టీజర్‌ చూసి థ్రిల్‌ అయ్యాను | Raagala 24 Gantallo Teaser Launched by Director Trivikram Srinivas | Sakshi
Sakshi News home page

టీజర్‌ చూసి థ్రిల్‌ అయ్యాను

Published Fri, Sep 27 2019 1:28 AM | Last Updated on Fri, Sep 27 2019 1:28 AM

Raagala 24 Gantallo Teaser Launched by Director Trivikram Srinivas - Sakshi

‘‘టీజర్‌ చాలా బావుంది. థ్రిల్‌ అయ్యాను. ఖచ్చితంగా ఆడియన్స్‌ కూడా థ్రిల్‌ ఫీలవుతారు. టైటిల్‌ కూడా చాలా బావుంది. రఘు కుంచె మ్యూజిక్, కెమెరామేన్‌ అంజి వర్క్‌ బావుంది. దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డికి, నిర్మాత శ్రీనివాస్‌ కానూరుకు ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్‌ సమర్పణలో శ్రీ నవ్‌హాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనివాస్‌ కానూరు నిర్మించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్, ఇషా రెబ్బా జంటగా నటించిన ఈ చిత్రానికి ‘ఢమరుకం’ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహించారు. అక్టోబర్‌ చివరి వారంలో దీపావళి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం టీజర్‌ను దర్శకుడు త్రివిక్రమ్‌ చేతుల మీదుగా విడుదల చేయించింది చిత్రబృందం. ‘‘మా చిత్రం టీజర్‌ను విడుదల చేసిన గ్రేట్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ గారికి చాలా థ్యాంక్స్‌’’ అన్నారు దర్శక, నిర్మాతలు. దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి, నిర్మాత శ్రీనివాస్‌ కానూరుతో పాటు సంగీత దర్శకుడు రఘు కుంచె, కెమెరామేన్‌ ‘గరుడవేగ’ ఫేమ్‌ అంజి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ బాబా అలీ  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement