andhra pradesh legislative council
-
అట్టుడికిన మండలి.. నిలదీసిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల బలవంతపు రాజీనామాల వ్యవహారం.. రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల ఉపాధి అవకాశాల అంశాలు మంగళవారం శాసన మండలిని కుదిపేశాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా ఒకేసారి 17 మంది వీసీలను బెదిరించి.. బలవంతంగా రాజీనామా చేయించారని, ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ సభ్యులు పట్టుపట్టారు. ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని, తామెవరినీ బెదిరించలేదని మంత్రి లోకేశ్ దబాయించబోయారు. ‘ఏ వీసీ అయినా ప్రెస్మీట్ పెట్టి చెప్పారా.. వాట్సాప్లో పంపించారా.. ఫలానా వాళ్లు రాజీనామా చేయమన్నారని చెప్పారా.. ఇలా ఏ ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తారా.. ఆరోపణలను వెంటనే వెనక్కు తీసుకోవాలి’ అంటూ గుడ్లురమబోయారు. ‘వీసీలందరికి ఐఏఎస్ అధికారి సౌరబ్ గౌర్ ఫోన్ చేసి రాజీనామా చేయండని ఒత్తిడి చేశారు. కావాలంటే కాల్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. వీసీలు తమ రాజీనామా పత్రంలో ‘ఉన్నత విద్యా మండలి అధికారుల ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నాం’ అని పేర్కొన్నారు’ అని విపక్ష సభ్యులు ఆధారాలు చూపగా లోకేశ్ వెంటనే మాట మార్చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పించాలో చూపాలన్న డిమాండ్కు సమాధానం చెప్పలేక మంత్రులు నీళ్లు నమిలారు. తర్జుమా చేయడంలో పొరపాటంటూ మంత్రి లోకేశ్ కవర్ చేసుకునేందుకు విఫల యత్నం చేశారు. సర్కారు ద్వంద్వ నీతిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వీసీలతో బలవంతపు రాజీనామాలుసాక్షి, అమరావతి: ‘గవర్నర్ ప్రసంగంలో వీసీల నియామకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీసీల నియామకం అనేది రెగ్యులర్ ప్రొసెస్. ఏ ప్రభుత్వం అయినా వారి పదవీ కాలం ముగిసిన తర్వాతే సెర్చ్ కమిటీ వేసి నియామకాలు చేపడుతుంది. అయితే రాష్ట్రంలో 19 యూనివర్సిటీలుండగా, 17 వర్సిటీల వీసీలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకేసారి రాజీనామా చేశారు. ఇలా ఇంత మంది రాజీనామాలు చేయడం చరిత్రలో ఎప్పుడూ ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. బెదిరించి, బలవంతంగా వారితో రాజీనామా చేయించారు. ఏపీపీఎస్సీ చైర్మన్తో కూడా బలవంతగా రాజీనామా చేయించడం నిజం కాదా.. ’ అని శాసన మండలి వేదికగా వైఎస్సార్సీపీ గళం విప్పింది. ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ జోక్యం చేసుకుంటూ.. ‘మేము బెదిరించాం.. భయపెట్టాం.. బయటకు పంపించాం.. అని వైఎస్సార్సీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖా మంత్రిగా అడుగుతున్నా.. ఆధారాలుంటే హౌస్లో పెట్టండి’ అని మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు. దీనిపై ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి బదులిస్తూ.. ‘నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీలో గొడవలు చేసి, గందరగోళం సృష్టించి.. వీసీ రాజీనామా చేసి పోయేలా చేశారు. నేను అడుగుతున్నది ఒక్కటే.. ఇంత మంది ఒకేసారి రాజీనామా చేస్తే ఎందుకు విచారణ చేయడం లేదో చెప్పాలి’ అని నిలదీశారు. వెంటనే లోకేశ్ జోక్యం చేసుకుంటూ.. ‘ఏదో రాయి వేస్తాం.. మట్టి వేస్తాం.. కడుక్కోండి.. అంటే కుదరదు. మా ప్రభుత్వంలో ఎవరు బెదిరించారో.. ఏమని బెదిరించారో.. రాజీనామా చేసిన వీసీలు ప్రెస్మీట్ పెట్టి చెప్పమనండి.. వీసీ పోస్టుల కోసం 500 మంది అప్లై చేశారు. టాప్ యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లను తీసుకొచ్చి వీసీలుగా నియమించాం. సామాజిక న్యాయం చేశాం. గత ప్రభుత్వం మాదిరిగా ఒక సామాజిక వర్గానికే ఇవ్వలేదు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై వైఎస్సార్సీపీ సభ్యులు స్పందిస్తూ.. ‘దేశ చరిత్రలో ఓ రాష్ట్రంలో ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామా చేయడం జరగలేదు. వారు ఎందుకు రాజీనామాలు చేయాల్సి వచ్చిందో జ్యూడిషియల్ విచారణకు ఆదేశించండి’ అని నిలదీశారు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం.. మంత్రి లోకేశ్ మళ్లీ జోక్యం చేసుకుంటూ.. ‘యూనివర్సిటీలకు ఛాన్సలర్ గవర్నర్. మీరు గవర్నర్ను కించ పరిచినట్టుగా ఆరోపణలు చేస్తున్నారు. లోకేశ్ ఫోన్ చేశాడా.. లేదా ఇక్కడున్న మా మంత్రులు ఎవరు ఫోన్ చేశారో చెప్పమనండి.. లేదా మా ఆఫీస్ నుంచి ఎవరైనా ఫోన్ చేసి బెదిరించారో చెప్పమంటే చెప్పకుండా ఆరోపణలు చేయడం సరికాదు. మీరు చేస్తున్న ఆరోపణల వల్ల విశ్వవిద్యాలయాలకు చెడ్డపేరు వస్తుంది. తక్షణమే బేషరతుగా మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఆధారాలుంటే బయట పెట్టండి. తప్పకుండా విచారణ జరిపిస్తాం.. ల్యాప్ ట్యాప్ నా దగ్గరే ఉంది.. ఇప్పుడే ఆర్డర్ ఇస్తా.. మాజీ వీసీలు ఎవరైనా మీకు ఫోన్ చేశారా? వాట్సాప్ మెసేజ్ చేశారా? వివరాలు ఇవ్వండి.. చర్యలు తీసుకుంటాం. వీసీల రాజీనామాల వ్యవహారమే కాదు.. 2019 నుంచి ఏం జరిగిందో అంతా బయటకు తీద్దాం. అన్నీ బయటకొస్తాయి. ఇప్పటికే ఒకరు జైల్లో ఉన్నారు. ఎవరినీ వదిలి పెట్టం. వెయిట్ అండ్ వాచ్.. టైమ్, డేట్ రాసుకోండి’ అని తీవ్ర స్వరంతో మంత్రి లోకేశ్ హెచ్చరించారు. ఈ దశలో టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి మాట్లాడుతూ ‘రాజీనామా చేసిన వీసీలంతా మీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి బావమరుదులు, మేనత్తలే అని అన్నారు. వైఎస్ జగన్ ఓడిపోయారు కాబట్టి వారంతా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారన్నారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో గందరగోళంతో చైర్మన్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు.ఇవిగో ఆధారాలు..సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ‘వీసీలందరికీ ఐఏఎస్ అధికారి సౌరబ్ గౌర్æ ఫోన్ చేసి రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. ఆ మరుసటి రోజే వారంతా రాజీనామా చేశారు. కావాలంటే కాల్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు.. వీసీలు తమ రాజీనామా పత్రంలో ఉన్నత విద్యా మండలి అధికారుల ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? తక్షణమే విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. ఇదే విషయమై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. ‘ఏ విచారణ కావాలి.. జ్యుడీషియల్ విచారణా లేక డిపార్టుమెంటల్ విచారణా.. క్లారిటీ ఇవ్వండి‘ అని చైర్మన్ కోరగా, ‘మేము జ్యూడిషియల్ ఎంక్వైరీ కోరుతున్నాం.. వాళ్లు ఎంక్వైరీ వేసినా మాకు అభ్యంతరం లేదు. మంత్రి చెబుతున్నట్టు 2019 నుంచే కాదు.. కావాలంటే 2014 నుంచి ఎంక్వైరీ చేయండి. మాకు అభ్యంతరంలేదు. వాస్తవాలేమిటో ప్రజలకు తెలుస్తాయి’ అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ దశలో మంత్రి లోకేశ్ మాట మార్చారు. ‘ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇస్తే ఎంక్వైరీ వేస్తాం. ఏ ఆధారం లేకుండా కేసు పెట్టమంటే ఎలా?’ అని తప్పించుకొనే ప్రయత్నం చేశారు. ‘ముందు ఒకలా మాట్లాడుతున్నారు.. ఆధారాలు చూపాక మరొకలా మాట్లాడుతున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీసీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.బెదిరిపోయేవాళ్లెవరూ లేరు: బొత్స మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ‘ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో విచారణ జరపాలని మా సభ్యులు కోరుతున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఎంక్వైరీ వేయండి.. నిరూపిస్తాం.. నిరూపించకపోతే అప్పుడు మాట్లాడండి. అడిగిన దానికి బదులివ్వకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. మళ్లీ మళ్లీ చెబుతున్నాం. చట్ట ప్రకారం ఏం చేయదల్చుకున్నారో చేయండి. ఇక్కడ ఎవరూ బెదిరిపోయేవాళ్లు, అదిరిపోయే వాళ్లు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్లు అనుభవిస్తారు. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి’ అని బొత్స సత్యనారాయణ... మంత్రి లోకేశ్కు దీటుగా స్పందించారు. -
ప్రజలకు షాక్లు.. సర్కారు సోకులు 'వాతలపై వాకౌట్'
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు విద్యుత్తు షాకులపై శాసన మండలి దద్ధరిల్లింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని... అవసరమైతే చార్జీలను ఇంకా తగ్గిస్తామన్న హామీని కూటమి నేతలు గాలికొదిలేయడంతోపాటు ఐదు నెలల్లోనే ప్రజలపై ఏకంగా రూ.17 వేల కోట్లకుపైగా కరెంట్ చార్జీల భారాన్ని మోపడాన్ని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మండలి సాక్షిగా నిగ్గదీసింది. గత సర్కారుపై బురద చల్లే యత్నాలను ఎండగట్టింది. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా డిస్కమ్లకు (విద్యుత్తు పంపిణీ సంస్థలు) సకాలంలో రాయితీలను అందించి ఆదుకుందని, ఐదేళ్లలో ఏకంగా రూ.45 వేల కోట్లకు పైగా అందచేసిందని గుర్తు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించేందుకు నిరాకరిస్తూ వినియోగదారులపై నిర్దాక్షిణ్యంగా రూ.17 వేల కోట్లకుపైగా చార్జీల భారాన్ని మోపుతోందని మండిపడింది. విద్యుత్తు చార్జీల వాతలు, సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు లేకపోవడం, రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలకు నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సోమవారం మండలి నుంచి వాకౌట్ చేసింది. శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ అంశాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం నిర్వాకాలపై నిప్పులు చెరిగారు. సామాన్య ప్రజలపై విద్యుత్తు చార్జీల భారాన్ని ఎందుకు మోపుతున్నారని నిలదీశారు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన తరువాత ఆ కార్యక్రమాల వ్యయాన్ని ఆయా ప్రభుత్వాలే భరించాలని హితవు పలికారు. ‘ఎన్నికల సమయంలో మీరే వాగ్దానం చేశారు కదా? హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? సబ్సిడీ కింద ప్రభుత్వం నిధులు కేటాయించి వినియోగదారులకు ఊరట కల్పించవచ్చు కదా? ఇప్పటికే రూ.ఆరు వేల కోట్లకుపై భారాన్ని ప్రజలపై మోపారు. ఇంకో రూ.11 వేల కోట్లకుపైగా భారాన్ని కూడా వేసి ఏం చేద్దామనుకుంటున్నారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు జరపకపోవడం మోసపూరితమని మండిపడ్డారు. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తూ సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ‘రాష్ట్ర విభజన తరువాత విద్యుత్ బకాయిలు, అప్పులు రూ.ఏడు వేల కోట్ల దాకా ఉంటాయి. 2014–19 మధ్య టీడీపీ సర్కారు వాటిని రూ.29 వేల కోట్ల వరకు తీసుకెళ్లింది. వైఎస్సార్ సీపీ హయాంలో రూ.395 కోట్లకు మించి ఐదేళ్లలో డిస్కంలపై భారం పడలేదు. అదే నాడు టీడీపీ హయాంలో రూ.22 వేల కోట్ల మేర భారం వేశారు. ఇక టీడీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లలో డిస్కంలకు రూ.15 వేల కోట్లు మాత్రమే సబ్సిడీ కింద ఇవ్వగా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.45 వేల కోట్లకుపైగా విద్యుత్ రంగానికి అందచేసి ఆదుకుంది’ అని గణాంకాలతో కూటమి సర్కారు షాకులను ఎండగట్టారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి నిరసనగా పార్టీ సభ్యులందరితో కలసి వాకౌట్ చేశారు. అప్పులపై తప్పుడు ప్రచారం.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు మూడు నెలల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం ఆనవాయితీ. ఇంత ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు ఎటువంటి కేటాయింపులు లేకపోగా ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న విషయంపై కూడా స్పష్టత లేదంటే ఇది మోసపూరిత బడ్జెట్ కాక ఇంకేమంటారు? మాజీ ఆర్ధికమంత్రి రూ.14 లక్షల కోట్ల అప్పలు అంటారు! ముఖ్యమంత్రి రూ.పది లక్షల కోట్లు అంటారు! ఆర్థిక మంత్రి రూ.6.46 లక్షల కోట్లు అని బడ్జెట్లో అంటారు! మరి ఇందులో ఏది నిజం? ఎవరు తప్పుడు లెక్కలు చెబుతున్నారో సభకు స్పష్టత ఇవ్వాలి. గత ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిర్దేశించిన పరిమితికి లోబడి అందులో 86 శాతం మాత్రమే అప్పులు తీసుకుంది. సూపర్ సిక్స్ ఎక్కడ? సూపర్సిక్స్ పథకాలకు కేటాయింపులు ఎక్కడ? స్కూలుకు వెళ్లే పిల్లలకు తల్లికి వందనం ఎక్కడ? నీకు 15 వేలు.. నీకు 15 వేలు అనేది ఇప్పుడు తెగ ప్రచారమవుతోంది. పాఠశాల విద్యార్థులు 80 లక్షల మందికిపైగా ఉంటే బడ్జెట్లో కేటాయించిన రూ.5,000 కోట్లు ఎలా సరిపోతాయి? ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు? 50 ఏళ్లు దాటిన వారికి ఫించను హామీని ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆలస్యం ఎందుకు? 20 లక్షల ఉద్యోగాలు సృష్టించలేనప్పుడు కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలి కదా? దిగజారిన శాంతి భద్రతలు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఉప ముఖ్యమంత్రే చెప్పారని బొత్స పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, హత్యాచారాలపై మండలిలో చర్చ సందర్భంగా అధికార – ప్రతిపక్ష సభ్యుల వాగ్యుద్ధం చోటు చేసుకుంది. హోంమంత్రి అనిత జవాబిచ్చిన తీరును బొత్స ఖండించారు. సభ్యుల ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పకుండా మంత్రి రాజకీయ ఉపన్యాసాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గత ఐదు నెలల కాలంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, వేధింపులు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కల్పలత ఆందోళన వ్యక్తం చేశారు. యథేచ్ఛగా మద్యం బెల్ట్ షాపులు ఏర్పాటవుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు జరిగిన నేరాల్లో 24–48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశామని హోంమంత్రి అనిత చెప్పారు. కాగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ ఈ సందర్భంగా మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు. కాగా శాంతి భద్రతలు విఫలమయ్యాయని డిప్యూటీ సీఎం అనలేదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఔను.. ఒక్క సిలిండరే ఉచిత గ్యాస్ సిలెండర్ హామీపై బొత్స గట్టిగా నిలదీయండంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చి అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క సిలెండర్ మాత్రమే ఉచితంగా ఇస్తామని, ఏడాదికి మూడు ఉచిత సిలెండర్ల హామీని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభలో స్పష్టం చేశారు. ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనం పెంపు ప్రతిపాదన లేదు.. ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనాల పెంపు ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రి ఫరూక్ తెలిపారు. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి మాత్రమే ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందని చెప్పారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వైఎస్సార్ ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, మహ్మమద్ రుహల్లాలు ఈ అంశాలను ప్రస్తావించారు. మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదు: మంత్రి గొట్టిపాటి రవి రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ఉపప్రశ్నకు మంత్రి గొట్టిపాటి ఈ మేరకు బదులిచ్చారు. బిల్లును వ్యతిరేకిస్తున్నాం: లక్ష్మణ్రావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిలును మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికే తొలిదశలో రూ.6 వేల కోట్ల భారాన్ని విద్యుత్తు వినియోగదారులపై మోపింది. ఇప్పుడు మరో రూ.11 వేల కోట్ల బాదుడుకు సిద్ధమైంది. మొత్తం సుమారు రూ.17 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేస్తోంది. వినియోగదారులకు ఇది మోయరాని భారం. ఇలాంటి బిల్లు ఇప్పుడు అవసరమా? దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. మూజువాణితో ఆమోదం... మండలిలో విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చకు విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానిచ్చారు. గత ప్రభుత్వం ఎంతో మేలు చేసినట్లు బొత్స సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని విమర్శించారు. ఇది సవరణ మాత్రమేనని, గత ప్రభుత్వమే ప్రజలపై భారం వేసిందని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో లోపాలను సరిదిద్దడానికే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామన్నారు. అనంతరం బిల్లుపై సభలో తీర్మానం ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు చైర్మన్ మోషేన్రాజు ప్రకటించారు. -
Andhra Pradesh: ‘మండలి’లో మంటలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై శాసన మండలి అట్టుడికింది. కూటమి సర్కారు నిరంకుశ వైఖరి, అరాచక విధానాలపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే నెపంతో చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులను అరికట్టాలి.. నిరంకుశ రాజ్యం నశించాలి.. ఉయ్ వాంట్ జస్టిస్.. సేవ్ డెమొక్రసీ అంటూ నినదించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కించపరుస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కూటమి పార్టీలకు చెందిన కొందరు పెట్టిన అభ్యంతరకర పోస్టుల ప్లకార్డులను ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సభ్యులు ప్రదర్శించారు. యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ అరెస్టులపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ సభ్యులు మొండితోక అరుణ్కుమార్, తుమాటి మాధవరావు, పి.రామసుబ్బారెడ్డి వాయిదా తీర్మానాన్ని ఇవ్వగా మరో ఫార్మాట్లో తేవాలంటూ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు తిరస్కరించారు. దీనిపై చర్చకు అనుమతించాలంటూ పట్టుబట్టిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, తలశిల రఘురాం, వరుదు కళ్యాణి, కల్పలతారెడ్డి, పండుల రవీంద్రబాబు, తోట త్రిమూర్తులు, మహ్మద్ రుహుల్లా తదితరులు పోడియం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నారా లోకేశ్, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, మండలి చీఫ్విప్ పంచుమర్తి అనురాధ, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు దీనిపై జోక్యం చేసుకుంటూ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత చర్చకు పట్టుబట్టడం సరికాదన్నారు. దీనిపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అనేక మంది యువకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని, దీనిపై సభలో ఖచ్చితంగా చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టారు. చర్చ కోసం వైఎస్సార్సీపీ సభ్యులు నిరసన తెలపడంతో సభ 34 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో చైర్మన్ మోషేన్రాజు సభను కొద్దిసేపు వాయిదా వేసి మళ్లీ కొనసాగించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కాలయాపనపై చర్చించేందుకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని కూడా మండలి చైర్మన్ మోషేన్రాజు తిరస్కరించారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై చర్చకు డిమాండ్ చేస్తున్న సభ్యులు మా రాజీనామాలు ఆమోదించండి.. సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై చర్చించాలని వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన చేస్తున్న సమయంలోనే వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ రాజీనామాలు ఆమోదించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, టీడీపీ సభ్యులు కలసి వారిని ముందుకు తీసుకెళ్లడం గమనార్హం. ఆ ముగ్గురూ పోడియం పైకి వెళ్లి చైర్మన్ను కలసి తమ రాజీనామాలు ఆమోదించాలని విజ్ఞాపన పత్రాలు అందించారు. మీ రాజీనామాల అంశం పరిశీలనలో ఉందని, వాటిపై తర్వాత నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ స్పష్టం చేశారు. బడ్జెట్పై చర్చను అడ్డుకున్న మంత్రులు శాసన మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు బడ్జెట్పై మాట్లాడుతున్న సమయంలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు పదేపదే అడ్డుపడి రభస సృష్టించారు. వైఎస్సార్సీపీ సభ్యురాలు వరుదు కళ్యాణి బడ్జెట్పై చర్చను ప్రారంభించగానే మంత్రులు, కూటమి సభ్యులు చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. చర్చ పక్కదారి పడుతోందని, బడ్జెట్పైనే మాట్లాడాలంటూ చైర్మన్ సహనంతో పలుమార్లు కోరినా మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, డోలా బాలవీరాంజనేయస్వామి, అనిత, సవిత పదేపదే అడ్డు తగులుతూ చర్చ కొనసాగనివ్వకుండా చేశారు. విధిలేని పరిస్థితుల్లో చైర్మన్ పది నిమిషాలు సభను వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులు అదే ధోరణి కొనసాగించారు. చర్చ పూర్తిగా తప్పుదోవ పట్టి గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.సర్వనాశనం చేసింది బాబే: బొత్సరాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబేనని, మళ్లీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి నాశనం చేశారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో అందుకు అనుగుణంగా కేటాయింపులు జరపలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్సీపీ సభ్యులు కోరటాన్ని తప్పుబడితే ఎలా? అని ప్రశ్నించారు. హామీలు ఎలా అమలు చేస్తారు? ఎప్పుడు నెరవేరుస్తారు? అని అడిగితే అందులో తప్పు ఏముందన్నారు. తమ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక చర్చను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.ఏం జరిగిందంటే..?బడ్జెట్పై చర్చ సందర్భంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి పారీ్టలు హామీ ఇచ్చినట్లుగా.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.18 వేలు.. రైతులకు రూ.20,000, మహిళలకు నెలకు రూ.1,500 లాంటి పథకాల కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. అయితే బడ్జెట్లో ఈ పథకాలకు ఒక్క పైసా కూడా కేటాయించలేదని చెబుతుండగా.. మంత్రి సవిత, అనిత, పయ్యావుల కేశవ్ ఆమెను పదేపదే అడ్డుకున్నారు. సభ్యులు ప్రసంగించకుండా మంత్రులు ఈ విధంగా పదేపదే అడ్డుపడటం సరికాదని ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. సభ్యుల ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే వాటిని నోట్ చేసుకొని సమాధానం ఇచ్చే సమయంలో వివరణ ఇస్తే సరిపోతుందన్నారు. ఈ సందర్భంగా సభలో ఏ విధంగా నడుచుకోవాలి? ఎలా మాట్లాడాలి? అనే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరగడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. అనంతరం వరుదు కళ్యాణి తిరిగి చర్చను ప్రారంభిస్తూ దీపం–2 పథకం కింద మూడు ఉచిత సిలెండర్లకు రూ.3,000 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో కేవలం రూ.800 కోట్లే కేటాయించారని ప్రస్తావిస్తుండగా.. మంత్రి అనిత నిలబడి ఆమెను అడ్డుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమైందని కళ్యాణి మాట్లాడుతున్న సమయంలో మంత్రి డోలా వీరాంజనేయస్వామి లేచి నిలబడి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మీ నాయకుడు పారిపోయి ఇంట్లో పడుకున్నారు..! త్వరలో మీరూ పారిపోతారంటూ వైఎస్సార్సీపీ సభ్యులను రెచ్చగొట్టడంతో సభలో అలజడి చెలరేగింది. ఇంతలో హఠాత్తుగా నారా లోకేశ్ లేచి నిలబడి అసందర్భ చర్చను తెరపైకి తెచ్చారు. గౌరవ సభలో మా తల్లిని అవమానించారని, అందుకే ఆగ్రహంతో మాట్లాడుతున్నాం అంటూ ఊగిపోయారు. అయితే రికార్డుల్లో లేని విషయాలు, సభలో లేని వ్యక్తులను ప్రస్తావించి చర్చ చేయడం సరికాదంటూ బొత్స వారించారు. ఇరుపారీ్టల సభ్యులు వాగ్యుద్ధానికి దిగడంతో చైర్మన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. -
వీ వాంట్ జస్టిస్.. సేవ్ డెమోక్రసీ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నిరసన
అమరావతి, సాక్షి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమైన కాసేపటికే.. శాసనమండలిలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబట్టగా.. చైర్మన్ అందుకు నిరాకరించారు. దీంతో.. ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం చుట్టుముట్టి అరగంట పాటు నినాదాలతో తమ నిరసన తెలియజేశారు. సోషల్ మీడియా అరెస్టులతో పాటు డీఎస్సీపై పీడీఎఫ్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే చైర్మన్ కొయ్యే మోషేన్రాజు ఆ రెండు తీర్మానాలను తిరస్కరించారు. తమ వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని చైర్మన్ను మండలిలో ప్రతిపక్ష నేత బొత్స కోరారు. అయినా అందుకు చైర్మన్ అంగీకరించలేదు. దీంతో.. పోడియం వద్దకు వచ్చి చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ‘‘వీ వాంట్ జస్టిస్..’’, ‘‘సేవ్ డెమోక్రసీ’.. అంటూ నినాదాలు చేస్తుండగా.. మరోవైపు కూటమి ఎమ్మెల్సీలు వాళ్లతో వాగ్వాదానికి దిగి రెచ్చగొట్టేందుకు యత్నించారు. కానీ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాత్రం సోషల్ మీడియా పోస్టుల ప్రతులను చైర్మన్కు చూపిస్తూ నినాదాలు కొనసాగించారు. చేసేది లేక ఆ నినాదాల నడుమే ఏపీ మంత్రులు మాట్లాడేందుకు యత్నించారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొనగా.. మండలిని కాసేపు వాయిదా వేశారు చైర్మన్. ఇదీ చదవండి: చావు లెక్కలు నవ్వుతూ.. -
AP: ఫిరాయింపు ఎమ్మెల్సీ కొత్త డ్రామా?
విజయనగరం, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు కొత్త డ్రామాకు తెర లేపారా?. సరిగ్గా శాసన మండలిలో అనర్హత పిటిషన్పై విచారణ నాడే ఆయన ఆస్పత్రిలో చేరడం ఆ అనుమానాలను బలపరుస్తోంది. ఎమ్మెల్సీ రఘురాజు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి పార్టీ ఫిరాయించారు. దీంతో వైఎస్సార్సీపీ శాసనమండలిలో ఫిర్యాదు చేసింది. మే 27వ తేదీన విచారణకు హాజరు కావాలని మండలి చైర్మన్ మోషేన్ రాజు నోటీసులు పంపారు. అయితే ఆరోజు కారణం ఏంటో చెప్పకుండానే రఘురాజు విచారణకు గైర్హాజరు అయ్యారు. దీంతో విచారణను మే 31(ఇవాళ్టికి) వాయిదా వేశారు చైర్మన్. అయితే విచారణకు రాకుండా విశాఖ నారాయణ ఆస్పత్రిలో చేరారు రఘురాజు. కిడ్నీ సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరారని ఆయన అనుచరులు అంటున్నారు. మరోవైపు ఆయన ఇవాళ కూడా విచారణకు గైర్హాజరు కావడంతో చైర్మన్ మోషేన్ రాజు విచారణ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. తదుపరి విచారణ ఎప్పుడుంటుదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఇటు శాసనమండలిలో.. అటు శాసనసభలోనూ చైర్మన్, స్పీకర్లు ఫిరాయింపులను తీవ్రంగా పరిగణిస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీకి మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. ఇక మండలిలోనూ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపైనా అనర్హత వేటు పడింది. -
మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ / సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 9 స్థానిక సంస్థల నియోజకవర్గాలు, 3 పట్టభద్రులు, 2 టీచర్ల నియోజకవర్గాలకు మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 16న కౌంటింగ్ చేపడతారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. నామినేషన్లకు చివరి తేదీ ఈ నెల 23 కాగా, ఉపసంహరణకు ఈ నెల 27 చివరి తేదీగా నిర్ణయించారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. తెలంగాణలో 1 టీచర్ (హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్నగర్) ఎమ్మెల్సీ, 1 స్థానిక సంస్థల (హైదరాబాద్) స్థానాల్లో కూడా ఇదే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలో ఎన్నికలు జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు: అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానాలు, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే స్థానాలు : ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు కడప – అనంతపురం – కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు : 1. ప్రకాశం– నెల్లూరు –చిత్తూరు 2. కడప– అనంతపురం– కర్నూలు 3. శ్రీకాకుళం– విజయనగరం– విశాఖపట్నం షెడ్యూల్: నోటిఫికేషన్ : ఫిబ్రవరి 16 నామినేషన్లకు చివరి తేది : ఫిబ్రవరి 23 నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 24 నామినేషన్ ఉపసంహరణ : ఫిబ్రవరి 27 ఎన్నిక : మార్చి 13 ఫలితాలు: మార్చి 16 -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: వికేంద్రీకరణపై స్పల్ప కాలిక చర్చ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్ ►అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిధ్వజమెత్తారు. కట్టని రాజధాని గురించి కట్టలేని గ్రాఫిక్స్ గురించి వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమాలు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలు అని సీఎం జగన్ ప్రశ్నించారు. ► ‘టీడీపీ సొంత అభివృద్ధి కోసమే ఈ ఉద్యమాలు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కంటే కట్టని, కట్టలేని అమరావతి చంద్రబాబుకు గొప్పది. అమరావతి రాజధాని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం కాదు.. కేవలం పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమే. ►నవరత్నాల ద్వారా రూ.లక్షా 65వేల కోట్లు డీబీటీ ద్వారా లబ్దిదారులకు అందించాం. అవినీతికి తావులేకుండా నేరుగా అకౌంట్లలో వేశాం. చంద్రబాబు హయాంలో రైతుభరోసా ఎందుకు లేదు?. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు ఇవ్వలేదు?. 21 లక్షల ఇళ్లు ఎందుకు నిర్మించలేదు?. ►బాబు హయాంలోనూ, ఇప్పుడు ఒకే బడ్జెట్ ఉంది.. మరి ఆ నిధులన్నీ ఏమయ్యాయి?. చంద్రబాబు హయాంలో ఇన్ని పథకాలు ఎందుకివ్వలేదు?. ఆనాడు దోచుకో పంచుకో తినుకో అన్నట్లు సాగింది. ►బినామీ భూములు ప్రాంతమే రాజధానిగా ఉండాలనేదే పెత్తందారీల మనస్తత్వం. పచ్చళ్లు అమ్మినా మా వారి పచ్చళ్లే అమ్మాలనేది పెత్తందారీ మనస్తత్వం. చిట్ఫండ్ వ్యాపారమైనా మా వాళ్లే వ్యాపారం చేయాలనేది పెత్తందారీల మనస్తత్వం’ అని సీఎం జగన్ విమర్శించారు. ►మా వాడైతే ఆర్బీఐ నిబంధలను ఉల్లంఘించి చిట్ఫండ్ వ్యాపారం చేయొచ్చనేది వారి మనస్తత్వం. మా నారాయణ, మా చైతన్య ఉండాలనేది పెత్తందారీల మనస్తత్వం. ప్రతిపక్ష పార్టీలో కూడా నా మనుషులే ఉండాలనేది పెత్తందారీల మనస్తత్వం. వీళ్లంతా ఈ మధ్య ఒకటే రాజధాని అమరావతి అని డిజైన్ చేశారు’ అని సీఎం జగన్ ►ఏపీకి అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని కురసాల కన్నబాబు అన్నారు. టీడీపీ స్వప్రయోజనాల కోసమే రాజధానిగా అమరావతి ఉందన్నారు. విజన్ అని చెప్పుకునే చంద్రబాబు ప్లానింగ్ ఏంటో అర్థం కాలేదన్నారు. పాదయాత్ర పేరుతో హడావుడీ చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రకు కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వమే కాకుండా నిర్మాత కూడా చంద్రబాబేనని విమర్శించారు. ►వికేంద్రీకరణపై అసెంబ్లీలో కన్నబాబు మాట్లాడుతూ.. ‘అభివృద్ధి వికేంద్రీకరణ అవమసరమని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. రాజధాని కోసం కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని నియమిస్తే.. చంద్రబాబు నారాయణ కమిటీని నియమించారు. నారాయణ కమిటీ తుళ్లూరులో రాజధాని ఎంపిక చేసింది. దానికి అమరావతి అని పేరు పెట్టారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ చుట్టూ భూములు కొనిపించినట్టే.. తమ వాళ్లతో అమరావతిలోనూ చంద్రబాబు భూములు కొనిపించారు. రూ. లక్ష కోట్లతో రాజధాని అభివృద్ధి కష్టమనే.. సీఎం జగన్ వికేంద్రీకరణకు మొగ్గు చూపారు.’ అని కన్నాబాబు తెలిపారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సీట్లలో కూర్చోవాలని స్పీకర్ ఆదేశించినా ఆందోళన కొనసాగించారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ను టీడీపీ సభ్యులు ఏకవచనంతో సంబోధించగా.. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టీడీపీ సభ్యులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ►పయ్యావుల కేశవ్ కుమారుడు భూమలు కొన్నది వాస్తవం కాదా అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఎప్పుడెప్పుడు భూములు కొన్నారో తమ దగ్గర వివరాలు ఉన్నాయన్నారు. రాజధానిపై ఇష్టానుసారం మాట మార్చింది టీడీపీనే అని విమర్శించారు. ► కొందరి చేతుల్లోనే అమరావతి భూములు ఉన్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. వికేంద్రీకరణపై అసెంబ్లీలో స్పల్ప కాలిక చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమరావతిలోనివి తాత్కాలిక నిర్మాణాలు అని తెలిపారు. 30 వేల ఎకరాల భూమిలో కొంతమంది చేతుల్లోనే 10 వేల ఎకరాలు ఉన్నాయని అన్నారు. టీడీపీ అంటేనే టెంపరరీ డెవలప్మెంట్ పార్టీ అని, అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ►16 వేల గ్రామాల్లో సచివాలయాలు పెట్టిన వ్యక్తి సీఎం జగన్. గ్రామ సచివాలయాలతో లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాగా.. 26 జిల్లాలు ఏర్పాటు చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ పాలన.మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రకరణ జరగాలని సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ. సీఎం జగన్పై బురద జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. వాళ్లకు రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశం లేదు. 40 ఆలయాలు కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు. ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్నారు. తన స్వార్థం కోసం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దు: కొడాలి నాని ► సచివాలయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసిన ఘనత సీఎం జగన్దే. గ్రామ సచివాలయాలతో ప్రజలకు పాలన చేరువైంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన మరింత దగ్గరైంది. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకే సచివాలయ వ్యవస్థ. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేశాము. అన్నమయ్య పేరుతో జిల్లా ఏర్పాటు చేయడం గొప్ప ఆలోచన: భూమన కరుణాకర్ రెడ్డి ► వికేంద్రీకరణపై అసెంబ్లీలో స్పల్ప కాలిక చర్చ ►చంద్రబాబు డైరెక్షన్లో వీరాంజనేయులు పనిచేస్తున్నారు. అసెంబ్లీలో సభా హక్కులను ఉల్లంఘిస్తున్నారు. దళితులను కించపరచడం టీడీపీకి అలవాటే: సుధాకర్బాబు ►అసెంబ్లీలో నేను తప్పుగా ఏమీ మాట్లాడలేదు. బాల వీరాంజనేయులు బాధ్యతారహితంగా మాట్లాడారు: మేరుగ నాగార్జున ►మా సభ్యులను కావాలనే రెచ్చగొడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.మేరుగ నాగార్జునను రెచ్చగొట్టాలని ప్రయత్నించి నీతులు చెబుతున్నారు. అలాంటి వ్యవహారాన్ని అంగీకరించొద్దు- అంబటి ►టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం ►సభలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టీకరణ ► ఉద్యోగాలపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. ఇంటికో ఉద్యోగమని చంద్రబాబు మోసం చేశారు. 1.30 లక్షల మందికి సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలు కల్పించాం. 2.80 లక్షల మందికి వాలంటీర్లుగా అవకాశం ఇచ్చాం. లోకం పూర్తిగా తెలియన వ్యక్తి లోకేష్.. దొడ్డిదారిన మంత్రి అయ్యారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో టీడీపీ విఫలం: వేణుగోపాలకృష్ణ ►తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ► ముగిసిన బీఏసీ సమావేశం.. ఐదురోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ► స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం ఈ సమావేశంలో సీఎం జగన్మోహన్రెడ్డితో పాటు సభ్యులు బుగ్గన, పెద్దిరెడ్డి, జోగి రమేస్, ప్రసాద్రాజు, శ్రీకాంత్రెడ్డిలు పాల్గొన్నారు. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. దివంగత నేతలకు ఏపీ అసెంబ్లీ సంతాపం ► ఈ మధ్యకాలంలో కన్నుమూసిన నేతలకు.. ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పులపర్తి నారాయణమూర్తి, జేఆర్ పుష్పరాజ్, నల్లమిల్లి మూలారెడ్డి మృతి పట్ల సభ్యులు సంతాపం ప్రకటించారు. సభను అడ్డుకోవాలని టీడీపీ చూస్తోంది. ఏదో విధంగా గొడవ చేయాలని టీడీపీ సభ్యుల యత్నం. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ సభ్యుల ఆందోళన: అంబటి రాంబాబు ►నిరుద్యోగ భృతితో మోసం చేసింది చంద్రబాబు. ఎస్సీలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు. స్టడీ సర్కిళ్లను వైఎస్సార్ అభివృద్ధి చేశారు: మేరుగ నాగార్జున ►దళిత వ్యతిరేకి చంద్రబాబు. గత ప్రభుత్వం ఎస్సీలకు చేసేందేమీ లేదు. పేదలకు చంద్రబాబు ఏనాడు మేలు చేయలేదు: జోగారావు ► టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారు. టీడీపీ సభ్యులకు చర్చించే దమ్ము లేదు. చంద్రబాబు ఆదేశాలతోనే సభను అడ్డుకుంటున్నారు. త్వరలో జరగబోయేది టీడీపీ శవయాత్రే : జోగి రమేష్ ► టీడీపీకి నైతిక హక్కు లేదు. ప్రజా సమస్యలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు ఎలా ఉన్నారో.. వాళ్ల నాయకులు కూడా అలానే ఉన్నారు: సుధాకర్బాబు ► 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం. సభా సమయం వృథా చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. అసెంబ్లీ పెట్టాలని టీడీపీ నేతలు సవాల్ చేశారు. అసెంబ్లీ పెడితే చంద్రబాబు మళ్లీ డుమ్మాకొట్టారు. సభ్యులేమో ఇప్పుడు అడ్డుకోవాలని చూస్తున్నారు: గడికోట శ్రీకాంత్రెడ్డి టీడీపీ సభ్యుల తీరు సరికాదు: బుగ్గన ► ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన నిమిషాల వ్యవధిలోనే.. ప్రతిపక్ష టీడీపీ సభను అడ్డుకునే యత్నం చేసింది. వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి గోల చేశారు టీడీపీ సభ్యులు. సభను అడ్డుకునేందుకు ఆ పార్టీ సభ్యులు తీవ్రంగా యత్నించారు. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని స్పీకర్ తమ్మినేని హామీ ఇచ్చినా.. వాళ్లు ఊరుకోలేదు. ఈ క్రమంలో.. మంత్రి బుగ్గన స్పందించారు. టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదన్నారు. ప్రశ్నోత్తరాలు జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని, సభను అడ్డుకోవడానికే వాళ్లు వచ్చినట్లు ఉందని మండిపడ్డారు. ► ప్రశ్నోత్తరాలతో మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ► ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. ► గురువారం నుంచి జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్ని శాఖల కార్యదర్శులను కోరారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా పెరిగిపోయిన నేపథ్యంలో యావత్ ప్రజల దృష్టి ఈ సమావేశాలపై ఉంటుందనే విషయాన్ని అధికారులు అందరూ గుర్తించాలని చెప్పారు. ఇందుకోసం బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ హాల్లో పలు శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులతో వారు వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. ► సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సరైన సమాధానాలను అందిస్తూ వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అటువంటి సత్సంప్రదాయం కొనసాగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గత సమావేశాల్లో గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలలో కొన్నింటికి ఇంకా సమాధానాలు అందజేయాల్సి ఉందని, వాటిని ఈ సమావేశాల్లో అందజేయాలని చెప్పారు. ► సభ్యులు అడిగిన ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు అందజేసేందుకు ప్రతి శాఖ ఒక లైజనింగ్ అధికారిని నియమించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల మెడికల్ బిల్లుల చెల్లింపుపై ఆరి్థక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న మాజీ ప్రజా ప్రతినిధులకు వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఔషధాలను అందజేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ► ప్రశాంత వాతావరణంలో సమావేశాలు కొనసాగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్లు.. డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఆధునికీకరించిన ఏ పాఠశాల మూతపడదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాడు–నేడు ద్వారా ఆధునికీకరించిన ఏ పాఠశాల మూతపడదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాఠశాలలు మూసివేస్తామంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరో 27 వేల అదనపు తరగతి గదులు నిర్మిస్తామని చెప్పారు. ఎంఈవో పోస్టుల భర్తీ, పాఠశాలల విలీనం, ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు అనే అంశాలపై శాసనమండలిలో శుక్రవారం పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సురేష్ బదులిచ్చారు. విద్యాశాఖ అంశాలపై నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ప్రతి మండలానికి ఎంఈవో–2ను నియమించాల్సిన అవసరాన్ని సూచించిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖాళీగా ఉన్న 264 ఎంఈవోలతోపాటు మరో 666 ఎంఈవో–2 పోస్టులను సృష్టించి వాటి భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. దీనివల్ల ఏడాదికి రూ.28 కోట్లు అదనపు భారం పడుతుందన్నారు. వీటితోపాటు 36 డివిజనల్ విద్యాశాఖ అధికారుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని చెప్పారు. ఎంఈవో, డివిజినల్ విద్యాశాఖ అధికారుల ఖాళీల భర్తీకి సీనియారిటీ ప్యానల్ రూపొందిస్తామన్నారు. స్వీపర్లను ఆయాలుగా చేసి వేతనాలు పెంచాం.. పాఠశాలల్లో పనిచేసేవారిని గత ప్రభుత్వం స్వీపర్లు అని కించపరిచేలా వ్యవహరిస్తే.. వారికి ఆయాలుగా పేరు మార్చి తమ ప్రభుత్వం గౌరవిస్తోందని మంత్రి సురేష్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 45,488 మంది ఆయాలకు గత ప్రభుత్వం రూ.2 వేలు వేతనంగా ఇస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారి వేతనాన్ని రూ.6 వేలకు పెంచిందని మంత్రి గుర్తుచేశారు. -
మంగళసూత్రాలతో రాజకీయాలా!
సాక్షి, అమరావతి: హిందూ మహిళలు ఎంతో పవిత్రంగా భావించే మంగళసూత్రాలను కూడా రాజకీయాలకు వాడుకుంటారా.. సిగ్గులేదా అంటూ శుక్రవారం శాసన మండలిలో పలువురు మహిళా ఎమ్మెల్సీలు టీడీపీ సభ్యులపై మండిపడ్డారు. ఉదయం సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు పోడియంలోకి వచ్చి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో అందులో కొందరు మంగళసూత్రాలను చూపుతూ కేకలు వేశారు. దీంతో ఎమ్మెల్సీ టి.కల్పలతతో పాటు వైఎస్సార్సీపీకి చెందిన పోతుల సునీత, వరుదు కళ్యాణిలు పోడియంలోకి వచ్చి ‘తాళిబొట్లను సభలోకి తీసుకొచ్చి మహిళలను కించపరుస్తారా’ అంటూ టీడీపీ సభ్యుల తీరును తప్పుపట్టారు. చైర్మన్ వెంటనే ఆ మంగళసూత్రాలను స్వాధీనం చేసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై చైర్మన్ మోషేన్రాజు స్పందిస్తూ.. తాళి బొట్టు అనేది హిందూ మహిళలు పవిత్రంగా భావిస్తారని, వాటిని సభలోకి తీసుకొచ్చి మహిళలందరినీ అవహేళన చేస్తున్నారని.. వెంటనే సభ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారు. అయినా టీడీపీ సభ్యులు అలాగే వ్యవహరిస్తుండడంతో మహిళా ఎమ్మెల్సీలతో వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీ సభ్యుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సమయంలో చైర్మన్ సభను ఐదు నిమిషాలపాటు వాయిదా వేశారు. శాసనసభలోనూ.. టీడీపీ సభ్యులు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలోనూ తాళిబొట్లు ప్రదర్శించి నిరసన తెలిపారు. సారా మరణాలపై న్యాయవిచారణ నిర్వహించాలని నినాదాలు చేశారు. కొద్దిసేపు స్పీకర్ పోడియంపై చేతులతో చరుస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాళి బొట్లను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఆ తర్వాత సభ నుంచి వెళ్లిపోయారు. 8 మంది సస్పెన్షన్ వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమయ్యాక కూడా టీడీపీ సభ్యులు పోడియంలోకి మళ్లీ వచ్చి మంగళసూత్రాలను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో 8 మందిని సభ నుంచి సస్పెండ్ చేసేందుకు మంత్రి పెద్దిరెడ్డి ప్రతిపాదించగా.. ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, అశోక్బాబు, దీపక్రెడ్డి, కేఈ ప్రభాకర్, రాజసింహులు, దువ్వారపు రామారావు, తిరుమలనాయుడు, మంతెన వెంకట సత్యనారాయణరాజులను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ మోషేన్రాజు ప్రకటించారు. మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తరలించారు. మిగిలిన ఎమ్మెల్సీలతో కలిసి లోకేశ్ కూడా బయటకు వెళ్లిపోయారు. -
కౌన్సిల్లోనూ టీడీపీ అదే తంతు
సాక్షి, అమరావతి: శాసన మండలిలో గురువారం కూడా టీడీపీ ఎమ్మెల్సీలు చిడతలతో భజనలు చేస్తూ, ఈలలు వేస్తూ గలాటా సృష్టించారు. చైర్మన్ మోషేన్రాజు ఎంత వారిస్తున్నా.. భజనలు చేసే వారు సభ నుంచి వెంటనే బయటకు వెళ్లాలని ఆదేశిస్తున్నా వారు అదే తీరున వ్యవహరించారు. దీంతో ఎనిమిది మందిని సస్పెండ్ చేసేందుకు మంత్రి కన్నబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా చైర్మన్ వారిని ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో.. దీపక్రెడ్డి, అశోక్బాబు, బచ్చుల అర్జునుడు, అంగర రామ్మోహన్, కేఈ ప్రభాకర్, రాజనర్శింహులు, దువ్వారపు రామారావు, మర్రెడ్డి రవీంద్రనాథ్రెడ్డి ఉన్నారు. వీరంతా బయటకు వెళ్లిపోవాలని చైర్మన్ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా వారు సభలోనే రాద్ధాంతాన్ని కొనసాగించారు. దీంతో.. చిడతలు, ఈలలను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని మోషేన్రాజు మార్షల్స్ను ఆదేశించారు. చైర్మన్తో వాదులాట.. తమ సస్పెన్షన్ వ్యవహారంలో చైర్మన్ వైఖరిని తప్పుపడుతూ లోకేశ్ సహా మరికొందరు టీడీపీ సభ్యులు ఆయనతో వాదులాటకు దిగారు. ఇదే సమయంలో దీపక్రెడ్డి తమ చుట్టూ ఉన్న మార్షల్స్ను తోసుకుంటూ చైర్మన్ పోడియం మెట్లు ఎక్కేందుకు యత్నించగా మోషేన్రాజు మండిపడ్డారు. లోకేశ్ ప్రవర్తన బాగోలేదంటూ వ్యాఖ్యానించారు. అనంతరం.. మార్షల్స్ సస్పెండ్ అయిన వారిని బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకువెళ్లారు. అయినా కూడా అంగర రామ్మోహన్, బచ్చుల అర్జునుడు మరో గేట్ నుంచి తిరిగి సభలోకి వచ్చి ఆందోళన కొనసాగించేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. మరోవైపు.. అప్పటిదాకా తన సీటులోనే కూర్చుని ఉన్న టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు సభలో ఈ గందరగోళం జరుగుతున్న సమయంలో నెమ్మదిగా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత లోకేశ్ మిగిలిన టీడీపీ ఎమ్మెల్సీలూ వెళ్లిపోయారు. సస్పెండ్ అయిన వారిని బయటకు తీసుకెళ్లకుండా మార్షల్స్ తాత్సారం చేయడంపై మంత్రులు, పలువురు ఎమ్మెల్సీలు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా సమస్యల కోసం కాదు, సస్పెన్షన్ కోసమే.. సస్పెండ్ ప్రక్రియ అనంతరం చైర్మన్ మోషేన్రాజు మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు సస్పెండ్ కావడానికే సభకు వచ్చారుగానీ, ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదన్నారు. విచిత్రంగా తమను సస్పెండ్ చేయమని వారు అడుగుతున్నారని, కానీ.. సస్పెండ్ చేయకూడదని బుధవారం వరకూ ఓపిక పట్టామన్నారు. అనంతరం మంత్రులు, పలువురు ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. మండలి స్థాయిని టీడీపీ దిగజార్చిందంటూ తప్పుపట్టారు. పెద్దల సభలో ఇంత చిల్లరగా గలాటా చేయడం దురదృష్టకరమని మంత్రి కన్నబాబు అన్నారు. ఈ సభకు లోకేశ్ లాంటి వారు వచ్చాక ఇది దొడ్డిదారి సభలా ముద్రపడిపోయిందని చెప్పారు. మండలి అంటే చాలా గౌరవంగాను, హుందాగాను ఉండాలని.. కానీ అటువంటి సభా మర్యాదను టీడీపీ సభ్యులు మంటగలిపి సభ ఔన్నత్యాన్ని దిగజార్చారన్నారు. వారి ప్రవర్తనతో సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. చివరికి.. గోవింద నామాలను కించపరిచారన్నారు. బయటకు వెళ్లి ఏం చెప్పినా ప్రజలు నమ్మడంలేదు కాబట్టి ఈ సభను ప్రచారం కోసం వినియోగించుకోవాలని చూశారని మంత్రి అవంతి అన్నారు. దళిత వర్గానికి చెందిన వ్యక్తి చైర్మన్ స్థానంలో ఉండడం ఇష్టంలేనట్లుగా వారి ప్రవర్తన ఉందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని సీ రామచంద్రయ్య, ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాధవ్రావు, అరుణ్కుమార్, రవీంద్రబాబు, భరత్, గోపాలరెడ్డి తదితరులు కూడా మాట్లాడారు. ఇదిలా ఉంటే.. సస్పెన్షన్కు ముందు టీడీపీ ఎమ్మెల్సీలు ‘మా భజన బాగుందా.. మీది బాగుందా’ అంటూ నినాదాలు చేస్తుండగా, మిగిలిన సభ్యుల వైపు నుంచి వీరిపై రూ.500 నోటు విసిరారు. -
మండలిలో ప్లేటు ఫిరాయించి టీడీపీ సభ్యులు
సాక్షి, అమరావతి: శాసనమండలిలో జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరగాలంటూ తెలుగుదేశం సభ్యులు వెల్లోకి వచ్చి ఆందోళన చేశారు. అయితే మరణాలపై చర్చకు రెడీగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. జంగారెడ్డిగూడెం మరణాలపై స్టేట్మెంట్ ఇవ్వడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సిద్ధమయ్యారు. దీంతో ఖంగుతున్న టీడీపీ నేతలు వెంటనే ప్లేటు ఫిరాయించారు. ముఖ్యమంత్రి సభకు వచ్చి జంగారెడ్డిగూడెం మరణాలపై స్టేట్మెంట్ ఇవ్వాలని యనమల రామకృష్ణుడు మాటమార్చారు. శాసనసభలో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ముఖ్యమంత్రే వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలన్న అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ పరిగణలోకి రాదని అన్నారు. అయితే యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రూల్ 306లో ఆ శాఖకు సంబంధించిన మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వాలని రూల్ పొజిషన్లో చదివి వినిపించారు. యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు శాసనమండలి చైర్మన్ను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం సభ నడపాలని సూచించారు. సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదు: మండలి ఛైర్మన్ టీడీపీ సభ్యులు.. సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదని శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్టేట్ మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారన్నారు. ప్రభుత్వం చెప్పింది ముందు వినాలని.. ఆ తర్వాత అభ్యంతరాలుంటే తెలపాలని మండలి ఛైర్మన్ మోషేన్రాజు పదే పదే చెప్పిన టీడీపీ ఎమ్మెల్సీలు పట్టించుకోలేదు. -
సమావేశాలు ముగిసేలోగానే సమాధానాలివ్వండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభ సమావేశాలు ఈ నెల 7వ తేదీ నుంచి జరగనున్న నేపథ్యంలో గతంలో సభ్యులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలను సమావేశాలు పూర్తయ్యేలోపు అందజేయాలని అన్ని శాఖల కార్యదర్శులను మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆదేశించారు. సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. శనివారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ హాల్లో వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులతో వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సమీక్షించారు. ఆ ప్రశ్నలే ఎక్కువ పెండింగ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు మాట్లాడుతూ.. గత సమావేశాల్లో మండలి సభ్యులు అడిగిన ప్రశ్నల్లో పాఠశాల విద్య, ఆర్థిక శాఖకు సంబంధించినవే ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయన్నారు. విద్యా వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దేందుకు పలు వినూత్న సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని, వాటిని సుస్పష్టంగా వివరిస్తూ సరైన సమాధానాలను సభ్యులకు అందజేయాలని పాఠశాల విద్యా శాఖ కార్యదర్శికి సూచించారు. మాజీ ఎమ్మెల్సీల మెడికల్ బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీలకు వారు నివశించే ప్రాంతాల్లోనే మందులు అందజేసే అంశాన్ని పరిశీలించాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ కె.రాజేంద్రనాథ్రెడ్డికి పలు సూచనలు చేశారు. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమివ్వాలి శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ.. ప్రజల దృష్టంతా ఈ నెల 7 నుంచి జరిగే శాసన సభ సమావేశాలపై ఉంటుందని, వాటికి ఎంతో ప్రత్యేకత ఉందనే విషయాన్ని అధికారులు అందరూ గుర్తించాలని అన్నారు. ఈ నేపథ్యంలో సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం అందజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గత సమావేశాల్లో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలను అందజేయాల్సి ఉందని, వాటన్నింటినీ ఈ సమావేశాలు ముగిసేలోపు తప్పక ఇవ్వాలని అన్నిశాఖల కార్యదర్శులను కోరారు. సచివాలయం చుట్టూ ఖాళీ ప్రాంతం ఎక్కువగా ఉన్న దృష్ట్యా అన్నివైపులా పటిష్టమైన బందోబస్తు, అధునాతన సమాచార, సాంకేతిక వ్యవస్థతో పటిష్టమై నిఘా ఏర్పాట్లు చేయాలని డీజీపీ కె.రాజేంద్రనాథ్రెడ్డికి సూచించారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి, శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యలు, డిప్యూటీ సెక్రటరీ ఎం.విజయరాజు, శాసన మండలి ఓఎస్డీ కె.సత్యనారాయణరావు, పలు శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కడప గడపలో తొలిసారి.. బీసీ ఎమ్మెల్సీ
సాక్షి, అమరావతి: కడప జిల్లా నుంచి చట్టసభల్లో బీసీలకు అవకాశం దక్కటమంటే ఒక చరిత్రే!! ఎందుకంటే ఇక్కడ చివరిసారిగా 1962లో కాంగ్రెస్ తరఫున కుండ రామయ్య జమ్మలమడుగు నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. ఆ తరవాత ఏ పార్టీ తరఫున కూడా ఎవ్వరూ ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర లేదు. పోనీ ఎమ్మెల్సీగా అయినా బీసీలకు అవకాశమిచ్చారా అంటే... ఏ పార్టీ కూడా అందుకు ముందుకు రాలేదు. బలహీనవర్గాలకు సముచిత ప్రాధాన్యమిస్తూ బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు బ్యాక్బోన్ క్లాస్ అని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్... చేతల్లో కూడా అది చూపించారు. తాజాగా గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలను నామినేట్ చేస్తూ కడప జిల్లా చరిత్రను తిరగరాశారు. అక్కడి నుంచి రమేష్ యాదవ్కు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. వీటికి గవర్నరు ఈ నెల 10న ఆమోదముద్ర వేయగా సోమవారం అధికారికంగా ప్రకటించటం తెలిసిందే. నిజానికి ఆంధ్రప్రదేశ్ శానస మండలి ఏర్పాటయిన తరవాత కడప జిల్లా నుంచి మొత్తం 30 మంది ఎమ్మెల్సీలను ఇప్పటిదాకా వివిధ పార్టీలు నామినేట్ చేశాయి. వారిలో యాదవ సామాజిక వర్గానికి మాత్రం ఇప్పటిదాకా అవకాశం దక్కలేదు. ఇదే తొలిసారి. దీనిపై రమేష్ స్పందిస్తూ ‘‘నన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారని కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఈ జిల్లా నుంచి యాదవ వర్గానికి చెందినవారెవరూ ఇప్పటిదాకా ఎమ్మెల్సీ కాలేదు’’ అని సంతోషం వ్యక్తం చేశారు. రమేష్ యాదవ్ తండ్రి వెంకటసుబ్బయ్య 1987లో ప్రొద్దుటూరు మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్గా పనిచేశారు. వైసీపీ ద్వారా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ కావడం పట్ల జిల్లా బీసీలు సైతం హర్షం వ్యక్తం చేశాయి. జగన్ హయాంలోనే బడుగులకు అధికారం తాజాగా నామినేట్ చేసిన మోషేన్రాజు (పశ్చిమగోదావరి), రమేష్యాదవ్ (కడప), తోట త్రిమూర్తులు (తూర్పుగోదావరి), లేళ్ళ అప్పిరెడ్డి (గుంటూరు)లో సగం... అంటే ఇద్దరు ఎస్సీ, బీసీలకు చెందిన వారు కావటం గమనార్హం. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికారకంలోకి వచ్చాక వైఎస్సార్ సీపీ తరఫున ఇప్పటిదాకా 15 ఎమ్మెల్సీ స్థానాలను నామినేటెడ్, ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికల ద్వారా భర్తీ చేయగా... ఇందులో 4 ఎస్సీలకు, 4 బీసీలకు, 3 మైనార్టీలకు దక్కాయి. ప్రతిపక్షంలో ఉండగా 2018 తర్వాత భర్తీ చేసిన ఎమ్మెల్సీల్లోనూ బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 12 సీట్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్దే. ఈ క్రమంలోనే బీసీ నేత జంగా కృష్ణమూర్తికి వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అవకాశం లభించింది. సామాజిక న్యాయమనేది మాటల్లో కాకుండా చేతల్లో జగన్ ఏ మేరకు చూపిస్తున్నారనేది తెలియటానికి ఈ ఉదంతాలు చాలు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సునీత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతను అభ్యర్థిగా సీఎం జగన్ ప్రకటించారు. ఆయన చేతుల మీదుగా సునీత బీ ఫారం అందుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు సోమవారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె వెంట మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పోతుల సురేష్ ఉన్నారు. ఆ తర్వాత వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలో శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డికి సునీత తన నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు బీసీలను వాడుకుని వదిలేసేవారని, సీఎం వైఎస్ జగన్ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీలను ఆదరిస్తున్నారని చెప్పారు. జగన్ పాలన స్వర్ణయుగమన్నారు. అన్ని వర్గాల ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే లక్ష్యంతో పనిచేస్తున్న జగన్ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కుళ్లు, కుతంత్రాలు, కుట్రలతో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుని తన బుద్ధిని చూపిస్తున్నారని విమర్శించారు. దేవుడినీ వదలకుండా రాజకీయానికి వాడుకుంటున్నారన్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగిన సునీత.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీరును నిరసిస్తూ రాజీనామా చేయడం తెలిసిందే. -
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశమవుతుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశం మొదలవుతుంది. ప్రస్తుత అంచనా ప్రకారం ఈ సమావేశాలు డిసెంబర్ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని భావిస్తుండటంతో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ తమ వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఉభయ సభల్లో ప్రారంభంలోనే తొలి అంశంగా సంతాప తీర్మానాలు ఉంటాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్ ముఖర్జీ, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు పలువురు ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. శాసన మండలిలో కూడా ఈ ప్రముఖులతో పాటు మాజీ ఎమ్మెల్సీల మృతికి సంతాపం తెలిపే తీర్మానాలను ఆమోదిస్తారు. ఉభయ సభల్లోనూ ప్రభుత్వానికి చెందిన పలు అధికార పత్రాలను సమర్పించే కార్యక్రమం (పేపర్స్ లెయిడ్ ఆన్ ద టేబుల్) ఉంటుంది. బీఏసీ సమావేశంలో అజెండా ఖరారు ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఉభయ సభలు కొద్ది సేపు విరామంతో వాయిదా పడతాయి. ఈ విరామ సమయంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన ఆయన చాంబర్లో శాసనసభ కార్యకలాపాల సలహా మండలి (బీఏసీ) సమావేశం జరుగుతుంది. శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు జరిగేది, చర్చించాల్సిన అజెండా అంశాలను ఖరారు చేస్తారు. మండలిలో చైర్మన్ షరీఫ్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో యధావిధిగా ఎజెండాను ఖరారు చేస్తారు. ఎక్కువ రోజులు జరగాల్సిన సాధారణ బడ్జెట్ సమావేశాలు కరోనా మహమ్మారి వల్ల గత జూన్ నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇపుడు ఐదు రోజులు జరుగుతాయని భావిస్తున్న శీతాకాల సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ► రాజ్యాంగ నియమం ప్రకారం డిసెంబర్ 14వ తేదీ లోపుగా ఉభయ సభల సమావేశాలు జరిగి తీరాలి కనుక.. కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల్లో అనేకులు 60 ఏళ్లు దాటిన వారున్నప్పటికీ, తప్పనిసరిగా ఈ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రజా సమస్యలపై చర్చకు అధికార పక్షం సిద్ధం ► ప్రజా ప్రాధాన్యత గల అంశాలను చర్చించాలని అధికార పక్షం భావిస్తోంది. నిజంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కానీ, అత్యవసర ప్రాధాన్యత గల అంశాలను కానీ ప్రతిపక్షం చర్చకు తెస్తే ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా చర్చకు తావిచ్చేందుకు, సమగ్రంగా అన్ని విషయాలు చర్చించేందుకు అధికారపక్షం మొగ్గు చూపుతోంది. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశాల్లో ప్రాధాన్యత గల అంశాలన్నింటిపైనా చర్చకు సిద్ధపడదామని, ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ, మండలిని నడిపిద్దామని సూచించారు. ► ప్రభుత్వం గత ఏడాదిన్నరగా చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలతో సహా ఇతరత్రా సమస్యలు సుమారు 20 వరకు ఎంపిక చేసి, చర్చ కోసం అధికారపక్షం సిద్ధపడుతోంది. శుక్ర, ఆదివారాల్లో జరిగిన ప్రభుత్వ చీఫ్ విప్, విప్, మంత్రుల సమావేశాల్లో అధికార పక్షం ఆయా అంశాల వారీగా చర్చలో పాల్గొనే వారికి బాధ్యతలు అప్పగించింది. ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని వ్యూహం రూపొందించింది. అడ్డుకోవడమే ప్రతిపక్షం ఎజెండా ► ప్రజా సమస్యలపై ఒక దశ, దిశ లేకుండా సతమతం అవుతున్న ప్రతిపక్ష టీడీపీ.. ప్రభుత్వ కా>ర్యకలాపాలను అడ్డుకోవడం ద్వారా వార్తల్లోకి ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాము ఉభయ సభల్లోనూ అడ్డుకుంటామని ఆ పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు బాహాటంగానే ప్రకటించారు. ► ముఖ్యంగా ప్రభుత్వం తెచ్చే అధికారిక బిల్లులను శాసనమండలిలో తమకున్న ఆధిక్యతతో అడ్డుకోవాలని టీడీపీ చూస్తోంది. ప్రజా ప్రాధాన్యం గల అంశాలపై చర్చ కన్నా రాజకీయ లబ్ధి చేకూరే కార్యక్రమాలపైనే దృష్టి పెట్టాలని టీడీపీ భావిస్తోంది. ► రాష్ట్ర ప్రజలకు అవసరమా? లేదా? అనే అంశాలను పక్కన పెట్టి, ప్రభుత్వం తెచ్చిన బిల్లును మండలిలో అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే దిశా నిర్దేశనం చేశారు. టీడీపీ అనుకూల మీడియాపై అసెంబ్లీ, మండలిలో ఉన్న ఆంక్షలు తొలగించాలని కోరుతూ ఉభయ సభల్లో ప్రతిష్టంభనకు దిగాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపు జరుగుతోందని, రాష్ట్రంలో హింస, అవినీతి పెరిగి పోయిందని, రాష్ట్రంలో అసలు రాజ్యాంగమే అమలు కావడం లేదని ఆరోపిస్తూ ఉభయ సభల్లో చర్చకు దిగాలని ప్రతిపక్షం భావిస్తున్నట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదని కూడా ఆ పార్టీ ఆరోపిస్తోంది. 15 బిల్లులు.. 20 అంశాలు ► శీతాకాల శాసనసభ, మండలి సమావేశాల్లో సుమారు 15 బిల్లులను ప్రవేశ పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశాలు 5 రోజులు జరుగుతాయని భావిస్తున్నందున ఇప్పటి వరకు బిల్లుల స్థానంలో ఉన్న ఆర్డినెన్సులన్నింటికీ చట్ట రూపం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని బిల్లుల వివరాలిలా ఉన్నాయి. ► ఏపీ పశుదాణా బిల్లు, చేపల దాణా బిల్లు, అక్వా కల్చర్ విత్తన బిల్లు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మార్పు బిల్లు, అసైన్మెంట్ భూమి బదలాయింపు నిషేధ సవరణ బిల్లు, ఏపీ వాల్యూ యాడెడ్ పన్ను సవరణ బిల్లు, ఏపీ వాల్యూ యాడెడ్ పన్ను (3వ సవరణ) బిల్లుతో పాటుగా సుమారు 15 బిల్లులు సభ ముందుకు వస్తాయని తెలుస్తోంది. ► మరి కొన్ని బిల్లులు వివిధ దశల్లో ఉన్నాయి. సమావేశాలు ముగిసే లోపు అవి కూడా సంబంధిత అనుమతులు పొందితే ఇదే సమావేశాల్లో చర్చకు వస్తాయని అధికార వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం ప్రజా ప్రాధాన్యం గల 20 అంశాలను సమావేశాల్లో చర్చకు తీసుకు రావాలని జాబితాను సిద్ధం చేసింది. చర్చకు రానున్న అంశాలు ► పోలవరం పురోగతి–గత ప్రభుత్వం తప్పిదాలు, ఇళ్ల పట్టాల పంపిణీ – ప్రతిపక్షాల కుట్ర, టిడ్కో గృహాలు –వాస్తవాలు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ – ప్రతిపక్షాల కుట్ర, బీసీల సంక్షేమం – ప్రభుత్వ చర్యలు.. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు, కరోనా నియంత్రణ – ప్రభుత్వ చర్యలు, వైద్య ఆరోగ్య రంగం – ఆరోగ్యశ్రీ. ► ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం, వ్యవసాయ రంగం, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా కేంద్రాలు, మద్దతు ధర, వైఎస్సార్ జలకళ, గ్రామ సచివాలయాలు – మెరుగైన పని తీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు –అమలు తీరు, మహిళా సాధికారత.. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, మద్య నియంత్రణ – ప్రభుత్వ సంస్థలు, ► నాడు–నేడు, సాగునీటి ప్రాజెక్టులు – రివర్స్ టెండరింగ్, అవినీతి నిర్మూలన – పారదర్శక పాలన, పారిశ్రామికాభివృద్ధి – ప్రభుత్వ చర్యలు, 9 గంటల ఉచిత విద్యుత్ – విద్యుత్ రంగంలో సంస్కరణలు, ప్రభుత్వ హామీలు – అమలు తీరు, నూతన ఇసుక విధానం అంశాలపై చర్చించాలని అధికారపక్షం భావిస్తోంది. ► వివిధ అంశాలపై ఉభయ సభల్లో చేపట్టే చర్చకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. శాసనమండలిపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆయా అంశాలపై చర్చలో పాల్గొనే ఎమ్మెల్యేల పేర్లను కూడా ఖరారు చేశారు. -
ఏపీ మండలి చైర్మన్ షరీఫ్కు కరోనా
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎంఏ. షరీఫ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు ఆయన కార్యాలయ అధికారులు తెలిపారు. షరీఫ్ కోవిడ్ బారిన పడటం బాధాకరమని ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
గవర్నర్ కోటాలో ఎస్సీ, ముస్లిం వర్గాలకు ఎమ్మెల్సీ పదవులు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గవర్నర్ కోటాలో భర్తీ చేసే సభ్యుల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒకటి ఎస్సీ, మరొకటి ముస్లిం వర్గాలకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం త్వరలోనే ఈ మేరకు సిఫార్సు చేయనుందని వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి. ► ప్రస్తుతం మండలిలో మొత్తం నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణారావు రాజీనామా చేసిన కారణంగా శాసనసభ నుంచి ఎన్నికయ్యే రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ► గవర్నర్ నామినేట్ చేసే కోటాలో కంతేటి సత్యనారాయణరాజు, రత్నాబాయి పదవీ కాలం ముగిసిన కారణంగా ఖాళీ అయిన రెండు స్థానాలు కొంత కాలంగా అలాగే ఉన్నాయి. ► వైఎస్ జగన్ ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని నిర్ణయించినప్పటికీ పైస్థాయిలో జాప్యం కారణంగా అది ఇప్పటికీ మనుగడలో ఉంది. మండలి రద్దు విషయంలో ఎలాంటి రెండో ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇప్పటికే శాసనసభలో మండలి రద్దుకు తీర్మానం చేసి పంపారు కూడా. అయితే మండలి మనుగడలో ఉన్నంత వరకైనా ఖాళీ స్థానాలను భర్తీ చేయాలన్న ఆలోచనతో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. ► అందువల్ల గవర్నర్ నామినేటెడ్ స్థానాల్లో ఒకటి ఎస్సీ వర్గానికి, మరో స్థానం ముస్లిం మైనారిటీ వర్గాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి తాజాగా యోచిస్తున్నట్టు సమాచారం. ► బోస్, మోపిదేవి రాజీనామా వల్ల ఖాళీ అయిన వాటిలో ఒక స్థానం పదవీ కాలం కేవలం 9 నెలలే ఉంది. మరో ఎమ్మెల్సీ పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుంది. 9 నెలలే గడువున్న ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదు కనుక రెండేళ్ల పదవీ కాలం ఉన్న స్థానానికి కూడా అభ్యర్థిని త్వరలో సీఎం ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మండలిలో మాటల యుద్ధం
సాక్షి, అమరావతి: శాసన మండలిలో బుధవారం రాష్ట్ర వార్షిక బడ్జెట్పై చర్చ కొనసాగుతున్న సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటా మాట పెరిగి కొద్ది సేపు సభా కార్యక్రమాలు వాడీవేడిగా కొనసాగాయి. బడ్జెట్పై చర్చలో టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్రెడ్డి, నాగజగదీశ్వరరావులు మంత్రులపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రులు.. టీడీపీ సభ్యులకు దీటుగా జవాబిచ్చారు. మంత్రులు గెడ్డాలు పెంచి గత సమావేశాల సమయంలో సభలో రౌడీల మాదిరి వ్యవహరించారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి బొత్స జోక్యం చేసుకొని సభ్యులు అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పారు. దీంతో చైర్మన్ షరీఫ్.. సభ్యులు బడ్జెట్పై చర్చకే పరిమితం కావాలని సూచించారు. ఆధారాలుండటం వల్లే అచ్చెన్నాయుడి అరెస్ట్ ► టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారాన్ని ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు ప్రస్తావిస్తూ.. ఈ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. ► అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలు ఉండడం వల్లే అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేశారని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. దొంగతనం చేస్తే, అవినీతి చేస్తే బీసీలు కదా అని వదిలి వేయాలా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ఒక్క బీసీ నేతకు కూడా రాజ్యసభ సీటు కేటాయించ లేదని, సీఎం జగన్ ఇప్పుడు ఒకేసారి ఇద్దరు బీసీ నేతలకు రాజ్యసభ సీట్లు ఇచ్చారని చెప్పారు. ► పేద కార్మికులకు సంబంధించిన రూ.150 కోట్ల వ్యవహారంలో అవినీతి జరిగిందని తేలడంతో అచ్చెన్నాయుడు అరెస్టు జరిగిందని, తప్పు చేయకుంటే చట్టం ముందు ఆయన తన నిజాయితీని నిరూపించుకోవాలని మంత్రి అనిల్కుమార్ సవాల్ విసిరారు. తప్పుచేసే బీసీల పట్ల ఒక తీరుగా, అగ్రవర్ణాల పట్ల మరో తీరుగా వ్యవహరించడం చట్టంలో లేదన్నారు. గత ప్రభుత్వంలో కాపు నాయకుడు ముద్రగడ దీక్ష చేస్తుంటే అక్కడ 3 వేల మంది పోలీసులను దించి దిగ్బంధనం చేశారన్నారు. చంద్రబాబుకు, చైర్మన్కూ గెడ్డం ఉంది.. ► ‘మంత్రులు గెడ్డాలు పెంచుకుంటే రౌడీలన్నట్టు టీడీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు.. చంద్రబాబుకు గెడ్డం ఉంది.. చైర్మన్కు కూడా గెడ్డం ఉంది.. వాళ్లు రౌడీలవుతారా’ అని అనిల్కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ► మంత్రి అనిల్ మాట్లాడే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు జోక్యం చేసుకుని, మంత్రిపై క్రికెట్ బెట్టింగ్ కేసు ఉందనడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ► గత ప్రభుత్వంలో పోలీసులు కేవలం నోటీసులిచ్చారని, తాను తప్పు చేయలేదు కాబట్టి విచారణకు హాజరై తన నిజాయితీని నిరూపించుకున్నానని అనిల్ అన్నారు. పోలీసు రికార్డులు పరిశీలించుకోవచ్చని చెప్పారు. గత ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం వంద కోట్లు ఖర్చు పెట్టి తనను ఓడించడానికి ప్రయత్నించిందని, అయినా తనను ఏమీ చేయలేకపోయారని చెప్పారు. ► సభలో గొడవ ముదిరే పరిస్థితికి దారితీస్తుండటంతో చైర్మన్ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కూడా కొద్దిసేపు టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు, మంత్రి అనిల్ మధ్య వాగ్వాదం సాగింది. -
మండలిలో మరోసారి దుష్ట సంప్రదాయం!
సాక్షి, అమరావతి: అర్థవంతమైన చర్చలు, సలహాలు, సూచనలతో ఆదర్శంగా నిలవాల్సిన శాసనమండలి టీడీపీ రాజకీయ కుయుక్తులకు వేదికైంది. విపక్ష సభ్యులు మరోసారి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను అడ్డుకునేందుకు ఏం చేయడానికైనా సిద్ధం అనే రీతిలో దౌర్జన్యంగా వ్యవహరించారు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులతో పాటు ద్రవ్య వినిమయ బిల్లును బుధవారం మండలిలో ప్రవేశపెట్టనివ్వకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుని దుష్ట సంప్రదాయాన్ని కొనసాగించారు. నిబంధనల మేరకు సభ నడపాలని అధికార పార్టీకి చెందిన సభ్యులు అభ్యర్థించినా ఆలకించలేదు. రూల్ 90 ప్రకారం చర్చ చేపట్టాలంటే ఒక రోజు ముందుగా నోటీసు ఇవ్వాలనే సంప్రదాయాన్ని పాటించకుండా అప్పటికప్పుడు చైర్మన్కు నోటీసు ఇచ్చి పరిగణలోకి తీసుకోవాలంటూ టీడీపీ సభ్యులు రభస చేశారు. సంఖ్యా బలంతో జాప్యం చేయడం మినహా బిల్లులను అడ్డుకోలేమని తెలిసినా డ్రామాలకు తెరతీయడంపై ప్రజాస్వామికవాదులు, నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు సహా ఇతర బిల్లులను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం. మండలిలో బుధవారం జరిగిన పరిణామాలు ఆందోళనకరం.ద్రవ్య వినిమయ బిల్లును మండలి ఆమోదించడం రాజ్యాంగ విధి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను, బిల్లును రాజ్యసభ ఆమోదిస్తున్నప్పుడు ఇక్కడ ఈ పరిస్థితి ఏమిటి? ఆర్థిక బిల్లును అడ్డుకున్నా లావాదేవీలు ఆగవు. కాకుంటే కాస్త ఆలస్యమవుతాయి. – పీజే చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పెద్దల సభ పరిధి సలహాల వరకే.. ‘ద్రవ్యవినిమయ బిల్లు మనీ బిల్లు కనుక శాసనసభకే సర్వాధికారాలుంటాయి. శాసనమండలి అనేది పెద్దల సభ. కేవలం సలహాలు ఇవ్వడం వరకు మాత్రమే దాని పరిధి. బడ్జెట్పై చర్చించి వారికేమైనా సలహాలుంటే ఇచ్చి ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాల్సిందే. పరిస్థితులు ఎలా ఉన్నా సద్దుమణిగేలా చేస్తూ ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే వరకు సభను కొనసాగించకుండా ఎందుకు వాయిదా వేశారో అర్థం కాకుండా ఉంది. ద్రవ్యవినిమయ బిల్లు పూర్తిగా అసెంబ్లీ అధికార పరిధికి లోబడి ఉంటుంది. మూడు రాజధానులకు సంబంధించి మొదట పంపించిన బిల్లుపై శాసనమండలి గడువులోగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు కనుక రెండోసారి అదే బిల్లును మళ్లీ శాసనసభ ఆమోదించి మండలికి పంపించింది. మండలి కేవలం సలహాలు ఇవ్వడం వరకే పరిమితం తప్ప బిల్లులను అడ్డుకొనే అధికారం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దల సభ ఏ ఉద్దేశంతో ఏర్పడిందో దానికి విరుద్ధంగా అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అలాంటి ప్రజలు ఎనుకున్న శాసనసభకే సర్వాధికారాలు ఉంటాయి తప్ప శాసనమండలికి ఏమీ అధికారం ఉండదు. సలహాలు ఇచ్చి అభిప్రాయం చెప్పడం వరకే పరిమితం కాకుండా అంతకు మించి అక్కడ వ్యవహారాలు కొనసాగుతుండడం విపరీతంగా కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అక్కడి కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మూడు రాజధానుల బిల్లును రెండుసార్లు అసెంబ్లీలో ఆమోదించి పంపించారు. రెండోసారి పంపించిన తరువాత శాసనమండలిలో ప్రవేశపెట్టినా, ప్రవేశపెట్టకున్నా, చర్చించినా చర్చించకున్నా, ఆమోదించినా ఆమోదించకున్నా శాసనసభ దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు. శాసనసభకు పూర్తి అధికారాలున్నందున రెండోసారి బిల్లు పంపినందున అది ఆమోదమైనట్లే భావించి నిర్ణయం తీసుకోవచ్చు. శాసనమండలి ఆమోదంతో శాసనసభకు కానీ, ప్రభుత్వానికి కానీ అవసరం లేదు. శాసనసభ ఆమోదించినందున ప్రభుత్వం దాని ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రారంభించవచ్చు. శాసనమండలికి నచ్చినా నచ్చకున్నా ప్రజలు నేరుగా ఎన్నుకున్న శాసనసభదే తుది నిర్ణయం అవుతుంది’ – కేఆర్ సురేష్రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ -
మండలి చైర్మన్ వైఖరిపై సీఎస్కు ఫిర్యాదు
-
‘బొండా ఉమాను జైల్లో వేయమంటారా’
సాక్షి, అమరావతి: అసెంబ్లీ కార్యదర్శిపై శాసన మండలి చైర్మన్ కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. అసెంబ్లీ సెక్రటరీ నిబంధనల ప్రకారం నడుచుకున్నారని తెలిపారు. ఆయన్ను బెదిరించడం, మానసిక ఒత్తిడి చెయ్యడం సమంజసం కాదని హితవు పలికారు. కొన్ని పత్రికలు, పార్టీలు అసెంబ్లీ సెక్రటరీని బెదిరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మండలి చైర్మన్ తీరుపై సీఎస్కు ఫిర్యాదు చేసినట్టు ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి తెలిపారు. (చదవండి : సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అసాధ్యం : అసెంబ్లీ కార్యదర్శి) ‘మేమంతా అసెంబ్లీ సెక్రటరీకి మద్దతుగా ఉంటాం. అవసరమైతే గవర్నర్ను కూడా కలుస్తాం. సెలెక్ట్ కమిటీని రూల్స్కి విరుద్ధంగా వేస్తున్నానని చైర్మన్ గారే చెప్పారు .మోషన్ ఇవ్వకుండా, ఓటింగ్ జరగలేదు. మరి ఎలా సెలెక్ట్ కమిటీ వేస్తారు. అందుకే అసెంబ్లీ సెక్రటరీ ఆమోదించలేదు. ఏ అధికారయినా రూల్ ప్రకారమే పని చేయాలి. మేమందరం నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తాం. అధికారుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం. రూల్స్ లేవు ఏమీ లేవని యనమల, బొండా ఉమా మాట్లాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మిమ్మల్ని జైల్లో వేయమంటారా. అలా చేస్తే ఎవరైనా సమర్థిస్తారా’అని వెంకట్రామిరెడి పేర్కొన్నారు. (చదవండి : లేని సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపడమేంటి?) -
సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అసాధ్యం : అసెంబ్లీ కార్యదర్శి
సాక్షి, అమరావతి: శాసనమండలిలో ప్రతిపాదించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని అసెంబ్లీ కార్యదర్శి మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు మండలి చైర్మన్ పంపిన ఫైలును ఆయన వెనక్కి పంపించారు. క్లాజ్ 189 ఏ.. ప్రకారం సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని లెజిస్లేచర్ కార్యదర్శి (ఇన్చార్జి) పి.బాలకృష్ణమాచార్య పేర్కొన్నారు. (చదవండి : ఏపీ: సెలెక్ట్ కమిటీకి నో) మండలి చైర్మన్ నిర్ణయంతోనే.. పాలనా వికేంద్రీకరణ బిల్లును జనవరి 21న అసెంబ్లీ ఆమోదించి అదే రోజు శాసనమండలికి పంపింది. 22న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణలు ఈ బిల్లును మండలిలో ప్రతిపాదించారు. నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ప్రతిపక్షం ఆ బిల్లును మండలి పరిశీలనకు తీసుకోవడానికి ముందే నోటీసులు ఇవ్వాలి. అయితే అలా జరగకపోగా, రెండు రోజుల సుదీర్ఘ వివాదానంతరం 23వ తేదీ చైర్మన్.. తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తూ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు చెప్పి సమావేశాలను వాయిదా వేయడంతో వివాదం తలెత్తడం తెలిసిందే. -
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ప్రోరోగ్
-
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ప్రోరోగ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. శాసన సభ, శాసన మండలి సమావేశాలను ప్రోరోగ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ప్రోరోగ్ ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేయడంతో అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్ తెచ్చుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు లభించినట్లు అయింది. కాగా బిల్లులు మండలి ముందున్న సమయంలో..సభలను ప్రోరోగ్ చేస్తే ఆర్డినెన్స్ జారీకి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. (ముఖం చెల్లక.. అసెంబ్లీకి రాలేక) ఢిల్లీ వెళ్లినా మండలి రద్దు ఆగదు.. తాడేపల్లి: శాసన మండలి రద్దును ఎవరూ అడ్డుకోలేరని మంత్రి విశ్వరూప్ స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లినా మండలి రద్దు ఆగదన్నారు. మండలి రద్దు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, ఈ విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామని కేంద్ర బీజేపీ నేతలు చెప్పారన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు స్టేజ్ షో కోసం ఢిల్లీ వెళుతున్నారని విశ్వరూప్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు స్టేజ్ షోలు బాగా అలవాటు అని, సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తేవడం సరికాదన్నారు. (ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు) చదవండి: ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు -
అన్ని చట్టప్రకారమే జరుగుతాయి: స్పీకర్
సాక్షి, విశాఖ : శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపించామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఆయన శుక్రవారం విశాఖ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రానికి ఉన్న నిబంధనల ప్రకారమే అన్ని జరుగుతాయి. చట్టం ఎవరికీ చుట్టం కాదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మండలిని రద్దు చేశారు. రాజధాని రైతులతో ప్రభుత్వం వేసిన కమిటీ మాట్లాడుతుంది. రైతులతో పాటు రైతు కూలీలకు కూడా పెన్షన్ అందచేస్తామని శాసన సభ వేదికగా ప్రకటించారు. కృత్రిమ ఉద్యమాల గురించి నేను మాట్లాడను. నిజంగా ఉద్యం జరిగితే దానికి అందరు మద్దతిద్దాం’ అని పేర్కొన్నారు. -
రాజ్యాంగం మేరకే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడబోదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో కొన్ని టీవీ చానళ్లతో మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారమే కేంద్రం వ్యవహరిస్తుందని స్పష్టంచేశారు. ‘ఇది రాజకీయ వ్యవహారం కాదు. బీజేపీ తీసుకునే నిర్ణయమూ కాదు. శాసనమండలి రద్దుపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. వ్యవస్థ ఆధారంగా కేంద్రం ముందుకెళ్తుంది.. రాజకీయ కోణముండే ఆస్కారం లేదు’ అని వెల్లడించారు. ఎక్కడా రాజకీయాలకు తావుండదు బిల్లుపై బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘కేబినెట్ ఆమోదం పొంది ప్రభుత్వం ద్వారా వచ్చే బిల్లును ప్రభుత్వంలో ఉన్న పార్టీగా వ్యతిరేకించడం సాధ్యం కాదు కదా.. ఏవో కారణాల వల్ల ఆపేస్తారని, రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా ఆపేస్తారని కొందరు అంటున్నారు. నా అవగాహన మేరకు ఆర్టికల్ 169(1) ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తే దానిని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలి. దీనిలో ఎక్కడా రాజకీయాలకు తావులేదు’ అని పేర్కొన్నారు. బీజేపీకి ఏపీ చట్టసభల్లో.. అది కూడా శాసన మండలిలో మాత్రమే ఇద్దరు సభ్యులు ఉన్నారని, మండలి రద్దుతో ఆ ప్రాతినిధ్యం కూడా పోతుందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఇద్దరున్నా పది మంది సభ్యులున్నా సంబంధం లేదని, వ్యవస్థకు లోబడి నడుచుకోవాలన్నారు. బిల్లు వెనుక బీజేపీ ఉందన్న విమర్శలను తోసిపుచ్చుతూ.. ‘అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని మాత్రమే కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది. అక్కడ ఏపార్టీ అధికారంలో ఉందన్న అంశాన్ని పరిగణించదు. కాబట్టి రాజకీయ కోణం నుంచి చూస్తే అది తప్పు. దీని వెనక బీజేపీ ఉందన్న విమర్శలు అక్కసుతో కూడినవే. ఏపీ ప్రజలు అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్కు మద్దతు పలికారు. మేం వారితో కలిసి పోటీచేయలేదు. ఈరోజు కూడా వారు ఎన్డీయేలో భాగస్వామి కాదు. అక్కడ సీపీఎం ఉన్నా రాజ్యాంగ వ్యవస్థకు లోబడి కేంద్రం నడుచుకుంటుంది’ అని స్పష్టం చేశారు. షెడ్యూల్కు అనుగుణంగా బిల్లుపై ముందుకెళ్తారు ఈ సమావేశాల్లోనే బిల్లు వచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. దీనికి సమాధానం కేంద్ర కేబినెట్ కార్యదర్శి లేదా హోం శాఖ లేదా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నుంచి లభించవచ్చని.. వాటి షెడ్యూలు ప్రకారం సమయానుసారంగా పనిచేస్తాయని చెప్పారు. రాజకీయ కోణంలో జాప్యం చేయడం.. వెంటనే చేయడం వంటి కోణాలకు ఆస్కారం ఉండదని వివరించారు. రాజధానిపై పార్లమెంటులో బీజేపీ వైఖరి ఎలా ఉంటుందని ప్రశ్నించగా ‘ఇది రాష్ట్ర పరిధిలోని అంశమని గతంలోనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చెప్పారు. చర్చకు వస్తే మా పార్టీ వాణిని వినిపిస్తాం. దీనిని రాజకీయంగా రాష్ట్రంలో ఎదుర్కోవాలని గతంలోనే నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించాలనడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం’ అని పేర్కొన్నారు. -
రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తాం
-
మండలి రద్దు: కేంద్రం అడ్డు చెప్పే ఛాన్సే లేదు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్రం అడ్డు చెప్పే అవకాశం లేదని ఆయన తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచనల మాత్రమే చేస్తుందని, ఆ సూచనలపై అంతిమ నిర్ణయం పార్లమెంటు తీసుకుంటుందని తెలిపారు. మండలి రద్దు విషయంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన కేంద్రానికి లేదని ఆయన తేల్చి చెప్పారు. (మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం) -
చంద్రబాబుకు సవాల్.. ఆ విషయం చెప్పగలరా?
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్రలో రాజధాని అవసరంలేదని చెప్పే ధైర్యం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి ఉందా అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. వెనుకబడిన కర్నూలులో హైకోర్టు అవసరంలేదని బహిరంగంగా చెప్పగలరా అని సవాల్ విసిరారు. మంగళవారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ.. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. శాసనమండలి రద్దుకు టీడీపీ వ్యతిరేకమైతే అసెంబ్లీలో చర్చకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. వికేంద్రీకరణ, 13 జిల్లాల అభివృద్ధిపై టీడీపీ వైఖరి ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న దిశ చట్టంను దేశ వ్యాప్తంగా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. (కేంద్రం ముందుకు మండలి రద్దు తీర్మానం) ‘అసత్యాలు ప్రచారాలు చేస్తూ.. ప్రజలను పక్కదారి పట్టించడంలో చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. ఆయనలా దిగజారి మాట్లాడటానికి మాకు సంస్కారం అడ్డొస్తోంది. ఐదేళ్ల పదవీ కాలంలో కనీసం దుర్గగుడి ఫ్లై ఓవర్ కూడా పూర్తి చేయలేని చంద్రబాబు రాజధానిని ఎలా నిర్మించగలరు?. ప్రభుత్వ నిర్ణయంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు దావోస్కు ఎందుకు వెళ్లారో చెప్పాలి. స్విస్ బ్యాంక్లో దాచుకున్న అక్రమ సొమ్ము కోసమే వెళ్లారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు చరిత్ర ఎలాంటిదో మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు రాసిన పుస్తకం చూస్తే తెలుస్తుంద’ని శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. -
కేంద్రం ముందుకు మండలి రద్దు తీర్మానం..
-
శాసన మండలి రద్దుపై మరో ముందడుగు
సాక్షి, అమరావతి : శాసనమండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. తొలుత శాసనసభ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ తీర్మానాన్ని పంపారు. అనంతరం తీర్మానాన్ని పరిశీలించిన సీఎస్.. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం హోంశాఖ అధికారులకు పంపారు. దీంతో మండలి రద్దు విషయంలో ప్రభుత్వం మరో ముందడుగేసినట్లయింది. పార్లమెంట్ ఉభయ సభలతో పాటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం సభ పూర్తిగా రద్దు కానుంది. మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సభ్యులు రోజంతా సుదీర్ఘంగా చర్చించి.. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తున్నట్లు సభ్యులంతా తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు. -
‘రద్దును ఆనందంగా స్వీకరిస్తున్నాం’
సాక్షి, అమరావతి: శాసన మండలి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిందని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సభలో నేను సభ్యుడినైనా మండలి రద్దును ఆనందంగా స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్ గతంలో మండలిని చాలా స్వల్పకాలిక ప్రయోజనం కోసం రద్దు చేశారు. ఈనాడు రామోజీరావు కోసం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం రద్దు నిర్ణయం తీసుకున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన చోట రాజధాని పెట్టాలని శివరామకృష్ణ కమిటీ చెబితే.. చంద్రబాబు పట్టించుకోకుండా నారాయణ కమిటీ వేసి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. చంద్రబాబు చేసిన దురదృష్టకరమైన నిర్ణయాలను సరిచేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. మండలిని రాజకీయ కేంద్రంగా టీడీపీ వినియోగించుకోవడం దురదృష్టకరం. శాసనసభలో చేసిన చట్టాలకు సలహాలు, సూచనలు ఇవ్వకుండా టీడీపీ ఎమ్మెల్సీలు రాజకీయ కుట్రలకు దాన్ని వేదికగా చేసుకున్నారు. అభివృద్ధి కోసం రాజకీయాలు చేయాలే గానీ.. స్వార్థం కోసం కాదు. ఆటలో రిఫరీ నిష్పక్షపాతంగా ఉండాలి. బాల్ కొట్టకుండానే పాయింట్ ఇవ్వడం ఎంతవరకూ సమంజసం. మండలిలో చైర్మన్ చేసిన తప్పు అలాంటిదే. మండలి చైర్మన్ ఒక పార్టీ పట్ల పక్షపాతంగా వ్యవహరించడం క్షమించరాని నేరం. సభాపతులుకున్న నిబంధనలను సమీక్షించాల్సిన అవసరం ఉంది. దీనిపై ఒక కమిటీ వేయాలని కోరుతున్నా. మండలిలో జరిగిన దాని గురించి అసెంబ్లీలో చర్చించకూడదని కొందరు అంటున్నారు. జరిగిన తప్పును చర్చించకపోతేనే తప్పు అవుతుంది. చర్చించకపోతే ఇంకా తప్పులు చేస్తారు. మండలిని శాశ్వతంగా రద్దు చేయాల్సిందే’అని పిల్లి సుభాష్చంద్రబోస్ పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తా ‘మండలిలో సభ్యులుగా ఉన్న నేను, నా సహచర మంత్రి సుభాష్ చంద్రబోస్ పదవులను తృణప్రాయంగా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. పెద్దల సభగా పిలిచే శాసన మండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతిస్తున్నాం. పాలకులు ప్రజల కోసం ఈ సభలో చర్చించి తీసుకున్న నిర్ణయాలపై పెద్దల సభలో మంచి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. గడచిన నాలుగు రోజుల్లో చంద్రబాబు రెండు నాలుకల ధోరణితో ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే బిల్లులను అపహాస్యం చేశారు. చంద్రబాబు నిర్వాకం వల్ల ఆ చట్ట సభల్లోని సభ్యులు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియా టుడే సర్వేలో దేశంలోనే అత్యుత్తమ పరిపాలనా దక్షత ఉన్న ముఖ్యమంత్రుల్లో నాలుగో స్థానంలో ఉన్న ఘనత జగన్ది. మా పార్టీ నుంచి మండలికి నామినేట్ అయిన సభ్యులు ప్రజా జీవితంలో గుర్తింపు పొందిన వ్యక్తులు. చంద్రబాబు దోపిడీదారులను మండలికి నామినేట్ చేశారు’ అని మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వ్యాఖ్యానించారు. చదవండి: ప్రజా ప్రయోజనాల కోసమే.. శాసనమండలి రద్దు -
ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు
ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డుపడుతున్నారని అధికార పక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ఓడిపోయిన నేతలకు శాసనమండలి పునరావాస కేంద్రంగా మారిందన్నారు. రాజకీయాల కోసం చట్టాలను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. శాసనమండలి రద్దు తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రభుత్వ విప్లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, దాడిశెట్టి రాజా, మంత్రి పేర్ని నాని, అధికార పక్ష ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, మేరుగ నాగార్జున, విడదల రజని, గుడివాడ అమర్నాథ్, కొలుసు పార్థసారథి తదితరులు మాట్లాడారు.ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని.. ప్రజలు ఆమోదించిన,ప్రభుత్వ నిర్ణయాలను మండలిలో అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. అధికార పక్ష సభ్యులు ఏమన్నారంటే... సాక్షి, అమరావతి: శాసనసభ తీసుకున్న ప్రజోపయోగ నిర్ణయాలను మండలి అడ్డుకుంటోందని.. అసలు అలాంటి సభ మనకు అవసరమా? అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ అప్రజాస్వామికంగా, అభివృద్ధి నిరోధకంగా వ్యవహరిస్తున్న టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు శాసనమండలిని రద్దు చేయొద్దని చెప్పే అధికారం లేదని అన్నారు. శాసనమండలి రద్దు తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ధర్మాన ప్రసంగించారు. గతంలో శాసనమండలిని రద్దు చేసినప్పుడు ధర్మవాక్యాలు వల్లించిన చంద్రబాబు ఈవేళ సభకు జవాబు చెప్పలేక పారిపోయారని ఎద్దేవా చేశారు. గతంలో పలువురు ప్రముఖులు ఎగువ సభ రద్దు అవసరాన్ని నొక్కిచెప్పిన విషయాల్ని ఆయన తన ప్రసంగంలో వివరించారు. ధర్మాన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ప్రజోపయోగ నిర్ణయాల్ని అడ్డుకుంటారా? ప్రపంచంలో 178 దేశాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమలులో ఉంటే కేవలం 68 దేశాల్లో మాత్రమే మండలి వంటి ఎగువ సభలు ఉన్నాయి. చాలా దేశాలు రద్దు చేస్తున్నాయే తప్ప కొత్తగా తీసుకొస్తున్నవి లేవు. బ్రిటీష్ వాళ్లు.. వారి అవసరాల కోసం ప్రజల ఆకాంక్షలను పక్కనబెట్టి వీటిని ఏర్పాటు చేశారు. అందుకే మహాత్మాగాంధీ మొదలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ, గోపాలస్వామి అయ్యర్, ఎన్జీ రంగా లాంటి మహనీయులు వ్యతిరేకించారు. కొందర్ని మేనేజ్ చేయడానికి ఈ పెద్దల సభలు ఉపయోగపడతాయని ఆనాడే గాంధీ పసిగట్టారు. ప్రస్తుతం ఆ విషయం మనకు కరెక్ట్గా సరిపోయే సందర్భం. ఎన్నికల్లో గెలవలేక పరాజయం పొందినవారికి మండలి పునరావాస కేంద్రంగా మారింది. ఖజానాపై భారం పడుతుంది. ప్రజలచే తిరస్కరణకు గురైన వ్యక్తులు గ్యాలరీలలో కూర్చొని ప్రభావితం చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే శాసనసభ ఔన్నత్యాన్ని పడగొట్టాలని ఎత్తుగడలు వేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? సెలెక్ట్ కమిటీని పద్ధతి ప్రకారం వేయలేదు. ఆ సభలో ఉండే చైర్మన్ రూల్స్ వక్రీకరించి నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ బిల్లును ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో టీడీపీ వాళ్లకు తెలియదా? మండలి అవసరం లేదని చంద్రబాబే చెప్పాడు అమరావతి ప్రాంత ప్రజలే చంద్రబాబు కుమారుడు లోకేష్ను ఓడిస్తే తిరిగి దొడ్డిదారిన తెచ్చి శాసనమండలిలో కూర్చోబెట్టి మంత్రిని చేశారు. ఆయన మండలిలో కూర్చొని ఇది తప్పు..అది తప్పని చెబుతున్నారు. ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేసినట్టవుతుందా? కాదా? శాసనమండళ్లనే కాదు రాజ్యాంగపరమైన రాజ్యసభ రద్దుకు కూడా 1971, 72, 1975లలో ప్రయత్నాలు జరిగాయి. దేశ, ప్రజాక్షేమానికి భిన్నంగా వ్యవహరించినప్పుడు ఎవరో ఒక దేశ భక్తుడు ఈ ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఆ అవసరం వచ్చింది. మండలి అవసరం లేదని చంద్రబాబే అన్నాడు. అంతకుముందే మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు కాబట్టి..గాంధీజీ చెప్పిన మార్గంలోనే నడుద్దాం. సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నా’ అని ధర్మాన పేర్కొన్నారు. మండలి రద్దు 5 కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రజా శ్రేయస్సు కోసం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే శాసనమండలి అడుగడుగునా అడ్డు తగులుతోంది. మండలిలో టీడీపీ సభ్యులు స్వార్థ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరించి ఉమ్మడి రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోవడానికి చంద్రబాబు కారణమయ్యారు. సోనియాతో కుమ్మక్కై రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా వద్దంటూ ప్రత్యేక ప్యాకేజీ కోసం తాపత్రయపడ్డారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కనపెట్టి తన స్వార్థం కోసం అమరావతిని రాజధాని చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యలను, పోలవరం ప్రాజెక్ట్ను మర్చిపోయారు. భవనాలు కట్టడమే అభివృద్ధి కాదు. దీనికి భిన్నంగా మా నాయకుడు వైఎస్ జగన్ 6 నెలల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి పాలనను ప్రజల చెంతకు చేరుస్తుంటే సహించలేకపోతున్నారు. అమరావతిలో 4,500 ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే పరమావధిగా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టిన ప్రతి బిల్లునూ తిప్పిపంపడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ప్రజా తీర్పును అగౌరవపరుస్తున్నారు. శాసనమండలిని రద్దు చేయాలన్నది రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. మండలి రద్దు చాలా సమంజసం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే మండలి రద్దే మంచిది. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పూర్తిగా సమర్థిస్తున్నా. – ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని),ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు పొలిటికల్ క్రిమినల్ పొలిటికల్ క్రిమినల్ ఎవరని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు చంద్రబాబే అని. చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టేలా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా ఆయన దొంగ రాజకీయాలు చేస్తున్నారు. గాయం చేసిన బాధ తెలిసిన వాడే సాయం చేయగలడన్నట్లు సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల గాయాలను తెలుసుకుని వారు కోరుకున్న విధంగా చట్టాలు చేస్తుంటే చంద్రబాబు అడ్డు తగులుతున్నారు. ప్రజలు ఛీకొట్టిన నాయకుడు గ్యాలరీలో కూర్చుని ఆదేశిస్తే శాసనసభ ఆమోదించిన బిల్లును అవమానిస్తారా. తన దగుల్బాజీ రాజకీయాన్ని నిలదీస్తామనే చంద్రబాబు సభకు రాకుండా పారిపోయారు. పెద్దల సభకు వైఎస్ జగన్ అనుభవజ్ఞులైన నాయకులను పంపితే చంద్రబాబు తన ఇంట్లోని దద్దమ్మను పంపారు. అఖిల భారత మేధావుల సంఘానికి అధ్యక్షుడినని తనకు తానే స్వయంగా ప్రకటించుకున్న యనమలకు సింగపూర్ వెళ్లి జ్ఞానదంతం పీకించుకున్నా జ్ఞానం రాలేదు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ముందు నోటీసు ఇవ్వాలని ఈ మేధావికి తెలియదా. ప్రజాభిప్రాయానికి, ప్రజాతీర్పుకు విలువ ఇవ్వని మండలి ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. రాజ్యాంగాన్ని గౌరవించని పెద్దల సభకు శుభం కార్డు వేయాలి. – ఆర్కే రోజా, ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ప్రజాస్వామ్య ‘స్పిరిట్’తో మండలి తెస్తే టీడీపీ ఆల్కహాల్గా మార్చేసింది ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనం కోసం శాసనమండలిని చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ రాజకీయం చేయాలనుకుంటే ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టేవారు. రాజకీయాలు ఫెయిర్గా ఉండాలనేది ముఖ్యమంత్రి అభిమతం. సీఎం వైఎస్ జగన్ అనుకుంటే ఆర్డినెన్స్ ద్వారా అయినా చట్టం తెచ్చేవారు కాదా? ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు వెళ్తుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. మండలి రద్దు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలి. ఇలాంటి మండలిని ఇంకా ఉండాలా? అని ఆలోచించాలి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలనే స్పిరిట్తో ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి మండలిని తీసుకొస్తే.. చంద్రబాబు ఆ మండలిని ఆల్కహాల్గా మార్చేశారు. దేవాలయం లాంటి పెద్దల సభను దెయ్యాల కొంపగా మార్చారు. – చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రభుత్వ విప్ ప్రజాస్వామ్యవాదుల్ని ఆశ్చర్యపరిచింది శాసనమండలిలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సాగిన రాజకీయ క్రీడ ప్రజాస్వామ్య వాదుల్ని ఆశ్యర్యానికి గురి చేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలన్నీ ఆయన ప్రయోజనాల కోసమే. శాసనమండలిలో చంద్రబాబు, టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఎండగట్టాల్సిందే. ఆయన పాలనలో దాడులు, అసమానతలు, ప్రాంతాలు, కులాల మధ్య వైషమ్యాలు చూశాం. రాష్ట్ర విభజనకు ఆయన లేఖ ఇచ్చారు. హోదా విషయంలో అనేకసార్లు యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వికేంద్రీకరణ బిల్లు తెస్తే.. మండలిలో టీడీపీ సభ్యులు ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసు. మండలి రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. – మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే ప్రజాభిమతాన్ని అడ్డుకోవడమేనా? చంద్రబాబు లాంటి వ్యక్తులకు రాజకీయ క్రీడగా మారిన శాసనమండలి, ప్రజా ప్రభుత్వం చేసిన చట్టాలను అడ్డుకోవడానికే పరిమితమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాలను మండలి అడ్డుకోవడం వెనుక చంద్రబాబు కుతంత్రాలున్నాయి. వ్యవస్థలన్నీ ఆధిపత్య వర్గం చేతిలో ఉన్న సమయంలో వైఎస్ జగన్ పాలనను వికేంద్రీకరించి, గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకు తెచ్చారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు పేదలను బానిసలను చేశాయి. విద్యుత్ సంస్కరణల పేరుతో చంద్రబాబు ఆ రంగాన్ని దోచుకుతిన్నారు. గ్రీన్ జోన్ పేరుతో అమరావతి రైతులను దగా చేసి, సింగపూర్ కంపెనీలకు మేలు చేకూర్చే ఒప్పందాలు చేసుకోవడమా చంద్రబాబు చేసిన రాజధాని అభివృద్ధి?. రైతులకు చేసిన పాపమే చంద్రబాబుకు శాపమైంది. అందుకే ఆయనకు 23 సీట్లు వచ్చాయి. కౌన్సిల్లో ఏదో జరిగిపోయిందని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. దేశ చరిత్రలోనే వైఎస్ జగన్ మాదిరిగా 51 శాతం ఓట్లతో గెలిచిన నాయకుడు లేడు. ఎన్టీఆర్కు 1983లో 43 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 51 శాతం ఓట్లతో 151 సీట్లు సాధించిన ఏకైక మగాడు వైఎస్ జగన్. – కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేసిన చరిత్ర యనమలది మండలిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన బినామీలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు భారీ దోపిడీకి తెగబడ్డారు. మండలిలో టీడీపీ సభ్యులు సైంధవుల్లా వ్యవహరిస్తున్నారు. యనమల రామకృష్ణుడు వేసుకునే సూటు, బూటు కూడా ప్రభుత్వ సొమ్మే. ప్రభుత్వ సొమ్మును ఇంటి అద్దెలకు వాడుకున్న చరిత్ర యనమలది. ఇందుకు సంబంధించి జీవోలు ఉన్నాయి. రూ.లక్షల ప్రజాధనంతో దంత చికిత్సకు సింగపూర్ వెళ్లిన ఘనుడు యనమల. తన 39 ఏళ్ల రాజకీయ చరిత్రలో దుర్మార్గం తప్ప సొంత జిల్లాకు, తన నియోజకవర్గానికి ఏమీ చేయకుండా ఎన్టీఆర్కు పొడిచినట్లే ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. శాసనసభ్యులను ఆబోతులతో పోల్చిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. – దాడిశెట్టి రాజా, ప్రభుత్వ విప్ చంద్రబాబు అంటే వెన్నుపోటే గుర్తొస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను చూస్తే ఆయన ప్రవేశపెట్టిన అమ్మ ఒడి లాంటి సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. చంద్రబాబును చూస్తే వెన్నుపోటు కళ్లముందు కదలాడుతుంది. చంద్రబాబు దొడ్డిదారి రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మేనిఫెస్టోను వందకు వంద శాతం నెరవేర్చేలా సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారు. ఐదేళ్లు అవకాశం ఇచ్చిన ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు. ఒక్క ముస్లిం, మైనారిటీకి కూడా చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. మండలిపై కూడా చంద్రబాబు రెండు నాలుకల సిద్ధాంతాన్ని చూపించారు. ఈ ప్రభుత్వం ప్రజలకు అత్యంత జవాబుదారీతనంతో వ్యవహరిస్తోంది. – విడదల రజని, ఎమ్మెల్యే ఉత్తరాంధ్ర ప్రజల మనసుల్ని గాయపరిచింది శాసనమండలిలో టీడీపీ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల మనసును గాయపరిచింది. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఉత్తరాంధ్రకు ఒక గుర్తింపు వస్తున్న తరుణంలో టీడీపీ నేతలు దానిని చెడగొట్టే ప్రయత్నం చేశారు. మండలి రద్దుపై శాసన సభలో ఎలా చర్చిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తునారు. సభలో చర్చించకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో చర్చించాలా?. పెద్దల సభలో పెద్దలు లేరు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు, అవినీతి పరులు, ఆర్థిక నేరస్తులు, కొబ్బరి చిప్పలు అమ్ముకునేవారే టీడీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వికేంద్రీకరణ బిల్లుతో ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరుగుతుంది. దానిని అడ్డుకుని చంద్రబాబు మూడు గ్రామాలకు హీరో కావొచ్చు. కానీ.. 13 జిల్లాలకు విలన్ అయ్యారు. – గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎమ్మెల్యే చంద్రబాబుది నక్షత్రకుడి పాత్ర రాయలసీమది ఘనమైన చరిత్ర. రాజకీయ అవసరాల కోసం హత్యా రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు మాత్రమే సీమలో ఉన్నాయని చిత్రీకరించి టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచే దుష్ప్రచారం మొదలు పెట్టింది. శ్రీమహావిష్ణువు స్వయంభువుగా వెలసిన తిరుపతి రాయలసీమలోనే ఉంది. తాళ్లపాక అన్నమాచార్యులు, వేమన, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి వారు రాయలసీమ వారు కాదా? ఎన్టీఆర్తో అద్భుతమైన హిట్ చిత్రాలు నిర్మించిన కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి వంటి వారు రాయలసీమ వారు కాదా?. రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షిస్తున్నారు. ఒకప్పుడు మండలిలో మహానుభావులు ఉంటే.. ఇప్పుడు కాల్మనీ సెక్స్ రాకెట్ నిందితులు, ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవని వారు, భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో గెలవలేని వారు ఉన్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ఆయన తాత రాజారెడ్డి గురించి ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావిస్తున్నారు. ‘రాజారెడ్డి లాంటి ఉత్తమోత్తమమైన వ్యక్తి చాలా అరుదుగా రాజకీయాల్లో ఉంటారు. ఆయనతో 23 ఏళ్లు సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా చెబుతున్నాను. కమ్యూనిస్టు నాయకుడు, ప్రముఖ పాత్రికేయుడు, గొప్ప దార్శనికుడు గజ్జెల మల్లారెడ్డికి అత్యంత ప్రాణసఖుడు రాజారెడ్డి. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి నీచంగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లింది. – భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే జగన్ వల్ల నాకు శాప విముక్తి పొలిటికల్ ట్రాప్లో పడి ఎన్టీఆర్ అంతటి గొప్ప వ్యక్తికి వెన్నుపోటు పొడిచానని, అందుకు 15 సంవత్సరాలు రాజకీయంగా తెరమరుగయ్యానని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్ల తనకు శాపవిముక్తి జరిగిందన్నారు. గొప్ప వ్యక్తుల వల్లే శాప విముక్తి జరుగుతుందని పేర్కొన్నారు. సోమవారం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్కు వెన్నుపోటు అంశాన్ని ప్రస్తావించగా స్పీకర్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. విస్తృత చర్చ జరగాలి..: ఇదిలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ సభాపతులు అనుసరించాల్సిన నిబంధనలు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో జరిగిన స్పీకర్ల సమావేశాల్లో ఫిరాయింపుల నిరోధక చట్టాలపై మంచి చర్చలు జరిగాయన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి తమ పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందేనని తమ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కచ్చితంగా చెబుతున్నారని తాను చాలా స్పీకర్ల సమావేశాల్లో చెప్పానని తెలిపారు. దీనిపై రాజ్యాంగ సమీక్ష జరగాలనే అభిప్రాయం వ్యక్తమైందన్నారు. బోస్ ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని, దానిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరముందని స్పీకర్ అన్నారు. అసెంబ్లీ ఆమోదిస్తే కౌన్సిల్ అడ్డుకోవడం ఏమిటి? భావితరాల భవిష్యత్ కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేసే చట్టాలను అడ్డుకోవడానికే శాసనమండలిని చంద్రబాబు లాంటి వాళ్లు వాడుకుంటున్నారు. మహా యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్లుగా జగన్ ప్రజా శ్రేయస్సు కోసం చేసే ప్రతి పనినీ చంద్రబాబు అడ్డుకుంటున్నారు. శాసనసభలో ఆమోదించిన చట్టానికి సూచనలు చేయాల్సిన బాధ్యత గల మండలి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అందుకే మండలిని రద్దు చేయాల్సిందే. ఇంగ్లిష్ మీడియం విద్య బిల్లు, ఎస్సీ, ఎస్టీలకు విడివిడిగా కమిషన్ ఏర్పాటు చేసే చట్టాలను అసెంబ్లీ ఆమోదిస్తే కౌన్సిల్ అడ్డుకోవడం ఏమిటి. శాసనసభలో తాటకి మాదిరిగా చంద్రబాబు, కౌన్సిల్లో సుబాహు మాదిరిగా ఆయన కుమారుడు అభివృద్ధి యజ్ఞాన్ని అడ్డుకుంటున్నారు. కుట్రలు, కుతంత్రాలుతో నిండిన చంద్రబాబు నాయకత్వంలో ఉన్న టీడీపీ దుర్మార్గాలకు తెర తీస్తోంది. శాసన మండలి రద్దు గురించి చంద్రబాబు చెప్పే సుద్దులు విడ్డూరంగా ఉన్నాయి. 40 ఏళ్ల ఇండస్ట్రీ 2004లో మండలి పునరుద్ధరణపై వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను అందరూ గమనించాలి (అప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడిన వీడియో ప్రదర్శించారు). రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన మండలి రాష్ట్రానికి ఆర్థిక భారమన్న చంద్రబాబు ఇప్పుడు కావాలనడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం. చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలమని లేఖ ఇచ్చారు. రాష్ట్రాన్ని విడగొట్టిన తరువాత మీరెవరు విడగొట్టేందుకు అని బస్సులో బయల్దేరారు. వాజ్పేయి ప్రభుత్వాన్ని మతతత్వ పార్టీ అని, తాను మద్దతు ఇవ్వనని చెప్పిన చంద్రబాబు తరువాత ఆ పార్టీతోనే జత కట్టారు. ప్రధాని మోదీ కాళ్లకు దండం పెట్టి బీజేపీతో అంటకాగారు. పత్రికారంగంలో దుర్మార్గ పోకడలు హేయం. – పేర్ని నాని, రవాణా, సమాచార శాఖ మంత్రి -
నాడు ఎన్టీఆర్.. నేడు జగన్
సాక్షి, అమరావతి: శాసన మండలి వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని పేర్కొంటూ 1985లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీ రామారావు కౌన్సిల్ను రద్దు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రపద్రేశ్లో నేడు మరోసారి మండలి రద్దుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్థిక భారంతోపాటు రాష్ట్ర ప్రజలకు మేలు చేయకపోగా అన్యాయం చేసేలా ప్రతిపక్ష తెలుగుదేశం ఎమ్మెల్సీలు వ్యవహరించడంతో మండలి రద్దుకు వైఎస్ జగన్ తాజాగా నిర్ణయం తీసుకుని ఆ మేరకు అసెంబ్లీలో సోమవారం తీర్మానం ఆమోదింపజేశారు. ఎన్టీఆర్ హయాంలో మూడు నెలల్లో రద్దు.. 1958 జూలై 1న ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రద్దు చేశారు. అప్పట్లో మండలి రద్దు ప్రక్రియ కేవలం మూడు నెలల వ్యవధిలో పూర్తయింది. 1985 మార్చిలో రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన ఎన్టీఆర్ వెంటనే మండలిని రద్దు చేయాల్సిందిగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపగా.. అదే ఏడాది మే 31న మండలిని రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో 1–06–1985న మండలి రద్దయిపోయింది. నేడు జగన్ నేతృత్వంలో మండలి రద్దు తీర్మానం.. రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసే బిల్లులను అడ్డుకునేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం ప్రస్తుతం శాసనమండలిని వేదికగా చేసుకుంది. ఇదే క్రమంలో తాజాగా మూడు రాజధానుల ఏర్పాటుతో పాటు వికేంద్రీకరణ బిల్లుకు, సీఆర్డీయే రద్దు బిల్లుకు సైతం మోకాలడ్డింది. ప్రజాశ్రేయస్సుకు ఏమాత్రం ఉపయోగపడకపోగా, ప్రజలకు మేలు చేసే బిల్లులను సైతం అప్రజాస్వామిక రీతిలో అడ్డుకుంటుండడంతో తాజాగా వైఎస్ జగన్ శాసన మండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. ప్రజలచేత ఎన్నుకోబడ్డ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయకోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే మండలి పనిచేస్తోందని, కాలయాపన, ప్రజాప్రయోజనాలకు విఘాతం తప్ప ఎలాంటి మంచి జరిగే అవకాశం కనిపించట్లేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి మండలిని కొనసాగించాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. మండలి రద్దు ప్రక్రియ ఇలా.. - రాజ్యాంగంలోని 169(1) అధికరణ కింద శాసన మండలిని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. - మండలిని రద్దు చేయాలంటే.. రాజ్యాంగంలోని 169(1) అధికరణ కింద రద్దు ప్రతిపాదనను తొలుత రాష్ట్ర కేబినెట్ ఆమోదించాలి. అనంతరం మండలిని రద్దు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత సభలో చర్చ అనంతరం 2/3వ వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందాలి. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలి. - రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్ర హోంశాఖ పరిశీలించి స్వల్ప రాజ్యాంగ సవరణకు లోక్సభ, రాజ్యసభ ముందుకు తీసుకువెళ్లాలి. ప్రస్తుతం రాష్ట్రంలో శాసనసభ, శాసనమండలి ఉన్నాయి. ఇప్పుడు శాసనసభ మాత్రమే ఉంటుందని అతిసాధారణమైన రాజ్యాంగ సవరణలకు లోక్సభ, రాజ్యసభ ఆమోదించాల్సి ఉంది. - లోక్సభ, రాజ్యసభ ఆమోదించాక రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయగానే మండలిని రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వమే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ చాలా సాధారణమైన అంశమని, రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా కేంద్రం చేయాల్సిన బాధ్యత ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
మండలిని లోకేష్ భ్రష్టు పట్టించారు..
-
నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తారా..?
సాక్షి, అమరావతి: లోకేష్ అహంకారం, అహంభావంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. తాను డబ్బులు తీసుకున్నట్టు నిరూపించాలని.. లేకపోతే లోకేష్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్ విసిరారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. టీడీపీ స్వార్థ రాజకీయాలు కారణంగానే శాసనమండలి రద్దు కాబోతుందని ఆమె పేర్కొన్నారు. (చదవండి: బాబు తప్పులకు రిపేర్లు చేస్తున్నాం : సీఎం జగన్) -
చంద్రబాబు ఎందుకు పారిపోయారు..?
సాక్షి, అమరావతి: మండలి రద్దుపై ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయమే వైఎస్సార్సీపీ తీసుకుందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు మండలి రద్దు చేయాలనే ఆలోచన లేదని.. ఎన్నికల తర్వాత అనివార్యమైన పరిస్థితులను టీడీపీ కల్పించిందని చెప్పారు. పెద్ద మెజార్టీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలిచారని.. రాష్ట్రాభివృద్ధి కోసం త్వరితగతిన సీఎం నిర్ణయాలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చేసిన అధికార వికేంద్రీకరణ బిల్లును మండలిలో కావాలనే రాజకీయంతో తిరస్కరించారని మండిపడ్డారు. సభలో తీర్మానం చేసిన బిల్లులను అడ్డుకోవాలనే దుర్బుద్ధితో టీడీపీ సభ్యులు వ్యవహరించారని.. దీంతో మండలిని రద్దు చేయాలనే భావనను కల్పించారని వెల్లడించారు. చట్టాలను త్వరితగతిన అమలు చేసి ప్రజలకు అందించాలంటే మండలి అడ్డుగా ఉంటుందని పేర్కొన్నారు. గత ఐదేళ్లు పాలన చేసిన చంద్రబాబు అవమానకరంగా ఓడిపోయారని.. ఆయన బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. మెజార్టీ ప్రజల అభ్రిపాయాలను అణగదొక్కాలనే యత్నం చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. (చదవండి:బాబు తప్పులకు రిపేర్లు చేస్తున్నాం : సీఎం జగన్) ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు సభకు రాలేదని.. ఆ బాధ్యత నుంచి ఎందుకు పారిపోయారని అంబటి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొని కాపాడుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. వేగవంతమైన పరిపాలన అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని.. అందుకే మండలి రద్దు చేయాలనే నిర్ణయానికి సీఎం జగన్ వచ్చారన్నారు.. రాజకీయంగా అ ఆ లు రాని లోకేష్ లాంటి వ్యక్తులు శాసన మండలిని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. మండలిని దుర్వినియోగం చేసినందుకు చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. శాసనసభలో తీర్మానం తర్వాత మండలి కచ్చితంగా రద్దు అవుతుందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. -
మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
-
మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన 133 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. అనంతరం తీర్మానం ఆమోదం పొందినట్లు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. రాజ్యాంగంలోని 169 అధికరణ ప్రకారం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ తెలిపారు. మండలిని రద్దు చేయాలని సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా పెద్దల సభను రద్దు చేయాలని తీర్మానించి.. దానిని సీఎం జగన్ శాసనసభ ముందు ఉంచారు. దీనిపై రోజంతా సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తున్నట్లు సభ్యులంతా తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు. (మండలి రద్దుకు గర్వపడుతున్నాం: సీఎం జగన్) చర్చలో భాగంగా మండలి రద్దు తీర్మానంపై ప్రసంగించిన సీఎం జగన్.. దీనికి ఆమోదం తెలపాలని సభ్యులను కోరారు. అనంతరం సభలో ఓటింగ్కు పెడుతున్నట్లు అసెంబ్లీ స్పీకర్ సీతారాం ప్రకటించారు. ముందుగా సభలో సభ్యులు కాని మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోష్లను పక్కన కూర్చోవాలని సూచించారు. అనంతరం సభలో ఓటింగ్ చేపట్టి.. ఆమోదం పొందినట్లు ప్రకటించారు. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కేంద్రానికి పంపనుంది. పార్లమెంట్ ఉభయ సభలతో పాటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం సభ పూర్తిగా రద్దు కానుంది. కాగా ఏపీలో శాసనమండలి రద్దు కావడం ఇది రెండోసారి. తొలిసారి మే 31, 1985న నాటి సీఎం ఎన్టీఆర్ రద్దు చేసిన విషయం తెలిసిందే. -
మండలిలో టీడీపీ తీరు దురదృష్టకరం
-
రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆ నిర్ణయం..
సాక్షి, అమరావతి: రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణ కమిటీ ముఖ్యమైన సూచనలు చేసింది. ఆ కమిటీ సూచనలను చంద్రబాబు పట్టించుకోలేదు. నారాయణ కమిటీ వేసి తన స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి ప్రాంతాన్ని ఆయన ఎంపిక చేశారు. చంద్రబాబు చేసిన దురదృష్టకరమైన నిర్ణయాలను సరి చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని’ డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మండలిని రాజకీయ కేంద్రంగా టీడీపీ వినియోగించుకోవడం దురదృష్టకరమన్నారు. సభలో చేసిన చట్టాలకు సలహాలు, సూచనలు ఇవ్వకుండా టీడీపీ ఎమ్మెల్సీలు రాజకీయంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మండలిలో తీర్మానం మూవ్ కాలేదని చైర్మన్ స్వయంగా చెబుతున్నారని.. విస్తృత అధికారులు ఉన్నాయని సెలెక్ట్ కమిటీకి పంపడం సబబా అని ప్రశ్నించారు. ప్రజాసంపద అన్ని ప్రాంతాలకు సమానంగా ఖర్చు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం చేసిన చట్టాలను కూడా మండలిలో అడ్డుకున్నారన్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయని.. వాటిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని.. లేకుంటే ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందన్నారు. మండలిని శాశ్వతంగా రద్దు చేయాల్సిందే.. సీఎం జగన్ తీర్మానాన్ని సమర్థిస్తున్నానని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. -
చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు స్వార్థ ప్రయోజనాలకు నిలయంగా మండలి మారిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయన విధానాలు వలనే మండలి అప్రతిష్ట పాలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం బిల్లును తెస్తే మండలిలో టీడీపీ అడ్డుకుందని నిప్పులు చెరిగారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి వికేంద్రీకరణ బిల్లును కూడా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. పాదయాత్రలో ప్రాంతాల మధ్య అసమానతలను సీఎం వైఎస్ జగన్ గుర్తించారని చెప్పారు. హైదరాబాద్ లాంటి ఉదాహరణతో వికేంద్రీకరణ జరగాలని ఆయన నిర్ణయించారన్నారు. పాక్లో బందీలుగా ఉన్న మత్స్యకారులను విడిపించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ సంకల్పమని తెలిపారు. మండలి రద్దు తీర్మానాన్ని బలపరుస్తున్నానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న.. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నానని మోపిదేవి తెలిపారు. -
సమగ్రాభివృద్ధే సీఎం జగన్ సంకల్పం..
-
‘అందుకే బాబు సభకు రాకుండా పారిపోయారు’
-
‘అందుకే బాబు సభకు రాకుండా పారిపోయారు’
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేశ్ పదవి పోతుందనే సరికి భయపడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. 2004లో మండలి అవసరం లేదన్న చంద్రబాబు.. ఇప్పుడు లోకేశ్ పదవి కోసం కావాలంటున్నారని మండిపడ్డారు. ఇక్కడే ఆయన రెండు నాలుకల ధోరణి ప్రతి ఒక్కరికి అర్థమవుతోందన్నారు. శాసనసభ ద్వారా చట్టాలు చేయడమే నిజమైన ప్రజాస్వామ్యం అని స్పష్టం చేశారు. ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి మద్దతు తెలిపారు. సోమవారం అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానంపై రోజా మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని రాజ్యాంగం చెబుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారని గుర్తుచేశారు. వికేంద్రీకరణ బిల్లును నిబంధనలకు విరుద్ధంగా సెలక్ట్ కమిటీకి పంపారని మండిపడ్డారు. శాసనసభలో ఆమోదించిన బిల్లును.. మండలిలో అవమానిస్తారా అని ప్రశ్నించారు. అధికారం కోల్పోయినా చంద్రబాబు అహంకారంతో వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు విధానాలకు ప్రశ్నిస్తారనే.. ఈ రోజు శాసనసభకు రాకుండా పారిపోయారని విమర్శించారు. మండలి రద్దు చేయాలంటే రెండేళ్లు పడుతుందని చెబుతున్న చంద్రబాబు శాసనసభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పెద్దల సభకు చంద్రబాబు తన ఇంట్లో ఉన్న దద్దోజనాన్ని పంపించారని ఎద్దేవా చేశారు. యనమల రామకృష్ణుడు స్వయం ప్రకటిత మేధావిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్థం కోసం స్పీకర్ వ్యవస్థలను వాడుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని గుర్తుచేశారు. అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని చెప్పారు. గాయం విలువ తెలిసినవారే.. సాయం చేయగలరు పెద్దల సభ ప్రజాతీర్పును గౌరవించాలే.. కానీ అపహాస్యం చేయకూడదని అన్నారు. గాయం విలువ తెలిసినవారే.. సాయం చేయగలరని వ్యాఖ్యానించారు. అందుకే సీఎం వైఎస్ జగన్ ప్రజల గాయాలు తెలుసుకుని.. వారికి సాయం చేస్తున్నారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని గుర్తుచేశారు. అందుకే అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే దేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా ఎదిగారని అన్నారు. 13 జిల్లాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని చెప్పారు. మండలిని చంద్రబాబు తన రాజకీయాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. -
దొడ్డీదారిన మండలికి వచ్చి ప్రజానిర్ణయాలను అడ్డుకుంటున్నారు
-
మండలిని బంగారు బాతులా చూశారు : రజనీ
-
ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: మండలిలో రాజకీయాల కోసం చట్టాలను వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలిలో ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు పోడిచారని మండిపడ్డారు. ప్రజలు ఆమోదించిన, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మండలిలో అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనం కోసం మండలిని ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ రాజకీయం చేయాలనుకుంటే ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టేవారని.. రాజకీయాలు ఫేర్గా ఉండాలని ఆయన అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు. సీఎం అనుకుంటే ఆర్డినెన్స్ ద్వారా అయినా చట్టం తెచ్చేవారన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు వెళ్తుంటే టీడీపీ రాజకీయం చేస్తోందన్నారు. మండలి రద్దు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలని చెవిరెడ్డి కోరారు. ఆయన ప్రయోజనాల కోసమే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలన్ని ఆయన ప్రయోజనాల కోసమేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనమండలిలో చంద్రబాబు, టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ఎండగట్టారు. చంద్రబాబు పాలనలో దాడులు,అసమానతలు, ప్రాంతాలు, కులాల మధ్య వైషమ్యాలు చూశామని.. రాష్ట్ర విభజనకు ఆయన లేఖ ఇచ్చారని దుయ్యబట్టారు. హోదా విషయంలో అనేకసార్లు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం వికేంద్రీకరణ బిల్లు తెస్తే..మండలిలో టీడీపీ సభ్యులు ఎలా ప్రవర్తించారో అందరికి తెలుసునన్నారు. మండలి రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ,ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ల బిల్లులను కూడా చంద్రబాబు అడ్డుకున్నారని మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు. మండలిని అడ్డం పెట్టుకుని.. మండలిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన బినామీలను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని పేరుతో చంద్రబాబు భారీ దోపిడీకి ప్రయత్నించారని మండిపడ్డారు. మండలిలో సైంధవుల్లా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. యనమల వేసుకునే సూటు,బూటు కూడా ప్రభుత్వ సొమ్మేనని విమర్శించారు. ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేసిన చరిత్ర యనమలది అని దుయ్యబట్టారు. శాసనసభ్యులను ఆంబోతులతో పోల్చిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. -
సభలో కాకుండా ఈనాడు, ఏబీఎన్లో చర్చించాలా?
సాక్షి, అమరావతి : శాసనమండలిలో టీడీపీ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల మనసును గాయపరిచిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన శాసన మండలి రద్దు తీర్మానంలో అసెంబ్లీలో మాట్లాడుతూ.. స్వాతంత్ర లభించిన 70 ఏళ్ల తర్వాత ఉత్తరాంధ్రకు ఒక గుర్తింపు వస్తున్న తరుణంలో టీడీపీ నేతలు దానిని చెడగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. (చదవండి : ‘అందుకే బాబు సభకు రాకుండా పారిపోయారు’) శాసనమండలిలో టీడీపీ సభ్యుల నిర్ణయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబుకు ఎంత చిత్తశుద్ది ఉందో అర్థమవుతుందన్నారు. ‘ మండలి రద్దు అంశంపై శాసన సభలో ఎలా చర్చిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తునారు... సభలో చర్చింకుండా ఈనాడు, ఆంద్రజ్యోతిలో చర్చించాలా’ అని ప్రశ్నించారు. పెద్దల సభలో పెద్దలు లేరని, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు, అవినీతి పరులు, ఆర్థిక నేరస్తులు, కొబ్బరి చిప్పలు అమ్ముకునేవారే టీడీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజల అభివృద్ధి కోసం సభలో చట్టాలు చేస్తుంటే.. రాజకీయం కోసం మండలిలో టీడీపీ అడ్డుకుంటుందని ఆరోపించారు. వికేంద్రీకరణ బిల్లును మాత్రమే కాకుండా.. గతంలో తీసుకువచ్చిన ఇంగ్లీష్ మీడియం బిల్లును కూడా టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. అల్లూరి సీతారామరాజు పుట్టినటువంటి విశాఖపై టీడీపీ సభ్యులు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వికేంద్రీకరణ బిల్లుతో ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందన్నారు. చంద్రబాబుకు రాష్ట్రం బాగోలు అవసరం లేదని, తన రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే చాలని విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును అడ్డుకొని చంద్రబాబు మూడు గ్రామాలకు హీరో కావొచ్చు కానీ 13 జిల్లాకు విలన్ అయ్యారన్నారు. శాసన మండలి రద్దు బిల్లుతో ఉత్తరాంధ్ర ప్రజలకు సీఎం జగన్ ధైర్యాన్ని ఇచ్చారని అమర్నాథ్ పేర్కొన్నారు. -
సభలో కాకుండా ఈనాడు, ఏబీఎన్లో చర్చించాలా?
-
రాజకీయ అవసరాల కోసమే అలా చిత్రీకరించారు..
-
ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు
-
బాబు హయాంలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడింది
-
బాబు తన బినామీలను కాపాడూకునే ఉద్దేశం
-
‘బాబు నైతికంగా మండలి రద్దు ఒప్పుకున్నాడు’
సాక్షి, విజయవాడ: అసెంబ్లీలో శాసన మండలి రద్దు బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నామని.. బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుద్దా నాగేశ్వరరావు అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నైతికంగా మండలి రద్దు ఒప్పుకున్నారని తెలిపారు.1985లో ఎన్టీఆర్ మండలిని రద్దు చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించలేదని నాగేశ్వరరావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు మండలి అవసరం లేదని.. అనవసరపు ఖర్చని ఆనాడు చంద్రబాబు అన్నాడని మండిపడ్డారు. సలహాలు, సూచలనలు ఇవ్వాల్సిన పెద్దలసభను చంద్రబాబు అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. రౌడీ ప్రవర్తన ఉన్న తన ఎమ్మెల్సీలతో చంద్రబాబు మండలిని నింపారని నాగేశ్వరరావు ఆరోపించారు. బిల్లును మండలికి పంపితే వెనక్కి పంపుతూ ప్రజాస్వామ్యం విలువలను దిగజారుస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయ చరిత్రలో మాజీ సీఎం శాసనమండలి గ్యాలరీలో కూర్చుని మండలి చైర్మన్ను ప్రభావితం చేసిన సంఘనలు ఎక్కడా చూడలేదన్నారు. చదవండి: బినామీలను కాపాడుకునేందుకే బాబు తాపత్రయం ప్రజలకు మంచి చట్టాలను తీసుకురావడంలో జాప్యాన్ని గ్రహించిన సీఎం జగన్ మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. మండలి నిర్వహణ రాష్ట్రనికి అనవసర ఖర్చుతో పాటు ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు. ప్రజలకు ఉపయోపడే బిల్లులను మండలిలో అడ్డుకోవడం హేయమైన చర్య అని నాగేశ్వరరావు విమర్శించారు. టీడీపీ రాజకీయ ఉగ్రవాదంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రంలో రాజాకీయ నిరుద్యోగిగా మారి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. చంద్రబాబు 23 సీట్లుకే కాకుండా 23 పంచాయతీలకు నాయకుడిగా పరిమితమయ్యాడని ఆయన ఎద్దేవా చేశారు. చదవండి: అందుకే చంద్రబాబు సభకు రాలేదు 151 సీట్లు ఉన్న ప్రభుత్వం చేస్తున్న చట్టాలను మండలిలో వ్యతిరేకించడం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడవడమే అని నాగేశ్వర రావు మండిపడ్డారు. శాసన మండలి నిర్వహించటం అంటే రాజకీయ నిరుద్యోగులను ప్రోత్సహించడమే అని ఆయన పేర్కొన్నారు. 5 కోట్ల ప్రజలు శాసనసభ మండలి రద్దుపై హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు శాసనసభ మండలి రద్దును గ్రహించి.. సభ్యులకు అవినీతితో సంపాదించిన సొమ్ము జీతం రూపంలో ఇస్తానని హామీ ఇచ్చారని నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ హామీతో చంద్రబాబు అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని అన్నారు. ఎన్టీఆర్ హయాంలో మండలి రద్దును బలపపిర్చిన వ్యక్తి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. -
కాంట్రాక్టర్లకు ఎమ్మెల్సీ సీట్లు అమ్ముకున్నారు..
సాక్షి, అమరావతి : రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు ఐదేళ్లు చంద్రబాబు నాయుడుకి సమయం ఇచ్చినా ఉపయోగించుకోలేపోయారని వైస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజనీ విమర్శించారు. శాసనమండలి రద్దుపై సోమవారం అసెంబ్లీలో చర్చలో భాగంగా ఆమె ప్రసంగించారు. మండలిపై చంద్రబాబు తొలినుంచి రెండు నాల్కల సిద్ధాంతంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే చంద్రబాబుకు శాసనమండలి బంగారుబాతులా కనిపించిందని, కాంట్రాక్టర్లు, కార్పొరేటర్లు, వ్యాపారవేత్తలకు ఎమ్మెల్సీ సీట్లు అమ్ముకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యనమల రామకృష్ణుడు ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని రజనీ విమర్శించారు. మండలిని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వాన్ని హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. (మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్) నారా లోకేష్కు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన పెద్దల సభను.. తక్కువ చేసి మట్లాడం సరికాదని హితవుపలికారు. ప్రజల అవసరాలకు ఏమాత్రం ఉపయోగంలేని మండలిని రద్దు చేస్తామంటే పెద్దల సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు పిల్లి సుభాష్చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ స్వాగతించారని సభలో తెలిపారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తామంతా స్వాగతిస్తున్నామని రజనీ స్పష్టం చేశారు. -
ప్రతి నిర్ణయంలోనూ చంద్రబాబు యూటర్న్
-
సైంధవుడి పాత్రకు ఆయన నిదర్శనం..
-
సైంధవుడి పాత్రకు ఆయన నిదర్శనం..
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ హయాంలోనే పరిపాలన వికేంద్రీకరణ జరిగిందని.. సమితి వ్యవస్థల నుంచి మండల వ్యవస్థలు తీసుకొచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలిని టీడీపీ నేతలు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన బిల్లులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాజధాని పేరుతో రైతులను చంద్రబాబు నిలువునా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజల ఆమోదంతో ఎప్పుడు గెలవలేదన్నారు. మండలిని కించపరిచిన చరిత్ర ఆయనదని విమర్శించారు. మండలి రద్దు వల్ల రాష్ట్రానికి నష్టం లేదని పార్థసారధి పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసమే అలా చిత్రీకరించారు.. రాష్ట్రాభివృద్ధి సాధించాలంటే అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర ద్వారా అన్ని ప్రాంతాల ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని.. ప్రాంతాల మధ్య సమతుల్యత చేయాలనుకున్నారని చెప్పారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమది ఘనమైన చరిత్ర అని, రాజకీయ అవసరాల కోసం హత్యా రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు మాత్రమే సీమలో ఉన్నాయని టీడీపీ చిత్రీకరించిందని మండిపడ్డారు. మండలి రద్దు తీర్మానానికి మద్దతు.. ‘మహావిష్ణువు స్వయంభూ గా వెలసిన ప్రాంతం రాయలసీమ.. ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య జన్మించిన ప్రాంతం..చిత్రరాజాలు తీసిన కేవిరెడ్డి జన్మించిన ప్రాంతమని’ భూమన తెలిపారు. రాయలసీమకు అన్యాయం చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. మండలిలో బిల్లులను అడ్డుకోవడం చంద్రబాబు సైంధవుడి పాత్రకు నిదర్శమన్నారు. ఒకప్పుడు మండలిలో మహానుభావులు ఉంటే.. ఇప్పుడు కాల్మనీ సెక్స్ రాకెట్లోని నిందితులు, ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవని వారు, భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో గెలవలేని వారు ఉన్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం జగన్ చేస్తున్న మండలి రద్దు తీర్మానానికి మద్దతు ఇస్తున్నామని భూమన పేర్కొన్నారు. (చదవండి: శాసనమండలి రద్దును స్వాగతిస్తున్నాం!) (చదవండి: టీడీపీది శునకానందం: పేర్ని నాని) -
టీడీపీది శునకానందం: పేర్ని నాని
సాక్షి, అమరావతి: రామాయణంలో యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలను చంద్రబాబు, లోకేష్లు అడ్డుకుంటున్నారని మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రక బిల్లులను అడ్డుకుని టీడీపీ శునకానందం పొందుతుందని మండిపడ్డారు. ‘40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడటం ఆయనకు అలవాటు లేదని’ పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రాన్ని విడగొట్టాలని లేఖ ఇస్తారు.. రాష్ట్రాన్ని ఎలా విడగొడతారని ప్రశ్నిస్తారు.. బీజేపీ మతతత్వ పార్టీ అంటారు.. అదే బీజేపీతో పొత్తు అంటారు’ అంటూ టీడీపీ తీరును దుయ్యబట్టారు. రాష్ట్రానికి హోదా అవసరమని చెప్పి ప్యాకేజీని స్వాగతించారని.. ప్రతి నిర్ణయంలోనూ చంద్రబాబు యూటర్న్ తీసుకుంటారని విమర్శించారు. ‘ఎన్నికల ముందు మోదీ, అమిత్షాను చంద్రబాబు తిట్టారని..ఇప్పుడు వాళ్లిద్దరు మా వెనుక ఉన్నారని ఆయన చెబుతున్నారని విమర్శించారు. రాయలసీమకు నీళ్లిచ్చామంటున్న చంద్రబాబుకు గత ఎన్నికల్లో కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయని’ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో నిర్లక్ష్యానికి గురైన కొల్లేరు పరిరక్షణ కోసం రూ.350 కోట్లతో రెగ్యులేటర్ల ఏర్పాటుకు సీఎం జగన్ హామీ ఇచ్చారని పేర్ని నాని పేర్కొన్నారు. (చదవండి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకు కేబినెట్ నిర్ణయం) -
ప్రజల భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేశారు
-
అరుదైన తీర్పు ఇచ్చారు..
-
అందుకే చంద్రబాబు సభకు రాలేదు: ధర్మాన
సాక్షి, అమరావతి: బ్రిటిషర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పెద్దల సభను ఏర్పాటు చేశారని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ విషయాన్ని గమనించి స్వాతంత్ర్యానికి ముందే జాతిపిత మహాత్మా గాంధీ ఈ సభను వ్యతిరేకించారని పేర్కొన్నారు. పార్లమెంటు ప్రజాస్వామ్యం ఉన్న అనేక దేశాల్లో పెద్దల సభ లేదని తెలిపారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయపరమైన కారణాలతో చట్టాలు ఆలస్యమవుతున్నాయి కాబట్టి మండలి రద్దు సరైన నిర్ణయమని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవలేని వారి రాజకీయ పునరావాస కేంద్రంగా మండలి మారిందని.. అటువంటి సభ అవసరం లేదని గతంలో.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలోని కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందని పేర్కొన్నారు.(ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం) అరుదైన తీర్పు ఇచ్చారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 51 శాతానికి పైగా ప్రజలు మద్దతిచ్చారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు, అభిప్రాయాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు. రాష్ట్రమంతా పూర్తిగా అధ్యయనం చేసిన ఆయనకు ప్రజలు అరుదైన తీర్పు ఇచ్చారు. ఇంతకు ముందెన్నడూ లేని భారీ మెజారిటీతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అటువంటి ప్రభుత్వం చేస్తున్న చట్టాలను ప్రజల చేత తిరస్కరించబడిన టీడీపీ అడ్డుకుంటోంది. మండలి వల్ల కోట్ల రూపాయలు దుర్వినియోగమని చంద్రబాబు గతంలో చెప్పారు. ఐదు కోట్ల మంది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం చేస్తున్న చట్టాలను.. ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని మరీ అడ్డుకుంటున్నారు. టీడీపీ రాజకీయాల వల్ల కీలక బిల్లులు ఆలస్యమవుతున్నాయి’అని ధర్మాన.. చంద్రబాబు తీరును ఎండగట్టారు.(మీరు కోరుకున్నదే కదా చంద్రబాబు: చెవిరెడ్డి ) తాత్కాలికమని అంబేద్కర్ చెప్పారు.. ‘పెద్దల సభలు తాత్కాలికమే అని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పారు. ఆర్టికల్ 169 కింద పెద్దల సభను ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చని సూచించారు. అంతేకాదు గోపాలస్వామి అయ్యర్, ఆచార్య రంగా వంటి వారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చట్ట సవరణలు చేసే అధికారం ప్రజల చేత ఎన్నుకోబడిన శాసన సభకు లేకుంటే ప్రజల ఆకాంక్షలు ఎలా నెరవేరతాయి. మంత్రిగా ఉన్న నారా లోకేశ్ను మంగళగిరి ప్రజలు తిరస్కరిస్తే.. ఆయన మండలిలో ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటున్నారు. ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేయడమే. 1971, 72, 75లో రాజ్యసభను రద్దు చేసే ప్రయత్నాలు జరిగాయి. చంద్రబాబు ముఖం చూపించలేకనే శాసన సభకు రాలేదు. మండలి అవసరం లేదన్న బాబు వ్యాఖ్యలను ప్రశ్నిస్తారనే భయంతోనే చర్చకు రాలేదు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని గతంలో చంద్రబాబు తీర్మానం కూడా పెట్టారు. ఆ తీర్మానంలో ఉన్నవన్నీ కూడా తప్పులే. సీఆర్డీఏ చట్టం 171 పేజీలు ఉంది. దానిని శాసన మండలిలో ఎన్నిరోజులు చర్చించారు. దాన్ని సెలెక్ట్ కమిటీకి ఎందుకు పంపలేదు. 12 పేజీలు ఉన్న వికేంద్రీకరణ బిల్లును మాత్రం సెలెక్ట్ కమిటీకి పంపడంలో ఉద్దేశం ఏమిటి’అని ధర్మాన ప్రశ్నించారు. -
సీఎం జగన్కు అందరూ సహకరించాలి: ఆళ్ల నాని
సాక్షి, అమరాతి : చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణి, రెండు కళ్ల వైఖరి కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి కారణమని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ధ్వజమెత్తారు. శాసన మండలి రద్దు తీర్మానంపై మంత్రి సభలో చర్చ సందర్భంగా రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని, ప్రాంతీయ అసమానతలు రాకుడదన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. విశాఖ, అమరావతి, కర్నూలు రాజధానుల ఏర్పాటు వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని తెలిపారు.(మండలి రద్దుకు తీర్మానం ప్రతిపాదించిన సీఎం జగన్) చంద్రబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. రాజధాని పేరుతో భూములు కొనుగోలు చేసిన వారికోసం బాబు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం సోనియాతో కుమ్మకై.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు చంద్రబాబు సహకరించారని మండిపడ్డారు. విభజనతో హైదరాబాద్లాంటి మహా నగరాన్ని కోల్పోయామని, రాష్ట్రం రెండుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్ పిల్లల భవిష్యత్తును కోల్పోయామని అన్నారు. గత అయిదేళ్లలో చంద్రబాబు ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ అలుపెరగని పోరాటం చేశారని, హోదా కోసం పోరాటం చేసిన వారిపై చంద్రబాబు అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అమరావతి పేరుతో అభివృద్ధిని కేంద్రీకరిస్తుందని ప్రజలు భయపడ్డారని, శివరామకృష్ణ కమిటీ కూడా అమరావతిలో రాజధాని వద్దని చెప్పిందని తెలిపారు. చంద్రబాబు నారాయణ కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేశారన్నారు. (అందుకే చంద్రబాబు సభకు రాలేదు: ధర్మాన) చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆళ్ల నాని విమర్శలు గుప్పించారు. గత ఏడు నెలల్లో పశ్చిమగోదావరి జిల్లా ఎలా అభివృద్ధి చెందిందో స్వయంగా చూపిస్తానని, అభివృద్ధిని చూసేందుకు టీడీపీ నేతలు రావాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చేసిన ఘనత సీఎం జగన్ది అని, ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని బాబు ఎప్పుడైనా ప్రయత్నించారా అని ప్రశ్నించారు. మూడు నెలల్లోనే సీఎం వైఎస్ జగన్ రూ. 700 వందల కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించారని, డయాలసిస్ సెంటర్, తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారని తెలిపారు. (‘చంద్రబాబు వాదనలో పస ఉంటే చర్చకు రావాలి’) అధికార వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆళ్లనాని పేర్కొన్నారు. రియల్ ఎస్టేల్ వ్యాపారుల ప్రయోజనాలే బాబుకు ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టవని విమర్శించారు. మండలి గ్యాలరీలో కూర్చొని సభను ప్రభావితం చేయడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సలహాలు, సూచనలు ఇవ్వడానికే మండలి ఏర్పాటు జరిగిందని అన్నారు. మండలిలో టీడీపీ సభ్యులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునేలా ప్రయత్నించారని, ప్రజలే చంద్రబాబుకు గుణపాఠం చెప్తారని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి జగన్కు అందరూ సహకరించాలని సూచించారు. -
చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన దరిద్రం
-
మీరు కోరుకున్నదే కదా చంద్రబాబు: చెవిరెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు నిర్ణయాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా తీసుకుంటున్న నిర్ణయంగా స్వాగతిస్తున్నామని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. 2004లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. శాసన మండలిని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఆనాడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. శాసనమండలిలో ప్రజాస్వామ్యానికి కూడా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. శాసన మండలి పునరుద్ధరణ సమయంలో.. మండలి పెట్టడాన్ని చంద్రబాబు దుర్మార్గం అన్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా 2004లో చంద్రబాబు శాసన సభలో మాట్లాడిన మాటల(‘‘అధ్యక్షా, ఏదైతే ఈరోజు శాసనమండలి తేవడం పట్ల దీనిని వ్యతిరేకిస్తున్నాను. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ద్వారా ప్రజల ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. మంచిపనులు చేస్తే తప్పకుండా సహకరించేవారము. అదే విధంగా ప్రజల పైన భారం పడే చర్యలు ప్రభుత్వం ప్రధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం అనేకసార్లు చెప్పాము. మళ్లీ ఒకసారి రీయిటరేట్ చేస్తున్నాము. విధాన మండలికి చాలామంది చాలా గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ నిర్ణయం వలన వారి మనుషులకు మళ్లీ పదవులు వస్తాయి తప్ప రాష్ట్రప్రజలకు లాభం లేదు. మీరే చూడబోతున్నారు. ఈ రోజు శాసనమండలి ఒకసారి చూస్తే, కార్యకర్తలు కొంతమందికి, నాయకులు కొంతమందికి రాజకీయంగా పునరావాసం కల్పిస్తారు తప్ప దీనివలన బ్రహ్మాండంగా శాసనాలు వస్తాయి, రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది అనేది వాస్తవం కాదని తెలియజేస్తున్నాను. అందుకే మనం ఒకసారి ఆలోచించుకుఉంటే ఏ విధంగా ఇవన్నీ జరిగాయో, దేశంలో గానీ, ప్రపంచంలోగానీ ఒకసారి ఎనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది’’)ను చెవిరెడ్డి వినిపించారు. (ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకు కేబినెట్ నిర్ణయం) అదే విధంగా... శాసన మండలి వల్ల రూ. 20 కోట్లు ఆర్థిక భారం పడుతుందని.. రాజకీయ ప్రయోజనాల కోసమే మండలిని... రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నారంటూ బాబు వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఆరోజు చంద్రబాబు కోరుకున్న మాటను తాము ఈరోజు అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ‘మీరు కోరుకున్నది నిజమవుతుంటే స్వాగతించకుండా ఎందుకు దాక్కుంటున్నారు. మీకు అనుకూలంగా ఉంటే ఒకవిధంగా.. వ్యతిరేకమైతే మరో విధంగా మాట్లాడుతారా’ అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే.. మండలి ఉపయోగంపై శాసనసభలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. -
రాజకీయ దురుద్దేశంతో బిల్లులను అడ్డుకున్నారు
-
చంద్రబాబు 13 జిల్లాలకు విలన్
-
‘సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎవరికి ఇవ్వని మెజార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారని ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన క్యాబినేట్ సమావేశం శాసన మండలి రద్దు నిర్ణయం తీసుకోవడ ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నకోబడిన ప్రభుత్వమన్నారు. మండలిలో పెట్టిన బిల్లులన్నింటినీ ప్రతిపక్షం తిరస్కరించిందని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పట్టిన దరిద్రమని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు మండలి రద్దవుతుందన్న బాధ కంటే ఆయన కుమారుడు లోకేష్కు ఉద్యోగం పోతుందనే బాధ ఎక్కువైందన్నారు. మండలి చైర్మన్కు విచక్షణ అధికారాలు ఉంటే... 151 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి కూడా విచక్షణ అధికారాలు ఉన్నాయన్నారు. ఇక మండలి రద్దును వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలుగా సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పాలకొండ ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ: ఈ రోజు శాసన మండలి రద్దుకు క్యాబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చంద్రబాబుకు పట్టడం లేదని, వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో అడ్డుకోవడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లు అడ్డుకున్నారని, గిరిజనులు, దళితుల అభివృద్ధిని అడ్డుకునే విధంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. అదేవిధంగా ఆంగ్లభాషా బిల్లును కూడా అడ్డుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ: శాసన మండలి రద్దు నిర్ణయాన్ని తామంతా స్వాగతిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా శాసన మండలిలో టీడీపీ వ్యవహరిస్తోందని, ఎస్సీ,ఎస్టీ కమిషన్ బిల్లును అడ్డుకుందని మండిపడ్డారు. కాగా పాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రతి ఒక్కరు సమర్థిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. -
ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచారు
-
ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
-
'వారి కదలికలపై కుల మీడియా నిఘా'
సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కష్టాలు ఎల్లో మీడియాకు జీవన్మరణ సమస్యలుగా పరిణమించాయని విమర్శించారు. శాసనమండలి రద్దుపై సీఎం జగన్ ప్రకటన వచ్చినప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్సీల కదలికలపై కుల మీడియా నిఘా పెట్టిందని తెలిపారు. వారి ఇళ్ల చుట్టూ తమ ప్రతినిధులను మోహరించి బాబుకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోందంటూ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. (పూల ఖర్చు వృథా అయినట్టేనా బాబూ..!) కాగా మరో ట్వీట్లో.. 'రాజధాని పరిరక్షణ అంటూ పెయిడ్ ఆర్టిస్టులను దించాడు. ధర్నాలు, దీక్షల నాటకాలాడాడు. జోలె పట్టి చందాలకు తిరిగాడు. ఇప్పుడవన్నీ వదిలేసి కౌన్సిల్ను ఎలా రద్దు చేస్తారో చూస్తా అని రంకెలేస్తున్నాడు. చిట్టి నాయుడు, వెన్నుపోటు సహచరుడు నిరుద్యోగులవుతారని ఆయనకు భయం పట్టుకుంది' అని ట్వీట్ చేశారు. 'అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను సంతలో పశువుల్లా కొన్నాడు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీలకు డబ్బు ముట్ట చెబుతున్నాడు. ఎమ్మెల్సీలు ఎక్కడ ధిక్కరిస్తారో అని నిద్ర పోవడం లేదు. వారి పదవీకాలం ముగిసేంత వరకు జీత భత్యాల కింద ఎంత వస్తుందో అంత చెల్లిస్తాడట' అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. 'పప్పు నాయుడి రాజకీయ జీవితం ముగిసినట్టే' -
ఏపీ అసెంబ్లీ: ముగిసిన బీఏసీ సమావేశం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ఏపీ కేబినెట్ ఆమోదించిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రభుత్వం అందించింది. అయితే ఈ రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరగాలంటే బీఏసీ సమావేశం కావాలని స్పీకర్ సూచిస్తూ అసెంబ్లీని వాయిదా వేశారు. బీఏసీ సమావేశం అనంతరం తిరిగి సభ ప్రారంభం కానుంది. ముగిసిన బీఏసీ సమావేశం.. ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ ఒక్క రోజు(సోమవారం) మాత్రమే అసెంబ్లీ జరపాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా నేటి అసెంబ్లీ సమావేశంలో మండలి రద్దుపై సుదీర్ఘంగా చర్చించాలని నిర్ణయించింది. మండలి రద్దుతో పాటు మరికొన్ని బిల్లులను కూడా ప్రవేశపెట్టేందుకు బీఏసీ సుముఖత వ్యక్తం చేసింది. ఇక ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్కుమార్ యాదవ్, కన్నబాబు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి సంబంధించిన పలు కీలక బిల్లులను శాసనమండలి అడ్డుకుంటున్న నేపథ్యంలో మండలిని రద్దుపై చర్చించనుంది. ఇప్పటికే ఏపీ కేబినెట్ శాసనమండలి రద్దుకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. అభివృద్ది-పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ వంటి కీలకబిల్లులను మండలిలో టీడీపీ అడ్డుకుంటూ సైంధవ పాత్ర పోషిస్తోందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా ఈ రెండు బిల్లుల విషయంలో నిబంధనలను పాటించలేదని, ఇది తప్పేనని, అయినా సెలెక్ట్ కమిటీకి పంపిస్తామని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం లోకేష్ తీరు... బాగా బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి -
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు..!
-
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకువచ్చిన పలు కీలక బిల్లులకు అడ్డు తగులుతున్న శాసన మండలి రద్దే సరైందని మంత్రివర్గం భావించింది. ఈ మేరకు మండలి రద్దుకు సంబంధించి శాసన సభలో సోమవారం ప్రవేశపెట్టే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు కేబినెట్ భేటీలో భోగాపురం ఎయిర్పోర్ట్, మచిలీపట్నం పోర్టులపై మంత్రివర్గం చర్చించినట్టు తెలిసింది. మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. శాసన మండలి రద్దు తీర్మానాన్ని ప్రభుత్వం కేంద్రం ఆమోదానికి పంపనుంది. (చదవండి : ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?) ⇒ ఏపీలో మండలి రద్దు కావడం ఇది రెండోసారి ⇒ శాసన మండలిని మే 31, 1985న రద్దు చేసిన నాటి సీఎం ఎన్టీఆర్ ⇒ మార్చి 30, 2007న తిరిగి మండలి పునరుద్దరణ ⇒ 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి విడిగా శాసన మండలి ⇒ మండలి రద్దుపై తీర్మానం చేయనున్న శాసన సభ ⇒ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్న ప్రభుత్వం ⇒ ఆర్టికల్ 169 ద్వారా ఏ రాష్ట్ర మండలినైనా రద్దు చేసే అధికారం ⇒ పార్లమెంట్ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో రద్దు కానున్న మండలి ⇒ ఇప్పటికే చాలాచోట్ల మండలిని పక్కనపెట్టిన రాష్ట్రాలు ⇒ దేశవ్యాప్తంగా కేవలం 6 రాష్ట్రాల్లోనే శాసన మండలి ⇒ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్, యూపీలోనే పెద్దల సభ ⇒ మండలిని పునరుద్దరించాలంటూ 5 రాష్ట్రాల్లో వినతులు ⇒ అసోం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, బెంగాల్లో మండలి కోసం వినతులు ⇒ మండలి పునరుద్దరించాలన్న ఐదు రాష్ట్రాల వినతుల పట్ల కేంద్రం విముఖత ⇒ మండలి వల్ల ఆర్థికంగా రాష్ట్రంపై భారీగా భారమన్న భావనలో కేంద్రం -
అలాంటి శాసన మండలి అవసరమే లేదు
-
బాగా బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి..
సాక్షి, అమరావతి: పెద్దల సభ అంటే సూచనలు ఇవ్వాలి గాని, సంఘర్షణలకు వేదికగా ఉండకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అభిప్రాయపడ్డారు. ఆమె సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు డ్రైవర్ అయితే యనమల రామకృష్ణుడు స్టీరింగ్ అని ఎద్దేవా చేశారు. పెద్దల సభను దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి పునరుద్దరిస్తే...శాసనమండలిలో ఇవాళ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు రాజధానుల బిల్లుపై వారి తీరు చూస్తుంటే... చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారుతారని అన్నారు. పెద్దల సభ అంటే అందరూ గౌరవించేలా ఉండాలే కానీ, శాసనమండలిని టీడీపీ నేతలు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారని, మండలిలో ప్రజాతీర్పును అపహాస్యం చేశారని మండిపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న మండలి అవసరం లేదని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. శాసనమండలిని రద్దు చేయమని తాము ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను గట్టిగా కోరుతామని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. శాసనసభ ఆమోదించిన బిల్లును అగౌరపరిచారని, అమరావతిలో బినామీల భూముల కోసమే చంద్రబాబు పోరాటం చేస్తున్నారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు ఆరాటం, పోరాటమని విమర్శించారు. ‘బాగా బలిసిన కోడి.. చికెన్ షాప్ కు వెళ్తే.. ఏమవుతుందో.. నారా లోకేష్ గ్రహించాలి. యనమల మహా మేధావిగా ఫీల్ అవుతున్నారు..రెండుసార్లు ఓడిపోయారు. పెద్దల కోసం ఏర్పాటు చేసిన సభకు తన ఇంట్లో ఉన్న దద్దమ్మను, దద్దోజనాన్ని పంపించారు. చంద్రబాబు ఓటమిపాలైనా ఇంకా అహంకారం మాత్రం తగ్గలేదు. ప్రజా క్షేత్రంలో ఓడిపోయిన యనమల మహా మేధావిలా ఫీలవుతున్నారు. ఇండియా టుడే సర్వేల బెస్ట్ సీఎం సర్వేలో 4వ స్థానంలో జగన్గారు ఉన్నారు. ఆయన పనితీరును ప్రజలంతా మెచ్చుకుంటున్నారు. టీడీపీ మాత్రం తమ పార్టీ ఎమ్మెల్సీలతో బేరసారాలు చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అలాంటి అవసరమే లేదు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు’ అని చురకలు అంటించారు. -
ప్రారంభమైన ఏపీ మంత్రివర్గ సమావేశం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. శాసనమండలి రద్దుపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. మండలి భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ నిర్ణయం తర్వాత అసెంబ్లీ చర్చించి, ఆ తర్వాత తీర్మానం చేయనుంది. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్, మచిలీపట్నం పోర్టులపై మంత్రివర్గం చర్చించనుంది. (శాసనమండలిపై నేడే నిర్ణయం) కాగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల శ్రేయస్సును కాంక్షిస్తూ, పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ధ్యేయంతో శాసన సభలో ఆమోదించిన అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లులను శాసన మండలిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది. అలాగే అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో నిబంధనలను పాటించలేదని, ఇది తప్పేనని, అయినా సెలెక్ట్ కమిటీకి పంపిస్తానని శాసన మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో శాసన మండలిని రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా పలువురు సభ్యులు ప్రభుత్వానికి సూచించారు.(టీడీపీ తప్పుడు ప్రచారం.. వెలుగులోకి అసలు నిజం..!) -
చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఆరుగురు ఎమ్మెల్సీలు
-
అందరి సలహాల కోసం సమయం ఇచ్చాం
సాక్షి, అమరావతి: శాసన మండలి రద్దును ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో చర్చ జరిగిందని, ప్రజా సంబంధమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని వర్గాల సలహాలు తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ కొంత సమయం ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాము ప్రలోభాలు పెడుతున్నట్లు ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తోందని, ఆ మీడియా ఆగడాలకు అంతేలేకుండా పోతోందన్నా్డరు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపినంత మాత్రాన టీడీపీ సాధించేది ఏమీ లేదన్నారు. తప్పు చేశానని మండలి చైర్మన్ అంగీకరించారని, నిబంధనలను తుంగలోతొక్కి ఆయన నిర్ణయం ప్రకటించారని, బిల్లులపై ఓటింగ్ కూడా నిర్వహించలేదన్నారు. ఆ బిల్లులు చట్టాలు కాకుండా ఎవరూ అడ్డుకోలేరన్నారు. శాసనసభే ఎప్పుడూ సుప్రీం అని, తన పరిధికి మించి మండలి వ్యవహరించడం కరెక్టు కాదన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజా సంక్షేమ పథకాలు చేపడుతుంటే.. మండలిలో ఆ కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతోందన్నారు. మండలిని ఎవరూ తక్కువ చేయడంలేదన్నారు. మండలిలో మెజార్టీతో తామేదైనా చేయగలుగుతామని టీడీపీ ప్రజలకు భ్రమలు కల్పిస్తోందని మండిపడ్డారు. మండలిని రద్దు చేస్తారేమోనని చంద్రబాబుకు, లోకేశ్కు భయం పట్టుకుందన్నారు. చైర్మన్ను చంద్రబాబు తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, గ్యాలరీలో కూర్చుని చైర్మన్ను నియంత్రించడం దుర్మార్గమన్నారు. అంతరించిపోతున్న నేత బాబు .. టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో 17 మంది వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సజ్జల చెప్పారు. ఆ పార్టీ ఎమ్మెల్సీల పరిస్థితి కూడా అలాగే ఉందని, అయితే వాళ్లందరిని తీసుకుని తామేం చేయాలని ప్రశ్నించారు. రూ. 5 కోట్లో, రూ. 10 కోట్లో ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరమేముందని అన్నారు. పొరపాటున కూడా డబ్బులతో సీఎం వైఎస్ జగన్ రాజకీయాలు చేయరని స్పష్టం చేశారు. సీఎం జగన్ నవతరం నాయకుడైతే, చంద్రబాబు అంతరించిపోతున్న నేత అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చీకటి అయితే.. సీఎం వైఎస్ జగన్ వెలుగు అన్నారు. అమిత్షాతో మాట్లాడి మండలి రద్దును అడ్డుకుంటామని చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్సీలకు చెపుతున్నారని తెలిసిందన్నారు. ఎమ్మెల్సీలను భ్రమపెట్టేందుకు అమిత్ షాతో మాట్లాడినట్టు వేరే ఎవరితోనో చంద్రబాబు ఫోన్లో మాట్లాడినట్లు తెలిసిందన్నారు. 18 మంది ఎమ్మెల్సీలను బీజేపీలోకి పంపుతాను.. రెండేళ్లు మండలి రద్దు కాకుండా ఆపాలని చంద్రబాబు కోరారని, ఒక ఏడాది ఆపుతానని ఫోన్లోని అవతలి వ్యక్తి చెప్పినట్లు ఎమ్మెల్సీలను మభ్యపెట్టారని చెప్పారు. అమిత్ షా ఎందుకు లైన్లోకి వచ్చి మీతో మాట్లాడతారని ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తే బాబు వద్ద సమాధానం లేదన్నారు. అమరావతిలో కృత్రిమ ఉద్యమం ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని సజ్జల విమర్శించారు. శివరామకృష్ణన్ కమిటీని చంద్రబాబు పట్టించుకోక పోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. బినామీ భూమల వ్యవహారం బయటపడుతుందనే, అమరావతి ప్రాంతంలో కృత్రిమ ఉద్యమం సృష్టించారని తెలిపారు. ఎన్టీఆర్ నిర్ణయాలను మండలిలో వ్యతిరేకించడం కరెక్టు కాదని అప్పట్లో ఈనాడు రాసిందని, ఇప్పుడేమో దానికి భిన్నంగా రాస్తోందని అన్నారు. లోకేశ్ను ఓడించి సీఎం జగన్ నాయకత్వాన్ని ఆహ్వానించిన ప్రాంతాన్ని, ఆ ప్రజలను తాము ఎట్లా విస్మరిస్తామని, భవిష్యత్తులో అమరావతి ప్రాంతంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందన్నారు. -
మండలి రద్దుపై లెఫ్ట్ యూ టర్న్!
సాక్షి, అమరావతి: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గవర్నర్లు, శాసన మండలి వంటివి దండగమారి వ్యవస్థలుగా అభివర్ణించిన కమ్యూనిస్టు పార్టీలు ప్రస్తుతం యూ టర్న్ తీసుకున్నాయి. ఈ రెండు వ్యవస్థలు ఆరో వేలు లాంటివని, వీటివల్ల ప్రజాధనం వృథా కావడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదని గతంలో వాదించిన లెఫ్ట్ పార్టీలు ప్రస్తుతం అందుకు భిన్నమైన గళం వినిపిస్తుండడం గమనార్హం. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసన మండలి రద్దు ప్రతిపాదన చేసినప్పుడు అందుకు మద్దతు తెలిపిన కమ్యూనిస్టులు ఇప్పుడు స్వరం మార్చారు. విధానాలు మారిపోతాయా? రాష్ట్రంలో శాసన మండలి రద్దు ఆలోచనే అప్రజాస్వామికమని సీపీఎం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే వ్యవస్థలనే రద్దు చేస్తారా? అని సీపీఐ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఆయా పార్టీల్లోని సీనియర్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకత్వాలు మారినప్పుడల్లా కమ్యూనిస్టు విధానాలు మారిపోతాయా? అని నిలదీస్తున్నారు. ఎన్టీ రామారావు హయాంలో శాసన మండలి రద్దు తీర్మానాన్ని తాము సమర్థించామని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన సీనియర్ కమ్యూనిస్టు నేత ఒకరు గుర్తుచేశారు. ప్రస్తుతం 6 రాష్ట్రాల్లోనే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్లు ఉన్నాయి. ఇటీవలి వరకు జమ్మూకశ్మీర్లోనూ మండలి ఉండేది. రాష్ట్ర హోదా రద్దయి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడిన తర్వాత అక్కడ కూడా శాసన మండలి రద్దయ్యింది. అస్సాం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒకప్పుడు ఉండేవి. తర్వాత అవి రద్దయ్యాయి. శాసన మండళ్లు వద్దని చెబుతున్న కమ్యూనిస్టు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కౌన్సిల్ను రద్దు చేస్తామనే ప్రతిపాదన వచ్చీ రాకమునుపే అన్యాయం, అప్రజాస్వామికం అనడం దేనికి సంకేతమని సీనియర్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
టీడీఎల్పీ భేటీకి.. ఆరుగురు ఎమ్మెల్సీలు డుమ్మా
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆరుగురు ఎమ్మెల్సీలు షాకిచ్చారు. ఆదివారం నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశానికి వారు గైర్హాజరయ్యారు. మండలి రద్దవుతుందనే ప్రచారం నేపథ్యంలో తీవ్ర ఆందోళనలో ఉన్న ఎమ్మెల్సీలను బుజ్జగించేందుకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో టీడీపీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీలంతా కచ్చితంగా సమావేశానికి రావాలని చంద్రబాబే స్వయంగా పిలిచినా ఆరుగురు డుమ్మా కొట్టారు. గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు, ఏఎస్ రామకృష్ణ, శమంతకమణి కావాలనే సమావేశానికి దూరంగా ఉన్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. నలుగురు ఎమ్మెల్సీలు సమావేశానికి రాలేమని చంద్రబాబుకు సమాచారం ఇచ్చారని ముఖ్య నేతలు చెబుతున్నా.. అది వాస్తవం కాదని పార్టీలోని ఇతర నాయకులు పేర్కొంటున్నారు. సమావేశానికి హాజరైన పలువురు ఎమ్మెల్సీలపైనా పార్టీ ముఖ్యుల్లో అనుమానాలున్నాయి. బాబు, లోకేశ్ కారణంగా పదవులకే ఎసరు! రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలు ఇప్పటికే టీడీపీని వీడారు. మరో ఎమ్మెల్సీ డొక్కా ఏకంగా ఎమ్మెల్సీ పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. తాజా పరిణామాలపై ఎమ్మెల్సీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తన రాజకీయం కోసం తమను బలిపెట్టాడని వాపోతున్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఆపలేమని తెలిసినా రాజకీయ ప్రయోజనం కోసం ప్రాకులాడి తమ పదవులు కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారని లబోదిబోమంటున్నారు. మండలి చైర్మన్ను అనైతికంగా వాడుకుని ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత తీసుకొచ్చేలా చేశారని, చంద్రబాబు, లోకేష్ రాజకీయ అజెండా కారణంగా ఇప్పుడు మండలి రద్దయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. తమ రాజకీయ జీవితాలకు ముగింపు పడేలా వారిద్దరూ వ్యవహరించారని ఎమ్మెల్సీలు రగిలిపోతున్నారు. నేడు అసెంబ్లీకి గైర్హాజరవ్వాలని నిర్ణయం శాసన మండలిలో పరిణామాలపై సోమవారం అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. సమావేశానికి హాజరుకాకూడదని టీడీపీ నిర్ణయించింది. టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ సోమవారం నిర్వహించే అసెంబ్లీ అజెండా రాజ్యాంగ విరుద్ధమని, ఒక సభ గురించి మరో సభలో చర్చించడం పార్లమెంటరీ సాంప్రదాయాలకు వ్యతిరేకమన్నారు. మండలిని రద్దు చేస్తే తాను అధికారంలోకి వచ్చాక పునరుద్ధరిస్తానని భేటీలో ఎమ్మెల్సీలను సముదాయించారు. మండలి రద్దు వల్ల నష్టపోతే అన్ని రకాలుగా ఆదుకుంటానని, ఆర్థికంగా అండగా ఉంటానని హామీనిచ్చారు. -
శాసనమండలిపై నేడే నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన మండలి విషయంలో ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల శ్రేయస్సును కాంక్షిస్తూ, పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ధ్యేయంతో శాసన సభలో ఆమోదించిన అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లులను శాసన మండలిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడ్డుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో చర్చించి, ఆమోదించిన బిల్లులపై సలహాలు, సూచనలు ఇవ్వడం శాసన మండలి ప్రధాన కర్తవ్యం. కానీ, ప్రతిపక్షం రాజకీయ కారణాలతో కీలక బిల్లులకు అడ్డుపడుతుండడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు, పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బిల్లులను సైతం మండలిలో టీడీపీ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో మండలిపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. రద్దుకు అనుకూలంగానే నిర్ణయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. లెజిస్లేటివ్ రాజధానితోపాటు ఎగ్జిక్యూటివ్ రాజధాని, జ్యుడీషియల్ రాజధాని ఏర్పాటు బిల్లు, సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లు మండలిలో నిలిచిపోయిన నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే శాసన మండలి రద్దుకు అనుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మచిలీపట్నం పోర్టు నిర్మాణాలపైనా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అర్హులైన పేదలందరికీ ఉగాది పర్వదినం రోజున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూముల సేకరణపైనా చర్చించనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో.. బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత తలెత్తిన పర్యవసానాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. ఏపీ శానస మండలిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర సర్కారు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆమోదించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. మండలిని రద్దు చేయాలని ఎమ్మెల్యేల సూచన అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో నిబంధనలను పాటించలేదని, ఇది తప్పేనని, అయినా సెలెక్ట్ కమిటీకి పంపిస్తానని శాసన మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి నేరుగా ఎన్నికైన సభ్యులు ఆమోదించిన బిల్లులను మండలిలో నిలిపివేయడంపై గురువారం అసెంబ్లీలో చర్చ జరిగింది. శాసన మండలిని రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా పలువురు సభ్యులు ప్రభుత్వానికి సూచించారు. ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేసే బిల్లులను అడ్డుకుంటున్న మండలి అవసరమా? అనేదానిపై సోమవారం విస్తృతంగా చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. -
టీడీపీ తప్పుడు ప్రచారం.. వెలుగులోకి అసలు నిజం..!
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతల బరితెగింపు యవ్వారాలు మరింత పెరిగాయి. ఇప్పటికే పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుకున్న పచ్చ పార్టీ తాజాగా సెలెక్ట్ కమిటీ పేరుతో తప్పుడు ప్రచారానికి తెరతీసింది. శాసన మండలి చైర్మన్ అన్ని పార్టీలకు సెలెక్ట్ కమిటీ విషయమై లేఖలు రాశారంటూ అనుకూల మీడియాకు అసత్యపు లీకులు విడుదల చేస్తున్నారు. దీంతో చైర్మన్ లేఖల పేరుతో ఎల్లో మీడియాలో టీడీపీ విషప్రచారానికి పూనుకుంది. కాగా, ఈ విషయమై పలు రాజకీయ పార్టీలను వివరణ కోరగా.. తమకు మండలి చైర్మన్ నుంచి ఎటువంటి లేఖలు అందలేదని చెప్తున్నారు. మరోవైపు టీడీపీ నేతల వద్ద చైర్మన్ లేఖల అంశాన్ని ప్రస్తావించగా ముఖం చాటేస్తున్నారు. ఇక సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదని అసెంబ్లీ అధికారులు ధ్రువీకరించారు. అదేవిధంగా సెలెక్ట్ కమిటీపై ఎటువంటి బులెటిన్ విడుదల చేయలేదని పేర్కొన్నారు. లేఖలతో సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. -
‘17 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరేందుకు సిద్ధం’
సాక్షి, తాడేపల్లి : టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో 17 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీల పరిస్థితి కూడా అలానే ఉందని పేర్కొన్నారు. వాళ్లందరినీ తీసుకుని తామేం చేయాలని అన్నారు. అయినా, కోట్లు పెట్టి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేదని తెలిపారు. సీఎం జగన్ నవతరం నాయకుడైతే.. చంద్రబాబు నాయుడు అంతరించిపోతున్న నాయకుడని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో రామకృష్ణారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. (చదవండి : ‘బాబుకు లోకేష్ భయం పట్టుకుంది’) ‘మండలి రద్దును ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో చర్చ జరిగింది. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు అన్ని వర్గాల సలహాలు తీసుకుంటే మంచిదని సమయం ఇచ్చాం. ఎల్లో మీడియా ఆగడాలకు అంతులేదు. మండలిని ఎవరూ తక్కువ చేయడం లేదు. 151 మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని నిర్ణయాలతో సీఎం జగన్ ప్రజాసంక్షేమ పథకాలు చేపడుతున్నారు. మండలిలో ఉన్న మెజార్టీతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతోంది. రాజధానిని గ్రాఫిక్స్లో అద్భుతంగా చూపించినట్టు.. మండలి తమ చేతిలో ఉందని తామేదైనా చేస్తామని టీడీపీ ప్రజలకు భ్రమలు కల్పిస్తోంది. (చదవండి :ర్యాంకింగ్స్ ఇస్తే ఆయనకు ఆఖరి స్థానం కూడా కష్టమే) చైర్మన్ను ప్రభావితం చేసి బాబు తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. సామాన్య కార్యకర్తకంటే హీనంగా బాబు వ్యహరించారు. చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని చైర్మన్ను నియంత్రించడం దుర్మార్గం. ప్రజలు మీ గ్రాఫిక్స్ రాజధానిని నమ్మలేకే లోకేష్ని ఓడించారు. ప్రజల సంపూర్ణ మద్దతు, తీర్పు మావైపే ఉంది. అయినా, పద్ధతి ప్రకారం సీఎం జగన్ ముందుకెళ్తున్నారు’అని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అమిత్ షా లైన్లోకి వచ్చారట..! అమిత్షాతో మాట్లాడి మండలి రద్దును అడ్డుకుంటామని.. చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్సీలకు చెప్పారట. అమిత్షాతో మాట్లాడినట్టు స్పీకర్ ఆన్చేసి.. బాబు ఎవరితోనే మాట్లాడారని టీడీపీ ఎమ్మెల్సీలు చెప్తున్నారు. 18 మంది ఎమ్మెల్సీలను బీజేపీలో పంపుతాను. రెండేళ్లు మండలి రద్దు కాకుండా ఆపాలని చంద్రబాబు కోరారట. అవతలి వ్యక్తి ఒక ఏడాది ఆపుతానని అన్నారట. మీతో అమిత్షా ఎందుకు లైన్లోకి వస్తారని టీడీపీ ఎమ్మెల్సీలు అడిగితే.. చంద్రాబాబు దగ్గర సమాధానం లేదట. ఒక సంవత్సరం ఆగితే మండలిలో మాకు మెజార్టీ వస్తుంది. (చదవండి : చంద్రబాబుకు షాకిచ్చిన ఎమ్మెల్సీలు.. కీలక భేటీకి డుమ్మా) ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఎందుకు పారిపోయి వచ్చారు..? రూ.5 కోట్లు, రూ.10 కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరమేముంది. శివరామకృష్ణన్ కమిటీని బాబు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. బినామీ భూముల వ్యవహారం బయటపడుతుందనే.. అమరావతి ప్రాంతంలో కృత్రిమ ఉద్యమం సృష్టించారు. దళితులను భయపెట్టి చంద్రబాబు భూములను తీసుకున్నారు. లోకేష్ను ఓడించి, సీఎం జగన్ నాయకత్వాన్ని ఆహ్వానించిన ప్రాంతాన్ని.. ఆ ప్రజలను మేం ఎట్లా విస్మరిస్తాం. అమరావతి ప్రాంతంలో భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. వైఎస్ జగన్కు బాబుకు అదే తేడా..! 5 కోట్ల ప్రజల ఆకాంక్షలకను నెరవేర్చేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా తన కుటుంబం, వారి కష్టనష్టాలు తనవి అనుకుని సీఎం వైఎస్ జగన్ ముందుకెళ్తున్నారు. చంద్రబాబు మాత్రం.. నాది, నా కుంటుంబం అనుకుని రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారు. ఎదురీదడం సీఎం జగన్ లక్షణం. ఆయన మరోసారి ప్రజలతో మమేకం కావాలనుకుంటున్నారు. నిజాయితీ, నిబద్ధత ఆయన నైజం. మనీ, మీడియా, మ్యానిప్యులేషన్ ఇవి చంద్రబాబు లక్షణాలు. ప్రభుత్వాన్ని, వ్యవస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకోవడం చంద్రబాబు నైజం. ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. చంద్రబాబు చీకటి అయితే.. సీఎం వైఎస్ జగన్ వెలుగు. ప్రజా సంక్షేమం, అభివృద్ధితో కలిపి రాష్ట్రాన్ని నెంబర్వన్లో ఉంచాలన్నదే ఆయన ధ్యేయం. చంద్రబాబుకు అధికారం ఇచ్చినా నిలుపుకోలేకపోయారు. ఎల్లో మీడియా కథనాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. పొరపాటున కూడా డబ్బులిచ్చి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాలు చేయరు. ప్రజా సంక్షేమానికి అందరం కలిసి పనిచేద్దాం’అని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
చంద్రబాబుకు షాకిచ్చిన ఎమ్మెల్సీలు.. కీలక భేటీకి డుమ్మా
-
‘17 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరేందుకు సిద్ధం’
-
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ యనమల
-
బాబుకు షాకిచ్చిన ఎమ్మెల్సీలు.. కీలక భేటీకి డుమ్మా!
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి సొంత పార్టీ ఎమ్మెల్సీల నుంచి ఊహించని షాక్ తగిలింది. చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో ఆదివారం టీడీపీఎల్పీ భేటీ అయ్యింది. అయితే ఈ సమావేశానికి ఆరుగురు మండలి సభ్యులు డుమ్మా కొట్టారు. వీరిలో గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు, ఏఎస్ రామకృష్ణ, శమంతకమణి ఉన్నారు. పార్టీ అధినేతకు కనీస సమాచారం లేకుండా గైర్హాజరు కావడంతో ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన పలువురు సీనియర్లుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (టీడీపీ ఎమ్మెల్సీల్లో ఆందోళన.. అంతర్మథనం) బహిరంగంగా ఎవరూ విమర్శ చేయనప్పటికీ.. స్థానిక ప్రజల నుంచి ఆగ్రహాలు వ్యక్తమవుతుండటంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోతుల సునీత, శివనాథ్రెడ్డిలు పార్టీ విధానాలపై బహిరంగంగానే విమర్శలకు దిగారు. మరో సీనియర్ సభ్యుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్ మండలి పదవికి ఇప్పటికే రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. మరోవైపు శాసన మండలిలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో చంద్రబాబును నమ్మి మోసపోయాయని, కొరివితో తలగొక్కున్నట్లైందని టీడీపీ సభ్యులు వాపోతున్నారు. (ఎమ్మెల్సీలకు బాబు బుజ్జగింపులు) మండలిని రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడంతో టీడీపీ ఎమ్మెల్సీలు అంతర్మథనంలో పడ్డారు. తమ రాజకీయ భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఏర్పడిందని.. అందుకు చంద్రబాబే కారణమని లోలోన రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనలో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీల్ని బుజ్జగించేందుకు చంద్రబాబు రెండ్రోజులుగా ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ నేటీ భేటీకి టీడీపీ ఎమ్మెల్సీలు దూరంగా ఉన్నారు. దీంతో వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న చంద్రబాబుకు సొంత పార్టీ సభ్యలు షాక్ ఇచ్చినట్లయింది. తాజా పరిణామం టీడీపీ వర్గాల్లో తీవ్ర నిరాశకు గురిచేసింది. -
ఎమ్మెల్సీలకు బాబు బుజ్జగింపులు
సాక్షి, అమరావతి: శాసన మండలి రద్దయితే తమ పదవులు పోయి రాజకీయంగా ఉనికి కోల్పోతామనే ఆందోళనలో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీల్ని బుజ్జగించేందుకు చంద్రబాబు రెండ్రోజులుగా ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్సీలు పదవులు పోతాయనే భయంతో పార్టీ వైఖరికి వ్యతిరేకంగా ఉన్నారని, ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారని తెలియడంతో రంగంలోకి దిగి.. ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలవాలని, వేరే దారి చూసుకోవద్దని, అన్ని రకాలుగా అండదండలు అందిస్తానని పదేపదే ప్రాథేయపడుతున్నట్లు తెలిసింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తారనే అనుమానం ఉన్న ఎమ్మెల్సీలపై నిఘా పెట్టడంతోపాటు వారితో తరచూ మాట్లాడుతూ.. చేయి దాటిపోకుండా చూసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా పలువురు ఎమ్మెల్సీలు ఇప్పటికే అందుబాటులో లేకపోవడంతో వారు ఎక్కడున్నారో తెలుసుకుని.. తన దారికి తెచ్చుకునేందుకు తనకు అత్యంత నమ్మకస్తులైన నేతల్ని చంద్రబాబు రంగంలోకి దింపారు. నేడు టీడీపీ ఎమ్మెల్సీల శాసనసభాపక్ష భేటీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీల్లో ఎవరు ఏ వైఖరితో ఉన్నారో తెలుసుకునేందుకు ఆదివారం శాసనసభాపక్షాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీలంతా తప్పనిసరిగా ఈ సమావేశానికి రావాలని సమాచారం ఇచ్చారు. జిల్లాల వారీగా మాజీ మంత్రులు, ముఖ్య నాయకులకు వారిని సమావేశానికి తీసుకువచ్చే బాధ్యత అప్పగించారు. వచ్చిన తర్వాత వారందరితో క్యాంపు పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు ఇప్పటికే క్యాంపు బాధ్యతల్లో తలమునకలై ఉన్నట్లు చెబుతున్నారు. త్యాగాలు చేయండి.. పదవులు పోయినా ఫర్వాలేదు: చంద్రబాబు పదవులు పోయినా భయపడాల్సిన అవసరం లేదని, త్యాగాలు చేస్తేనే ప్రజలు గుర్తిస్తారని ప్రతిపక్ష నేత చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్సీలకు హితబోధ చేశారు. 1984లో టీడీపీ ధర్మ పోరాటాన్ని ప్రపంచం మొత్తం అభినందించిందని, ఇప్పుడు ఎమ్మెల్సీలకు ఆ అవకాశం వచ్చిందన్నారు. హైదరాబాద్ నుంచి శనివారం పార్టీ ఎమ్మెల్సీలతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన మండలి రద్దయినా బాధపడవద్దని కోరారు. ఎమ్మెల్సీ పదవులు పోయినా వాటి ద్వారా వచ్చే జీతభత్యాలు, ఖర్చులన్నీ పార్టీ తరఫున అందే ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. పోయిన పదవుల స్థానంలో పార్టీలో గౌరవం ఇస్తామని, ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు. -
టీడీపీ ఎమ్మెల్సీల్లో ఆందోళన.. అంతర్మథనం
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం తమను మోసగిస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేలా నిర్ణయాలు తీసుకోవడంపై వారు మండిపడుతున్నారు. శాసనమండలి రద్దును కేంద్రం ఒప్పుకోదంటూ వ్యూహాత్మకంగా మాట్లాడుతూ, తమను పక్కదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు ఎమ్మెల్సీలు రహస్యంగా సమావేశమై వారి రాజకీయ భవిష్యత్పై రెండ్రోజులుగా చర్చిస్తున్నారు. చంద్రబాబు వల్లే ఈ పరిస్థితి పార్టీ కోసం త్యాగాలు చేస్తే అండగా ఉంటానని బాబు చెప్పే మాటలన్నీ గండం గట్టెక్కేవరకేనని, ఆ తర్వాత పార్టీలో తమను ఎవరూ పట్టించుకోరనే అంశంపై ఎమ్మెల్సీలు తీవ్ర సమాలోచనలు జరుపుతున్నారు. ‘పార్టీ అధినేత తీరుతో సమస్య మరింత జటిలమవుతోంది.. పార్టీకి కనుచూపు మేరలో భవిష్యత్తు కనిపించడం లేదు.. ఐదేళ్లలో రాజధానిని కనీసం పునాదులు కూడా దాటించలేని పరిస్థితే ఇప్పుడు దీనికి కారణమైంది.. జనం నమ్మే పరిస్థితే లేదు.. ఐదేళ్లూ ఏమీ చేయకుండా ఇప్పుడు రాజధాని తరలిస్తున్నారని గగ్గోలు పెట్టడాన్ని విజయవాడ ప్రజలు కూడా పట్టించుకోకపోవడం పరిస్థితికి అద్దంపడుతోంది’ అని టీడీపీ ఎమ్మెల్సీ ఒకరు గురువారం విజయవాడలోని ఓ హోటలో జరిగిన అంతర్గత సమావేశంలో ఇతర నేతలతో గట్టిగా వాదనకు దిగినట్టు తెలిసింది. ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమల అభివృద్ధికి మనం వ్యతిరేకమనే సందేశం వెళ్లిపోయిందని.. కేవలం 29 గ్రామాల పార్టీగా మాత్రమే నిలిచిందని ఆ సమావేశంలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారని విశ్వసనీయ సమాచారం. రెండ్రోజులుగా హైదరాబాద్, విజయవాడలో పలువురు ఎమ్మెల్సీలు రహస్యంగా సమావేశమై ఏం చేయాలన్న అంశంపై మల్లగుల్లాలు పడ్డారు. ఇప్పటికే భారీ వ్యతిరేకత మూటగట్టుకున్నాం చైర్మన్ను అడ్డుపెట్టుకుని శాసన మండలిని చంద్రబాబు అగౌరవపర్చారని, మండలి ప్రతిష్టను దిగజార్చారంటూ మండలిలో టీడీపీకి వ్యతిరేకంగా ఓటేసి, టీడీపీని వీడిన ఎమ్మెల్సీ పోతుల సునీత ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లను ఏర్పాటుచేసే బిల్లును వెనక్కి పంపడంతో ఆయా వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నామని, పేద ప్రజలు కోరుతున్న ఇంగ్లీష్ మీడియం బిల్లును తిప్పి పంపి అప్రతిష్ట పాలయ్యామని, ప్రజలకు మేలు చేసే చట్టాలను అడ్డుకుని ఏం సాధించామని ఆమె ప్రశ్నించారు. మూడు రాజధానులను రాష్ట్రమంతా స్వాగతిస్తున్నారని, ప్రజల్లో దానిపై సానుకూలత వ్యక్తమవుతుంటే.. అందుకు సంబంధించిన బిల్లుల్ని అడ్డుకోవడం ద్వారా ప్రజల్లో మరింత వ్యతిరేకతను కొనితెచ్చుకున్నామని ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్సీ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. మండలి చైర్మన్ తాను తప్పు చేస్తున్నానంటూనే.. పార్టీకి అనుకూలంగా రెండు బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకుని చట్టసభల ఔన్నత్యాన్నే భ్రష్టుపట్టించారని, రాజకీయం కోసం టీడీపీ ఏ స్థాయికైనా దిగజారుతుందనే సంకేతం ప్రజల్లోకి వెళ్లిపోయిందని రాయలసీమకు చెందిన ఒక ఎమ్మెల్సీ ఆవేదనగా చెప్పారు. ప్రభుత్వం చేసే మంచి పనులను రాజకీయ స్వలాభం కోసం వ్యతిరేకించి, ప్రతిదాన్ని తెగేవరకూ లాగి.. మండలి రద్దు వరకూ తీసుకొచ్చిన చంద్రబాబు తమ భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని ఆ ఎమ్మెల్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బాబు హామీలన్నీ మభ్యపెట్టేందుకే మండలిని రద్దు చేసే అధికారం సీఎంకు లేదని, రద్దుకు తీర్మానం చేసినా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదని, ఒకవేళ రద్దయినా మళ్లీ తాను అధికారంలోకి వచ్చాక పునరుద్ధరిస్తానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండలి రద్దు అధికారం సీఎంకు లేకపోతే ఇక ఎవరికి ఉంటుందని, గతంలో ఎన్టీఆర్ మండలిని రద్దు చేశారు కదా! అనే వాదన ఆ పార్టీ ఎమ్మెల్సీలే గుర్తుచేస్తున్నారు. మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రం ఆమోదించదని, తాను ఇప్పటికే బీజేపీ అగ్ర నాయకులతో టచ్లో ఉండి మాట్లాడుతున్నానంటూ చంద్రబాబు.. తమను నమ్మించడానికి నానాపాట్లు పడుతున్నారని ఆ పార్టీకి చెందిన ఓ నేత చెప్పారు. ‘మండలిలో చైర్మన్ వైఖరిని బీజేపీ తీవ్రంగా తప్పు పట్టింది. అలాంటప్పుడు బాబు చెప్పే మాటలను ఎంతవరకు నమ్మాలి? ఇది మనల్ని మభ్యపెట్టడానికి కాదా?’ అని ఓ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. కేంద్రానికి ప్రస్తుతం తమ పార్టీతో అవసరం లేదని, వారికి అవసరమయ్యే బలం తమకు లేదని కృష్ణా జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు దేశమంతా తిరిగి మోదీ, అమిత్షాను తిట్టి, వారిని ఓడించేందుకు కాంగ్రెస్తో చేతులు కలిపి.. దేశ రాజకీయాల్లో విశ్వసనీయత లేని వ్యక్తిగా ముద్రపడిన చంద్రబాబు వైఖరిని ఢిల్లీలో కమలనాథులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ‘పార్టీకి మిగతా ప్రాంతాల్లో నష్టం జరుగుతోందని స్పష్టంగా తెలిసినా, అమరావతిలో ఆయన ఆస్తులు, బినామీల భూముల కోసమే ఇదంతా చేస్తుంటే.. దానికి మనం బలికావాలా?’ అని రహస్య సమావేశంలో పలువురు ఎమ్మెల్సీల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నడిచినట్లు తెలుస్తోంది. బిల్లు అడ్డుకునే అవసరం కేంద్రానికి లేదు.. ‘ఒక రాష్ట అసెంబ్లీ ఒక తీర్మానం చేసి పంపితే, సాధారణంగా కేంద్ర ప్రభుత్వాలు దానిని అంగీకరిస్తాయి. మండలి కొనసాగినా, రద్దయినా బీజేపీకి ప్రయోజనం పెద్దగా ఉండదు. అలాంటిది బలమైన ప్రాంతీయ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా.. మండలి రద్దును వ్యతిరేకించడం వల్ల పెద్దగా రాజకీయ ప్రయోజనం ఉండదని తెలిసీ ఎందుకు అడ్డుకుంటారు?’ అనే చర్చ టీడీపీ శ్రేణుల్లో బలంగా సాగుతోంది. ‘వైఎస్ జగన్ అంటే ఏమిటో పదేళ్లుగా ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు.. ఇన్నాళ్లూ బాబు ఏం చేశారో జనం చూశారు. ఇలాంటి పరిస్థితిలో ఎవరి విశ్వసనీయత ఏంటనేది మొన్నటి ఎన్నికల్లోనే స్పష్టంగా తేల్చారు’ అని ఓ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. అవసరానికి వాడుకుని వదిలేసే చంద్రబాబు.. ఒక మాటిస్తే దానిపై నిలబడే వ్యక్తిగా జగన్మోహన్రెడ్డి.. వీరిద్దరిలో ఎవరి వ్యక్తిత్వం ఏంటనేది బీజేపీపాటు ఇతర జాతీయ పార్టీల అధినేతలందరికీ తెలుసనే చర్చ సాగుతోంది. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలతో దేశంలోనే బలమైన నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అవసరం బీజేపీకి ఉందనే విషయం కొందరు టీడీపీ ఎమ్మెల్సీల మధ్య చర్చకు వచ్చింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీకి ఇప్పటికే రెండు స్థానాలుండగా త్వరలో జరిగే ఎన్నికల్లో వచ్చే నాలుగు స్థానాలతో వారి సంఖ్య ఆరుకు పెరగనుంది. ఈ నేపథ్యంలో జగన్కు వ్యతిరేకంగా బీజేపీ ఎందుకు వ్యవహరిస్తుందనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. శాసనమండలి రద్దు అనేది కేంద్రానికి ఏమాత్రం సంబంధం లేని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని.. ఇలాంటి సాధారణ విషయాలపై కేంద్రం బలమైన రాష్ట్ర ప్రభుత్వంతో విభేదం తెచ్చుకునే పరిస్థితి ఏమాత్రం ఉండదని చెబుతున్నారు. ఏ కోణంలో చూసినా తమ అధినేతను మోదీ, అమిత్షా పట్టించుకునే అవకాశం లేదని, చంద్రబాబు చెప్పే మాటలన్నీ భయంతో ఉన్న తమను నిలబెట్టుకునేందుకేననే అభిప్రాయాన్ని పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ అధికారమా.. ! బాబు మాటలన్నీ అబద్ధాలే వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని బట్టి.. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే మాటమీద నిలబడతారని, ఈ విషయం ఇప్పటికే పలు అంశాల్లో స్పష్టమైందని టీడీపీ నేతలే అంటున్నారు. మండలి రద్దు చేసినా, మళ్లీ తాను వచ్చాక పునరుద్ధరిస్తాననే చంద్రబాబు మాటల్ని విని నవ్వొస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానిస్తున్నారు. శాసనమండలి అవసరమే లేదని, దానివల్ల సమయం, ప్రజాధనం వృథా అని 2004లో చెప్పిన తమ అధినేత ఇప్పుడు శాసన మండలిని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకోవడం, మండలి పరిణామాల నేపథ్యంలో అది ఇంకా పెరగడం, మరోవైపు పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా చెల్లాచెదురై, ఎమ్మెల్యేలను కూడా నిలుపుకోలేని పరిస్థితుల్లో ఉన్న తరుణంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడమనేది కలనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. జగన్మోహన్రెడ్డి గేట్లు తెరిస్తే ఈ పాటికే ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీకి క్యూకట్టే వారని, తమ అధినేతకు ప్రతిపక్ష హోదా ఎప్పుడో పోయేదని ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఎమ్మెల్సీ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును నమ్ముకుని మునిగిపోయే పరిస్థితి తెచ్చుకున్నామని ఆందోళన చెందుతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం.. మండలి ఛైర్మన్గా ఉన్న ఎంఏ షరీఫ్ సహా 15 మంది టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం 2021 మార్చి నుంచి జూన్ మధ్య ముగుస్తుంది. లోకేష్ సహా 12 మందికి 2023 మార్చి నుంచి జులై వరకూ పదవీకాలం ఉంది. మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న యనమల రామకృష్ణుడుతోపాటు మరో ముగ్గురికి 2025 మార్చి వరకూ పదవీకాలం ఉంది. మండలి రద్దయితే వీరందరి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. -
టీడీపీ ఎమ్మెల్సీలు తప్పు సరిదిద్దుకోవాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును టీడీపీ ఎమ్మెల్సీలు అడ్డుకుని శాసనమండలి ప్రతిష్టను పూర్తిగా దిగజార్చారని ఎమ్మెల్సీ పోతుల సునీత విమర్శించారు. తాడేపల్లిలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. బిల్లు సందర్భంగా మండలిలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయన్నారు. మండలిలో బిల్లు విషయంలో పొరపాటు చేశామని టీడీపీ సభ్యులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఇప్పటికైనా వారు బాబు ట్రాప్లో పడకుండా బయటకు వచ్చి తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని శాసన మండలి చైర్మన్కు సైగలు చేస్తూ పూర్తిగా సభను పక్కదారి పట్టించారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదన్నారు. మండలి చైర్మన్ పూర్తిగా తప్పు చేశారని, ఆయన చరిత్ర హీనులుగా మిగిలిపోతారని చెప్పారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. తమది ప్రజల కోసం పనిచేసే కుటుంబమని, ప్రలోభాలకు గురి కావాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు తాను మద్దతిస్తున్నానని చెప్పారు. మండలి రద్దుపై తుది నిర్ణయం సీఎందేనన్నారు. బిల్లులపై ఓటింగ్ జరగలేదు మండపేట: శాసనసభ ఆమోదించిన బిల్లులపై శాసన మండలిలో ఎలాంటి ఓటింగ్ జరగలేదు కాబట్టి ఆ బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆయన శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా మండపేటలో మీడియాతో మాట్లాడారు. సంవత్సరానికి 6 లక్షలు చొప్పున నాలుగేళ్లలో 24 లక్షల మందికి స్థలాలు, గృహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 21.34 లక్షల మందికి ఉగాది రోజుకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలోని తాడేపల్లి, మంగళగిరి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి మున్సిపాల్టీలో 33,817 మంది లబ్ధిదారులకు దాదాపు 2,500 ఎకరాల్లో సుందరమైన కాలనీ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. శాసన మండలి రద్దు అంశం ఇంకా చర్చ దశలో ఉందని పిల్లి సుభాష్చంద్రబోస్ బదులిచ్చారు. మండలిని రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని పిల్లి సుభాష్చంద్రబోస్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి గ్యాలరీలో కూర్చుని మండలి చైర్మన్కు కనుసైగలతో ఆదేశాలిచ్చారంటే రాజ్యాంగ విలువలు విషయంలో ఆందోళన కలుగుతోందన్నారు. తప్పు చేశానన్న తర్వాత రాజీనామా చేసి ఉంటే మండలి చైర్మన్ పేరు తారస్థాయికి వెళ్లేదని చెప్పారు. టీడీపీ చర్యలకు నిరసనగా నేటి నుంచి ఆందోళనలు ప్రజాస్వామ్య విలువల్ని శాసనసభ, శాసన మండలి సాక్షిగా తెలుగుదేశం పార్టీ హరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలపాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ప్రభుత్వం అధికార, పరిపాలన వికేంద్రీకరణ చేసి 13 జిల్లాల అభివృద్ధి కోసం తీసుకు వచ్చిన విధానాలను విద్యార్థులు, యువత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కోరింది. ఈ మేరకు పార్టీ సూచనా పత్రం పంపించింది. ఈ నెల 25న విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అన్ని విశ్వవిద్యాలయాల వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేయాలని, 27న యువజన విభాగం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించాలని, 28న విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అభివృద్ధి–వికేంద్రీకరణపై యూనివర్సిటీల వద్ద సదస్సులను నిర్వహించాలని పార్టీ సూచించింది. 29న సంతకాల సేకరణ: 29న పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లలో ప్రజలచే సంతకాల సేకరణ చేపట్టాలని, 30న వికేంద్రీకరణ విషయంలో టీడీపీ తీరుపై భారత రాష్ట్రపతికి పోస్టుకార్డులు పంపే ఉద్యమం చేపట్టాలని పార్టీ కోరింది. ఈ నెల 31వ తేదీన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 3 ప్రాంతాల జేఏసీ నేతల భేటీ జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసేలా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చర్యలు తీసుకోవాలని పార్టీ జారీ చేసిన లేఖలో పేర్కొంది. -
‘పార్లమెంట్ ఆమోదిస్తే మండలి రద్దవుతుంది’
సాక్షి, తూర్పుగోదావరి : శాసన మండలి రద్దు అంశంపై సోమవారం పునః సమీక్ష చేసి తమ నిర్ణయాన్ని పార్లమెంటుకు పంపుతామని ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదిస్తే శాసన మండలి రద్దు అవుతుందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగాది నాటికి పేదలందరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని చంద్రబోస్ వెల్లడించారు. పేదలకు ఇచ్చే ప్రతి ఇంటి స్థలం మహిళల పేరున రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. ఉగాది నాటికి రాష్ట్రవ్యాప్తంగా 21.34 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందిస్తామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు 26,136 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని చెప్పారు. మరో 12,219 ఎకరాలు సేకరించాల్సి ఉందని తెలిపారు. అసైన్డ్ భూములు, దేవస్థానం, వక్ఫ్ బోర్డ్ భూములు సేకరించకూడదని చంద్రబోస్ అధికారులను ఆదేశించారు. -
మండలిలో దుర్మార్గంగా వ్యవహారించారు
-
‘ఛీకొట్టినా బాబులో మార్పు రాలేదు’
సాక్షి, విజయవాడ : శాసనమండలిని టీడీపీ రాజకీయ వేదికగా మార్చేసిందని ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. మండలిలో టీడీపీ సభ్యుల తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గ్యాలరీకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబును ప్రజలు ఛీకొట్టినా ఆయనలో మార్పు రాలేదని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలి ప్రతిష్టను దిగజార్చారని విమర్శించారు. చంద్రబాబు మండలికి వచ్చి చైర్మన్ షరీఫ్ను ప్రభావితం చేశారని చెప్పారు. శుక్రవారం విజయవాడలో సునీత మీడియాతో మాట్లాడుతూ.. వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు భ్రష్టు పట్టించారని తెలిపారు. బాబు ట్రాప్లో పడకుండా టీడీపీ సభ్యులు హుందాగా వ్యవహరించాలని కోరారు. నిబంధనలు పాటించకుండా చైర్మన్ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. వికేంద్రీకరణ బిల్లుపై చైర్మన్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో ఓ మచ్చగా మిగిలిపోతుందన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. మండలి రద్దుపై శాసనసభ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మూడు రాజధానులను అందరు స్వాగతించాలన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కోసమే మూడు రాజధానులు అని అన్నారు. రాజధాని రైతులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాలు పక్కనపెట్టి పార్టీలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్కు మద్దతు తెలపాలన్నారు. -
జనవరి 27న ఏపీ కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి జనవరి 27న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 9.30 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. కాగా, రాజకీయ అజెండాతో నడుపుతున్న శాసనమండలిని కొనసాగించాలా.. వద్దా అనే దానిపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం వైఎస్ జగన్ స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరిన సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదనకు అంగీకరించిన స్పీకర్ సోమవారం ఆ అంశాన్ని శాసనసభలో చర్చించేందుకు అనుమతించారు. -
చంద్రబాబును ప్రజలు క్షమించరు
సాక్షి, భీమవరం: ప్రాముఖ్యత కలిగిన పాలన,వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి తిప్పి పంపడం దారుణమని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మండలి చైర్మన్ షరీఫ్ మంచి వ్యక్తి అని, అలాంటి వ్యక్తి చేత తప్పుడు పని చేయించిన చంద్రబాబుని ప్రజలు క్షమించరన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శాసనమండలి అవసరం లేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు. టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. టీడీపీ మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై సీఐడీ కేసులు నమోదు చేసిందని, మరికొందరు టీడీపీ పెద్దల బండారం కూడా బయటపడుతుందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సమైక్యత కోసం పనిచేస్తోందని పేర్కొన్నారు. బీజేపీతో కలిసిన తర్వాత పవన్కల్యాణ్ మంచి జోష్ మీద ఉన్నారని.. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి హోదాలో ఉన్నట్లు.. మోదీ, అమిత్ షా స్థానంలో ఉన్నట్టు ఊహించుకుంటున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పడగొడతానని పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. పుస్తకాలు చదువుతున్నానంటారు.. చట్టాలు కూడా చదవాలని పవన్కు ఎమ్మెల్యే శ్రీనివాస్ హితవు పలికారు. -
బిల్లుపై స్పష్టతనిచ్చిన మండలి చైర్మన్
సాక్షి, అమరావతి : అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై టీడీపీ చేస్తున్న ప్రచారం తప్పని తేలిపోయింది. ఏపీ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై స్పష్టతనిచ్చారు. బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదని, సాంకేతిక కారణాలతో అది మండలిలోనే ఆగిపోయిందని అన్నారు. ఆ ప్రక్రియ పూర్తయితేగానీ వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లదని చెప్పారు. బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లిందన్న టీడీపీ ప్రచారం అవాస్తవమని వెల్లడించారు. మండలి చైర్మన్ ఇచ్చిన స్పష్టతతో అసలు నిజం బయటికొచ్చిందని రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కోరుకుంటున్న ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ బిల్లుపై మండలి ఏ విధంగా ముందుకు వెళ్తుందనే సందిగ్దత నెలకొంది. (చదవండి : నన్నెవరూ బెదిరించలేదు: షరీఫ్) ఇక ‘మూడు రాజధానులు’ బిల్లును టీడీపీ సభ్యులు అడ్డుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జిల్లాల వ్యాప్తంగా పలు చోట్ల రాస్తారోకోలు, చంద్రబాబు దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. ప్రజలు రోడ్లెక్కి చంద్రబాబు, టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వెన్నుపోటు రాజకీయాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. చదవండి : ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా? మండలి చైర్మన్కు ఆ విచక్షణాధికారం లేదు వీధిన పడ్డ ‘పెద్ద’ల సభ పరువు గ్యాలరీలో చంద్రబాబు ఎందుకు కూర్చున్నారు? -
‘ముస్లింల గురించే మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు’
సాక్షి, తాడేపల్లి : శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ టీడీపీ నాయకుడిగా వ్యవహరించారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మండిపడ్డారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మండలిలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం సభలో రెండు బిల్లులు ప్రవేశపెట్టారని.. పెద్దల సభలు సలహాలు, సూచనలు ఇవ్వాలే కానీ, బిల్లులు చర్చకు రాకుండా రూల్ 71ను తీసుకు వచ్చారన్నారు. 51 శాతం ఓట్లు 86 శాతం సీట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. సభలో మండలి ఛైర్మన్ అనైతికంగా వ్యవహరించారని, ఆయన చైర్ను గౌరవించలేదని విమర్శించారు. సభలో నిబంధనలను అతిక్రమించారని, బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపి చైర్మన్ తప్పు మీద తప్పు చేశారన్నారు. ఛైర్మన్ తీరుపై అన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందన్నారు.సభ నిబంధనలకు విరుద్ధంగా సభలో వీడియోలు తీశారని, చంద్రబాబు కనుసన్నల్లోనే మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం ధ్వజమెత్తారు. కాలయాపన చేయడం కోసమే సెలెక్ట్ కమిటీకి పంపారన్నారు. సభలో టీడీపీ సభ్యులు గూండాలు, రౌడీలుగా వ్యవహరిస్తే చంద్రబాబు వారిని శెభాష్ అని మెచ్చుకోవడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబుకు కుల రాజకీయాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని, ఆయన కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. శవ రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించినవారు దేశంలో మరొకరు ఉండరని అన్నారు. ఛైర్మన్ను మంత్రులు కులంపేరుతో తిట్టారని టీడీపీ నేతలు అంటుంటే... ఛైర్మనే స్వయంగా తనను ఎవరూ తిట్టలేదని చెబుతున్నారన్నారు. టీడీపీ నేతలు కావాలనే మతం, కులంతో రాజకీయాలు చూస్తున్నారన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ముస్లింల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఈ సందర్భంగా తనను మంత్రులు తిట్టలేదని శాసనమండలి ఛైర్మన్ చెప్పిన వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారని, ఆ నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారన్నారు. కర్నూలులో హైకోర్టు రాయలసీమ ప్రజల హక్కు అని అన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ద్రోహి అయిన చంద్రబాబు... కనీసం సీమలో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. 13 జిల్లాల అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నారన్నారు. కర్నూలు అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సవాల్ విసిరారు. -
మండలిలో టీడీపీ సభ్యుల వ్యవహార తీరు బాధాకరం
-
మండలి మనకు అవసరమా?
-
యనమల కుట్రలు పైనున్న ఎన్టీఆర్కు తెలుసు..
సాక్షి, విశాఖపట్నం: శానసమండలిలో పరిణామాలను మేధావులు, ప్రజలు బ్లాక్ డే గా భావిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. మండలి ఛైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు. శుక్రవారం విశాఖలో గుడివాడ అమర్నాథ్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ..‘తాను తప్పు చేస్తున్నట్లు శాసనమండలి ఛైర్మనే ఒప్పుకున్నారు. ఆయన తీరును మేధావులు కూడా తప్పుబట్టారు. బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు కూడా నిబంధనల ప్రకారం వెళ్లాలని ఛైర్మన్కు సూచించారు. చంద్రబాబు నాయుడు మండలి గ్యాలరీలో కూర్చుని ఛైర్మన్ను కనుసైగలతో శాసించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా మండలి ఛైర్మన్ వ్యవహరించారు. ఆయన నిర్ణయం వల్ల కొంత ఆలస్యం మాత్రమే జరుగుతుంది. ఏం సాధించారని చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారు? రాష్ట్రంలో ప్రజాస్వామ్యాని ఖునీ చేసినందుకా ఆనందోత్సాహాలు? (వీధిన పడ్డ ‘పెద్ద’ల సభ పరువు) మూడు గ్రామాలకే చంద్రబాబు హీరో ప్రజాస్వామ్యవాదులంతా ఈ అంశంపై ఆలోచించాలి. మండలి గురించి సోమవారం అసెంబ్లీలో చర్చిస్తాం. చంద్రబాబు మూడు గ్రామాలకే హీరో.. 13 జిల్లాలకు విలన్. ఆయన పనికిరాని వారిని శాసనమండలికి తీసుకు వచ్చారు. కొబ్బరి చిప్పలు అమ్ముకునే బుద్ధా వెంకన్నను మండలిలో కూర్చోబెట్టారు. తాను మేధావినంటూ వరుసగా ఓడిపోయిన యనమల రామకృష్ణుడిని ఎమ్మెల్సీని చేశారు. స్పీకర్గా యనమల చేసిన కుట్రలు పైనున్న ఎన్టీఆర్కు తెలుసు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్కు సభలో మైక్ ఇవ్వని మీరా రూల్స్ గురించి మాట్లాడేది? చంద్రబాబు చేస్తున్న పోరాటాలు తాత్కాలికమే. ఆయన కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారు. చంద్రబాబు తాత దిగొచ్చినా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోలేరు. అయితే తన స్వార్థపూరిత రాజకీయాల కోసం మండలిని ఉపయోగించుకోవడం దారుణం. మండలిని ఆనాడు ఎన్టీఆర్ రద్దు ఎందుకు చేశారో అందరికీ తెలుసు. అయితే అర్ధవంతమైన సభగా పెద్దల సభ ఉండాలనే మంచి ఆలోచనలతో వైఎస్సార్ ఆనాడు శాసన మండలిని పునరుద్దించారు. (చంద్రబాబు స్వార్థానికి బలయ్యాం!) పవన్కి చంద్రబాబే ఆదర్శం వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితంలో పవన్ కల్యాణ్ ఒంటరిగా వెళ్లలేరు. ఆయనది లాంగ్ మార్చ్ కాదు... రాంగ్ మార్చ్. పవన్కు వ్యక్తిత్వం, స్థిరత్వం, సిద్ధాంతాలు లేవు. మూడు రాజధానులు ఉంటే ఎందుకు తప్పు? అయిదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్. రాజకీయ జీవితంలో...వ్యక్తిగత జీవితంలో పవన్కి పక్కన ఎవరో ఒకరుండాలి. పొత్తుల విషయంలో పవన్ కి చంద్రబాబే ఆదర్శం. గాజువాక ప్రజలు ఓడించారనే పవన్ కక్ష సాధిస్తున్నారు.’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (నిమిషాల వ్యవధిలో మాట మార్చిన పవన్) -
అప్రజాస్వామికం
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన శాసనమండలి తీరుపై శాసనసభ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు సైంధవ పాత్ర పోషించిన మండలి తీరు ప్రజాస్వామ్యానికి విఘాతమని మండిపడింది. ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు, అవినీతిని రక్షించే వేదికగా మండలి వ్యవహరించడాన్ని తూర్పారబట్టింది. రాజ్యాంగ ధర్మం ప్రకారం వ్యవహరించాల్సిన చైర్మన్.. చంద్రబాబు రాజకీయ కుతంత్రంలో పావుగా మారడాన్ని తీవ్రంగా ఖండించింది. ప్రాంతీయ సమానాభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఉద్దేశించిన బిల్లులను మండలి నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని గర్హించింది.(శ్రీరాముడి మాదిరిగానే జగన్కు జనం పట్టాభిషేకం) విచక్షణాధికారాల ముసుగులో.... బిల్లులపై చర్చ సందర్భంగా శాసనమండలిలో బుధవారం జరిగిన పరిణామాలను శాసనసభ తీవ్రంగా పరిగణించింది. ఇదే అంశంపై అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చలో సభ్యులు సవివరంగా చర్చించారు. శానసమండలిలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన తీరును మంత్రులు, సభ్యులు ఖండించారు. ప్రజా ప్రయోజనాలకు విఘాతంగా మారిన శాసనమండలిని రద్దు చేయాల్సిందేనని సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్ చేయడం వారి ఆవేదనకు అద్దంపట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దీనిపై చర్చను ప్రారంభిస్తూ మండలిలో జరిగిన పరిణామాలను సభకు వివరించారు. అనంతరం మంత్రులు, పలువురు సభ్యులు మాట్లాడుతూ మండలిలో చోటు చేసుకున్న పరిణామాలపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిల్లుల రూపకల్పనలో సలహాలు, సూచనలు ఇచ్చేందుకే పరిమితం కావాలి్సన మండలి టీడీపీ కుటిల వ్యూహానికి వేదికగా మారిపోయిందని శాసనసభ ఆవేదన వెలిబుచి్చంది. తప్పు అని చెబుతూ మరీ మండలి చైర్మన్ విచక్షణాధికారాల ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించింది. రాజ్యాంగ నిపుణులు నాడే హెచ్చరించారు.. విధానపర నిర్ణయాలను చర్చించి అభిప్రాయాలను తెలియజేసేందుకు ఉద్దేశించిన రూల్ 71ను మండలిలో దుర్వినియోగం చేశారని సభ్యులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం మోషన్ మూవ్ చేయనప్పుడు బిల్లులను సెలెక్ట్ కమిటీకి ఎలా పంపుతారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు పనిచేయకుండా శాసనమండలి అడ్డుపడే అవకాశం ఉందని రాజ్యాంగాన్ని రూపొందించిన సమయంలోనే ఎన్జీ రంగా లాంటి రాజ్యాంగ నిపుణులు హెచ్చరించిన విషయం శాసనసభలో చర్చ సందర్బంగా ప్రస్తావనకు వచ్చింది. ప్రజాతీర్పును అపహాస్యం చేసే మండలి అవసరం ఉందా? అని ప్రశ్నించడం శాసనసభ ఎంత కలత చెందిందో తెలియజేస్తోంది. విచక్షణ లేనివారికి విచక్షణాధికారాలు ఉండకూడదని శాసన మండలి చైర్మన్ను ఉద్దేశించి శాసనసభ వ్యాఖ్యానించింది. అధికార పార్టీకి శాసనమండలిలో తగినంత బలం లేనందున ఉభయ సభల సమావేశాన్ని నిర్వహిద్దామని తాము సూచించినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమ్మతించలేదని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సభ దృష్టికి తెచ్చారు. రాజకీయ పునరావాస కేంద్రమా? రాష్ట్ర ప్రగతికి అడ్డంకిగా మారిన శాసనసమండలి రద్దు చేయాల్సిందేనని అందులోని సభ్యులుగా తాము కోరుతున్నానని మంత్రులు సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు విస్పష్టంగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమకు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తేల్చిచెప్పారు. సంక్షేమ, అభివృద్ధి విధానాలకు అడ్డుపడుతున్న శాసనమండలిని రద్దు చేయాల్సిందేనని సభ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, ఎస్సీ ఎస్టీల ప్రయోజనాల కోసం వేర్వేరు కమిషన్ల నియామకాలకు కూడా శాసనమండలి మోకాలడ్డటం ఏమిటని శాసనసభ నిలదీసింది. మూడు ప్రాంతాల అభివృద్ధికోసం ఉద్దేశించిన బిల్లులను అడ్డుకోవడం ద్వారా మండలిలో టీడీపీ సభ్యుల అరాచకం పరాకాష్టకు చేరిందని అభిప్రాయపడింది. ఎన్నికల్లో చిత్తుగా ఓడిన లోకేశ్, ప్రజల తీర్పు కోరడానికి భయపడి నియోజకవర్గాన్ని వదిలి రాజధానిలో తలదాచుకున్న యనమల రామకృష్ణుడు, దాదాగిరి చేసే కొందరు టీడీపీ నేతలకు పునరావాస కేంద్రంగానే శాసనమండలి మిగిలిపోతోందని ఆవేదనగా వ్యాఖ్యానించింది.(ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?) అసెంబ్లీలో తీర్మానం ద్వారా అవకాశం ఉన్నా.. శాసనసభలో చర్చ సందర్భంగా పలువురు సభ్యులు శాసనమండలిని రద్దు చేయాల్సిందేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ శాసనమండలిలో బుధవారం చైర్మన్ ప్రకటనల వీడియో ప్రదర్శించారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడం నిబంధనలకు విరుద్ధమంటూనే తన విచక్షణాధికారాలతో సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు చైర్మన్ ప్రకటించడాన్ని ఆ వీడియో ద్వారా సభ్యులు, ఇతరులు వీక్షించారు. శాసనసభలో తీర్మానం ద్వారా మూడు రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ సభలను గౌరవిస్తూ తాము బిల్లులను పెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. 51 శాతం ఓట్లు, 68 శాతం సీట్లు సాధించిన తమ ప్రభుత్వాన్ని నడపకుండా ప్రతిపక్షం రాజకీయ దురుద్దేశంతో అడ్డుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. విద్యావంతులకు ప్రాతినిధ్యం కోసం శాసనమండలిని ఏర్పాటు చేశారని చెబుతూ ప్రస్తుతం శాసనసభలోనే పీహెచ్డీలు చేసినవారు, డాక్టర్లు, లాయర్లు, సివిల్ సర్వీస్ ఉన్నతాధికారులు, కళాకారులు, రైతులు, ఫారిన్ రిటర్న్ ప్రముఖులు తదితరులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏటా రూ.60 కోట్ల భారం అవసరమా? విభజన అనంతరం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ రాష్ట్రం శాసనమండలి కోసం ఏటా రూ.60 కోట్లు భరించడం అవసరమా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వాదనకు సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. శాసనమండలిని రద్దు చేయాల్సిందేనని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల రీత్యా సరైన నిర్ణయం తీసుకునేందుకు శాసనసభను సోమవారం సమావేశపరచాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. అందుకు స్పీకర్ సమ్మతిస్తూ సోమవారం శాసనసభ సమావేశమవుతుందని ప్రకటించారు. సోమవారం అసెంబ్లీ భేటీపై సర్వత్రా ఆసక్తి శాసనమండలిలో ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం రాష్ట్రంలో రాజకీయంగా పలు కీలక పరిణామాలకు దారి తీసింది. మండలి అప్రజాస్వావిుక తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రజాప్రయోజాలకు విఘాతంగా మారిన శాసనమండలిని కొనసాగించడానికి వీల్లేదని సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శాసనమండలిపై ప్రత్యేకంగా చర్చించేందుకు సోమవారం శాసనసభ సమావేశం కానుంది. ఈ పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ‘శాసన మండలిలో మాకు తగినంత బలం లేదని తెలుసు. కాబట్టి శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశం నిర్వహించి వికేంద్రీకరణ బిల్లును ఆమోదింపజేసుకుందామని నాతోపాటు సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సూచించాం. కానీ ఆయన అందుకు సమ్మతించలేదు. మనం ఫెయిర్గా (పారదర్శకంగా) వ్యవహరిద్దాం. వాళ్లు కూడా అలాగే ఉంటారని, నిబంధనల మేరకు వ్యవహరిస్తారేమో చూద్దాం. ఒకవేళ వాళ్లు నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకుంటే అడ్డుకోనివ్వండి. మనం మాత్రం నిబంధనలను ఉల్లంఘించవద్దని ముఖ్యమంత్రి జగన్ మాతో చెప్పారు. అదీ ఆయన రాజనీతిజ్ఞత’ అని ఉప ముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. శాసనమండలిలో జరిగిన పరిణామాలపై గురువారం శాసన సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల కోసం కుతంత్రాలు చేసే నేతలున్న ఈ రోజుల్లో అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి గొప్ప రాజ నీతిజ్ఞతను ప్రదర్శించారని చెప్పారు.( చంద్రబాబు స్వార్థానికి బలయ్యాం!) తప్పు చేశానంటూ విచక్షణ ఏమిటి?: సుభాష్ చంద్రబోస్ ‘రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజు్ఞడు రాబోయే తరాల గురించి ఆలోచిస్తారు. అలాంటి అరుదైన తీరును ముఖ్యమంత్రి జగన్ ప్రదర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు తన రాజకీయ స్వార్థంతో శాసనమండలిని దుర్వినియోగం చేశారు. ప్రజలు గెలిపించిన ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకోవడానికి మండలిని అడ్డుపెట్టుకోవడం ఏమిటి? నిబంధనల మేరకు వ్యవహరించాలని చైర్మన్ను ఎంతగా వేడుకున్నా ఆయన ఖాతరు చేయలేదు. తప్పు చేశానని అంగీకరించిన శాసన మండలి చైర్మన్కు విచక్షణాధికా>రాలను వినియోగించే హక్కు ఎక్కడ ఉంటుంది? విచక్షణతో వినియోగించాలి్సన అధికారాలను మండలి చైర్మన్ భ్రషు్టపట్టించారు. ఈ పరిస్థితుల్లో శాసన మండలిని కొనసాగించాలి్సన అవసరం ఉందా? మండలిని రద్దు చేయాలని అందులో సభ్యుడిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా’ చైర్మన్ తీరు దారుణం: బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభ సుదీర్ఘంగా చర్చించి ఆమోదించిన పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు విషయంలో మండలి చైర్మన్ అనుసరించిన తీరు దారుణంగా ఉందని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తప్పుబట్టారు. అసెంబ్లీ ఆమోదించి పంపిన పరిపాలన – అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో మండలిలో టీడీపీ సభ్యుల ప్రవర్తన, చైర్మన్ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉందని గురువారం అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. తలెత్తి చంద్రబాబును చూశాక... చైర్మన్ చివరిలో మాట్లాడిన మాటలు చూస్తే చాలా బాధ కలుగుతోంది. సెలక్ట్ కమిటీకి పంపడానికి వీల్లేదని చెప్పిన చైర్మన్ (పైకి తలెత్తి గ్యాలరీలో ఎదురుగా ఉన్న చంద్రబాబు వైపు చూసి...) ‘నాకున్న విచక్షణాధికారంతో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించా’ అని ప్రకటించారు. మేం గౌరవప్రదంగా ఆమోదించాక.. ప్రభుత్వ బిజినెస్ నిర్వహణకే ఈనెల 21, 22వ తేదీల్లో మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బీఏసీలో ఆమోదించారు. అజెండాలో కూడా అదే ఉంది. టీడీపీ కుట్రపూరితంగా రూల్ 71 అంశాన్ని తెరపైకి తెచ్చింది. పాలకపక్షం తరఫున గవర్నమెంట్ బిజినెస్కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరాం. తర్వాత రూల్ 71 కింద చర్చ కావాలంటే పెట్టుకోవాలని కోరాం. రూల్ 71 కింద మొదట చర్చించి తర్వాత బిల్లులపై చర్చ జరుపుదామంటే గౌరవప్రదంగా ఆమోదించాం. బిల్లులను మేం వివరించి ఆమోదించాలని కోరగానే సెలక్ట్ కమిటీని తెరపైకి తెచ్చారు. అడ్డగించటం సరికాదు 300 పేజీల పుస్తకంలో వెతికి ఏదో ఒక రూల్ తెచ్చి చట్టాలు చేయడానికి సహకరించటానికి ఉపయోగిస్తున్నారా? మనం చేసేపనిని అడ్డగించటానికి ఉపయోగిస్తున్నారా? ఆలోచించాలి. చైర్మన్తో బీఏసీలో నేను, మంత్రులు మాట్లాడాం. వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్స్తో మాట్లాడాం. రూల్ ఎలా ఉంటే అలా చేయాలని వారంతా సలహా ఇచ్చారు. నాలుగు గంటలసేపు ప్రతిపక్షనేత చంద్రబాబు చైర్మన్కు ఎదురుగా గ్యాలరీలో కూర్చొని ఆయన్ను ప్రభావితం చేశారు. మండలిని రద్దు చేయండి: మంత్రి మోపిదేవి వెంకటరమణ ‘నేను మండలి సభ్యుడిని. నా ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల భవిష్యత్తే ముఖ్యం. ప్రజా ప్రయోజనాలను అడ్డుకుంటున్న శాసనమండలిని రద్దు చేయాలి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను శాసనమండలి అడ్డుకోవడం దురదృష్టకరం. మండలి తప్పనిసరిగా ఉండాల్సిన వ్యవస్థ ఏమీ కాదు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటైంది. మండలిలో బిల్లులను ఆమోదించి పంపించాలని కోరినప్పటికీ చైర్మన్ వినిపించుకోలేదు. ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి చంద్రబాబు కనుసన్నల్లోనే మండలి కొనసాగింది. చైర్మన్ కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తలా వ్యవహరించడం దురదృష్టకరం. టీడీపీ ఆఫీస్లా మార్చారు: అంజాద్ బాషా, ఉప ముఖ్యమంత్రి ‘శాసన మండలిని చంద్రబాబు టీడీపీ కార్యాలయంలా మార్చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి తెచ్చిన వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం ఏమిటి? పెద్దల సభ అంటే పెద్ద మనసుతో వ్యవహరించాలిగానీ ఇలా కొందరి రాజకీయ ప్రయోజనాల సాధనంగా మారకూడదు. మండలి చైర్మన్ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించడానికి చంద్రబాబు ఒత్తిడే కారణం. ‘గ్యాలరీ’ డైరెక్షన్లో నడవడం ప్రమాదకరం: ధర్మాన ప్రసాదరావు వేగంగా అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పరుగును నిరోధించేందుకు చేసే కుట్రలను ఏమాత్రం సాగనివ్వరాదని సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ‘శాసనాలుచేసే అధికారం ప్రజలు ఎన్నుకున్న శాసనసభకే ఉంటుంది. వ్యవస్థలను మేనేజ్ చేసినట్లుగా చంద్రబాబు మండలిని ప్రభావితం చేసి బిల్లులను అడ్డుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని పాటించకపోతే ప్రజలు నిస్సహాయులుగా మిగిలిపోతారు. ఇలాంటి పరిస్థితి రాకూడదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గ్యాలరీలో ఉన్న వారి డైరెక్షన్ ప్రకారం నడిచే వ్యవస్థ ప్రమాదకరం. మండలి అవసరమే లేదని ఎన్జీ రంగా నాడే చెప్పారు. పరిగెడుతున్న ప్రభుత్వాన్ని నడవకుండా చేసే ప్రయత్నం తప్ప మరేమీ లేదని కామత్ 70 ఏళ్ల క్రితమే ఎగువ సభ గురించి ప్రస్తావించారు. మండలి అవసరమా? లేదా? అనే అంశంపై సభలో సుదీర్ఘ చర్చ జరిపి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి్సన అవసరం ఉంది. (వీధిన పడ్డ ‘పెద్ద’ల సభ పరువు) దేశవ్యాప్తంగా చర్చ జరగాలి: మంత్రి కన్నబాబు శాసనమండలిలో బుధవారం జరిగిన దారుణమైన పరిణామాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి్సన అవసరం ఉందని మంత్రి కన్నబాబు చెప్పారు. న్యాయమూర్తిగా ఉండాల్సిన మండలి చైర్మన్.. ‘నేను తప్పు చేస్తున్నా. నాతో తప్పు చేయిస్తున్నారు. రూల్స్ లేకపోయినా నా విచక్షణాధికారం ప్రకారం సెలక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించా’ అంటూ మరో తప్పు చేశారని కన్నబాబు పేర్కొన్నారు. ‘విచక్షణాధికారంపై చర్చ జరగాలి. ఉన్న విధానాలను, రూల్స్ను అతిక్రమించరాదు. రూల్స్ లేకుండా ఏదైనా సందిగ్ధత ఉన్నప్పుడే విచక్షణాధికారాల ప్రస్తావన వస్తుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటే అది ప్రజలను అవమానించినట్లే. ప్రజాస్వామ్య లక్ష్యాన్ని దెబ్బతీసే విధంగా టీడీపీ వ్యవహరిస్తోంది. బిల్లులను అడ్డుకొని చంద్రబాబు నాయుడు నాలుగు నెలల కాలాన్ని మింగేయగలరేమోగానీ అంతకుమించి ఏమీ చేయలేరు. తాగి వచ్చారంటూ మంత్రులను అవమానించిన యనమలపై చర్యలు తీసుకోవాలి. మరో వ్యక్తి మంత్రులకు బ్రీత్ ఎనలైజర్లు పెట్టాలన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించరాదు. ఎమ్మెల్యేలను, మంత్రులను అనడమంటే ప్రజలను అవమానించడమే. శాసన మండలి అవసరమా లేదా అనే దానిపై చర్చ జరగాలి. పాలన సాగాలా.. వద్దా?: అంబటి రాంబాబు మూడుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు మండలి గ్యాలరీలో కూర్చొని చైర్మన్ను ప్రభావితం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాజకీయ స్వార్థం కోసం వ్యవస్థలను ప్రభావితం చేయడంలో చంద్రబాబును మించిన వ్యక్తి దేశంలోనే లేరన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం శాసనసభ చేస్తున్న బిల్లులను మండలి అడ్డుకుంటూ ఉంటే ఐదేళ్లపాటు పాలన సాగాలా వద్దా? అని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో శాసనమండలిని కొనసాగించాలి్సన అవసరం లేదన్నారు. వికేంద్రీకరణ బిల్లుపై కాలయాపన చేయడం మినహా పూర్తిగా అడ్డుకోలేమని తెలిసినప్పటికీ చంద్రబాబు రైతులను మభ్యపెట్టేందుకే ఈ కుయుక్తి పన్నారని చెప్పారు. రైతులు చంద్రబాబును నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని హెచ్చరించారు. రైతులు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మరిన్ని ప్రయోజనాలు పొందాలని సూచించారు. ఆరో వేలు అవసరమా?: మంత్రి కొడాలి నాని ఆరో వేలు లాంటి శాసనమండలి అవసరమా? అనే విషయంపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబును మండలి గ్యాలరీ ఎక్కించిన ముఖ్యమంత్రి జగన్ను అభినందిస్తున్నాం. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబుకు ఇక్కడ (అసెంబ్లీ) గ్యాలరీనే గతి. దివంగత వైఎస్సార్ భిక్ష వల్లే పప్పునాయుడు మంత్రి, ఎమ్మెల్సీ అయ్యారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఆరో వేలు అవసరం లేదని మండలిని రద్దు చేశారు. మేధావులు ఆలోచించి సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్సార్ మండలిని పునరుద్ధరిస్తే పప్పునాయుడు, యనమల లాంటి వారు వస్తున్నారు. చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని సిగ్గు లేకుండా చైర్మన్కు సైగలు చేశారు. మంత్రులు తాగి వచ్చారని యనమల అనడం శోచనీయం. చంద్రబాబు లేదా ఆయనతో ఉన్నవారు తాగి వచ్చారేమో? యనమల నీతులు చెబితే వినాలా? ఆయన పేరు చెబితే గుర్తొచ్చేది ఎన్టీఆర్కు చేసిన మోసమే. ప్రభుత్వాన్ని కించపరిచేలా దుష్ప్రచారం: గడికోట శ్రీకాంత్రెడ్డి ‘నిపుణులతో కూడిన మూడు కమిటీలు సుదీర్ఘ అధ్యయనం చేసి ఇచ్చిన నివేదికలను తులనాత్మకంగా పరిశీలించిన అనంతరం శాసనసభ బిల్లును ఆమోదించి కౌన్సిల్కు పంపితే అక్కడ జరగరాని పరిణామాలు జరిగాయి. మంత్రులను, ప్రభుత్వాన్ని అవహేళన చేసేలా, కించపరిచేలా కొన్ని పేపర్లు, టీవీల్లో దుష్ప్రచారం జరుగుతోంది. మండలిలో ఏం జరిగిందో సభ్యులకు, ప్రజలకు తెలియజేయాలని ఆర్థిక మంత్రిని కోరుతున్నా’ అని ప్రభుత్వ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. -
చంద్రబాబు స్వార్థానికి బలయ్యాం!
సాక్షి, అమరావతి: శాసన మండలిలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో చంద్రబాబును నమ్మి మోసపోయాయని, కొరివితో తలగొక్కున్నట్లైందని టీడీపీ సభ్యులు వాపోతున్నారు. చైర్మన్ను అడ్డుపెట్టుకుని బిల్లులు చట్టరూపం దాల్చకుండా తాత్కాలికంగా అడ్డుకుని.. తమ పదవులకే ఎసరు తెచ్చుకున్నామని ఆందోళన చెందుతున్నారు. మండలిని రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడంతో టీడీపీ ఎమ్మెల్సీలు అంతర్మథనంలో పడ్డారు. తమ రాజకీయ భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఏర్పడిందని.. అందుకు చంద్రబాబే కారణమని లోలోన రగిలిపోతున్నారు. (చదవండి: అప్రజాస్వామికం) మండలి రద్దయితే టీడీపీకి తీరనినష్టం మండలిలో టీడీపీ సభ్యుల సంఖ్య 32 కాగా.. చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు ఆ పార్టీకి చెందిన వారే. మండలి రద్దయితే ఎక్కువగా నష్టపోయేది టీడీపీనే. మండలిలో ఈ రెండు బిల్లుల్ని అడ్డుకునేందుకు బాబు, లోకేష్, యనమల మంత్రాంగం నడుపుతున్న సమయంలోనే పలువురు టీడీపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లులను కొద్దిరోజులు అడ్డుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదని.. కొంత ఆలస్యమైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేస్తుందని చెప్పారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించి అప్రదిష్ట మూటగట్టుకోవాల్సి వచ్చిందని పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. (చదవండి: వీధిన పడ్డ ‘పెద్ద’ల సభ పరువు) ఈ క్రమంలోనే పార్టీ విప్ను ధిక్కరించి పోతుల సునీత, శివనాథరెడ్డిలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. కొందరు యనమల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు, లోకేశ్ రాజకీయాల వల్ల పైకి మాట్లాడలేక పోయారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు తమ భవిష్యత్తును పణంగా పెట్టారని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం తమ పదవులకు ఎసరు తెచ్చే పరిస్థితి తీసుకొచ్చారని మరికొందరు వాపోతున్నారు. శాసనమండలి రద్దు దిశగా అడుగులు పడుతుండడంతో ఏం చేయాలో తెలియక విలవిల్లాడుతున్నారు. ఈ పరిస్థితి వస్తుందని చెప్పినా వినలేదు: పీడీఎఫ్ చంద్రబాబు, లోకేశ్ తీరు వల్లే శాసన మండలి ఉనికే లేకుండాపోయే పరిస్థితి ఏర్పడిందని పీడీఎఫ్ సభ్యులు, పలువురు ఇండిపెండెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సలహాలు, సూచనల వరకే పరిమితం కావాలని తాము మొదటి నుంచి టీడీపీ సభ్యులకు చెబుతున్నా స్వప్రయోజనాలు చూసుకున్నారని, వారి స్వార్థానికి అందరూ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు. టీడీపీ తీరుపై పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం మండలిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బిల్లులు అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఆ తర్వాత చైర్మన్తో జరిగిన చర్చల్లోనూ.. నిబంధనల ప్రకారం వ్యవహరించి బిల్లులపై ఓటింగ్ నిర్వహించాలని కోరారు. (చదవండి:ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?) చైర్మన్తో చంద్రబాబు తప్పు చేయించి అందరినీ బలి చేస్తున్నారని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలికి ఎలాంటి అధికారాలు, విధులు లేవని.. అనవసరంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని స్వతంత్య్ర సభ్యుడు కంతేటి సత్యనారాయణరాజు టీడీపీకి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. చాన్నాళ్ల అనంతరం వైఎస్ హయాంలో మండలిని పునరుద్ధరించుకుంటే.. ఇప్పుడు దాన్ని లేకుండా చేయొద్దని హితవు పలికినా చంద్రబాబు అండ్ కో పట్టించుకోలేదు. చంద్రబాబు రాజకీయం వల్ల సొంత పారీ్టకి చెందిన సభ్యులతోపాటు పట్టభద్రులు, ఉపాధ్యాయుల ప్రతినిధులుగా మండలిలో అడుగుపెట్టిన మేధావులకు సైతం నష్టం జరిగే పరిస్థితి ఏర్పడిందని సభ్యులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. (గ్యాలరీలో చంద్రబాబు ఎందుకు కూర్చున్నారు?) -
ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?
సాక్షి, అమరావతి: రాజకీయ అజెండాతో నడుస్తూ.. ప్రజలకు మేలు చేసే విధంగా లేని శాసనమండలిని కొనసాగించాలా లేక రద్దు చేయాలా అన్నదానిపై సీరియస్గా ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సలహాలు, సూచనలు ఇవ్వడానికే శాసనమండలి ఏర్పడిందని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తే.. మండలిలోని సభ్యులు మాత్రం మేలు జరగకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. శాసన మండలిలో బుధవారం చోటుచేసుకున్న పరిణామాలపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. ప్రజాస్వామ్య విలువలకు తూట్లు ‘‘అధ్యక్షా.. ఇవాళ కొన్ని అంశాలను సభ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకు వచ్చి మీ అందరి నిర్ణయాన్ని అడగదలుచుకున్నా. 2019 ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 151 మంది ఎమ్మెల్యేలతో.. అంటే 86 శాతం మంది ఎమ్మెల్యేలతో ప్రజల మాటే వేదంగా ఈ సభ ఏర్పడింది. అంటే ఇది ప్రజలు ఆమోదించిన సభ. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం మాది. ఏడున్నర నెలలకు పైగా బీసీలకు శాశ్వత కమిషన్, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు.. మూడు కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో కానీ, కాంట్రాక్టుల్లో కానీ 50 శాతం ఇవ్వాలని చేసిన చట్టం.. ఇందులో 50 శాతం మహిళలకే కేటాయించాలని చేసిన చట్టం.. దిశ చట్టం.. జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటు.. రివర్స్ టెండరింగ్కు చట్టబద్ధత.. గ్రామ సచివాలయాల ఏర్పాటు.. స్థానికంగా ఉద్యోగాలలో 75 శాతం రిజర్వేషన్లు.. ఆర్టీసీ విలీనం.. విద్యా సంస్థలపై రెండు రెగ్యులేటరీ కమిషన్ల ఏర్పాటు.. ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనకు శ్రీకారం చుట్టాం. అత్యంత దిగువన ఉన్న వర్గాల కోసం మనసు పెట్టి పని చేశాం. పాలకులం కాదు సేవకులం అని చెప్పినట్టుగా నడుచుకుంటున్నాం. చదవండి: వీధిన పడ్డ ‘పెద్ద’ల సభ పరువు చంద్రబాబు స్వార్థానికి బలయ్యాం! మండలి చైర్మన్కు ఆ విచక్షణాధికారం లేదు తప్పు.. అంటూనే తప్పు చేయడంలో అర్థం ఏమిటి? శాసనమండలిలో నిన్న (బుధవారం) జరిగిన ఘటనలు నన్ను ఎంతగానో బాధించాయి. ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నవి ఉండాలి.. ఉంటాయి. వాటికి నేను ఏ రోజూ వ్యతిరేకం కాదు. చట్టాన్ని కాపాడటానికి ఇవి ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించి ఉపయోగించుకోవడానికి మాత్రం కాదు. మండలి అన్నది చట్టసభలో భాగం కాబట్టి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం. కానీ నా నమ్మకంతో పాటు ఐదు కోట్ల మంది ప్రజలందరి నమ్మకాన్ని వమ్ము చేస్తూ నిన్న శాసనమండలిలో జరిగిన తంతు గమనించాం. శాసనమండలి చైర్మన్.. నిష్పాక్షికంగా మండలి నిర్వహించే పరిస్థితి లేదని నిన్న (బుధవారం) చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని జారీ చేసిన ఆదేశాల వల్ల ఎవరికైనా అర్థమవుతోంది. ఆ సందర్భంగా శాసనమండలి చైర్మన్ చేసిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి. అన్ని ప్రాంతాల అభివృద్ధికి, అధికారాల వికేంద్రీకరణకు మేము ప్రవేశపెట్టిన బిల్లును మండలి చర్చించి ఆమోదించవచ్చు.. లేదా తిరస్కరించవచ్చు.. లేదా వారి అభిప్రాయాలు సూచిస్తూ సవరణలతో తిప్పి పంపవచ్చు. చట్టం కూడా ఇదే చెబుతోంది. కానీ ఇవేవీ కూడా లెక్క చేయకుండా మండలి చైర్మన్ విచక్షణాధికారం అంటూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. విచక్షణా అధికారం అనేది ఏదైనా సందిగ్ధత ఉన్నప్పుడు ఉత్పన్నం అవుతుంది. రూల్స్ ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశం లేదని ఆయనే చెప్పారు. మరోవైపు తనకు లేని అధికారం ఉపయోగించి ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం, విధానం అత్యంత దురదృష్టకరం. ప్రజలకు న్యాయం జరగకుండా ఉండేందుకు మండలిని వాడుకోవచ్చన్న దురాలోచనను మనం ఆమోదిస్తే ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుంది. అధ్యక్షా.. మీ ఆమోదంతో నిన్న శాసనమండలిలో చైర్మన్ ఏం మాట్లాడారో ఒక్కసారి డిస్ప్లే చేయిద్దాం. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టేనా? అధ్యక్షా.. ఆయన ఏమన్నారో అందరూ చూశారు. విధానపరంగా ఏ బిల్లునైనా మూవ్ చేసిన 12 గంటల్లోగా సవరణలు ఇవ్వాలన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న ఆలోచన ఉన్నప్పుడు బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడే మూవ్ చేయాలి.. ఆ టైమ్ ల్యాప్స్ అయిందని కూడా అన్నారు. ప్రభుత్వ పరంగా వచ్చిన బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చి, రూల్ పరంగా ప్రైవేట్ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడానికి వీలు లేదని మంత్రులు వాదించిన విషయం కూడా నిజమే అన్నారు. ప్రభుత్వ వాదనతో ఇటు బీజేపీ పక్షం.. అటు పీడీఎఫ్, లెఫ్ట్ పార్టీల పక్షం కూడా ఏకీభవించాయి అని కూడా ఆయన చెప్పారు. సెలెక్ట్ కమిటీ వేయాలన్న తెలుగుదేశం ప్రతిపాదన రూల్ పరంగా లేదని సుస్పష్టంగా కనిపిస్తోందని శాసనమండలి చైర్మన్ పేర్కొన్నారు. అయినా దానిని ఏ రకంగా అతిక్రమించాలన్న ఆలోచన చేశామని కూడా చెప్పారు. చివరకు రూల్స్కు అనుగుణంగా లేనందున, సెలెక్ట్ కమిటీకి పంపే పరిస్థితి లేనందున, చైర్మన్గా నాకున్న విచక్షణాధికారాలకు లోబడి రూల్ 154 ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అంటే.. విచక్షణ అధికారాన్ని చట్టాన్ని ఉల్లంఘించడానికి వాడానని ఆయనే చెబుతున్నారు. అంటే విచక్షణాధికారం చట్టాన్ని పరిరక్షించడానికి కాకుండా ఉల్లంఘించడానికి వాడారు. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టేనా.. అని అందరమూ ఆలోచించాలి. అక్కడ డైరెక్షన్ ఇవ్వడానికి తనకు సంబంధం లేని సభ గ్యాలరీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూర్చున్నది అందరం చూశాం. ఇకపై ఆ తప్పు చేయకుండా ఆలోచించాలా.. వద్దా? రాజ్యాంగ రచన కోసం నాడు ఏర్పాటు చేసిన కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ.. రాష్ట్రాల్లో రెండవ సభ అంటే మండలి ఉండాలా.. వద్దా అనే చర్చలో అత్యధికులు ఇది అనవసరం అని అభిప్రాయపడ్డారు. డబ్బు ఖర్చు తప్ప ఏ ప్రయోజనం ఉందదన్నారు. దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉంది. విడిపోయిన ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా అనేది ఆలోచించాలి. మండలి కోసం సంవత్సరానికి రూ.60 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 60 రోజులు సభ జరుగుతుందనుకుంటే రోజుకు రూ.కోటి ఖర్చు పెడుతున్నాం. అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం. ఇంత ఖర్చు అవసరమా? మంచి చేయడం కోసం తమ బుర్రలను పెట్టకుండా, ప్రతి మంచి పనిని ఎలా జరగకుండా ఆపాలి.. ఎలా డిలే చేయాలి.. అని రూల్స్ను సైతం ధిక్కరిస్తున్న ఇలాంటి మండలిని కొనసాగించాలా.. వద్దా.. అన్నది సీరియస్గా ఆలోచించాలి. ఇది తప్పే.. అయినా చేస్తున్నామని మండలి చైర్మన్ చెబుతున్నారు. అయినా చంద్రబాబు మాత్రం ఊళ్లకు పోయి కార్యకర్తలను పిలిపించుకుని పూల దండలు వేయించుకోవడం, సన్మానం చేయించుకోవడం.. ఆయన ఎల్లో మీడియాలో ఊదరగొట్టడం ఆశ్చర్యమనిపిస్తోంది. ఎక్కడి నుంచైనా పాలన సాగించొచ్చు రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదమే లేదు. పరిపాలన కోసం వికేంద్రీకరణ చేయవచ్చు. దివంగత జయలలిత ఊటీ నుంచి పాలన సాగించారు. మొన్న వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు పది రోజులు విశాఖ నుంచి పాలన సాగించారు. రేపు ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే ముఖ్యమంత్రి 20 రోజుల పాటు అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడి నుంచే పాలన సాగిస్తారు. ప్రజలు ఇచ్చిన అధికారం మేరకు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ కూర్చొని అయినా మంత్రులు, సెక్రటరీలకు సూచనలు ఇస్తూ పాలన సాగించవచ్చు. ఇందుకు ఏ చట్టం అవసరం లేదు. ఏ బిల్లూ అవసరం లేదు. ఒక తీర్మానం చేసి ఈ పని చేయొచ్చు. రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీ పెట్టొచ్చు. ఆర్టికల్ 174 ప్రకారం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా చట్టాలు చేయవచ్చని రాజ్యాంగం చెబుతోంది. సూచనలు, సలహాలు ఇవ్వాల్సింది పోయి.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమిది.. అలాంటప్పుడు నైతిక విలువలు మరచిపోయి ఎందుకు ఇన్ని డ్రామాలు చేస్తున్నారో వాళ్లకు వాళ్లు ప్రశ్నించుకోవాలి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే కౌన్సిల్ అన్నది ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. ఇలాంటి మండలి ఆ పని చేయనప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అని సీరియస్గా ఆలోచించాలి. మొన్న ఇంగ్లిష్ మీడియం బిల్లును అడ్డుకున్నారు. దీనిని అడ్డుకున్న వారి పిల్లలు చదువుతున్న స్కూళ్లు తెలుగు మీడియంవి కాదు.. ఇంగ్లిష్ మీడియంవి. పేద పిల్లలకు మాత్రం తెలుగు మీడియం స్కూళ్లు ఉండాలట. ఇంగ్లిష్ మీడియం ఉండకూడదట. పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటే ప్రపంచంతో పోటీ పరిస్థితి వస్తుందని తెలిసీ ఆ బిల్లును అడ్డుకోవడం, డిలే చేయడం.. జరక్కుండా చూడాలని ఆరాట పడుతున్న పరిస్థితిలో ఈ మండలి అవసరమా? ప్రతి అడుగులోనూ రాజకీయ దురుద్దేశం ఎస్సీలకు, ఎస్టీలకు వేర్వేరుగా రెండు కమిషన్లు ఏర్పడితే వారికి మేలు చేసే దిశగా అడుగులు పడతాయి. అటువంటి దానినీ అడ్డుకోవడం, డిలే చేయడం, చట్టం కాకుండా ఏ స్థాయిలో వీలైతే ఆ స్థాయిలో అడ్డుకోవడం జరుగుతోంది. మంచి చేయాలని ప్రభుత్వం చూస్తుంటే దానిని అడ్డుకునే దిశగా ఈ పెద్దల సభ వెళ్లిపోతే పరిస్థితి ఏంటన్నది పెద్దలు బుర్రలు పెట్టి ఆలోచించలేకపోతే పాలనకు అర్థం ఏమిటి? చంద్రబాబు ఇక్కడ ఇంగ్లిష్ మీడియంకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పి, అక్కడ మండలిలో బిల్లు పాస్ కాకుండా అడ్డుకుంటారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏడాదికి రూ.60 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి రాజకీయ అజెండాతో నడుపుతున్న ఇలాంటి సభను నిజంగా కొనసాగించాలా వద్దా అని మనమంతా సీరియస్గా ఆలోచించాలి. అధ్యక్షా.. మీరు అనుమతిస్తే సోమవారం మళ్లీ సభను పెట్టండి. ఇంకా సుదీర్ఘంగా చర్చించి ఇటువంటి మండలిని కొనసాగిద్దామా.. వద్దా.. అని నిర్ణయం తీసుకుందాం. ఈ సిస్టంను క్లీన్ చేసే విషయంలో నాలుగు అడుగులు ముందుకేయాలని మిమ్మల్ని, శాసనసభ్యులందరినీ అభ్యర్థిస్తున్నా’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. సోమవారానికి సభ వాయిదా ముఖ్యమంత్రిగా మీరు ఎక్కడి నుంచి అయినా పరిపాలన సాగించవచ్చు. నాడు ఎన్టీఆర్.. మొత్తం మంత్రి వర్గాన్నే బర్తరఫ్ చేసి నెల రోజుల పాటు అస్సాంలో ఉండి పరిపాలించారు. సోమవారం ఉదయం 11 గంటలకు తిరిగి సభ ప్రారంభమవుతుంది. – తమ్మినేని సీతారామ్, అసెంబ్లీ స్పీకర్ శాసనమండలి చట్టం ప్రకారం నడుస్తోందా.. లేక ఒక పార్టీ, ఒక వ్యక్తి ఇష్టాయిష్టాల ప్రకారం నడుస్తోందా? ప్రజల ప్రభుత్వం ఇస్టానుసారం నడుస్తోందా.. లేక ఓడిన పార్టీ నాయకుడి ప్రయోజనాల కోసం నడుస్తోందా? మండలి అనేది సలహాలు, సూచనలు చేసే పెద్దల సభగా ఉండాలి. కానీ బిల్లులను చట్టం కాకుండా నిరోధించేలా ఉంది. తప్పు అని తెలిసి కూడా, విచక్షణాధికారంతో అదే తప్పును చేస్తానంటున్న ఈ మండలి అధ్యక్షుడిని చూస్తే.. ‘హత్య చేయడం తప్పు. అయినా నేను హత్య చేస్తాను’ అని అన్నట్లుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?– సీఎం వైఎస్ జగన్ -
సీఎం జగన్ను కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు తాను మద్దతు ఇస్తానని చెప్పారు. గురువారం ఆమె ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరడానికే సీఎం జగన్ను కలిశానని స్పష్టం చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. బుధవారం శాసన మండలిలో జరిగిన ఘటన దేశం మొత్తం పరిశీలించిందని, అలా జరగడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ బిల్లులు అడ్డుకున్నారని ఆరోపించారు. మండలి చైర్మన్ టీడీపీ కార్యకర్తగా వ్యవహరించారని విమర్శించారు. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న శాసస మండలి ఉండాలా వద్దా అనే అంశంపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్ధేశంతో రూల్ 71ను టీడీపీ పెట్టిందని, అందుకే వ్యతిరేకంగా ఓటు వేశానని అన్నారు. కాగా, ఏపీ శాసన మండలిలో మంగళవారం టీడీపీ ప్రవేశపెట్టిన రూల్ 71ను సునీత వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓటు వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు మరో టీడీపీ ఎమ్మెల్సీ శివనాథ్రెడ్డి కూడా సొంత పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. -
ఆ వార్తల్లో నిజం లేదు: మండలి చైర్మన్
సాక్షి, తణుకు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను ప్రలోభాలకు గురిచేశారంటూ వస్తున్న వార్తలను శాసనమండలి చైర్మన్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా షరీఫ్ విలేకరులతో మాట్లాడుతూ.. బుధవారం శాసనమండలిలో జరిగిన పరిణామాలపై స్పందించారు. వైఎస్సార్సీపీ నాయకులు తనపై వ్యక్తిగత దూషణలు చేయలేదని స్పష్టం చేశారు. తనను మంత్రులు దుర్భాషలాడినట్టు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. అదేవిధంగా వారు తనని బెదిరించినట్లు వస్తున్న వార్తల్లో కూడా ఎంతమాత్రం నిజం లేదన్నారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన తెలిపారు. మూడు రాజధానులు రావాలా, అమరావతి ఒక్కటే ఉండాలా అన్నదానిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని తేల్చిచెప్పారు. శాసనమండలిని రద్దు చేయాలన్న ప్రతిపాదనపై స్పందిస్తూ.. అది ప్రభుత్వం ఇష్టమని వ్యాఖ్యానించారు. -
‘మండలిని రద్దు చేయండి’
సాక్షి, అమరావతి : శాసన మండలి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిందని డిప్యూటీ సీఎం, మండలి సభా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అసహనం వ్యక్తం చేశారు. మండలిని రద్దు చేయాలని ఒక సభ్యునిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రతిపాదిస్తున్నానని అన్నారు. బుధవారం శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలపై గురువారం శాసనసభలో చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ మాట్లాడుతూ.. చట్టాలు చేసే సభలో సభాపతులు వ్యవహరించిన తీరుపై చర్చించడం దారుణమన్నారు. బుధవారం మండలిలో జరిగిన చర్చలో మంత్రుల సలహాలను చైర్మన్ పట్టించుకోలేదని ఆరోపించారు. కావాలనే బిల్లులను అడ్డుకున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు మండలి గ్యాలరీలో కూర్చొని చైర్మన్ను ప్రభావితం చేశారని ఆరోపించారు. సలహాలు, సూచనలు ఇవ్వడానికే పెద్దల ఉందన్నారు. చట్టాలను సక్రమంగా అమలు చేసే సభాధిపతులే.. చట్టాలను అతిక్రమిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు. ‘మంచి ఆలోచనలతో రాజ్యాంగ నిర్మాతలు పెద్దల సభ పెట్టారు. శాసన సభకు విద్యావంతులు రాకపోవడం, ధన బలం ఉన్నవాళ్లు ఎన్నికవ్వడం జరగవచ్చు. అలాంటి సమయంలో వారికి ఇష్టం వచ్చిన చట్టాలు తెచ్చి ప్రజలను ఇబ్బంది కలిగిస్తారనే భయంతో పెద్దల సభ ఏర్పాటు చేశారు. సలహాలు, సూచనలు ఇవ్వడానికే ఈ సభ ఏర్పాటైంది. కానీ నేడు అది రాజకీయాలకు కేంద్ర బిందువైంది. బుధవారం మండలిలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యానికే మచ్చగా మారాయి. టీడీపీ నేతలు నేరుగా చైర్మన్ దగ్గరకు వచ్చి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపమని సలహాలు ఇచ్చారు. చైర్మన్ తప్పు చేశానంటునే విచక్షణాధికారంతో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు. తప్పు చేసిన వారికి విచక్షణాధికారం ఎలా ఉంటుంది? రూల్ 71 ఎప్పుడు ఉపయోగించాలో తెలియకుండా చర్చించారు. సభాపతే చట్టాలను ఉల్లంఘిస్తే మేం ఎవరికి చెప్పుకోవాలి? ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు మండలి గ్యాలరీలో కూర్చోని చైర్మన్ను ప్రభావితం చేశారు. టీడీపీ సభ్యుల సలహా మేరకు చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు. దీనికంటే ఆయన రాజీనామా చేసి బయటకు వస్తే గౌరవంగా ఉండేది. మండలి సభ్యునిగా ముఖ్యమంత్రి, స్పీకర్కు ప్రతిపాదిసున్నా.. సభను వెంటనే రద్దు చేయండి. రాజకీయాలకు ఉపయోగపడే సభ నిష్ర్పయోజనం. రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే ప్రజాస్వామ్యం కొనసాగుతుంది’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. -
ఇలాంటి మండలిని కొనసాగించాలా?
సాక్షి, అమరావతి : రాజకీయ ఎజెండాతో నడుస్తూ.. ప్రజలకు మేలు చేసే విధంగా లేని శాసనమండలిని కొనసాగించాలా లేదా అన్నదానిపై సీరియస్గా ఆలోచన చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సలహాలు, సూచనలు ఇవ్వాడానికే శాసనమండలి ఏర్పడిందని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తే.. మండలిలోని సభ్యులు మాత్రం మేలు జరగకూడదని చూస్తున్నారని మండిపడ్డారు. మండలిలో నిన్న జరిగిన పరిణామాలు బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండలి కోసం ఏడాదికి రూ. 60 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదం లేదని.. రాష్ట్రంలో ఎక్కడ కూర్చొని అయినా పాలన సాగించవచ్చని తెలిపారు. శాసనమండలిలో బుధవారం చోటుచేసుకున్న పరిణామాలపై నేడు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ప్రజల మాటే వేదంగా తాము శాసనసభలో అడుగుపెట్టాం. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం తమ ప్రభుత్వం ఏర్పడింది. ఏడున్నర నెలలుగా ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నాం. చట్టాలు చేయడానికే శాసనసభ ఉంది. అవినీతికి అడ్డుకట్ట వేయడానికి మా అధికారం ఉపయోగించాం. మేము పాలకులం కాదని సేవకులమని చెబుతున్నాం.. ఈ రోజుకు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నాం. ప్రజాస్వామ్య విలువలు లేకుండా చేశారు.. చట్టసభల్లో భాగమైనా మండలి చట్టబద్ధంగా వ్యవహరిస్తోందని నమ్మాం.. కానీ నిన్న జరిగిన పరిణామాలు దానిని ఒమ్ము చేశాయి. నిష్పాక్షికంగా మండలి నిర్వహించే పరిస్థితి లేదు.. గ్యాలరీలో కూర్చొని చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. శాసనసభ పంపిన వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో చర్చించి ఆమోదించవచ్చు, లేకపోతే తిరస్కరించవచ్చు.. అదికాకపోతే సవరణలు కోరుతూ తిప్పి పంపవచ్చు . చట్టం కూడా ఇదే చెబుతోంది.. కానీ వాటిని లెక్కచేయకుండా విచక్షణ అధికారం అంటూ కౌన్సిల్ చైర్మన్ నిన్న బిల్లును సెలక్ట్ కమిటీకి పంపారు. నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ నిర్ణయం తీసుకుని.. ప్రజాస్వామ్యానికి విలువ కూడా లేకుండా చేశార’ని అన్నారు. అలాగే మండలిలో చైర్మన్ మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘ నిబంధనల ప్రకారం బిల్లును సెలక్ట్ కమిటీకి పంపే అధికారం తనకు లేదని చైర్మన్ చెప్పారు. బిల్లు పెట్టిన 12 గంటల్లోపే సవరణలు ఇవ్వాలని కూడా తెలిపారు. సెలక్ట్ కమిటీకి పంపాలంటే .. బిల్లు పెట్టినప్పుడే ప్రతిపాదనలు చేయాలని కూడా చైర్మన్ చెప్పారు. మళ్లీ ఆయనే రూల్స్ను అతిక్రమించి బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపకూడదనే మంత్రుల వాదనతో బీజేపీ, పీడీఎఫ్, వామపక్ష సభ్యులు ఏకీభవించారు. కానీ సెలక్ట్ కమిటీకి పంపే అధికారం లేకున్నా.. తనుకున్న విచక్షణ అధికారంతో నిర్ణయం తీసుకున్నాని చైర్మన్ అన్నారు. చట్టాన్ని ఉల్లఘించేందుకే విచక్షణ అధికారాన్ని వాడానని చైర్మన్ స్వయంగా అంగీకరించారు. చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని ఇచ్చిన ఆదేశాలను చైర్మన్ పాటించారు. 6 రాష్ట్రాలకు మాత్రమే మండలిలు ఉన్నాయి.. మండలి ప్రజల కోసం నడుస్తోందా.. రాజకీయ నిరుద్యోగల కోసం నడుస్తోందా అన్న ఆలోచన చేయాలి. చైర్మన్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?. విడిపోయిన ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి శాసన మండలి అవసరమా అన్న ఆలోచన జరగాలి. మండలి కోసం ఏడాదికి రూ. 60 కోట్ల ఖర్చు పెడుతున్నాం. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే.. కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే మండలిలు ఉన్నాయి. 22 రాష్ట్రాల్లో మండలిలు లేనే లేవు. ఓవైపు చంద్రబాబు తప్పు జరిగిందని చెబతున్నారు.. మరోవైపు చంద్రబాబు పూల దండలు వేయించుకుంటున్నారు. దాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదం లేదు. అభివృద్ది కోసం వికేంద్రీకరణ చేయొచ్చు. రాష్ట్రంలో ఎక్కడ కూర్చొని అయినా పాలన సాగించవచ్చు. దివంగత జయలలిత ఊటీ నుంచి పాలన సాగించారు. ఆర్టికల్ 174 ప్రకారం ఎక్కడి నుంచి అయినా చట్టాలు చేయొచ్చు. మండలి అన్నది ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. కానీ అక్కడ సలహాలు, సూచనలు పక్కనబెట్టి ప్రజలకు మేలు జరిగే బిల్లులను ఎలా ఆలస్యం చేయాలో ఆలోచిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం బిల్లును అడ్డుకుంటారు. ఇంగ్లిష్ మీడియం బిల్లును అడ్డుకున్నవాళ్ల పిల్లలందరు ఇంగ్లిష్లోనే చదువుతున్నాదు. ఇలాంటి మండలిని కొనసాంగించాలా? వద్దా? అనేదానిపై సీరియస్గా చర్చ జరగాలి’ అని అన్నారు. ఈ అంశంపై సోమవారం చర్చించుదామని స్పీకర్ను కోరారు. శాసనసభ సోమవారానికి వాయిదా.. సీఎం వైఎస్ జగన్ ప్రసంగం అనంతరం మాట్లాడిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. శాసనమండలికి సంబంధించి సోమవారం సభలో చర్చించడానికి అనుమతిచ్చారు. అలాగే శాసనసభను సోమవారానికి వాయిదా వేశారు. -
సీఎం జగన్ దెబ్బతో.. బాబు గ్యాలరీ ఎక్కారు
సాక్షి, అమరావతి : పెద్దల సభ అంటే సలహాలు, సూచనలు ఇచ్చి బిల్లును ఆమోదించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. శాసనసభలో చేసిన బిల్లుపై చర్చించాలే తప్ప తిరస్కరించవద్దన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దెబ్బకు.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శాసనమండలి గ్యాలరీ ఎక్కారని నాని ఎద్దేవా చేశారు. త్వరలోనే సీఎం వైఎస్ జగన్ ఆయనను శాసనసభ గ్యాలరీ కూడా ఎక్కిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. బుధవారం శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలపై నేడు శాసనసభలో చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిన్న అశోక్బాబు మండలి చైర్మన్ షరీఫ్ వద్దకు వెళ్లాడనేది అవాస్తమని చెప్పారు. రూల్స్ పాటిస్తానని చెప్పిన మండలి చైర్మన్.. తన మాటకు కట్టుబడలేదని అన్నారు. శాసనమండలి లేకపోతే చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు. 1983లో ఉన్నటువంటి బ్యాచే మళ్లీ మండలిలో చేరిందని విమర్శించారు. అందుకే అప్పట్లో ఎన్టీఆర్ మండలిని రద్దుచేశారని గుర్తుచేశారు. అయితే మంచి సలహాలు ఇస్తారనే ఉద్దేశంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనమండలిని పునరుద్ధరించారని తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేని లోకేశ్కు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సార్ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మండలిని తీసేయాలనే అంశాన్ని కచ్చితంగా ఆలోచించాలని కోరారు. తమకు వ్యక్తిగతంగా ఎవరిపై కోపం లేదని స్పష్టం చేశారు. మండలిలో ఇంగ్లిష్ మీడియం, ఎస్సీ, ఎస్టీ బిల్లులను ఆపేశారని.. ఇప్పుడు ఏకంగా వికేంద్రీకరణ బిల్లుకే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మండలి చైర్మన్కు డైరెక్షన్స్ ఇచ్చారని.. ఇలాంటి పనులు చేయడానికి ఆయనకు సిగ్గు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తాగి వచ్చారో.. ఇంకెవరు తాగొచ్చారో తెలియదని.. యనమల రామకృష్ణుడుతో సహా టీడీపీ నేతలకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయాలని అన్నారు. యనమల పేరెత్తితే వెన్నుపోటు గుర్తుస్తోందన్నారు. అలాంటి వ్యక్తి తమకు సలహాలు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. మండలిలో టీచర్, పట్టభద్ర ఎమ్మెల్సీల్లో చాలా మంచివారున్నారని తెలిపారు. వారితోపాటు.. బీజేపీ ఎమ్మెల్సీలు కూడా వికేంద్రీకరణ బిల్లు ఆపొద్దని విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. -
‘మండలి అవసరమా..? చర్చ జరగాలి’
సాక్షి, అమరావతి : గతంలో వ్యవస్థలను మెనేజ్ చేసినట్లుగా బుధవారం చంద్రబాబు నాయుడు శాసన మండలిని ప్రభావితం చేసి బిల్లులను అడ్డుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని పాటించకపోతే ప్రజలు నిస్సహాయులుగా మిగిలిపోతారని ఆవేద వ్యక్తం చేశారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..ప్రభుత్వ నిర్ణయాలను మండలి ఆపలేదన్నారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు చేసే ఆస్కారం ఉన్న శాసన మండలి అవసరమా లేదా అన్నది ప్రజాస్వామ్యవాదులంతా ఆలోలించాలని కోరారు. (చదవండి : నిబంధనలు పాటించడమే చైర్మన్ బాధ్యత: కన్నబాబు) మండలి అనేది అవసరమే లేదని ఎన్జీ రంగా నాడే చెప్పారని గుర్తు చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన నిర్ణయాలను అడ్డుకుంటే.. అది ప్రజలను అవమానించినట్లేనని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య లక్ష్యాన్ని దెబ్బతీసేవిధంగా టీడీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. నిన్న మండలిలో జరిగిన పరిణామాలు సమయాన్ని వృధా చేయాలన్నట్లుగానే ఉన్నాయన్నారు. బిల్లులను అడ్డుకొని చంద్రబాబు నాయుడు నాలుగు నెలల కాలాన్ని మింగేస్తాడేమో కానీ అంతకు మించి ఏమి చేయలేరన్నారు. శాసన మండలి అవసరమా లేదా అనే దానిపై చర్చ జరగాలని, దీని కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి, స్పీకర్ను కోరారు. -
మండలి చైర్మన్కు ఆ విచక్షణాధికారం లేదు
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి నివేదించే విషయంలో శాసనమండలి చైర్మన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం మండలిలో జరిగిన ఈ వ్యవహారంపై బుగ్గన గురువారం అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. శాసనసభ ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో శాసనమండలికి పరిమితమైన ఆప్షన్స్ మాత్రమే ఉంటాయని, ఆ బిల్లును చర్చించి ఆమోదించడం, లేదా సవరణలతో మళ్లీ శాసనసభకు పంపించడం వంటి ఆప్షన్స్ ఉంటాయని, కానీ టీడీపీ కుట్రపూరితంగా రూల్ 71 అంశాన్ని తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. నిజానికి రూల్ 71 నిబంధన కేవలం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోనే ఉందని, ఏపీ అసెంబ్లీలో కూడా అది లేదని స్పష్టం చేశారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రభుత్వ పాలజీని చర్చించి మండలి తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు కొన్ని సంవత్సరాల కిందట ఈ నిబంధనను మండలిలో చేర్చారని వివరించారు. నిజానికి శాసనప్రక్రియలో గవర్నమెంట్ బిజినెస్కు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని, ఈ మేరకు స్పష్టంగా నిబంధనలు ఉన్నా.. వాటిని ఉల్లంఘిస్తూ చైర్మన్ రూల్ 71కింద సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారని తెలిపారు. అలా రిఫర్ చేసే సమయంలో ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని తాము లేఖలు ఇచ్చినట్టు టీడీపీ చెప్పుకొచ్చిందని తెలిపారు. నిజానికి రూల్ 71 కింద బిల్లులను సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసే అధికారమే లేదని బుగ్గన తెలిపారు. సెలెక్ట్ కమిటీకి పంపే ప్రొవిజన్ లేకపోయినా, విచక్షణాధికారం కింద బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించినట్టు చైర్మన్ చెప్పారని, కానీ, ఇది చైర్మన్ విచక్షణాధికారం కిందకు రాదని, దీనికి సంబంధించి స్పష్టంగా నిబంధనలు ఉన్నాయని స్పష్టం చేశారు. మండలిలో టీడీపీ సభ్యుల ప్రవర్తన నవ్వులాటలాగా ఉందని, మండలిలో బలముంది కదా అని అన్ని చట్టాలను, నిబంధనలను, సంప్రదాయాలను టీడీపీ తనకు అనుకూలంగా ఇష్టానుసారంగా వాడుకుంటోందని దుయ్యబట్టారు. తీర్మానాలు, బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో ఆ సమయాన్ని మార్చడానికి చైర్మన్కు విచక్షణాధికారం ఉంటుందని, సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయడంలో కాదని తెలిపారు. ప్రజల తరఫున ఎన్నికైన ప్రభుత్వం ప్రధాన బాధ్యత చట్టాలు రూపొందించడమని, శాసన వ్యవస్థ ప్రథమ బాధ్యత కూడా ఈ చట్టాలను ఆమోదించడమని, ఈ విషయంలో దిగువసభ అసెంబ్లీకే విశేష అధికారాలు ఉంటాయని భారత రాజ్యాంగం కూడా స్పష్టం చేస్తుందని, కానీ ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఏదో రూల్ తీసుకొచ్చి.. పరిపాలనను అడ్డుకునేందుకు, చట్టాల రూపకల్పన ప్రక్రియకు మోకాలడ్డేందుకు ప్రయత్నిస్తోందని బుగ్గన తప్పుబట్టారు. నిన్న సాయంత్రం మండలిలో జరిగింది చాలా బాధాకరమని, నాలుగు గంటలసేపు గ్యాలరీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కూర్చొన్నారని, అసలు ఎప్పుడూ మండలికి రాని చంద్రబాబు వచ్చి.. అంతసేపు కూర్చోవాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. చైర్మన్ ఎదుట కూర్చొని.. చైర్మన్ను ప్రభావితం చేసేవిధంగా చంద్రబాబు వ్యవహరించారని, ఈ విషయంలో తప్పు చేసినవారిదే కాకుండా తప్పు చేయించేలా ప్రభావితం చేసిన వారిది ఇంకా పెద్ద తప్పు అని మండిపడ్డారు. టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు మంత్రులు సభకు తాగొచ్చారంటూ బాధ్యతారహితంగా, దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇతర పార్టీల సభ్యులు సోము వీర్రాజు, మాధవ్తోపాటు పీడీఎఫ్, కాంగ్రెస్, స్వతంత్ర సభ్యుడు కూడా చైర్మన్ చేసింది తప్పని నిర్ద్వంద్వంగా చెప్పారని గుర్తు చేశారు. మండలి చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తిఇ తటస్థంగా వ్యవహరించాలని అన్నారు. -
ప్రతిపక్షాల వైఖరి సరైంది కాదు
సాక్షి, విశాఖపట్నం: శాసన మండలి చైర్మన్ తన విచక్షణాధికారాలతో బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడం శాసన మండలి చరిత్రలోనే ఇదే మొదటిసారని ఏయూ పొలిటికల్ సైన్స్ విశ్రాంతాచార్యులు ప్రొఫెసర్ కె.రవి అన్నారు. ప్రాంతీయ సమానాభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను నిబంధనలకు విరుద్ధంగా శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపించడాన్ని ఆయన తప్పుపట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ను ప్రభావితం చేసేలా వ్యవహరించడం తప్పని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విరుద్ధమని ప్రొఫెసర్ రవి పేర్కొన్నారు. టీడీపీ సభ్యుల తీరు చూస్తే అసలు వీరు ప్రజాస్వామ్య వాదులేనా, వీరికి ప్రజాస్వామ్యం మీద నమ్మకముందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ప్రతిపక్షాల వైఖరి సరైంది కాదని విమర్శించారు. ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయాలను ఆశ్రయించకుండా వికృత చేష్టలతో గొడవకు దిగి బిల్లును ఆపడం అప్రజాస్వామికమే అవుతుందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఆమోదించకుండా తిరోగమనం చెందటం ప్రజలకు నిరాశాజనకమని పేర్కొన్నారు. చదవండి: ఇది తప్పే.. సెలెక్ట్ కమిటీకి ఎలా పంపుతారు? -
పేదల జీవితాలు బాగుపడకూడదనే కుట్రతోనే..
సాక్షి, అమరావతి: పేద, బడుగు వర్గాల పిల్లలకు ఇంగ్లిష్ విద్యను అందించేందుకు ఉద్దేశించిన ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లు చరిత్రాత్మకమైనదని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో తప్పనిసరిగా విద్యాబోధన జరగాలంటూ ఈ బిల్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించి.. శాసనమండలికి పంపించిందని, మండలిలోని పెద్దలు ఈ బిల్లును మరింత కూలకశంగా చర్చించి.. సూచనలు, సలహాలు చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా బిల్లు మీద నాలుగు సవరణలు ప్రతిపాదిస్తూ మండలి తిరిగి శాసనసభకు పంపిందని తెలిపారు. ఇంగ్లిష్ మీడియాన్ని ఎత్తివేయాలని, లేదా తెలుగు మీడియం తీసుకోవాలా? ఇంగ్లిష్ మీడియమా? అన్న నిర్ణయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వదిలేయాలని సవరణలు పంపారని, శాసనమండలిలో తనకు మెజారిటీ ఉండటంతో చంద్రబాబు ఈ విధంగా దురుద్దేశంతో ఈ బిల్లును తిప్పి పంపారని ఆర్కే పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. విద్య ప్రాథమిక హక్కు అని, పిల్లలందరికీ కచ్చితంగా విద్యను ఉచితంగా అందించాలని రాజ్యాంగం నిర్దేశించిందని గుర్తు చేశారు. శ్రీచైతన్య, నారాయణ వంటి ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మీడియంలో అసలు బోధన జరగడం లేదని, నిర్బంధంగా ఇంగ్లిష్ మీడియంలోనే వాళ్లు బోధిస్తున్నారని తెలిపారు. తన బినామీలు, తన మనుషులు చేసే ఇలాంటి చర్యలు సమర్థించే చంద్రబాబు.. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన పేద పిల్లలు, అగ్రకులాల పేద పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. పేదలెవరూ ఇంగ్లిష్ మీడియం చదువుకోకూడదన్న దుర్బుద్ధితో చంద్రబాబు ఈ బిల్లుకు అడ్డుపడుతున్నారని, మండలిలో బలముందని ఇలా బిల్లులను చంద్రబాబు దురుద్దేశంతో అడ్డుకోవడం సరికాదని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తీసుకొస్తున్న బిల్లులను తన కుట్రల ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, పేదల జీవితాలు బాగుపడకూడదనే కుట్రతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని ఆర్కే ధ్వజమెత్తారు. -
ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి హర్షణీయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నాలుగోరోజు గురువారం ప్రారంభమయ్యాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక అసమానతల వల్ల కొంతమంది వెనకబడ్డారని, సమాజంలోని ఈ అసమానతలు తగ్గాలంటే విద్య చాలా అవసరమని తెలిపారు. పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ విద్య అవసరమని తెలిపారు. ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి అంటూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఎంతో కీలకమైనదని, హర్షించదగిందని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన అమ్మ ఒడి పథకంతో విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజన మెనూతో విద్యార్థులకు ఎంతో లాభం చేకూరుతుందని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం వల్ల వారి సామర్థ్యం పెరుగుతుందన్నారు. నాడు-నేడు కార్యక్రమంతో పాఠశాలల్లో వసతులు మెరుగవుతున్నాయని, ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వ పాఠశాల్లలో డ్రాపౌట్స్ తగ్గుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య మీద ఎంతో శ్రద్ధ పెట్టి.. ప్రాధాన్యమిస్తున్నారని, ఆయన తీసుకొస్తున్న పథకాలు ప్రజల తరతరాల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయని అన్నారు. నిరక్షరాస్యత రూపుమాపడమే మా ప్రభుత్వ లక్ష్యం.. సభ్యుడు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుత కాలంలో ఇంగ్లిష్ విద్య ఒక ఆస్తి. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఇంగ్లిష్ చాలా అవసరం. సమాజంలోని నిరక్షరాస్యత రూపుమాపడమే మా ప్రభుత్వ లక్ష్యం. పేద విద్యార్థులకు మేలు చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నాం. సమాజంలోని అసమానతలు విద్య వల్ల తగ్గుతాయి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ దేశ నిండుభారతిని అన్న కవి భావాలను నిజం చేయాలంటే అందుకు ఇంగ్లిష్ విద్య కూడా అవసరం. ప్రపంచ భాష అయిన ఇంగ్లిష్ రాకపోతే మన ఔన్నత్యాన్ని అందరికీ చాటిచెప్పలేం’ అని పేర్కొన్నారు. రైతు కొడుకు ఇంజినీర్ కావాలని.. సభ్యుడు కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘పేదలు తమ పిల్లల్ని చదివించడానికి ఎంతో కష్టపడుతున్నారు. అప్పులు చేసి ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. చాలామంది ఊళ్లను నుంచి పిల్లలను పట్టణాలకు పంపించి.. అక్కడ చదివిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. పదో తరగతికి వచ్చేవరకు ఆ ఒత్తిడిని తట్టుకోలేక కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నారాయణ, శ్రీచైతన్య వంటి ప్రైవేటు స్కూళ్లలోనే విద్యార్థుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకొని నిలబడే విధంగా శిక్షణ పొందుతున్నారు. జీవితంలో వచ్చే ఆటుపోట్లను తట్టుకునేవిధంగా తయారవుతున్నారు. చాలచోట్ల ప్రైవేటు పాఠశాలలు ఏమాత్రం వసతులు లేకుండా పశువుల కొట్టాంలా ఉన్నాయి. కానీ పెద్దమొత్తంలో ఫీజలను ప్రైవేటు స్కూళ్లు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చాలా అవసరం. రైతు కొడుకు ఇంజినీర్ కావాలని, రిక్షావాడి కొడుకు కూడా డాక్టర్ కావాలని, పేద విద్యార్థులు కూడా పెద్ద పెద్ద చదువులు చదవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. అంబేద్కర్ కలల సమాజాన్ని సీఎం జగన్ సాకారం చేస్తున్నారు’ అని అన్నారు. సభ్యుడు గొల్లబాబురావు మాట్లాడుతూ.. విద్యారంగంలో సంస్కరణలతో భావితరాలకు మేలు జరుగుతుందని అన్నారు. విద్య అనేది అభివృద్ధికి పునాది అని, అందుకే విద్యలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. విద్యారంగంలో సంస్కరణల వల్ల సమాజంలో ఎన్నో మంచి మార్పులు వస్తాయని తెలిపారు. పేదవర్గాల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. ఇంగ్లిష్ విద్య పేదలకు వరం లాంటిదని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేయడాన్ని స్వాగతించారు. సభ్యుడు తిప్పేస్వామి మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి ఇంగ్లిష్ చదువు రావాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం బిల్లును తీసుకొచ్చిందన్నారు. బిల్లు ఉద్దేశాన్ని పక్కదారి పట్టించేలా టీడీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. ప్రాథమిక విద్యలో తెలుగు మీడియంలో ఉండి, ఉన్నత విద్య ఇంగ్లిష్ మీడియంలో ఉండటం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని, అందువల్ల ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధన సాగించాల్సి ఉందని, అందుకు వీలుగా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని వివరించారు. సభ్యుడు బుడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతకాలంలో ఇంగ్లిష్ విద్య తప్పనిసరి అయిందని, ఇంగ్లిష్ విద్య పేద విద్యార్థులకు ఓ వరమని కొనియాడారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను మండలి చైర్మన్ షరీఫ్ బుధవారం అర్ధంతరంగా సెలెక్ట్ కమిటీకి నివేదించి.. మండలి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు మాత్రమే నేడు కొనసాగనున్నాయి. -
చంద్రబాబు ఏం సాధించారు?: వెలంపల్లి
సాక్షి, విజయవాడ: శానసమండలిలో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ..‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు పార్టీలకతీతంగా వ్యవహరించాలి. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదు. బిల్లులను అడ్డుకుని చంద్రబాబు ఏం సాధించారు?. చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని మండలి చైర్మన్ను ప్రభావితం చేశారు. టీడీపీ సభ్యులు కూడా మండలి చైర్మన్పై ఒత్తిడి తీసుకొచ్చారు. టీడీపీ సభ్యులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. చంద్రబాబు కనుసన్నల్లో చైర్మన్ వ్యవహరించారు. తాను చేసేది తప్పు అని మండలి చైర్మన్ ఒప్పుకున్నారు. 13 జిల్లాల్లో అభివృద్ధి జరగాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశించారు. చట్ట సభలపై గౌరవం లేకుండా టీడీపీ వ్యవహరించింది’ అని మండిపడ్డారు. చదవండి: ‘మండలి’లో రౌడీయిజం చేశాం.. హద్దులు దాటిన అరాచకం ఇది తప్పే.. -
రోజా పక్కన దిష్టి బొమ్మ?: వర్మ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా బుధవారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణతో ఏపీఐఐసీ ఛైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్ఫీ దిగారు. దీంతో ప్రస్తుతం రోజా-బాలకృష్ణల సెల్ఫీలు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారాయి. అయితే ఈ ఫోటోలపై వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ తనదైన రీతిలో స్పందించాడు. ఆ ఫోటోలను తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేస్తూ వరుస కామెంట్లు చేశాడు. ‘సెల్ఫీలో రోజాగారు హీరోలా కనిపిస్తున్నారు. కానీ ఆమె కుడి పక్కన ఉన్న వ్యక్తి ఎవరో గానీ అసహ్యంగా(యాక్)గా ఉన్నారు. ఈ ఫ్రేమ్లో అతను రోజా గారి అందాన్ని పాడు చేస్తున్నారు. ఒకవేళ అతను ఆమెకు దిష్టి బొమ్మ కావచ్చు’ అని వర్మ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత ‘అందమైన రోజా గారి పక్కన కూర్చుని.. ఆ ఫోటోను నాశనం చేసిన ఆ వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా?’ అని కోరుతూ వర్మ మరో ట్వీట్ చేశాడు. ఇక దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసనమండలిలో బుధవారం చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మండలి సమావేశాలను అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నాయకులు వీఐపీ గ్యాలరీల్లో నుంచి వీక్షించారు. ఈ సందర్భంగా బాలకృష్ణను ఆర్కే రోజా మర్యాదపూర్వకంగా పలకరించి, కాసేపు ముచ్చటించారు. అనంతరం రోజాతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు బాలయ్యతో సెల్ఫీలు దిగారు. Can someone tell me who’s this guy spoiling the photo by sitting next to the pretty Roja ? pic.twitter.com/0oJJHAuuEV — Ram Gopal Varma (@RGVzoomin) January 22, 2020 Wowww Roja Garu looks like a HERO and some guy who I don’t know on her right looks like yuckk..He’s spoiling her beauty by spoiling the frame with his face ...Or maybe he is her Dishti Bomma pic.twitter.com/4uO19G6rZL — Ram Gopal Varma (@RGVzoomin) January 22, 2020 చదవండి: బాలయ్య న్యూలుక్ అదిరింది!! ఆ సంఘటన నన్ను కలచివేసింది: వర్మ ఏపీ రాజధానిపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ -
సెలెక్ట్ కమిటీకి ఎలా పంపుతారు?
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ సందర్భంగా బుధవారం శాసన మండలిలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఆర్డీఏ రద్దు, ఏఎంఆర్డీఏ ఏర్పాటు బిల్లులపై సవరణలను సెలెక్ట్ కమిటీకి పంపించాలని యనమల పేర్కొనగా బుగ్గన విభేదించారు. నిబంధనల ప్రకారం చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపకూడదని చెప్పారు. ఈ సమయంలో యనమల జోక్యంచేసుకుంటూ మంత్రులు సభలో ఉండకూడదని, వారిని బయటకు పంపించాలంటూ వెటకారంగా వ్యాఖ్యలు చేశారు. చైర్ను మీరెలా డిక్టేట్ చేస్తారని బుగ్గన ప్రశ్నించారు. బిల్లులను చర్చకు తీసుకున్నపుడు ఎలాంటి మోషన్ మూవ్ చేయలేదు కాబట్టి సెలెక్ట్ కమిటీ అంటూ కొత్త వాదనలను తెరమీదకు తేవడం సరికాదన్నారు. రూల్బుక్లో నిబంధనలను బుగ్గన చదివి వినిపించారు. తొలుత మోషన్ మూవ్ కాలేదన్న చైర్మన్.. బిల్లులను చర్చకు తీసుకున్న సమయంలో సవరణలకు సంబంధించి ఎటువంటి మోషన్ మూవ్ కాలేదని పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. యనమల చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారని, క్షుణ్నంగా నిబంధనలు చదివి వినిపించినా సెలెక్ట్ కమిటీకి పంపించాలనడం దారుణమని బుగ్గన పేర్కొనగా ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బిల్లులను చర్చకు తీసుకున్న సమయంలో ఎలాంటి మోషన్ మూవ్ కాలేదని మండలి ఛైర్మన్ షరీఫ్ తొలుత ప్రకటించారు. సాంకేతికంగా మోషన్ మూవ్ అయితేనే ఏదైనా నిర్ణయం తీసుకోగలమని చెప్పగా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. ఈ దశలో చైర్మన్ అశోక్బాబు నోటీసులు ఇచ్చారని చెప్పడం పట్ల అధికార పక్ష సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నోటీసులు పాత తేదీలు వేసి ఇవ్వవచ్చని, యనమల చాలా మేధావితనంతో మాట్లాడుతున్నారని బుగ్గన అన్నారు. బిల్లును పరిగణనలోకి తీసుకున్న సమయంలోనే నిబంధనల మేరకు సవరణల మోషన్ మూవ్ చేయాలని, అలా మూవ్ చేసినట్లు రికార్డులున్నాయేమో చెప్పాలని చైర్మన్ను బుగ్గన కోరారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ బిల్లు పరిగణనలోకి తీసుకున్న విషయం టీడీపీ సభ్యులకు తెలియదన్నారు. కాసేపటి తరువాత రెండు నోటీసులు ఇచ్చారని చైర్మన్ చెప్పారు. మంత్రులవైపు దూసుకొచ్చిన టీడీపీ సభ్యులు గతంలో సీఆర్డీఏ ఏర్పాటు చేసినప్పుడు ఎలా బిల్లు పెట్టారో గుర్తు చేసుకోవాలని, అయినా వాటి గురించి ఇప్పుడు మాట్లాడటం లేదని యనమలకు మంత్రి బుగ్గన చురకలంటించారు. కాగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ టీడీపీ సభ్యులు పోడియం వద్ద గందరగోళం సృష్టించారు. మంత్రులవైపు దూసుకువెళ్లారు. అధికార పక్ష సభ్యులు, మంత్రులు పోడియం వద్దకు చేరుకుని బిల్లులను ఆమోదించాలని చైర్మన్ను అభ్యర్ధించారు. మంత్రులు చేతులు జోడించి వేడుకుంటుండగా టీడీపీ సభ్యులు బుద్ధా వెంకన్న, రాజేంద్రప్రసాద్, అశోక్బాబు, దీపక్రెడ్డి, బీటెక్ రవిలు మంత్రి బొత్సను దూషించారు. నారా లోకేష్ ఒక్కసారిగా మంత్రులు, అధికారపక్ష సభ్యల వైపు దూసుకురాగా టీడీపీ సభ్యుడు టీడీ జనార్ధన్ వెనక్కు తీసుకెళ్లారు. టీడీపీ సభ్యులు దూషణల పర్వం కొనసాగించగా మంత్రులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ రకంగా రౌడీయిజం చేస్తారా? అంటూ మంత్రి బొత్స నిలదీశారు. టీడీపీ సభ్యుల తీరు, హావభావాలు, చైర్మన్ వ్యవహార శైలిపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ పోడియం ఎదుట నిరసన తెలిపారు. సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. -
‘మండలి’లో రౌడీయిజం చేశాం..
సాక్షి, అమరావతి: ‘శాసన మండలిలో రౌడీయిజం చేశాం సార్’.. అంటూ టీడీపీ ఎమ్మెల్సీలు ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో జరిపిన సంభాషణ బుధవారం సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరల్ అయింది. నెటిజన్లందరూ ఈ వీడియో చూసి దానిపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో తెలుగుదేశం పార్టీ తీవ్ర అభాసుపాలైంది. ఆ వీడియోలో ఏముందంటే.. అసెంబ్లీ ఆమోదించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టనివ్వకుండా తాము ఏ విధంగా రౌడీయిజం ప్రదర్శించామో ఆ పార్టీ సభ్యులే స్వయంగా చంద్రబాబుకు వివరించారు. సభలో ఆ విధంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని చెప్పాల్సిన చంద్రబాబు అలాంటి సలహాలేవీ ఇవ్వకుండా.. ‘ఓకే గుడ్. బాగా చేశారు’.. అంటూ వారిపై ప్రశంసలు కురిపించారు. అంతేకాక.. ఎమ్మెల్సీలతో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మీరు లోపల కూర్చున్నారు. నేను టీవీ దగ్గర కూర్చుని మండలిలో జరిగే చర్చ చూశాను. మాధ్యమాల్లో స్క్రోలింగ్ చూస్తున్నా. ఎప్పుడు మాట్లాడినా గొడవపడ్డారు. వాళ్ల మంత్రులు రావటం.. మనవాళ్లు గొడవకు దిగడం అంతా చూశా’నని చెప్పారు. దీనికి ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు మరింత ఉత్సాహం ప్రదర్శిస్తూ.. ‘అశోక్బాబులో రౌడీని చూశాం.. మంత్రులు వచ్చినప్పుడు ఆయన ఏయ్.. ఏయ్ అని బాగా అరిచారు.. కొంచెం ఉంటే కొట్టేవాడు.. బెజవాడ రౌడీయిజం చూపెట్టాడు’ అని చంద్రబాబుకు వివరించారు. పార్టీ సభ్యులు అలా చెబుతుంటే చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా కన్పించారు. పెద్దల సభలో హుందాగా ఉండాలని చెప్పకుండా వారిని చంద్రబాబు ప్రశంసించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. -
హద్దులు దాటిన అరాచకం
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసన మండలిలో బుధవారం చర్చ ముగిసే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అరాచకం హద్దులు దాటింది. మండలిలో ఘర్షణ వాతావరణాన్ని ప్రేరేపించేందుకు ఆయన శతధా ప్రయత్నించారు. అసాధారణ రీతిలో ఆయన శాసనమండలి అధికారుల గ్యాలరీకి హుటాహుటిన టీడీపీ ఎమ్మెల్యేలతో వచ్చారు. అక్కడ మండలి చైర్మన్కు ఎదురుగా నిలబడే సైగలు చేస్తూ చైర్మన్ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. అంతేకాక.. టీడీపీ ఎమ్మెల్సీలకు సైగలు చేస్తూ అధికార పక్ష సభ్యులు, మంత్రులతో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు ప్రేరేపించారు. గ్యాలరీ నుంచి వెళ్లిపోవాల్సిందిగా మార్షల్స్ చంద్రబాబును కోరగా.. ఆయన ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారు. ఆగ్రహంతో ఊగిపోతూ వారిపైకి దూసుకెళ్తూ పెద్దపెద్దగా కేకలు వేశారు. స్పీకర్ను ఉద్దేశిస్తూ తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరించారు. ఆయన దౌర్జన్యకాండ ఎలా సాగిందంటే.. బిల్లులపై చర్చ అనంతరం మంత్రుల సమాధానం కూడా పూర్తయిన తరువాత మండలిలో టీడీపీ పక్షనేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. బిల్లుకు సవరణలను ప్రతిపాదించామని, సెలక్ట్ కమిటీకి పంపించాలన్నారు. ఇందుకు సంబంధించి మోషన్ కూడా ఇచ్చామన్నారు. దీంతో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్తో పాటు ఇతర మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇది అన్యాయమంటూ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు సాగుతున్న సమయంలో చంద్రబాబు సా. 5గంటల ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి అధికారుల గ్యాలరీలోకి వచ్చి చైర్మన్కు ఎదురుగా నిలబడ్డారు. ఆయన చైర్మన్ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడంతో పాటు టీడీపీ ఎమ్మెల్సీలకు సైగలుచేస్తూ మంత్రులుపైకి వెళ్లేందుకు ప్రేరేపించారు. అదే సమయంలో చంద్రబాబు పక్కనే ఉండి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, టీడీఎల్పీ కార్యాలయ ఉద్యోగి సురేశ్ కూడా మండలి ప్రొసీడింగ్స్ను తమతమ సెల్ఫోన్లతో వీడియోలు తీశారు. ఇది గమనించిన మార్షల్స్ వారిద్దరినీ వారించారు. మరోవైపు.. ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు సాగుతుండడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ఆ సమయంలో చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్, చిన్నరాజప్ప, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, అనగాని సత్యప్రసాద్లు అధికారుల గ్యాలరీలోనే తిష్టవేశారు. ఈ సమయంలో మార్షల్స్ వచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చంద్రబాబును, టీడీపీ ఎమ్మెల్యేలను కోరారు. దీంతో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ఒక్కసారిగా మార్షల్స్పైకి దూసుకువెళ్లి.. ‘వెళ్లిపోమని చెప్పడానికి స్పీకర్ ఎవరు? ఆయనను వచ్చి ఈడ్చుకు వెళ్లమనండి.. ఇక్కడ నుంచి నేను వెళ్లేది లేదు’.. అంటూ మార్షల్స్పై చంద్రబాబు పెద్దపెద్దగా కేకలు వేశారు. అంతేకాక.. ‘చైర్మన్ను చెప్పమనండి వెళ్తాను. తమాషాలు చేస్తున్నారా, ఇష్టానుసారం చేస్తారా ఇది పోలీసు రాజ్యమా’.. అంటూ వారిపై ఊగిపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక మార్షల్స్ బిత్తరపోయారు. వైఎస్సార్సీపీ నేతల రాక మరోవైపు.. వీఐపీ గ్యాలరీల్లో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డితోపాటు రోజా, కాసు మహేశ్రెడ్డి తదితర అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కూర్చుని మండలి ప్రొసీడింగ్స్ను వీక్షించారు. -
ఏపీ చరిత్రలో ఇది బ్లాక్ డే
సాక్షి, అమరావతి: పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపడం దారుణం అని, ఈ రోజు ఏపీ చరిత్రలో బ్లాక్ డే అని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. బుధవారం శాసనమండలిలో ఏపీ వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన అనంతరం ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘చట్టసభలపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదు. శాసనమండలి గ్యాలరీ నుంచి చైర్మన్కు డైరెక్షన్ ఇచ్చి, వికేంద్రీకరణ బిల్లును అడ్డుకున్నారు. వంద సంవత్సరాల చరిత్ర చూసి.. ప్రభుత్వం రెండు బిల్లులను తీసుకొచ్చింది. శాసనసభ ఆమోదించినా మండలి వ్యతిరేకించడం రాజ్యాంగ విరుద్ధం. బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ)లో యనమల రామకృష్ణుడు మాట్లాడిన దానికి, చేసిన దానికి పొంతన లేదు. రూల్ 71ని అడ్డుపెట్టుకుని సభను పక్కదారి పట్టించారు. రూల్ 71 అనేది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. బిల్లును ప్రవేశపెట్టే సమయంలోనే సెలెక్ట్ కమిటీకి పంపించాలంటే ఒక మోషన్ పెట్టాలి. మొదట ఇది చేయకుండా చివర్లో మోషన్ బిల్లు పెడుతున్నట్లు తాజా తేదీ వేసి సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపించాలని కుట్రలు చేశారు. రూల్స్ను విస్మరిస్తూ.. చివరకు ఇదంతా తప్పు అని, అయినా కూడా విచక్షణాధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నానని చైర్మన్ చెప్పారు. రూల్ 71ని అడ్డుపెట్టుకుని బిల్లులకు అడ్డుపడి.. పార్టీకి చైర్మన్ లొంగిపోతే ప్రజల పరిస్థితి ఏంటి? మా నాయకుడు చెప్పినట్లు చేస్తున్నానని చైర్మన్ చెప్పినట్లుగా ఉంది. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఇలా వ్యవహరించడం దుర్మార్గం. రెండు రోజులుగా బిల్లును ఓటింగ్కు పెట్టకుండా కావాలనే అడ్డుకున్నారు. చంద్రబాబు మాటలు విని మండలి చైర్మన్ నడుచుకుంటారా? చైర్మన్గా తప్పు చేసి, విచక్షణాధికారాలను ఉపయోగించానని ఎలా చెబుతారు? సభను చైర్మన్ రాజకీయాల కోసం వినియోగించారు. 13 జిల్లాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకున్నారు.. ఆ తర్వాత శాసనసభలో 90 శాతం మెజారిటీతో ఆమోదించిన బిల్లులను మండలిలో ఎలా అడ్డుకుంటారు?’ అని బుగ్గన మండిపడ్డారు. బాబు కనుసన్నల్లో మండలి చైర్మన్ శాసన మండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ సందర్భంగా మండలి చైర్మన్.. చంద్రబాబు కనుసన్నల్లో నడుచుకున్నారని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బుధవారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. ఒక పార్టీ అధ్యక్షుడు చెబితే చైర్మన్ చేయడం సిగ్గుచేటని.. చంద్రబాబు, చైర్మన్లు చరిత్రహీనులుగా మిగిలిపోతారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘శాసన మండలిలో ఈ రోజు జరిగిన ఘటన చట్టసభలకు మాయని మచ్చ. చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం వ్యహరించాలని మంగళవారం నుంచి చైర్మన్ను కోరుతున్నాం. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి అసెంబ్లీలో రెండు బిల్లుల్ని ఆమోదించాం. వాటిని మండలి ఆమోదించాలి... లేదా సలహాలివ్వాలి. అయితే తన పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు చైర్మన్ వ్యవహరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. అదే మాట చైర్మన్ స్వయంగా చెప్పారు. తప్పుచేసే వారికి ఇక విచక్షణాధికారం ఎక్కడుంటుంది. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అధికారం ఇచ్చారు. రెండు బిల్లుల్ని శాసన సభలో ఆమోదింపజేసుకున్నాం. ఇష్టమో, లేదో మండలిలో ప్రతిపక్ష సభ్యులు తేల్చాలి. నాన్చుడు ధోరణి వల్ల రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయి. శాసన మండలి రూల్ బుక్ ప్రకారం చేయాలని చైర్మన్ను కోరాం. ఆయన అలా చేయలేదు. చైర్మన్ చర్య రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుంది. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు. ప్రతీ ఒక్కరికి విచక్షణాధికారం ఉంటుంది. చట్టానికి లోబడకుండా విచక్షాణాధికారాన్ని ఉపయోగిస్తే ఎలా ఉంటుంది. అన్ని వర్గాలకు విచక్షణాధికారం ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తుంటే శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూ, దుర్మార్గంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోంది. రాష్ట్రం ఏమైపోయినా బాబుకు పట్టదు. ఆస్తులు కాపాడుకోవడమే ఆయనకు ముఖ్యం. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను.. నీతిమాలిన కార్యక్రమాలను ప్రజలు గమనించాలి. ఇలాంటి చైర్మన్లు ఉంటే వ్యవస్థకే ప్రమాదం. దుర్మార్గపు ఆలోచనతో ముందుకు వెళ్తున్న చంద్రబాబుకు చరమగీతం పాడేంతవరకు సీఎం వైఎస్ జగన్కు తోడుగా ఉంటాం. సీఎం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజామోదం మెండుగా ఉంది’ అన్నారు. -
మండలిలో అనూహ్య పరిణామం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధికార వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి శాసనమండలిలో బుధవారమంతా హైడ్రామా నడిచింది. ప్రభుత్వ ప్రతిపాదిత ఈ బిల్లుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు అడుగడుగునా అడ్డుతగలడంతో పలు దఫాలు సభ వాయిదా పడూతూ కొనసాగింది. నిబంధన 71 ప్రకారం ముందు తామిచ్చిన నోటీసుపై చర్చ జరగాలన్న పట్టుదలతో ప్రతిపక్షం సమావేశాలను అడ్డుకుంది. చివరకు నిబంధన 71 పై సభలో చర్చ చేపట్టిన అనంతరం ప్రభుత్వం ప్రతిపాదించిన వికేంద్రీకరణ బిల్లుపై సభ ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేయాల్సిన తరుణంలో మండలి చైర్మన్ అనూహ్యంగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మొత్తం పరిణామంలో విచిత్రమైన అంశమేమంటే... 4 దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకునే ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండలి గ్యాలరీలో కూర్చొని వీక్షించడం. ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ రకంగా గ్యాలరీలో కూర్చొని సభా కార్యక్రమాలను పర్యవేక్షించడం బహుశ గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇకపోతే మధ్య మధ్యలో తన చాంబర్కు వెళుతూ పార్టీ నాయకులతో సమావేశమై కార్యక్రమాలను అడ్డుకోవాలంటూ సూచనలు ఇవ్వడం విడ్డూరం. సభ వాయిదా పడిన తరుణంలో చంద్రబాబు పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశమై బాగా అడ్డుకున్నారంటూ వారిని భుజం తట్టారు. ఆ సందర్భంగా కొందరు సభ్యులైతే ఇంకా ముదిరితే చేయి చేసుకునే వారమని కూడా చెప్పడం వీడియోల్లో స్పష్టంగా తెలుస్తోంది. సభా కార్యక్రమాలను అడ్డుకునే విషయంలో ఎవరెవరం ఎలా వ్యవహరించామో? ఏ రకంగా అడ్డుకున్నామో? ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా చెబుతుంటే బాగా చేశారని, మరింతగా అడ్డుకోవాలని చంద్రబాబు సూచించారు. సభలో ఎవరేం చేస్తున్నారో టీవీల్లో చూస్తున్నానని మధ్య మధ్యలో గమనిస్తున్నానని వారిని పరోక్షంగా హెచ్చరించారు. చివరగా బుధవారం రాత్రి మండలి తిరిగి సమావేశమైనప్పుడు చంద్రబాబు, ఆయనతో పాటు పలువురు నాయకులు ఏకంగా గ్యాలరీల్లో కూర్చున్నారు. సభ వాయిదా పడేంతవరకు చంద్రబాబు అక్కడే ఉంటూ పక్కనున్న నాయకులకు ఎప్పకప్పుడు సూచనలు ఇవ్వడం కనిపించింది. ఈ దశలోనే మండలి చైర్మన్ మహ్మమద్ షరీఫ్ వికేంద్రీకరణ బిల్లుపై తనకున్న విచక్షణాధికారాన్ని వినియోగిస్తూ ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు ప్రకటించారు. ఈ బిల్లును చర్చకు చేపట్టినప్పుడు దాన్ని సెలెక్ట్ కమిటీకి నివేదించాలన్న ప్రతిపాదనను ఒక మోషన్ రూపంలో సభ ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. అలాంటి మోషన్ ఏదీ లేనప్పుడు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరంగానీ ఆవశ్యకతగానీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి మండలి సమావేశాల కోసం చైర్మన్ అధ్యక్షతన జరిగిన సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో స్పష్టంగా నిర్ణయాలు తీసుకున్నారు. సభలో అధికార పక్షంకన్నా ప్రతిపక్షం బలం ఎక్కువగా ఉన్న ఇలాంటి సందర్భాల్లో సభలో ఓటింగ్ నిర్వహించి బిల్లు ఆమోదం పొందినట్లో లేదా తిరస్కరించినట్లో చూడాల్సిన బాధ్యత మండలి చైర్మన్ పరిధిలో ఉంటుంది. ఇలా కాకుండా అనూహ్యమైన పరిస్థితులేవైనా తలెత్తినప్పుడు సభలో అన్ని పక్షాల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే సభాపతి ఒక నిర్ణయానికి రావడం ఒక సంప్రదాయంగా వస్తున్నదే కాకుండా ప్రజాస్వామిక విధానం కూడా. సభా సంప్రదాయాలు, రూల్స్ ఏవీ అంగీకరించని తరుణంలో చైర్మన్ ఖచ్చితంగా అన్ని పార్టీల అభిప్రాయాలను కోరాల్సి ఉంటుంది. అందులోనూ మెజారిటీ ఉంటేనే బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించాల్సి ఉంటుంది. ఇక్కడ అలా చేయకుండా రూల్స్ అంగీకరించనప్పటీ తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించుకుని బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు ప్రకటించడం విచిత్రం. ఈ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నవ్వుతూ వెళ్లడం కనిపించింది. -
బ్లాక్ డే కంటే ఘోరమైన రోజు : బుగ్గన
సాక్షి, అమరావతి : అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో ఈ రోజు బ్లాక్ డే కంటే ఘోరమైన రోజు అని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభలపై గౌరవం లేకుండా టీడీపీ వ్యవహరించిందని మండిపడ్డారు. బిల్లులను ఓటింగ్కు పెట్టకుండా.. టీడీపీ సభ్యులు ఛైర్మన్పై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ముందుగానే మోషన్ మూవ్ చేయాలని, కానీ ఛైర్మన్ అలా చేయకుండా డైరెక్ట్గా సెలెక్ట్ కమిటీకి పంపారన్నారు. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో ఛైర్మన్ వ్యవహరించారని ఆరోపించారు. నిబంధన ప్రకారం సెలక్ట్ కమిటీకి పంపొద్దని చెబుతూనే విచక్షణాధికారంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పడం సిగ్గు చేటన్నారు. అందరికీ నీతి నియమాలు చెప్పే యనమల రామకృష్ణుడు.. వికేంద్రీకరణ బిల్లుపై నిబంధనలు పాటించలేదన్నారు. మండలిలో తమకు ఉన్న సంఖ్యా బలాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ అన్ని ప్రాంతాల అభివృద్ధికి మోకాలొడ్డిందని విమర్శించారు. బిల్లులను అడ్డుకొని చంద్రబాబు ఏం సాధించారు? విచక్షణాధికారంతో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించానని ఛైర్మన్ ప్రకటించడం దారుణమని మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీకి ఈ రోజు బ్లాక్ డే అన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రెండు బిల్లులను శాసన సభలో ఆమోదించుకొని మండలికి వస్తే.. చర్చ జరపకుండా సెలెక్ట్ కమిటీకి పంపడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఛైర్మన్ వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుకు సిగ్గులేకపోతే.. ఛైర్మన్ అయినా ఆలోచించరా అంటూ అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు పార్టీలకతీతంగా వ్యవహరించాలని హితవు పలికారు. చంద్రబాబుకు తన స్వార్థం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదన్నారు. ఈ బిల్లులను అడ్డుకుని చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన చంద్రబాబు, ఛైర్మన్ షరీఫ్ చరిత్రహీనులుగా మిగిలిపోతారని మంత్రి బొత్స పేర్కొన్నారు. చదవండి: సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు -
సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు
సాక్షి, అమరావతి : అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి నివేదిస్తున్నట్లు మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రకటించారు. నిబంధనల ప్రకారం పంపకూడదని, తన విచక్షణాధికారాల మేరకే బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నామని ఛైర్మన్ ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి బిల్లులపై మండలిలో చర్చ జరిగింది. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో బిల్లులను సెలెక్ట్ కమిటీకి నివేదిస్తున్నట్లు టీడీపీ నోటీసు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సెలెక్ట్ కమిటీకి పంపవద్దని ఛైర్మన్కు మంత్రులు సూచించారు. సుదీర్ఘంగా దీనిపై చర్చ జరిగింది. మండలిలో తమకు ఉన్న సంఖ్యా బలాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ అన్ని ప్రాంతాల అభివృద్ధికి మోకాలొడ్డింది. మొదటి నుంచి వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తున్న టీడీపీ.. మరోసారి అదే ధోరణిని ప్రదర్శించి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపేలా ఛైర్మన్పై ఒత్తిడి తెచ్చింది. కాగా, బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని వైఎస్సార్సీపీ సభ్యులు తప్పుపట్టారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఛైర్మన్ వ్యవహరించారని ఆరోపించారు. -
ఎలాంటి మోషన్ మూవ్ కాలేదు: మండలి చైర్మన్
సాక్షి, అమరావతి: వికేంద్రీకరణ బిల్లును చర్చకు తీసుకున్న సమయంలో ఎలాంటి మోషన్ మూవ్ కాలేదని శాసన మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. సాంకేతికంగా మోషన్ మూవ్ అయితేనే ఏదైనా నిర్ణయం తీసుకోగలమని స్పష్టం చేశారు. ‘బిల్లు మూవ్ చేసిన తర్వాత యనమల మాట్లాడారు. అప్పుడు అశోక్బాబు నోటీసులు ఇచ్చారు’ అని పేర్కొన్నారు. కాగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ టీడీపీ సభ్యులు మండలిలో గందరగోళం సృష్టించారు. మంత్రులవైపు దూసుకువెళ్లారు. ఇక బిల్లును చర్చకు తీసుకున్నప్పుడు ఎలాంటి మోషన్ మూవ్ చేయలేదు కాబట్టి.. నిబంధనల ప్రకారం దానిని సెలెక్ట్ కమిటీకి పంపకూడదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. ‘కొంచెం ఉంటే కొట్టేవాడు..’ : చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్సీలు సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదు: బుగ్గన -
సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదు: బుగ్గన
సాక్షి, అమరావతి: వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. నిబంధనల ప్రకారం చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపకూడదని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై శాసన మండలిలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 13 జిల్లాల అభివృద్ధి కోసం ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్లో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో జ్యూడిషియల్ క్యాపిటల్, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉంటుంది. అమరావతిలో శాసన సభ, శాసన మండలి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉంటాయి’ అని పేర్కొన్నారు. ఇక చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు యనుమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. మంత్రులు సభలో ఉండకూడదంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై స్పందించిన బుగ్గన చైర్ను మీరెలా డిక్టేట్ చేస్తారని ప్రశ్నించారు. అదే విధంగా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న టీడీపీ సభ్యులకు సమాధామనిస్తూ... బిల్లును చర్చకు తీసుకున్నపుడు ఎలాంటి మోషన్ మూవ్ చేయలేదు కాబట్టి... ఇప్పుడు సెలెక్ట్ కమిటీ అంటూ కొత్త వాదనలను తెరమీదకు తీసుకురావడం సరికాదని హితవు పలికారు. ఈ క్రమంలో శాసన మండలిని 15 నిమిషాల పాటు చైర్మన్ వాయిదా వేశారు. చదవండి: మండలిలో లోకేష్కు సవాల్ విసిరిన మంత్రి బుగ్గన -
‘కొంచెం ఉంటే కొట్టేవాడు..’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో టీడీపీ సభ్యుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని అడ్డుకునేలా టీడీపీ చేస్తున్న కుయుక్తులపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరక్షన్లో.. టీడీపీ ఎమ్మెల్సీలు ఎలా యాక్షన్ చేశారో తెలిపే వీడియో ఒకటి బయటికొచ్చింది. మండలిలో తాము ఏ విధంగా రౌడీయిజం ప్రదర్శించామో టీడీపీ సభ్యులే స్వయంగా చంద్రబాబుకు వివరించారు. వారు అలా చెబుతుంటే చంద్రబాబు చాలా బాగా చేశారని వారిపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు.. టీడీపీ సభ్యులు బెజవాడ రౌడీయిజం అని ఓ ప్రాంతాన్ని అవమానించేలా మాట్లాడినా కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై పలువురు విస్తుపోతున్నారు. హుందాగా ఉండాల్సిన పెద్దల సభలో టీడీపీ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎమ్మెల్సీలతో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మీరు లోపల కూర్చున్నారు. నేను టీవీ దగ్గర కూర్చున్నా.. చాలా బాగా చేశారు. నేను ఒకటి.. రెండు సార్లు వచ్చి చూశాను. మిగతావి స్క్రోలింగ్ చూస్తున్నా.. ఎప్పుడూ మాట్లాడినా గొడవ పడ్డారు. వాళ్ల మంత్రులు రావటం.. మనవాళ్లు రావడం అంతా చూశాన’ని చెప్పారు. దీనికి బదులిచ్చిన తమ్ముళ్లు.. ‘అశోక్ బాబులో రౌడీని చూశామని.. మంత్రులు వచ్చినప్పుడు ఆయన ఏయ్.. ఏయ్ అని బాగా అరిచారు. కొంచెం ఉంటే కొట్టేవాడు. బెజవాడ రౌడీయిజం చూపెట్టాడ’ని చెప్పారు. టీడీపీ సభ్యులు అలా చెబుతుంటే చంద్రబాబు వారిని ఉత్సాహపరిచేలా కనిపించారు. -
టీడీపీ సభ్యులపై మండలి చైర్మన్ ఆగ్రహం..
సాక్షి, అమరావతి : ఆంధప్రదేశ్ శాసనమండలి సమావేశాలను అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం సభలో అనవసర రాద్ధాంతం సృష్టించిన టీడీపీ ఎమ్మెల్సీలు బుధవారం కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. దీంతో మండలి చైర్మన్ షరీఫ్ టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ ప్రసారాలు రావడం లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీలు బుధవారం మండలి వ్యవహారాలకు ఆటంకం కలిగించారు. టీవీ ప్రసారాలకు సాంకేతిక సమస్య తలెత్తిందని.. దానిని పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పినా కూడా టీడీపీ సభ్యులు వినిపించుకోలేదు. మంత్రి సమాధానంతో ఏకీభవించిన మండలి చైర్మన్ షరీఫ్.. టీడీపీ సభ్యులు ఆందోళన విరమించాలని ఆదేశించారు. అయితే టీడీపీ సభ్యులు మాత్రం చైర్మన్ చెప్పిన కూడా వినిపించికోకుండా.. టీవీ లైవ్ల కోసం ఆందోళన కొనసాగించారు. పదే పదే టీవీ ప్రసారాల పేరుతో టీడీపీ సభ్యులు మండలి సమావేశాలను అడ్డుకోవడంపై చైర్మన్ అసహనం చెందారు. టీవీ ప్రసారాలు తప్ప మరే అంశం లేదా అంటూ టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ముఖ్య విషయాలను దాచిపెట్టారు: ఇక్బాల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. శాసన మండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లుల(అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు)ను స్వాగతిస్తున్నామని తెలిపారు. పాలన వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి ఫలాలు పేదవారికి అందుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సహజ వనరులు ఉన్నాయని.. వాటిని అందిపుచ్చుకోవాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. ముఖ్య విషయాలను దాచిపెట్టారు.. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి ఐకానిక్ బిల్డింగులు అవసరమని గత ప్రభుత్వం ఆలోచించ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ విమర్శించారు. రాజధాని అంశంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా చంద్రబాబు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ‘అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఆహారలోటు ఏర్పడుతుందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. కానీ.. టీడీపీ శివరామకృష్ణన్ కమిటీలో ఉన్న ముఖ్యమైన విషయాలను దాచిపెట్టింది’ అని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని.. అందుకోసం రెండు బిల్లులను స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. -
బీటెక్ రవి వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వ్యాఖ్యలపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వికేంద్రీకరణపై శాసనమండలిలో బుధవారం చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదన్నారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొన్న చరిత్ర చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారని విమర్శించారు. చంద్రబాబుకు భగవంతుడు బుద్ధి చెప్పాలనే గత ఎన్నికల్లో 23మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీ సీట్లు వచ్చాయన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం తమకు లేదని మంత్రి తేల్చి చెప్పారు. బీటెక్ రవి అనుచితంగా మాట్లాడిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని విశ్వరూప్ కోరారు. చదవండి: ‘బాబు పాలనలో 150 రహస్య జీవోలు ఇచ్చారు’ థ్యాంక్యూ.. సీఎం సార్ -
చంద్రబాబుకు సోము వీర్రాజు చురకలు
సాక్షి, అమరావతి : పాలనా వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గత ప్రభుత్వ హయంలో రాజధాని పేరుతో టీడీపీ నేతలు భూములు కొట్టేశారని ఆరోపించారు. నాడు ప్రధాని మోదీ బొమ్మను గాడిదతో తన్నించిన చంద్రబాబు నేడు రాజధాని విషయంలో ఆయన జోక్యం కోరుతున్నారని చురకలంటించారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి జరిగిందని, రాష్ట్రం విడిపోయాక కూడా చంద్రబాబు అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించారని వీర్రాజు తెలిపారు. శాసన మండలిలో పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే ఇప్పుడు ఈ చర్చ జరుగుతోందని అన్నారు. కర్నూలును రాజధానిగా స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ చెప్పారు. ఈ బిల్లులో ప్రాంతీయ బోర్డులు ఉన్నాయని తెలిపారు. బందరు పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధం కావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కాపులు ఉద్యమిస్తే కేసులు బనాయించిన చరిత్ర టీడీపీదని అన్నారు. కాపు ఉద్యమం అణిచివేతకు గత ప్రభుత్వం ముద్రగడ స్వగ్రామంలో 3500 మంది పోలీసులను మోహరించిందని వీర్రాజు గుర్తు చేశారు. నారా లోకేశ్ చెప్పిన టీడీపీ అభివృద్ధి వివరాల్లో.. 70 శాతం కేంద్రం నిధులతో చేసినవేనని అన్నారు. చంద్రన్న బాట పేరుతో రాష్ట్రంలో వేసిన సిమెంట్ రోడ్లన్నీ కేంద్రం నిధులతో వేసినవేనని చెప్పారు. -
'తండ్రి జపాన్,సింగపూర్.. కొడుకేమో అమెరికా'
సాక్షి,అమరావతి : టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వైజాగ్లోని భూముల్ని యధేచ్చగా దోచుకున్నారని బుధవారం మంత్రి అవంతి శ్రీనివాస్ శాసనమండలిలో పేర్కొన్నారు. అప్పట్లో ఈ దోపిడిపై చంద్రబాబుకు తాను స్పష్టమైన ఆధారాలు ఇచ్చానని, అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అప్పట్లో విశాఖ రైల్వేజోన్ కూడా విజయవాడకు తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించారని తెలిపారు. అయితే అప్పట్లో స్థానిక ఎంపీలుగా తాను, సుబ్బం హరిబాబు అడ్డుకునేందుకు ప్రయత్నించామని, పదవీ రిజైన్కు కూడా సిద్ధపడ్డామని గుర్తుచేశారు. ఇప్పుడు వైఎస్ జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తానంటే చంద్రబాబు, నారా లోకేష్లు అదే పనిగా అడ్డుతగులుతున్నారని అవంతి మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో చంద్రబాబు జపాన్, సింగపూర్ అంటుంటే.. లోకేష్ అమెరికా అంటున్నారని, కానీ తాము మాత్రం శ్రీకాకుళం, విజయనగరం అంటున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేతలు విశాఖపై ఎందుకు విషం కక్కుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికి ఉత్తరాంధ్రలో పూర్తి స్థాయిలో విద్య, వైద్య సదుపాయాల్లేవని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు.ఇవాళ లోకేష్ ధర్నాలు, దీక్షలు, కేసుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని తెలిపారు. కాపుల రిజర్వేషన్ కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభంపై ఎన్ని కేసులు పెట్టారో మాకు తెలియనిది కాదా అని ప్రశ్నించారు. ఆ సమయంలో తాము కాపు అన్న ప్రతి ఒక్కరిని జైలుకు పంపించిన టీడీపీ వాళ్లు ఇప్పుడు ధర్నాలు , కేసుల గురించి మాట్లాడితే అపహాస్యంగా ఉందని విమర్శించారు. అమరావతిని తామ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని చెబుతున్న లోకేష్ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి ఎందుకు ఓడిపోయాడో చెప్పాలని ప్రశ్నించారు. భీమిలిలో తనపై పోటీ చేయడానికి లోకేష్ నాలుగుసార్లు సర్వే చేయించుకుఆన్నరని, ఓడిపోతాననే భయంతోనే మంగళగిరి నుంచి పోటీ చేసి అక్కడ కూడా ఓడిపోయారని అవంతి తెలిపారు. (మండలిలో నారా లోకేష్కు సవాల్ విసిరిన బుగ్గన) -
మండలిలో లోకేష్కు సవాల్ విసిరిన బుగ్గన
సాక్షి, అమరావతి: శాసన మండలి సాక్షిగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్... టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్కు సవాల్ విసిరారు. నవరత్నాలు అమలు కోసం చర్చిలు, మసీదులు, దేవాలయ భూములు అమ్ముకోవచ్చని ప్రభుత్వం జీవో ఇచ్చిందన్న నారా లోకేష్ వ్యాఖ్యలపై మంత్రి బుగ్గన అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం మసీదులు, చర్చిలు, దేవాలయాల భూములు అమ్ముకోవచ్చని ఎప్పుడూ జీవో జారీ చేయలేదని బుగ్గన స్పష్టం చేశారు. ఆ జీవో ఎక్కడుందో చూపించాలని సవాల్ విసిరిన బుగ్గన, కనీసం ఆ జీవో నెంబర్ అయినా చెప్పాలన్నారు. జీవో చూపించలేకపోతే సభకు నారా లోకేష్ క్షమాపణ చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. మరోవైపు మండలిలో నారా లోకేష్ సెల్ ఫోన్చూస్తూ ప్రసంగించడంపై మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలోకి సెల్ఫోన్ తీసుకు రావడం సాంప్రదాయాలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. -
‘బాబు పాలనలో 150 రహస్య జీవోలు ఇచ్చారు’
సాక్షి, అమరావతి : సాంకేతిక సమస్య వల్లే మండలి ప్రత్యక్ష ప్రసారాలకు అంతరాయం ఏర్పడిందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. ప్రత్యక్ష ప్రసారాలను ఇద్దరు మంత్రులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. టీవీ ప్రసారాలను ఆపే సంస్కృతి టీడీపీ నాయకులదేనని అన్నారు. టీడీపీ పాలనలో 150 రహస్య జీవోలు ఇచ్చారని గుర్తు చేశారు. బిల్లులపై చర్చలను అడ్డుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోతే.. రాజ్యాంగ సంక్షోభం వచ్చినట్లుగా టీడీపీ రాద్ధాంతం చేస్తోందని ఎద్దేవా చేశారు. బిల్లులపై సజావుగా చర్చ కొనసాగించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యక్ష ప్రసారాల విషయంలో.. సాంకేతిక సమస్య పరిష్కారానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. (చదవండి : ఏ ఎమ్మెల్సీని బెదిరించానో నిరూపించండి) రెండు బిల్లులు.. 3 గంటల చర్చ వాయిదా అనంతరం తిరగి ప్రారంభమైన శాసనమండలిలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులపై చర్చ ప్రారంభమైంది. ఈ రెండు బిల్లులపై మూడు గంటలపాటు చర్చించాలని మండలి నిర్ణయించింది. ఒక్కొక్క సభ్యుడికి మూడు నిముషాల పాటు మాట్లాడేందుకు వైస్ చైర్మన్ అవకాశమిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు 27 నిమిషాలు, టీడీపీ సభ్యులకు 84 నిమిషాలు, గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులకు 24 నిమిషాలు, పీడీఎఫ్ సభ్యులకు 15 నిమిషాలు, బీజేపీ సభ్యులకు 6 నిముషాలు, స్వతంత్ర సభ్యులకు 9 నిమిషాలు కేటాయిస్తున్నట్టు వైఎస్ చైర్మన్ వెల్లడించారు. అవసరమైన పక్షంలో మరో గంటపాటు అదనంగా చర్చిద్దామని ఆయన స్పష్టం చేశారు. (చదవండి : బిల్లులపై మండలిలో రగడ) -
మూడోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా కేంద్రాలపై శాసనసభలో చర్చ ప్రారంభించిన దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి టీడీపీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై చర్చ జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఇదిలాఉండగా.. ఏపీ శాసనమండలి సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్షణరావు పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చను ప్రారంభించారు. దీంతో పాటు సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుపై కూడా నేడు మండలిలో చర్చ జరుగనుంది. బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ మండలిలో మంగళవారం ఆయా బిల్లులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. (చదవండి) ఐయామ్ సారీ..! బిల్లులపై మండలిలో రగడ ఎస్సీ ఎస్టీ బిల్లుకూ అడ్డుపడతారా? -
బిల్లులపై మండలిలో రగడ
సాక్షి, అమరావతి: తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శాసన మండలిలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిపాలన వికేంద్రీకరణ బిల్లును, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. వీటిని ప్రవేశపెట్టే విషయమై ఉదయం సభ ప్రారంభం నుండి సాయంత్రం వరకు అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులు పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగించారు. సభలో బిల్లులు ప్రవేశపెట్టకుండా అడ్డుకునే ఉద్దేశంతో రూల్–71 కింద నోటీసు ఇచ్చి, దానిపై చర్చకు టీడీపీ పట్టుబట్టగా, బిల్లులు ప్రవేశపెట్టాలని అధికార పక్షం పదేపదే విజ్ఞప్తి చేసింది. దీనిపై నిర్ణయం తీసుకునే విషయంలో గందరగోళం నెలకొనడంతో మండలి చైర్మన్ షరీఫ్ పలుమార్లు సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి సభ ప్రారంభమైన అనంతరం చైర్మన్ అధికార, విపక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో మొదట రూల్–71పై చర్చించి ఆ తర్వాత బిల్లులు ప్రవేశపెట్టే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించారు. దీనిపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రభుత్వ బిల్లులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని.. సందర్భం లేకుండా రూల్–71ను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని.. రూల్–71 అంశంపై చర్చించిన అనంతరం బిల్లుల విషయమై ఆలోచిద్దామని అనడంతో మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ఏ అంశంపై అయినా జీఓ విడుదలైన తర్వాత దానికి సంబంధించిన విధానం చర్చకు వస్తుందని తెలిపారు. కానీ, రూల్–71పై చైర్మన్ ఇచ్చిన రూలింగ్ సరికాదని.. దానికంటే ముందు తమ బిల్లులనే తీసుకోవాలని కోరారు. అలాగే, మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత దానిపై ప్రతిపక్షం డివిజన్ కోరినా ఆమోదించినా, తిరస్కరించినా వారిష్టమని, అయితే ముందు బిల్లులు ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని కోరారు. సాయంత్రం రూల్–71పై నిర్వహించిన ఓటింగ్లో అనుకూలంగా 27మంది, వ్యతిరేకంగా 11మంది ఓటేశారు. తటస్థంగా తొమ్మిది మంది నిలిచారు. బిల్లులను అడ్డుకోవడం సరికాదు : కంతేటి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను అడ్డుకోవడం సరికాదని, విలువైన సూచనలు చేసి సహకరించాలని ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు సూచించారు. గతంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి వారికి తగినంత మంది సభ్యులు లేకపోయినా ప్రతిపక్ష సభ్యులు సహకరించి బిల్లులపై మండలిలో చర్చకు సహకరించిన విషయాన్ని గుర్తుచేశారు. మండలిని రద్దుచేసుకునే పరిస్థితిని తీసుకురావద్దని హితవు పలికారు. బిల్లులను అడ్డుకోవడం సరికాదు : పీడీఎఫ్ పీడీఎఫ్ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో బిల్లులు ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతున్నా వాటిని అడ్డుకోవడం సరికాదన్నారు. అసెంబ్లీలో అమోదం పొందిన బిల్లులు శాసనమండలికి వస్తే వాటిని అనుమతించకుండా చిన్నచిన్న సాంకేతిక కారణాలు చూపి గంటల తరబడి సభను స్తంభింపజేయడం ఏమిటని ప్రశ్నించారు. 13 ఏళ్లలో ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. బిల్లులపైనే మొదట చర్చ : బీజేపీ బీజేపీ సభ్యుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత రూల్–71 అంశంపై చర్చించేలా చూడాలని కోరారు. మరోవైపు.. తాము ప్రతిపాదించిన అంశంపైనే చర్చ జరగాలని టీడీపీ.. బిల్లులను ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సమయంలో మంత్రి బొత్స మరోసారి మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు చెప్పినట్లు చేస్తే ఎలాగని చైర్మన్ను ప్రశ్నించారు. చైర్మన్ పదవి గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని కోరారు. మళ్లీ గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. అనంతరం తిరిగి సమావేశమైన తర్వాత ఇరుపక్షాల మధ్య సమోధ్య కుదిర్చేందుకు చైర్మన్ షరీఫ్ ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో ప్రభుత్వం కోరిన విధంగా ముందు రెండు బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత రూల్–71 ప్రకారం చర్చ ప్రారంభించి మొత్తం మూడు అంశాలను కలిపి చర్చించేందుకు చైర్మన్ అనుమతించారు. అనంతరం.. మంత్రులు బుగ్గన, బొత్స రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. చర్చ అయినా ప్రారంభించండి లేదా బిల్లులను పాస్ చేయాలని చైర్మన్ను కోరారు. ఈ పరిస్థితుల్లో యనమల మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు సవరణలు ప్రతిపాదిస్తామని, సెలక్ట్ కమిటీకి పంపాలన్నారు. రూల్–71 అంశం, రెండు బిల్లులను విడివిడిగా చర్చించాలని కోరారు. అంతకుముందు సభలో ఇలా.. అంతకుముందు.. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ, అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో ఆమోదం కోసం పంపారని ప్రకటించారు. తర్వాత టీడీపీ సభ్యులు రూల్–71 ప్రకారం నోటీసు ఇచ్చారని పరిగనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ తదితర మంత్రులతో పాటు వైఎస్సార్సీపీ సభ్యులు కోరారు. అసెంబ్లీలో ఆమోదం పొంది సభకు వచ్చిన బిల్లుకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని.. నిబంధనలు కూడా ఇవే చెబుతున్నాయన్నారు. అదే రూల్–71 నోటీసుపై ఏడు రోజుల్లో ఎప్పుడైనా చర్చకు చేపట్టవచ్చన్నారు. చెడు సంప్రదాయాలకు నాంది పలకొద్దు రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ సభ్యులు కోరుతున్నట్లు రూల్–71 ప్రకారం ముందు చర్చకు అనుమతిచ్చి సభలో చెడు సంప్రదాయానికి నాంది పలకొద్దంటూ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, అవంతి శ్రీనివాసరావు, ఆళ్ల నాని, కె.నారాయణస్వామి, కొడాలి నాని, పేర్ని నాని, అనిల్కుమార్ యాదవ్, మోపిదేవి వెంకటరమణ, మేకపాటి గౌతంరెడ్డి, పుష్పశ్రీ వాణి, తానేటి వనిత, మేకతోటి సుచరితతో పాటు వైఎస్సార్సీపీ సభ్యులు చైర్మన్ను కోరారు. అయినప్పటికీ చైర్మన్ స్పందించకపోవడంతో అధికార పార్టీకి చెందిన సభ్యులు పలుమార్లు వెల్లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. వైఎస్సార్సీపీ సభ్యులు జంగా కృష్ణమూర్తి, వెన్నపూస గోపాల్రెడ్డి, షేక్ మహ్మద్ ఇక్బాల్, గంగుల ప్రభాకర్రెడ్డిలు పొడియం వైపు వెళ్లి బిల్లులపై మొదట చర్చించాలని పట్టుబట్టారు. ఇలా.. అధికార, విపక్ష సభ్యులు ఎవరికి వారు తమ వాదనకే కట్టుబడడంతో చైర్మన్ షరీఫ్ పలుమార్లు సభను వాయిదా వేశారు. చివరికి చైర్మన్ రూల్–71 కింద చర్చకు చైర్మన్ అనుమతిచ్చారు. చర్చలో టీడీపీ సభ్యులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సభలో సవాళ్లు, ప్రతిసవాళ్లతో గందరగోళం నెలకొంది. మరోవైపు.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులపై బుధవారం శాసన మండలిలో చర్చ చేపట్టనున్నారు. టీడీపీకి ఐదుగురు ఎమ్మెల్సీల షాక్ తెలుగుదేశం పార్టీకి ఐదుగురు ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారు. మూడు రాజధానులపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరికి మద్దతివ్వకుండా వారు ఝలక్ ఇచ్చారు. పోతుల సునీత, చదిపిరాల శివనాథరెడ్డి శాసన మండలిలో 71 రూలుపై జరిగిన చర్చకు నిర్వహించిన ఓటింగ్లో పార్టీకి నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. శత్రుచర్ల విజయరామరాజు, శమంతకమణిలు మండలికి గైర్హాజరై పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. మరో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏకంగా టీడీపీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఓటింగ్లో రూల్–71కి అనుకూలంగా 27 మంది, వ్యతిరేకంగా 11మంది ఓటు వేయగా 9 మంది తటస్థంగా ఉన్నారు. -
మండలిలో టీడీపీ సైంధవ పాత్ర
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లును మంగళవారం శాసనమండలిలోప్రవేశపెట్టనివ్వకుండా అడ్డుకునేయత్నం ద్వారా టీడీపీ సరి కొత్త సంప్రదాయానికి తెర తీసింది. ఈ బిల్లుపై శాసనసభలో సోమవారం సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ సభ్యులు ప్రయత్నించారు. చివరకు తమ వాదన వినిపించలేక వాకౌట్ చేశారు. శాసనసభలో సుదీర్ఘంగా చర్చించి.. ఆమోదించిన బిల్లును అడ్డుకోవడానికి ప్రతిపక్ష టీడీపీ శాసనమండలిలో రూల్ 71 కింద నోటీసు ఇవ్వడాన్ని రాజ్యాంగ నిపుణులు తప్పుబడుతున్నారు. శాసన మండలిలో సంఖ్యా బలంతో ఆ బిల్లును జాప్యం చేయడం మినహా అడ్డుకోలేమని తెలిసినా, టీడీపీ ఈ డ్రామాకు తెరతీయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతిలో తానూ, తన బినామీలు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తక్కువ ధరకే కొనుగోలు చేసిన భూముల ధరలు తగ్గకుండా చూడటానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా చేయడానికే చంద్రబాబు రూల్ 71ను తెరపైకి తెచ్చేలా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను శాసనమండలిలో సంఖ్యా బలంతో అడ్డుకునే యత్నం పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని రాజ్యాంగ నిపుణులు, సామాజిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల కూడా ఇదే తీరు.. శాసనమండలిలో టీడీపీ ఇలా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. ఎస్సీ వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఎస్సీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనకు సంబంధించిన బిల్లు విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించింది. పర్యవసానంగా చారిత్రక బిల్లులు చట్టాల రూపు సంతరించుకోవడంలో తీవ్రంగా జాప్యం చోటు చేసుకుంటోంది. ప్రజా సమస్యల పరిష్కారం.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా అర్థవంతమైన, లోతైన చర్చలకు వేదికగా నివాల్సిన శాసనమండలిని టీడీపీ ‘రాజకీయ’ కుయుక్తులకు వినియోగించుకుంటోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. భారత రాజ్యాంగంలోని 169వ అధికరణ ప్రకారం శాసనమండలిని ఏర్పాటు చేయాలన్నా, రద్దు చేయాలన్నా ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేయాలి. ఆ తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదిస్తే.. మండలి ఏర్పాటుకుగానీ, రద్దుకుగానీ ఆమోదముద్ర పడినట్లు లెక్క. శాసనసభ ఆమోదించిన బిల్లులపై మరింత అర్థవంతమైన చర్చలు జరిపి, వాటికి మెరుగులు దిద్ది.. జనరంజకంగా తీర్చి దిద్దడం శాసనమండలి ప్రధానోద్దేశమని భారత రాజ్యాంగం స్పష్టీకరిస్తోంది. కానీ, శాసన ప్రక్రియలో జాప్యం చోటు చేసుకోవడానికే శాసనమండలిని కొన్ని రాజకీయ పార్టీలు వినియోగించుకుంటున్నాయని, అందుకే దాన్ని ఉండుకంగా, ఆరవ వేలుగా రాజ్యాంగ నిపుణులు అనేక సందర్భాల్లో విశ్లేషించారు. ఇప్పుడు శాసనమండలిలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగ నిపుణుల విశ్లేషణకు అతికినట్లు సరిపోతుంది. శాసనసభలో విఫలం.. మండలిలో వితండవాదన సోమవారం శాసనసభలో పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపై తమ వాదనను వినిపించడంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు విఫలమయ్యారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఆ బిల్లును శాసనసభ ఆమోదించింది. నిబంధనల ప్రకారం ఈ బిల్లును శాసనమండలిలో మంగళవారం ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి ప్రతిపాదించింది. ఈ బిల్లును శాసనమండలిలో తిరస్కరిస్తే మళ్లీ అది శాసనసభకు వెళ్తుంది. ఆ బిల్లును శాసనసభ మరో సారి ఆమోదించి.. పంపితే శాసనమండలి దాన్ని ఆమోదించినా, తిరస్కరించినా.. ఆమోదించినట్లుగానే లెక్క. అంటే ఆ బిల్లు చట్టరూపాన్ని సంతరించుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ తొండాటకు దిగింది. ఈ బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టడానికి వీల్లేదని రూల్–71 కింద టీడీపీ నోటీసు ఇస్తూ.. చర్చ చేపట్టాలని వితండవాదనకు దిగింది. ‘రూల్–71 కింద చర్చకు అనుమతిస్తే ఇది ఒక సంప్రదాయంగా మారిపోతుంది.. ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా భావించి ప్రవేశపెట్టిన బిల్లులను ప్రతిసారీ అడ్డుకోవడానికి ఈ రూల్ను తెరపైకి తెస్తే ప్రజాభ్యుదయానికి విఘాతం కలుగుతుంది’ అని శాసన వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పదే పదే వి/æ్ఞప్తి చేసినా టీడీపీ పట్టించుకోక పోవడం వెనుక చంద్రబాబు, బినామీల ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారమే కారణమని రాజకీయ విశ్లేషకులు స్పష్టీకరిస్తున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు.. శాసనసభలో మెజార్టీ స్థానాలు సాధించిన పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధే లక్ష్యంగా శాసనసభ ఆమోదించిన బిల్లులను శాసనమండలిలో టీడీపీ సభ్యులు ప్రవేశపెట్టనివ్వకుండా అడ్డుకోవడం, తిరస్కరించడమంటే ప్రజా తీర్పును అవమానించినట్లేనని.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని రాజ్యాంగ నిపుణులు, మేధావులు అభివర్ణిస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ కోసం ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయడానికి వీలుగా శాసనసభ బిల్లును ఆమోదించింది. సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకోకుండా శాసనమండలి ఆ బిల్లులో మార్పులు చేస్తూ శాసనసభకు తిప్పిపంపేలా టీడీపీ చక్రం తిప్పింది. దీని వల్ల రెండు వేర్వేరు కమిషన్ల ఏర్పాటులో జాప్యం చోటు చేసుకుంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనకు వీలుగా శాసనసభ ఆమోదించిన ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్–1982 సవరణ బిల్లును కూడా ఇదే రీతిలో తిప్పి పంపేలా శాసనమండలిలో టీడీపీ సభ్యులు వ్యవహరించారు. దీంతో అది చట్టరూపం సంతరించుకోవడంలో జాప్యం ఏర్పడింది. దీంతో నిరుపేద వర్గాల విద్యార్థుల భవితను అంధకారంలోకి నెట్టడానికి టీడీపీ సభ్యులు ప్రయత్నించారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. రూల్ 71 అంటే.. ‘శాసనమండలిలో అధికారపక్షం విధానంపై ప్రతిపక్షం తన అభ్యంతరం లేదా అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ రూల్–71 కింద చైర్మన్కు నోటీసు ఇవ్వొచ్చు. ఈ నోటీసు అందిన వారం రోజుల్లోగా శాసనమండలిలో చర్చ చేపట్టాలి. ఈ రూల్ కింద ఇచ్చిన నోటీసుపై చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. ఇందులో ఆయా పక్షాల బలాబలాలను అనుసరించి బిల్లు ఆమోదం పొందడం/పొందక పోవడం ఉంటుంది. అయితే ఈ రూల్ కింద చర్చ చేపట్టే అంశం, బిల్లులోని అంశం ఒక్కటే అయితే సభలో ప్రవేశపెట్టకుండా తిరస్కరించడానికి వీల్లేదు. రూల్ 71కు, బిల్లులపై చర్చకు సంబంధం ఉండదు. ఆ బిల్లులను మళ్లీ సభలో చర్చకు తీసుకుంటారు. సభ్యులు దీనిపై సవరణలను ప్రతిపాదించవచ్చు. ఆ సవరణలను ప్రభుత్వం ఆమోదించడమో, లేదా తిరస్కరించడమో చేయొచ్చు. బిల్లును అడ్డుకునే అధికారం శాసనమండలికి లేదు శాసన ప్రక్రియలో శాసనమండలి ముందుకు వచ్చిన బిల్లుపై తన అభిప్రాయాన్ని చెప్పాలి కానీ ఆ బిల్లును అడ్డుకునే అధికారం లేదు. అసలు రూల్ 71 అనే నిబంధన శాసనసభ తీసుకొచ్చిన బిల్లులపై శాసనమండలి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఉద్దేశించింది కాదు. కేవలం ప్రభుత్వ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించే నిబంధన మాత్రమే. కానీ పరిపాలన వికేంద్రీకరణ విధాన రూపాన్ని దాటుకుని.. బిల్లుగా రూపం దాల్చింది కాబట్టి ఈ దశలో అభిప్రాయాన్ని చెప్పడం మండలి బాధ్యత. బిల్లు కన్నా ముందు విధానంపై అభిప్రాయాన్ని చెప్పడంలో అర్థం లేదు. కాబట్టి రూల్ 71 కింద నోటీసును అనుమతించడం తప్పుడు నిర్ణయం. – ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ -
మండలిలో టీడీపీకి షాక్
సాక్షి, అమరావతి : ఏపీ శాసన మండలిలో రూల్ 71పై ఓటింగ్ సందర్భంగా టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్సీలు గట్టి షాక్ ఇచ్చారు. ఓటింగ్లో సొంత పార్టీకే వ్యతిరేకంగా ఓటు వేశారు. టీడీపీ ప్రవేశపెట్టిన రూల్ 71కి వ్యతిరేకంగా ఆ పార్టీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్రెడ్డి ఓటేశారు. రూల్ 71కి అనుకూలంగా 27మంది, వ్యతిరేకంగా 11మంది ఓటు వేయగా.. 9 మంది తటస్థంగా ఉన్నారు. శాసన మండలిలో టీడీపీ సభ్యులు 32మంది ఉండగా.. ఇద్దరు సొంతపార్టీకే వ్యతిరేకంగా నడుచుకున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు శత్రుచర్ల, శమంతకమణి సభకు గైర్హాజరయ్యారు. ఓటింగ్ అనంతరం మండలిని రేపటికి వాయిదా వేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై రేపు మండలిలో చర్చ జరగనుంది. కాగా మంగళవారం ఉదయం నుంచి 71రూల్పై చర్చించాలని టీడీపీ పట్టుపట్టింది. ప్రభుత్వ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టకుండా గందరగోళం సృష్టించింది. టీడీపీ సభ్యుల తీరును అధికారం పక్షంతో పాటు బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు తప్పుపట్టారు. ఈ గందరగోళ పరిస్థితిలో ఛైర్మన్ రూల్ 71పై చర్చకు అనుమతించారు. ఓటింగ్ అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. -
మండలి ముందుకు వికేంద్రీకరణ బిల్లు
సాక్షి, అమరావతి : పదినిమిషాల విరామం తర్వాత ఏపీ శాసన మండలి తిరిగి ప్రారంభమైంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను పరిణగలోకి తీసుకుంటున్నట్లు మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. బిల్లుతో పాటు రూల్ 71పై కూడా చర్చిందామని సూచించారు. ఇప్పటికే చాలా సమయం వృధా అయిందని అసహనం వ్యక్తం చేశారు. రూల్ 71పై చర్చిద్దామంటే సభ ఆర్డర్లో ఉండట్లేదని అందుకే బిల్లులను పరిగణలోకి తీసుకుంటున్నాని చైర్మన్ వెల్లడించారు. దీంతో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులు మండలి ముందుకు వచ్చాయి. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. కాగా ఈ రెండు బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం విదితమే. మూడు రాజధానులు ఏర్పాటు అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సుధీర్ఘ చర్చల అనంతరం ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ.. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా బిల్లు ఆమోదం పొందింది. అనంతరం సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును సైతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది. చదవండి : మండలిలో గందరగోళం సృష్టిస్తోన్న టీడీపీ ‘మండలిని రద్దు చేసే అధికారం రాజ్యాంగంలో ఉంది’ -
‘మండలిని రద్దు చేసే అధికారం రాజ్యాంగంలో ఉంది’
సాక్షి, విశాఖపట్నం : శాసనమండలిని రద్దు చేసే అధికారం రాజ్యాంగంలో ఉందని వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు తెలిపారు. శాసన మండలిలో టీడీపీ అనవసరంగా రాద్ధాంతం సృష్టిస్తోందని మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం అద్భుతంగా ఉందన్నారు. ఆ ప్రసంగం చూడని వ్యక్తులు.. ఒక్కసారైనా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మూడు ప్రాంతాలకు అభివృద్దిని వికేంద్రీకరణ చేస్తూ సీఎం వైఎస్ జగన్ చారిత్రత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. శాసనసభలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లును మండలిలో అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. మండలి చైర్మన్కు ఒక బిల్లును అడ్మిట్ చేయాలా, వద్దా అనే అధికారం లేదన్నారు. ఏ బిల్లునైనా యథాతథంగా ప్రవేశపెట్టాలని చెప్పారు. మండలిలో చర్చ జరిగిన తర్వాత దానిని మద్దతు తెలుపాలా వద్దా అన్న అంశాన్ని సభ్యులు నిర్ణయిస్తారని చెప్పారు. టీడీపీకి మెజారిటీ ఉంటే మండలిలో సవరణలు కోరవచ్చన్నారు. కౌన్సిల్లో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని.. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఈ ప్రతిష్టంభన వెనక టీడీపీ ఉద్దేశమేమిటని చంద్రబాబును ప్రశ్నించారు. రాజ్యాంగ ప్రతిష్టంభన తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత బాధ్యతను కూడా చంద్రబాబు నెరవేర్చలేకపోతున్నారని విమర్శించారు. టీడీపీని ఉప ప్రాంతీయ పార్టీగా మారుస్తున్నారని అన్నారు. చంద్రబాబు 29 గ్రామాలకే పరిమితం అవుతారా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు అవసరం చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అమరావతి ఉంటే చాలు ఇతర ప్రాంతాలు వద్దంటున్నారని.. ఈ విషయాన్ని జనసేన కార్యకర్తలు గుర్తించాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ రాజకీయాలు తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. చదవండి : మండలిలో గందరగోళం సృష్టిస్తోన్న టీడీపీ -
మండలిలో గందరగోళం సృష్టిస్తోన్న టీడీపీ
సాక్షి, అమరావతి : నాలుగు గంటల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన ఏపీ శాసన మండలి కొద్దిసేపటికే మరో సారి వాయిదా పడింది. మండలిని 10నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. కాగా, ప్రభుత్వ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టకుండా టీడీపీ గందరగోళం సృష్టిస్తోంది. టీడీపీ సభ్యుల తీరును అధికారం పక్షంతో పాటు బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు తప్పుపట్టారు. సభలో ముందు బిల్లులపై చర్చ జరగాలని, ఆతర్వాతే రూల్ 71పై చర్చ జరపాలని చైర్మన్ను పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం కోరారు. చర్చ నిర్వహించే ముందు.. నిబంధనల ప్రకారం ముందు బిల్లులను పరిగణలోకి తీసుకోవాలని చైర్మన్ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విజ్ఞప్తి చేశారు. పరిగణలోకి తీసుకున్నాక చర్చకు తాము అంగీకరిస్తామని తెలిపారు. రూల్ 71పైచర్చ జరిగాకనే బిల్లులను పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పట్టుబడుతున్నారు. కాగా, ప్రతిపక్ష నేతలు ఇచ్చిన 71 నోటీసు అసలు వర్తించదని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయం జీవో కాకుండా పాలసీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ నోటీసు వర్తించదు కానీ చైర్మన్ మాట మీద గౌరవంతో ముందు బిల్లును పరిగణలోకి తీసుకొని తరువాత చర్చ చేపట్టాలని సూచించారు. ఉద్దేశపూర్వకంగా టీడీపీ ప్రభుత్వ బిల్లులను సభలో ప్రవేశపెట్టకుండా చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. చైర్మన్ అన్ని పార్టీలను సమానంగా చూడాలని కోరారు. రాజ్యాంగ విరుద్ధంగా టీడీపీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. సమయాన్ని వృధా చేయడం మంచి కాదు ప్రభుత్వ బిల్లులను పరిగణలోకి తీసుకొని చర్చ జరపాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విజ్ఞప్తి చేశారు. మండలి సమయాన్ని వృధా చేయడం మంచిది కాదన్నారు. బిల్లును పరిగణలోకి తీసుకున్న తర్వాత రూల్ 71పై చర్చ జరగాలని కోరారు. సభలో ఎప్పుడులేని పరిస్థితి ఈ సారి నెలకొందని అసహనం వ్యక్తం చేశారు. -
శాసనమండలిలో అమరావతిపై చర్చ
సాక్షి, అమరావతి: ‘రాజధాని విషయంలో తెలుగుదేశం సభ్యుల మాటల్లో వారు దోచుకున్నది, ఆక్రమించుకున్నది ఏమైపోతుందో అన్న భయం వారిలో కనబడుతోంది’ అని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో సోమవారం రాజధాని అమరావతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం చట్టాలను విస్మరించి భూములు లాక్కుంది. చట్ట ప్రకారం అసైన్డ్ భూములు కొనుగోలు చేయకూడదు. మొదట్లో సీఆర్డీఏ పరిధి 217 కిలోమీటర్లుగా నిర్ణయించారు. అయితే చంద్రబాబు బంధువు కోసం పరిధిని పెంచి 498 ఎకరాలు కేటాయించారు. ఎకరం రూ.లక్ష చొప్పున చంద్రబాబు తన బంధువుకు కేటాయించారు. ఇక తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం 102 అడుగులు పిల్లర్లు వేశారు. దీనివల్ల ఖర్చు పెరిగింది. అసైన్డ్ భూముల కొనుగోళ్లను రద్దు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. గతంలో శివరామకృష్ణ కమిటీ విజయవాడ, గుంటూరు మధ్య అతి సారవంతమైన భూములు ఉన్నాయని తెలిపింది. ఈ ప్రాంతం రాజధానికి అనువైనది కాదని తెలిపింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధానిపై జీఎన్రావు కమిటీ నివేదికను పరిశీలిస్తాం. నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం ఉంటుంది.’ అని తెలిపారు. -
శాసనసభ బీఏసీ సమావేశం రేపటికి వాయిదా
సాక్షి, అమరావతి: శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ అధ్యక్షతన సోమవారం శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. వారం రోజులు పాటు శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో తీర్మానం చేశారు. ఈనెల 9, 10, 11, 12, 13, 16, 17 తేదీలలో ఏడు పని దినాల్లో మండలి సమావేశాలు నిర్వహించాలని ఈ మేరకు బీఏసీ నిర్ణయం తీసుకొంది. డిసెంబర్ 14, 15 తేదీలు శని, ఆదివారాలు కావడంతో సభకు సెలవు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సమావేశమైన బీఏసీ తదుపరి సమావేశాన్ని రేపటికి వాయిదా వేసింది. సమావేశానికి శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు హాజరయ్యారు. -
పీఏసీ చైర్మన్గా పయ్యావుల కేశవ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) (ఛైర్మన్ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు. చైర్మన్గా పయ్యావుల కేశవ్తో పాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను, అలాగే ఎస్టిమేట్స్ కమిటీకి చైర్మన్గా రాజన్న దొర, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను నియమించారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీకి చైర్మన్గా చిర్ల జగ్గిరెడ్డితో పాటు సభ్యులుగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం గురువారం నియమించారు. పబ్లిక్ అకౌంట్ కమిటి సభ్యులుగా: 1. పయ్యావుల కేశవ్(చైర్మన్), 2. సంజీవయ్య కిలిబెటి, 3. కోలగట్ల వీరభద్ర స్వామి, 4. మేరుగు నాగార్జున, 5. భూమన కరుణాకర్రెడ్డి 6. కరణం ధర్మశ్రీ 7. జోగి రమేష్, 8. కెవి. ఉషశ్రీ చరణ్, 9.కాటసాని రాంభూపాల్ రెడ్డి, 10. బీద రవీచంద్ర, 11. డి. జగదీశ్వరరావు, 12. బాలసుబ్రమణ్యం, ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా: 1. రాజన్న దొర పీడిక(చైర్మన్), 2. అమర్నాథ్ గుడివాడ, 3. రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి, 4. కిరణ్ కుమార్ గొర్లె, 5. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, 6. అనిల్ కుమార్ కైలే, 7. మదిశెట్టి వేణుగోపాల్, 8. మండలి గిరిధర రావు, 9. ఆదిరెడ్డి భవాని, 10. దువ్వారపు రామారావు, 11. పరుచూరి అశోక్బాబు, 12. వెన్నపూస గోపాల్రెడ్డి పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యులుగా: 1. చిర్ల జగ్గిరెడ్డి(చైర్మన్) 2. గ్రంధి శ్రీనివాస్, 3. కిలారి వెంకటరోశయ్య, 4. జొన్నలగడ్డ పద్మావతి, 5. అన్నా రాంబాబు, 6. శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, 7. రవీంద్రనాథ్రెడ్డి, 8. చంద్రశేఖర్రెడ్డి, 9. వాసుపల్లి గణేష్ కుమార్10. వెంకట సత్యనారాయణ రాజు, 11. గుంజపాటి దీపక్రెడ్డి, 12. సోము వీర్రాజు -
ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. దీంతో శాసన మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ఎంఏ షరీఫ్ ప్రకటించారు. అంతకుముందు గోదావరి జలాలపై శాసన మండలిలో చర్చ సందర్భంగా జలవనరులశాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణతో కలిసి గోదావరి నీటి జాలాల మల్లింపుపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుపై ఎటువంటి నిర్ణయాలు రాకముందే టీడీపీ సభ్యులు గోలగోల చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నీటి లభ్యత వ్యవహారాలు చూసిన తరువాతే తెలంగాణతో చర్చలు మొదలయ్యాయని స్పష్టం చేశారు. చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్నట్టు.. చీకటి ఒప్పందాలు చేసుకునే సంస్కృతి తమది కాదని చురకలంటించారు. నాడు ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేటప్పుడు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ఎవరికీ అనుమానాలు లేవు.. పోలవరాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభిస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేస్తారని.. ఇది భగవంతుడి నిర్ణయమని అన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రాజెక్టులో రూ.100 కోట్లు తగ్గించిన తమ ప్రభుత్వం.. ప్రజాధనాన్ని కాపాడినట్లేనని అన్నారు. గోదావరి జలాలపై ప్రజలెవరికీ అనుమానాలు లేవని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడే పనులే సీఎం జగన్మోహన్రెడ్డి చేపడతారని వెల్లడించారు. ఇది తెలుగుదేశం సభ్యులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇక ఈ సమావేశాల్లో మండలిలో 9 బిల్లులు ఆమోదం పొందాయి. -
‘మహానేత ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తిచేస్తాం’
సాక్షి, అమరావతి : వెలిగొండ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర జలవనరులు శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడారు. దీనికి సమాధానంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి తవ్విన కాల్వలపై లిఫ్టు పెట్టి పట్టిసీమ పేరుతో గత ప్రభుత్వం తెగ హడావిడి చేసిందన్నారు. పట్టిసీమలో రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని కాగ్ తెలిపిందని గుర్తుచేశారు. మహానేత వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను తమ ప్రభుత్వంలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజక్టు మొదటి సొరంగ పనులను వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి చేసి నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పైన కూడా తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. అలాగే ప్రశ్నోత్తరాల సమయంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై కూడా మంత్రి అనిల్ మాట్లాడారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మహానేత వైఎస్సార్ మొదలుపెట్టారని గుర్తుచేశారు. 2012లో ఈ ప్రాజెక్టును రద్దు చేశారని తెలిపారు. ఎన్నికలకు నాలుగు నెలలు ఉందనగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు ఈ ప్రాజెక్టును మరోసారి మొదలుపెట్టారని విమర్శించారు. నాలుగేళ్లు ఈ ప్రాజెక్టును పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం.. ఎన్నికల ముందు దానిని ప్రారంభించడం చూస్తే వారికెంతా చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టుపై తమ ప్రభుత్వానికి పూర్తి క్లారిటీ ఉందన్నారు. -
రేషన్ డీలర్లను తొలగించే ప్రసక్తే లేదు
సాక్షి, అమరావతి : రేషన్ డీలర్లను తొలగించే ప్రసక్తే లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. గురువారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులనుంచి ఎదురైన ప్రశ్నలకు మంత్రులు సమాధానలిచ్చారు. ఈ సందర్భంగా రేషన్ కార్డులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. అక్టోబర్ 2 నుంచి గ్రామ వాలంటీర్ల ద్వారా కొత్త రేషన్ కార్డులిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల ద్వారా అర్హులు కాని వారికి కూడా రేషన్ కార్డు ఇచ్చారని వ్యాఖ్యానించారు. రేషన్ కార్డుల వ్యవస్థను గ్రామ సచివాలయాల ద్వారా పూర్తిగా ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. అర్హులకు మాత్రమే దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో రేషన్ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ 2 వరకు కొత్త రేషన్ కార్డుల ఇవ్వమని చెప్పారు. రేషన్ డీలర్లను స్టాక్ పాయింట్గా పెడతామని.. వారికి వచ్చే కమిషన్ను కొనసాగిస్తామని అన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. తెలుగు భాష అధికార ప్రతినిధిగా యార్లగడ్డ : అవంతి తెలుగు భాషపై సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నలకు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం తెలుగును నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. మాతృభాషను ప్రతి ఒక్కరు మర్చిపోవద్దన్నారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ను తెలుగు భాష అధికార ప్రతినిధిగా త్వరలోనే నియమించనున్నట్టు ప్రకటించారు. రాబోయే రోజుల్లో జీవోలను తెలుగులో విడుదల చేస్తామని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగులో బోర్డులు పెట్టేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తెలుగు భాష అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భూగర్భ డ్రైనేజీ పనులపై విచారణ జరిపిస్తాం : బొత్స గుంటూరు భూగర్భ డ్రైనేజీ నిర్మాణంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. గుంటూరు భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి కేంద్రం నుంచి రూ. 540 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. కానీ ఇప్పటివరకు రూ. 391 కోట్ల పని మాత్రమే జరిగిందన్నారు. భూగర్భ డ్రైనేజీకి రూ. 363 కోట్లు ఇవ్వాల్సి ఉండగా చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పటికీ రూ. 24 కోట్ల బిల్లు పెండింగ్లో ఉందన్నారు. భూగర్భ డ్రైనేజీ పనులపై అనేక ఆరోపణలు వస్తున్నాయని చెప్పిన ఆయన.. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ జరిపిస్తామన్నారు. డ్రైనేజీ పనులు త్వరగా పూర్తయ్యేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య రంగంలో సంస్కరణల కోసం సీఎం కమిటీ వేశారు : ఆళ్ల నాని రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జవాబిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 1145 ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల విషయంలో జీవో ఇచ్చిందని.. కానీ దానిని అమలు చేయలేదని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్యగ కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేయలేదన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో సంస్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కమిటీ వేశారని గుర్తుచేశారు. కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఐటీ విధానాన్ని పున సమీక్షిస్తాం : గౌతమ్రెడ్డి ఐటీ రంగంలో పెట్టుబడులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్రెడ్డి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు తెస్తామని చెప్పి.. కేవలం 30 వేల ఉద్యోగాలు మాత్రమే కల్పించిందని తెలిపారు. రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు తెస్తామని చెబితే.. కేవలం రూ. 1037 కోట్లు వచ్చాయన్నారు. ఐటీ విధానాన్ని పున సమీక్షిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలా తాము మాటలు చెప్పమని.. ఐదేళ్లలో ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఐటీ పేరుతో రియల్ ఎస్టేట్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయని.. వాటిని కచ్చితంగా పరిశీలిస్తామన్నారు. -
‘షరతులకు లోబడి లేకపోతే చర్యలు’
సాక్షి, అమరావతి: ప్రభుత్వం నుంచి భూములు పొందుతున్న విద్యా సంస్థలు షరతులకు లోబడి లేకపోతే వాటిపైన చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. శాసనమండలిలో శుక్రవారం రాజధాని పరిధిలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు భూ కేటాయింపులపై చర్చ జరిగింది. ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ రాజధానిలో విట్, అమృత, ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీలకు ఎకరం రూ. 50 లక్షల చొప్పున ఆరు వందల ఎకరాల భూమిని కేటాయించారని తెలిపారు. అలానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎకరం రూ. 50 లక్షల చొప్పున 25 ఎకరాల భూమని కేటాయించారని పేర్కొన్నారు. అయితే ఈ యూనివర్సిటీల్లో ఎక్కడా పిల్లలు ఫ్రీగా చదువుకునే అవకాశం లేదని బొత్స మండిపడ్డారు. విద్యా సంస్థలకు భూములు కేటాయించేటప్పుడు ప్రభుత్వం కొన్ని షరతులు విధిస్తుందని.. వాటిని అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులు ఇంకా ఒక్క పంట కూడా సాగు చేయలేదన్నారు. కానీ తమ ప్రభుత్వం వల్లే రైతు ఆత్మహత్యలు అంటూ టీడీపీ సభ్యులు తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో మొత్తం 1160 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. వారిలో కేవలం 454 మందికి మాత్రమే ఎక్స్గ్రేషియా ఇచ్చారన్నారు. మిగిలిన 706 మందివి రైతు ఆత్మహత్యలా కాదా అనే విషయాన్ని తమ ప్రభుత్వం విచారిస్తుందని.. అర్హులందరికి ఎక్స్గ్రేషియా ఇస్తామని తెలిపారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని.. రైతు సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందని బొత్స స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడితే ఆరోగ్యశ్రీ రద్దు: ఆళ్ల నాని 730 ప్రభుత్వ ఆస్పత్రుల్లో, 551 ప్రైవేట్ హాస్పటల్స్లో ఆరోగ్యశ్రీ పథకం అమలవుతుందని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హాయాంలో అస్తవ్యస్తంగా మారిన ఆరోగ్యశ్రీ పథకంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమూల మార్పులు తెచ్చారని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం అమలులో భాగంగా ఏ ఆస్పత్రిలోనైనా అవినీతికి పాల్పడితే.. అంతకు పది రెట్ల పెనాల్టీ వేస్తామని హెచ్చరించారు. అవసరమైతే అవినీతికి పాల్పడిన ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ రద్దు చేస్తామని హెచ్చరించారు. తమ ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి కింద రూ. 3వేల కోట్లు బడ్జెట్ ప్రేవశపెట్టామన్నారు. రైతులను అన్ని విధాల ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతు మిషన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
ఏపీ శాసన మండలి చైర్మన్గా ఎంఏ షరీఫ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్గా ఎంఏ షరీఫ్ ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం నిర్వహించిన ఎన్నికల్లో షరీఫ్ తరఫున ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు ప్రకటన వెలువడగానే ఆయన గురువారం మండలి చైర్మన్ పదవిని చేపట్టారు. మొన్నటివరకు శాసనమండలి చైర్మన్గా ఉన్న ఎన్ఎండీ ఫరూక్ను ఇటీవల చంద్రబాబు కేబినెట్లోకి తీసుకోవడంతో మండలి చైర్మన్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. -
ఉపాధ్యాయుల అరెస్టుపై భగ్గుమన్న ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ పోరాటం చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడంపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు భగ్గుమన్నారు. ఉపాధ్యాయుల అరెస్టులు ఆపేవరకు సభను జరగనివ్వమంటూ మండలిలో నినాదాలు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నిరసనతో మండలిలో గురువారం గందరగోళం నెలకొంది. సీపీఎస్ వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం తీరు, ఉపాధ్యాయుల అరెస్టు తదితర అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మండలి హాల్లో బైఠాయించారు. రాత్రి నుంచి ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారని, నిరసన తెలిపితే అరెస్టు చేస్తారా? అని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులను వెనక్కి తీసుకోవాలని, అరెస్టులను ఆపాలంటూ మండలి చైర్మన్తో ఎమ్మెల్సీలు వాగ్వాదానికి దిగారు. సీపీఎస్ విషయంలో తమ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తామని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. దీంతో కల్పించుకున్న మండలి డిప్యూటీ చైర్మన్.. సీపీఎస్ అంశంపై చర్చకు శుక్రవారం అనుమతి ఇస్తామని పీడీఎఫ్ ఎమ్మెల్సీలకు హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆందోళన విరమించారు.