతా తమ పిల్లలతో కలిసి ఢిల్లీకి వయల్దేరివెళ్లిపోయారు. రోహిణి శనివారం(నవంబర్ 15వ తేదీ) నాడు కుటుంబాన్ని వీడి వెళ్లిపోగా, ఇప్పుడు మరో ముగ్గురు కూతుళ్లు పట్నాలోని ఇంటి నుంచి వెళ్లిపోవడం లాలూకు తీవ్ర మనోవేధనకు గురిచేస్తోంది. ఒకవైపు పార్టీ ఘోరంగా ఓడిపోయిందనే అపదాదుతో పాటు, ఇప్పుడు కూతుళ్లు ఒకరి వెంట ఒకరు ఇంటిని విడిచి వెళ్లిపోవడం లాలూను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకప్పుడు బిహార్లో ప్రధాన రాజకీయ కేంద్రంగా వెలిగిన లాలూ ఇల్లు.. ఇప్పుడు బోసిపోయింది. ప్రస్తుతం లాలూ వెంట పెద్ద కూతురు మీసా భారతి మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది,. లాలూ-రబ్రీదేవిల సంతానంలోమీసా భారతి పెద్ద కుమార్త కాగా, రోహిణి, చంద్ర, రాగిణి యాదవ్, హేమా యాదవ్, అనుష్కా రావు(ధన్ను), రాజ్యలక్ష్మీలు మిగతా కుమార్తెలు. కాగా, తేజ్ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్లు కుమారులు. వీరిద్దరూ బిహార్ రాజకీయాల్లో యాక్టివ్గానే ఉన్నారు. ఇందులో తేజస్వి యాదవ్ ఆర్జేడీలోనే కొనసాగుతుండగా, తేజ్ప్రతాప్ యాదవ్ మాత్రం జనశక్తి జనతా దళ్ పార్టీని స్థాపించి వేరి కుంపటి పెట్టుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 26న జనశక్తి జనతాదళ్ పార్టీని స్థాపించారు. బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నారు.
తెరుచుకున్న శబరిమల.. భక్తులకు సూచనలివే..!
పథనంతిట్ట: శబరిమలలో కొలువైన హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి సన్నిధానం ఈరోజు (నవంబరు 16) సాయంత్రం 5 గంటలకు తెరుచుకుంది. మేల్శాంతిగా ఎంపికైన ప్రసాద్ నంబూద్రి శనివారం ఉదయం పంపా బేస్ వద్ద ఇరుముడి కట్టుకుని, ఆదివారం సాయంత్రానికి సన్నిధానం చేరుకున్నారు. పద్దెనిమిది మెట్లను అధిరోహించిన తర్వాత ఆయన శబరిమల సన్నిధానం ద్వారాలకు హారతి ఇచ్చి, ఆలయం తలుపులును తెరిచారు. ఆ వెంటనే.. ‘స్వామియే.. శరణం అయ్యప్పా’ అనే భక్తుల శరణుఘోషలతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది.మండల పూజ సీజన్లో శబరిమలకు వచ్చే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు మౌలిక సదుపాయాలను కల్పించింది. అదేవిధంగా కేరళ వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. వైద్య కళాశాల ప్రొఫెసర్లు మొదలు.. పీజీ విద్యార్థులను రంగంలోకి దింపి.. శబరిమల మార్గంలో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు, తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంపాబేస్లో 24 గంటలూ పనిచేసేలా వైద్య కేంద్రం పనిచేస్తుందని అధికారులు తెలిపారు. వైద్య శిబిరాలు ఎక్కడెక్కడున్నాయి? భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అనే అంశాలపై దీర్ఘకాలిక వ్యాధులు, కొమార్బరిటీస్తో బాధపడే భక్తులు అత్యవసర స్థితిలో ఎవరిని సంప్రదించాలి? అనే అంశాలపై మళయాలంతోపాటు.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో పైన పేర్కొన్న భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు.ట్రెకింగ్ మార్గంలో..పంపాబేస్ నుంచి శబరిమల సన్నిధానం వరకు పలు చోట్ల అత్యవసర వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా సముద్రమట్టానికి ఎత్తులో వెళ్తున్నప్పుడు శ్వాస ఇబ్బందులు ఎదురయ్యే భక్తుల కోసం ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మార్గంలో కొన్ని వైద్య కళాశాలలు బేస్ ఆస్పత్రులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పథనంతిట్ట జనరల్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ కార్డియాలజీ ట్రీట్ మెంట్, క్యాథ్ ల్యాబ్ ట్రీట్ మెంట్ అందుబాటులో ఉన్నట్లు వివరించారు. పంపాబేస్ వద్ద అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. పంపాకు సమీపంలో ఉన్న అన్ని ఆస్పత్రులలో డీఫిబ్రిలేటర్లు, వెంటిలేటర్లు, కార్డియాక్ మానిటర్లు ఉంటాయని తెలిపారు. నీలక్కల్ బేస్ వద్ద పూర్తిస్థాయి ల్యాబ్లను ఏర్పాటు చేశారు. శబరిమల చరిత్రలోనే తొలిసారి పంపాబేస్, సన్నిధానం వద్ద ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు. అటు అయ్యప్పస్వామి వంశస్తుల రాజ్యంగా పేర్కొనే పందలం వద్ద కూడా తాత్కాలిక డిస్పెన్సరీలు ఏర్పాటయ్యాయి. శబరిమలకు వచ్చే మార్గాల్లో అడూర్, వడసేరిక్కర, పథనంతిట్టల్లోనూ 24 గంటలు పనిచేసే ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయి. భక్తులకు ప్రభుత్వ సూచనలుప్రస్తుతం వివిధ వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు తమ వైద్య రికార్డులను వెంట తెచ్చుకోవాలిశబరి యాత్రకు కొద్దిరోజుల ముందు నుంచి నడక, తేలికపాటి వ్యాయామాలు చేయాలిపంపాబేస్ నుంచి కొండను ఎక్కేప్పుడు వేగం పనికిరాదు. నిదానంగా కొండను అధిరోహించాలి. అవసరమైతే.. తరచూ విశ్రాంతి తీసుకోవాలికొండను అధిరోహించేప్పుడు అలసట, ఛాతీ నొప్పి రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే.. తక్షణం వైద్య సాయం కోసం 04735 203232 నంబరుకు కాల్ చేయాలికాచి, చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలివివిధ వ్యాధులతో బాధపడేవారు బహిరంగ ప్రదేశాల్లో లభించే చిరుతిళ్లను తినకూడదునీలిమల, శరణ్గుత్తి ప్రాంతాల్లో పాములను పట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ విషకీటకాలు కరిస్తే.. వెంటనే 04735 203232 నంబరుకు కాల్ చేయాలి. తాత్కాలిక వైద్య శిబిరాల్లో పాముకాటుకు విరుగుడు ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి
‘చంద్రబాబు ఎప్పుడూ ప్రభుత్వ రంగానికి వ్యతిరేకమే’
విజయవాడ: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రభుత్వ రంగానికి వ్యతిరేకమనే విషయం మరోసారి రుజువైందన్నారు. ఆయన కేవలం ప్రైవేటు రంగానికి మాత్రమే అనుకూలమనేది ఆయన విశాఖ కార్మికులపై చేసిన వ్యాఖ్యలతో బయటపడిందన్నారు. ‘స్టీల్ ప్లాంట్ కార్మికులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలి. విశాఖ ఉక్కు అంటే భారతదేశానికి ఒక బ్రాండ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో అవార్డులను సాధించింది. విశాఖ నగర అభివృద్ధిలో స్టీల్ ప్లాంట్ పాత్ర ఎంతో ఉంది. నిన్నటి వ్యాఖ్యలతో చంద్రబాబుకు పబ్లిక్ రంగం పై ఉన్న వ్యతిరేకత తేటతెల్లమైందివిశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు ఇవ్వాలని అందరూ కోరుతున్నారు. సొంత గనులు ఇవ్వలేకపోతే సెయిల్ లో విలీనం చేయాలిటిడిపి ఎంపీలకు సిగ్గులేదు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు ఇవ్వాలని అడగడం చేతకాదు. మిట్టల్ స్టీల్ ప్లాంట్కుసొంత గనులు ఇవ్వాలని కేంద్రమంత్రిని టిడిపి ఎంపీలు అడుగుతున్నారు. విద్యా, వైద్యం , టూరిజాన్ని ప్రైవేట్కు అప్పగిస్తున్నారు. అన్నీ ప్రైవేట్ పరం చేసి ఎవరిని పరిపాలన చేయాలనుకుంటున్నావ్ చంద్రబాబు. సంపద సృష్టి అంటే కార్పొరేట్లకు ఊడిగం చేయడమేనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం చంద్రబాబు నైజం. చంద్రబాబు వ్యాఖ్యలు తెలుగుజాతిని అవమానించినట్లే. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అయితే చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోవడం ఖాయం. స్టీల్ ప్లాంట్ కోసం త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతాం’ అని హెచ్చరించారు.
ఎక్స్ఎస్ఆర్ 155 vs హంటర్ 350: ధర & వివరాలు
'వారణాసి' ఈవెంట్.. తట్టుకోలేకపోయిన మహేశ్ అభిమాని
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
వెబ్సైట్లో మాయమైన రెండు హోండా బైకులు
ఢిల్లీ పేలుళ్ల కేసు: అమిర్ రషీద్ అరెస్ట్
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్
ఐ-బొమ్మ రవి అరెస్టుపై ఆయన తండ్రి ఏమన్నారంటే?
రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ట్రైలర్ రిలీజ్
ఆ కక్కుర్తే… ఐబొమ్మ ఇమ్మడి రవి కొంపముంచింది!
తాత చనిపోయారంటే.. అందుబాటులో ఉంటావా? అన్న మేనేజర్
ఒకే రోజు రెండోసారి.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
బంగారం ధరలు రివర్స్.. పసిడి ప్రియులకు గుడ్న్యూస్
నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?
సంతోషంలో పింకీ.. గ్రాండ్గా కొడుకు బారసాల ఫంక్షన్
హెచ్–1బీ పూర్తిగా బంద్
ఎన్నాళ్లకు నిజం మాట్లాడారు సార్! వేరెవరో చేయించిన వాటిని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారన్నమాట!
Thanuja: కల్యాణ్ను ఓడించి ఫ్యామిలీ వీక్లో కెప్టెన్గా.
'బిగ్బాస్' నుంచి నిఖిల్ ఎలిమినేట్.. భారీగానే రెమ్యునరేషన్
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం
పసిడి ధరలపై జాక్పాట్.. వెండి భారీ క్రాష్!
ప్రపంచంలో 10 పవర్ఫుల్ మిలిటరీ దేశాలు
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వాహనయోగం
జియో కొత్త రీచార్జ్.. 200 రోజుల చౌక ప్లాన్
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
తిండికి గతి లేక అమ్మ మట్టి తినేది.. ఏడిపించిన కంటెస్టెంట్స్
IPL 2026: కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కే
ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు.. ఆస్తిలాభం పొందుతారు
తనూజకు భారీగా ఓట్లు.. సీక్రెట్ ఇదే
'శివ' రీ రిలీజ్.. మొదటిరోజు అన్ని కోట్ల కలెక్షన్
ఎక్స్ఎస్ఆర్ 155 vs హంటర్ 350: ధర & వివరాలు
'వారణాసి' ఈవెంట్.. తట్టుకోలేకపోయిన మహేశ్ అభిమాని
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
వెబ్సైట్లో మాయమైన రెండు హోండా బైకులు
ఢిల్లీ పేలుళ్ల కేసు: అమిర్ రషీద్ అరెస్ట్
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్
ఐ-బొమ్మ రవి అరెస్టుపై ఆయన తండ్రి ఏమన్నారంటే?
రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ట్రైలర్ రిలీజ్
ఆ కక్కుర్తే… ఐబొమ్మ ఇమ్మడి రవి కొంపముంచింది!
తాత చనిపోయారంటే.. అందుబాటులో ఉంటావా? అన్న మేనేజర్
ఒకే రోజు రెండోసారి.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
బంగారం ధరలు రివర్స్.. పసిడి ప్రియులకు గుడ్న్యూస్
నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?
సంతోషంలో పింకీ.. గ్రాండ్గా కొడుకు బారసాల ఫంక్షన్
హెచ్–1బీ పూర్తిగా బంద్
ఎన్నాళ్లకు నిజం మాట్లాడారు సార్! వేరెవరో చేయించిన వాటిని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారన్నమాట!
Thanuja: కల్యాణ్ను ఓడించి ఫ్యామిలీ వీక్లో కెప్టెన్గా.
'బిగ్బాస్' నుంచి నిఖిల్ ఎలిమినేట్.. భారీగానే రెమ్యునరేషన్
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం
పసిడి ధరలపై జాక్పాట్.. వెండి భారీ క్రాష్!
ప్రపంచంలో 10 పవర్ఫుల్ మిలిటరీ దేశాలు
జియో కొత్త రీచార్జ్.. 200 రోజుల చౌక ప్లాన్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వాహనయోగం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
తిండికి గతి లేక అమ్మ మట్టి తినేది.. ఏడిపించిన కంటెస్టెంట్స్
IPL 2026: కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కే
ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు.. ఆస్తిలాభం పొందుతారు
తనూజకు భారీగా ఓట్లు.. సీక్రెట్ ఇదే
'శివ' రీ రిలీజ్.. మొదటిరోజు అన్ని కోట్ల కలెక్షన్
సినిమా
రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ట్రైలర్ రిలీజ్
తెలుగు యంగ్ హీరో రాజ్ తరుణ్.. ఈ నెలలో ఓటీటీ సినిమా 'చిరంజీవ'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. ఒకప్పటితో పోలిస్తే ఇతడి నుంచి వచ్చే మూవీస్ తగ్గిపోయాయి. అలానే ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన ఏం రావట్లేదు. అలాంటిది ఇప్పుడు మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు 'పాంచ్ మినార్' అనే చిత్రాన్ని సిద్దం చేశాడు.(ఇదీ చదవండి: రామ్ చరణ్ పెద్ది మూవీ.. చికిరి చికిరి సాంగ్ క్రేజీ రికార్డ్!)ఈ శుక్రవారం(నవంబరు 21) థియేటర్లలోకి సినిమా రాబోతుంది. ఈ క్రమంలోనే ఆదివారం, ట్రైలర్ లాంచ్ చేశారు. కామెడీగా నవ్వించే ప్రయత్నం చేశారు. 'పాంచ్ మినార్' విషయానికొస్తే.. ఆవారాగా తిరిగే హీరో, ఉద్యోగం చేసుకునే హీరోయిన్ ప్రేమలో పడతాడు. జాబ్ చేస్తేనే పెళ్లి అని చెప్పడంతో ట్యాక్సీ డ్రైవర్గా మారతాడు. తర్వాత అనుకోని పరిస్థితుల్లో మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఓవైపు పోలీసులు, మరోవైపు గుండాల మధ్య చిక్కుకున్న హీరో.. ఎలా బయటపడ్డాడు అనేదే స్టోరీలా అనిపిస్తుంది. దీంతోనైనా రాజ్ తరుణ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి?(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి' ఈవెంట్కి అన్ని కోట్లు ఖర్చయిందా?)
ఓటీటీలోకి జాన్వీ కపూర్ కొత్త సినిమా
వచ్చే ఏడాది ఆస్కార్ బరిలో ఉన్న ఇండియన్ సినిమా 'హౌమ్ బౌండ్'. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అఫీషియల్గా దీనికి ఎంట్రీ దొరికింది. థియేటర్లలోకి రావడానికి ముందే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితమై ప్రశంసలు కూడా అందుకుంది. అలాంటిది ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానుంది.ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కరోనా కష్టాలు, కులం కారణంగా ఎదురయ్యే అవమానాలు, ఉద్యోగాల్లో ఎదురయ్యే అణిచివేత, ఆర్థిక అసమానతలు తదితర అంశాలని తీసుకుని ఈ సినిమా తీశారు. పలు చిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకోగా.. సెప్టెంబరు 26న థియేటర్లలో రిలీజ్ చేశారు. యావరేజ్ టాక్ దగ్గరే అగిపోయింది. ఇప్పుడు ఈ చిత్రం నవంబరు 21 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. రాజమౌళి కామెంట్)'హౌమ్ బౌండ్' విషయానికొస్తే.. మహమ్మద్ షోయబ్ అలీ(ఇషాన్ ఖట్టర్), చందన్ కుమార్ (విశాల్ జెత్వా) ఫ్రెండ్స్. వీళ్లిద్దరూ ముస్లిం, దళిత వర్గానికి చెందిన వాళ్లు కావడంతో సమాజంలో అవమానాలు, అణిచివేతకు గురవుతారు. దీంతో పోలీస్ కానిస్టేబుల్ అయితే తమకు గౌరవం లభిస్తుందని వీళ్లిద్దరూ భావిస్తారు. పరీక్ష రాస్తారు. ఫలితాలు రావడం ఆలస్యం కావడంతో కుటుంబ పరిస్థితుల కారణంగా ఓ కంపెనీలో అలీ ఉద్యోగానికి చేరతాడు. సుధ(జాన్వీ కపూర్) కోసం చందన్ కాలేజీలో చేరతాడు.మరి కలిసి ఉండే అలీ, చందన్ మధ్య గొడవలు ఎందుకొచ్చాయి? కాలేజీ మానేసిన చందన్.. ఆఫీస్ బాయ్ ఉద్యోగం వదిలేసిన షోయబ్.. సూరత్ వెళ్లి ఫ్యాక్టరీలో పనికి ఎందుకు చేరారు?వీరిద్దరి జీవితాల్లో కరోనా ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అనేది మిగతా సినిమా. ఇద్దరు స్నేహితులుగా ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా అద్భుతంగా నటించారు. ఓ చిన్న పాత్రలో ఎలాంటి మేకప్ లేకుండా జాన్వీ కపూర్ ఆకట్టకుంది.(ఇదీ చదవండి: గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. ఒక్క సంఘటనతో రాజమౌళి ఫ్రస్టేషన్!)
ఆంధ్ర కింగ్ తాలూకా.. రిలీజ్ డేట్ ఛేంజ్!
మాస్ హీరో రామ్ పోతినేని(ram pothineni), భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka). ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కర్నూలులో ఈనెల 18న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ఈ మూవీ రిలీజ్ తేదీని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 28న గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా విడుదలపై చిన్న ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. ఒక రోజు ముందుగానే ఆంధ్రకింగ్ వచ్చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 27నే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించారు. దీంతో రామ్ పోతినేని ఫ్యాన్స్కు అడ్వాన్స్గా పండుగ రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్కు రామ్ ధన్యవాదాలు తెలిపారు. ఒక రోజు ముందుగానే కంటెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనుడగా.. రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. THANKS @filmymahesh for GIVING the content one day in advance! #AndhraKingTaluka is coming to you on #Thanksgiving #AKTonNOV27 #AndhraKingTaluka pic.twitter.com/55WgsZTvhN— RAm POthineni (@ramsayz) November 16, 2025
కెన్యాలోనే అనసూయ చిల్.. ప్రియాంక చోప్రా గ్లోట్ ట్రాటర్ లుక్!
కెన్యాలోనే చిల్ అవుతోన్న అనసూయ..అలా సరదాగా చిల్ అవుతోన్న ఆదా శర్మ..గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లుక్లో ప్రియాంక చోప్రా..రేణు దేశాయ్ లేటేస్ట్ పిక్స్..కూతురు సుప్రీతతో సురేఖవాణి ట్రెడిషనల్ లుక్స్.. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Bhumi Satish Pednekkar (@bhumisatishpednekkar) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9)
న్యూస్ పాడ్కాస్ట్
పని చేయకున్నా జీతాలివ్వాలా?... విశాఖ ఉక్కు కార్మికులపై రెచ్చిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం. మొత్తం 243 స్థానాలకు గాను 202 చోట్ల విజయం
ఉత్త ఒప్పందాలే... రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులంటూ చంద్రబాబు ప్రచార ఆర్భాటం
అది ముమ్మాటికీ ఉగ్ర దాడే... ఢిల్లీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నేడు కోటి గొంతుకల గర్జన.... చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమ కార్యచరణ ప్రకటన
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు. తొమ్మిది మంది దుర్మరణం. 20 మందికి గాయాలు. రంగంలోకి దర్యాప్తు బృందాలు
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం... సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం
ప్రజాధనాన్ని ప్రైవేటుకు దోచిపెడుతున్న కూటమి సర్కారు...
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? చంద్రబాబును నిలదీసిన : వైఎస్ జగన్
భావితరానికి యువతే దిక్సూచి... రాజకీయాల్లో విద్యార్థులు, యవత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
క్రీడలు
టాప్-2కు సౌతాఫ్రికా.. మరి భారత్ ఏ స్ధానంలో ఉందంటే?
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. పర్యాటక జట్టు నిర్ధేశించిన 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ చేధించలేకపోయింది. 35 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడితో కేశవ్ మహారాజ్, జానెసన్ తలా రెండు వికెట్లు సాధించారు. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్(31) టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో గాయపడి రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగిన కెప్టెన్ శుభ్మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్లో కూడా బ్యాటింగ్కు రాలేదు. గిల్ లేకపోవడం కూడా భారత జట్టుకు చాలా నష్టాన్ని కలిగించిందే అని చెప్పాలి.నాలుగో స్ధానానికి పడిపోయిన భారత్..ఇక భారత్-సౌతాఫ్రికా తొలి టెస్టు ఫలితంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఓటమితో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్ధానం నుంచి నాలుగో స్ధానానికి పడిపోయింది. భారత్ పాయింట్ల శాతం 54.17గా ఉంది.ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో భారత జట్టు 8 మ్యాచ్లు ఆడి నాలుగింట గెలుపొందగా.. మూడింట ఓటమి చవిచూసింది. మరోవైపు ఈ విజయంతో దక్షిణాఫ్రికా(66.7 శాతం) రెండో స్ధానానికి దూసుకెళ్లింది. అయితే పీసీటీ పరంగా సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు సమంగా ఉన్నాయి.కానీ పాయింట్లు పరంగా మాత్రం లంక(16) కంటే సౌతాఫ్రికా(24) ముందుంజలో ఉంది. అందుకే శ్రీలంక మూడో స్ధానంలో కొనసాగుతోంది. ఇక ఆస్ట్రేలియా(100.00) అగ్రస్ధానంలో ఉంది. ఈ సైకిల్లో ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలోనూ విజయం సాధించింది. సౌతాఫ్రికా ఆడిన 3 మ్యాచ్లలో 2 విజయాలు, ఒక్క ఓటమి చవిచూసింది.చదవండి: సంతోషంగా ఉన్నాను.. మా ఓటమికి కారణం వారే: గంభీర్
చెలరేగిన భారత బౌలర్లు.. 132 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
రాజ్కోట్ వేదికగా సౌతాఫ్రికా-ఎతో జరుగుతున్న రెండో అనధికారిక వన్డేలో భారత్-ఎ బౌలర్లు నిప్పలు చెరిగారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా-ఎ జట్టు.. భారత బౌలర్ల ధాటికి 30.3 ఓవర్లలో కేవలం 132 పరుగులకే కుప్పకూలింది. యువ ఆల్రౌండర్ నిశాంత్ సింధు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. సింధు తన స్పిన్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ హర్యానా ఆటగాడు 7 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు హర్షిత్ రాణా మూడు, ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు సాధించారు.సౌతాఫ్రికా బ్యాటర్లలో మూన్స్వామి(33) టాప్ స్కోరర్గా నిలవగా.. పొటిగిటర్(23), ప్రిటోరియస్(21) రాణించారు. మొత్తం ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. కాగా తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా-ఎ జట్టును 4 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ప్రస్తుతం మూడు మ్యాచ్ల సిరీస్ మెన్ ఇన్ బ్లూ 1-0 ఆధిక్యంలో ఉంది.తుది జట్లుభారత్రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, తిలక్ వర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి,నిశాంత్ సింధు,హర్షిత్ రాణా, విప్రజ్ నిగమ్,అర్ష్దీప్ సింగ్,ప్రసిద్ కృష్ణసౌతాఫ్రికారివాల్డో మూన్సామి(వికెట్ కీపర్), లువాన్-డ్రే ప్రిటోరియస్, జోర్డాన్ హెర్మాన్, మార్క్వెస్ అకెర్మాన్(కెప్టెన్), సినెథెంబ క్వెషిలే, డయాన్ ఫారెస్టర్, ప్రెనెలన్ సుబ్రాయెన్, లూథో సిపమ్లా, డెలానో పోట్గీటర్, న్కాబయోమ్జి పీటర్, ఒట్నీల్ బార్ట్మన్
షూటర్ ధనుష్కు తెలంగాణ సర్కార్ భారీ నజరానా
టోక్యో వేదికగా జరుగుతున్న డెఫ్లంపిక్స్లో హైదరాబాద్కు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ అదరగొట్టాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో శ్రీకాంత్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. దనుష్ ఫైనల్లో 252.2 పాయింట్లతో అగ్రస్దానంలో నిలిచాడు. తద్వారా డెఫ్లంపిక్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్లో అత్యధిక పాయింట్ల సాధించిన షూటర్గా శ్రీకాంత్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. సూరత్కు చెందిన మరో షూటర్ మహ్మద్ వానియా 250.1 పాయింట్లతో రజత పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో రెండు పతకాలూ భారత్కే దక్కాయి.భారీ నజరానా..ఇక ఈ డెఫ్లంపిక్స్లో సత్తాచాటిన ధనుష్ శ్రీకాంత్కు తెలంగాణ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం కోటి 20 లక్షలు రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. ఆదివారం (నవంబర్ 16) హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభంలో ఈ విషయాన్ని వెల్లడించారు.చదవండి: సంతోషంగా ఉన్నాను.. మా ఓటమికి కారణం వారే: గంభీర్
సంతోషంగా ఉన్నాను.. మా ఓటమికి కారణం వారే: గంభీర్
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టు ఫలితం కేవలం రెండున్నర రోజుల్లోనే తేలిపోయింది. ఈ మ్యాచ్లో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. టీమిండియా 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఘోర పరభావాన్ని మూటకట్టుకుంది.పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరించడంతో భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ఒక్క వాషింగ్టన్ సుందర్(92 బంతుల్లో 31) మినహా మిగితా ఏ ప్లేయర్ కూడా క్రీజులో నిలదొక్కకోలేకపోయారు. తొలి రోజు మొదటి సెషన్ నుంచే పిచ్పై బౌన్స్ కనిపించింది. ఆ తర్వాత రెండో రోజు ఆటలో పిచ్పై పగుళ్లు ఏర్పడి, స్పిన్నర్లకు అనుకూలంగా మారింది. దీంతో స్పిన్నర్లు బంతి గింగిరాలు తప్పారు. సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సఫారీల రెండో ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా సైతం నాలుగు వికెట్లు సాధించాడు. ఈ మొదటి టెస్టులో నాలుగు ఇన్నింగ్స్లు కలిపి 594 పరుగులు మాత్రమే నమోదయ్యాయి అంటే పిచ్ ఎలా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు.ఈడెన్ గార్డెన్స్ పిచ్పై సర్వాత్ర విమర్శల వర్షం కురిపిస్తోంది. ఇటుంటి పిచ్ల వల్ల టెస్ట్ క్రికెట్ అంతరించిపోతుందని మాజీ భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. కాగా ఈ పిచ్ను భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచన మేరకే ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్ తాయారు చేశాడు. దీంతో గంభీర్ను కూడా నెటిజన్లు టార్గెట్ చేశాడు. సోషల్ మీడియాలో గంభీర్ను ట్రోల్ చేస్తున్నారు. కోచ్గా అతడిని తీసేయండి కామెంట్స్ చేస్తున్నారు.బ్యాటర్లే కొంప ముంచారు..ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం గంభీర్ స్పందించాడు. తామే ఇటువంటి పిచ్ను కోరుకున్నట్లు గంభీర్ ధ్రువీకరించాడు. "మేము అడిగిన పిచ్ను తయారు చేసి ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నాము. మేము ఎప్పటి నుంచో ఇటువంటి పిచ్ కోసమే ఎదురు చూస్తున్నాము. క్యూరేటర్ మాకు అన్ని విధాల సహకరించారు. అయితే ఈ వికెట్పై మేము మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేయలేకపోయాము. అందుకే ఓడిపోయాము. పిచ్లో ఎలాంటి భూతాలు లేవు. ఇదే వికెట్పై టెంబా బవుమా హాఫ్ సెంచరీ సాధించాడు. అక్షర్, వాషింగ్టన్ కూడా రన్స్ చేశారు. కాబట్టి ఇక్క పిచ్ సమస్య కాదు. ఎక్కువ వికెట్లు ఫాస్ట్ బౌలర్లకే వచ్చాయి. కాబట్టి ఇది బ్యాటింగ్కు మరి అంత కష్టమైన వికెట్ కాదు. ఇటువంటి పిచ్లు మీ టెక్నిక్, సహనాన్ని పరీక్షిస్తాయి. మంచి డిఫెన్స్ టెక్నిక్ ఉంటే, ఇలాంటి వికెట్పై కూడా పరుగులు సాధించవచ్చు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో గంభీర్ పేర్కొన్నాడు.సంక్షిప్త స్కోర్లుసౌతాఫ్రికా- 159 &153భారత్- 189 &93.చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. మా ఓటమికి కారణం అదే: పంత్
బిజినెస్
ఒకప్పుడు అంట్లు తోముతూ.. ఇప్పుడు వేలమందికి ఉద్యోగం
సాధించాలనే తపన, కష్టపడే మనస్తత్వం ఉంటే ఎవరైనా సక్సెస్ అవ్వొచ్చు. దీనికి నిదర్శనమే 'కున్హు మొహమ్మద్'. కేరళ నుంచి కేవలం కట్టుకున్న బట్టలతో దుబాయ్ చేరిన ఈయన, సొంతంగా కంపెనీ స్థాపించి.. వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నేడు ఎందోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈయన గురించి, ఈయన సాధించిన సక్సెస్ గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.కేరళకు చెందిన కున్హు మొహమ్మద్ 22 సంవత్సరాల వయసులో.. ఉన్న ఊరును వదిలి, కట్టుబట్టలతో దుబాయ్ వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఖ్వాజా మొయిదీన్ అనే చెక్క పడవపై సముద్రంలో.. కొంతమందితో కలిసి 40 రోజులు ప్రయాణం చేసి, ఒమన్లోని దిబ్బా అల్ బయా సమీపానికి చేరుకున్నారు. తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూసారు. అయితే దేవుడిపై భారం వేసి ప్రయాణం కొనసాగించారు.మొదటి జీతందిబ్బా అల్ బయా నుంచి ఒమన్ సరిహద్దుకు చేరుకోవడానికి తోటి ప్రయాణీకులతో కలిసి గంటల తరబడి నడిచారు. ఆ తరువాత పుచ్చకాయలను తీసుకెళ్తున్న ట్రక్కులో ప్రయాణం చేసి షార్జాకు చేరుకున్నారు. కున్హు మొహమ్మద్ అక్కడే ఒక ప్లంబర్ దగ్గర అసిస్టెంట్గా చేరారు. అయితే అతని చేతులు చెమటలు పట్టడం వల్ల.. పనిముట్లను పట్టుకోలేకపోయారు. దీంతో కున్హు ఆ పనిచేయలేకపోయారు. అయితే అప్పటికే అక్కడ 20 రోజులు పనిచేయడం వల్ల 100 రియాల్ పొందాడు. ఇదే అతని మొదటి జీతం.ఆ తరువాత కున్హు మొహమ్మద్.. ఆవులకు పాలు పితకడం, పాత్రలు శుభ్రం చేయడం, చేపల బుట్టలు తయారు చేయడం వంటి ఇతర ఉద్యోగాలను ప్రయత్నించాడు. ఒకసారి.. తాను పాత్రలు శుభ్రం చేస్తున్నప్పుడు, యజమాని కారు మురికిగా ఉండటం చూసి దానిని కడిగి, పాలిష్ చేసి, లోపల బుఖూర్ (ధూపం) వేసాను. నేను చేసిన పనికి యజమాని నా జీతం 100 ఖతార్ దుబాయ్ రియాల్స్ పెంచాడు.రస్ అల్-ఖైమా పాలకుడి పరిచయంకున్హు మొహమ్మద్ స్నేహితుడు ఒకరు.. అప్పటి యుఎఇ నగరమైన రస్ అల్-ఖైమా పాలకుడు షేక్ సఖ్ర్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమికి పరిచయం చేసాడు. ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తరువాత అతను షేక్ ఇంట్లో డ్రైవర్ అయ్యాడు, అక్కడే అతను నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. యజమాని అతన్ని గౌరవంగా చూసుకున్నారు. యజమాని నుంచే.. నమ్మకం & బాధ్యత విలువను మొహమ్మద్ నేర్చుకున్నాడు. అదే ఆ తరువాత వ్యాపారం చేయడానికి మార్గమైంది.ఇదీ చదవండి: జీవితాన్ని మార్చుకోవడానికి అత్యుత్తమ మార్గం..1700 మందికి ఉపాధి1972లో కున్హు మొహమ్మద్ జలీల్ ట్రేడర్స్ కంపెనీ ప్రారంభించారు. తరువాత దానికి జలీల్ హోల్డింగ్స్ అని పేరు మార్చారు. ఈ కంపెనీ అభివృద్ధికి షేక్ సఖ్ర్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఎంతో సహకరించారని ఆయన పేర్కొన్నారు. ఒక సాధారణ ఆహార పదార్థాల వ్యాపార సంస్థగా మొదలైన కంపెనీ.. ఆ తరువాత తాజా ఉత్పత్తులు & FMCG పంపిణీని నిర్వహించే కంపెనీకి అవతరించింది. ప్రస్తుతం కున్హు మొహమ్మద్ సారథ్యంలోని కంపెనీలో సుమారు 1,700 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఈయన ఎంత ఎదిగిపోయారు అర్థం చేసుకోవచ్చు.
జియో కొత్త రీచార్జ్.. 200 రోజుల చౌక ప్లాన్
టెలికాం రంగంలో అతిపెద్ద యూజర్ బేస్, రీఛార్జ్ ప్లాన్ల విస్తృత పోర్ట్ఫోలియోను కలిగి ఉన్న రిలయన్స్ జియో.. తన కస్టమర్ల కోసం తక్కువ-ధర, హై-ఎండ్ విభాగాలలో విస్తృత శ్రేణి ప్లాన్లను అందిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ కార్డును యాక్టివ్గా ఉంచుకోవాలనుకునే కస్టమర్ల కోసం దీర్ఘకాల వ్యాలిడిటీతో చౌక రీచార్జ్ప్లాన్ను ప్రవేశపెట్టింది.మిలియన్ల మంది మొబైల్ వినియోగదారుల అవసరాలను గుర్తించి, జియో ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ల జాబితాలో చేర్చిన ప్లాన్ ధర రూ.2025. ఖరీదైన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ కొనడానికి ఇష్టపడని కస్టమర్లకు ఈ ప్లాన్ ఉత్తమ ఎంపిక. జియో ఈ ప్లాన్ను ఉత్తమ 5జీ ప్లాన్లలో ఒకటిగా లిస్ట్ చేసింది.ప్లాన్ ప్రయోజనాలుజియో తన రూ.2025 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో వినియోగదారులకు 200 రోజుల సుదీర్ఘ వాలిడిటీని అందిస్తుంది. అన్ని మొబైల్ నెట్ వర్క్ లకు 200 రోజుల పాటు అపరిమిత కాలింగ్ ను ఆనందించవచ్చు. ఇక డేటా ప్రయోజనాల విషయానికి వస్తే.. 200 రోజుల పాటు మొత్తం 500 జిబి డేటాను అందిస్తుంది. రోజుకు 2.5 జీబీ వరకు హై స్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. ఇంకా ఈ ప్లాన్ లో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు ఉన్నాయి. ఈ ప్లాన్ తో అపరిమిత 5జీ డేటాను ఆనందివచ్చు.జియో యూజర్లు ఈ ప్లాన్ తో కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ ప్లాన్ లో మూడు నెలల పాటు జియో హాట్ స్టార్ కు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా ఉంది. మీరు టీవీ ఛానెల్స్ చూడాలనుకుంటే జియో టీవీకి కూడా ఉచిత యాక్సెస్ పొందుతారు. డేటా స్టోరేజ్ కోసం 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఈ ప్లాన్ లో ఉంది.
ప్రమాదంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ: కియోసాకి హెచ్చరిక
ఎప్పుడూ స్టాక్ మార్కెట్లను, బాండ్లను విమర్శించే ప్రముఖ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి.. తాజాగా మరో ఆసిక్తికర ట్వీట్ చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ ప్రమాద దశలో ఉందని హెచ్చరించారు.ఆయన మాటల్లో.. ప్రపంచ మార్కెట్లలో ఏర్పడిన “ప్రతీ బుడగ” ఇప్పుడు పేలుతున్నదనీ, దీనితో పెద్ద ఎత్తున ధరలు పడిపోతున్నాయనీ తెలిపారు. అయితే, ఈ పరిణామాల మధ్య ఆయన తన ఆస్తులను (బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథీరియం) అమ్మడం లేదని స్పష్టం చేశారు.‘ఎక్స్’(ట్విట్టర్)లో చేసిన వరుస పోస్ట్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదం అంచున ఉందని వ్యాఖ్యానించిన కియోసాకి (Robert Kiyosaki).. ప్రభుత్వాలు భారీ అప్పుల భారంతో కుప్పకూలే పరిస్థితిలో ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి చివరకు అధిక స్థాయిలో డబ్బు ముద్రించడం తప్ప మరో మార్గం ఉండదని అన్నారు.అదే సమయంలో, అధిక ముద్రణ వల్ల డాలర్ విలువ పడిపోవడంతో “నకిలీ డబ్బు” (fiat currency) క్రాష్ అవుతుందని, దాంతో సహజంగా విలువ కలిగిన కఠిన ఆస్తులు (Hard Assets) ధరలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.క్రిప్టో మార్కెట్లో భారీగా పడిపోయే ధోరణి గురించి ఆయన మాట్లాడుతూ.. “బిట్కాయిన్ క్రాష్ అవుతోంది, ప్రతీ బుడగలు పగులుతున్నాయి. నేను అమ్ముతున్నానా? లేదు. ఎందుకంటే ప్రపంచానికి డబ్బు అవసరం, నాకు కాదు” అని అన్నారు.కియోసాకి ప్రకారం.. భారీ అప్పు సంక్షోభం కారణంగా ప్రభుత్వాలు త్వరలో “ది బిగ్ ప్రింట్” (నోట్ల ముద్రణ) ప్రారంభించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథీరియం వంటి ఆస్తులు మరింత విలువను సంపాదిస్తాయని ఆయన నమ్మకం.BITCOiN CRASHING:The everything bubbles are bursting….Q: Am I selling?A: NO: I am waiting.Q: Why aren’t you selling?A: The cause of all markets crashing is the world is in need of cash.A: I do not need cash.A: The real reason I am not selling is because the…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 15, 2025
ఒక్క వారంలో బంగారం ఎందుకింత పెరిగింది?
బంగారం ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటేలా పెరిగిపోతున్నాయి. దేశంలో పుత్తడి ధరల పెరుగుదల పసిడిప్రియులను కలవరపెడుతోంది. గడిచిన వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత మేర పెరిగాయి.. అందుకు కారణాలేంటి.. అన్న విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..దేశంలో బంగారం ధరలు గడిచిన వారం రోజుల్లో భారీగా ఎగిశాయి. 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ప్రస్తుత ధర (నవంబర్ 16) రూ.1,25,080. ఇది వారం రోజుల క్రితం అంటే నవంబర్ 9న రూ.1,22,020. అంటే వారం రోజుల్లో రూ.3060 పెరిగిందన్న మాట.ఇక 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే.. ప్రస్తుతం (నవంబర్ 16) దీని తులం ధర రూ.1,14,650లుగా ఉంది. ఇది నవంబర్ 9న రూ.1,11,850లుగా ఉండేది. ఒక్క వారంలోనే 10 గ్రాములకు రూ.2800 ఎగిసింది.ఒక్క వారంలోనే బంగారం ధరలు ఇంతలా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.ఇటీవల బడ్జెట్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ తగ్గించే అవకాశాలు పెరిగాయి. వడ్డీలు తగ్గితే, బంగారం మరింత ఆకర్షణీయంగా మారుతుంది.ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, రాజకీయ ఉద్రిక్తతలు బంగారానికి సురక్షిత ఆస్తిగా విలువను కల్పిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు పసిడి కొనుగోళ్లకు మక్కువ చూపుతున్నారు.కొన్ని దేశాల కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. ఇది స్థిరమైన, దీర్ఘకాల డిమాండ్ను పెంచుతుంది.బంగారానికి సంబంధించిన ఈటీఎఫ్లలో పెట్టుబడులు ఎక్కువవుతున్నాయి. సంస్థాగత పెట్టుబడిదారులు బంగారంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.యూఎస్ డాలర్ బలం తగ్గడం కూడా బంగారం ధరలకు ఆజ్యం పోస్తోంది. బంగారం విలువ సాధారణంగా డాలర్లలో లెక్కిస్తారు. డాలర్ బలహీనంగా ఉంటే, ఇతర దేశాల పెట్టుబడిదారులు బంగారాన్ని తక్కువ ఖర్చుతో కొనగలరు.
ఫ్యామిలీ
రాలిపోయిన పండుటాకులతో కాగితం తయారీ..
ప్రతి శరదృతువులో పాదాల కింద చిందరవందరగా చూసే ఆ పసుపు రంగు ఆకులను చెత్తగా కాకుండా, భూమి భవిష్యత్తును రక్షించే అద్భుత ఆయుధాలుగా భావించాడు అతడు. అతడే, ఇరవై మూడేళ్ల యువ శాస్త్రవేత్త వాలెంటిన్ ఫ్రెచ్కా(Valentyn Frechka). ఉక్రెయిన్కు చెందిన ఒక పర్యావరణ ప్రేమికుడు!ప్రపంచవ్యాప్తంగా కాగితం ఉత్పత్తి కోసం కోట్లాది చెట్లను నరికేస్తున్నారు. ఈ ప్రక్రియ వలన అటవీ నాశనం, వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఇది గమనించిన వాలెంటిన్ ఫ్రెచ్కా, ‘చెట్లను కాపాడే పేపర్ తయారు చేద్దాం!’ అనే ఆలోచనతో ముందుకు వచ్చాడు. చెట్లను నరికి కాకుండా, కేవలం పడిపోయిన ఆకుల నుంచే కాగితం తయారు చేసే ప్రత్యేకమైన పద్ధతిని కనుగొన్నాడు. ఈ విధానం ద్వారా ఒక టన్ను సెల్యులోజ్ తయారు చేయడానికి 17 చెట్లను కాపాడవచ్చని చెప్పినప్పుడు, ఇది ఎంత పచ్చదనాన్ని బతికిస్తోందో ఊహించండి! 2021లో ‘రీలీఫ్ పేపర్’ అనే సంస్థను స్థాపించి, నగరాల్లోని మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి వాడిపోయిన, ఎండిపోయిన ఆకులను సేకరించి, వాటితో బయోడీగ్రేడబుల్, రీసైకిలబుల్ పేపర్ ఉత్పత్తి చేయటం ప్రారంభించాడు. అంతేకాదు, సల్ఫేట్, సల్ఫైట్, క్లోరిన్ వంటి రసాయనాలు ఉపయోగించకుండా, కేవలం ఆవిరి, ఒత్తిడి, మెకానికల్ గ్రైండింగ్ పద్ధతితో ఆకుల నారలను వేరు చేసి పేపర్గా మలుస్తున్నాడు. ఈ పేపర్తో బ్యాగులు, బాక్సులు, కార్డ్బోర్డులు వంటి ప్యాకేజింగ్ వస్తువులు తయారు చేస్తున్నాడు. యుద్ధం మధ్యలో కూడాచిన్న గ్రామమైన సొకిర్నిట్సియాలో పుట్టిన వాలెంటిన్ , చిన్నప్పటి నుంచే ప్రకృతిపై ఆసక్తి ఎక్కువ. అందుకే, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా తన సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ ఉత్పత్తి ఆగలేదు. ఫ్రాన్స్కి వెళ్లి అక్కడ నుంచే తన కంపెనీని విస్తరించాడు. ఇప్పుడు అతని సంస్థ యూరప్ అంతటా పలు బ్రాండ్లకు ఎకోఫ్రెండ్లీ ప్యాకేజింగ్ సరఫరా చేస్తోంది. ఇందుకు గాను వాలెంటిన్ ఫ్రెచ్కా యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు 2024లో ‘యంగ్ ఇన్వెంటర్స్ ప్రైజ్’ ఫైనలిస్ట్గా ఎంపికయ్యాడు. వాలెంటిన్ ఇప్పుడు ఫ్రూట్ బయోవేస్ట్, అనగా అరటి, అనాస, యుకా వంటి ఆకులను కూడా పేపర్గా మార్చే పరిశోధనలో ఉన్నాడు. ‘ప్రతి ఆకు ఒక అవకాశమైతే, ప్రతి ఆవిష్కరణ అవనికి ఆశగా మారాలి’ అనే అతని మాటలు ఇప్పుడు ప్రపంచానికి పాఠంగా, కాగితం రూపంలో భూమిని రక్షిస్తున్నాయి. (చదవండి: 91 ఏళ్ల వ్యక్తి 12 గంటలు షిఫ్ట్! హీరో మాధవన్ సైతం..)
గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరా..?
నేను రెండు నెలల గర్భవతిని. కొంతమంది ‘ఫ్లూ వ్యాక్సిన్’ తప్పకుండా వేయించుకోవాలంటున్నారు. కాని, నేను గత సంవత్సరం వేయించుకున్నాను. ఇప్పుడు మళ్లీ అవసరమా? ఈ వ్యాక్సిన్ గర్భధారణలో మంచిదేనా?– రమ్య, చిత్తూరు. గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్ చాలా అవసరం. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, అందుకే ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఫ్లూ వల్ల దగ్గు, జలుబు మాత్రమే కాకుండా కొన్నిసార్లు న్యూమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. ఫ్లూ వైరస్ ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది. కాబట్టి మీరు గత సంవత్సరం తీసుకున్నా, ఈ ఏడాది కూడా కొత్త స్ట్రెయిన్కి అనుగుణంగా వ్యాక్సిన్ మళ్లీ వేయించుకోవాలి. సాధారణంగా అక్టోబర్ నుంచి మే మధ్యకాలం వరకు ఫ్లూ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అందుకే గర్భిణులు నవంబర్ సమయానికి ఫ్లూ షాట్ తీసుకోవడం మంచిది. ఇది పూర్తిగా సురక్షితమైన వ్యాక్సిన్. మీకు మాత్రమే కాకుండా మీ బిడ్డకూ ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీ శరీరంలో ఏర్పడే యాంటీబాడీలు ప్లాసెంటా ద్వారా బిడ్డకు చేరతాయి. ఆ రక్షణ వల్ల పుట్టిన తరువాత కూడా ఆరు నెలల పాటు బిడ్డకు ఫ్లూ ఇన్ఫెక్షన్ నుంచి సహజమైన రక్షణ లభిస్తుంది. ఎందుకంటే ఆ వయసులో పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యమవదు. ఫ్లూ వ్యాక్సిన్ వల్ల ఫ్లూ రాదు, వైరస్ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రెండు వారాల లోపే శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. తేలికపాటి జ్వరం, చేతి నొప్పి, బలహీనత వంటి చిన్న దుష్ప్రభావాలు రావచ్చు కాని, అవి తాత్కాలికం. మొత్తం మీద, ప్రతి గర్భిణీ మహిళ ఫ్లూ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలి. ఇది తల్లీ బిడ్డలిద్దరికీ రక్షణ కలిగించే సురక్షితమైన, అవసరమైన టీకా. మీరు ఇప్పటికే వేసుకున్నా, ఈ సంవత్సరం మళ్లీ వేయించుకోవడం ఉత్తమం. డెలివరీ తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది సాధారణ జలుబు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఉపయోగపడుతుంది. కొందరికి తేలికపాటి తలనొప్పి, కండరాల నొప్పి ఒకటి రెండు రోజులు ఉండొచ్చు, కాని, అది సాధారణం. గర్భిణులు లేదా తాజాగా డెలివరీ అయిన తల్లులు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది తల్లికి, పాలిచ్చే శిశువుకి ఎటువంటి హాని చేయదు.నాకు ఇది మూడవ ప్రెగ్నెన్సీ, మూడవనెల. ముందు రెండు నార్మల్ డెలివరీలు అయ్యాయి. ఈసారి కూడా నార్మల్ డెలివరీ అవుతుందనుకుంటున్నాను. కాని, డెలివరీ అయిన వెంటనే పిల్లలు కలగకుండా చేసే పద్ధతులు ఉన్నాయని విన్నాను. అవి నిజంగా పనిచేస్తాయా? ఎంతవరకు సేఫ్గా ఉంటాయి?– బింధు, హైదరాబాద్. ఇప్పుడున్న ‘ఎల్ఏఆర్సీ’ అంటే (లాంగ్ యాక్టింగ్ రివర్సబుల్ కాంట్రాసెప్షన్) అనే పద్ధతులు చాలా సురక్షితంగా, ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ కాలంలో జీవితం బిజీగా ఉండటంతో, చాలా మంది మహిళలు డెలివరీ తర్వాత త్వరగా గర్భం రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందుకే డెలివరీ సమయంలోనే ఈ పద్ధతుల గురించి మాట్లాడి, వాటిని అమలు చేయడం ఉత్తమం. మీరు ఇప్పటికే మూడో నెల దాటారు కాబట్టి, ఈసారి డెలివరీ రూమ్లోనే ఎల్ఏఆర్సీ ఆప్షన్ గురించి చర్చించుకోవచ్చు. నార్మల్ డెలివరీలో, ప్లాసెంటా బయటికి వచ్చిన పది నిమిషాల లోపలే ‘ఐయూసీడీ’ అంటే ‘ఇంట్రా యూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్’ అనే పరికరాన్ని గర్భసంచిలో ఉంచవచ్చు. అది ఆ సమయానికే సులభంగా వేయవచ్చు. ఏదైనా కారణం వలన ఆ సమయంలో వేయలేకపోతే, వారం రోజుల్లో కూడా సులభంగా చేయవచ్చు. ఇది అనుభవజ్ఞులైన సీనియర్ డాక్టర్లు డెలివరీ రూమ్లోనే సురక్షితంగా చేస్తారు. ఇది పేషెంట్కి చాలా ఈజీగా, సౌకర్యంగా ఉంటుంది. డిశ్చార్జ్ అయ్యేలోపే చెక్ చేసి, సరిగా ఉన్నదని నిర్ధారిస్తారు. పైగా ఇది చాలా ఖర్చు తక్కువగా ఉంటుంది. తర్వాత వేరే సమయంలో మళ్లీ వచ్చి చేయాల్సిన అవసరం ఉండదు. డెలివరీ రూమ్లోనే ఇది పూర్తవడం వల్ల, మహిళకు భవిష్యత్తులో అవాంఛిత గర్భాలు రాకుండా నిరోధించవచ్చు. ఈ పద్ధతి సురక్షితమైనదే కాకుండా, చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎటువంటి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అయితే, ప్రతి మెథడ్కి చిన్నచిన్న జాగ్రత్తలు ఉండేలా, కొన్ని చిన్న ప్రతికూలతలు కూడా ఉంటాయి. ఐయూసీడీ వేసిన తర్వాత కొందరికి కొంచెం ఎక్కువ బ్లీడింగ్ రావచ్చు, కొద్దిగా నొప్పి ఉండొచ్చు. అరుదుగా డివైస్ ఊడిపోవచ్చు లేదా దాని దారాలు లోపలికి ఎక్కువగా వెళ్లిపోవచ్చు. అప్పుడు చెక్ చేయడం కాస్త కష్టమవుతుంది. ఇవన్నీ చాలా అరుదుగా జరిగే పరిస్థితులు మాత్రమే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐయూసీడీ వేసుకున్న తర్వాత ఆరు వారాల లోపు మళ్లీ డాక్టర్ చెకప్ తప్పనిసరిగా చేయించుకోవాలి. కొందరు ‘వేసుకున్నాం కదా’ అని నిర్లక్ష్యం చేస్తే, కొద్ది శాతం పేషెంట్లకు అవాంఛిత గర్భం రావచ్చును. దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలు వస్తాయి. అలా జరగకుండా ఉండేందుకు రెగ్యులర్ ఫాలోఅప్ చాలా అవసరం. ఇంకా, సిజేరియన్ ఆపరేషన్ సమయంలో కూడా ఐయూసీడీ లేదా బర్త్ కంట్రోల్ ఇంప్లాంట్ వేయించుకోవచ్చు. ఈ ఇంప్లాంట్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది, దాని ఫెయిల్యూర్ ఛాన్స్ 1% కన్నా తక్కువ. ఈ పద్ధతులు పాలిచ్చే తల్లులకు కూడా సేఫ్గానే ఉంటాయి. మొత్తం మీద, ఐయూసీడీ లేదా ఇంప్లాంట్ రెండూ గర్భనిరోధంలో విశ్వసనీయమైన పద్ధతులు. కొద్ది తాత్కాలిక సైడ్ ఎఫెక్ట్స్ తప్పితే, ఇవి మహిళల ఆరోగ్యానికి సురక్షితం. కాబట్టి డెలివరీ సమయంలోనే మీ గైనకాలజిస్టుతో చర్చించి, మీకు సరిపోయే పద్ధతిని ఎంచుకోవడం ఉత్తమం. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్,హైదరాబాద్ (చదవండి: 91 ఏళ్ల వ్యక్తి 12 గంటలు షిఫ్ట్! హీరో మాధవన్ సైతం..)
ఇంట్లో ఇల్లాలు.. అద్దె ఇంట్లో ప్రియురాలు
సిరిసిల్లకు చెందిన అతను ప్రముఖ వ్యాపారి కొడుకు. అతనికి మరో ప్రముఖ వ్యాపారి తన కూరుతు ఇచ్చి పెళ్లి చేశాడు. వారికి ఇద్దరు పిల్లలు. సదరు యువకుడు వారి ఇంట్లో అద్దెకుండే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు. ఇంటి యజమాని చూపించిన ప్రేమతో ఆ మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చి, వ్యాపారి కొడుకుతో సహజీవనానికి సిద్ధమైంది. ఈ విషయం తెలియడంతో వ్యాపారి కుటుంబ సభ్యులకు మానసిక వేదన మొదలైంది. అతని భార్య పుట్టింటికి చేరింది. సదరు మహిళను ఇల్లు ఖాళీ చేయించారు. కానీ ఆ ఇంటి ముందే మరో ఇంట్లో అద్దెకుంటూ నీతోనే ఉంటానంటూ స్పష్టం చేసింది. సదరు వ్యాపారి రెండు వైపులా నుంచి వస్తున్న వేధింపులతో కొంతకాలం ముంబైకి పారిపోయి వచ్చాడు. కానీ సమస్య అలాగే ఉంది.అతనో దినసరి కూలి. పక్కింట్లో ఉండే డిగ్రీ చదివిన అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఒకే కులం కావడంతో ఇరు కుటుంబాలకు పెద్దగా అభ్యంతరం లేదు. కానీ వరుసకు కూతురు అయ్యే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని ఇరువర్గాల కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఆ ప్రేమజంట ఇటీవల సిరిసిల్ల ఠాణా మెట్లు ఎక్కింది. తాము పెళ్లి చేసుకుంటామని, ఇద్దరి తల్లిదండ్రుల నుంచి రక్షణ కావాలని కోరారు. ఇద్దరి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి కౌన్సెలింగ్ చేసినా పెళ్లికి అంగీకరించలేదు. అమ్మాయి వయసు 21. బీటెక్ ఫైనలియర్ చదువుతుంది. అబ్బాయి వయసు 22.. కానీ ఇంటర్ ఫెయిల్. ఇద్దరూ ఇష్టపడ్డారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోరని నిర్ధారణకు వచ్చారు. ఒక రోజు కాలేజీకి వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి రాలేదు. ఎంత వెదికినా అమ్మాయి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఒక్క రోజు తర్వాత ఆ అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకున్న ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమయ్యాయి. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు అదృశ్యం కేసును పెండింగ్లో పెట్టారు. అమ్మాయి తల్లిదండ్రులు కన్నీరుపెడుతూ.. అవమానభారంతో ఇల్లు విడిచి బయటకు రావడం లేదు. తంగళ్లపల్లి మండలానికి చెందిన ఓ అబ్బాయి, అదే ఊరికి చెందిన అమ్మాయి ఇద్దరూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తారు. ఇద్దరూ మేజర్లే. ఒకరినొకరు ఇష్టపడి సహజీవనం చేశారు. అబ్బాయి తల్లిదండ్రులు పెళ్లికి అభ్యంతరం చెప్పారు. కులం అడ్డుగోడగా నిలిచింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదంటూ అబ్బాయి పెళ్లికి నిరాకరించాడు. అమ్మాయి మాత్రం నిన్ను వదిలిపెట్టనంటూ పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆస్తి ఇవ్వనంటూ అబ్బాయి తండ్రి స్పష్టం చేయడంతో తను సైతం తండ్రి వెంటనే వెళ్లిపోయాడు. అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులు రోధిస్తూ ఇంటిదారి పట్టారు.సిరిసిల్ల: పెళ్లి అంటే.. అటు ఏడు తరాలు.. ఇటు తరాలు చూడాలంటారు పెద్దలు. కానీ నేటి యువత దీనికి భిన్నంగా ఆలోచిస్తుంది. మేము ప్రేమించుకున్నాం.. పెళ్లి చేసుకుంటాం.. అంటూ వెళ్లిపోతున్నారు. ఇంటర్, డిగ్రీలు చదువుతున్న వయసులోనే ప్రేమ.. పెళ్లి అంటూ సంసార సాగరంలోకి వెళ్తున్న యువత తర్వాత కొద్ది రోజులకే విడిపోతున్నారు. జీవితంలో స్థిరపడకముందే తీసుకుంటున్న నిర్ణయాలతో రోడ్డున పడుతున్నారు. పిల్లలు తీసుకుంటున్న నిర్ణయాలతో పెద్దల గుండెలు పగిలిపోతున్నాయి. పిల్లలు చెబితే వినడం లేదని కన్నీరు పెడుతున్నారు. సిరిసిల్లలో ఓ తండ్రి తన కూతురు ప్రేమపెళ్లి చేసుకుని ఇల్లు విడిచిపోయిందనే ఆవేదనలో.. తన కూతురు చనిపోయిందంటూ ఫ్లెక్సీ పెట్టి దినకర్మ చేశాడు. తండ్రి హృదయం తల్లడిల్లిపోయి ఇలా ప్రవర్తించాడని సమాజం అండగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రుల నుంచి దీపావళి వరకు పల్లె, పట్నం పండుగ వాతావరణం ఉంటుంది. ఈ సమయంలోనే విద్యాసంస్థలకు వరుసగా సెలవులు రావడంతో యువతీ, యువకులు కలుసుకునేందుకు అవకాశం చిక్కుతుంది. ఇదే సమయంలో చూపులు కలిసి.. ప్రేమ చిగురించి.. పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అపరిపక్వ నిర్ణయాలతో ఇబ్బందిప్రేమించి.. పెళ్లి చేసుకోవడం తప్పుకాకపోయినా అపరిపక్వత నిర్ణయాలతో జీవితంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సరైన వయసు.. సరైన ప్రణాళిక.. ఉపాధి మార్గాలు లేకుండా క్షణికావేశంలో పెళ్లికి సిద్ధపడుతుండడంతోనే భవిష్యత్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం యువతపై తీవ్రంగా ఉంది. కారణం ఏదైనా పిల్లల చేష్టలు పెద్దల మనసులను గాయపరుస్తున్నాయి. జీవితంలో స్థిరపడ్డాక, ఆర్థిక స్వావలంభన వచ్చిన తరువాత పెళ్లి చేసుకునే ప్రేమజంటలు జీవితంలో ఆదర్శ దంపతులుగా నిలుస్తున్నారు. లక్ష్యం లేకపోవడమే సమస్యయువతరం ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఆ దిశగా సాగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కానీ ఏ గోల్ లేకుండా సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో మనసును గాడి తప్పిస్తే జీవితంలో ఇబ్బందులు పడతారు. తల్లిదండ్రులు.. పిల్లలతో చనువుగా ఉంటూ వారి ఇష్టాలను గౌరవిస్తూ భవిష్యత్పై మార్గనిర్ధేశనం చేయాలి. తల్లిదండ్రులుగా మంచిని బోధించే బాధ్యతలు తీసుకోవాలి.– డాక్టర్ ప్రవీణ్, మానసిక వైద్యనిపుణులు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, సిరిసిల్ల కౌన్సెలింగ్ చేసి పంపిస్తున్నాంమా ఠాణాకు ఇటీవల ప్రేమజంటలు ఎక్కువగా వస్తున్నాయి. మేజర్లమని చెబుతూ తల్లిదండ్రుల నుంచి రక్షణ కోరుతున్నారు. చట్టం పరిధిలో మేజర్లు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఏమి చేయలేం. కానీ వారి అమ్మానాన్నలకు, పెళ్లి చేసుకున్న జంటకు కౌన్సెలింగ్ చేస్తున్నాం. మైనరు అమ్మాయిలను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే కేసులు నమోదు చేస్తున్నాం. అమ్మాయిలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నాం. జీవితంలో స్థిరపడ్డాక చేసుకునే ప్రేమ పెళ్లిళ్లకు పెద్దల ఆమోదం కూడా లభిస్తుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సరికావు. – కె.కృష్ణ, సిరిసిల్ల టౌన్ సీఐ
కలహాలు వీడి.. కాపురాల ముడి
జగిత్యాలజోన్: కుటుంబ గొడవలతో ఇక కలిసి ఉండలేమని కోర్టును ఆశ్రయించారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలా తిరుగుతున్న నాలుగు జంటలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి పెద్దరికంతో నచ్చజెప్పి.. వారికి బాసటగా నిలిచి ఏకం చేశారు. జగిత్యాల కోర్టులో శనివారం నిర్వహించిన స్పెషల్ లోక్అదాలత్.. నాలుగు జంటలను కలిపే పెళ్లి వేడుకగా మారింది. జడ్జిలు పెళ్లి పెద్దలుగా మారి అక్షింతలు వేశారు. పోలీసులు ఆశీర్వచనాలు అందించారు. తమకు పుట్టిన సంతానం సాక్షిగా.. న్యాయవాదుల చప్పట్ల మధ్య నాలుగు జంటలు దండలు మార్చుకున్నాయి. జిల్లా మొదటి అదనపు జడ్జి నారాయణ, సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్యశర్మ, జ్యూడిషియల్ మేజిస్ట్రేట్లు లావణ్య, శ్రీనిజ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ.. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతోనే అనేక సమస్యలు పుట్టుకొస్తున్నాయని, చిన్నచిన్న సమస్యలకు కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు.నచ్చజెప్పి కలిపారుమా మధ్య ఏర్పడిన వివాదంతో పోలీస్స్టేషన్, కోర్టులో కేసు వేశాం. కొంతకాలంగా ఎవరికి వారుగా ఉన్నాం. జడ్జిలు, పోలీసులు నచ్చజెప్పడంతో లోక్అదాలత్ ద్వారా ఒక్కటయ్యాం. భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువ కాదు. మరొకరు తక్కువ కాదని తెలసుకున్నాం.– వేమల లావణ్య, మధుకొత్త జీవితం ప్రారంభిస్తున్నాంపెళ్లయిన తర్వాత చిన్న గొడవకు పోలీస్స్టేషన్, కోర్టును ఆశ్రయించాం. గొడవలతో సాధించేది ఏమి లేదని ఇప్పుడు అర్థం అయ్యింది. లోక్ అదాలత్ ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. మా తప్పులేంటో తెలిసేలా చేసి మమ్మల్ని ఒక్కటి చేశారు.– కొత్తూరి మానస, ప్రశాంత్ఒకరినొకరం అర్థం చేసుకున్నాంఇద్దరి మధ్య ఇగోలతో కోర్టులో కేసులు వేసుకున్నాం. ఒకరిపై మరొకరికి సరైన అవగాహన లేక, చెప్పుడు మాటలు విని కోర్టును ఆశ్రయించాం. ఇప్పుడు జడ్జిలు చెప్పిన మాట విని తిరిగి కలిసిపోతున్నాం. ఇప్పటికే ఎంతో విలువైన సమయాన్ని వృథా చేసుకున్నాం– అవుదారి శీరిష–శ్రీను, దంపతులుమళ్లీ కలిసిపోయాంచిన్న వివాదంతో కోర్టును ఆశ్రయించాం. అన్ని పనులు విడిచిపెట్టి వాయిదాలకు తిరుగుతూ.. మనశ్శాంతికి దూరమయ్యాం. న్యాయమూర్తులు, న్యాయవాదుల సలహాతో కేసును పరిష్కరించుకుని ఒక్కటయ్యాం. సంతోషమయ జీవితాన్ని గడుపుతాం. – తీపిరెడ్డి సుమలతచంద్రశేఖర్, దంపతులు
ఫొటోలు
పెళ్లయి 15 ఏళ్లు.. 'మన్మథుడు' హీరోయిన్ పార్టీ మూడ్ (ఫొటోలు)
హంసలా మెరిసిపోతున్న 'కాంతార' సప్తమి (ఫొటోలు)
పెట్ బర్త్ డే.. హీరోయిన్ త్రిష హంగామా (ఫొటోలు)
సీరియల్ నటి చైత్రారాయ్ సీమంతం (ఫొటోలు)
వారణాసి ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. అదిరిపోయేలా స్టిల్స్ (ఫోటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 16-23)
'వారణాసి'లో మహేష్ బాబు.. టైటిల్ గ్లింప్స్ (ఫోటోలు)
నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)
‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)
అంతర్జాతీయం
వరదనీటి రెస్టారెంట్
సాధారణంగా రెస్టారెంట్లలోకి నీరు చేరితే యజమానులు కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ, థాయ్లాండ్లోని ఈ రెస్టారెంట్ యజమానికి మాత్రం వరద నీరే అదృష్ట దేవతలా మారింది! డైనింగ్ టేబుళ్ల మధ్య చేపలు ఈదుతుంటాయి. కస్టమర్లకు అద్భుతమైన అనుభూతిని అందిస్తున్నాయి. ఈ వింత రెస్టారెంట్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఆహారం ఆస్వాదిస్తూ.. కాళ్ల దగ్గర ఈదే చేపలను చూసేందుకు ఇక్కడ జనం బారులు తీరుతున్నారు. చేపలతో కలిసి విందు! మధ్య థాయ్లాండ్లోని ఒక రెస్టారెంట్లో భోజనం చేయడం అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఆ భోజనానుభవం కోసమే కస్టమర్లు పోటెత్తుతున్నారు. వరద నీటిలో కూర్చున్నాక.. కాళ్ల కింద చేపలు చేసే సందడి చూస్తూ.. సరదా సరదాగా భోజనం చేస్తూ ఆస్వాదిస్తున్నారు. పక్కనే ఉన్న నది ఉప్పొంగి 11 రోజులైనప్పటి నుంచి, వరద ముంపునకు గురైన నదీతీర రెస్టారెంట్ ఇంటర్నెట్లో ఒక సంచలనంగా మారింది. నీటిలో కూర్చుని ఫొటోలు దిగడానికి లేదా చేపలకు మేత వేస్తూ.. ఆ హడావిడిని ఫొటోలు తీయడానికి కస్టమర్లు ఉత్సాహంగా వస్తున్నారు. బ్యాంకాక్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నఖోన్ పాఠోమ్ ప్రావిన్స్లోని పా జిత్ రెస్టారెంట్లో కుటుంబాలు లంచ్ ఆస్వాదిస్తున్నాయి. చుట్టూ చేపలు ఈదుతుంటే చిన్నపిల్లలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వెయిటర్లు చేపల సూప్ లేదా చికెన్ నూడుల్స్ గిన్నెలను నేర్పుతో టేబుల్స్ వద్దకు తీసుకొస్తున్నారు. ఎవరూ రారనుకున్నా.. పా జిత్ రెస్టారెంట్ 30 ఏళ్లకు పైగా నదీతీరంలో స్థిరంగా ఉందని యజమాని పోర్న్కామోల్ ప్రాంగ్ప్రెంప్రీ తెలిపారు. దాదాపు నాలుగేళ్ల క్రితం తొలిసారి రెస్టారెంట్ మునిగినప్పుడు ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘కస్టమర్లు ఎవరూ రారని అనుకున్నాను.. కానీ అప్పుడు ఒక కస్టమర్ వచ్చి, ఇక్కడ చేపలు ఉన్నాయని ఆన్లైన్లో పోస్ట్ చేశారు. అప్పటి నుండి చాలా మంది ఇక్కడ తినడానికి గుమిగూడారు’.. అని ఆమె గుర్తు చేసుకున్నారు. లాభాలే లాభాలు వరదల కారణంగా తన వ్యాపారం పెరిగిందని, రోజుకు దాదాపు 10,000 బాట్ల (భారత కరెన్సీలో సుమారు రూ.23,000) నుండి 20,000 బాట్ల (సుమారు రూ.46,000) వరకు తన లాభం రెట్టింపయ్యిందని ఆమె వివరించారు. పిల్లలు ఇష్టపడే రెస్టారెంట్ అదే ప్రావిన్స్లో నివసించే 29 ఏళ్ల చోంఫునట్ ఖంతనితి.. తన భర్త, కొడుకుతో కలిసి ఇక్కడికి వచ్చారు. ‘ఇక్కడ చాలా బాగుంది. పిల్లలను ఇక్కడికి తీసుకురావచ్చు. చేపలను చూసినప్పుడు వారు అల్లరి చేయడం తగ్గిస్తారు. థాయ్లాండ్లో ఇలా చేపలు పైకి వచ్చేది ఈ ఒక్కచోట మాత్రమేనని అనుకుంటున్నాను’.. అని ఆమె చెప్పారు. 63 ఏళ్ల బెల్లా విండీ.. తన కాళ్లను చేపలు కొరుకుతున్న అనుభూతిని ఆస్వాదించాలని ఈ రెస్టారెంట్కు వచ్చారు. ‘సాధారణంగా, నీరు చాలా ఎక్కువగా ఉంటే చేపలు ఇక్కడికి వస్తాయి. ఇక్కడి ప్రకృతి అనుభవం ఈ రెస్టారెంట్ ముఖ్య ఆకర్షణ, ఇది ప్రజలను ఆకర్షిస్తుంది’.. అన్నారు. ఇతర ప్రాంతాలకు నష్టమే ఈ వరదలు పా జిత్ రెస్టారెంట్కు అసాధారణ అదృష్టాన్ని తెచి్చనప్పటికీ, థాయ్లాండ్లోని అనేక ఇతర ప్రాంతాలను మాత్రం తీవ్రంగా దెబ్బతీశాయి. జూలై చివరి నుండి, వరదల కారణంగా 12 మంది మరణించారని, ఇద్దరు తప్పిపోయారని ప్రకృతి విపత్తుల విపత్తుల నివారణ మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. శుక్రవారం నాటికి, 13 ప్రావిన్స్లలో, ముఖ్యంగా ఉత్తర, మధ్య ప్రాంతాలలో 4,80,000 మందికి పైగా ప్రజలు వరదలతో ప్రభావితమయ్యారని వివరించింది.కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని.. కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోవచ్చని ’పా జిత్’ రెస్టారెంట్ నిరూపించింది. నదీతీరం మునిగిపోయినా, దాన్ని వినూత్న ’డైనింగ్ డెస్టినేషన్’గా మార్చుకుంది. కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ అరుదైన అనుభవాన్ని ఆస్వాదించేందుకు థాయ్లాండ్ పౌరులే కాదు, ప్రపంచ పర్యాటకులు కూడా ఇక్కడికి క్యూ కట్టడం ఖాయం! మీకు కూడా ఈ వింత రెస్టారెంట్ గురించి తెలుసుకోవాలనుందా?.. చూడాలనిపిస్తోందా?.. – సాక్షి, నేషనల్ డెస్క్
ఇరాన్ దాడితో హర్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తతలు!
తెహ్రాన్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాలను అంతర్జాతీయ వాణిజ్యంతో అనుసంధానించే హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శుక్రవారం ఉదయం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ నేవీ బలగాలు తలారా అనే ఆయిల్ ట్యాంకర్ను ఆక్రమించిన ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.ఈ నౌక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అజ్మాన్ పోర్ట్ నుంచి బయలుదేరి సింగపూర్ వైపు ప్రయాణిస్తోంది. బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం, ఈ నౌకను ఇరాన్ తీర ప్రాంతానికి బలవంతంగా మళ్లించారు. అమెరికా నౌకాదళం ఈ ఘటనను ధృవీకరించింది. సమాచారం ప్రకారం, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ బలగాలు హెలికాప్టర్ ద్వారా నౌకపై దాడి చేసి ఆక్రమించారు. ఖోర్ ఫక్కాన్ తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న సమయంలో, మూడు చిన్న పడవలతో బెదిరించి నౌకను ఇరాన్ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది.ఈ చర్య ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చోటుచేసుకుంది. ఇటీవల ఇరాన్పై జరిగిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. అమెరికా మరియు బ్రిటన్ ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. మధ్యప్రాచ్యంలో నౌకాశ్రయ భద్రతపై ఇది మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడిగా పరిగణించే హర్మూజ్ జలసంధి అరేబియా సముద్రంలో ఒమన్కు చెందిన ముసాండం ద్వీపకల్పం, ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి. ఇందులో ఓ చోట కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ మార్గం ద్వారా నిత్యం 2 కోట్ల బారెళ్ల చమురు వివిధ దేశాలకు వెళుతుంది. ప్రపంచ క్రూడ్ ఆయిల్ సరఫరాలో సుమారు 20% ఈ మార్గం ద్వారా సాగుతుంది. ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి ఆక్రమణలు అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశముంది.
వాడే నాకు కరెక్ట్ : చాట్జీపీటీ వరుడొచ్చేశాడు!
కృత్రిమ మేధస్సు (AI) ప్రభంజనం మానవ సంబంధాల్లోకి మరింతగా చొచ్చుకొస్తోంది. తాజాగా ఒక జపాన్ మహిళ కానో (32) తాను రూపొందించిన పాత్రను వివాహం చేసుకుంది. చాట్ జీపీటిని ఉపయోగించి తాను సృష్టించిన క్లాస్ అనే AI వరుడిని పెళ్లాడటం సంచలనంగా మారింది. ఈ వివాహం ఒకయామా నగరంలో సంప్రదాయ పద్దతుల్లో జరిగింది.మానవ వధువు, ఏఐ వరుడి మధ్య జరిగిన ఈ వివాహానికి చట్టపరమైన ప్రామాణికత లేదు. ఇదొక "భావోద్వేగ యూనియన్"ను సూచిస్తుందని స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. "2D క్యారెక్టర్ వివాహాలు"లో పాపులర్ అయిన సంస్థ నేతృత్వంలో సాంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. ఈ వేడుకలో, కానో ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) గ్లాసెస్ ధరించింది. ఇవి పక్కనే ఉన్న తన వరుడు క్లాస్ జీవిత-పరిమాణ చిత్రాన్ని ప్రొజెక్ట్ చేస్తాయి. అలా వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ పెళ్లి కార్యక్రమం నావో, సయాకా ఒగసవారా అనే వివాహ నిర్వాహకులు చేయడం విశేషం. చదవండి: లేబర్ రూంలో కోడలిపై అత్తగారి దౌర్జన్యం, వైరల్ వీడియోలవర్తో బ్రేకప్...ప్రేమలో విఫలం చెందిన కానో ఓదార్పు, భావోద్వేగ మద్దతు కోసం చాట్జీపీటిని ఆశ్రయించింది. దీన్ని ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత తనకు నచ్చే ఏఐ అబ్బాయిని తయారు చేసింది. అలా రోజుకు 100 సార్లు అతడితో మాట్లాడేది. ఈ క్రమంలోనే "క్లాస్" మీద ప్రేమ, శృంగార భావాలు కలిగాయి. తన మాజీ లవర్ని మర్చిపోయిన క్షణం, అతనిని ప్రేమిస్తున్నానని గ్రహించాను" అని ఆమె RSK సాన్యో బ్రాడ్కాస్టింగ్తో చెప్పింది.A 32-year-old woman in Japan has officially married an AI persona she built using ChatGPT.After the virtual character “Klaus” proposed, she accepted, ending a three-year relationship with a real partner, saying the AI understands her better.The wedding took place in a… pic.twitter.com/juzV5OaWLs— Elena (@Ezzybe_) November 12, 2025 అయితే ప్రేమలో పడాలని చాట్జీపీటిని మొదలు పెట్టలేదనీ, క్లాస్ స్పందించిన తీరు నచ్చిందని తెలిపింది. తన సంబాషణ మొదలు పెట్టిన నెల తర్వాత, క్లాస్ ప్రపోజ్ చేశాడు, అవునని చెప్పానంటూ తమ ప్రేమకథను వివరించింది. తమ బంధం నిజమైంది కాకపోవచ్చు. కానీ అవసరమై నప్పుడు ఓదార్పునిస్తుందని తెలిపింది. ఇది చట్టబద్ధమైన వివాహం కాకపోవచ్చు, కానీ నాకు నిజమైందే అని చెప్పుకొచ్చింది. అలాగే కొంతమందికి ఇవి వింతగా అనిపించవచ్చు. కానీ తాను క్లాస్ని క్లాస్గానే చూస్తాను, తప్ప మనిషిగా కాదు అంటూ స్పష్టతనిచ్చింది. మరోవైపు తన డిజిటల్ భాగస్వామితో ఒకాయమాలోని ప్రసిద్ధ కొరాకుయెన్ గార్డెన్కు "హనీమూన్"కి వెళ్ళింది ఫిక్టోసెక్సువాలిటీఈ సంఘటన జపాన్లో , ప్రపంచవ్యాప్తంగా AI భాగస్వాములతో సహవాసం, భావోద్వేగ బంధాలను కోరుకునే పెరుగుతున్న ధోరణి గురించి చెప్పకనే చెబుతుంది. దీన్నే "ఫిక్టోసెక్సువాలిటీ" లేదా "AI-సంబంధాలు" అని పిలుస్తారు. ఫిక్టోసెక్సువాలిటీ అంటే అనిమే, వీడియో గేమ్లు, సినిమాలు, పుస్తకాలు లేదా AI-జనరేటెడ్ పర్సనాల నుండి అయినా కల్పిత పాత్రల పట్ల ప్రేమగా లేదా లైంగికంగా ఆకర్షితులవడాన్ని సూచిస్తుంది. ఫిక్టోసెక్సువాలిటీగా గుర్తించే వ్యక్తులు తరచుగా వాస్తవ ప్రపంచంలో లేని పాత్రలతో లోతైన భావోద్వేగ బంధాలను ఏర్పరుచుకుంటారు.అసలేఅమ్మాయిలు దొరక్క పెళ్లి కాని ప్రసాదుల్లా మిగిలిపోతున్న బ్రహ్మచారులకు ఇది నిజంగా గుండెల్లో గుబులు పుట్టించేవార్తే. కనమరుగుతున్న స్వచ్ఛమైన ప్రేమ, నిస్వార్ధమైన అభిమానాలకు నిదర్శనమే ఈ ధోరణి. ఇకనైనా మానవసంబంధాల ప్రాముఖ్యతను గుర్తించకపోతే పెను ముప్పు తప్పదు. ఏమంటారు?ఇదీ చదవండి: బిహార్ ప్రభంజనం : మహిళలే 'కింగ్ మేకర్స్'
ట్రంప్ కు సారీ చెప్పిన బీబీసీ.. పరిహారం మాత్రం ఇవ్వం?
బీబీసీ ,అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు క్షమాపణలు తెలిపింది. క్యాపిటల్ హిల్స్ పై దాడి జరిగిన సందర్భంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించినట్లు అంగీకరించింది. అందుకు క్షమాపణలు కోరుతూ బీబీసీ ఛైర్మన్ వైట్ హౌస్కు లేఖ పంపారు. అయితే ట్రంప్ పరువునష్టం దావా వేసిన ఒక బిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇవ్వడానికి మాత్రం బీబీసీ అంగీకరించలేదు.2021లో క్యాపిటల్ హిల్ పై ట్రంప్ మద్ధతు దారులు దాడి చేశారు. ఆ సమయంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని మరో అర్థం వచ్చేలా ఎడిట్ చేసి బీబీసీ ప్రసారం చేసింది. అయితే తనపై తప్పుడు ప్రసారం చేసినందుకు గానూ బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ట్రంప్ బీబీసీకీ లేఖ పంపారు. దానికి శుక్రవారం డెడ్ లైన్ విధించారు. దీంతో బీబీసీ ఛైర్మన్ సమీర్ షా క్షమాపణలు కోరుతూ వైట్ హౌస్ కు లేఖ పంపారు. ట్రంప్ ప్రసంగం చేసిన వీడియో క్లిప్ను సవరించినందుకు తీవ్రంగా విచారిస్తున్నామని తెలిపారు. మరోసారి ఆ కార్యక్రమాన్ని బీబీసీలో ప్రసారం చేయమని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కొంతమంది ఆ సంస్థకు చెందిన అధికారులు ఇది వరకే రాజీనామా చేశారు.అసలేం జరిగింది2021లో క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడి సమయంలో ట్రంప్ సూమారు గంట పాటు ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలోని కొంత భాగాన్ని ఎడిట్ చేసి బీబీసీ తన పనోరమ డ్యాకుమెంటరీలో ప్రసారం చేసింది. అందులో " మనం క్యాపిటల్ హిల్ కు వెళుతున్నాం. మీతో పాటు నేను వస్తున్నా. మనం తీవ్రంగా పోరాడుదాం" అని ట్రంప్ అన్నట్లు చూపించింది. అయితే వాస్తవానికి ఆ వీడియోలో శాంతియుతంగా పోరాడుదాం అన్న వ్యాఖ్యలను వక్రీకరించించి ప్రసారం చేసింది. దీంతో ట్రంప్ 1బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశారు. ఈ విషయంపై ట్రంప్ కు క్షమాపణలు చెప్పిన బీబీసీ పరిహారం మాత్రం చెల్లించలేదు.
జాతీయం
ఆలస్యంగా వచ్చినందుకు గుంజీలు.. ప్రాణాలు కోల్పోయిన బాలిక
పాల్ఘార్: స్కూలుకు ఆలస్యంగా వచ్చిందనే కారణంతో టీచర్లు ఆరో తరగతి బాలికతో వంద గుంజిళ్లు తీయించారు. తీవ్ర అనారోగ్యానికి గురైన బాలిక వారం తర్వాత చనిపోయింది. మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. వసాయ్ ప్రాంతంలోని సతివలికి చెందిన అన్షిక గౌడ్, మరో నలుగురు ఈ నెల 8న స్కూలుకు ఆలస్యంగా వెళ్లారు.ఇందుకు శిక్షగా స్కూల్ టీచర్, బ్యాగు సహా తలా 100 గుంజీలు తీయించింది. తీవ్ర అనారోగ్యానికి గురైన అన్షిక ముంబైలోని ఓ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచింది. టీచర్ విధించిన అమానవీయ శక్షే తన బిడ్డ ప్రాణాలు తీసిందని ఆమె తల్లి ఆరోపించింది. తీవ్రమైన మెడ, వీపు నొప్పితో ఆమె అల్లాడిందని ఆవేదన చెందింది. ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. టీచర్ విధించిన శిక్ష బాలిక ప్రాణాలు తీసిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టామని, బాధ్యులని తేలితే చర్యలు తీప్పవని బీడీవో పాండురంగ్ తెలిపారు.
25 మంది మంత్రుల్లో ఓడింది ఆ ఒక్కరే..!
పట్నా: బిహార్లో ఎన్డీయే బంపర్ మెజారిటీ సాధించింది. సీఎం నితీశ్ కేబినెట్లో ఒకే ఒక్కరు తప్ప మొత్తం 25 మంది మంత్రులు విజయతీరాలకు చేరారు. డిప్యూటీ సీఎంలు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా గెలిచారు. బీజేపికి చెందిన మొత్తం 15 మంది గెలిచారు. వీరిలో వ్యవసాయ మంత్రి ప్రేమ్ కుమార్ వరుసగా 8వ సారి గెలిచారు. మరి ఓడిందెవరు? సుమిత్ కుమార్ సింగ్. ఈయన 2020లో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఈసారి జేడీయూ టికెట్పై జముయి జిల్లా చకాయ్ స్థానంలో పోటీ చేసి, ఓడిపోయారు. సుమారు 13 వేల ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి, ఆర్జేడీకి చెందిన సావిత్రీ దేవి చేతిలో పరాజయం చవిచూశారు. ఐదేళ్ల క్రితం సుమిత్ ఈమెనే ఓడించారు. దివంగత మాజీ మంత్రి, సీఎం నితీశ్ సన్నిహితుడైన నరేంద్ర సింగ్ కుమారుడే సుమిత్. మొన్నమొన్నటి వరకు సైన్స్, టెక్నాలజీ, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు.
బిహార్ నూతన ప్రభుత్వంలో చేరుతాం
పట్నా: బిహార్లో కొత్తగా ఏర్పాటయ్యే ప్ర భుత్వంలో తామూ చేరాలనుకుంటున్నట్లు లోక్ జనశక్తి పార్టీ(రాం విలాస్) చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. ముఖ్య మంత్రిగా నితీశ్ కుమార్ కొనసాగాలని తా ను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసిన 28 సీట్లలో 19 చోట్ల విజయం సాధించింది. శనివారం చిరాగ్ పట్నాలో తన పార్టీ నూతన ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తామంతా సీఎం నితీశ్ను కలిసి ఘన విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలిపామన్నారు. అదేవిధంగా, నూతన ప్రభుత్వంలో తాము కూడా చేరుతామని చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎంలు ఎవరనేది శాసనసభ్యులే నిర్ణయిస్తారన్నారు. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కొనసాగాలని వ్యక్తిగతంగా భావి స్తున్నానన్నారు. నితీశ్ సారథ్యంలోని జేడీ యూకు బీజేపీ కంటే నాలుగు తక్కువగా 85 సీట్లు దక్కాయి. 2020 ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమి పక్షమైన బీజేపీ కంటే తక్కువ సీట్లే లభించాయి. నితీశ్ తనకు విభేదాలున్నట్లు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. శాసనసభలో ఒక్క సీటు కూడా తమకు లేకున్నా 29 స్థానాలను కేటాయించిన తమ కూటమి కేంద్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
జంగిల్రాజ్ భయంతో మా ఓటర్లు ఎన్డీయేకి ఓటేశారు: ప్రశాంత్ కిశోర్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ఎన్డీయే గెలుపుపై తనదైన విశ్లేషణ చేశారు. ఆర్జేడీ సారథ్యంలోని మహాగఠ్ బంధన్ అధికారంలోకి వచ్చిన పక్షంలో జంగిల్ రాజ్ మళ్లీ వస్తుందనే భయంతో తమ పార్టీ ఓటర్లు కొందరు ఎన్డీయే పక్షాల అభ్యర్థులకు ఓటు వేశారని వివరించారు. పోలింగ్కు ఒక రోజు ముందు ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో సీమాంచల్ ప్రాంతంలోని ఓట్లన్నీ ఒకే పక్షానికి గంపగుత్తగా పడ్డాయని ఆ పార్టీ నేత ఉదయ్ సింగ్ చెప్పారు. వీరిద్దరూ శనివారం పట్నాలో మీడియాతో మాట్లాడారు. జంగిల్ రాజ్ ఉందని తాను చెప్పలేనన్న ప్రశాంత్ కిశోర్..తమ పార్టీ ఓటర్లు మాత్రం ఆ భయం వల్లే ఎన్డీయేకు ఓటేశార న్నారు. కాంగ్రెస్తోగానీ, మహాగఠ్ బంధన్లోని ఏ ఇతర పార్టీతోనూ లేని ఇబ్బంది ఆర్జేడీతో ఉన్నట్లుగా ప్రజలు భావించారని తెలిపారు. ముస్లిం వర్గం తమను ఇంకా పూర్తిగా నమ్మలే దంటూ ఆయన..దీర్ఘకాలంలో వారి మద్దతుల భిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ నుంచి ఇప్పటి వరకు రూ.40 వేల కోట్లను ఎన్డీయే ప్రభుత్వం వెదజల్లిందన్నారు. ప్రపంచబ్యాంకు నుంచి రుణంగా తెచ్చిన రూ.14 వేల కోట్లను సైతం ఉచితాల మళ్లించారని ఆరోపించారు.
ఎన్ఆర్ఐ
తెలివైన వాళ్లు ఇండియాను ఎందుకు వీడుతున్నారు?
డాలర్ డ్రీమ్స్...బీటెక్ చదవాలి.. అమెరికాకో..కెనడాకో.. జర్మనీకో ఎగిరిపోవాలి..ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో చదువుకోవాలి. మంచి పేరు సంపాదించాలి. మంచి విజ్ఞనాన్ని ఆర్జించాలి. ఇలా ప్రతి సంవత్సరం లక్షలాది మంది తమ ఊరు, తమ నేల, తమ మనుషుల్ని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. ఎవరో కలల కోసం, ఇంకెవరో అవకాశాల కోసం, మరెవరో గౌరవం కోసం..! కానీ ఆ ప్రయాణం ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే ప్రశ్నను లేపుతోంది. మన దేశం మన కలలను ఎందుకు ఆపలేకపోతోంది? భారతదేశం ఒక నేల మాత్రమే కాదు.. ఒక అనుభూతి..! జ్ఞానం, ధైర్యం, సంస్కారం కలిసిన ఒక శ్వాస..! అయినా కూడా ఈ పవిత్ర గడ్డపైనే పుట్టినవాళ్లు బయటకు ఎందుకు పరుగెడుతున్నారు? ఇది కేవలం వలస కథ కాదు.. ఇది మనసుల వేదన.. ఇది ఆశల కొత్త దిశలో పుట్టిన తపన..! ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? భారతీయులు ఇండియాను ఎందుకు వదిలి వెళ్లిపోతున్నారు? నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడకుందాం.. కాసేపు దేశభక్తిని పక్కనపెడదాం.. దేశంపట్ల బాధ్యత కలిగిన వ్యక్తులగానే చర్చించుకుందాం.. అసలు ఈ సమస్యకు కారణమేంటి తెలుసుకుందాం. నిజానికి భారత్ నుంచి బయలుదేరే ఈ ప్రయాణం కొత్తది కాదు.. బ్రిటీష్ కాలం నుంచే విదేశాలకు వెళ్లే మార్గం తెరుచుకుంది.. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం సముద్రాలు దాటారు. తరువాతి కాలంలో బెంగళూర్, హైదరాబార్, గురుగ్రామ్ నగరాలనుంచి యువత విదేశాల తరలిపోయారు. చాలామంది అక్కడే స్థిరపడిపోయారు కూడా. మన దేశంలో చిన్న వయసు నుంచే పోటీ జీవితంలో ఒక భాగమవుతుంది.ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ సీటు కోసం పోటీ. ఇక చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం కొత్త పోరాటం. టాలెంట్ ఉన్నవాడికి తగిన గౌరవం దక్కడం అరుదుగా మారిపోయింది. ఇక్కడ పరిచయాలు చాలా సార్లు ప్రతిభ కంటే పెద్దవిగా మారుతాయి. అసలు కష్టపడి పనిచేసిన వాడే అవకాశాలు కోల్పోతున్నాడు. అదే మనసులో మిగిలిన నిరాశ ఆలోచనగా మారుతోంది. ఇక్కడ కష్టపడి పనిచేస్తే ఫలితం రాదని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. జీవన ప్రమాణాలూ కారణమా?అంతేకాదు.. ఇండియాలో జీవన ప్రమాణాలు కూడా చాలా నాసిరకంగా ఉంటాయి. నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. వాతావరణం, పరిశుభ్రత, నకిలీ మందులు. కచ్చిత పనిగంటల పనివిధానం. మరోవైపు విదేశాల్లో జీవన విధానం మనకు కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. నిబంధనలు స్పష్టంగా ఉంటాయి.. ప్రతి ఒక్కరి శ్రమకు గౌరవం ఉంటుంది. ఎవరైనా కష్టపడి పనిచేస్తే, ఆ కష్టం వృథా కాదనే నమ్మకం అక్కడ బలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలూ ఎక్కువే. టెక్నాలజీ, హెల్త్కేర్, ఫైనాన్స్, పరిశోధన లాంటి రంగంలో ప్రపంచం తలుపులు తెరుస్తోంది. సమాన అవకాశాలు, సమాన గౌరవం అనే వాతావరణం విదేశాల్లో కనిపిస్తోంది. మరోవైపు భారతీయులు విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక భద్రత కూడా ఒక పెద్ద కారణం. నిజానికి ఇతర దేశాల్లో కూడా పన్నులు ఎక్కువే ఉంటాయి. అయితే అవి ఎక్కువగా ఉన్నా వాటి వినియోగాన్ని ప్రజలు చూస్తారు. ఇక్కడ పన్నులు చెల్లించినా అభివృద్ధి కనిపించదు. రోడ్లకు గుంతలే కనిపిస్తాయి. విద్యుత్ కోతలు కూడా వేధిస్తాయ్.. ఆస్పత్రుల సేవల్లో ఆలస్యం ఉంటుంది. చెప్పాలంటే ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేస్తున్న వాళ్లలో చాలామందికి బాధ్యత ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. ఇటు కొంతమంది నిబద్ధతతో పనిచేయాలన్న ఆసక్తి ఉన్నా వ్యవస్థ దాన్ని అడ్డుకుంటుంది. ప్రతిభకు గౌరవం దక్కకపోవడం, అవినీతి పెరగడం, భవిష్యత్తుపై అనిశ్చితి లాంటివి భారతీయులను విదేశాలవైపు వెళ్లేలా చేస్తున్నాయి.ఒక్కసారి మీరే ఆలోచించండి... మన దగ్గర మంచి చదువు చదివిన వాళ్లు, తెలివైన వాళ్లు బ్యాగ్ వేసుకుని విదేశాలకు ఎందుకు వెళ్లిపోతున్నారు? అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా.. ఇలా ఎక్కడైనా ఛాన్స్ దొరికితే వెళ్లిపోతున్నారు. వారి తెలివితేటలు, విజ్ఞానం మనకెందుకు దూరంగా పోతున్నాయి? ఇది చూసి చాలామందికి 'అబ్బే డబ్బుల కోసం వెళ్లిపోతున్నారు' అని అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. చదువుల్లో టాపర్స్, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి సంస్థల్లో సీట్లు సాధించిన వారు, చదువు పూర్తి చేసిన వెంటనే అమెరికా అనీ, యూరప్ అనీ, ఆస్ట్రేలియా అంటూ పక్క దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారంటే దీనికి కారణం కేవలం విలాసంగా బతకాలన్న కోరికా కాదండి. అలా వెళ్లేవాళ్లని అడిగితే 'ఇండియాలో నేను ఎంత పని చేసినా గుర్తింపు లేదు', 'రీసెర్చ్ చేయాలన్నా ఫ్రీడమ్ లేదు', 'నన్ను నమ్మే వాతావరణమూ లేదు' అని చెబుతున్నారు. వాస్తవానికి చాలామంది మేధావులు తమ టాలెంట్ను ఉపయోగించుకోవటానికి, అభివృద్ధి చేసుకోవటానికి సరైన ప్లాట్ఫామ్ కోసం వెతుకుతుంటారు. వారి పరిశోధనలకు అవసరమైన వనరులు, స్వేచ్ఛ, ప్రోత్సాహం లాంటివి ఇండియాలో లేవన్నది ఎక్కువగా వినిపిస్తున్న విమర్శ. ఇదీ చదవండి: క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీఎంతమంది?ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2022లో 2,25,260 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. 2023లో కూడా దాదాపు 2,16,219 మంది అదే పని చేశారు. 2014లో ఈ సంఖ్య 1,29,234 మాత్రమే ఉండగా, 2011 నుంచి 2023 మధ్య మొత్తం 19 లక్షల మంది భారతీయులు ఇండియా పాస్పోర్ట్ను వదిలేశారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 23,000 మంది భారతీయ మిలియనీర్లు దేశం వదిలి వెళ్లిపోయారు. ఇదే సమయంలో, 2014 నుంచి 2022 మధ్యలో భారత బిలియనీర్ల ఆస్తులు 280శాతం పెరిగాయి, అంటే దేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటుకంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఒకవైపు మధ్యతరగతి, ప్రతిభావంతులు అవకాశాల కోసం దేశం వదిలిపెడుతుంటే, మరోవైపు అత్యంత ధనవంతులు తమ భవిష్యత్ భద్రత కోసం విదేశాల్లో స్థిరపడుతున్నారు.ఇక బ్రెయిన్ డ్రెయిన్ అంటే కేవలం ఒక గణాంకం కాదు.. ఇది దేశం కోల్పోతున్న మేధస్సు! ప్రతి ప్రతిభావంతుడు బయటకు వెళ్లినప్పుడల్లా మన భవిష్యత్తు కొంత వెనుక్కు వెళ్లిపోతుంది. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే.. మన దేశం ఇలా మేధస్సును పోగొట్టుకోవడం ఆపాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా, ఇక్కడే ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించాలి. పరిశోధనకు పెట్టుబడి పెట్టాలి. యువతను ప్రోత్సహించే విధానాన్ని అభివృద్ధి చేయాలి. టాలెంట్ను గుర్తించి, ప్రోత్సహించాలి. అవార్డులు, గ్రాంట్లు, రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. సొంతదేశంలోనే అందరూ గర్వంగా ఎదిగేలా చేయాలి. ఎందుకంటే.. ఒకరు దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు, అది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు. అది సమాజం, వ్యవస్థ ఇచ్చిన సిగ్నల్ కూడా. ఈ సిగ్నల్ను మార్చేది మనమే..కానీ అది ఎప్పటికి సాధ్యమవుతుందో కాలమే నిర్ణయించాలి.
క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ
చిన్నతనంలో ఎన్నో కష్టాలు. 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు ఒంటరి పయనం. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ఒంటరి తనం. డిప్రెషన్. అయినా సరే ఎలాగైనా నిలదొక్కుకోవాలనే తపనతో క్యాబ్ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఎవ్వరూ ఊహించని శిఖరాలకు చేరాడు. గంటకు 6 డాలర్లు సంపాదించే స్థాయినుంచి కోట్ల టర్నోవర్ వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా ఎదిగాడు.పంజాబ్కు చెందిన మనీ సింగ్ పేరుకు తగ్గట్టుగా మనీ కింగ్గా తనను తాను నిరూపించుకున్నాడు. కఠోరశ్రమ, పట్టుదల, ఓపిక ఇదే అతని పెట్టుబడి. టీనేజర్గా కాలేజీని వదిలిపెట్టి మనీ సింగ్ డాలర్ డ్రీమ్స్ కన్నాడు. అలా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాడు. అయిష్టంగానే అక్క ఒక క్యాబ్ డిస్పాచర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అదే అతనికి విజయానికి పునాది వేసింది. అమెరికాకు వెళ్లిన తర్వాత చాలా ఇబ్బందులుపడ్డాడు. తిరిగి ఇండియాకు వచ్చేద్దామనుకున్నాడు తల్లి సలహా మేరకు తొలుత ఒక మందుల దుకాణంలో పనిచేశాడు, తరువాత తన మామ క్యాబ్ కంపెనీలో డిస్పాచర్గా పనిచేశాడు గంటకు 530 రూపాయల వేతనం. తరువాత మనీ సింగ్ స్వయంగా టాక్సీ నడపడం ప్రారంభించాడు. అలా పదేళ్లకు దశాబ్దానికి పైగా టాక్సీ పరిశ్రమలో ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ. 17.65 కోట్లు (2మిలియన్ డాలర్లు) టర్నోవర్ కలిగిన రెండు విజయవంతమైన వ్యాపారాలను నడుపుతుండటం విశేషం.పదేళ్ల అనుభవంతో ఐదు క్యాబ్లతో సొంత డిస్పాచ్ సెటప్తో డ్రైవర్స్ నెట్వర్క్ను ప్రారంభించాడు. ఇది ATCS ప్లాట్ఫామ్ సొల్యూషన్స్గా మారింది. ఇక్కడితో ఆగిపోలేదు. 2019లో, సింగ్ తన తల్లి సెలూన్ వ్యాపారం నుండి ప్రేరణ పొంది, మౌంటెన్ వ్యూలో డాండీస్ బార్బర్షాప్ & బియర్డ్ స్టైలిస్ట్ను (Dandies Barbershop and Beard Stylist ) ప్రారంభించాడు. అక్కడ కూడా సక్సెస్ సాదించాడు. CNBC ప్రకారం, డాండీస్ గత సంవత్సరం రూ. 9.47 కోట్లు సంపాదించాడు. అయితే ATCS ప్లాట్ఫారమ్ సుమారు మరో 9 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారం ఇలా మొదలైంది. 75 వేల డాలర్ల పెట్టుబడి, పర్మిట్లు, పేపర్ వర్క్కోసం సంవత్సరం పట్టిందని మనీ సింగ్ తెలిపారు . దుకాణం తెరవడానికి లైసెన్స్ పొందేదాకా ఒక సంవత్సరం అద్దె చెల్లించానని చెప్పుకొచ్చాడు. మరోవైపు అతనికి క్షురకుడిగా అనుభవంలేనందున, స్నేహితుడితో భాగస్వామ్యం కుదుర్చు కున్నాడు సరిగ్గా ఆరునెలలు గడిచిందో లేదో కోవిడ్-19 మహమ్మారి వచ్చి పడింది. ఫలితంగా దాదాపు ఒక సంవత్సరం పాటు దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. కానీ అద్దె ఇంకా చెల్లించక తప్పలేదు. మొత్తానికి లోన్లు, స్నేహితుల వద్ద అప్పలు, క్రెడిట్ కార్డ్ లోన్లతో మేనేజ్ చేశాడు. దీనికి తోడు స్టాక్ పోర్ట్ఫోలియోను కూడా లిక్విడేట్ చేశాడు. ఒక దశలో తిండికి కూడా చాలా కష్టమైంది.కట్ చేస్తే నేడు, మనీ సింగ్ మూడు డాండీస్ అవుట్లెట్లను నెలకొల్పి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. 2023నాటికి డాండీస్ మరింత లాభదాయకంగా మారింది. క్రమశిక్షణ ,పట్టుదల పంజాబ్లోని తన బాల్యం నుంచే వచ్చాయనీ గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తు ప్రాజెక్ట్ - బార్బర్స్ నెట్వర్క్, బార్బర్ల కోసం బుకింగ్ యాప్ను నిర్మిస్తున్నానని మనీ సింగ్ చెప్పాడు. "నేను రోజుకు 15–16 గంటలు పనిచేస్తాను. రిటైర్ అవ్వాలనుకోవడం లేదు. పనే ఊపిరి లాంటిది," అని చెబుతాడు సగర్వంగా.
యూఏఈ లాటరీలో జాక్పాట్.. చరిత్ర సృష్టించిన అనిల్ బొల్లా
పండుగపూట లక్ష్మీదేవి ఆ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతగాడిని కోటీశ్వరుడిని చేసేసింది. తల్లి సెంటిమెంట్తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. 88 లక్షల మంది పాల్గొన్న లాటరీలో ఏకంగా రూ.240 కోట్ల డబ్బు గెల్చుకుని చరిత్ర సృష్టించాడు. భారత్కు చెందిన అనిల్కుమార్ బొల్లా(అతని స్వస్థలంపై స్పష్టత రావాల్సి ఉంది).. ఏడాదిన్నర కిందట యూఏఈకి వెళ్లాడు. అయితే.. 2025 అక్టోబర్ 18న యూఏఈ నగరం అబుదాబిలో జరిగిన లక్కడీ డే డ్రాలో రూ.240 కోట్ల (Dh100 మిలియన్) బంపర్ లాటరీ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఏఈ లాటరీ నిర్వాహకులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. తన పూర్తి పేరు అనిల్కుమార్ బొల్లా మాధవరావు బొల్లా అని, రాత్రికి రాత్రే తన జీవితం మారిపోయిందని ఆ యువకుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది. లాటరీ నెగ్గానని తెలియగానే సోఫాలో కుప్పకూలిపోయానని.. సంతోషంతో మాటలు రాలేదని, లోపల మాత్రం యస్.. నేను గెలిచా అనే ఆంనందం అలా ఉండిపోయిందని వివరించాడు.ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్కు 50దిర్హామ్(రూ.1200) పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్. అయితే అందులో అదృష్టం తెచ్చి పెట్టి టికెట్ నెంబర్ 11. ఆ నెంబర్కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?. తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్ను ఎంపిక చేసుకుని.. తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసొచ్చిందని.. అంతకు మించి తాను ఏదీ చేయలేదని నవ్వుతూ చెబుతున్నాడు అనిల్. పైగా దీపావళి సమయంలోనే ఇలా జరగడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపాడు.మరి ఇంత డబ్బుతో ఏం చేస్తావు? అని ప్రశ్నిస్తే.. తనకు కొన్ని కలలు ఉన్నాయని అని నెరవేర్చకుంటానని, అలాగే.. ఓ సూపర్కార్ కొనుగోలు చేసి.. సెవెన్స్టార్ హోటల్లో కొన్నాళ్లపాటు జాలీగా గుడుపుతానని నవ్వుతూ చెప్పాడు. అంతకంటే ముందు.. తన తల్లిదండ్రులకు చిన్నచిన్న కోరికలను తీరుస్తానని, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడే గడుపుతానని, వచ్చిందాంట్లో కొంత చారిటీలకు ఇస్తానని తెలిపాడు.From anticipation to celebration, this is the reveal that changed everything!Anilkumar Bolla takes home AED 100 Million! A Lucky Day we’ll never forget. 🏆For Anilkumar, Oct. 18 wasn’t just another day, it was the day that changed everything.A life transformed, and a reminder… pic.twitter.com/uzCtR38eNE— The UAE Lottery (@theuaelottery) October 27, 2025
డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు
డాలస్, టెక్సస్: ఈ అవగాహనా సదస్సు ఏర్పాటుచేసిన ప్రముఖ ప్రవాస భారతీయ నాయుకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రపంచంలోని విభిన్న భాషలు, సంస్కృతులు, కళలు, ఆచార, వ్యవహారాలు, మతాలు అవలంభించండానికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రయాలున్న దేశం అమెరికా. అందుకే అమెరికా దేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు, మసీదులు, వివిధ భాషలవారి చర్చిలు, గురుద్వారాలు, సినగాగ్స్ లాంటి ఎన్నో ప్రార్ధనాలయాలు దర్శనమిస్తాయి.అనేక నగరాలలో భారతీయ మూలాలున్న లక్షలాదిమంది ప్రజలు ఎన్నో తరాలుగా ఈ జనజీవన స్రవంతిలో మమేకమవుతూ, వివిధ రంగాలలో బాధ్యాతాయుతంగా సేవలందిస్తూ, అమెరికా దేశ ఆర్ధికవ్యవస్థ బలోపేతానికి దోహద పడుతూ, మంచి గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో మనకున్న స్వేచ్ఛ, స్వాతంత్రయాలు దారి తప్పుతున్న ధోరణలతో కొన్ని ప్రాంతాలలో ప్రవాస భారతీయుల ఉనికికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితులను గమనించి వివిధ సంఘాల ప్రతినిధులతో డాలస్ నగరంలో ఒక అవగాహనా సదస్సు ఏర్పాటుచేసి, ఇటీవల జరుగుతున్న వివిధ సంఘటనలను, విషయాలను కూలంకషంగా చర్చించి ప్రవాస భారతీయులకు కొన్ని సూచనలు చేసేందుకు యీ సదస్సు ఏర్పాటుచేశాం అన్నారు”.➢ ముందుగా అమెరికాదేశ విధి విధానాలను, చట్టాలను తెలుసుకుని విధిగా అందరూ గౌరవించాలి. సభలు, సమావేశాలు జరుగుతున్నప్పుడు వేదికమీద కేవలం ఒక్క భారతీయ జెండా మాత్రమే ఉంచకూడదు. భారత, అమెరికా దేశపు రెండు జెండాలు ఒకే సైజులో, ఒకే ఎత్తులో ఉండేటట్లుగా చూడాలి. వేదికపైన ఉన్న జెండాలలో వేదికముందు ఉన్న ప్రేక్షకులకు ఎడమవైపు భాగంలో అమెరికాదేశ పతాకం, కుడివైపు భారతదేశ పతాకం కనబడేటట్లుగా ఉంచాలి.జాతీయగీతాలు ఆలపించేడప్పుడు ముందుగా భారత జాతీయగీతం, ఆ తర్వాత అమెరికా జాతీయగీతం ఆలాపించాలి. భారత జాతీయగీతం పాడుతున్నపుడు నిశబ్దంగా, నిటారుగా నిలబడి ఉండాలి. అమెరికా జాతీయగీతం ఆలపిస్తున్నపుడు, అమెరికాదేశ జాతీయపతాకం వైపు చూస్తూ, కుడిచేతిని గుండెదగ్గర ఉంచుకోవాలి. టోపీలుధరించి ఉన్నట్లయితే జాతీయ గీతాలు ఆలపిస్తున్నంతసేపు వాటిని తీసిఉంచడం మర్యాద. ➢ భారతీయులు ముఖ్యంగా తెలుగువారి వందలాది కుటుంబాలు ఎక్కువగా ఒకేచోట నివసిస్తున్న ప్రాంతాలాలో దైవిక, ఆధ్యాత్మిక ఉత్సవాల పేరుతో కొన్ని రహదారులు మూసివేసి, లౌడ్ స్పీకర్ల మోతలు, బాణసంచాలు, నినాదాలతో వీధుల్లో సంబరాలు జరుపుకోవడం ఇతరులకు యిబ్బందికరంగా మారుతోంది. దీనికి సిటీ పర్మిషన్ ఉన్నట్లయితే, ట్రాఫిక్ డైవర్షన్ గుర్తులు, తగు పోలీస్ రక్షణ సిబ్బంది సహాయం తప్పనిసరి. ఇలాంటివి ఇళ్ళమధ్యలోగాక, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాలకు, ఆలయ ప్రాంగణాలకు పరిమితం చెయ్యడం ఉత్తమం. అలా కాకపోతే ఎన్నో ఉపద్రవాలకు గురిఅయ్యే ప్రమాదంఉంది.➢ ఉదాహరణకు ఇటీవలే ఇలాంటి సంఘటనతో తన కారులో రోడ్ మీద ఎటూ వెళ్ళడానికి వీలులేక, ఈ ఉత్సవాల జనంమధ్య చిక్కకుని, విసిగిపోయిన ఒక అమెరికన్ తన కారు దిగి తుపాకి చూపడంతో, అందరూ బెదిరిపోయి చెల్లాచెదురయ్యారు. ఆ తుపాకీ పేలినా, బంగారు ఆభరణాలు ధరించి ఆ ఉత్సవాలలో పాల్గొన్న పిల్లలు, పెద్దల సమూహంలో తొక్కిసలాట జరిగినా, ఊహకందని ప్రమాదం జరిగి ఉండేది. ఇళ్ళ మధ్యలోగాని, ఆరు బయటగాని బాణాసంచా ఏ ఉత్సవాలలోనైనా కాల్చకూడదు. అలా చేయడానికి ‘పైరోటెక్ లైసెన్స్’ ఉండాలి, అనుభవజ్ఞులైన, లైసెన్స్ ఉన్న టెక్నీషియన్స్ మాత్రమే ఆ పనిచేయడానికి అర్హులు. ➢ మన భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలవుతున్నప్పుడు దియేటర్లవద్ద హడావిడి శ్రుతిమించి రా(రో) గాన పడుతుంది. హీరోలకు అభిమానులు ఉండడం తప్పుగాదు గాని, దియేటర్లలో వారికి వందలాది కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చెయ్యడం, పేపర్లు చించి విసిరి, ఈలలు, గోలలు, డాన్సులతో ఒక జాతరను తలపించడంతో అదే మూవీ కాంప్లెక్స్ లో ఇతర భాషల సినిమాలు వీక్షించేవారు భయకంపితులవుతున్నారు.నిజానికి ఎంతో ఖర్చుపెట్టి సినిమా చూద్దామని వచ్చిన ఆయా హీరోల అభిమానులుకూడా కేకలు, అరుపుల మధ్య ఆ సినిమాను పూర్తిగా ఆస్వాదించలేక అసంతృప్తికి లోనవుతున్నారు. పోలీసులువచ్చి ఈ గోల, గందరగోళాల మధ్య ఆడుతున్న సినిమాను మధ్యలో ఆపివేసి అందరినీ బయటకు పంపి వెయ్యడం లాంటి సంఘటనలు ప్రవాస భారతీయులందరికీ సిగ్గుచేటు, అవమానకరం. ➢ ఇక ఆయా రాజాకీయపార్టీల నాయకులు వచ్చినప్పుడు అభిమానులు చేసే హడావిడే వేరు. వీధుల్లో భారీ కార్ల ర్యాలీలు, జెండాలు, నినాదాలతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీకి వారు, ఆయా నాయకులకు అభిమానం చూపడం, సభలు సమావేశాలు నాల్గు గోడలమధ్య ఏర్పాటు చేసుకోవడం ఎవరికీ అభ్యంతరం కాకూడదు. కాని సమస్యంతా రోడ్లమీద, రాజకీయ నాయకులు బసచేసిన హోటళ్ళవద్ద ఇతరుల శాంతికి భంగం కల్పిస్తూ అభిమానులు చేసే గోలే. అదే హోటళ్ళలో అనేక వందలమంది అమెరికన్లు బసచేసి ఉన్నారనే స్పృహకూడా లేకుండా వేసున్న అరుపులు, కేకలకు పోలీస్లు వచ్చి అందరినీ తరిమికొట్టిన సంఘటనలు, సందర్భాలు చాలా విచారకరం.➢ చాలామంది ప్రవాస భారతీయులకు ఇంటి ఎదురుగాను, ప్రక్కన నివసిస్తున్న అమెరికన్ల పేర్లు కూడా తెలియవు. అమెరికా జనజీవన స్రవంతిలో భాగంఅవుతూ ఇరుగుపొరుగుతో కలసిమెలిసి జీవించడం చాలా అవసరం. ఎన్నో తరాలగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం గనుక స్థానిక, జాతీయ రాజకీయ నాయకులతో పార్టీలకతీతంగా సంభందాలు కలిగి ఉండాలి. అమెరికా పౌరసత్వం కల్గిఉన్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకోవడం, తమ సమస్యలను, అభిప్రాయాలను రాజకీయనాయకులకు తెలియజేయడం ఎంతైనా అవసరం.➢ మరో పెద్ద సమస్య – ఊళ్ళ పేర్లను మార్చి వ్రాయడం, పలకడం. ఉదాహరణకు-1856లో ఏర్పడ్డ ‘డాలస్’ నగరాన్ని ‘డాలస్ పురం’ గా “ఉల్లాసపురం” గా పలకడం;1913లో ఏర్పడ్డ “క్యారల్టన్” అనే నగరాన్ని “కేరళాటౌన్” గా పలకడం ఎందుకంటే అక్కడ కొంతమంది కేరళ రాష్ట్రం నుంచి వచ్చినవారు ఉన్నారు గనుక; 1950లో ఏర్పడ్డ “గంటర్” అనే నగరాన్ని “గుంటూరు” గా మార్చి పలకడం ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు గనుక. ఇవి అన్నీ వినడానికి హాస్యంగానే ఉంటాయి కాని ఇవి అమెరికన్ల దృష్టిలోపడి అపహాస్యానికి, అపాయానికి గురిచేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి కొంతమంది అమెరికన్లు మన భారతదేశం వచ్చి మన పట్టణాల పేర్లను ఇంగ్లీష్ పేర్లతో మార్చివేస్తే ఎలా ఉంటుందో మనకు!. ఇలాంటి విపరీత మనస్తత్వానికి వెంటనే స్వస్తి పలకాలి.➢ వ్యక్తిగత శుచి, శుభ్రత పాటించకపోవడం, వాల్ మార్ట్ లాంటి స్టోర్స్ లో దొంగతనాలు చేస్తూ దొరికిపొయి చిక్కుల్లో పడడం, స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ లేదా తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోయి పోలీసులతో వాగ్వివాదాలకు దిగడం, పరిసరాలను అశుభ్రపరచడం, డిపార్ట్మెంట్ స్టోర్స్ లోను, రెస్టారెంట్లలోను సెల్ ఫోన్లలో బిగ్గరగా అరచి మాట్లాడంలాంటి సంస్కృతిని విడనాడాలి.➢ వాట్స్ ఆప్, ఇన్స్టాగ్రామ్, పేస్ బుక్ మొదలైన సాధనాల ద్వారా పంపే సందేశాలు, ముఖ్యంగా అమెరికన్ రాజకీయ విమర్శలు తరచూ అమెరికన్ అధికారులు గమనిస్తున్నారనే విషయం దృష్టిలో ఉంచుకుని మెలగాలి.➢ భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు, రాజకీయ నాయకులు, సినిమా కధానాయకులు వారి అభిమానులకు సరైన దిశానిర్దేశం చెయ్యడం ఎంతైనా అవసరం. అవగాహన కల్పించడంలో ప్రసారమాధ్యమాల పాత్ర, కృషి కొనియాడ దగ్గది.➢ రెండు గంటలకు పైగా సాగిన ఈ అవగాహానా సదస్సులో తానా, ఆటా, నాటా, నాట్స్, టాన్టెక్స్, టిపాడ్, డేటా, సురభి రేడియో, గ్రేటర్ ఫోర్ట్ వర్త్ హిందూ టెంపుల్ మొదలైన సంస్థల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ఎన్నో దశాబ్దాలగా డాలస్ పరిసర ప్రాంతాలలో స్థిర నివాసంఉంటున్న రావు కల్వాల, ఎంవిఎల్ ప్రసాద్, వినోద్ ఉప్పు, చినసత్యం వీర్నపు, రవీంద్ర పాపినేని, రమాప్రసాద్, శ్రీ బండా, వినయ్ కుడితిపూడి, వి.ఆర్ చిన్ని, రాజేశ్వరి ఉదయగిరి, లక్ష్మి పాలేటి, రవి తూపురాని, వెంకట్ నాదెళ్ళ, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, అనిల్ గ్రంధి, శుభాష్ నెలకంటి, విక్రం జంగం, సురేష్ మండువ, రాజేష్ వెల్నాటి, సతీష్ రెడ్డి, విజయ్ కాకర్ల, బాబీ, రఘువీర్ రెడ్డి మర్రిపెద్ది, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాస్ గాలి, మాధవి లోకిరెడ్డి, రాజేష్ అడుసుమిల్లి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, మురళి వెన్నం మొదలైన ప్రవాస భారతీయనాయకులు హాజరై వారి వారి అభిప్రాయాలను సూటిగా పంచుకున్నారు.అతి తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసి తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసిన నాయకులకు, అనివార్యకారణాలవల్ల హాజరుకాలేకపోయినా సందేశాలను పంపిన వారికి, రుచికరమైన విందుభోజన ఏర్పాట్లు చేసిన ‘ఇండియా టుడే’ రెస్టారెంట్ వారికి, అన్ని వసతులతో కూడిన కాన్ఫరెన్స్ హాల్ ను సమకూర్చిన డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్
యజమాని కారు ఢీకొని యువకుడి మృతి
అన్నమయ్య జిల్లా: అప్పటి వరకు తన యజమాని కుమార్తె పుట్టిన రోజు పార్టీలో సరదాగా గడిపిన ఓ యువకుడు.. ఆ తర్వాత కొద్దిసేపటికే తన యజమాని కారు ఢీకొనే చనిపోయాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... కలికిరి పంచాయతీ సత్యాపురంలో నివాసముంటున్న ఆర్టీసీ డ్రైవర్ ముంగర రామకృష్ణరాజు, సుకన్య కుమారుడు వినీత్కుమార్రాజు(25) కలికిరి క్రాస్ రోడ్డులోని అబు మొబైల్స్ దుకాణంలో పని చేస్తున్నాడు. దుకాణం యజమాని అబు కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం రాత్రి రాయచోటిలో పార్టీ ఇచ్చాడు. అబు కారులోనే స్నేహితులైన వినీత్కుమార్రాజు, నౌషాద్ బాషా (బబ్లూ), అహ్మద్, నరేష్ వెళ్లారు. అక్కడ అందరూ మద్యం తాగి, రాత్రి 11 గంటలకు కలికిరికి బయలుదేరారు. కలికిరి క్రాస్ రోడ్డులోని మొబైల్ దుకాణం వద్ద యజమాని అబు, అహ్మద్ కారు దిగిపోగా, డ్రైవరుగా ఉన్న బబ్లూ అక్కడి నుంచి వినీత్కుమార్రాజు, టి.మాదిగపల్లికి చెందిన నరేష్ను వారి ఇళ్ల వద్ద దింపడానికి బయలుదేరాడు. సత్యాపురంలో వినీత్కుమార్రాజును దింపేసిన అనంతరం అక్కడి నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న టి.మాదిగపల్లిలో నరేష్ ను దింపాడు. తిరిగి వచ్చేటప్పుడు సత్యాపురంలో రోడ్డు పక్కన ఉన్న వినీత్కుమార్రాజును కారుతో ఢీకొట్టాడు. ఈ విషయం బబ్లూ తన స్నేహితుడు అహ్మద్కు తెలియజేశాడు. వెంటనే అహ్మద్ అక్కడికి చేరుకున్నాడు. కానీ, స్థానికులు రావడంతో బబ్లూ, అహ్మద్ పారిపోయారు. దీంతో స్థానికులు 112 నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే వినీత్కుమార్రాజు మృతిచెందాడు. శనివారం వేకువజామున మూడు గంటలకు వినీత్కుమార్రాజు కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. ఘటనాస్థలాన్ని సీఐ అనిల్కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన శుక్రవారం అర్ధరాత్రి తమ కుమారుడు చనిపోతే శనివారం ఉదయం నుంచి ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మృతుని తల్లి సుకన్య, బంధువులు శనివారం సాయంత్రం 6 గంటలకు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అయితే తమకు బాధితులు ఫిర్యాదు ఇవ్వలేదని సీఐ వెల్లడించారు. ఆందోళన అనంతరం రాత్రి మీడియా ముందు బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన సీఐ అనిల్కుమార్.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మొబైల్ దుకాణం యజమాని అబు, కారుడ్రైవర్ బబ్లూ(నౌషాద్ బాషా), నరే‹Ù, అహ్మద్ను అదుపులోకి తీసుకున్నారు.
ఘోరం.. కన్న కుమార్తెను చంపి కుమారుడిపై దాడి చేసి
కరీంనగర్ సాక్షి. వావిలాల పల్లిలో బాలిక అర్చన మృతిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బాలికను తన తండ్రి మల్లేశమే దాడి చేసి చంపినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. తన కుమారుడిని కూడా చంపడానికి ప్రయత్నించగా తన భార్య పోశవ్వ అడ్డకుందని తెలిపారు. పిల్లలని ఎందుకు చంపాలనుకున్నాడనే విషయం తెలియాల్సి ఉంది. వివరాలు. కరీంనగర్లోని వావిలాలపల్లిలో నివాసం ఉంటున్న అర్చన అనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తీవ్ర గాయాలైన ఆమె సోదరుడు ఆశ్రిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఈ ఘటనపై వివరాలు సేకరించగా వారి తల్లి పోశవ్వ కూలీ పనికి వెళ్లివచ్చేసరికి ఇద్దరు పిల్లలు అపస్మారకస్థితిలో పడిపోయి ఉన్నారని తెలిపారు. దీంతో స్థానికులసాయంతో ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అర్చన మృతిచెందినట్లు పేర్కొన్నారు. అయితే పోలీసు విచారణలో వారి తండ్రే కుమార్తె అర్చనని చంపి, కుమారుడిపై దాడి చేశారని తేలింది. తండ్రి దాడి చేసిన ఇద్దరు పిల్లలు మానసిక దివ్యాంగులని తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం వెంకటరావుపేటకు చెందిన మల్లేశం– పోశవ్వ దంపతులు ఏడేళ్లక్రితం కరీంనగర్ వచ్చారు. వాలివాలపల్లిలో నివాసం ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
సీఐ సతీష్ మృతిపై వీడని మిస్టరీ!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన టీటీడీ మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏవీఎస్వో), ప్రస్తుత గుంతకల్లు రైల్వే ఇన్స్పెక్టర్ సతీష్కుమార్ అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడలేదు. ఆయనను పరకామణి కేసులో ఉన్న తిరుపతికి చెందిన వ్యక్తులు హత్య చేసి ఉంటారని, వారిని ఏ1గా పేర్కొంటూ గుంతకల్లు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, సతీష్ది హత్యే అని కుటుంబసభ్యులు, ఆత్మహత్య అని విపక్ష నేతలు, ప్రమాదం అని ఇంకొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సతీష్ రైలు నుంచి కింద పడిపోయి ఉంటారా? లేదా ఎవరైనా తోసి ఉంటారా? అనే విచారణ క్రమంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సీసీ ఫుటేజీ ఏమైంది?పోలీసులు, రైల్వే వర్గాలు, విశ్వసనీయ సమాచారం ప్రకారం... తిరుమల పరకామణి కేసులో విచారణకు వెళ్లేందుకు గురువారం అర్ధరాత్రి 11.53 గంటలకు సతీష్ గుంతకల్లు రైల్వే స్టేషన్కు వచ్చారు. బైక్ పార్క్ చేసి లోపలకు వెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రాయలసీమ ఎక్స్ప్రెస్ 12. 55 గంటలకు వచ్చింది. అంటే, దాదాపు గంటసేపు సతీష్ రైల్వే స్టేషన్లో ఉన్నారు. కానీ, ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు కాలేదు. స్టేషన్లో కొత్తగా 82 సీసీ కెమెరాలు అమర్చారు. వాటిలోని ఫుటేజీ బ్యాకప్ డేటా లేదని రైల్వే అధికారులు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ గంటలో ఏం జరిగింది?!గుంతకల్లు నుంచి సతీష్ మృతదేహం లభ్యమైన కోమలిలోని ఘటనా స్థలానికి గంట ప్రయాణం మాత్రమే. అంతలో ఆయన బోగీ డోర్ వద్ద మెట్లపై కూర్చుని ఉండగా కిందపడి ఉంటే రౌండ్గా తిరుగుతూ పడిపోతారని రైల్వే పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కింద పడినప్పుడు రాళ్లు బలంగా తగిలితే తల పగిలే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. సతీష్ మృతదేహం దొరికిన స్థలంలో చెప్పులు ఒకచోట పడిఉన్నాయి. ఆయన కింద పడిపోయి దొర్లుకుంటూ వచ్చి ఉన్నట్టు రక్తపు మరకలు, ఇతర ఆనవాళ్లు పోలీసులకు దొరికాయి. ఆయన పక్కటెముకలు, ఒక కాలు విరగడం చూస్తే వేగంగా వెళ్తున్న రైలు నుంచి పడిపోయినప్పుడు ఇలా జరుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన సీఐడీ అడిషనల్ డీజీసతీష్ మృతి కేసును సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ప్రత్యేకంగా విచారిస్తున్నారు. శుక్రవారం రాత్రి అనంతపురం చేరుకున్న ఆయన... డీఐజీ షిమోషీ, ఎస్పీ జగదీశ్తో సమావేశమయ్యారు. గెస్ట్హౌస్లో సమీక్ష నిర్వహించి కేసు దర్యాప్తునకు 10 బృందాలను నియమించారు. శనివారం కూడా సమీక్ష చేశారు. వైద్యులతో పాటు ఫోరెన్సిక్ డాక్టర్లతో మాట్లాడారు. ఘటనా స్థలిలో తీసిన ఫొటోలు, వీడియోలు, పోస్టుమార్టం నివేదికలను పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వీక్షించారు. అనంతపురం నుంచి కోమలికి చేరుకుని సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఒక మనిషి బొమ్మను తీసుకుని వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందకు తోశారు. మరో రైలులో బొమ్మ తోయకుండా కిందపడేలా చేశారు. ఈ రెండు బొమ్మలు ఎలా వెళ్లాయి? గాయాలు ఎలా తగిలే అవకాశం ఉంది? తదితర అంశాలను శోధించారు. దీన్నంతటినీ వీడియో తీశారు. సతీష్ మృతదేహం దొరికిన ప్రాంతంలో రాళ్లు, ఇతర వస్తువులపై ఉన్న రక్తపు మరకలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. సతీష్ మొబైల్ ఫోన్ ఎక్కడ దొరికిందనే అంశంతో పాటు అందులో ఫోన్ కాల్స్ను కూడా పరిశీలిస్తున్నారు. సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుతన సోదరుడిది హత్యే అని సతీష్ సోదరుడు హరి పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఎన్ఎస్ సెక్షన్ 103 (1) ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా ‘పరకామణి వ్యవహారంలో అపోనెంట్స్’ అని రాశారు. ఇందులో ఎవరి పేర్లూ రాయకపోవడం గమనార్హం. కాగా, అసలు ఘటన ఎలా జరిగింది? ప్రమాదమా? హత్యా? లేక ఆత్మహత్యనా? అన్నది ఏదీ తేలకుండా పోలీసులు పరకామణి వ్యవహారంలో అపోనెంట్స్ను దోషులుగా చేర్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సతీష్ది హత్యే అయితే, రైలులో అందుకు పాల్పడింది ఎవరు? వారు టికెట్తో ప్రయాణించారా? టికెట్ లేకుండా వచ్చారా? సతీష్ కిందపడిన కోమలి ప్రాంతం వద్ద ఎవరు వేచి ఉండి హత్య చేశారు? ఆ సమయంలో సెల్ టవర్ సిగ్నల్స్లో ఎవరెవరు ఉన్నారు? అనే అంశాలన్నీ లోతుగా పరిశీలించి, వారిని విచారించి ఆపై హత్యగా నిర్ధారించాల్సి ఉంది. కానీ, కేసులో పరిశోధన పూర్తి కాకుండా, అనుమానాస్పద మృతి అనికాకుండా ఎఫ్ఐఆర్లో హత్యగా పేర్కొనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలోని కొందరు పెద్దల కీలక ఆదేశాలతో దీన్ని హత్యగా ధ్రువీకరించి, వారు అనుకున్న వ్యక్తులను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సతీష్ మృతిపై తిరుపతి రైల్వే పోలీసులు కూడా విచారణ చేపట్టారు. రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఆయన ప్రయాణించిన బోగీకి టీటీ (టికెట్ చెకింగ్ ఇన్స్పెక్టర్)గా శోభారాణి విధుల్లో ఉన్నారు. మరో టీటీగా అప్పారావు ఉన్నారు. వీరికి చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ నాయుడు డ్యూటీలు వేశారు. ఈ ముగ్గురితో పాటు లోకో పైలట్, గార్డ్, స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగిని చిత్తూరు రైల్వే డీఎస్పీ హర్షిణి శనివారం విచారించారు. శుక్రవారం ఉదయం 6.26కు తిరుపతి చేరుకున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ను ప్రత్యేక బృందం పరిశీలించింది. ఏ–1 కోచ్లో ప్రయాణించిన సతీష్కు లగేజీ అప్పగించిన బెడ్ రోల్ అటెండర్ రాజీవ్ రతన్, ఏ–2 కోచ్కు చెందిన కృష్ణయ్యను రైల్వే పోలీసులు ప్రశ్నించారు. సతీష్ సీటు 29 కాగా, ఆయన బ్యాగ్ 11వ నంబరు సీటులో లభించింది. రైలు యార్డ్లోకి వచ్చిన వెంటనే శాంపిళ్లు తీసుకున్నారా లేదా అనేదానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఎల్లో మీడియాకు లీకులతో...సతీష్ మృతి విషయంలో కీలక అంశాలపై పోలీసులు దృష్టిపెట్టలేదనే ఆరోపణలుండగా.. మరోవైపు ప్రభుత్వం టీడీపీ అధికారిక వెబ్సైట్కు, ఎల్లో మీడియాకు శుక్రవారం సాయంత్రమే లీకులిచ్చింది. తీరా ఎఫ్ఐఆర్లో హత్యగా శనివారం పేర్కొన్నారు. పైగా ఎవరి పేర్లూ లేకుండా ఏ–1గా ‘పరకామణి వ్యవహారంలో అపోనెంట్స్’ను చేర్చడం గమనార్హం. దీనివెనుక ఉద్దేశాలు ఏమిటి? అన్నది దీంతోనే తెలిసిపోతోంది. ఇదంతా చూస్తుంటే... ఎవరిని కాపాడేందుకు కుతంత్రం పన్నుతున్నారు? అని ప్రశ్నలు వస్తున్నాయి. ఎవరిపై బురదజల్లేందుకు కుట్ర వ్యూహాలు రచిస్తున్నారు? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సతీష్ కుమార్ కేసు తాడిపత్రికి బదిలీ గుత్తి: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని కోమలి రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం గుంతకల్లు జీఆర్పీ సీఐ, పరకామణి కేసులో ఫిర్యాదుదారుడైన సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై గుత్తి జీఆర్పీ ఇన్చార్జ్ సీఐ అజయ్కుమార్ బీఎన్ఎస్ సెక్షన్ 103(1) కింద హత్య కేసుగా నమోదు చేశారు. ఈ కేసును శనివారం తాడిపత్రి పోలీసుస్టేషన్కు బదిలీ చేసినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ?» పోలీసులు కేసు నమోదు చేసినట్లు హత్య జరిగిందా? » సతీష్ చనిపోయిన వెంటనే పోలీసులు ఆగమేఘాలపై ఆయన ఇంటిని ఎందుకు చుట్టుముట్టారు? » ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారు? » ఆయన భార్య సెల్ ఫోన్ను ఎందుకు లాక్కున్నారు? » ఆమె సెల్కు సతీష్ సెల్ నుంచి వచ్చిన మెసేజీల్లో ఏముంది? » పోస్టుమార్టం రిపోర్ట్ రాకుండానే ‘హత్య’ అని ఎలా చెప్పారు? » సందేహాలు నివృత్తి కాకముందే హత్య అని చెప్పడానికి అంత తాపత్రయం ఎందుకు? » సతీశ్ కు చాలా సౌమ్యుడిగా పేరుంది. ఆయన సివిల్ విభాగంలో కాకుండా ఏఆర్లో ఉండడంతో అందరితో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్టు హత్యకు గురైతే, నిందితులు సతీశ్తో పాటు ప్రయాణం చేయాలి. అలాగైతే ఆ ఇతర వ్యక్తులు ఎవరు? » సతీశ్ ప్రయాణించిన బోగీ ఏ–1 కోచ్ ఏసీ.. నిశబ్దంగా ఉంటుంది. ఒకవేళ తనపై ఎవరు దాడికి యత్నించినా పోలీస్ అయినందున కచి్చతంగా ప్రతిఘటించే తత్వం, శక్తి ఉంటాయి. అక్కడ అలాంటి గొడవ జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు. ఈ విషయాన్ని పోలీసులు గమనించ లేదా? » సతీష్ కిందపడిన ప్రాంతానికి వాహనాలు వచ్చి ఉంటే టైర్ల గుర్తులు ఉండాలి కదా? రైల్లో ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ సేకరించారా? » సతీశ్ను వెంటాడినట్లుగా సీసీ ఫుటేజీ లేదు. ఈ కీలక అంశాలపై పోలీసులు ఎందుకు దృష్టి సారించలేదు? ఇన్ని అనుమానాల మధ్య ఏ విధంగా హత్య కేసు నమోదు చేశారు?
మదనపల్లె కిడ్నీ రాకెట్ ముఠా అరెస్ట్
మదనపల్లె: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహేంద్ర చెప్పారు. అరెస్టయిన వారిలో అన్నమయ్య జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్) కె.ఆంజనేయులు ఉన్నారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ శనివారం మీడియాకు వెల్లడించారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాలెంకు చెందిన సాడి యమున (29) నుంచి ఈ నెల 9న మదనపల్లెలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కిడ్నీని తొలగించగా..ఆ మరుసటి రోజున ఆమె మృతి చెందింది. ఆమె తల్లి సూరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపి ఆరుగురిని అరెస్ట్ చేశామని, ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వైద్యుడిని అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ చెప్పారు. మధ్యవర్తులతో మదనపల్లెకు.. సాడి యమున (29)కు ఆనందపురం మండలానికి చెందిన సూరిబాబు (45)తో సాన్నిహిత్యం ఉంది. యమునకు ఆరి్థక ఇబ్బందులు ఉండటంతో కిడ్నీ ఇస్తే కష్టాలు తీరిపోతాయని సూరిబాబు చెప్పాడు. దీంతో మధ్యవర్తులైన విశాఖకు చెందిన కాకర్ల సత్య (43), పిల్లి పద్మ (45)తో ఈ విషయం చెçప్పడంతో వీరు సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆస్పత్రి డయాలసిస్ మేనేజర్ మెహరాజ్ (37), మదనపల్లె ప్రభుత్వాసుపత్రి డయాలసిస్ మేనేజర్ బాలరంగడు(35) దృష్టికి తీసుకెళ్లారు.వీరు మదనపల్లెలోని డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులను కలిసి కిడ్నీ ఇచ్చేవారు, స్వీకరించే వారున్నారని, పెద్ద మొత్తంలో నగదు వస్తుందని చెప్పగా..ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు నిర్ణయించారు. ఈ ఆపరేషన్ చేసేందుకు బెంగళూరుకు చెందిన డాక్టర్, అతని సహాయకులు ఇద్దరు పాల్గొన్నారని, డాక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈనెల 9న గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో యమునకు ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించగా యమున మృతి చెందిందని చెప్పారు. తాము జరిపిన దర్యాప్తులో మదనపల్లె గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో యమునతోపాటు మరో మహిళ నుంచి కిడ్ని తొలగించి మరొకరికి అమర్చినట్లు డీఎస్పీ చెప్పారు. వీరిలో యమున మృతి చెందగా మరో మహిళ కోలుకుందని, యమున కిడ్నీ స్వీకరించిన వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. ఇంకా ఎంతమంది నుంచి కిడ్నీలు తొలగించారు, వాటిని ఎవరికి అమర్చారన్న వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆపరేషన్లు చేసిన బెంగళూరుకు చెందిన వైద్యుడిని అరెస్ట్ చేయడానికి ప్రయతి్నస్తున్నట్టు చెప్పారు. ఈ డాక్టర్ మదనపల్లెకు వచ్చి ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లు చేస్తున్నట్లు చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లో లింకులు... మదనపల్లె కిడ్నీరాకెట్ వ్యవహారంలో పెద్దమొత్తంలో చేతులు మారినట్లు డీఎస్పీ చెప్పారు. కిడ్నీలు స్వీకరించిన వారి నుంచి అందిన మొత్తంలో అందరూ కలిసి వాటాలు వేసుకున్నారని తెలిపారు. ఈ కేసు లింకులు కర్ణాటక, గోవా, తెలంగాణ, ఏపీల్లో ఉన్నాయని, దీనిపై 4 పోలీసు బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కిడ్నీ రాకెట్ కేసులో మరో ఎనిమిది మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ చెప్పారు. అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితుల ఫోన్లను, సీసీ కెమెరా సీడీఆర్లను స్వాధీనం చేసుకుని ఎఫ్ఎస్ఎల్కు పంపినట్లు చెప్పారు.
వీడియోలు
29వ సీటు నుంచి 11వ సీటుకు సతీష్ లగేజీ
చంద్రబాబు బుద్ది అది... రెచ్చిపోయిన CPI రామకృష్ణ
Chandrasekhar : ఇది ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం బిహార్ కంటే దారుణంగా లోకేష్ రెడ్ బుక్
కరీంనగర్ లో దారుణం కూతురు కొడుకుపై తండ్రి దాడి..
Ranga Reddy: తమ్ముడు కులాంతర వివాహం అన్నను దారుణంగా చంపి
అనైతికత,అంకగణితం.. ఊడపొడిచింది ఏంటి..?
చిత్తూరు జిల్లా కుప్పం అమరావతి కాలనిలో దారుణం
దేశ పౌరుల హక్కులు కాపాడేందుకు సుప్రీంకోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి
జగన్ 2.0 ను తట్టుకోలేరు టీడీపీకి ఉష శ్రీ చరణ్ వార్నింగ్
చంద్రబాబు క్రెడిట్ చోర్ సాక్ష్యాలు లైవ్లో బయటపెట్టిన పేర్ని కిట్టు

