Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Visits Tobacco Farmers At Podili Full Speech Highlights1
మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు: వైఎస్‌ జగన్‌

సాక్షి, ప్రకాశం: రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా.. పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పొదిలి పొగాకు బోర్డును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇవాళ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతులను పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో(పరుచూరు, కొండెపి) ఇటీవలే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర కంటే తక్కవకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో రైతు రాజ్యం నడిచింది. కూటమి ప్రభుత్వంలో రైతు నష్టపోతున్నాడు. మా హయాంలో ఖరీఫ్‌ సీజన్‌లోనే పెట్టుబడి సాయం అందించాం. చంద్రబాబు వచ్చాక రైతు భరోసా సాయం లేదు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా మరో రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు అన్నారు. గతేడాది రైతు భరోసా రూ.20 ఎగ్గొట్టారు. మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు మా ప్రభుత్వంలో రైతుకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ప్రతీ రైతుకు అదనంగా రూ.10 వేలు ఇచ్చేవాళ్లం. పారదర్శకంగా ఉచిత బీమా అందించాం. కానీ, కూటమి వచ్చాక ఉచిత బీమా ఎత్తేశారు. దళారీలు లేకుండా ఇప్పుడు పంట కొనే పరిస్థితి లేదు. ఈ క్రాప్‌ వ్యవస్థను నీరుగార్చారు. మా హయాంలో రైతుకు వెన్నెముకగా ఆర్బీకేలు నిలిచాయి. కూటమి వచ్చాక కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలతో నష్టపోతున్నారు’’ అని కూటమి పాలనను వైఎస్‌ జగన్‌ ఎండగట్టారు.

Ex CM Kcr Attends Kaleshwaram Commission inquiry Updates2
ముగిసిన విచారణ.. బీఆర్‌కే భవన్‌ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్‌

కేసీఆర్‌ విచారణ అప్‌డేట్స్‌.. ఫాంహౌస్‌కు బయలుదేరిన కేసీఆర్‌.. కాళేశ్వరం విషయంలో 115వ సాక్షిగా కేసీఆర్‌ను విచారించిన కమిషన్‌.తెలంగాణలో నీటి లభ్యత, వినియోగంపై కేసీఆర్‌ వివరించినట్టు సమాచారం.బీఆర్‌కే భవన్‌ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్‌.ముగిసిన కేసీఆర్‌ విచారణకాళేశ్వరం కమిషన్‌ ఎదుట కేసీఆర్‌ విచారణ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు కమిషన్‌.. కేసీఆర్‌ను విచారించింది. కాళేశ్వరం నిర్మాణంపై ప్రశ్నలు అడిగిన కమిషన్‌పలు డాక్యుమెంట్లను కమిషన్‌కు అందజేసిన కేసీఆర్‌. కాసేపట్లో బీఆర్‌కే భవన్‌ నుంచి కేసీఆర్‌ బయటకు రానున్నారు. కేసీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌..కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ముందు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్.కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై కమిషన్‌కు నివేదిక ఇచ్చిన కేసీఆర్.కమిషన్ విచారణలో పాల్గొన్న ఇద్దరు నోడల్ అధికారులు.మొత్తం నలుగురు అధికారుల సమక్షంలో సాగుతున్న కేసీఆర్ విచారణ.నోడల్ అధికారుల పేర్లు శ్రీనివాస్, విజయ భాస్కర్ రెడ్డివన్‌ టు వన్‌ విచారణ..కేసీఆర్‌ను వన్‌ టు వన్‌ విచారణ జరుపుతున్న పీసీ ఘోష్‌.అనారోగ్య కారణాలతో ఇన్‌ కెమెరా విచారణ కోరిన కేసీఆర్‌ఓపెన్‌ కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించిన కమిషన్‌ చైర్మన్‌ ఘోష్‌. కేసీఆర్‌తో ప్రతిజ్ఞదేవుని పై ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్తానని కేసీఆర్ తో ప్రతిజ్ఞ చేయించిన కమిషన్ చైర్మన్‌ ఘోష్‌.కమిషన్‌కు పలు డాక్యుమెంట్స్ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్బీఆర్‌కే భవన్‌ వద్ద ఉద్రిక్తతబీఆర్‌కే భవన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అరెస్ట్‌.పోలీసులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య తోపులాట. 👉కాళేశ్వరం కమిషన్‌ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్‌..ఇవన్నీ సీఎం రేవంత్‌ డ్రామాలు: కేటీఆర్‌👉బీఆర్‌కే భవన్‌ వద్ద కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం నాలుగేళ్లలో పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వంద కాంపోనెంట్స్‌ ఉన్నాయి. ఒక్క దాంట్లో చిన్న సమస్య వస్తే.. మొత్తం ప్రాజెక్ట్‌ వేస్ట్‌ అంటున్నారు. ఇరిగేషన్‌పై కేసీఆర్‌కు ఉన్న అవగాహన ఏ నాయకుడికి లేదు. ప్రజల దృష్టి మరల్చడానికి సీఎం ఆడిస్తున్న డ్రామాలు ఇవి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. ప్రజల దృష్టిని మరల్చడానికి సీఎం ప్రయత్నిస్తున్నారు. మేడిగడ్డలో కాంగ్రెస్‌ వాళ్లే కుట్ర చేసి ఉంటారు. సీఎం రేవంత్‌.. చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మంత్రులకు శాఖలు కేటాయించడానికి కూడా ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారు. 94వేల కోట్ల ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. బీఆర్‌కే భవన్‌కు చేరుకున్నారు. తన వెంటన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాల ఫైల్‌ను కేసీఆర్‌ తీసుకెళ్లారు. కేసీఆర్‌ వెంటన తొమ్మిది లోపలికి వెళ్లారు. 👉బీఆర్‌కే భవన్‌ వద్దకు కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 👉నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బీఆర్‌కే భవన్‌ వద్ద హైటెన్షన్‌కమిషన్‌ కార్యాలయానికి కేసీఆర్‌తో పాటు మరో 9 మందికి మాత్రమే అనుమతి.మధుసూదనాచారి, హరీష్‌రావు, ప్రశాంత్‌ రెడ్డి, రవిచంద్ర, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌, పద్మారావు, మహమూద్‌ అలీ, లక్ష్మారెడ్డికి అనుమతి.బీఆర్‌కే భవన్‌ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి.బీఆర్‌కే భవన్‌ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు. వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు.రోప్‌తో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కట్టడి చేస్తున్న పోలీసులు.బీఆర్‌కే భవన్‌ వద్ద పోలీసులతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల వాగ్వాదం.జై కేసీఆర్‌.. జై తెలంగాణ అంటూ గులాబీ పార్టీ కార్యకర్తల నినాదాలు.. 👉ఎర్రవల్లి ఫాం హౌస్ నుండి బీఆర్‌కే భవన్‌ బయలుదేరిన కేసీఆర్, హరీష్ రావు, కవితకాళేశ్వరం పై కమిషన్ విచారణకు ఎర్రవెల్లి నుండి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ pic.twitter.com/s4rDIftNpe— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025 కేసీఆర్‌ చేసిన త్యాగాలు సాటిలేనివి: హరీశ్‌రావుతెలంగాణ కోసం కేసీఆర్‌ చేసిన త్యాగాలు సాటిలేనివి.తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్‌ నిబద్ధత అచంచలమైనది.కాళేశ్వరం వంటి పరివర్తన ప్రాజెక్టులను ప్రజలకు అందించారు.ఇతరులు అధికారం వెంటబడితే.. ఆయన మన జీవితాలను మార్చారు. From achieving Telangana statehood to delivering transformative projects like Kaleshwaram, KCR’s commitment to the people has been unwavering.While others chase power, he changed lives.Congress conspiracy or enquiry commission can't erase his legacy.His sacrifices for…— Harish Rao Thanneeru (@BRSHarish) June 11, 2025 కోర్టు హాల్‌ సిద్ధం..కమిషన్ కార్యాలయంలో కోర్టు హాల్ సిద్ధం చేసిన అధికారులు.ఇన్ కెమెరా ఏర్పాట్లను సైతం సిద్ధంగా ఉంచిన కమిషన్ సిబ్బంది.కేసీఆర్ సమ్మతితో ఓపెన్ కోర్టు విచారణ లేదా ఇన్ కెమెరా విచారణ చేయనున్న కమిషన్ 👉బీఆర్‌కే భవన్ వద్దకు చేరుకుంటున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.👉దేశ్‌కీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న కార్యకర్తలు👉కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఇన్నాళ్లూ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇటీవలే మాజీ మంత్రులనూ విచారించింది. బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయనుంది. ఈ నేపథ్యంలో బీఆర్‌కే భవన్‌ వద్ద టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. కేసీఆర్‌ వస్తున్న క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్కే భవన్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు.👉బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఉదయం 11:30 గంటలకు బీఆర్‌కే భవన్‌లో జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌కే భవన్‌ ముందు రోడ్డును అధికారులు మూసివేశారు. దాదాపు ఐదు వేల మందికిపైగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ, ఎమ్మెల్యే క్వార్టర్స్, ట్యాంక్ బండ్ వైపు రోడ్లలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. బీఆర్‌కే భవన్‌లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందిని మాత్రమే లోపలకు అనుమతిస్తున్నారు. విజిటర్స్, పలు పనులపై బీఆర్కే భవన్‌కు వచ్చే వారిని గేట్ బయటే నిలిపివేస్తున్నారు. 👉ఇదిలా ఉండగా.. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించడం, వారి నుంచి అఫిడవిట్లు తీసుకొని క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను సైతం పూర్తిచేసింది. ఈ నెల 6న ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్, 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణకు హాజరయ్యారు. ఇప్పటివరకు మీడియా, కమిషన్‌లోని ఇంజినీర్ల సమక్షంలోనే విచారణ జరిగింది. నేడు కేసీఆర్‌ విషయంలో ఇదే పద్ధతిని అనుసరిస్తారా లేక కేవలం కమిషన్‌ అధికారుల వరకే పరిమితమై ఇన్‌కెమెరా విచారణ, క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.

govt considering reintroducing MDR charges on UPI transactions3
యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు?

ఆన్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఖర్చులను నిర్వహించడంలో బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్ ప్రొవైడర్లకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా రూ.3,000 కంటే ఎక్కువ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు(ఎండీఆర్‌)ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మర్చంట్ టర్నోవర్‌తో సంబంధం లేకుండా లావాదేవీ విలువ ఆధారంగా ఎండీఆర్‌ను వసూలు చేయాలనేలా చర్చలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.అధిక విలువ కలిగిన డిజిటల్ లావాదేవీల నిర్వహణ వ్యయం పెరగడంపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘తక్కువ పరిమాణంలో యూపీఐ చెల్లింపులకు ప్రస్తుతం ఛార్జీల నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ పెద్ద లావాదేవీలపై త్వరలో మర్చంట్ ఫీజును వసూలు చేసే అవకాశం ఉంది. జనవరి 2020 నుంచి అమలులో ఉన్న జీరో-ఎండీఆర్ విధానానికి బదులుగా రూ.3,000 కంటే ఎక్కువ చేసే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలను తిరిగి ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది’ అని కొందరు అధికారులు తెలిపారు.రిటైల్ డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా 80 శాతంగా ఉంది. కానీ జీరో మర్చంట్ డిస్కౌంట్ రేటు విధానంతో ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకు పరిమిత ప్రోత్సాహకాలు ఉన్నాయి. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ లావాదేవీల కోసం పెద్ద వ్యాపారులపై 0.3 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటును ప్రతిపాదించింది. ప్రస్తుతం రూపే మినహా క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు 0.9 శాతం నుంచి 2 శాతం వరకు ఉంది.బ్యాంకులు, ఫిన్‌టెక్‌ సంస్థలు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) సహా ఇతర వర్గాలతో సంప్రదింపులు జరిపి ఒకటి లేదా రెండు నెలల్లో యూపీఐ చెల్లింపుల ఛార్జీలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ఎన్ఆర్ఐలకు భారత్‌లో ఐటీ నోటీసులు!మర్చంట్ డిస్కౌంట్ రేటు అంటే..మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండిఆర్) అనేది డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి వ్యాపారులు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే రుసుము. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డిజిటల్ వాలెట్ చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దేశంలో ప్రస్తుతం ఎండీఆర్ రేట్లు చిన్న వ్యాపారులకు (టర్నోవర్ రూ.20 లక్షల వరకు) ఫిజికల్ పీఓఎస్, ఆన్‌లైన్‌ లావాదేవీలపై 0.40% (ప్రతి లావాదేవీకి రూ.200కు పరిమితం)గా ఉంది. క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.30% (ప్రతి లావాదేవీకి రూ.200 పరిమితి)గా ఉంది. పెద్ద వ్యాపారులు (టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే) ఫిజికల్ పీఓఎస్, ఆన్‌లైన్‌ లావాదేవీలపై 0.90% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి), క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.80% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి) ఛార్జీలున్నాయి.

WTC 2025 Final, AUS VS SA: Head Eyes On Kohli Record4
WTC Final: కోహ్లి ఆల్‌టైమ్‌ రికార్డుపై కన్నేసిన ట్రవిస్‌ హెడ్‌

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన లార్డ్స్‌ మైదానంలో ఇవాళ (జూన్‌ 11) మధ్యాహ్నం 3 గంటలకు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఆ రికార్డులు ఏంటో చూద్దాం.కోహ్లి ఆల్‌టైమ్‌ రికార్డుపై కన్నేసిన హెడ్‌ఈ మ్యాచ్‌లో (రెండు ఇన్నింగ్స్‌ల్లో) ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు ట్రవిస్‌ హెడ్‌ 94 పరుగులు చేస్తే ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్‌ కోహ్లి రికార్డును బద్దలు కొడతాడు. విరాట్‌ ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో ఇప్పటివరకు 411 పరుగులు చేయగా.. ట్రవిస్‌ హెడ్‌ ఖాతాలో ప్రస్తుతం 318 పరుగులు (కేవలం 3 ఇన్నింగ్స్‌ల్లోనే) ఉన్నాయి.బుమ్రా రికార్డుకు ఎసరు పెట్టిన కమిన్స్‌, స్టార్క్‌నేటి నుంచి ప్రారంభం కాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్‌ స్పీడ్‌స్టర్లు పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌ ఐదు, ఆరు వికెట్లు తీస్తే, ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో (2023-2025) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా అవతరిస్తారు. ప్రస్తుతం ఈ రికార్డు భారత పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా పేరిట ఉంది. బుమ్రా ఈ సైకిల్‌లో 77 వికెట్లు తీయగా.. కమిన్స్‌ 73, స్టార్క్‌ 72 వికెట్లు తీశారు.చరిత్ర సృష్టించనున్న బవుమాఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా మరో 46 పరుగులు చేస్తే (రెండు ఇన్నింగ్స్‌ల్లో) డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన సౌతాఫ్రికా బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు మాజీ కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ పేరిట ఉంది. ఎల్గర్‌ డబ్ల్యూటీసీలో 1935 పరుగులు చేయగా.. ప్రస్తుతం బవుమా ఖాతాలో 1890 పరుగులు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే బవుమా మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకుంటాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక విజయాలు సాధించిన సౌతాఫ్రికా కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు డీన్‌ ఎల్గర్‌, బవుమాల పేరిట సంయుక్తంగా ఉంది. ఇద్దరు తలో 8 విజయాలు సాధించారు.లియోన్‌ ఊరిస్తున్న అశ్విన్‌ రికార్డుఈ మ్యాచ్‌లో ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేస్తే డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసిన బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డును లియోన్‌ టీమిండియా స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌తో కలిసి షేర్‌ చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఇద్దరు తలో 11 ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.చరిత్ర సృష్టించేందుకు 2 వికెట్ల దూరంలో ఉన్న మహారాజ్‌ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ రెండు వికెట్లు తీస్తే.. సౌతాఫ్రికా టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం మహారాజ్‌ ఖాతాలో 198 వికెట్లు ఉన్నాయి.

Is Shah Rukh Khan And Salman Khan Tiger Vs Pathaan Not Shelved5
భారీ బడ్జెట్‌తో షారుక్‌- సల్మాన్‌ సినిమా.. గెస్ట్‌ రోల్స్‌లో ఎన్టీఆర్‌, హృతిక్‌!

వైఆర్‌ఎఫ్‌ (యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌) స్పై యూని వర్స్‌లో భాగంగా ఇప్పటివరకు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా చేసిన ‘ఏక్తా టైగర్‌’ (2012), ‘టైగర్‌ జిందా హై’ (2017), ‘టైగర్‌ 3’ (2023), హృతిక్‌ రోషన్‌ ‘వార్‌’ (2019), షారుక్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ (2023) వంటి సినిమాలు సూపర్‌ హిట్స్‌గా నిలిచాయి. ఈ యూనివర్స్‌లోనే హృతిక్‌ రోషన్‌ – ఎన్టీఆర్‌ హీరోలుగా చేసిన ‘వార్‌ 2’, ఆలియా భట్‌ – శర్వారీ లీడ్‌ రోల్స్‌ చేసిన ‘ఆల్ఫా’ చిత్రం రిలీజ్‌కు సిద్ధమౌతున్నాయి. ‘వార్‌ 2’ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ‘ఆల్ఫా’ చిత్రం ఈ ఏడాది డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా... రెండు సంవత్సరాలుగా ఈ ‘వైఆర్‌ఎఫ్‌’ స్పై యూనివర్స్‌లో భాగంగానే ‘పఠాన్‌ వర్సెస్‌ టైగర్‌’(Pathaan Vs Tiger)చిత్రం రానుందని, ఈ మూవీలో షారుక్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌ హీరోలుగా చేస్తారని, అలాగే ‘పఠాన్‌ వర్సెస్‌ టైగర్‌’ సినిమాలో ఈ యూనివర్స్‌లో భాగమైన హృతిక్‌ రోషన్, జాన్‌ అబ్రహాం, ఆలియా భట్, ఎన్టీఆర్‌ గెస్ట్‌ రోల్స్‌లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాని ‘వార్, పఠాన్‌’ సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తారనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ హఠాత్తుగా ‘పఠాన్‌ వర్సెస్‌ టైగర్‌’ చిత్రం ఆగిపోయిందనే టాక్‌ తెరపైకి వచ్చింది. కానీ అలాంటిది ఏమీ లేదని, ‘వార్‌ 2’, ‘ఆల్ఫా’ చిత్రాలు విడుదలైన తర్వాత ‘పఠాన్‌ వర్సెస్‌ టైగర్‌’ సినిమా గురించి ఓ స్పష్టత వస్తుందని జాతీయ ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో సిల్వర్‌ స్క్రీన్‌పై ‘పఠాన్‌–టైగర్‌’ల పోరు ఉంటుందని, కాకపోతే కొంత సమయం పడుతుందని తెలుస్తోంది.

iTDP and Co False Campaign On Eluru Sakshi Office Incident6
సాక్షిపై విషం చిమ్ముతూ.. మరింత దిగజారిన టీడీపీ!

సాక్షి, అమరావతి: అధికార పార్టీ తెలుగు దేశం మరింత దిగజారిపోయింది. అమరావతి మహిళలను టీవీ డిబేట్‌లో అగౌరవపరిచారంటూ సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావుపై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేయించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో.. సాక్షి మీడియా సంస్థ కార్యాలయాలపైనా దాడులకు తెగబడుతోంది. ఇప్పుడేమో సోషల్‌ మీడియా వేదికగానూ అసత్య ప్రచారాలతో ‘సాక్షి’పై విషం చిమ్ముతోంది.తాజాగా.. ఏలూరు సాక్షి కార్యాలయానికి టీడీపీ నేతలు నిప్పు పెట్టి ఫర్నీచర్‌ను దహనం చేసిన సంగతి తెలిసే ఉంటుంది. మూడు రోజులుగా ఆఫీస్‌ వద్ద నిరసలు చేస్తూ.. మంగళవారం సాయంత్రం రెచ్చిపోయారు. తొలుత దెందులూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు కార్యాలయంపై కోడిగుడ్లు విసిరారు. ఆపై కార్యాలయం కింద ఉన్న ఫ్లెక్సీతో పాటు ఫర్నీచర్‌ను తగలబెట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది కూడా. అయితే.. టీడీపీ సోషల్‌ మీడియా వింగ్‌ ఐ టీడీపీ, ఆ పార్టీ అధికారిక ఫేస్‌బుక్‌, ట్విట్టర్ ద్వారా సాక్షిపై తప్పుడు ప్రచారానికి దిగింది. సాక్షి కార్యాలయానికి తమ పార్టీ శ్రేణులు నిప్పు పెట్టలేదని, సంస్థ ఉద్యోగులే నిప్పు పెట్టి సీసీ ఫుటేజీ దొరక్కుండా మాయం చేశారంటూ కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తోంది. మరోవైపు.. పోలీసులేమో భిన్నమైన ప్రకటన ఒకటి చేయడం కొసమెరుపు. కార్యాలయం వద్ద జరిగిన దాడికి, సాక్షికి అసలు సంబంధమే లేదంటూ కాలిన ఫర్నీచర్‌ యాజమానితో చెబుతున్నారు(పోలీసులే చెప్పించారు!). ఇలా.. పరస్పర విరుద్ధ ప్రచారాలతో టీడీపీ అడ్డంగా దొరికిపోయినట్లైంది. టీడీపీ శ్రేణుల తీరుతో ప్రజల్లో వ్యతిరేకత రావటంతోనే ఇలా కొత్త డ్రామాలకు తెరలేపినట్లు స్పష్టమవుతోంది.

Gali Janardhana Reddy And Telangana High Court Bail7
గాలి జనార్థన్‌ రెడ్డికి తెలంగాణ హైకో‍ర్టులో ఊరట

సాక్షి, హైదరాబాద్‌: ఓబులాపురం అక్రమ మైనింగ్‌‌‌‌ కేసు(ఓఎంసీ)లో కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్థన్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు తాజాగా నిలుపుదల చేసింది. ఈ క్రమంలో గాలి జనార్థన్‌ రెడ్డికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా జనార్థన్‌ రెడ్డి.. దేశం విడిచి వెళ్లవద్దని.. ఆయన పాస్‌పోర్టును సరెండర్‌ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.కాగా, ఓబులాపురం అక్రమ మైనింగ్‌‌‌‌ కేసు(ఓఎంసీ)లో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్‌‌‌‌ చేయాలంటూ కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌‌‌‌రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌‌‌‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. బుధవారం తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌ వెల్లడించారు. ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్‌‌‌‌ రెడ్డి, శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్‌‌‌‌ ను దోషులుగా తేల్చుతూ సీబీఐ కోర్టు గత నెల 6న వారికి ఏడేండ్ల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పును గాలి జనార్దన్‌‌‌‌రెడ్డి ఇతరులతోపాటు ఓఎంసీ కంపెనీ కూడా హైకోర్టులో సవాల్‌‌‌‌ చేసింది. వాదనల అనంతరం కోర్టు స్పందిస్తూ.. మధ్యంతర అభ్యర్థనలపై బుధవారం ఉత్తర్వులు వెలువరిస్తామని ప్రకటించింది. తాజాగా బెయిల్‌ మంజూరు చేసింది.

Rahul Writes to PM Flags Delay in Scholarships8
విద్యార్థుల సమస్యలపై రాహుల్‌ ఆవేదన.. ప్రధాని మోదీకి లేఖ

ఢిల్లీ: దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈబీసీల హాస్టళ్లలో నెలకొన్న పరిస్థితులను మెరుగుపరచాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్పులను తగిన సమయంలో అందించి, విద్యార్థులను ఆదుకోవాలని రాహుల్‌ కోరారు.దేశంలోని దళిత, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని రాహుల్‌ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల వారికి పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లలో జరుగుతున్న జాప్యాన్ని ఆయన తప్పుబట్టారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన 90 శాతం మంది విద్యార్థుల విద్యకు కలిగించే సమస్యలను వెంటనే పరిష్కరించాలని గాంధీ మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.ఇటీవల బీహార్‌లోని దర్భంగాలోని అంబేద్కర్ హాస్టల్‌ను తాను సందర్శించినప్పుడు అక్కడి అపరిశుభ్రమైన టాయిలెట్లు, అసురక్షిత తాగునీరు, మెస్ సౌకర్యాలు లేకపోవడం, లైబ్రరీలు, ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడాన్ని చూసినప్పుడు తనకు బాధ కలిగిందన్నారు. అలాగే అణగారిన వర్గాల విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అందించడంలో ఆలస్యం జరుగుతున్నదన్నారు. అక్కడి స్కాలర్‌షిప్ పోర్టల్ మూడు సంవత్సరాలుగా పనిచేయడంలేదని, 2021-22లో ఏ విద్యార్థికి కూడా స్కాలర్‌షిప్ లభించలేదని రాహుల్‌ పేర్కొన్నారు. ఇటువంటి వైఫల్యాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నాయని, వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. అట్టడుగు వర్గాల యువత అభివృద్ధి చెందకపోతే , దేశం అభివృద్ధి చెందదనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారని తాను భావిస్తానని ఆ లేఖలో రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రియాంకకు హైకోర్టు సమన్లు

Sagubadi: Hing or Asafoetida successfully cultivated in India9
Asafoetida ఐదేళ్ల శ్రమ.. ఇంగువ పండిందోచ్‌!

ఇంగువ.. (Heeng or asafoetida) మన ఆహార సంస్కృతితో విడదీయరాని అనుబంధం ఉన్న సుగంధ్ర ద్రవ్యం. భారతీయ వంటకాల్లో ఇంగువకు విశిష్ట స్థానం ఉంది. ఏ వంటకంలో అయినా చిటికెడు వేస్తే చాలు. అతి తక్కువ పరిమాణంలో వినియోగించినా అత్యంత ప్రభావశీలతనుచూపే విశిష్ట ద్రవ్యం. ఇది కూడా ఒక మొక్క నుంచే వస్తుంది. వేలకొలదీ పంటల జీవ వైవిధ్యానికి ఆలవాలమైనభారతదేశంలో ఇంగువ పంట మాత్రం లేదంటేఆశ్చర్యం కలుగుతుంది. ఇది నిజం. ప్రతి ఏటా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. 2022–23లో 1,442 టన్నుల (విలువ రూ. 1,504 కోట్లు) ఇంగువను దిగుమతి చేసుకుంటున్నాం.అయితే, సరికొత్త కబురేమిటంటే.. శీతల ఎడారుల్లో పండే ఈ పంటనుఇప్పుడు మన దేశంలోనూ పండించటం ప్రారంభించాం. భారతీయఇంగువ పంట సాగు చరిత్రలో 2025 మే 28 ఒక మైలురాయి. విదేశాల నుంచి విత్తనాలు తెప్పించి, మన దేశపు వాతావరణానికిమచ్చిక చేసుకొని, సాగు చేయటంలో విజయం సాధించినట్లు కేంద్రప్రభుత్వ సంస్థ సిఎస్‌ఐఆర్‌ అధికారికంగా ప్రకటించిన రోజిది. అన్నట్లు.. వంటకాల్లోనే కాదు, ఔషధంగానూ.. పంటలనుఆశించే తెగుళ్ల నివారణకూ ఇంగువ మందే! భారతీయ ఇంగువ పంటకుశుభారంభం జరిగిన సందర్భంగా ఆవిశేషాలేమిటో తెలుసుకుందాం.. మనం వాడుతున్న ఇంగువ శాస్త్రీయ నామం ‘ఫెరుల అస్స–ఫోటిడ’ ((Ferula assa-foetida). ఇంగువ సాధారణ వాతావరణంలో పండదు. అతిశీతల ఎడారి ప్రాంతాల్లో పండుతుంది.ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్‌ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు హిమాచల్‌ ప్రదేశ్‌లో సాగు చేయటం ప్రారంభం. బయోరిసోర్స్‌ సెంటర్‌ (ఐహెచ్‌బిటి)లోని శాస్త్రవేత్తలు ఐదేళ్లుశ్రమించి ఇంగువ పంటను ఎట్టకేలకు మచ్చిక చేసుకున్నారు. ఈ విషయాన్ని మే 28న ప్రకటించారు. ఐహెచ్‌బిటి పాలంపూర్‌ క్యాంపస్‌లో ఇంగువ విత్తనోత్పత్తి కేంద్రాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి డా. జితేంద్ర సింగ్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 26న ప్రారంభించారు. మొదటి విడత ఇంగువ మొక్కల నుంచి విత్తనోత్పత్తి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో, ఇక మన దేశంలో ఈ పంట పండించగలం అని శాస్త్రవేత్తలు ప్రకటించారు.ఫలించిన ఐదేళ్ల శ్రమఐహెచ్‌బిటి శాస్త్రవేత్తలు 2018లో తొలుత ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌ దేశాల నుంచి ఇంగువ మొక్క విత్తనాలను అధికారికంగా జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్‌–ఎన్‌బిపిజిఆర్‌) ద్వారా క్వారంటైన్‌ వ్యవస్థ ద్వారా దిగుమతి చేసుకున్నారు. ఆ విత్తనాలను ప్రత్యేక నియంత్రిత వాతావరణంలో సాగు చేసి, వాటి ద్వారా ప్రమాదకరమైన చీడపీడలేవీ దిగుమతి కావటం లేదని నిర్థారణ అయిన తర్వాతే విత్తనాలను మన వాతావరణంలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత టిష్యూకల్చర్‌ పద్ధతిలో ఇంగువ మొక్కలను అభివృద్ధి చేశారు. ఈ ప్రక్రియ మొత్తానికీ ఐదేళ్ల సమయం పట్టింది.ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్‌ లుక్‌లో అఖిల్- జైనబ్‌మహాభారత కాలంలోనే... ఇంగువ ప్రస్తావన ఆయుర్వేద గ్రంథాలతోపాటు, మహాభారతం వంటి పురాతన గ్రంథాల్లోనే ఉంది. ఇంద్రియాలను, మానవ చేతనను శుద్ధి చేయటానికి ఇంగువను వాడేవారు. కడుపు నొప్పి, అజీర్తి నివారణకు.. వంటకం రుచిని పెంపొందించటం కోసం ఇంగువను ఉపయోగపడుతుందని చరక సంహిత చెబుతోంది. పిప్పాలడ సంహిత,పాణిని రచనల్లోనూ ఇంగువ ఉనికి ఉంది.–4 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకుఅతి తక్కువ వర్షపాతం పడే అతి శీతలప్రాంతాల్లో ఇంగువ మొక్క పెరుగుతుంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా ప్రాంతాల్లో అనాదిగా సాగవుతోంది. నీరు నిలవని, తేమ తక్కువగా ఉండే ఇసుక నేలల్లో పెరుగుతుంది. ఏడాదికి 200 ఎం.ఎం. కన్నా తక్కువ వర్షపాతం ఉండాలి. 10–20 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రత నప్పుతుంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటుంది. శీతాకాలంలో –4 డిగ్రీల చలిని కూడా తట్టుకుంటుంది. అతిశీతల, అతి వేడి వాతావరణ పరిస్థితుల్లో ఇంగువ మొక్క నిద్రావస్థకు వెళ్లిపోతుంది. వాతావరణం అనుకూలించాక మళ్లీ చిగురిస్తుంది. అందుకే హిమాచల్‌ప్రదేశ్‌లోని లహాల్‌–స్పిటి జిల్లాల్లో ఈ పంట సాగుపై శాస్త్రవేత్తలు ఐదేళ్లుగా చేసిన ప్రయోగాలు ఫలించాయి. ఇంగువ మొక్కకు తల్లి వేరు నేలలోపలికి వేరూనుకుంటుంది. మందపాటి ఆ వేరు నుంచి, దుంప నుంచి సేకరించిన జిగురు వంటి పదార్ధాన్ని సేకరిస్తారు. దాన్ని ఎండబెట్టి, ప్రాసెస్‌ చేస్తే.. జిగురు పరిమాణంలో 40–64% మేరకు ఇంగువ వస్తుంది. ఔషధంగా వాడే ఇంగువ వేరు. వంటకు వాడే ఇంగువ వేరు. ఔషధంగా వాడే ఇంగువనే పంటలపై తెగుళ్ల నివారణకూ వాడుతుంటారు. ఇంగువ మొక్క పెరిగి పూత దశకు ఎదగడానికి ఐదేళ్ల సమయం పడుతుంది. చదవండి: దాదాపు 200 ఏళ్ల నాటి కండోమ్‌ : ఎగబడుతున్న జనం2018లో విదేశాల నుంచి తెచ్చిన విత్తనాలను క్వారంటైన్‌ లాంఛనాలన్నీ పూర్తి అయ్యాక 2020 అక్టోబర్‌ 15న మన దేశ వాతావరణంలో నాటారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహాల్‌ లోయలోని క్వారింగ్‌ గ్రామంలో మొదట నాటడం ద్వారా భారతీయ ఇంగువ పంట సాగు ప్రారంభం అయ్యింది. ఐహెచ్‌బిటి పాలంపూర్‌లో ఏర్పాటైన జెర్మ్‌ప్లాజమ్‌ రీసోర్స్‌ సెంటర్‌లో ఇంగువ విత్తనోత్పత్తి, శిక్షణ, ఇంగువ ఉత్పత్తి తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడే టిష్యూ కల్చర్‌ యూనిట్‌ కూడా ఏర్పాటు కావటంతో విస్తృతంగా ఇంగువ మొక్కల ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ పంట సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించడానికి జిపిఎస్‌ డేటా ఆధారంగా పెద్ద కసరత్తే జరిగింది. ఎకలాజికల్‌ నిచే మోడలింగ్‌ పద్ధతిలో అనువైన స్థలాలను గుర్తించటం, సాగు చేయటంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. వారి ఐదేళ్ల కృషికి గుర్తింపుగా గత నెల 28న అధికారికంగా ఇంగువ పంటను మన నేలలకు అలవాటు చేసి, విత్తనోత్పత్తి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. అతిశీతల ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఇంగువ మొక్కల్ని సముద్రతలానికి 1,300 మీటర్ల ఎత్తులో ఉండే పాలంపూర్‌ వంటిప్రాంతాల్లో సాగు చేయటంలో విజయం సాధించటమే మనం సాధించిన ఘన విజయంగా శాస్త్రవేత్తలు సంబరంగా చెబుతున్నారు. సుసంపన్నమైన వ్యవసాయక జీవవైవిధ్యానికి ఒకానొక కేంద్ర బిందువైన భారతావని సిగలో మరో కొత్త పంట సరికొత్త ఘుమఘుమలతో చేరటం మనందరికీ సంతోషదాయకం. ఆ విధంగా హిమాచల్‌ రైతులు పండించే ఇంగువను మున్ముందు మనం రుచి చూడబోతున్నామన్నమాట!

Raj Kushwaha he Used to call Sonam Didi Raj Kushwahas sister10
‘హనీమూన్‌’ కేసు: సోనమ్‌ను ‘అక్కా’ అనేవాడు.. షాకిచ్చిన ప్రియుని సోదరి

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన కొత్త జంట రాజారఘువంశీ, సోనమ్‌ల ‘హనీమూన్‌ కథ’ సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోనివిధంగా ఉంది. జూన్ 2న మేఘాలయలోని ఒక లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమయ్యాక ఈ కథలో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. సోనమ్ తమ కుటుంబ వ్యాపార కార్యాలయంలో పనిచేసే రాజ్ కుశ్వాహాతో ఎప్పటి నుంచో ప్రేమలో ఉందని పోలీసుల విచారణలో తేలింది. రాజారఘువంశీ హత్యకు రాజ్ కుశ్వాహాతో పాటు అతని స్నేహితులు ఆకాష్, ఆనంద్, వికాస్‌లు సోనమ్‌కు సహకరించారని, ఇందుకు ‍ప్రతిగా సోనమ్ వారికి రూ. 20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నదని పోలీసులు తెలిపారు. తాజాగా రాజ్ కుశ్వాహా సోదరి సుహానీ మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు నిర్దోషి అని, సోనమ్‌ను ‘దీదీ’ (అక్క) అని సంబోధించేవాడని, ఇంటిలో ఆఫీసుకు సంబంధించిన విషయాలు అంతగా మాట్లాడేవాడు కాదని తెలిపింది. సోనమ్‌ ప్రతీరోజూ ఉదయం అన్నయ్యకు ఫోన్ చేసేదని, ఆఫీసులో చేయాల్సిన పనుల గురించి చెప్పేదని సుహానీ తెలిపింది. తన అన్నయ్య సోనమ్‌ ఆఫీసులో రెండేళ్లు పనిచేశాడని చెప్పింది. మే 23న మేఘాలయలో రాజా రఘువంశీ హత్యకు గురైనప్పుడు తన సోదరుడు ఇండోర్‌లోనే ఉన్నాడని ఆమె పేర్కొంది. మే 11న జరిగిన సోనమ్ వివాహానికి తమ కుటుంబం నుండి ఎవరూ హాజరు కాలేదని సుహాని తెలిపింది. సోనమ్ వివాహ నిశ్చితార్థం తరువాత కూడా తన సోదరునిలో ఎటువంటి మార్పు చూడలేదని, అన్నయ్య ఎటువంటి తప్పు చేయలేదని పేర్కొంది. ఈ హత్యలో సోనమ్‌ దీదీ ప్రమేయం గురించి తనకు తెలియదని సుహానీ తెలిపింది.ఇది కూడా చదవండి: ప్రియాంకకు హైకోర్టు సమన్లు

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement