promises
-
ధర్నాచౌక్ సాక్షిగా ప్రజాగ్రహం
సాక్షి, అమరావతి: ప్రజాగళం వినిపించే ప్రతిపక్షానికి చోటు లేకుండా చేసి ఆత్మస్తుతి–పరనింద ధ్యేయంగా మారిన అసెంబ్లీ సమావేశాలు ఒకపక్క జరుగుతుండగా, మరోపక్క కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు చేసిన ఆందోళనకు విజయవాడ ధర్నాచౌక్ కేంద్రంగా నిలిచింది. ఉద్యోగ, అంగన్వాడీ, ఆశా, వ్యవసాయ కార్మిక, ఉపాధి హామీ కూలీలు సహా 20కిపైగా విభాగాలకు చెందిన సామాన్య ప్రజానీకం తమ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తెచ్చేలా పది రోజులకుపైగా మండుటెండను సైతం లెక్క చేయకుండా సాగించిన ఉద్యమ హోరు కూటమి ప్రభుత్వంపై తక్కువ సమయంలోనే పెల్లుబికిన అసంతృప్తికి అద్దం పట్టింది. డిమాండ్లు నాలుగు నెలల్లోగా పరిష్కరించకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ప్రజానీకం అల్టిమేటం ఇచ్చింది. వెల్లువెత్తిన ఆందోళనలు.. » అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వేతనాల పెంపు, గ్రాట్యుటీ, తదితర డిమాండ్స్ నెరవేర్చాలని మహాధర్నాను నిర్వహించారు. » పెద్ద ఎత్తున ఫీజు పోరు, బకాయిల విడుదలకు ఆందోళన జరిగింది. » ఆశా వర్కర్లు కనీస వేతనం నెలకు రూ.26 వేలతోపాటు పలు డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ ధర్నాకు దిగారు. » వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, నెలకు రూ.10వేలు వేతనం హామీని నిలబెట్టుకోవాలని మహాధర్నా జరిగింది. » రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని, తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని, ఐదు నెలలుగా ఉన్న వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (వీఓఏ) ధర్నా నిర్వహించారు. » కనీస వేతనాలు వర్తింపజేయాలని ఏపీ గ్రామ పంచాయతీ కార్మికులు ఉద్యమించారు. » గ్రామ, వార్డు సచివాలయాల్లోని హెల్త్ సెక్రటరీలను వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తూధర్నా జరిగింది. » కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది పొట్టగొట్టేలా.. ఆప్కాస్ విధానం రద్దును విరమించుకోవాలని ఉద్యమించారు. » ఆరు నెలల్లో సమస్య పరిష్కరించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అగ్రిగోల్డ్ బాధితులు అల్టిమేటం ఇచ్చారు. » డప్పు కళాకారుల రిజిస్ట్రేషన్ పేరుతో పెన్షన్ తొలగించడంపై ధర్నా నిర్వహించారు. » ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులకు నెలవారి పెన్షన్ రూ.10 వేలకు పెంచాలని కోరుతూ ధర్నా చేశారు. » నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి ఆదుకోవాలంటూ కాటికాపరులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. » మిలియపుట్టి సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను ఏర్పాటు చేయాలని ఆదివాసీలు ధర్నా చేశారు. » మెప్మా, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు, ఉపాధి హామీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు తదితర అనేక విభాగాలకు చెందిన వారు కూటమి ప్రభుత్వం హామీలిచ్చి మోసం చేసిందని ధర్నాచౌక్లో నినదించారు. -
బాబు పెట్రో బాదుడు రూ.5,256 కోట్లు
సాక్షి, అమరావతి: ఒకవైపు సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టి అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు సర్కారు మరోవైపు వీలైనన్ని మార్గాల్లో జనం జేబులకు చిల్లు పెడుతోంది. ఎన్నికల వాగ్దానం ప్రకారం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేకూర్చాల్సింది పోయి పన్నుల బాదుడుతో నిలువు దోపిడీ చేస్తోంది. సంపద సృష్టించి పథకాలను అమలు చేస్తానంటూ నమ్మించిన ప్రభుత్వ పెద్దలు నడ్డి విరిగేలా రూ.వేల కోట్ల భారం వడ్డిస్తున్నారు.ఇప్పటికే విద్యుత్తు చార్జీలను పెంచి రూ.15 వేల కోట్లకుపైగా భారాన్ని జనం నెత్తిన మోపిన కూటమి సర్కారు పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామన్న హామీని నెరవేర్చకుండా తొమ్మిది నెలల్లో వాహనదారుల నుంచి ఏకంగా రూ.5,256 కోట్లకుపైగా వసూలు చేసింది. తద్వారా మరో ఎన్నికల హామీకి తిలోదకాలిచ్చింది. తాము అధికారంలోకి వస్తే పెట్రోలుపై లీటర్కు రూ.16 చొప్పున ధరలు తగ్గిస్తామని ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ నమ్మబలికారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్ పెట్రోలు బంకులు, ఆటో డ్రైవర్లు వద్దకు వెళ్లి అధికారంలోకి రాగానే గ్రీన్ట్యాక్స్ రద్దుతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ హామీలిచ్చారు. ఇక 2021 నవంబర్లో పెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.పెట్రోలుపై లీటర్కు రూ.16 వరకు ధర తగ్గించాలని నాడు చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంధన ధరలపై గగ్గోలు పెట్టిన ఆయన అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మరిచారు. ఇది చాలదన్నట్లు ప్రకృతి వైపరీత్యాల నిధి పేరిట అదనపు సెస్ విధించేందుకు ఫైళ్లను సిద్ధం చేయడం గమనార్హం.రూ.5,256 కోట్లు తిరిగి కట్టాల్సిందేప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోలుపై లీటర్కు రూ.16 చొప్పున ధర తగ్గించాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. దాన్ని అమలు చేయాలని ఇప్పుడు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. మన రాష్ట్రంలో రోజూ సుమారు 35.66 లక్షల లీటర్ల పెట్రోలు, 86.01 లక్షల లీటర్ల డీజిల్ అమ్ముడవుతున్నట్లు ఏపీ పెట్రో డీలర్స్ అసోసియేషన్స్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 270 రోజుల్లో ప్రజల నుంచి కనీసం రూ.5,256 కోట్లు ముక్కుపిండి వసూలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల హామీ అమలులో భాగంగా తక్షణం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించడంతోపాటు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు కూటమి నేతల హామీలను సామాజిక మాధ్యమాల్లో రీ పోస్ట్ చేస్తున్నారు. ‘‘వచ్చారు సరే.. తగ్గించరేం..?’’ అంటూ కూటమి సర్కారును నిలదీస్తున్నారు.సరిహద్దు జిల్లాల్లో బంకులు వెలవెలఇక్కడ ధరలు అధికంగా ఉండటంతో ఏపీ సరిహద్దు జిల్లాల్లో వాహనదారులంతా పక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో తమిళనాడు, కర్నాటక సరిహద్దు జిల్లాల్లోని పెట్రోలు బంకుల యజమానాలు వ్యాపారాలు లేక లబోదిబోమంటున్నారు. తమిళనాడు కంటే మన రాష్ట్రంలో పెట్రోలు ధర లీటరుకు రూ.7.99 అధికంగా ఉండగా కర్నాటక కంటే రూ.5.89 ఎక్కువగా ఉంది. యానాం కంటే మన రాష్ట్రంలో పెట్రోలు లీటర్కు రూ.12.77 అధికంగా ఉంది. ఇవన్నీ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. » ‘కేంద్ర ప్రభుత్వంతోపాటు 12 రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాయి. మరి మీరెప్పుడు (నాటి సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి) తగ్గిస్తారు? ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే వరకు టీడీపీ పోరాటం ఆగదు. దీనిపై అన్ని పెట్రోల్ బంక్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ.16 తగ్గించి తీరాలి..’– 2021 నవంబర్ 5న మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు డిమాండ్» ‘డీజిల్ రేటు ఎంత..? కర్నాటకలో కొట్టించుకుంటున్నావా..? ఆంధ్రాలో అంత తక్కువ రేటు ఎక్కడుందబ్బా అనుకుంటున్నా..! వచ్చేది మేమే.. తగ్గించేది మేమే..!! దోచుకోవడంలో ఈ ప్రభుత్వం ఎవరినీ మినహాయించడంలేదు. మా ప్రభుత్వం రాగానే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తాం. అడ్డగోలు చలానా విధానానికి స్వస్తి పలుకుతాం. ఆటో యూనియన్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమాన్ని అందిస్తాం. ప్రమాదంలో చనిపోయిన వారికి చంద్రన్న బీమా ద్వారా రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకుంటాం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం..’– 2023 మార్చి 27న పుట్టపర్తి యువగళం పాదయాత్రలో నారా లోకేశ్కర్ణాటక వెళ్లొస్తున్నాం..పెట్రోల్, డీజిల్ ధరలపై గగ్గోలు పెట్టిన నారా లోకేష్ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఎందుకు తగ్గించడం లేదు? మేం కర్ణాటక వెళ్లి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అక్కడికి, ఇక్కడికి ధరలో చాలా వ్యత్యాసం ఉంది. – ఎస్ రామకృష్ణారెడ్డి, చిలమత్తూరు, కర్ణాటక సరిహద్దు మండలంరూ.6 తక్కువకే..ఏపీలో లీటర్ పెట్రోల్ సుమారు రూ.110 ఉంటే కర్ణాటకలో రూ.104 మాత్రమే ఉంది. ఏపీ కంటే కర్ణాటకలో రూ.6 తక్కువగా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలి. – ఇంతియాజ్ అహమ్మద్, బసవనపల్లి, అమరాపురం మండలంరాష్ట్రంలో రోజుకు సగటు విక్రయాలు..పెట్రోలు: 35,66,066.66 లీటర్లుడీజిల్: 86,01,966 లీటర్లురోజుకు పెట్రోల్, డీజిల్ కలిపి 121.67 లక్షల లీటర్లు270 రోజులకు 328.50 కోట్ల లీటర్ల వినియోగం.. ఆ లెక్కన లీటరుకు రూ.16 చొప్పున తగ్గించకుండా చంద్రబాబు ప్రజల ముక్కుపిండి వసూలు చేసిన మొత్తం రూ.5,256 కోట్లు -
తగినంత గ్యారంటీ
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీల పేరుతో రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలతో పాటు మహిళలు, రైతులు, విద్యార్థులకు వర్తించే ఇతర సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ 2025–26 సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం తదితర రంగాలకు చూపెట్టిన గణాంకాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని అంటున్నాయి. ఆరు గ్యారెంటీలతో పాటు అన్ని సంక్షేమ పథకాలకు కలిపి ఈసారి బడ్జెట్లో రూ.90,500 కోట్లు ప్రతిపాదించినట్లు వెల్లడించాయి. ఆరు గ్యారంటీల కింద రూ.56,084 కోట్లు, స్కాలర్ షిప్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రాజీవ్ యువ వికాసం (కొత్త పథకం), డైట్ చార్జీలు, రైతు బీమా, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, విద్యుత్ సబ్సిడీలు, రేషన్ బియ్యానికి మరో రూ. 34,416 కోట్లు ప్రతిపాదించినట్లు చెబుతున్నాయి. ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహలక్ష్మి, గృహజ్యోతి, సన్న ధాన్యానికి బోనస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలకు నిధులు కేటాయించినట్లు ఆ వర్గాలు వివరిస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్అప్పుల విషయానికి వస్తే 2024–25లో ప్రతిపాదించిన మొత్తానికి రూ.7,500 కోట్లు అదనంగా రూ.69 వేల కోట్లకు పైగా సమీకరించాలని ఈ బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో బహిరంగ మార్కెట్ రుణాలు రూ.64,539 కోట్లు కాగా, కేంద్రం నుంచి, ఇతర రుణాలు కలిపి మొత్తం రూ.69 వేల కోట్లు చూపెట్టారు. ఇది మొత్తం బడ్జెట్లో 21 శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం. అప్పులు తీసుకోవడంతో పాటు అప్పులు చెల్లించే పద్దును కూడా ఈసారి పెంచారు. గతంలో చేసిన అప్పులకు వడ్డీ, అసలు చెల్లింపు కింద రూ. 35,217 కోట్లు చూపెట్టారు. ఇది మొత్తం బడ్జెట్లో దాదాపు 11.5 శాతం. పెరిగిన పన్ను ఆదాయం అంచనాలుబడ్జెట్లో పేర్కొన్న రెవెన్యూ రాబడుల గణాంకాలను పరిశీలిస్తే..ఈసారి రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం పద్దు భారీగా కనిపిస్తోంది. గత బడ్జెట్తో పోలిస్తే సుమారు రూ.7 వేల కోట్లు అదనంగా పన్ను రాబడుల కింద చూపెట్టారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.1.38 లక్షల కోట్ల పన్ను ఆదాయ ప్రతిపాదనలు చేయగా, రూ.1.29 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి రూ.1.45 లక్షల కోట్లను రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం కింద చూపెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర పన్నుల్లో వాటాను కలుపుకొంటే ఈ ఆదాయ గణాంకాలు రూ.1.75 లక్షల కోట్లకు చేరాయి. వీటికి తోడు పన్నేతర ఆదాయం, గ్రాంట్ ఇన్ ఎయిడ్లను కలిపి మొత్తం రూ.2.29 లక్షల కోట్ల రెవెన్యూ రాబడులను ప్రతిపాదించారు. గత ప్రతిపాదనల కంటే ఇది రూ.8 వేల కోట్లు ఎక్కువ. గత బడ్జెట్లో రూ.2.21 లక్షల కోట్లు రెవెన్యూ రాబడుల కింద చూపెట్టగా, సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.2.02 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. అంటే రెవెన్యూ రాబడులు అంచనాల కంటే రూ.20 వేల కోట్లు తగ్గాయి. అయినా, ఈసారి రెవెన్యూ రాబడులను రూ.2.29 లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. విద్య, వైద్యానికి కాస్త ఎక్కువగా..ప్రధాన శాఖల వారీగా పరిశీలిస్తే విద్యా శాఖకు గత ఏడాది కంటే రూ.2 వేల కోట్లు అధికంగా రూ.23 వేల కోట్ల వరకు ప్రతిపాదించారు. వైద్యరంగానికి గత ఏడాది కంటే రూ.800 కోట్లు అధికంగా రూ.12,393 కోట్లు ప్రతిపాదించారు. రైతు రుణమాఫీ చేసిన నేపథ్యంలో వ్యవసాయ రంగానికి గత ఏడాది కంటే కొంచెం తక్కువ నిధులను కేటాయించారు. గత ఏడాది వ్యవసాయ శాఖకు రూ.26,500 కోట్లు ప్రతిపాదించగా, ఈసారి రూ.24,500 కోట్లు చూపెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు కలిపి ఈసారి రూ.34,070 కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 31,605 కోట్లను ప్రతిపాదించారు. ఈసారి కల్యాణలక్ష్మి పథకానికి ప్రత్యేకంగా రూ.3,683 కోట్లు, విద్యార్థుల స్కాలర్షిప్లు, డైట్ చార్జీల కింద రూ.7 వేల కోట్లకు పైగా నిధులు చూపెట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.12 వేల కోట్లు, ఆర్టీసీకి రూ.4,305 కోట్లు కేటాయించారు. సవరణల బడ్జెట్లో భారీ వ్యత్యాసం2024–25 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలను పరిశీలిస్తే ప్రతిపాదనలకు, సవరణల బడ్జెట్కు మధ్య భారీ వ్యత్యాసం కన్పిస్తోంది. 2024–25 వార్షిక బడ్జెట్లో మొత్తం వ్యయం రూ.2,91,059 కోట్లుగా ప్రతిపాదించగా, సవరించిన అంచనాల మేరకు అది రూ.2,66,034.51 కోట్లకు తగ్గింది. ఈ సవరించిన అంచనాలకు మరో రూ.40 వేల కోట్లను కలిపి ఈసారి బడ్జెట్ మొత్తం వ్యయాన్ని రూ.3,04,965 కోట్లుగా ప్రతిపాదించారు. పన్ను రాబడుల కింద రూ.1.38 లక్షల కోట్లు వస్తాయని 2024–25 బడ్జెట్లో ప్రతిపాదించగా, సవరించిన బడ్జెట్లో అది రూ.1.29 లక్షల కోట్లకు తగ్గింది. పన్నేతర ఆదాయం రూ.35 వేల కోట్ల వరకు వస్తుందని అంచనా వేయగా, రూ.10 వేల కోట్ల మేర తగ్గి రూ.25 వేల కోట్లుగా నమోదైంది. 2024–25లో రూ.21,636 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు కింద వస్తాయని అంచనా వేయగా, రూ.19,836 కోట్లు మాత్రమే సమకూరినట్లు సవరించిన అంచనాలు వెల్లడిస్తున్నాయి. అప్పుల కింద 2024–25లో ప్రతిపాదించిన మొత్తంలో సింహభాగం సమకూరింది. అన్ని రకాల రుణాలు కలిపి రూ.62 వేల కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.60 వేల కోట్లకు పైగా సమకూరాయి. -
షుగర్స్ పునఃప్రారంభంలో ని‘జామ్’!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్స్ పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసినప్పటికీ.. మళ్లీ సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ కొంత ప్రక్రియ పూర్తి చేసింది. ప్రైవేటు యాజమాన్యం పరిధిలోని ఈ ఫ్యాక్టరీకి చెందిన రూ.400 కోట్ల బ్యాంకుల బకాయిలకు సంబంధించి, వన్టైం సెటిల్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.190 కోట్లు చెల్లించింది. 2025 డిసెంబర్ నాటికి ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటించినప్పటికీ.. అది మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆలస్యంగానైనా.. పబ్లిక్ సెక్టార్లోనా, ప్రైవేటు సెక్టార్లోనా, సహకార విధానంలో ప్రారంభిస్తారా? అనే అంశంపై కూడా స్పష్టత లేకుండా పోయింది. మరోవైపు క్షేత్రస్థాయిలో సన్నద్ధత విషయంలో ఇప్పటికీ గందరగోళమే నడుస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది క్రషింగ్ సీజన్ (అక్టోబర్ నుంచి డిసెంబర్) నాటికి సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. ప్రభుత్వం నుంచి సైతం స్పష్టమైన ప్రకటన రావడం లేదు. బోధన్ ఫ్యాక్టరీని మరో చోటికి తరలించి.. కొత్త యంత్రాలతో నడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. రైతులతో విడతల వారీగా కమిటీ చర్చలు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీలో సభ్యుడైన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ రైతులతో విడతలవారీగా ముఖాముఖి చర్చలు జరిపింది. చెరుకు సాగును ప్రోత్సహించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, షుగర్ కేన్ బోర్డు రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గొన్నారు. మరోవైపు ప్రస్తుతం ఫ్యాక్టరీ స్థితిగతులు, యంత్రాల పరిస్థితిని నిపుణుల బృందం పరిశీలిస్తోంది. తరువాత వారి నివేదిక మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. నిపుణుల బృందం నివేదిక ప్రభుత్వం వద్దకు వెళ్లి దని ప్రచారం జరుగుతోంది. నివేదికలో ఏముందో బయటకు రాలేదు. మరోవైపు చెరుకు సాగుపై రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం విధానపరంగా ఫ్యాక్టరీ పునఃప్రారంభం విషయమై స్పష్టత ఇవ్వలేదు. రైతులు గణనీయమైన స్థాయిలో చెరుకు పంటను పండించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తేనే.. షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పునఃప్రారంభానికి అడుగులు మరింతగా పడాలంటే చెరుకు సాగు విస్తీర్ణమే ప్రధానం కానుంది. బోధన్ (ఉమ్మడి నిజామాబాద్), మంబోజిపల్లి (ఉమ్మడి మెదక్), ముత్యంపేట (ఉమ్మడి కరీంనగర్) జిల్లాల్లో నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీలున్నాయి. 2002లో ప్రైవేటుకు విక్రయించిన చంద్రబాబు ప్రభుత్వం.. నిజాం షుగర్స్ యూనిట్లను 2002లో డెల్టా పేపర్ మిల్స్ అనే ప్రైవేటు సంస్థకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విక్రయించింది. 2014లో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ నిజాం షుగర్స్ను ప్రభుత్వపరం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా 2015 డిసెంబర్ 23న ఫ్యాక్టరీ మూడు యూనిట్లకు లేఆఫ్ ప్రకటించారు. 2005–06లో చెరుకు దిగుబడి 35 వేల టన్నులున్నప్పటికీ నడిపిన ఈ కర్మాగారాలను.. 2015లో దిగుబడి లక్ష టన్నులకు పెరిగినా మూసేయడం గమనార్హం. దీంతో రైతులు వరి పంట వైపు మళ్లారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలున్న బోధన్, ముత్యంపేట, మంబోజిపల్లి ప్రాంతాల్లో రైతులు గణనీయమైన విస్తీర్ణంలో చెరుకు పంట పండించేందుకు ముందుకు వస్తేనే.. ప్రభుత్వం ఫ్యాక్టరీల పునఃప్రారంభం విషయంలో మరింత వేగంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు చెరుకు సాగు చేయడంపై ఆసక్తి నెలకొంది. -
14 నెలలైనా.. హామీల అమలులో అదే కాలయాపన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు ప్రకటించి, అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఆ హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి మండిపడ్డారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ బీజేపీ అని, తాము చేయలేకపోయిన హామీలను ఇంకొకరి మీద వేసి, వారు అడ్డుకుంటున్నారు అని ఎప్పుడూ ఎవరినీ నిందించలేదని పరోక్షంగా సీఎం రేవంత్రెడ్డిని కిషన్రెడ్డి విమర్శించారు. కొత్త ప్రాజెక్టుల పేరు మీద రూ. 1.5 లక్షల కోట్లు కావాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం చిన్నపిల్లల నవ్వులాటలా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్థిక వనరులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని కిషన్రెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో భారతీయ పురాతన చేతివృత్తుల వైభవాన్ని గుర్తుచేస్తూ రచించిన ‘వూట్జ్: ద ఫర్గాటెన్ మెటల్ క్రాఫ్ట్ ఆఫ్ డెక్కన్’పుస్తకాన్ని కిషన్రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, తన వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజల దృష్టి మళ్లించడానికి కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతున్నారని విమర్శించారు. ఇది దివాలాకోరు విధానం, బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 7.5 లక్షల కోట్లు అప్పు చేసిందని, తమకు తెలియదని, రాష్ట్ర అప్పు రూ.3.5 లక్షల కోట్లే అనుకున్నానని రేవంత్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను కిషన్రెడ్డి తప్పుబట్టారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నానని, హామీలు అమలు చేయలేకపోతున్నానంటూ ముఖ్యమంత్రి మాట మార్చడం రాహుల్గాం«దీ, రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతకు అద్దం పడుతోందని కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు తామే హామీ ఇచ్చామని, తప్పకుండా అమలు చేస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా, మహిళలకు ఇచ్చిన హామీలు, జాబ్ కేలండర్, నిరుద్యోగ భృతి, రైతులు, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, పెన్షన్లు సహా ఇచి్చన అన్ని హామీల గురించి ప్రస్తావిస్తామన్నారు. వీటన్నింటి గురించి శాసనసభలో చర్చిస్తే బాగుంటుందని కిషన్రెడ్డి సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో రాష్ట్రాన్ని దోపిడీ చేశారని, రియల్టర్లను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామన్న భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తనపై వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు. తనను ఎవరు తిట్టినా వారి విజ్ఞతకే వదిలేస్తానని చెప్పారు. -
హామీలు రద్దు.. మోసాల పద్దు!
సాక్షి, అమరావతి: ‘‘బాబు ష్యూరిటీ అంటే... చరిత్ర చూడని మోసాలు గ్యారెంటీ!’’ అని బడ్జెట్ పుటల సాక్షిగా మరోసారి రుజువయ్యాయి! ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా ఎగ్గొడుతూ.. ఇస్తున్న ఒకటో రెండో పథకాలకు కూడా కోతలు, కత్తిరింపులు విధిస్తూ... లక్షల మంది లబ్ధిదారులను తగ్గిస్తూ.. పిల్లల నుంచి అవ్వల దాకా అన్ని వర్గాలను మోసం చేస్తూ.. సూపర్ సిక్స్కు ఎగనామం పెడుతూ సీఎం చంద్రబాబు సర్కారు శుక్రవారం అసెంబ్లీకి బడ్జెట్ను సమర్పించింది. సూపర్ సిక్స్ సహా హామీలన్నీ విస్మరించి పిల్లలు, మహిళలు, నిరుద్యోగులు, యువత, రైతన్నలు.. ఇలా అన్ని వర్గాలను దగా చేసింది. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అని హామీ ఇచ్చి ఆ ఊసే లేకుండా చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో ఏడాదిగా యువత నెలకు రూ.3 వేల చొప్పున నష్టపోతోంది. 1.60 కోట్ల మందికి ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేల ఆర్థిక సాయాన్ని మరోసారి ఎగ్గొట్టడంతో మహిళలు ఏడాదికి సుమారు రూ.28,800 కోట్లు కోల్పోతున్నారు! ఇక ‘తల్లికి వందనం’ అంటూనే బడ్జెట్లో రూ.3 వేల కోట్లకుపైగా కోత పెట్టారు! అన్నదాతా సుఖీభవ అమలుకు కావాల్సింది రూ.10,717 కోట్లైతే బడ్జెట్లో ఇచ్చింది కేవలం రూ.6,300 కోట్లే! ఈ లెక్కన 22 లక్షల మందికిపైగా రైతులు రూ.4,417 కోట్ల పెట్టుబడి సాయానికి దూరం కానున్నారు. గతేడాది మొండి చెయ్యి చూపడంతో రైతన్నలు ఇప్పటికే రూ.పది వేల కోట్లకుపైగా నష్టపోయారు. ఇక ఇప్పటికే దాదాపు రెండు లక్షల పెన్షన్లను తగ్గించగా తాజా బడ్జెట్ కేటాయింపుల్లో రూ.5 వేల కోట్లకుపైగా కోత విధించటాన్ని బట్టి మరిన్ని పింఛన్లను ఎగరగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వెరసి.. ప్రణాళిక – ఆలోచనల సమ్మిళతంగా ఉండాల్సిన రాష్ట్ర బడ్జెట్.. అంతులేని మోసాలు.. గాడి తప్పిన అంకెల సమాహారంగా మిగిలిపోయింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా వ్యవసాయ బడ్జెట్ను శాసనసభలో మంత్రులు అచ్చెన్నాయుడు, మండలిలో మంత్రి పి.నారాయణ ప్రవేశపెట్టారు.అంకెల్లో ఆడంబరంగా..అప్పులతో ముంచెత్తుతూ.. అంకెల్లో అత్యంత భారీతనంతో ఆడంబరంగా కనిపించిన ఈ బడ్జెట్ పరిమాణం రూ.3.22 లక్షల కోట్లు! కానీ ఇంత భారీ బడ్జెట్లోనూ హామీలకు కేటాయింపులు చేయకుండా సీఎం చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారు. గత ప్రభుత్వం డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఏకంగా రూ.4.57 లక్షల కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూరిస్తే ఇప్పుడు చంద్రబాబు ఏడాదిలోనే రూ.లక్ష కోట్లకుపైగా అప్పులతో ముంచెత్తి చరిత్ర సృష్టించారు. ఆకారం పెంచినా.. నేల విడిచి సాము చేసినా.. ఈ బడ్జెట్ చంద్రబాబు సర్కారు మోసాలను మాత్రం దాచిపెట్టలేకపోయింది! ఎన్నికల హామీల సంగతి అటుంచితే.. సీఎం చంద్రబాబు రోజూ జబ్బలు చరుచుకునే ‘సంపద సృష్టి’ ఆనవాళ్లు బూతద్దంతో గాలించినా బడ్జెట్లో కానరాలేదు. వైఎస్సార్ సీపీ హయాంలో విలువైన సంపద సృష్టిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన పోర్టులు, కొత్త మెడికల్ కాలేజీల గురించి ఈ బడ్జెట్లో కనీసం ప్రస్తావించలేదు. ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ ఇంటి ముంగిటికే గత ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక వ్యవస్థలు, సంక్షేమ పథకాలను కూటమి సర్కారు నిర్వీర్యం చేయడంతో ఇవాళ పల్లెలు కళ తప్పి కనిపిస్తున్నాయి. వలంటీర్ల వేతనాలు రూ.ఐదు వేలు కాదు.. ఏకంగా రూ.పది వేలకు పెంచుతామంటూ నమ్మబలికి ఏకంగా వ్యవస్థకే మంగళం పాడేశారు!హామీలు గాలికి..సూపర్ సిక్స్లో తొలి హామీగా పేర్కొన్న నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల భృతి గురించి బడ్జెట్లో అసలు ప్రస్తావనే లేకుండా చేశారు. ఆడబిడ్డ నిధికి పైసా కూడా కేటాయించలేదు. మహిళల ఉచిత బస్సు ఊసే లేదు. అన్నదాతా సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు కోతలు విధించి అరకొర కేటాయింపులను చూపించినా ఎప్పటి నుంచి అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. కాగితాల్లో కేటాయింపులు చేయడం.. అమలు చేయకపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే! గత బడ్జెట్లోనూ అన్నదాతా సుఖీభవకు రూ.వెయ్యి కోట్లు కేటాయింపులు చేసినట్లు చూపించి చివరకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టడం తెలిసిందే. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి రూ.15 వేల చొప్పున తల్లికి వందనం కింద ఇచ్చేందుకు రూ.9,407 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్లో పేర్కొన్నప్పటికీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పకుండా తప్పించుకునే యత్నం చేశారు.పేదల ఇళ్లకు పాతర..పేదల ఇళ్ల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం పాతరేసింది. వైఎస్సార్సీపీ హయాంలో 2023–24లో ఏకంగా రూ.6,866 కోట్లు కేటాయించి వ్యయం చేయగా.. కూటమి సర్కారు 2024–25 పేదల రూ.4,012 కోట్లు కేటాయించి కేవలం రూ.1,611 కోట్లే వ్యయం చేసినట్లు సవరించిన అంచనాల్లో పేర్కొంది. ఇక 2025–26లో పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.6,317 కోట్లు ప్రతిపాదించింది. -
బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ
సాక్షి, అమరావతి: ‘‘ఎన్నికలకు ముందు చంద్రబాబు నోట ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్కు గ్యారంటీ’ అనే మాట వినిపించేది. ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ అనే మాట వినిపిస్తోంది. బటన్ నొక్కడం ఏమైనా పెద్ద పనా? మూలనున్న ముసలావిడ కూడా బటన్ నొక్కుతుందంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ మేనిఫెస్టోలో 143 హామీలిచ్చారు. చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నికల ముందు ఇంటింటికీ తిరిగి టీడీపీ హామీలకు గ్యారెంటీ అంటూ బాండ్లు పంచారు. హామీలు అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయమన్నారు. మరి ఆ బాండ్లు ఏమయ్యాయి? మేనిఫెస్టో ఏమైంది? పంచిన కరపత్రాలు ఏమయ్యాయి? ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలి’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్తోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని చంద్రబాబును ప్రజలు నిలదీసే పరిస్థితులు త్వరలోనే రానున్నాయన్నారు. జమిలి రూపంలో ఎన్నికలు ఎంత తొందరగా వస్తే ఆయన్ను అంత త్వరగా పంపించేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మరి ఎవరి చొక్కా పట్టుకోవాలి?చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తోంది. ఎన్నికల ముందు ఇంటింటికీ తిరిగి హామీలిచ్చారు. ఏ ఇంట్లో అయినా చిన్న పిల్లలు కనిపిస్తే తల్లికి వందనం కింద నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని చెప్పారు. తల్లులు కనిపిస్తే ఆడబిడ్డ నిధి కింద నీకు రూ.18 వేలు. రూ.18 వేలు.. అని నమ్మబలికారు. ఆ పిల్లల అమ్మమ్మలు, అత్తమ్మలు కనిపిస్తే మీకు 50 ఏళ్లు నిండాయి కదా పెన్షన్ కింద నీకు రూ.48 వేలు నీకు రూ.48 వేలు.. అని చెప్పారు. యువత కనిపిస్తే నిరుద్యోగ భృతి కింద నీకు రూ.36 వేలు.. రైతన్న కనిపిస్తే అన్నదాతా సుఖీభవ కింద నీకు రూ.20 వేలు ఇస్తామని ఇంటింటికి బాండ్లు కూడా పంచారు. వీళ్లు ఇచ్చిన హామీలకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 బాకా ఊదాయి. ఇప్పుడు వారు ఇచ్చిన బాండ్లు ఏమయ్యాయి? మేనిఫెస్టోలో హామీలు ఏమయ్యాయి? ప్రచార కరపత్రాలు ఏమయ్యాయి? ఎవరి చొక్కా పట్టుకోవాలి? ఎవరిని నిలదీయాలి?ఐఆర్ ఏమైంది? పీఆర్సీ ఏది?తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ అన్నారు. ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. మెరుగైన పీఆర్సీ అన్నారు. పీఆర్సీ చైర్మన్ను బలవంతంగా రాజీనామా చేయించారు. 1వ తేదీనే జీతాలంటూ తొమ్మిది నెలల్లో ఒకే ఒక్కసారి ఇచ్చారు. మూడు డీఏలు, ట్రావెల్ ఎలవెన్స్, సరెండర్ లీవ్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ అన్నీ పెండింగ్.. పెండింగ్! జీఎల్ఐ, జీపీఎఫ్లను చంద్రబాబు వాడేసుకుంటున్నారు. ఆర్థిక విధ్వంసం అంటే ఇదీ.కొత్తవి దేవుడెరుగు.. ఉద్యోగాలు ఊడగొట్టారుతొమ్మిది నెలల్లో కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు.. ఉన్నవే ఊడగొట్టారు. ఎన్నికల ముందు వలంటీర్లకు నెలకు రూ.10 వేలు వేతనం ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక 2.60 లక్షల వలంటీర్ ఉద్యోగాలను తీసేశారు. బెవరేజ్ కార్పొరేషన్లో 18 వేల మందిని తొలగించారు. ఫైబర్ నెట్, ఏపీఎండీసీ, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, వైద్య ఆరోగ్య శాఖ.. ఇలా వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగస్తులను ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్లో సర్దుబాటు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. తద్వారా ఆయా విభాగాల్లో ఖాళీలను పూర్తిగా కుదిస్తున్నారు. చీటింగ్లో బాబు పీహెచ్డీ..ఎవరైనా ఎన్నికల హామీలు ఏమయ్యాయని చంద్రబాబును ప్రశ్నిస్తే.. వెటకారంగా మాట్లాడటాన్ని చూస్తున్నాం. మొన్న రాయచోటిలో ఇలాగే ప్రశ్నిస్తే.. సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవిలో చెప్పు అని వ్యాఖ్యానించటాన్ని చూశాం. అన్నీ తెలిసి కూడా ఆయన అడ్డగోలు హామీలిచ్చారు. చీటింగ్లో పీహెచ్డీ తీసుకున్న వ్యక్తి ఒక్క చంద్రబాబు మాత్రమే. ఇక ఆయన నటన ఏ స్థాయిలో ఉంటుందంటే.. హామీలను ఎగ్గొట్టేసి చాలా బాధగా, ఆవేదనగా ఉంది. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. భయమేస్తోందని.. రాష్ట్రం ధ్వంసమై పోయిందని అంటారు! సినిమాల్లో దివంగత ఎన్టీఆర్ను మించిన హావ భావాలను ప్రదర్శిస్తారు. ఆ నటనకు కచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందే!!స్లో పాయిజన్..చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమే.. పులి నోట్లో తలపెట్టడమేనని నేను ముందే హెచ్చరించా. చంద్రబాబు మాయ మాటలతో మోసపోయిన ప్రజలు ఇప్పుడు బాధపడే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు ప్రజలను వంచించడం, మోసం చేయటాన్ని ఓ పద్ధతి ప్రకారం స్లో పాయిజన్ రూపంలో ఎక్కిస్తారు. తన అబద్ధాల ఫ్యాక్టరీ నుంచి ఒక్కొక్కటి బయటకు తీస్తారు. వాటిని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 రకరకాల పద్ధతుల్లో పబ్లిసిటీ ఇస్తాయి. చంద్రబాబు తప్పేమీ లేనట్లుగా.. రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఆయన చేయలేకపోతున్నాడన్న భావన ప్రజల్లో కల్పిస్తారు. పిల్లలకు మనం ఏం చెబుతాం..? అబద్ధాలు ఆడకూడదు.. మోసాలు చేయకూడదు.. ఎదుటివారికి మంచి చేయాలి.. మాట తప్పకూడదు.. విలువలు ఉండాలి. విశ్వసనీయత పెంచుకోవాలి... అలాగే బతకాలని మనం పిల్లలకు చెబుతాం. ఒక్క చంద్రబాబు మాత్రమే తన కుమారుడి దగ్గర నుంచి తన పార్టీలో ఉన్నవారికి చెప్పే సిద్ధాంతం ఏమిటంటే.. అబద్ధాలు చెప్పు.. మోసం చెయ్.. మన స్వార్ధం కోసం ఏం చేసినా తప్పు లేదు.. మోసం చేసినా తప్పు లేదు.. అదీ ఓ ఘనకార్యమే అని చెబుతూ నేర్పించే నాయకుడు చంద్రబాబు మినహా మరొకరు లేరు. -
డీఎస్సీ ఎప్పుడిస్తారు?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ అభ్యర్థులతో ఆటలాడుతోంది. తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీతో 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు.. సీఎం కాగానే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తామంటూ తొలి సంతకం చేశారు. ఇప్పటికి 8 నెలలు పూర్తయినా డీఎస్సీపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడంపై ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం నిలువునా మోసంచేసిందంటూ మంగళవారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ను కూటమి ప్రభుత్వం రద్దు చేసి, మెగా డీఎస్సీ పేరుతో తమ జీవితాలతో ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సీఎం చంద్రబాబు 16,347 పోస్టులకు తొలి సంతకం చేసి, గత డిసెంబర్కే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేశారు. కానీ 8 నెలలు అవుతున్నా నోటిఫికేషన్ ఇవ్వకపోగా పలు సాకులతో వాయిదా వేస్తున్నారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నెల క్రితమే జిల్లాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను తెప్పించుకుంది. ఆ వివరాలను కూడా వెల్లడించలేదు. నోటిఫికేషన్పై నిరుద్యోగులను ఇన్ని నెలలుగా మభ్యపెట్టి, వాస్తవ పరిస్థితులను వెల్లడించకపోవడంతో అభ్యర్థులు రోడ్డెక్కుతున్నారు. నోటిఫికేషన్పై నోరు విప్పని ప్రభుత్వం ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తోంది. టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోంది. పాఠశాలల్లో 25 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలేదు. మేం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం’.. అంటూ ఎన్నికల్లో నారా చంద్రబాబుతో పాటు కూటమి ముఖ్య నాయకులంతా తెగ ప్రచారం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మాట మార్చేశారు. ఉన్నవి 25 వేల ఖాళీలు కాదు.. 16,347 పోస్టులే అని ప్రకటించారు. అంతేగాకుండా, గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ను సరిగ్గా పరీక్షల ముందు రద్దు చేశారు. తర్వాత కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పిస్తామంటూ జూలై 2న నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో పరీక్షలంటూ ప్రచారం చేసింది. అనంతరం టెట్కు, డీఎస్సీకి 90 రోజుల గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్ను తొలుత సెప్టెంబర్ కు, తర్వాత అక్టోబర్కు మార్చారు. టెట్ ఫలితాలు వచ్చి మూడు నెలలైనా డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం ప్రకటించలేదు. దాదాపు 10 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఆర్థికంగా నలిగిపోతూ డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నా, కనీసం విద్యాశాఖ మంత్రి కూడా ఫలనా రోజు డీఎస్సీ షెడ్యూల్ ఇస్తామని చెప్పే ప్రయత్నం చేయడంలేదు. ఏడాది కాలంగా శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు డీఎస్సీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అసలు చదవాలో లేదో కూడా తెలియని గందరగోళంలో ఉన్నారు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన 16,347 పోస్టుల సంఖ్యపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా ఇన్ని పోస్టులు లేకపోవడం వల్లే నోటిఫికేషన్ ఇవ్వడంలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం మొదటి సంతకం ఏమైంది? అధికారంలోకి వస్తే మొదట మెగా డీఎస్సీ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు యువతకు హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు 16 వేల పోస్టులతో డీఎస్సీ ఇస్తామంటూ తొలి సంతకం చేశారు. అయినా భర్తీ ప్రక్రియ చేపట్టకుండా కాలయాపన చేయడం అన్యాయం. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఇక ఓపిక పట్టే పరిస్థితి యువతకు లేదు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన 16 వేల ఉపాధ్యాయ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలి. లేకపోతే పోరాటాలతోనే ప్రభుత్వానికి సమాధానం చెబుతాం. – జి.రామన్న, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అభ్యర్ధుల జీవితాలతో చెలగాటం డీఎస్సీ కోసం ఇప్పటికి రెండుసార్లు కోచింగ్ తీసుకున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామంటే అందరం నమ్మాం. డిసెంబర్ అన్నారు.. జనవరి వెళ్లిపోతోంది. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో మాత్రం ఎవరూ చెప్పరు. డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. – లలిత్, డీఎస్సీ అభ్యర్థి, తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా రెండేళ్ల నుంచి శిక్షణ తీసుకుంటున్నాం.. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. 16 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. రకరకాల సాకులతో వాయిదా వేస్తున్నారు. రెండేళ్ళ నుంచి శిక్షణ తీసుకుంటున్నాం. – మండల శ్రీను, శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లా -
కోతలే తప్ప చేతలు లేవు
సాక్షి. హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీది ప్రజాప్రభుత్వం కాదు.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వం. అది చేతల ప్రభుత్వం కాదు.. మాటలు, కోతల ప్రభుత్వం మాత్రమే’అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్గాంధీ, రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటించి ఇచి్చన హామీలు.. హామీలుగానే మిగిలిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారంఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆ పార్టీ నాయకుల ఆర్థిక స్థితిలో మార్పు వచ్చిందే తప్ప ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని అన్నారు. ఆశచూపి వెన్నుపోటు కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కిషన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రైతు భరోసాలో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఆశచూపి వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. రైతు లు, కూలీలు, కౌలు రైతుల డేటా అంతా ప్రభుత్వం వద్ద ఉండగా.. మళ్లీ ఎందుకు దరఖాస్తులు అడుగుతున్నారని ప్రశ్నించారు. ‘గతంలో దరఖాస్తులు తీసుకున్నారు..సర్వే చేశారు.. ఇప్పుడు రైతు భరోసాకు మళ్లీ దరఖాస్తులు ఎందుకు? రైతు భరోసా కింద ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సంకెళ్లు వేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కా రు కూడా సంకెళ్లు వేసింది’అని విమ ర్శించారు. రైతులకు నాలుగో విడత రుణమాఫీ చేస్తున్నట్లు నవంబర్ 30వ తేదీనే సీఎం రేవంత్రెడ్డి ప్రకటించినా.. ఆ డబ్బులు ఇంకా రైతు ల ఖాతాల్లో పడలేదని తెలిపారు.ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనవరి రెండో వారంలో రైతుల సమస్యలు, హామీల అమలుపై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, మండల ఆఫీసర్లు, తహసీల్దార్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తామని తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచినప్పుడు తమ ప్రభుత్వం ఆ విషయాన్ని ప్రకటిస్తుందని ఒక ప్రశ్నకు కిషన్రెడ్డి సమాధానమిచ్చారు. సమగ్రశిక్ష ఉద్యోగులకు కేంద్రం అండగా నిలుస్తుంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం దిల్ కుశ అతిథి గృహంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, సమగ్ర శిక్ష ప్రతినిధులు.. కిషన్రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. సమగ్ర శిక్ష కార్యక్రమ అమలుకు కేంద్రం తన వాటా కింద 60 శాతం నిధులు, 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని ఉద్యోగుల సంఘం నేతలు యాదగిరి, అనిల్ చారి తెలిపారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందు కు సమగ్ర శిక్ష ఉద్యోగులు కృషి చేస్తున్నా, చాలీచాలని వేతనాల తో సతమతమవుతున్నామని వాపోయారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేంద్రం ఇచ్చే 60 శాతం నిధుల వాటాను కొనసాగించాలని ఉద్యోగులు కిషన్రెడ్డిని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కిషన్రెడ్డి హామీ ఇచ్చారు. -
కొత్త ఏడాదిలో... ఇలా చేద్దాం!
న్యూ ఇయర్ను ‘హ్యాపీ’గా మలచుకునే మార్గాలు కాలం ఒక మాయాజాలం. కళ్లముందే కరిగిపోతుంది. ఒడిసిపట్టేందుకు ఎంత ప్రయత్నించినా వేలి సందుల గుండా ఇట్టే జారిపోతుంది. ఆ క్రమంలో మరో ఏడాది చూస్తుండగానే కరిగిపోయింది. తీపి, చేదు అనుభవాలను మిగిల్చి 2024 చరిత్ర పుటల్లోకి జారుకుంది. కొత్త ఆశలను, సరికొత్త ఆకాంక్షలను మోసుకుంటూ 2025 వచ్చేసింది. బద్ధకం వదిలించుకుంటామని, ఇంకోటని, మరోటని... ఇలా న్యూ ఇయర్ అంటేనే ఎన్నో తీర్మానాలు, మనకు మనమే చేసుకునే వాగ్దానాలు. ఇటు చేసే పనిని, అటు ఈదే సంసారాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంటిల్లిపాదితో పాటు మన ఆరోగ్యమూ జాగ్రత్తగా చూసుకోవాలి. పెట్టుకున్న లక్ష్యాలన్నింటినీ సాధించేయాలి. కొత్త అభిరుచులు పెంచుకోవాలి. మొత్తమ్మీద వీలైనన్ని ఆనందమయ క్షణాలను ఒడిసిపట్టుకోవాలి. ఇలాంటివన్నీ ఎవరికైనా ఉండే ఆశలే. ఇవన్నీ తీరి 2025 ఆసాంతం హాయిగా సాగేందుకు ఏమేం చేయాలంటే..!ఆందోళనకు చెక్ ఆధునిక జీవన విధానం పుణ్యమా అని అప్పుడప్పుడు ఒత్తిళ్లు ఎవరికైనా ఉండేవే. కానీ రోజులో చాలాభాగం ఆందోళన మధ్యే గడుస్తోందంటే మాత్రం డేంజరే. కాస్త ఆగి, అర్థం చేసుకునే లోపే పూడ్చుకోలేనంత నష్టం జరిగిపోతుంటుంది. కనుక మనసును కుంగదీసే ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిష్పాక్షికంగా మదింపు చేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం వారానికోసారి కొంత సమయాన్ని ప్రత్యేకించుకోవాలి. ప్రథమ కోపం వంటివేమైనా పెరుగుతున్నాయా అని ఒకటికి రెండుసార్లు పరిశీలించి చూసుకోవాలి. ఆ లక్షణాలు కనిపిస్తే మొదట్లోనేవదిలించుకోవాలి. లేదంటే ఆఫీసులోనూ, ఇంట్లోనూ లేనిపోని సమస్యలు నెత్తిన పడటం ఖాయం. లేదంటే నచ్చనిది, ఊహించనిది జరిగితే వెంటనే అరిచేసి అవతలి వారిని గాయపరచడం లాంటివి పెరిగిపోతాయి. ఇది సంబంధాలను సరిచేయలేనంతగా దెబ్బ తీస్తుందని గుర్తుంచుకోవాలి. అది ఆఫీసైనా కావచ్చు, ఇల్లయినా కావచ్చు. అయితే ఎంత ప్రయత్నించినా మనమూ మనుషులమే గనుక ఎప్పుడైనా నోరు జారవచ్చు. అప్పుడు పరిస్థితిని చక్కదిద్దేందుకు మీరే చొరవ తీసుకోండి. అవసరమైతే అవతలి వారికి సారీ చెప్పినా తప్పు లేదు. అది మీకు నామర్దా అని అస్సలు అనుకోవద్దు. అవతలి వారి దృష్టిలో వ్యక్తిగా మిమ్మల్ని మరో మెట్టు ఎక్కిస్తుందని తెలుసుకోండి. మంచి సావాసం మీకన్నా తెలివైన వారితో, మంచివారితో వీలైనంత ఎక్కువగా గడపండి. తెలివైనవారి సాహచర్యంలో తెలియకుండానే బోలెడు విషయాలు నేర్చుకుంటారు. మంచివారు ఆచరించి చూపే జీవిత విలువలు మనకు దారి చూపే దీపాలవుతాయి. వాటిని ఎంతగా అలవర్చుకుంటే అహంకారం వంటి అవలక్షణాలు అంతగా అణగుతాయి. మానసిక ప్రశాంతతకు, నిజమైన తృప్తికి బాటలు పడతాయి. బద్ధకానికి బై బై బద్ధకాన్ని వదలించుకుందాం. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా దీన్ని న్యూ ఇయర్ తీర్మానాల చిట్టాకు పరిమితం చేయకండి. ఈ క్షణం నుంచే ఆచరణలో పెట్టండి. దీన్నొక్కదాన్ని దూరం చేసుకుంటే చాలా సమస్యలు పరిష్కారమైనట్టేనని గుర్తుంచుకోండి. మెదడును ఖాళీగా ఉంచకపోవడమే ఈ సమస్యకు పరిష్కారం. ఏఐ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోండి. వృత్తి సంబంధ నైపుణ్యాలను మెరుగుపెట్టుకోండి. అది మీ ఆత్మవిశ్వాసాన్నీ అమాంతంగా పెంచేస్తుంది. నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే అటు బద్ధకమూ వదులుతుంది. ఇటు చక్కని ఐడియాలూ పుట్టుకొస్తాయి. రెండిందాలా లాభమే. ఇతరులకు సాయపడదాం ప్రతిఫలం ఆశించకుండా చేసే సాయం వల్ల కలిగే ఆత్మసంతృప్తి అంతా ఇంతా కాదు. అది ఎన్ని వేలు, లక్షలు ఖర్చు చేసినా దొరికేది కాదు. మనకిష్టమైన వారికి సాయపడటం పెద్ద విషయమేమీ కాదు. మీకిష్టం లేని వారికి అవసరాల్లో సాయపడితే మనిíÙగా మరో మెట్టు ఎక్కినట్టే. ఇతరుల్లోని మంచిని గుర్తించడం, అభినందించడం అలవాటుగా మార్చుకుంటే మన సాన్నిధ్యాన్ని అంతా ఇష్టపడతారు. పరిష్కారాలు సూచిద్దాం ఎప్పుడూ సమస్యలను ఎత్తిచూపడం కాదు. అది అందరూ చేసేదే. ఇంతకాలంగా మనమూ చేస్తూ వస్తున్నదే. వాటికి ఆచరణసాధ్యమైన పరిష్కారాలను సూచించే ధోరణి అలవర్చుకుందాం. మొదట్లో కాస్త కష్టమే అనిపించినా మనల్ని అందరికీ అత్యంత ఇషు్టలను చేస్తుందిది. ముఖ్యంగా ఆఫీసుల్లో మేనేజర్ వంటి పొజిషన్లలో ఉంటే ఈ ఒక్క అలవాటుతో సహోద్యోగులందరి మనసూ ఇట్టే గెలుచుకోవచ్చు. వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి వాళ్లకు సలహాలివ్వడమే గాక ఎప్పటికప్పుడు తోడు నిలిస్తే వాళ్లకూ బాగుంటుంది. మనకూ తృప్తిగా ఉంటుంది. సంస్థా లాభపడుతుంది. అలా ఆల్ హ్యాపీసే. చిన్న విజయాలనూ ఆస్వాదిద్దాం విజయం సాపేక్షం. దానికి ఒక్కొక్కరూ ఒక్కో నిర్వచనమిస్తారు. భారీ లక్ష్యాలు సాధించినప్పుడు కలిగే విజయానందం గొప్పదే. కానీ దాని కోసమని ఆనందాన్ని అప్పటిదాకా వాయిదా వేసుకోవడమెందుకు? ఆ లక్ష్యాలను సాధించే క్రమంలో ఎదురయ్యే చిన్న చిన్న సాఫల్యాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడాన్ని అలవాటుగా మార్చు కుందాం. అప్పుడిక ప్రతి రోజూ పండుగే. ఆత్మానందమూ ముఖ్యమే వ్యక్తిగత, వృత్తిగత, సాంసారిక సంతృప్తి చా లా ముఖ్యమే. కానీ ఆత్మానందం వీటన్నింటి కంటే విలువైనది. దాన్ని పొందేందుకు కూడా ఇప్పటినుంచే ప్రయత్నం మొ దలు పెడదాం.అంటే ఎకాయెకిన కఠోర ఆధ్యాత్మిక సాధనలు చేసి తీరాలని కాదు. ఏ కవిత్వం, సంగీతం వంటివాటితో లోపలి ప్రయాణాన్ని మెల్లిమెల్లిగా మొదలు పెట్టవచ్చు. నేనెవరిని అనే మూలాలోచన అంటూ ఒకటి మనసులో ఒక పక్కన సాగుతూ ఉంటే చాలు. ఆత్మాన్వేషణకు క్రమంగా బాటలు అవే పడతాయి. చివరగా, వీలైనంతగా నవ్వండి. మానసికంగా అది కలిగించే సానుకూల ప్రభావం అంతా ఇంతా కాదని ఎన్నెన్నో అధ్యయనాలు ముక్త కంఠంతో తేల్చాయి. మొహంపై చిరునవ్వు చెరగని వారికి ప్రతి క్షణమూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది. మరింకెందుకు ఆలస్యం?! ఈ క్షణమే రంగంలోకి దిగుదాం. బద్ధకాన్ని వదిలించుకుందాం. మనల్ని మనం నిత్యం సానబట్టుకుంటూ సాగుదాం. 2025ను మన జీవితంలోకెల్లా అత్యంత ఆనందమయమైన ఏడాదిగా మలచుకుందాం. అవసరాలకే జై కోర్కెలకు, కనీస అవసరాలకు చాలా తేడా ఉంది. ఆశలు అనంతమే గానీ ఆర్జన ఎప్పుడూ పరిమితమే. ఇదొక్కటి గుర్తుంచుకుంటే అవసరాలు, సౌకర్యాలు, ఆడంబరాలకు మధ్య స్పష్టమైన గీత గీయగలం. వేటిని తీర్చుకోవాలో, వేటిని దూరం పెట్టాలో, వేటిని వదిలించుకోవాలో తేల్చుకోవ డం తేలికవుతుంది. చాలా ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. అనుకోని అవసరాల కోసం కొంత మొత్తం కూడా పక్కన పెట్టుకోగలుగుతాం. ఆర్థిక ప్రశాంతత ఎంత బావుంటుందో అనుభవంలోకి వస్తుంది.బంధాలే ముఖ్యం చిన్న పొరపాట్లకు బంధాలు తెంచుకునేదాకా వెళ్లకండి. ఇందుకోసం ప్రత్యేకించి ఏమీ చేయనక్కర్లేదు. అవతలివాళ్లు కూడా మనలాగే మామూలు మనుషులేనని, అప్పుడప్పుడు తప్పులు, పొరపాట్లు చేస్తుంటారని గుర్తుంచుకుంటే చాలు. క్షమించే గుణాన్ని పెంచుకుంటే ప్రపంచమంతా మరింత అందంగా మారుతుంది. ఎప్పుడో జరిగిన అవమానాలను, చేదు సంఘటనలను మనసులో మోయకండి. ఆ భారం నానారకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.సహోద్యోగులు కీలకం తిండీ, నిద్రా తదితరాలకు పోగా మన జీవితంలో మిగిలే నాణ్యమైన సమయంలో అత్యధిక భాగం గడిపేది కలిసి పనిచేసే సహోద్యోగులతోనే. వారితో సత్సంబంధాలు చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. చిన్నాచితకా కారణాలతో సహోద్యోగులతో కీచులాటలకు దిగకండి. అందుకోసం అవసరమైతే మీరే కాస్త తగ్గండి. తప్పేమీ లేదు. చక్కని పని వాతావరణం మన మానసిక, శారీరక ఆరోగ్యాలకు ఎంతో అవసరం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ హామీల వర్షం
-
పాయె.. ఇంకో హామీకి కూడా బాబు మంగళం!
ఆంధ్రప్రదేశ్లో మరో వంచన పర్వానికి రంగం సిద్ధమైంది. తెలుగుదేశం అనుకూల పత్రిక ఈనాడులో వచ్చిన ఒక కథనం చూస్తే ఎవరికైనా ఈ అనుమానం రాకమానదు. ఆర్టీసీకి ఎన్నో సమస్యలున్నాయని చెప్పే ఈ కథనాన్ని బట్టి చూస్తే.. టీడీపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ ఇక అమలు జరగదనే అనిపిస్తుంది. జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోలోని 25 హామీల్లో ఇది ప్రముఖమైంది. తెలంగాణలో ఎన్నికల హామీకి తగ్గట్టుగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అమలు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏడు నెలలవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో రాష్ట్రంలోని మహిళలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉండగా తెలుగుదేశం సహా కూటమి పార్టీలన్నీ వాగ్ధానాల అమలుపై నానా రచ్చ చేసేవి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చినా ప్రతిపక్షాలు దాని అనుకూల మీడియా నానా వంకలూ పెట్టేవి. పచ్చి అబద్ధాలను ప్రసారం చేసేవి. ఇప్పుడు మాత్రం.. ఇచ్చిన ఆరంటే ఆరు హామీలకూ మంగళం పాడుతున్నా ఈనాడు, ఆంధ్రజ్యోతులకు గొంతు పెగలడం లేదు. పైపెచ్చూ జగన్ కారణంగా ఇప్పుడు చంద్రబాబు హామీలను నెరవేర్చలేకపోతున్నారన్న కలరింగ్ ఒకటి! ఉన్నది ఉన్నట్టుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారు అనకుండా.. వారిపై జనాల్లో సానుభూతి పెంచేందుకు నానా తంటాలూ పడుతున్నాయి. ఎన్నికలప్పుడు కూటమి ఇచ్చిన హామీల్లో వృద్ధాప్య ఫించన్ల మొత్తం పెంపు ఒక్కటే ప్రస్తుతానికి అమలైన హామీగా కనిపిస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్లకు పరిమితి పెట్టారు. ఇస్తామన్న మూడూ ఎంతమందికి అందుతోందన్న స్పష్టత లేదు. దీన్ని అమలు చేశారని అనుకున్నప్పటికీ మిగిలిన వాటి సంగతేమిటి? రాష్ట్రం పరిస్థితి చూస్తూంటే భయమేస్తోందని అనడంతోనే చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రింబవళ్లూ ఆలోచిస్తున్నా ఐదేళ్ల విధ్వంసానికి పరిష్కారం దొరకడం లేదని పచ్చమీడియా తన బొంకులతో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు మాటల్లోని డొల్లతనం ఏమిటన్నది ఈ మాటలతోనే స్పష్టమైపోతోంది కదా?ఎన్నికలకు ముందు... జగన్ ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు వార్తలు సృష్టించారు. సంపద సృష్టించడం ఎలాగో తనకు తెలుసునని బడాయికి పోయారు. మ్యానిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని గొప్పలు చెప్పుకున్నారు కూడా. తీరా అధికారం చేతికొచ్చిన తరువాత చేసిందేమిటి? జగన్ చేసిన అప్పులు బాబు చెప్పిన సంఖ్యలో సగమేనని స్పష్టమైంది. పగ్గాలు చేపట్టింది మొదలు ఇప్పటివరకూ రూ.70 వేల కోట్ల అప్పూ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో ఇంకో రూ.15 వేల కోట్ల భారం ప్రజల నెత్తిన రుద్దారు. ఇంతింత అప్పులెందుకు అని అడిగితే మాత్రం విషాద రాగం ఎత్తుకుంటారు బాబుగారు. ఈ క్రమంలోనే తాజాగా మహిళల ఉచిత బస్ ప్రయాణం హామీకి మంగళం పలకడమో, తూతూ మంత్రంగా అమలు చేయడమో చేసేందుకు బాబు రంగం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మంత్రివర్గ ఉప సంఘం, ఆ తర్వాత అధికారిక కమిటీలతో నివేదికలు తయారు చేయిస్తున్నారు. ఈనాడు కథనం ప్రకారం ఉచిత బస్ స్కీమ్ అమలుకు 2000 బస్సులు కావాలి. ఇప్పుడున్న వారికి తోడు మరో 11500 మంది సిబ్బంది అవసరం. మహిళా ప్రయాణికుల సంఖ్య పది లక్షలు పైగా పెరుగుతుందని. ఆర్టీసికి నెలకు రూ.ఆరు కోట్ల నష్టం రావచ్చని అధికారులు అంచనా వేశారని రాసుకొచ్చింది ఈనాడు! అన్ని కలిపి ప్రభుత్వానికి నెలకు రూ.200 కోట్లు, ఏటా రూ.2400 కోట్లూ నష్టమని లెక్కకట్టారు.ప్రస్తుతం ఆర్టీసీ సిబ్బంది జీతాలపై నెలకు రూ.300 కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలోకి విలీనం చేసిన తరువాత కూడా జీతాలు ఈ స్థాయిలో ఎందుకున్నాయో ఎల్లో మీడియా చెప్పడం లేదు. అదనపు సిబ్బంది పేరు చెప్పి.. వీరి నియామకానికి సమయం పడుతుందని.. వీరి జీతభత్యాలు అదనమని చెప్పేందుకు ఈనాడు తన కథనం ద్వారా ప్రయత్నిస్తోందన్నమాట. అయితే.. రాజకీయాల్లో తనది 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ చెప్పుకునే చంద్రబాబుకు హామీ ఇచ్చే నాటికి ఈ విషయాలన్నీ తెలియవని అనుకోవాలా? అంటే.. గద్దెనెక్కేందుకు నోటికొచ్చిన హామీలు ఇచ్చారనేగా అర్థం ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం చేస్తే తీవ్రంగా నష్టపోయేది ఆటోవారు. కాబట్టి వీరికి పరిహారం సంగతి కూడా చూడాల్సి ఉంటుంది. తెలంగాణలో కొన్ని లోటుపాట్లతో ఈ పథకం అమల్లో ఉంది. కొత్త బస్సులు కొనలేదు.. అదనపు సిబ్బంది నియామకమూ జరగలేదు. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇవన్నీ ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది. ఎగొట్టడానికే అన్నది సామాన్యుడిని అడిగినా వచ్చే సమాధానం. చంద్రబాబు ఎన్నికల హామీల అమలుకు ఏటా రూ.1.5 లక్షల కోట్లు కావాలని వైసీపీ ఎప్పుడో స్పష్టం చేసినా టీడీపీ తమకు అనుభవముందని చెప్పేవాళ్లు. అచ్చంగా 2014లో రైతు రుణమాఫీ హామీ మాదిరిగా అన్నమాట! అప్పట్లో బాబు తాకట్టులో ఉన్న రైతుల భార్యల బంగారాన్ని కూడా విడిపిస్తానని పదే, పదే ప్రచారం చేశారు. దానిని రైతులు చాలా మంది నమ్మి ఓట్లు వేశారు.ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపెట్టింది. రకరకాల కండిషన్లు పెట్టడం, సర్టిఫికెట్ల పేరుతో ఆఫీస్ల చుట్టూ తిప్పడం వంటి ఇబ్బందులు పడ్డారు. అయినా రుణమాఫీ కేవలం రూ.15 వేల కోట్ల మేరే చేశారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వం రుణమాఫీ కొనసాగించాలని కూడా టీడీపీ డిమాండ్ చేసేది. 2024లో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఆనాటి రుణమాఫీ బాకీల గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు తాజాగా ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే పాత రుణమాఫీ బాకీ గురించి రైతులు అడిగే ప్రశ్న రాదు. ఈ సారి ఇచ్చిన రైతుల పెట్టుబడి సాయం రూ.20 వేలు హామీ ఎప్పుడు నెరవేర్చేది చెప్పడం లేదు. ఈ దశలో ఒక్కో హామీకి సంబంధించి ఇబ్బందులపై ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించి దాటవేయడానికి ప్రయత్నాలు ఆరంభం అయినట్లు అర్ధం చేసుకోవచ్చు. అందులో భాగంగానే మహిళల ఉచిత బస్ హామీకి గుడ్ బై చెప్పడానికి లేదా, గతంలో రుణమాఫీ మాదిరి అరకొరగా చేయడానికి ఒక ప్రాతిపదికను తయారు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: వైఎస్ జగన్
జమిలి ఎన్నికలు 2027లో అంటున్నారు. నెలలు గడిచేకొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతోంది. మనంరెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నాం. మన ప్రభుత్వం మళ్లీ రాగానే నాతో పాటు ఈ కష్టాల్లో ఉన్న వారందరికీ మంచి రోజులు వస్తాయి. ఇబ్బందులు కొంత కాలం ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు. కొంత ఓపిక పట్టండి. మీ అందరి ప్రేమ ఎప్పటికీ మరిచిపోను. మనందరం కలిసికట్టుగా పని చేయాలి. – వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, కడప : ‘ఎన్నికల ముందు అలవి గాని హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదు. అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. 2027 చివర్లో జమిలి ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం ఇడుపులపాయలో కడప కార్పొరేటర్లు, ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ప్రజలకిచ్చిన మాట మీద నిలబడి, ప్రజల కష్టాలను నా కష్టాలుగా భావించి, ప్రజలకు మంచి చేశాం. ఈ రోజు కూడా ప్రతి ఇంటికీ మనం కాలర్ ఎగరేసుకుని వెళ్లగలుగుతాం. మనం చెప్పింది చేశామనే మాట ప్రతి ఇంట్లో నుంచి వినిపిస్తోంది. ప్రజలు సంతోషంగా మీరు చేశారంటున్నారు. అదే టీడీపీ నాయకులు ఎవరైనా ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ అమలు చేశామని వెళ్లగలుగుతారా? వాళ్లు ప్రజల దగ్గరకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఏ ఇంటికి వెళ్లినా చిన్న పిల్లలతో నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని, వారి తల్లులైతే నీకు రూ.18 వేలు, ఆ అమ్మలకు తల్లులు, అత్తలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్లు దాటిన పిల్లవాడు కనిపిస్తే రూ.36 వేలు అని, కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని.. ఇలా ఇంట్లో ఎవరినీ వదిలి పెట్టకుండా ఆశ పెట్టారు. ఇప్పుడు వారంతా మా డబ్బులు ఏమయ్యాయని అడుగుతున్నారు. అందుకే ఏ టీడీపీ కార్యకర్త ఎవరి ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు’ అని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. కలిసికట్టుగా పని చేద్దాం జమిలి ఎన్నికలు 2027లో అంటున్నారు. నెలలు గడిచేకొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతోంది. మనం రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నాం. మన ప్రభుత్వం మళ్లీ రాగానే నాతో పాటు ఈ కష్టాల్లో ఉన్న వారికి మంచి రోజులు వస్తాయి. ఇబ్బందులు కొంత కాలం ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు. మనందరం కలిసికట్టుగా పని చేయాలి. దేశ చరిత్రలో ఏ ఒక్కరు చేయని మంచి పనులు చేశాం. అబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మనం మార్చాం. కోవిడ్ సమయంలో కూడా సంక్షేమాన్ని ఆపలేదు. మోసపూరిత హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. మనల్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఇబ్బందులు పెట్టినా, కొంత ఓపిక పట్టండి. మీకు నా తమ్ముడు అవినాష్ అందుబాటులో ఉంటారు. మీకు ఏ అవసరం వచ్చినా తనను కలవండి. తప్పకుండా సాయం చేస్తారు. నేను కడప బిడ్డను కాబట్టే మీరంటే నాకు ప్రత్యేకమైన అనుబంధం. మీ అందరి ప్రేమ ఎప్పటికీ మరిచిపోను. మేము జిల్లాలో చూసుకుంటాం.. మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించండంటూ మీరంతా నాకు అండగా ఒక్కతాటిపై నిలవాలి. ప్రజాపక్షమై గళమెత్తుదాం మనం ఇంత త్వరగా ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తుందనుకోలేదు. చంద్రబాబు బాదుడే బాదుడులా పాలన సాగిస్తున్నారు. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్లేదు.. అందుకే మనం పోరుబాట పట్టాల్సి వస్తోంది. హామీలు, సమస్యలపై ప్రజాపక్షమై గళమెత్తుదాం. ఇప్పటికే రైతు ధర్నా చేశాం. ఈ నెల 27న కరెంట్ బిల్లులపై మరో నిరసన కార్యక్రమం చేయనున్నాం. జనవరి 3న ఫీజు రీయింబర్స్మెంట్పై విద్యార్థుల తరుఫున మరో కార్యక్రమం చేయాల్సి ఉంది. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మీ అందరినీ నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నా. ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలి. సంక్రాంతి తర్వాత ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్తాను. అన్ని జిల్లాల్లో పర్యటిస్తాను. వైఎస్సార్కు నివాళులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి.. మంగళవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అరి్పంచారు. అనంతరం వైఎస్ కుటుంబ సభ్యులు.. ఓపెన్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ జగన్, భారతి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మ, వైఎస్ ఆనందరెడ్డి, వైఎస్ రవీంద్రనాథరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర కుటుంబీకులు.. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, మేయర్ సురేష్ బాబు, మాజీ మంత్రి ఎస్బీ అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, గంగుల బిజేంద్రనాథరెడ్డి, సుదీర్రెడ్డి.. వైఎస్ అనిల్రెడ్డి, వైఎస్ సునీల్రెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వలంటీర్లను కొనసాగించాలి
సీతమ్మధార/చిలకలూరిపేట/తిరుపతి అర్బన్: వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి, రూ.10 వేల వేతనం చెల్లిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు ధర్నా నిర్వహించారు. విశాఖ జీవీఎంసీ గాం«దీపార్కులో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు మణి మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన మాటకు పూర్తి భిన్నంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ లేదని ప్రకటించడం విశ్వాస ఘాతుకమని దుయ్యబట్టారు. తక్షణం వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఏపీ ప్రజా గ్రామ వార్డు వలంటీర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ కరోనా సమయంలో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలందించామని గుర్తు చేశారు. చాలామంది కరోనా రోగుల్ని ఆస్పత్రులకు తీసుకెళ్లి, మెరుగైన వైద్యం అందించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు నడిరోడ్డు మీదికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్లకు న్యాయం చేయకపోతే విజయవాడలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం కక్షసాధింపు తగదు ఇచ్చిన హామీ మేరకు వార్డు, గ్రామ వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని ఏపీ వలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వలంటీర్లను విధుల్లోకి తీసుకొనేది లేదని చేసిన ప్రకటనకు నిరసనగా శుక్రవారం వలంటీర్లతో కలసి చిలకలూరిపేటలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉన్న వలంటీర్లను కొనసాగిస్తూ వాళ్లకు ఉద్యోగ భద్రత కలిగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతోపాటు ఐదు నెలల బకాయిలు చెల్లించి రూ.10 వేల గౌరవవేతనం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వలంటీర్లను కొనసాగేలా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. సీఎం, డిప్యూటీ సీఎం న్యాయం చేయాలి ‘మా ఉద్యోగం మాకు ఇవ్వండి.. మాకు రాజకీయ రంగు పూయకండి..ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అదేశాలను తు.చ. తప్పకుండా పాటించడమే మా పని.. గత సర్కార్లోను ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో వారధిలాగానే పనిచేశాం’ అంటూ వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్ద వలంటీర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచి్చన హామీని నిలబెట్టుకోమని గుర్తుచేస్తున్నట్లు చెప్పారు. -
‘భరోసా’ గంగపాలు!
పంపాన వరప్రసాదరావు బాపట్ల జిల్లా వాడరేవు నుంచి ‘సాక్షి’ ప్రతినిధి : కూటమి పార్టీల నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చాక ఇలా మొండిచెయ్యి చూపుతారని అనుకోలేదని గంగపుత్రులు మండిపడుతున్నారు. బాపట్ల జిల్లా వాడరేవు గ్రామంలో ఏ గడపకు వెళ్లినా ఇదే మాట వినిపిస్తోంది. వైఎస్ జగన్ హయాంలో ఐదేళ్ల పాటు వేట నిషేధ సమయంలోనే ఏటా రూ.10 వేల చొప్పున మత్స్యకార భరోసా వచ్చిందని గుర్తు చేసుకుంటున్నారు. రూ.20 వేల చొప్పున మత్స్యకార భరోసా ఇస్తామని నమ్మబలికి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం ఆర్నెల్లలో తమకు ఎలాంటి సాయం అందించలేదని వాపోతున్నారు. 8 వేలకుపైగా జనాభా ఉన్న ఒక్క వాడరేవు గ్రామంలోనే 2,035 మంది మత్స్యకారులు ఐదేళ్లలో రూ.6.30 కోట్లు మత్స్యకార భరోసాగా అందుకున్నారు. ఈ ఏడాది గ్రామంలో 1,450 మంది అర్హత పొందగా ఆర్నెల్లుగా వేట నిషేధ భృతి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనిపై సీఎం, డిప్యూటీ సీఎంలకు లేఖలు రాసినా, కలసి విన్నవించినా పట్టించుకోలేదంటూ గంగపుత్రులు మండిపడుతున్నారు. ఇప్పట్లో ఇవ్వలేమని తాజాగా అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. భరోసా ఇవ్వకుండా ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ఎందుకని నిలదీస్తున్నారు. ఐదేళ్లలో రూ.538 కోట్లు..వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలతో పాటు రూ.2 వేలు నగదు ఇస్తుండగా చంద్రబాబు హయాంలో నిత్యావసరాలను నిలిపివేసి రూ.4 వేలు చొప్పున వేట నిషేధం ముగిసిన ఆర్నెల్లకో.. ఏడాదికో తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే పాదయాత్ర హామీ మేరకు నిషేధ భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ఏటా వేట నిషేధ గడువు ముగిసేలోగా అర్హుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లకే కాకుండా తెప్పలు, ఇతర సంప్రదాయ నావలపై వేటకు వెళ్లే వారికి సైతం సాయాన్ని అందచేశారు. ఇలా ఐదేళ్లలో ఏటా సగటున 1.23 లక్షల మందికి రూ.538 కోట్ల మేర మత్స్యకార భరోసాతో లబ్ధి చేకూర్చారు.ఈసీకి కూటమి నేతల ఫిర్యాదుతో..వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఎన్నికల కమిషన్ అనుమతితో ఈ ఏడాది కూడా మే 2వ తేదీ నుంచి అర్హులను గుర్తించి జాబితాలను సిద్ధం చేసింది. 2023–24లో 1.23 లక్షల మంది అర్హత పొందగా 2024–25లో 1.30 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. అయితే ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఫిర్యాదు చేయడంతో గత ప్రభుత్వం మత్స్యకార భృతిని జమ చేసేందుకు ఈసీ అనుమతించలేదు. అనంతరం ఎన్నికల హామీ మేరకు రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.260.26 కోట్లు కావాలని మత్స్యశాఖ పంపిన ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ఐదేళ్లలో వివిధ పథకాలతో లబ్ధి ఇలా..మత్స్యకారులకు లీటర్ డీజిల్పై సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కి పెంచిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఏటా సగటున 23 వేల బోట్లకు రూ.148 కోట్ల మేర లబ్ధి చేకూరింది. టీడీపీ హయాంలో తొలి మూడేళ్లలో 460 బోట్లకు, తర్వాత రెండేళ్లకు 1,100 బోట్లకు డీజిల్ సబ్సిడీ ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తొలి ఏడాదే మెకనైజ్డ్, మోటరైజ్డ్తోపాటు సంప్రదాయ బోట్లు కలిపి 14,229 బోట్లకు డీజిల్ సబ్సిడీ ఇచ్చారు. గరిష్టంగా 2023–24లో 23,209 బోట్లకు డీజిల్పై సబ్సిడీ ఇచ్చారు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చే నష్ట పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఐదేళ్లలో 175 మందికి రూ.17.71 కోట్ల పరిహారాన్ని అందించింది. వివిధ పథకాల ద్వారా ఐదేళ్లలో మత్స్యకారులకు రూ.4,913 కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జీఎస్పీసీ (గెయిల్) పైపులైన్ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.78.22 కోట్లు, ఓఎన్జీసీ పైపులైన్ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు రూ.485.58 కోట్లు చొప్పున అందచేసి తోడుగా నిలిచింది.రూ.5 లక్షల అప్పు తీర్చిన ‘ఆసరా’.. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవుకు చెందిన సూరాడ ఎల్లయ్యమ్మ భర్త మత్స్యకారుడు కాగా ఆమె చేపలను విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గత ఐదేళ్లపాటు వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఏటా రూ.10 వేలు చొప్పున జమయ్యాయి. ఆసరా పథకం ద్వారా పొదుపు సంఘంలో ఉన్న రూ.5 లక్షల అప్పు అణా పైసలతో సహా మాఫీ అయ్యింది. వారి కుమారుడు కాకినాడలో ఎమ్మెస్సీ చదువుతుండగా కుమార్తె డిగ్రీ చదువుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి, విద్యాదీవెన అందాయి. ఎల్లయ్యమ్మ మామ పింఛన్ పొందుతుండగా ఆమె అత్త వైఎస్సార్ చేయూత కింద నాలుగేళ్ల పాటు ఏటా రూ.18,750 చొప్పున లబ్ధి పొందింది. జగనన్న పాలనలో లబ్ధి పొందని మత్స్యకార కుటుంబం లేదు.. చంద్రబాబు పాలనలో ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదని ఎల్లయ్యమ్మ చెబుతోంది. నేను బతికున్నానంటే జగన్ బాబు చలవే.. మైలు సంజీవ్ 40 ఏళ్లుగా చేపల వేటనే నమ్ముకుని జీవిస్తున్నాడు. ఆయనకు గత ఐదేళ్ల పాటు మత్స్యకార భరోసా అందింది. కుమార్తెకు అమ్మ ఒడి వచ్చింది. పొదుపు సంఘంలో ఆయన భార్య అప్పు మాఫీ అయ్యింది. సంజీవ్ అమ్మకు చేయూత వచ్చింది. నాలుగేళ్ల క్రితం సంజీవ్కు గుండెపోటు రావడంతో వలంటీర్ ధైర్యం చెప్పి ఆరోగ్యశ్రీ కార్డుతో గుంటూరు ఆస్పత్రికి పంపించాడు. రూ.4 లక్షలు ఖరీదైన బైపాస్ సర్జరీని ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా నిర్వహించారు. డిశ్చార్జీ అనంతరం ఇంటికి పంపేటప్పుడు చేతికి డబ్బులిచ్చి పంపారు. ఏడాది పాటు మందులు ఉచితంగా ఇచ్చారు. నేను ఇప్పుడిలా బతికి ఉన్నానంటే జగన్ బాబు చలవే అంటూ సంజీవ్ కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబు వచ్చి ఆర్నెళ్లు అవుతున్నా వేట సాయం కూడా ఇవ్వలేదని వాపోయాడు.ఐదేళ్లూ అందుకున్నా.. మా తాతముత్తాల నుంచి చేపల వేటే జీవనాధారం. 20 ఏళ్లుగా వేటకు వెళ్తున్నా. జగన్ పాలనలో ఐదేళ్లూ మత్స్యకార భరోసా అందుకున్నా. మా పిల్లలకు అమ్మఒడి, అమ్మకు చేయూత వచ్చింది. నా భార్యకు పొదుపు సంఘంలో అప్పు మాఫీ అయింది. రేషన్ కూడా ఇంటికే వచ్చేది. వలంటీర్ల వల్ల గడప దాటాల్సిన అవసరం లేకుండా అన్నీ అందేవి. ఇప్పుడు ఏ పని కావాలన్నా వేట మానుకొని ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఓపక్క వేటకు వెళ్తే సరైన చేపలు పడడం లేదు. మరోవైపు వేట నిషేధ భృతి ఇవ్వడం లేదు. ఆర్ధికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. – ఎస్.పోలయ్య, వాడరేవు, బాపట్ల జిల్లాహామీని నిలబెట్టుకోకుంటే ఉద్యమిస్తాం... వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడికి రూ.20 వేల చొప్పున వేట నిషేధ భృతి ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు అవుతున్నా హామీని నెరవేర్చలేదు. బడ్జెట్లో కేటాయింపులు కూడా చేయలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉండగానే ఈసీ అనుమతితో అర్హుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. ఇప్పుడు మత్స్యకార భరోసాని ఎగ్గొట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్లడంతో తీరని అన్యాయం జరుగుతోంది. ఇచి్చన హామీని నిలబెట్టుకోకుంటే మత్స్యకారుల తరపున ఉద్యమిస్తాం. – కొండూరు అనీల్బాబు, మాజీ ఆప్కాఫ్ చైర్మన్ -
అప్పులపై అడ్డగోలు లెక్కలా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు అవుతోంది.. ప్రభుత్వ యంత్రాంగమంతా నీ చేతుల్లోనే ఉంది.. నీ చేతుల్లో ఉన్న అధికారులతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టావు.. అందులో అంకెలన్నీ నువ్వు పెట్టినవే.. ఆ లెక్కలను కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కూడా ధ్రువీకరించింది.. మరి నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే 2018–19 నాటికి అంటే నువ్వు అధికారంలోకి నుంచి దిగిపోయే నాటికి గ్యారంటీలతో కలిపి రాష్ట్ర అప్పులు రూ.3.13 లక్షల కోట్లు అని లెక్క చూపావు.. 2023–24 నాటికి అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి గ్యారంటీలతో కలిపి రాష్ట్ర అప్పులు రూ.6.46 లక్షల కోట్లు అని తేల్చావు.. మరి ఇప్పడేమో లేదు లేదు.. రాష్ట్ర అప్పులు రూ.10.47 లక్షల కోట్లని ఒకరు.. రూ.11 లక్షల కోట్లని మరొకరు..! పక్కకు వస్తే వేరే నెంబర్లు చెబుతా అని అంటావా? గుంజీలు తీయిస్తానంటావా? సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు నిలదీస్తారనే భయంతో.. బొంకిందే బొంకుతున్న నిన్ను ‘బొంకుల బాబు..’ అని ఎందుకు అనకూడదు?’’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అప్పుల నుంచి పోలవరం దాకా భిన్న అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు పదే పదే అబద్ధాలు చెబుతుండటాన్ని ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలు, మోసాలు, అక్రమాలపై ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు, ప్రజాస్వామికవాదులపై అక్రమ కేసులను బనాయిస్తూ, నిర్భందిస్తూ అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..తప్పైతే అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టారు?2018–19 నాటికి రూ.3.13 లక్షల కోట్లున్న అప్పులు మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.6.46 లక్షల కోట్లకు చేరాయని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని నిర్థారిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పద్దులను ఆడిట్ చేసే కాగ్ ఇచ్చిన నివేదికను కూడా అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. అందులోనూ రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లుగానే తేల్చారు. మరి వాస్తవాలు ఇలా ఉంటే.. ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పు రూ.11 లక్షల కోట్లు.. రూ.12.50 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లని మీరు చేసింది తప్పుడు ప్రచారం కాదా? ఇలా దుష్ఫ్రచారం చేయడం ధర్మమేనా? చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీలోని తన వదినమ్మ, ఎల్లో మీడియాతో కలిసి అబద్ధాలకు రెక్కలు కట్టి ఎలా వ్యవస్థీకృత నేరాలకు (ఆర్గనైజ్డ్ క్రైమ్స్) పాల్పడుతున్నారనేందుకు రాష్ట్ర అప్పులపై వారు చేసిన దు్రష్ఫచారమే తార్కాణమని గత మీడియా సమావేశంలోనే చెప్పా. బడ్జెట్ ప్రవేశపెట్టాక కూడా రాష్ట్ర అప్పులపై అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించేందుకు చంద్రబాబు దుష్ఫ్రచారం కొనసాగిస్తున్నారు. అప్పులపై బడ్జెట్లో చూపించింది తప్పైతే మరి ఆ బడ్జెట్ను అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టావు బాబూ? పైగా మరో అడుగు ముందుకేసి బకాయిలపై (స్పిల్ ఓవర్ అకౌంట్స్) పదే పదే అబద్ధాలా? ప్రభుత్వం వివిధ పనులకు సంబంధించి చెల్లించాల్సిన బిల్లులు ఏటా స్పీల్ ఓవర్ కింద మరుసటి ఏడాదికి రావడం సహజం. 2019లో చంద్రబాబు దిగిపోతూ రూ.42,183 కోట్ల బకాయిలు పెట్టారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఈ స్థాయిలో బకాయిలు పెట్టిన దాఖలాలు లేవు. అయినా సరే చిరునవ్వుతో ఆ బకాయిలన్నీ మేం చెల్లించాం. ఇలా సర్వసాధారణ విషయాన్ని బూతద్దంలో చూపిస్తూ ఏదో జరిగిపోతోందనే భ్రాంతి కలిగించడంలో చంద్రబాబు దిట్ట.ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?.. మేమిచ్చినవీ ఊడగొట్టారుమెగా డీఎస్సీ అని హామీ ఇచ్చారు. ఉన్న డీఎస్సీ కూడా ఆగిపోయింది. మేం 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చాం. వీళ్లు 16,347 పోస్టులతో ఇస్తున్నామన్నారు. అది కూడా వాయిదా పడింది. ఇప్పటికి ఆర్నెల్లు గడిచిపోయాయి. అదే మేం అధికారంలోకి వచి్చన ఆర్నెళ్లు తిరగకమునుపే అక్టోబర్ 2వతేదీన గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.30 లక్షల ఉద్యోగాలు సృష్టించాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 58 వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. 2.66 లక్షల మంది వలంటీర్ల నియామకాలు చేశాం. ఇవన్నీ ఆర్నెళ్ల లోపే చేశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు ఊడపీకుతున్నారు. ఇప్పటికే 2.66 లక్షల మంది వలంటీర్లు, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో ఔట్ సోర్సింగ్లో పని చేస్తున్న 15 వేల మందిని పీకేశారు. ఆర్థిక విధ్వంస కారుడు బాబే..» ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం) పరిమితికి మించి 2014–19 మధ్య రూ.28,457 కోట్లు అప్పులు చేసింది నువ్వు కాదా బాబూ? ఈ అంశాన్ని కాగ్ నివేదిక, కేంద్ర ఆర్థిక సంఘం నివేదిక కూడా స్పష్టం చేసింది. చంద్రబాబు పరిమితికి మించి అప్పులు చేయడం వల్ల ఆ మేరకు మా హయాంలో అప్పులపై కోత పడింది. మా హయాంలో కేవలం రూ.1,600 కోట్లు మాత్రమే పరిమితికి మించి అప్పులు చేశాం. ఈ గణాంకాలు చాలు.. ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో.. ఎవరు ఆర్థిక క్రమశిక్షణతో నడిచారో.. ప్రభుత్వాన్ని నడిపించారో చెప్పడానికి! సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు ఎగ్గొట్టేందుకే చంద్రబాబు అప్పులను భూతంగా చూపే కార్యక్రమాలు చేస్తున్నాడు.» చంద్రబాబు హయాంలో కోవిడ్ లాంటి మహమ్మరి లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కరోనా ప్రభావంతో రాష్ట్రానికి ఆదాయ వనరులు తగ్గిపోయాయి. అనుకోని ఖర్చులు పెరిగిపోయాయి. దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా కోవిడ్ వల్ల అనూహ్య పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ చంద్రబాబు హయాంతో పోల్చితే వైఎస్సార్సీపీ హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు (సీఏజీఆర్) తక్కువగానే ఉంది. నాడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చే నాటికి రూ.1.32 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు ఆయన దిగిపోయే నాటికి రూ.3.13 లక్షల కోట్లకు చేరగా.. సీఏజీఆర్ 19.54 శాతంగా నమోదైంది. అనంతరం మా హయాంలో అప్పులు రూ.3.13 లక్షల కోట్ల నుంచి రూ.6.46 కోట్లకు చేరాయి. సీఏజీఆర్ 15.61 శాతంగా ఉంది. అంటేæ చంద్రబాబు హయాంలో కంటే వార్షిక అప్పుల వృద్ధి రేటు 4 శాతం తక్కువగా ఉన్నట్లు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలలోనే స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరు ఆర్ధిక విధ్వంసకారుడో చెప్పేందుకు ఈ లెక్కలే సాక్ష్యం. » నాన్ గ్యారంటీ అప్పులు బడ్జెట్లోకి రావు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలయిన ఎస్బీఐ, ఐవోసీ, హెచ్పీసీఎల్ లాంటి సంస్థలు చేసే అప్పులు కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఖాతాలో కనిపించవు. ఎందుకంటే ఇవన్నీ నాన్ గ్యారంటీ అప్పులు కాబట్టి. అయినా సరే ఈ నాన్ గ్యారంటీ అప్పులు కూడా కలిపి చూసినా నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.8,638 కోట్లుగా ఉంటే ఆయన దిగిపోయే నాటికి రూ.77,229 కోట్లకు తీసుకుపోయిన ఘనత కూడా బాబుదే. మా హయాంలో వాటిని రూ.75,386 కోట్లకు తగ్గించాం. అంటే రూ.2 వేల కోట్లకుపైగా అప్పులు తగ్గించాం. ఈ నాన్ గ్యారంటీ అప్పుల వార్షిక వృద్ధి రేటు చంద్రబాబు హయాంలో 54.98 శాతం ఉంటే మా హయాంలో అది 0.48 శాతం తగ్గింది. రాష్ట్ర అప్పులు, గ్యారంటీ అప్పులు, నాన్ గ్యారంటీ అప్పులు కలిపి చూస్తే నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.40 లక్షల కోట్లు ఉన్న అప్పులు ఆయన దిగిపోయే నాటికి రూ.3.90 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధిరేటు 22.63 శాతంగా నమోదైంది. మా హయాంలో ఆ అప్పులు రూ.3.90 లక్షల కోట్ల నుంచి రూ.7.21 లక్షల కోట్లకు చేరాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధి రేటు 13.57 శాతం మాత్రమే. ఈ లెక్కలు చూస్తే ఎవరు ఆరి్ధక విధ్వంసకారుడో ఇట్టే అర్ధమవుతుంది. » చంద్రబాబు ఏ స్థాయిలో అబద్ధాలు ఆడతారో ఇంకొక ఉదాహరణ చెప్పాలి. మా హయాంలో తలసరి ఆదాయం 9 నుంచి 2 శాతానికి తగ్గినట్టు తప్పుడు లెక్కలతో మరో అబద్ధాన్ని ప్రచారం చేశాడు. చంద్రబాబు సర్కార్ దిగిపోయేనాటికి 2018–19లో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.1.54 లక్షలు మాత్రమే ఉంటే మా హయాంలో 2024 మార్చి నాటికి రూ.2,42,479గా నమోదైంది. తలసరి ఆదాయంలో చంద్రబాబు హయాంలో మన రాష్ట్రం దేశంలో 18వ స్థానంలో ఉంటే.. రెండేళ్లు కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ మా హయాంలో 15వ స్థానానికి ఎగబాకింది. ఈ ఏడాది లెక్కలు కూడా కలిపితే మరో 3 స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. 2019–24 మధ్య ఏ రంగాన్ని తీసుకున్నా సరే ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏపీ వృద్ధి రేటు దేశం కంటే ఎక్కువగా ఉంది. అయినా సరే వాస్తవాలకు ముసుగేసి చంద్రబాబు వక్రీకరిస్తూ దు్రష్ఫచారం చేస్తున్నారు. ప్రతికూలతలోనూ పారిశ్రామిక వృద్ధి..బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ 2014–19 వరకు రాష్ట్ర వృద్ధి రేటు 13.50 శాతం ఉంటే 2019–24 మధ్య 10.60 శాతానికి పడిపోయిందన్నారు. బాబూ..! నీ హయాంలో కోవిడ్ లేదు. ప్రపంచమంతా రెండేళ్ల పాటు కోవిడ్తో అతలాకుతలమైంది. 2014–19తో పోల్చి చూస్తే గత ఐదేళ్లలో వృద్ధి రేటు ప్రతి రాష్ట్రంలోనూ తక్కువే ఉంది. దేశ వృద్ధి రేటు చూస్తే 2014–19 మధ్య 10.97 శాతం ఉంటే 2019–24 మధ్య 9.28 శాతం ఉంది. 2014–19 మధ్య మన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సగటున 11.92 శాతం ఉండగా 2019–24 మధ్య 12.61 శాతంగా నమోదైంది. ఇవేమీ నేను చెప్పిన లెక్కలు కాదు. బడ్జెట్తో పాటు చంద్రబాబు ప్రవేశపెట్టిన సామాజిక ఆరి్థక సర్వే నివేదికలో వెల్లడించిన అంశాలే ఇవన్నీ! రాష్ట్ర పారిశ్రామిక రంగంలో స్థూల వస్తు ఉత్పత్తి విలువ (జీవీఏ) చూస్తే 2014–19 మధ్య రూ.1.07 లక్షల కోట్ల నుంచి రూ.1.88 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వార్షిక వృద్ధిరేటు 11.92 శాతంగా నమోదైంది. అదే 2019–24 మధ్య కోవిడ్ ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ రూ1.88 లక్షల కోట్ల నుంచి రూ.3.41 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వార్షిక వృద్ధిరేటు 12.61 శాతం పెరిగింది. జాతీయ స్థాయి వృద్ధి రేటుతో పోల్చితే పారిశ్రామిక రంగంలో జీవీఏలో 2018–19లో 11 స్థానంలో ఉన్న రాష్ట్రం 2019–24 మధ్య 8వ స్థానంలోకి ఎగబాకింది. ఏపీ ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ (జీవీఏ) 12.61 శాతం ఉంటే దేశంలో సగటున ఉత్పత్తి విలువ 8.17 శాతంగా నమోదైంది. అంటే పారిశ్రామికాభివృద్ధి దేశంలో కంటే రాష్ట్రంలో 4 శాతం ఎక్కువగా ఉంది. మేకపిల్ల – కుక్కపిల్ల కథలో గజదొంగల్లా..!చంద్రబాబు అబద్ధాలు చూస్తే ఓ కథ గుర్తుకొస్తోంది. ఒక ఊరిలో ఓ అమాయకుడు భుజాన మేకపిల్లను వేసుకుని అమ్ముకోవాలని బజారుకు బయలుదేరతాడు. ఇంటి గడప దాటగానే ఒకడొచ్చి నీ కుక్క భలే ఉందంటాడు! దాంతో ఆ అమాయకుడు ఆలోచనలో పడతాడు. వీధి చివరికి వచ్చేసరికి మరొకడు ఎదురై నీ కుక్క పిల్ల చాలా తెల్లగా, బాగుంది అంటాడు. ఎక్కడి నుంచి తెచ్చావు? అంటాడు. మళ్లీ ఆ అమాయకుడు సందిగ్ధంలో పడి.. ఇది మేకపిల్లే.. కుక్కపిల్ల కాదు.. నీకు కళ్లు కనిపించట్లేదా అనుకుంటూ ముందుకువెళ్తాడు. అక్కడి నుంచి కిలోమీటరు ముందుకు వెళ్లేసరికి ఇంకొకడు కనిపిస్తాడు. అరే.. నీ కుక్కపిల్ల బాగుంది.. నాకు అమ్ముతావా? అంటాడు! ఇక.. ఆ అమాయకుడిలో గందరగోళం ప్రారంభం అవుతుంది. నేను మేక పిల్లలను భుజాన వేసుకుని వెళ్తుంటే ఇంతమంది అది కుక్క పిల్లే అని అంటున్నారు. నా కళ్లకు ఏమైనా అయ్యిందా? నాకు ఏమైనా జరిగిందా? అనే అనుమానంతో మేకపిల్లను కిందకు దించి నాకు మేకపిల్లా వద్దూ.. కుక్క పిల్లా వద్దూ! అనుకుని వెళ్లిపోతాడు. ఈ కథ చంద్రబాబు వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతూ రాష్ట్రాన్ని ఎలా కబళిస్తున్నారో చెప్పేందుకు అతికినట్లు సరిపోతుంది. ఈ కథలో తొలి వ్యక్తి పేరు చంద్రబాబు! రెండో వ్యక్తి దత్తపుత్రుడు! మూడో వ్యక్తి బీజేపీలో ఉన్న తన వదినమ్మ..! నాలుగో వ్యక్తి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5..లాంటి ఎల్లో మాఫియా. వీళ్లంతా కలిసి ఆంధ్రప్రదేశ్కు లేని అప్పులు ఉన్నట్టుగా వ్యవస్థీకృత నేరానికి పాల్పడి ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా సూపర్ సిక్స్లు, సూపర్ సెవన్లు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసేందుకే. ఈ కథలో రాష్ట్ర ప్రజలు అమాయకులు అయితే.. మేక పిల్ల మన రాష్ట్రం. ఆ నలుగురు గజదొంగలు కలసి కింద పడేసిన మేకను తీసుకెళ్లి బిర్యానీ వండుకుని పంచుకుని తిన్నట్లుగా.. ఈ నలుగురు రాష్ట్ర ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని దోచేసే పంచుకు తింటున్నారు. ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఉంటుందా?ఆరోగ్యశ్రీ గతంలో వెయ్యి ప్రొసీజర్స్కు మాత్రమే పరిమితం కాగా మేం 3,300 ప్రొసీజర్స్కు పెంచి రూ.25 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యాన్ని అందించేలా పథకాన్ని విస్తరించాం. గతంలో చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.వెయ్యి కోట్ల కంటే తక్కువే ఉన్న పరిస్థితి నుంచి మా హయాంలో ఏకంగా రూ.3,762 కోట్లకు చేరాయి. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సామాజిక ఆరి్థక సర్వే నివేదికను పరిశీలిస్తే 2023–24లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అని పేర్కొన్నారు. 2023–24లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఉండగా దాన్ని మార్చేసి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ స్కీంగా పెట్టేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 13,22,319 మంది రోగులకు మేలు చేశారట! రూ.3,762 కోట్లు ఖర్చు చేశారట! 1–4–2023 నుంచి 31–3–2024 మధ్య ఎవరి ప్రభుత్వం ఉంది? వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.3,762 కోట్లు ఖర్చు చేసి 13 లక్షల మందికిపైగా పేదలకు వైద్యం అందిస్తే ఆ మంచి ఎక్కడ వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి వస్తుందోననే ఆందోళనతో ఇలా చేశారు. మేం ఖర్చు పెట్టింది వాళ్లు (చంద్రబాబు) వ్యయం చేసినట్లు రాసుకుని.. దొంగ పబ్లిసిటీ.. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే మీకంటే (చంద్రబాబు) దిక్కుమాలిన ప్రభుత్వం ఇంకొకటి ఉంటుందా? నాలుగు నెలల నుంచి జీతాలు అందట్లేదని 104, 108 ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులను పెండింగ్లో పెట్టేశారు. రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మా హయాంలో జీరో వేకెన్సీ పాలసీతో తగినంత మంది స్పెషలిస్టు డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నాం. 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టాం. పులివెందుల సహా మరో రెండు కొత్త కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం సీట్లను కేటాయించినా అడ్డుపడిన చరిత్ర మీది. 32.79 లక్షల మందికి ఉద్యోగాలు..అసెంబ్లీలో చంద్రబాబు ప్రవేశపెట్టిన సామాజిక ఆర్ధిక సర్వే నివేదికలో పేర్కొన్న గణాంకాలను పరిశీలిస్తే.. ఎంఎస్ఎంఈ రంగంలో ఆయన హయాంలో 2014–19 మధ్య 8.67 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో 2019–24 మధ్య 32,79,770 ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడైంది. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. భారీ, మెగా ప్రాజెక్టులతో మా హయాంలో 1,02,407 ఉద్యోగాలు కల్పిస్తే చంద్రబాబు హయాంలో ఉపాధి కల్పన చాలా తక్కువగా నమోదైంది. మేనిఫెస్టోతో మోసం..చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఆర్గనైజ్డ్ క్రైమ్ను ఉపయోగించారు. సూపర్ సిక్స్లు, సూపర్ సెవన్లు అంటూ హామీలిచ్చి మేనిఫెస్టో అంటూ ఒక మాయా పుస్తకాన్ని రచించారు. దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరి మనోభావాలతో ఆడుకుని, వాడుకున్నారు. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు సూపర్ సిక్స్లు, సూపర్ సెవన్లలో అతి చిన్న అంశాలు! కూటమి నాయకులు ఎన్నికల వేళ ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లిన సమయంలో చిన్న పిల్లలు కనిపిస్తే చాలు.. ఎంత మంది ఉన్నా సరే.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15వేలు..నీకు రూ.15 వేలు.. సంతోషమా? అనేవాళ్లు. వాళ్ల అమ్మ.. చిన్నమ్మలు బయటకొస్తే నీకు రూ.18 వేలు.. నీకు రూ.18 వేలు.. నీకు రూ.18 వేలు.. అనేవాళ్లు! అంతటితో ఆగకుండా ఆ ఇంట్లో పెద్ద వయసు మహిళలు కనిపిస్తే నీకు రూ.48 వేలు..నీకు రూ.48 వేలు.. నీకు రూ.48 వేలు అనేవాళ్లు. ఇంట్లో 26 ఏళ్ల యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు.. నీకు రూ.36 వేలు..నీకు రూ.36 వేలు అనేవాళ్లు.రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు.. సంతోషమా? అనేవాళ్లు. ఇవన్నీ సూపర్ సిక్స్లో భాగమే. పెద్దవి కూడా. మోసాల్లో భాగంగా ఇవన్నీ ఎలాగూ చేయరనుకుంటే చిన్న చిన్న వాటిల్లోనూ మోసాలే! రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు 1.55 కోట్లు ఉన్నాయి. కర్నాటకలో 1.84 కోట్లు, కేరళలో 96 లక్షలు, తమిళనాడులో 2.33 కోట్లు, తెలంగాణలో 1.24 కోట్లున్నాయి. ఏపీలోని 1.55 కోట్ల కనెక్షన్లకు సిలిండర్కు రూ.895 చొప్పున ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు రూ.4,200 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్లో మాత్రం రూ.895 కోట్లే పెట్టారు. అంటే ఇచ్చేది ఒక్క సిలిండర్.. అది కూడా అందరికీ ఇవ్వరు. ఒక్కో సిలిండర్ ఇవ్వాలంటే ఏడాదికి రూ.1,400 కోట్లు కావాలి. అందరికీ ఇవ్వడానికి నీకు (చంద్రబాబు) మనసు లేదు. 40 లక్షల మంది మాత్రమే లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారని అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. ఆర్థిక మంత్రి ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామంటారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఈ సంవత్సరానికి ఒకటే ఇస్తామంటారు. ఒక మంత్రి చెప్పేదానికి.. ఇంకో మంత్రి చెప్పేదానికి పొంతన లేదు. పోనీ ఒక్కటన్నా అందరికీ ఇస్తున్నారంటే అదీ లేదు. దారుణమైన అబద్ధాలు, మోసాలకు ఇది నిదర్శనం కాదా? -
విశాఖలో ఆశ వర్కర్ల నిరసనలు..లోకేష్ గాలి తీసేసిన ఆశావర్కర్
-
నా ఆలోచనలతో సంపద సృష్టిస్తా: చంద్రబాబు
సాక్షి, అమరావతి : ‘అన్ని వర్గాల వారిలో మా ప్రభుత్వంపై ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, హామీల అమలుకు అప్పులు తేవాలంటే ఎఫ్ఆర్బీఎం షరతులున్నాయి. అమ్మడానికి ఆస్తులు కూడా లేవు’.. అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. హామీలు అమలుచేయడానికి డబ్బుల్లేవుగానీ, తన దగ్గర కొత్త ఆలోచనలున్నాయని చెప్పారు. వాటితో సంపద సృష్టించి, పేదరికాన్ని నిర్మూలిస్తానన్నారు. బడ్జెట్పై శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కూటమి నుంచి 21 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. ఫలితంగా ఢిల్లీలో పలుకుబడి పెరిగిందన్నారు. హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చుపెడతామని.. ఇందులో భాగంగా ఆరు కొత్త పాలసీలను ప్రకటించామని సీఎం చెప్పారు. గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్సీపీ పాలనతో ప్రభుత్వంలోని అన్ని శాఖలు అస్తవ్యస్థంగా మారాయని, వివిధ పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని ఆయన ఆరోపించారు. ఇది ఉత్తమ బడ్జెట్.. రూ.2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టామని.. ఇది ఎంతో ఉత్తమ బడ్జెట్ అని చంద్రబాబు అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఇచి్చన సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా నెరవేరుస్తూ అదనపు హామీలను అమలుపరుస్తున్నామని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చిన నిధులతో అమరావతిని పట్టాలెక్కించామని.. గోదావరి, పెన్నా, వంశధార నదుల అనుసంధానానికీ చర్యలు తీసుకుంటామన్నారు. ఇక సంక్రాంతిలోపు రహదారులపై గుంతలన్నింటినీ పూడుస్తామని.. నూతన మద్యం పాలసీ అమలుతో రాష్ట్రంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మద్యం బ్రాండ్లన్నింటినీ అందుబాటులోకి తెచ్చామని.. ప్రజలు కూడా తమ జీవితాలు ఎలా మారాయో చర్చించుకోవాలన్నారు. భూములు అమ్ముకుంటే రాజధాని నిర్మాణం పూర్తి.. ఇక అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చంద్రబాబు చెప్పారు. రాజధాని కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టే అవసరంలేదని తాను గతంలో చాలా సందర్భాల్లో చెప్పానన్నారు. ఇక్కడ 10 వేల ఎకరాల భూమి ఉందని.. దీనిని అమ్ముకుంటే దశల వారీగా రాజధాని నిర్మాణం పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఆడబిడ్డల రక్షణ కోసం తమ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని.. సోషల్ మీడియాలో వారిని కించపరిచేలా పోస్టులు పెడితే వారు ఏ పార్టీ వారైనా విడిచిపెట్టబోమని హెచ్చరించారు. డిసెంబరులోగా పేదలకు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. ఇసుక విధానంపై మా ఎమ్మెల్యేలే అసహనంతో ఉన్నారు.. సభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.15 వేల కోట్లు గ్రాంటా అప్పా అనే సందేహాలపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. అప్పులపై ఆధారపడితే రాష్ట్రం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని.. గత ప్రభుత్వంలో చేసిన అప్పుల్లో 80 శాతం మేర సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చుపెట్టారని.. అదే బాబు పాలనలో చేసిన అప్పుల్లో 40 శాతం మాత్రమే సంక్షేమానికి ఖర్చుచేశారని పయ్యావుల చెప్పారు. నూతన ఇసుక విధానాన్ని తీసుకొచ్చామని.. అయితే, దీనిపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అంతేకాక, చాలా జిల్లాల్లో సమస్యలు ఉన్నట్లు తమ ఎమ్మెల్యేలే అసహనం వ్యక్తంచేస్తున్నారని పయ్యావుల సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఇసుక పాలసీలో ప్రభుత్వానికి మంచిపేరు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. -
నేటి నుంచి అసెంబ్లీ
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజల కళ్లుగప్పటం... రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై ఎవరూ ప్రశ్నించకుండా రెడ్బుక్ అమలుతో దృష్టి మళ్లింపు రాజకీయాలే లక్ష్యంగా సాగుతున్న సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు సోమవారం శాసనసభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. నేటి ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్లో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసన సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. అదే సమయానికి శాసన మండలిలో గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తి అయిన అనంతరం వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు. మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్ను చదువుతారు.సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్నట్లుగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3 వేలు చొప్పున భృతి, స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు, రైతన్నలకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం, ప్రతి మహిళకు (19–59 ఏళ్ల వయసు) నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం లాంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మభ్యపెడుతున్న కూటమి సర్కారు అసెంబ్లీ సమావేశాలను సైతం డైవర్షన్ రాజకీయాలకే వినియోగించుకోవాలని ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై యథేచ్ఛగా జరుగుతున్న అఘాయిత్యాలు, లైంగిక దాడులు, హత్యలు, శాంతి భద్రతల వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకు.. ఇప్పుడే కొత్తగా సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినట్లు, వాటిపైనే చర్చించాలనే వైఖరితో ప్రభుత్వం ఉందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పలుచోట్ల మైనర్ బాలికలు అత్యాచారాలు, హత్యలకు గురి కావడం నుంచి దృష్టి మళ్లించడమే లక్ష్యంగా సోషల్ మీడియా పోస్టులపై ప్రభుత్వ పెద్దలు ఇటీవల గగ్గోలు పెడుతున్నారు. ఇదే అంశాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించాలని సన్నద్ధమైనట్లు సమాచారం. మరోపక్క సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బడ్జెట్ సమావేశాల్లో గత సర్కారుపై ఆరోపణలు, నిందలు మోపేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ హామీ కింద యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లేదంటే నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి పార్టీలు హామీలిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దీనిపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సూపర్ సిక్స్ హామీ కింద స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. దీని గురించి కూడా సర్కారు నోరు విప్పడం లేదు. ఏటా రైతన్నలకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని ఇస్తామన్నారు. ప్రతి మహిళకు (19–59 ఏళ్ల వరకు) నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయాన్ని ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లూ వీటి అమలు గురించి ప్రస్తావించకుండా డైవర్షన్ రాజకీయాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ పధకాలకు కేటాయింపులు ఉంటాయో లేదో నేడు తేలనుంది. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా మరో నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుండటంతో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతోంది.శాసన సభ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ ద్వారకా తిరుమల రావు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్తో ఆదివారం సమీక్షించారు. -
కాంగ్రెస్ గ్యారంటీలపై వ్యాఖ్యలు.. ఖర్గేపై మండిపడ్డ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ చూసుకొని ఎన్నికల హామీలు ప్రకటించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. గాలిమాటల గ్యారెంటీలిస్తే.. మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా అని విమర్శించారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.బడ్జెట్ను మించి గ్యారంటీలు ఇవ్వొద్దని.. అలా చేస్తే రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి వస్తుందన్న ఖర్గే వ్యాఖ్యలకు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా? ఆరు గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి తెలియదా? తెలంగాణలో కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు.. ఈ విషయాలు ఎందుకు గుర్తుకురాలేదు?చదవండి: కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది: మోదీ ఏవీ చూసుకోకుండా.. కేవలం అధికారమే లక్ష్యంగా.. కాంగ్రెస్ ఆడిన గ్యారెంటీల గారడీతో తెలంగాణ రాష్ట్రం ఏడాదిలోనే ఆగమైంది. తెలంగాణ ప్రజలను నమ్మించి, నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. పదేళ్లపాటు ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణను అడ్డగోలు హామీలతో మభ్యపెట్టినందుకు తప్పు ఒప్పుకోవాలి.అనాలోచితంగా ఇచ్చే కాంగ్రెస్ గ్యారెంటీలతో.. భవిష్యత్ తరాలకు కూడా నష్టం జరుగుతుందని ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషం. కానీ.. కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మిన పాపానికి ఏడాదికాలంగా తెలంగాణకు జరిగిన నష్టం పూడ్చలేనిది!. గ్యారెంటీల మాటున కాంగ్రెస్ చేసిన మోసం క్షమించలేనిది’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.గౌరనీయులైన ఖర్గే గారు..గాలిమాటల గ్యారెంటీలిస్తే.. మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా..?కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా?బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా..?ఆరు గ్యారంటీలతో… https://t.co/XcHhFGnDkN— KTR (@KTRBRS) November 1, 2024 -
కాంగ్రెస్ రంగు బయటపడింది: మోదీ
ప్రధానమంత్రి మోదీ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అసలు రంగు బయటపడిందని అన్నారు. బడ్జెట్కు మించి గ్యారంటీలు ఇవ్వొద్దంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. హామీలు ఇవ్వడమే సులభమే అయినప్పటికీ వాటిని అమలు చేయడం కష్టం, అసాధ్యమన్న సంగతి కాంగ్రెస్కు తెలుసని పేర్కొన్నారు. అమలు చేయలేమని తెలిసినప్పటికీ హామీలు, గ్యారంటీల పేరిట ఆ పార్టీ ప్రజలను దగా చేస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలో ఒక గ్యారంటీని రద్దు చేయాలని చూస్తు న్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ పాలిత తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారిందన్నారు. తెలంగాణలో రుణ మాఫీ కోసం రైతులు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ దుష్ట రాజకీయాలకు పేదలు, రైతులు, యువత, మహిళలు తీవ్రంగా నష్టపోతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హరియాణా ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలను తిరస్కరించారని గుర్తుచేశారు. కాంగ్రెస్కు ఓటు వేయడం అంటే అధ్వాన్న పరిపాలనకు, దిగజారిన ఆర్థిక వ్యవస్థకు, వనరుల లూటీకి ఓటు వేసినట్లేనని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని వెల్లడించారు. కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తే హామీలు అమలు కాకపోవడమే కాదు, ఉన్న పథకాలు సైతం రద్దవుతాయని విమర్శించారు. కాంగ్రెస్ సంస్కృతి అయిన బూటకపు హామీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. దేశ ప్రజలు కేవలం అభివృద్ధిని కోరుకుంటున్నారు తప్ప అదే పాతకాలం నాటి బోగస్ హామీలను కాదని తేల్చిచెప్పారు. -
బాబు మాటలు నేతి బీర చందమే!
బీరాలు పలకడం ఎలాగో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలి. ప్రతిపక్షంలో ఉంటే బెదిరించడం, అధికారంలో ఉంటే దబాయించడం ఈయనగారికి బాగా ఒంటబట్టిన విద్య. ఓటేస్తే అది చేస్తా ఇది చేస్తామని సూపర్ సిక్స్ పేరుతో హామీలు గుప్పించిన బాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని సాంతం మరచిపోయారు. పైగా హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి బాబు విషయం బాగానే తెలిసినట్లు ఉంది. అందుకే కొన్నేళ్ల క్రితమే ‘యూ టర్న్’ బాబు అని పేరు పెట్టారు. చంద్రబాబు కూడా ఆ పేరును ఎప్పటికప్పుడు సార్థకం చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గమనించండి.. ప్రజలు ఆనందంగా ఉంటే వైఎస్సార్సీపీ నేతలు భరించలేకపోతున్నారట! కక్ష్యలు కార్పణ్యాలు తనకు అసలే తెలియవట! హద్దుమీరితే ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసట! వైఎస్సార్సీపీ తన పాలన కాలంలో వందకు 70 మంది అధికారులను భ్రష్టు పట్టించిందట! అవినీతి కేసులో జైల్లో ఉండగా ఆయన్ను చంపే ఆలోచన చేశారట! ఇవీ బాబుగారి వాక్కులు. వీటితోపాటు.. ‘‘రాష్ట్రానికి వీళ్లు అరిష్టం’’ అంటూ బాబు వైఎస్సార్సీపీని ఉద్దేశించి మాట్లాడారని అనుకూల మీడియా ఓ భారీ కథనాన్ని వండి వార్చింది. ఇచ్చిన హామీలు నెరవేర్చడం అరిష్టమా? లేక అన్నీ ఎగ్గొట్టడమా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో ఈ నాలుగు నెలల కాలంలో ఎప్పుడైనా బాబు చెప్పాడా? కనీసం షెడ్యూలైనా ఇచ్చారా? ఇవ్వలేదే!. వాస్తవాలిలా ఉంటే.. ఆయనేమో.. ప్రభుత్వం చాలా మంచిదని తనకుతాను కితాబిచ్చుకుంటున్నారు. హామీలన్నింటినీ ఉట్టికెక్కించినా తన హయాంలో ప్రజలు ఆనందంగా ఉన్నారట! దబాయించడం అంటే ఇదే మరి!విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ బాబు తీరు ఇంతే. ప్రతిపక్షంలో ఉండగా.. తామైతే ప్రైవేట్పరం కాకుండా రక్షిస్తామని గొప్పలు చెప్పారు. తీరా ప్రభుత్వంలోకి వచ్చాక మాత్రం చేతులెత్తేశారు. కుంటిసాకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేశానని తరచూ చెప్పుకునే బాబు ప్రతిపక్షంలో ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అవగాహన లేకపోయిందని చెప్పడంతోనే తెలిసిపోయింది ఆయన మాటల్లో డొల్లతనం ఎంత అన్నది! విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రస్తుతం బాబు చేస్తున్న వ్యాఖ్యల్ని గమనిస్తే అది ప్రైవేట్ పరం కావడం తథ్యమని అనిపించకమానదు. అదే జరిగితే విశాఖకే కాదు.. మొత్తం ఆంధ్రప్రదేశ్కే అరిష్టం అవుతుంది!తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం విషయం.. లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని ఒకసారి.. ఎక్కడ వాడారో అప్రస్తుతమని ఇంకోసారి!! ఇది కదా అరిష్టం! విజయవాడ కనకదుర్గమ్మ ఉత్సవాల విషయంలోనూ ఇంతే. మునుపెన్నడూ లేనంత విధంగా ఉత్సవాలు జరిగాయని ఆయనకు ఆయన కితాబిచ్చుకున్నారు కానీ.. ప్రత్యేక దర్శనం కోసం రూ.500 లు పెట్టి టికెట్ కొన్నవారు కూడా గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చిందని, వీఐపీలు, జత్వానీ వంటి మోసకారి నటీమణులు నేరుగా, దర్జాగా దర్శనానికి వెళ్లారని భక్తులు ఆరోపించారు. ముఖ్యమంత్రి మాత్రం ఆహా, ఓహో అని పొగుడుకుంటున్నారు. తాను అధికారంలో ఉండగా జరిగిన అవినీతి కార్యకలాపాలను ఎండగట్టారని, కేసులు పెట్టి, జైలుకు పంపారన్న అక్కసుతో ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేయడమే కాకుండా దాదాపు పాతికమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పక్కనపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తనకు కక్షంటే ఏమిటో తెలియదని అమాయకపు మాటలు చెబుతున్నారు. వరద సాయం జరిగేటప్పుడు 5 - 10 శాతం దుబారా కావచ్చని ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి చెప్పడం రాష్ట్రానికి అరిష్టమో కాదో తేల్చుకోవాలి. రాజమండ్రి జైలులో తనను చంపాలనుకున్నారని ప్రచారం జరిగిందని ఒక సీఎం అంటున్నారంటే అంతకన్నా పచ్చి అబద్ధం మరొకటి ఉంటుందా? నిజంగా అలాంటిదేమైనా జరిగి ఉంటే ప్రస్తుతం ఆయనే సీఎంగా ఉన్నారు కదా, నిజానిజాలు నిగ్గుదేల్చవచ్చు కదా? జైలులో ఏసీ కూడా పెట్టించుకున్న ఈ నాయకుడు తనకు తగు సదుపాయాలు కల్పించ లేదని చెబుతున్నారంటే ఏమి అనుకోవాలి! ఈనాడు, జ్యోతి వంటి టీడీపీ అనుకూల మీడియాలో రాసిన పచ్చి అబద్ధాలను ఇప్పటికీ ఆయన వాడుకుంటూనే ఉన్నారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ. 23 కోట్లు ఖర్చుపెట్టినదానికి సమాధానం ఇవ్వకపోగా ఐతే ఏంటట? అన్నట్లుగా మాట్లాడుతున్నారు. దీన్ని కదా అరిష్టపు పాలన అనాల్సింది. ఈవీఎంలు, జమలి ఎన్నికలపై చంద్రబాబు పలు మార్లు మాటమార్చిన సంగతి కొత్తేమీ కాదు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెప్పిందే ఆయన. ఒంగోలులో ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి అక్రమాలు జరగలేదని ఎందుకు ఎన్నికల సంఘం ఎందుకు తేల్చలేదో చంద్రబాబు వివరించి ఉంటే అప్పుడు ఆయన మాటను నమ్మవచ్చు.ఈవీఎం బ్యాటరీ ఛార్జింగులో ఎందుకు తేడా వచ్చిందో చంద్రబాబైనా తెలిపి ఉంటే బాగుండేది. కానీ అలా చేయకుండా 2019లో వైఎస్సార్ సీపీ ఎలా గెలిచిందని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆయన ఈవీంలపై సుప్రీం కోర్టు దాకా ఎందుకు వెళ్లారో చెప్పరు. ఈ సంగతులు పక్కన పెడితే ‘‘నీకు 15 వేలు, నీకు 15 వేలు’’ అంటూ పిల్లలనూ, ‘‘నీకు 18 వేలు’’ అంటూ తల్లుల్ని, ‘‘నీకు 48 వేలు’’ అంటూ యాభై ఏళ్లలోపు ఉన్న బీసీలను ఊరించి వారికి మొండి చేయి చూపడం అరిష్టపాలన అవుతుందా కాదా? నిరద్యోగులకు నెలకు రూ. మూడు వేలు ఇస్తామని ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం, వాలంటీర్లను కొనసాగించడమే కాకుండా రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని ఆశపెట్టి, అలా చేయకుండా, వారి బతుకులను రోడ్డు పాలు చేస్తే అది మంచి ప్రభుత్వం అవుతుందా? లేక అరిష్టపు ప్రభుత్వమవుతుందా? కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై మాత్రం చంద్రబాబు ఉన్నవి లేనివి కల్పించి దుష్ప్రచారం చేస్తుంటారు.జగన్ తాను ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేస్తే అది అరిష్టమట. టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన దాదాపు అన్ని హామీల ఊసే ఎత్తకుండా, జనాన్ని మోసం చేయడం అరిష్టం కాదట? జగన్ సచివాలయాలు, హెల్త్ క్లినిక్కులు, రైతు భరోసా కేంద్రాలు ఇలా అనేక వ్యవస్థలను తీసుకురావడం అరిష్ట పాలన అవుతుందా? వాటిని అన్నిటినీ ప్రస్తుతం ధ్వసం చేయడం అరిష్టపాలన అవుతుందా? ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం లోటుపాట్లు లెక్కకు మిక్కిలి. చంద్రబాబు ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతూ కూడా ఎల్లో మీడియా అండతో జనాన్ని మభ్య పెట్టాలని చూడడం అన్నిటికన్నా పెద్ద అరిష్టం కాదా?- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
హామీలిచ్చా.. అప్పులున్నాయిగా..
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలిచ్చానని, కానీ, రాష్ట్రానికి ఉన్న రూ.10 లక్షల కోట్ల అప్పులకు వడ్డీ కట్టాలని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని, ప్రతి కులాన్ని అధ్యయనం చేస్తున్నానని, వారిని ఏ విధంగా పైకి తీసుకురావాలో ఆలోచిస్తున్నానని అన్నారు. ఆయన శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. అడవి తల్లికి ఆదివాసీ చీరను సమర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. దేశ ప్రధానితో అరకు కాఫీ తాగించి ఆయన్నే బ్రాండ్ అంబాసిడర్ చేశానని చెప్పారు. దేశంలోని ప్రతి షాపులో అరకు కాఫీ అమ్మేలా చేస్తానన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి తగ్గుతోందని, గిరిజనుల్లో మాత్రం సంతానం పెరగడం శుభపరిణామమని అన్నారు. ఈ రోజుల్లో కూడా ఏజెన్సీలో డోలీ మోతలు విచారకరమని అన్నారు. డీఎస్సీకి పోటీ పడే గిరిజన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. గిరిజన విద్యార్థుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతిలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. లంబసింగిలో మ్యూజియం, పాడేరులో మెడికల్ కళాశాల రూ.500 కోట్లతో పూర్తి చేస్తామని చెప్పారు. పాడేరులో రూ.10 కోట్లతో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గిరిజన గ్రామాలకు రోడ్లు వేస్తామని, కుళాయి ద్వారా నీళ్లు అందిస్తామని, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని హామీల వర్షం కురిపించారు. మొన్నటి ఎన్నికల్లో వచ్చిన సుడిగాలిలో జగన్ కొట్టుకుపోయాడని, ఇక తిరిగి రాడని చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలో తెచ్చిన 16 పథకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ద్వారా మీ భూములను దోచుకోవాలని చూశారని, అందుకే ఆ చట్టాన్ని రద్దు చేశామని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చంద్రబాబు కసరత్తుఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీచేసే విషయంపై సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు. ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం ఆ జిల్లా నేతలతోపాటు పలువురు పార్టీ సీనియర్లతో మాట్లాడారు. పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. నేతలు చెప్పిన లెక్కల ప్రకారం గెలవడానికి సరిపోయే సంఖ్య లేదని తెలిసింది. అందుకే అభ్యర్థిని ఖరారు చేయకుండా సాగదీస్తున్నట్లు సమాచారం. పోటీ చేయాల్సివస్తే అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారు. -
చంద్రబాబు నోట మళ్లీ పాత పాట
సాక్షి, నంద్యాల జిల్లా: అలవికాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబు.. మళ్లీ పాత పాటే పాడారు. గురువారం.. శ్రీశైలంలో పర్యటించిన చంద్రబాబు.. ‘‘నేను ఎన్నో హామీలిచ్చాను.. కానీ ఖజానా ఖాళీగా ఉంది. డబ్బులు లేవు.. ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలను డైవర్ట్ చేయడానికి డ్రామాకు తెరలేపారు.చంద్రబాబు హామీలు అమలు చేసేవి కావని తేలిపోగా, కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకే.. వేలం పాట మాదిరిగా ప్రకటించిన హామీలు మరోసారి మాయ చేసేందుకేనని ప్రజలకు అర్థమవుతోంది. 2014లో మాదిరిగా ఈసారి కూడా మేనిఫెస్టో మాయం కావడం ఖాయమంటున్నారు. జనాన్ని ఎలా మోసం చేయాలన్న దానిపైనే చంద్రబాబు దృష్టి పెట్టారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతోంది. తల్లికి వందనం, రైతులకు, మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, ఉచిత పంటల బీమా ఇలా ఎన్నో పథకాలకు ఇంకా డబ్బులు వేయలేని కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కూటమి పార్టీలకు ఓట్లు వేసి ఎంత తప్పు చేశామో తెలుసుకుంటున్న ఓటర్లు.. జగన్ సంక్షేమ పాలనను గుర్తు తెచ్చుకుంటున్నారు. చంద్రబాబువి బూటకపు మాటలేనని.. సూపర్ సిక్స్ హామీలన్నీ నీటి మూటలేనని చంద్రబాబు వ్యాఖ్యలతో స్పష్టమైంది.కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా రూ.70 వేల కోట్లు దాకా ఖర్చు చేసింది. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా నేరుగా లబ్దిదారులకే ప్రయోజనం చేకూర్చింది. -
చంద్రబాబూ.. ఆ మాటలు ఏమయ్యాయి?: రవిచంద్రా రెడ్డి
సాక్షి, ఢిల్లీ: చంద్రబాబు ప్రభుత్వం మూడు వారాల్లోనే పది వేల కోట్ల అప్పులు చేసిందని.. సంపద సృష్టించడం ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని బాబు అధికారంలోకి వచ్చారు.. సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు మాటలు ఏమయ్యాయి? అంటూ ప్రశ్నించారు వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.రవిచంద్రా రెడ్డి.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ వ్యవస్థను బాబు పక్కనపెట్టారు.. వాలంటీర్లకు పది వేల రూపాయల ఇస్తామన్న మాట ఏమైంది? అని మండిపడ్డారు. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి ఇస్తామన్న 20,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు?.రైతులకు నిధులు ఏ తేదీన విడుదల చేస్తారో చెప్పాలి’’ అని రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తల వ్యాపారాలు, ఆస్తులపైన దాడులు చేస్తున్నారు. పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాడులు పక్కనపెట్టి, సంపద సృష్టిపైన దృష్టి పెట్టండి. టీడీపీ కార్యకర్తలను సంయమనం పాటించేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలి’ అని రవిచంద్రారెడ్డి అన్నారు. -
గొంతు నొక్కేస్తున్నారు..
ఒక ప్రభుత్వాన్ని ఐదేళ్ల కోసం ఎన్నుకుంటారు. కానీ వీళ్లందరూ 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని గొంతు పట్టుకుని పిసికేయాలని ఆలోచన చేస్తున్నారు. వీళ్లు గొంతు పట్టుకుని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు.. నా అక్కచెల్లెమ్మల గొంతులను, నా అవ్వాతాతల గొంతులను, నా రైతన్నల గొంతులను, నా పేద విద్యార్థుల గొంతులనే అని ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా – మంగళగిరి సభలో సీఎం జగన్నేను ప్రతి సందర్భంలోనూ నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అని ఎందుకు అంటానో తెలుసా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బాహాటంగా ‘‘నా..’’ అని పిలుచుకుంటూ వారిపై ప్రేమ చూపించినప్పుడు ఆయా సామాజిక వర్గాలకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా గౌరవం, ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అది జరగాలనే తపనతోనే మీ బిడ్డ ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు.– కడప సభలో సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, తిరుపతి, సాక్షి ప్రతినిధి, కడప: ‘మీరంతా ఐదేళ్ల కోసం అధికారం ఇస్తే 57 నెలలకే మీ బిడ్డ గొంతు నొక్కేస్తున్నారు! వీళ్ల దుర్మార్గాలు, కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయంటే జగన్కు ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తుందోననే ఆందోళనతో ఇంటికే వచ్చే పెన్షన్కు కూడా అడ్డుపడి రానివ్వకుండా చేస్తున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కి రెండు నెలలైంది. ఎన్నికల కోడ్ రాకముందే బటన్లు నొక్కినా ఎక్కడ అక్కచెల్లెమ్మలకు డబ్బులు వెళ్లిపోతాయో, ఎక్కడ జగన్ను వాళ్లంతా మంచివాడు అని అనుకుంటారేమోనని అది కూడా అడ్డుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. నా అక్కచెల్లెమ్మలకు ఎట్టి పరిస్ధితుల్లోనూ పథకాల డబ్బులు అందాలని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీ బిడ్డ కోర్టుకు వెళ్తున్నాడంటే ఈ వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో ఆలోచన చేయండి. బాగా ముదిరిపోయిన తొండ లాంటి చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారు. ఒకవైపు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జత కట్టి మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం కపట ప్రేమ నటిస్తున్నారు’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు, వైఎస్సార్ జిల్లా కడపలోని వన్టౌన్ సమీపాన మద్రాస్ రోడ్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. విశ్వసనీయతతో అడుగులు..మరో మూడు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు. వచ్చే ఐదేళ్లు మీ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలివి. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. మళ్లీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ఇదే. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. మరోవైపు మీ బిడ్డది మనసున్న ప్రభుత్వం. మీ బిడ్డ పేదవాడిని పేదవాడిగానే చూశాడు. ఏ రోజూ కులమతాలు చూడలేదు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత 59 నెలల కాలంలో 130సార్లు బటన్లు నొక్కి వివిధ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. గతంలో రాష్ట్రంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఏకంగా మరో 2.31 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాడు. 1.30 లక్షల మంది నా తమ్ముళ్లు, చెల్లెమ్మలే సచివాలయాల్లో కనిపిస్తున్నారు. ఎన్నికలు ముగిశాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పారేసే సంస్కృతికి తెర దించి ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి చిత్తశుద్ధి చాటుకున్నాం. విశ్వసనీయతకు అర్థం చెప్పాం మన మేనిఫెస్టోను గడపగడపకూ పంపించి మీరే టిక్ పెట్టాలని కోరుతూ అక్కచెల్లెమ్మల ఆశీర్వాదం తీసుకున్నాం. మేనిఫెస్టోకి విశ్వసనీయత తెచ్చిన ఇలాంటి కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా ? మచ్చుకు కొన్ని గడగడా చెబుతా..మన ప్రభుత్వం తెచ్చిన కొన్ని పథకాలు మచ్చుకు కొన్ని గడగడా చెబుతా. ‘నాడు–నేడు’తో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు, ఇంగ్లిష్ మీడియం, 6వ తరగతి నుంచే ఐఎఫ్పీలతో డిజిటల్ బోధన, 8వ తరగతికి రాగానే ట్యాబ్లు, 3వ తరగతి నుంచి టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణం, బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్, బడులు తెరవగానే విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి, పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెన, ఖర్చుల కోసం వసతి దీవెన లాంటి వినూత్న పథకాలు, కార్యక్రమాలు గతంలో ఉన్నాయా? ఉన్నత విద్య అభ్యసిస్తున్న 93 శాతం మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో లబ్ధి చేకూరుస్తున్నాం. తొలిసారిగా అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను మన డిగ్రీలలో భాగస్వామ్యం చేయడం, తప్పనిసరి ఇంటర్న్షిప్ లాంటివి మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు కావా? ఈ రోజు ఒకటో తరగతి ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న పిల్లవాడు 2035లో ఐబీ సర్టిఫికెట్తో పదో తరగతి పాస్ అవుతాడు. ఆ తర్వాత ఏ హార్వర్డ్ నుంచో, ఎల్ఎస్సీ, స్టాన్పర్డ్ నుంచో, ఏంఐటీ నుంచో సర్టిఫికెట్ కోర్సులతో డిగ్రీ పట్టా తీసుకుంటాడు. ఆ పిల్లవాడు అనర్గళంగా ఇంగ్లిష్లో మాట్లాడుతూ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో మిమ్మల్ని ఆలోచన చేయమని కోరుతున్నా. పేదల తలరాతలు మార్చేందుకు మీ బిడ్డ వేస్తున్న అడుగులు ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో ఆలోచన చేయండి. విప్లవాత్మక పథకాలు, సేవలు..నా అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడి ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తంతోపాటు వారి పేరిటే ఏకంగా 31లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. 22లక్షల గృహ నిర్మాణాలను సైతం చేపట్టాం. అక్కచెల్లెమ్మల బాగు కోసం ఇంతగా తపించిన ప్రభుత్వాలు గతంలో ఉన్నాయా? అవ్వాతాతలకు ఇంటికే రూ.3 వేలు పెన్షన్, ఇంటి వద్దకే పౌరసేవలు, రేషన్, పథకాలు అందడం గతంలో ఎప్పుడైనా చూశారా? రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచితంగా పంటల బీమా, నష్టపోతే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, చేయిపట్టుకుని నడిపించే ఆర్బీకేలు లాంటి కార్యక్రమాలు గతంలో జరిగాయా?స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసా, చిరువ్యాపారులకు తోడు, చేదోడు, లాయర్ల కోసం లా నేస్తం పథకాలను తెచ్చాం. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించి రూ.25 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా కూడా ఇస్తున్నాం. గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలతో ప్రజారోగ్యంపై ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? ఇవాళ ఏ గ్రామానికి వెళ్లినా 600 రకాల సేవలందిస్తున్న సచివాలయాలు కనిపిస్తున్నాయి. 60–70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలందించే వలంటీర్లు, నాడు–నేడుతో బాగుపడ్డ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, అక్కచెల్లెమ్మలకు భద్రతగా గ్రామంలోనే మహిళా పోలీసు, దిశ యాప్ లాంటివి తీసుకొచ్చాం. 14 ఏళ్ల పాటు పరిపాలన చేశానని చెప్పుకునే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? ముస్లింలకు మీ జగన్ ఇస్తున్న మాట...బాగా ముదిరిపోయిన తొండ లాంటి చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారు. ఒకపక్క 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీతో జత కట్టి ఎన్డీఏలో కొనసాగుతూ మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తున్నాడు. ఇంత మోసాలు, ఇలాంటి దగుల్బాజీ రాజకీయాలు చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా? ఆరు నూరైనా సరే ముస్లిం మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్, మీ వైఎస్సార్ బిడ్డ ఇస్తున్న మాట. మరి చంద్రబాబుకు ప్రధాని మోదీ సమక్షంలో ఇదే మాట చెప్పే దైర్యముందా?వారు మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పినా కూడా చంద్రబాబు ఎందుకు ఎన్డీఏలో కొనసాగుతున్నాడు? మైనారిటీ రిజర్వేషన్లు అంటే చాలు రాజకీయాలు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరికీ అర్థం కావటానికి మీ అందరి సమక్షంలో ఒక విషయం చెబుతున్నా. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు మతం ప్రాతిపదికగా ఇచ్చినవి కాదు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు వర్తింపచేయటం లేదు. పఠాన్లు, సయ్యద్లు, మొఘల్లకు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనకబాటుతనం ప్రాతిపదికగా ఇస్తున్న రిజర్వేషన్లు. అన్ని మతాల్లోనూ బీసీలు, ఓసీలు ఉంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడటం ధర్మమేనా? రాజకీయాల కోసం వారి జీవితాలతో చెలగాటం ఆడటం న్యాయమేనా? ఎట్టి పరిస్థితిలోనూ ఈ 4శాతం రిజర్వేషన్లు కచ్చితంగా కొనసాగుతాయి. ఇవే కాదు.. ఎన్ఆర్సీ, సీఏఏతో సహా ఏ విషయంలోనైనా మైనారిటీల మనోభావాలు, వారి ఇజ్జత్ ఔర్ ఇమాన్కు అండగా ఉంటాం. డీబీటీ స్కీమ్లే కాకుండా ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫా, ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడం, నలుగురు మైనారిటీలను ఎమ్మెల్సీలుగా, నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం, నా మైనారిటీ సోదరుడికి ఉప ముఖ్యమంత్రి పదవి, నా మైనారిటీ సోదరికి శాసన మండలి ఉపాధ్యక్షురాలి పదవులు ఇచ్చి గౌరవించాం. మైనారిటీ సబ్ ప్లాన్ బిల్లు తేవడం మొదలు ప్రతి సందర్భంలోనూ సముచిత స్థానం కల్పించాం. ఆ దివంగత నేత, నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డి మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్లు ఇచ్చి రెండు అడుగులు ముందుకు వేస్తే.. ఆయన బిడ్డ మీ జగన్ మరో నాలుగు అడుగులు ముందుకేసి 7 ఎమ్మెల్యే స్థానాలు మైనార్టీలకు ఇవ్వడం ద్వారా 4శాతం రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇచ్చినట్లయ్యింది. మన అభ్యర్థులను దీవించండిమంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.లావణ్య, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య, నగరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా, చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాష, కడప ఎంపీగా పోటీ చేస్తున్న నా తమ్ముడు వైఎస్ అవినాష్రెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీలతో గెలిపించాలని కోరుతున్నా. మీ బిడ్డ ఎన్నికల కోసం ఏదీ చేయలేదు..వీళ్ల దుర్మార్గాలు, కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయంటే... అవ్వాతాతలకు మొన్నటి వరకు ఇంటికే వచ్చే పెన్షన్కు కూడా అడ్డుపడి రానివ్వకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్లు! మీ బిడ్డ చేసిందేదీ ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ ఏదీ ఎన్నికలకు రెండు నెలల ముందు, మూడు నెలల ముందు చేసిన దాఖలాలు లేవు. మీ బిడ్డ ఏం చేసినా ముందే కేలండర్ ప్రకటించి ఇదిగో ఈ నెలలో రైతుభరోసా, అమ్మఒడి, చేయూత ఇస్తామని చెప్పి క్రమం తప్పకుండా ఐదేళ్లుగా అందించాడు. సాధారణంగా ఎవరైనా మోసం చేస్తే చీటింగ్ కేసు పెడతాం. ఛీటర్ అంటాం. దొంగతనం చేస్తే దొంగోడు అని కేసు పెడతాం. మరి ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ మేనిఫెస్టో అంటూ అందమైన హామీలిచ్చి మన జీవితాలతో ఆడుకుంటున్న వాళ్ల మీద ఎలాంటి కేసులు పెట్టాలి? పట్టపగలే ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తున్నారు.మంగళగిరి బీసీలదేమంగళగిరి సీటు బీసీలది.. వెనుకబడిన వర్గాలది. గతంలో నేను ఆర్కేకు ఇచ్చా. ఈసారి మాత్రం మనం ఈ సీటును త్యాగం చేయాలని ఆర్కేకు చెప్పా. మనం బీసీలకు సీటు ఇస్తే... అటువైపు∙వాళ్లంతా డబ్బు మూటలతో నెగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. మీ బిడ్డ మాదిరిగా చంద్రబాబు ఎక్కడా బటన్లు నొక్కలేదు కాబట్టి ఆయన దగ్గర బాగా డబ్బులున్నాయి. అందుకుని ఓటుకు రూ.5 వేలు కూడా ఇస్తానంటాడు. ఆయన డబ్బులిస్తే వద్దనకుండా తీసుకోండి.అదంతా మన దగ్గర దోచేసిన సొమ్మే. కానీ ఓటేసేటప్పుడు మాత్రం ఎవరి వల్ల మీకు మంచి జరిగిందో ఆలోచించండి. ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుందో ఆలోచన చేయండి. మీ అందరికీ మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్లీ ఇంటికే రావాలన్నా, బటన్లు నొక్కిన పథకాల సొమ్ము నా అక్కచెల్లెమ్మల ఖాతాలకి రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగాలన్నా, పేదల భవిష్యత్, తలరాతలు మారాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన వైద్యం మెరుగుపడాలన్నా ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 2014 బాబు విఫల హామీల్లో ముఖ్యమైనవి» రూ.87,612కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? రూ.14,205కోట్ల పొదుపు రుణాల్లో ఒక్క రూపాయి మాఫీ చేశాడా? » ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. ఎవరికైనా రూపాయి ఇచ్చాడా?» ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఈ లెక్కన ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా ? » అర్హులందరికీ మూడు సెంట్లు స్థలం, పక్కా ఇళ్లు ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? » రూ.10వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ హామీ అమలైందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా?» సింగపూర్ని మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? మంగళగిరి, నగరిలో ఎవరికైనా కనిపిసున్నాయా?» ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. » అదే ముగ్గురు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంటూ నమ్మబలుకుతున్నారు.నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇలా.. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు నరసరావుపేట లోక్సభ స్థానం పరిధిలోని చిలకలూరిపేటలో ఉన్న కళామందిర్ సెంటర్లో జరిగే ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు లోక్సభ స్థానం పరిధిలోని కైకలూరులో ఉన్న తాలూకా ఆఫీస్ సెంటర్లో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు కాకినాడ లోక్సభ స్థానం పరిధిలోని పిఠాపురంలో ఉన్న ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో జరిగే సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. -
మోసాల బాబు మరో అబద్ధం..
సాక్షి, అమరావతి: నిజం చెప్పకపోవడం.. మాటమీద నిలబడకపోవడం టీడీపీ అధినేత చంద్రబాబుకు పుట్టుకతో వచ్చిన సహజ లక్షణం. అందుకే ఆయన ఎన్నికలొచ్చిన ప్రతీసారి అలవోకగా ఎడాపెడా హామీలిచ్చేస్తూ ఉంటారు. ఈసారి కూడా అలాంటివి ఎన్నో ప్రకటించారు. అందులో మూడ్రోజుల క్రితం ఆయన ప్రకటించిన మేనిఫెస్టోలో ‘స్కూలుకి వెళ్లే ప్రతీ విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు’ అన్న ఓ అబద్ధపు హామీ కూడా ఇలాంటిదే. నిజానికి.. ఇది ఏ విధంగా చూసినా ఆచరణ సాధ్యంకాదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ స్థాయిలో రాష్ట్రంలోని 82.29 లక్షల మంది విద్యార్థులకు రూ.15 వేలు చొప్పున ఇవ్వాలంటే రాష్ట్ర బడ్జెట్లో భారీ మొత్తాన్నే ఈ ఒక్క పథకానికే ఖర్చుచేయాల్సి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన ఈ హామీని వారు వట్టి మాటగా కొట్టిపడేస్తున్నారు. ఏ జిల్లాలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో చెబుతూ ఏటా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి ‘యూనిఫైడ్ డి్రస్టిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్’ (యూడైస్) కింద నివేదికను అందజేస్తుంటాయి. దీని ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో పాఠశాల స్థాయిలో 1–10 తరగతుల్లో 71,77,637 మంది, ఇంటర్మీడియట్లో 10,52,221 మంది కలిపి మొత్తం 82,29,858 మంది విద్యార్థులున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా వీరందరికీ రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే ఏడాదికి అక్షరాలా రూ.1,23,44,78,70,000లు అవసరమవుతుంది. సులభంగా చెప్పాలంటే రూ.1,234 వేల కోట్లకు పైగా ఇవ్వాలి. అంటే.. ప్రస్తుత ప్రభుత్వం ఏటా అమ్మఒడి కింద రూ.6,452 కోట్లు ఖర్చుచేస్తుండగా, దీనికి రెండింతలు ఇస్తానని చంద్రబాబు అలవోకగా ఓ అందమైన అబద్ధపు హామీని ఇచ్చిపడేశారు. ప్రభుత్వ విద్యపై చంద్రబాబు కక్ష.. వాస్తవానికి.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి, కార్పొరేట్ విద్యా సంస్థలకు చంద్రబాబునాయుడు కొమ్ముకాశారు. 2014–19 మధ్య సుమారు 6 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేశారు. పేదలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవని, వాటిని కల్పించే పరిస్థితి లేదని చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో బహిరంగంగా ప్రకటించారు. డబ్బున్న వారు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవాలని ఓ ఉచిత సలహా ఇచ్చారు. ఇలాంటి వ్యక్తి బడికి వెళ్లే పిల్లలకు రూ.15 వేలు ఇస్తానని ప్రకటించడం ఒక ఎత్తయితే.. 117 జీఓను రద్దుచేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందని విద్యావేత్తలు అంటున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులు విద్యకు దూరం కావడం ఖాయం. ఇక గతంలో ఒక స్కూలుకు మంజూరైన పోస్టులను పిల్లలున్నా లేకున్నా కొనసాగించే పరిస్థితి ఉండేది. కానీ, జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం బడిలో పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలి. ఈ నేపథ్యంలో.. తక్కువ విద్యార్థులు, ఎక్కువమంది ఉపాధ్యాయులున్న పాఠశాల నుంచి ఎక్కువ విద్యార్థులున్న స్కూలుకు వారిని బదిలీ చేసేందుకు వీలుగా 2022 జూన్లో జీఓ–117 తీసుకొచ్చింది. దీంతో పోస్టులను రద్దుచేయకుండా అదనపు ఉపాధ్యాయులను ఎక్కువమంది పిల్లలున్న స్కూలుకు బదిలీ చేయవచ్చు. పేద విద్యార్థులకు ఎంతో మేలుచేసిన ఈ జీఓను ఉపాధ్యాయ వర్గాలూ స్వాగతించాయి. ఫలితంగా.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లు అందుబాటులోకి వచ్చారు. కానీ, చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు 117 జీఓను రద్దుచేస్తే.. ప్రభుత్వ విద్య నాశనం కావడంతో పాటు, విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో పాఠశాలలను మూసివేసేందుకు ఉపాధ్యాయ పోస్టులను రద్దుచేసేందుకు ఆస్కారం ఉంది.జగన్ సర్కారులో విద్యా సంస్కరణలకు ప్రాధాన్యం2019లో ప్రభుత్వం ఏర్పాటుచేశాక సీఎం జగన్ ప్రభుత్వ విద్యపై దృష్టిపెట్టారు. ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించాలన్న సమున్నత లక్ష్యంతో అంగన్వాడీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా.. జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం కరిక్యులమ్లో మార్పులు చేశారు. ఉదా.. » ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి తేవడంతో పాటు విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు, తెలుగు–ఇంగ్లిష్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ప్రభుత్వం ఉచితంగా అందించింది. » ప్రతి పేదింటి బిడ్డను బడికి పంపించాలని, ఇలా పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన ‘అమ్మఒడి’ పథకాన్ని అమలుచేసింది. » విద్యార్థి తప్పనిసరిగా బడిలో ఉండేలా చూసేందుకు 75 శాతం హాజరు తప్పనిసరి చేసింది. » కోవిడ్ రెండేళ్లు మినహా మిగిలిన సంవత్సరాల్లో హాజరును పరిగణనలోకి తీసుకుని నాలుగు పర్యాయాలు రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమచేసింది.సగటున ఏటా రూ.6,452 కోట్లు జమ ఈ పథకం కింద 2019–20లో 42,33,098 మంది తల్లులకు రూ.6349.6 కోట్లు, 2020–21లో 44,48,865 మంది తల్లులకు రూ.6,673.4 కోట్లు, 2021–22లో 42,62,419 మందికి రూ.6,393.6 కోట్లు, 2022–23 విద్యా సంవత్సరంలో 42,61,965 మంది తల్లులకు రూ.6,392.9 కోట్లు.. ఇలా మొత్తంగా రూ.25,809.50 కోట్లు అందించింది. అంటే.. సగటున ఏడాదికి రూ.6,452.37 కోట్లు తల్లుల ఖాతాల్లో జమచేసింది. అలాగే, 2024 మేని ఫెస్టోలో రూ.15వేల అమ్మఒడి మొత్తాన్ని రూ.17 వేలకు పెంచి అమలుచేయనుంది. కానీ, చంద్రబాబు మాత్రం ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వారందరికీ ఇస్తానంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. -
కూటమిది అసత్యాల మేనిఫెస్టో
చిలకలపూడి (మచిలీపట్నం): ప్రజలను మరొకసారి మోసం చేసేందుకే ఎన్డీయే కూటమి అసత్యాల మేనిఫెస్టోను విడుదల చేసిందని మాజీమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. ఆయన మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మూడు పార్టీలు కలిశామని కూటమి అభ్యర్థులు చెప్పుకొంటున్నా.. మేనిఫెస్టోపై ఒకరి ఫొటో లేకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. మూడుఫోటోలు రెండు ఫోటోలయ్యాయంటే మేనిఫెస్టోలోని అంశాలు ఫొటోలేని వారికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఆడిన అబద్ధం ఆడకుండా జరగనవి, అసత్యాల మేనిఫెస్టో రూపొందించిన కూటమి సభ్యులు.. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకోవటం చూస్తే ప్రజలకే అర్థమవుతోందన్నారు. 50 ఏళ్ల వయసున్న సీఎం జగన్ 2019లో మేనిఫెస్టోను విడుదల చేసి 99 శాతం అమలు చేసి ప్రజలకు మంచిచేస్తేనే నాకు ఓటేయండని ధైర్యంగా అడుగుతున్నారని చెప్పారు. సంవత్సరానికి 71 వేల కోట్లతో సంక్షేమ పథకాలను ధైర్యంగా అమలు చేశారన్నారు.నిజాయితీగల వారైతే చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో అమలు చేసిన వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా గ్రూపుల వారికి రూ.14 వేల కోట్ల రుణాలు, రైతులకు రూ.84 వేలకోట్ల రుణాలు మాఫీచేస్తానని చెప్పి.. వాటిని ఎంతవరకు అమలు చేశావో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసింది చంద్రబాబేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడ్డామని, ఎన్డీయేలో కలిశామని చెప్పుకొంటున్న చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా, రైల్వేజోన్, విశాఖ స్టీల్ప్లాంట్, కడప స్టీల్ కర్మాగారం ఏర్పాటు విషయాలు ఎందుకు పొందుపరచలేదో చెప్పాలన్నారు. అధికారం కోసమే కూటమి అధికారం కోసమే కూటమిగా ఏర్పడ్డారని ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఏపీలో ఏడాదికి 10 శాతం మాత్రమే పెరుగుతున్న ఆదాయాన్ని బట్టి సీఎం జగన్ మేనిఫెస్టో రూపొందించారన్నారు. ఏడాదికి రూ.2 లక్షల కోట్లు అవసరమయ్యే విధంగా మేనిఫెస్టో రూపొందించిన చంద్రబాబు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో, ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పాటుపడతానని చెబుతున్న చంద్రబాబు ఆయన పాలనలో ముస్లింలకు ఎమ్మెల్యే, మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తుచేశారు. రాజ్యాధికారంలో మైనార్టీలు భాగస్వామ్యులు కాకూడదనుకునే బాబుకు ఇప్పుడు వారిపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని నిలదీశారు. రజకులకు, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయన్నారు. నాయీబ్రాహ్మణులకు ఉపకరణాలు ఇస్తామని చెబుతున్న చంద్రబాబు వారి పిల్లలకు చదువులు ఎందుకు చెప్పించవని ప్రశ్నించారు. వారు ఆర్థికంగా, విద్యాపరంగా ఎదగకుండా కులవృత్తిలోనే బతకాలా అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండని ధైర్యంగా చెబుతున్న సీఎం జగన్లాగా చెప్పగల దమ్ముందా అని చంద్రబాబును ప్రశ్నించారు.చంద్రబాబు ఏది చెబితే అదేనంటూ.. కూటమిలో పార్టీలు బుర్రకథల బ్యాచ్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. 2014లో కోటిమంది నిరుపేదలు ఉన్నప్పుడు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి చెల్లిస్తానని మాయమాటలు చెప్పి ఏ ఒక్కరికి ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా..ఇప్పుడు 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తానని అసత్యాల దొంతర అయిన మేనిఫెస్టోలో చెప్పటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. -
నీ హామీలకు డబ్బెక్కడిది బాబూ?
సాక్షి, అమరావతి: అధికారమే పరమావధిగా ప్రజలను వంచించేందుకు సిద్ధమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మేనిఫెస్టోలో ఇష్టం వచ్చినట్లు ఇచ్చిన హామీల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఈ ప్రశ్న ఇప్పుడు ఆర్థిక నిపుణులను సైతం వేధిస్తోంది. అలవికాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబు అసలు వాటిని అమలు చేయడం సాధ్యమా? అందుకు ఎంత ఖర్చు అవుతుంది? అంత సొమ్ము ఎక్కడి నుంచి సమీకరిస్తారు? అనే అంశాలకు సమాధానం లేదు. ప్రాథమిక అంచనాల ప్రకారం చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.65 లక్షల కోట్లు ఖర్చవుతుంది. అంత డబ్బు సమీకరించుకునే అవకాశం ఉందా? రాష్ట్రంలో అందుకు తగ్గ వనరులు ఉన్నాయా?.. అంటే లేదనే సమాధానం వస్తుంది. వాస్తవికంగా ఆలోచిస్తూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు కాబట్టే సీఎం వైఎస్ జగన్కు ఇంకా సంక్షేమం అందించాలని మనసులో ఉన్నా కొత్త హామీలు ఇవ్వలేదు. అన్ని లెక్కలు వేసుకుని, వనరుల సమీకరణ చూసుకుని చేయగలిగే హామీలను మాత్రమే ఆయన మేనిఫెస్టోలో చేర్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా రూ.70 వేల కోట్లు దాకా ఖర్చు చేస్తున్నారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా నేరుగా లబ్దిదారులకే ప్రయోజనం చేకూరుస్తున్నారు.దీనికి అదనంగా మరికొంత లబ్ధిని జోడిస్తూ మేనిఫెస్టోను రూపొందించారు. తాము అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు, వాటికి అయ్యే ఖర్చు, ఎక్కడి నుంచి సమీకరిస్తామనే విషయాలను ఆయన కూలంకషంగా వివరించారు. పథకాల అమలులో ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్దిదారుల అకౌంట్లలోనే డబ్బు జమ చేయడం (డీబీటీ) లాంటి వినూత్న విధానాల ద్వారా చాలా పకడ్బందీగా ఐదేళ్లు ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ నెట్టుకొచ్చారు. పింఛన్లకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు కనుకే రూ.3,500 చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ అప్పులు తెద్దామన్నా అవి కూడా పరిమితులకు లోబడే తేవాల్సి ఉంటుంది. అన్నీ బేరీజు వేసుకుని, ఉన్న వనరులను సది్వనియోగం చేసుకుంటూ పథకాలను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. వేలం పాటలా పోటీ పడి హామీలు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కనీస ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించారు. చిత్తశుద్ధితో నెరవేర్చే ఉద్దేశం లేనందువల్లే వేలం పాటలో రేటు పెట్టినట్లుగా సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలకే తాను ఇంకా ఎక్కువ ఇస్తానని నమ్మబలికారు. అమ్మఒడి, రైతు భరోసా పథకాల పేర్లు మార్చి ఇష్టం వచ్చినట్లు ప్రకటించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న చాలా పథకాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రకటించిన పథకాలను సైతం కాపీ కొట్టి మేనిఫెస్టోలో చేర్చి ప్రజలను ఏమార్చేందుకు సిద్ధమయ్యారు. మరి ఇన్ని హామీలను అమలు చేయడం సాధ్యమా? ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే దానికి ఆయన వద్ద సమాధానం లేదు. మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఒక మీడియా ప్రతినిధి ఈ హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందని అడగడంతో సమాధానం చెప్పకుండా కస్సుమని మండిపడ్డారు. దాన్నిబట్టే ఆయనకు తాను ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమైంది. సీఎం జగన్ ఇస్తున్నారు కాబట్టి తాను అంతకంటే ఎక్కువ ప్రకటించి ప్రజలను నమ్మించాలి, ఆ తరువాత ఎలాగూ అమలు చేసేది లేదని తనకు అలవాటైన రీతిలో వాగ్దానాలు చేస్తున్నారు. సాధ్యం కాదనే బీజేపీ పట్టించుకోలేదు చంద్రబాబు హామీలను అమలు చేయడం సాధ్యం కాదని గుర్తించడం వల్లే బీజేపీ ఆయన మేనిఫెస్టోను అంగీకరించలేదు. ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతల ఫొటోలు మేనిఫెస్టోలో కనీసం ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. చివరికి మేనిఫెస్టోను తాకడానికి సైతం బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్సింగ్ ఇష్టపడలేదంటే బాబు హామీలపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే చంద్రబాబు హామీలకు కేంద్రం నుంచి కూడా ఎలాంటి సహకారం ఉండదని చెప్పకనే చెప్పేశారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు సమకూర్చుకునే పరిస్థితులు లేక, కేంద్రం సహకరించకపోతే చంద్రబాబు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే దానికి సమాధానమే లేదు. అంటే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసేవి కావని తేటతెల్లమైంది. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు, మరోసారి మాయ చేసేందుకే వేలం పాట మాదిరిగా సంక్షేమ పథకాలు ప్రకటించారు. పొరపాటున జనం నమ్మితే ఇక అంతే సంగతులు. 2014లో మాదిరిగా ఆ మేనిఫెస్టో మాయం కావడం ఖాయం. -
బాబు కిచిడీ మేనిఫెస్టో
సాక్షి, అమరావతి: చంద్రబాబు అంటేనే మోసం, మాయ, వెన్నుపోటు. ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టడం, అధికారంలోకి వస్తే అదే ప్రజలను మోసం చేసి, వెన్నుపోటు పొడిచి, తాను లాభపడటం.. ఇదే నైజం. ప్రజలకు మేలు చేసే మనసు ఆయనకు ఏ కోశానా లేదు. మంగళవారం విడుదల చేసిన తాజా మేనిఫెస్టోలోనూ చంద్రబాబు ఇదే నైజాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఏపీలో, పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలనే కాపీ కొట్టి తన మేనిఫెస్టో తయారు చేశారు.నిబద్దతతో పనిచేసే నాయకుడైతే ప్రజలకు తానేమి మేలు చేస్తాడో ఆలోచించి, వాటిని మేనిఫెస్టోలో చెప్తాడు. కానీ, చంద్రబాబు ప్రజల కోసం ఏమీ చేయరన్నది గతంలో ఆయన పరిపాలనే విస్పష్టంగా చెబుతుంది. ఇటువంటి నాయకుడి మేనిఫెస్టోలో ఏ హామీలు ఉంటే ప్రజలకేం ఉపయోగం? అందుకే చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న ప్రజోపయోగ పథకాలు, పక్క రాష్ట్రాల్లో ఉన్నవీ తెచ్చి తాజా మేనిఫెస్టోలో చేప్పేసుకున్నారు.. ఏమాత్రం కష్టం లేకుండా. గతంలో 2104, 2019లో తాను ప్రజలను మోసగించడానికి ఇచ్చిన హామీలను కూడా ఈసారి మేనిఫెస్టోలో ఉంచారు.. ఇందులో ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. ఈ మేనిఫెస్టోలో 177 హామీలు ఉన్నప్పటికీ, అవన్నీ కాపీ కొట్టినవి, పాతవే.అరువు తెచ్చుకున్న సూపర్ సిక్స్చంద్రబాబు తాజా మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన ప్రధాన హామీలు అన్నీ అరువు తెచ్చుకున్నవే. వీటిలో సగం రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న పథకాలు కాగా, మిగతావి పక్క రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందించే పథకాలను అమ్మఒడి, రైతు భరోసా పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐదేళ్ల నుంచి అమలు చేస్తోంది. వీటికే పేర్లు మార్చి, చంద్రబాబు మేనిఫెస్టోలో రాసుకున్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కూడా వైఎస్సార్సీపీ నుంచి కాపీ కొట్టిందే. ఇది కాకుండా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకి నెలకు రూ.1500, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీలను తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు. అంతే కాదు.. జాబు కావాలంటే బాబు రావాలంటూ 2014లో ఊదరగొట్టిన చంద్రబాబు.. జాబు లేదంటే నిరుద్యోగ భృతి అంటూ యువతను నిలువునా మోసం చేసి, మళ్లీ అదే హామీ ఇప్పుడూ ఇవ్వడమే ఆయనలోని గొప్పతనం.అవినీతి అమరావతిని మళ్లీ కడతారటఅధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పేదలను పట్టించుకోని చంద్రబాబు.. మళ్లీ అధికారంలోకి వస్తే వారిని సంపన్నులను చేసేందుకు పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్షిప్ (పీ4) పేరుతో పథకాలు ఇస్తానని ప్రకటించారు. అంతర్జాతీయ అవినీతి కుంభకోణంగా మారిన రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తానని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల గురించి పట్టించుకోకుండా అమరావతి జపం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని నమ్మబలుకుతున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వద్దే వద్దంటూ అక్కడ హైకోర్టు బెంచిని తక్షణం ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టి లక్షలాది మందిని నడిరోడ్డున పడేసిన విషయాన్ని మరచిపోయి, ఇప్పుడు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెబుతున్నారు.రూ.4 వేలు పింఛనంటూ మాయ హామీచంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లూ సామాజిక పింఛన్లు రూ.1,000 మాత్రమే ఇచ్చారు. అందులోనూ చాలా మోసాలు. ఇచ్చిందే తక్కువ. అందులోనూ జన్మభూమి కమిటీల దందా, అవినీతి. వృద్ధులు నెల నెలా నానా అవస్థలుపడి ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లి, అక్కడ ఇచ్చినంత తెచ్చుకోవాల్సిన దుస్థితి. అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పెన్షనర్లకు చంద్రబాబు పెట్టిన అవస్థల నుంచి విముక్తి కల్పిస్తూ సీఎం జగన్ చర్యలు చేపట్టారు. బాబు రూ. వెయ్యి పింఛను ఇవ్వగా, దానిని సీఎం జగన్ రూ.3 వేలు ఇచ్చి, ఇంటి వద్దనే వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఐదేళ్లుగా ఇస్తున్న రూ.3 వేలను రూ.4 వేలకు పెంచి ఇస్తామని చంద్రబాబు మభ్యపెట్టే హామీ ఇచ్చారు. అది కూడా 50 ఏళ్లకే ఇస్తామని చెప్పడం మాయ చేయడానికేనని కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. గతంలో చేయకుండా ఇప్పుడు మెగా డీఎస్సీ ప్రకటిస్తామని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అంటూ ప్రకటించారు. ప్రతి ఇంటికీ మేలు చేసేలా జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థను తూలనాడి, 2 నెలలుగా వారిని విధులకు దూరం చేసిన చంద్రబాబు.. వారికి రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తానని ప్రకటించడం ఆయన దివాళాకోరుతనమే. ఉద్యోగుల గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు అధికారంలోకి వస్తే వారికి మేలు చేస్తానంటున్నారు.ఇది మరో రకం మోసంఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ఆ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో చేయాలని చెబుతున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించడమూ ప్రజలను మోసం చేయడమే. 2014, 2019 మేనిఫెస్టోల్లో చెప్పినట్టుగానే ఈ మేనిఫెస్టోలోనూ పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేస్తామని, నదుల అనుసంధానం, ప్రతి ఎకరానికి నీరు అంటూ పాత హామీలను పెట్టారు. రాష్ట్రంలో ఇప్పుడు పారదర్శకంగా ఇసుక విధానం అమలవుతుండగా తన హయాంలో అభాసుపాలైన ఉచిత ఇసుక విధానాన్ని మళ్లీ తెస్తానని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ వంటి సకల మౌలిక వసతులతో గ్రామాల ముఖ చిత్రమే మారిపోయినా, గ్రామాల్లో మౌలిక వసతులు, మండల, జిల్లా కేంద్రాల్లో వర్క్ ఫ్రం హోం స్టేషన్లు అంటూ హామీలిచ్చారు. బీసీలకు బురిడీచంద్రబాబు అధికారంలో ఉండగా బీసీలకు స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు తగ్గించేశారు. ఇప్పుడు 34 శాతం ఇస్తామని చెప్పడం ఆ వర్గాలను మభ్యపెట్టడమే. 2014, 2019 మేనిఫెస్టోల్లో చెప్పినట్టుగానే ఇప్పుడూ బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేస్తామని మరోసారి పాత హామీనే ఇచ్చారు. మరోసారి మహిళలను మోసం చేసేలా..స్వయం సహాయక సంఘాలను మళ్లీ కొత్త తరహాలో మోసం చేయడానికి చంద్రబాబు కొత్త హామీ ఇచ్చారు. స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ చేస్తానని 2014 మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరినీ వంచించి, ఆ సంఘాలను దివాలా తీయించారు చంద్రబాబు. ఇప్పుడు రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామంటూ నిస్సిగ్గుగా మరోసారి ప్రకటించారు. ఇది మరోసారి మహిళలను వంచనకు గురిచేయడమే.ఆరోగ్యశ్రీకి మంగళమే!సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.25 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. చంద్రబాబు ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామని ప్రకటించారు. అంటే చంద్రబాబు వస్తే ప్రజలకు బీమానే వర్తిస్తుంది తప్ప, ఆరోగ్య శ్రీ ఉండదు. ఆరోగ్యానికి భరోసా ఉండదు. డిజిటల్ హెల్త్ కార్డులు ఇప్పటికే రాష్ట్రంలో కోట్ల మందికి పంపిణీ చేసినా తానూ చేస్తానని చెప్పారు. విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలి డాక్టర్, జగనన్న సురక్ష పథకాలన్నీ వైద్యాన్ని పేదలకు చేరువ చేయగా వాటికి ఏమాత్రం సాటిరాని, తీసికట్టుగా జన ఔషధి కేంద్రాలు, బీపీ, షుగర్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తామని చెబుతున్నారు. విద్యా రంగంలో వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు తెస్తే, వాటి దరిదాపుల్లోకి సైతం రాలేని స్థితిలో కేజీ టు పీజీ సిలబస్ని రివ్యూ చేస్తామని, మూతపడిన పాఠశాలలు పునరుద్ధరిస్తామంటూ పస లేని హామీలు ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ ప్రస్తుతం అమల్లో ఉండగా, నేరుగా కాలేజీలకే రుసుం చెల్లిస్తామని ప్రకటించి దానిపైనా తిరకాసు హామీ ఇచ్చారు.ఇప్పుడు అమలవుతున్నవే ఆయనొచ్చి చేస్తాడట..» సీఎం జగన్ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, కాపులు, వడ్డెరలు, ఆర్య వైశ్యులు, క్షత్రియులు, అగ్రవర్ణ పేదలకు నవరత్నాలతో రూ.వేల కోట్ల సంక్షేమ అందిస్తుంటే.. ఇప్పుడు బాబు వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని అనడం కొసమెరుపు.» 2019 ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే గ్రామాల్లో పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తానని, పక్కా ఇళ్లు కట్టిస్తానంటూ పాత పాటే పాడారు. నిజానికి ఈ ఐదేళ్లలో పేదలకు సీఎం వైఎస్ జగన్ 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వగా, వీటిలో ఇప్పటికే 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఆయనొచ్చి చేసేదేముంది?» నైపుణ్య శిక్షణ కేంద్రాలు, క్రీడా మౌలిక సదుపాయాలు, డిజిటల్ లైబ్రరీలు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నా, వాటి గురించి మేనిఫెస్టో చేర్చడం ప్రజలను మభ్యపెట్టడం కాక మరేమిటి? కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇప్పటికే రాష్ట్రంలో అమల్లో ఉండగా తానూ అమలు చేస్తానని ప్రకటించడం పక్కా మోసమే.» వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది నుంచి రాష్ట్రంలో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తుండగా.. తాము అందిస్తామంటూ అదే హామీ ఇచ్చారు.» గొర్రెల పెంపకం యూనిట్లకు రాయితీలు, బీమా సౌకర్యం ఇప్పటికే ఉండగా దాన్ని తాను ఇస్తానని అంటున్నారు.» నాయీ బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుండగా దాన్ని ఇస్తానంటూ చెప్పుకొంటున్నారు. » మత్స్యకారుల సంక్షేమానికి ఇప్పటికే వైఎస్సార్సీపీ రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తుండగా దాన్ని పెంచుతామని నమ్మబలికారు.» వైఎస్సార్సీపీ వాహన మిత్ర పథకం అమలు చేస్తూ రవాణా రంగ కార్మికులకు మేలు చేస్తుండగా, ఇప్పుడు తాను డ్రైవర్లకు ప్రమాద బీమా ఇస్తానని, వడ్డీ సబ్సిడీ ఇస్తానంటూ నమ్మబలికారు.» వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ విద్యుత్ సరఫరా ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇస్తుండగా తాను అధికారంలోకి వస్తే ఇస్తానన్నారు.» వైఎస్ జగన్ సీఎం కాగానే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయగా, ఇప్పుడు తాను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.» సేంద్రీయ వ్యవసాయం, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, ప్రభుత్వ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీ యూనిట్ల వంటివన్నీ వైఎస్సాÆŠసీపీ ప్రభుత్వం చేస్తుండగా వాటిని తన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇప్పుడు అమల్లో ఉన్న పథకాలన్నీ తాను చేస్తాననడం ప్రజలను వంచించడమే కదా? -
2014లో చంద్రబాబు హామీలేంటి? చేసిన మోసాలేంటి?
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా చెబుతారు. హామీలిచ్చి మోసం చేయడంలో ఆయన్ను మించినవారు లేరని దేశమంతా చెప్పుకుంటారు. వర్తమాన భారత రాజకీయాల్లో చంద్రబాబును మించిన మోసపూరిత నేత మరొకరు లేరని అంతర్జాతీయ స్థాయిలో పేరొచ్చింది. 2014 ఎన్నికలపుడు 600కు పైగా హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారు చంద్రబాబు. అధికారంలోకి రాగానే ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో టీడీపీ వెబ్సైట్ నుంచి ఆ మేనిఫెస్టోనే మాయం చేశారు. మళ్ళీ మరోసారి ప్రజల్ని మోసం చేయడానికి రెడీ అవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి వస్తున్నాడు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే మాయం చేసిన నాటి మేనిఫెస్టోకి కొత్తగా పచ్చ రంగులేసి ప్రజల్ని భ్రమల్లో ముంచెత్తడానికి నానాపాట్లు పడుతున్నారు. చంద్రబాబు అంటేనే దగా, మోసం, కుట్ర, వెన్నుపోట్లు అని అందిరికీ తెలిసిందే. అధికారంలోకి రావడానికి ఎంతకైనా తెగిస్తారు, ఏ స్థాయికైనా దిగజారతారు. అలవికాని హామీలిచ్చి ప్రజల్ని భ్రమల్లో ముంచుతారు. ఎలాగూ అమలు చేసేది లేదు కనుక ఎటువంటి హామీలైనా ఇచ్చేస్తారు. అలాగే 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్కు జరిగిన తొలి ఎన్నికల్లో 50 పేజీలతో కూడిన రంగు రంగుల మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులో 600కు పైగా హామీలిచ్చారు. ఒకవైపు బీజేపీని మరోవైపు పవన్కల్యాణ్ను పెట్టుకుని ప్రచారం చేసుకుని.. అతికష్టం మీద చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఆ వెంటనే తన మేనిఫెస్టోను ప్రజలు గుర్తు చేసుకోకూడదని, చదివి ప్రశ్నించకూడదని టీడీపీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోను మాయం చేశారు. ఇదీ చంద్రబాబు ఘనత. చెప్పేవాడు చంద్రాబాబు అయితే..వినేవాళ్ళు వెర్రివాళ్ళని ఆయన అనుకుంటారు. అందుకే పదేళ్ళనాడు ఇచ్చిన హామీలు ఎవరికి గుర్తుంటాయిలే..అసలు మేనిఫెస్టోనే మాయం చేశాం కదా..అవి ఎవరికీ తెలియవులే అనుకుని..మరోసారి అంతకంటే ఎక్కువగా..అంతకుమించి అన్నట్లుగా హామీలు గుప్పిస్తున్నారు. ఆనాడు అమలు చేయని హామీల్ని ఈసారి అధికారంలోకి వస్తే గొప్పగా అమలు చేస్తానంటూ రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. అప్పటిమాదిరిగానే..ఈసారి కూడా ఒకవైపు కమలం పార్టీని మరోవైపు పవన్ పార్టీని వెంటేసుకుని ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్నవాటికంటే మరింత ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నట్లు ప్రతి ఇంటికి కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తానంటూ ప్రజల్ని మోసం చేయడానికి రెడీ అయ్యారు చంద్రబాబు. అసలు 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు, చేసిన మోసాల గురించి వివరంగా చూద్దాం. 50 పేజీల మేనిఫెస్టోలో 11వ పేజీ నుంచి 45వ పేజీ వరకు వందలకొద్దీ హామీలు కనిపిస్తాయి. సమాజంలోని ఏ వర్గాన్ని వదలకుండా..ప్రతి ఒక్కరి మీదా హామీల సునామీతో విరుచుకుపడ్డారు చంద్రబాబు. కాంగ్రెస్ హయాంలో రైతులంతా నానా కష్టాలు పడ్డారు గనుక అధికారంలోకి రాగానే రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రుణమాఫీ మీదే తొలి సంతకం చేస్తానని కూడా చెప్పారు. అయితే 87వేల కోట్లకు పైగా ఉన్న వ్యవసాయ రుణాల్ని పంచ పాండవులు మంచం కోళ్ళ సామెతలా 20 వేల కోట్లకు మాత్రమే రద్దు అర్హత ఉందని తేల్చారు. అదీ ఐదు సంవత్సరాల్లో రద్దు చేస్తామని ప్రకటించారు. నాలుగు విడతలు బ్యాంకులకు చెల్లించి ఐదో విడత చెల్లించకుండానే రైతుల్ని మోసం చేశారు. చంద్రబాబు మాటలు నమ్మిన రైతులు రుణాలు రద్దు కాకపోవడంతో వడ్డీలు మరింతగా పెరిగి లక్షలాది మంది భయంకరమైన అప్పుల్లో కూరుకుపోయారు. రుణమాఫీ అనేది మోసపూరిత హామీగా చంద్రబాబు రుజువు చేసుకున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. రుణమాఫీ గురించి అడిగిన స్వయం సహాయక బృందాల మహిళలను చంద్రబాబు బెదిరించారు. డ్వాక్రా సంఘాల రుణాలు ఒక్క రూపాయి కూడా రద్దు చేయలేదు. ఇంటికి దగ్గరలోనే ఉన్న మద్యం బెల్ట్ షాపుల్ని అధికారంలోకి వచ్చిన వెంటనే రెండో సంతకం ద్వారా రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. కాని 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఒక్కటి కూడా రద్దు కాలేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, రుణాలిప్పిస్తామంటూ ఇచ్చిన హామీని చంద్రబాబు విజయవంతంగా మర్చిపోయారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద 30 వేల రూపాయలు బ్యాంక్లో డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. కాని ఒక్కరికి కూడా 30 వేలు కాదు కదా..30 రూపాయలు కూడా ఇవ్వలేదు. పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్కరికి కూడా ఫోన్ ఇవ్వలేదు. పేద కుటుంబాలకు సబ్సిడీ కింద ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తామన్న హామీ కూడా గాల్లో కలిసిపోయింది. హైస్కూల్, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు ఇస్తామన్నారు. తన పార్టీ గుర్తు విషయంలో కూడా చంద్రబాబు మోసం చేశారు. ఒక్క విద్యార్థినికి కూడా సైకిల్ ఇవ్వలేదు. కాలేజ్ విద్యార్థులందరికీ ఉచితంగా ట్యాబ్స్ ఇస్తామన్నారు. ఏ ఒక్కరికీ ఇవ్వలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో 8వ తరగతి నుంచే ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులందరికీ పాఠాలు లోడ్ చేసిన ట్యాబ్స్ ఉచితంగా ఇస్తున్నారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు ఉద్యోగ మిత్ర పథకం కింద ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ యువతీ యువకులకు వెయ్యి నుంచి రెండు వేల వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. కాని నాలుగున్నరేళ్ళు కళ్ళు మూసుకుని సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందు కొద్ది మంది టీడీపీ కార్యకర్తలైన యువతీ, యువకులకు వెయ్యి రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చారు. 60 నెలల పాటు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతిని కేవలం మూడు నెలల పాటు కొద్ది మందికి ఇచ్చి...ఇచ్చేశానంటూ డప్పు కొట్టుకున్నారు చంద్రబాబు. మైనారిటీల కోసం విశాఖ, విజయవాడ, రేణిగుంట ప్రాంతాల్లో మూడు హజ్ హౌజ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఒక్క చోట కూడా వాటి నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా వేయలేదు. కాపులకు బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక కమిషన్ నియమించి బీసీ వర్గాల రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. వారికి రిజర్వేషన్లు ఇవ్వకపోగా రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన కాపు నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని దారుణంగా హింసించి, అవమానించారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక వృద్ధాశ్రమం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఒక్క చోట కూడా అందుకు పూనుకోలేదు. సమాజంలోని ప్రతి వర్గానికీ బోలెడు హామీలిచ్చారు. బీసీ కులాలన్నిటికి నిర్దిష్టమైన హామీలు కురిపించారు చంద్రబాబు. బీసీల అభివృద్ధే తన ధ్యేయమని ప్రచారం చేసుకున్నారు. కాని ఏ ఒక్కరికీ ఎటువంటి సాయమూ చేయలేదు. పైగా చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కరకట్ట మీద అక్రమంగా నివసిస్తున్న ఆయన నివాసానికి నాయూ బ్రాహ్మణులు సమస్యలు పరిష్కారం కోసం వస్తే..వారి తోకలు కత్తిరిస్తానంటూ మీడియా ముందే హూంకరించారు. వారిని దారుణంగా అవమానించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల స్థలం ఇచ్చి..ఇంటి నిర్మాణానికి లక్షన్నర రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇవ్వకపోగా...వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 31 లక్షల మంది పేద కుటుంబాలకు ఇంటి స్థలాలిస్తుంటే అనేక వందల ప్రాంతాల్లో కేసులు వేసి పేదల్ని నానారకాలుగా హింసించిన దుష్ట చరిత్ర చంద్రబాబుది. అన్ని ఆటంకాలు అధిగమించిన వైఎస్ జగన్ ప్రభుత్వం అందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చి, దాదాపు సగానికిపైగా పేదలకు ఇళ్ళు కూడా నిర్మిస్తున్నారు. కోస్తా జిల్లాల్లో ఓడ రేవులు అభివృద్ధి చేస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ సముద్రంలో కలిసిపోయింది. ఒక్క పోర్టుకు కూడా పనులు ప్రారంభించకపోగా...పోర్టుల విషయంలో కేంద్రంతో కయ్యం పెట్టుకుని కేంద్రం ఇస్తానన్నదాన్ని కూడా కాలదన్నారు చంద్రబాబు. కాని వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నాలుగు పోర్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మరో పది ఫిషింగ్ హార్బర్లు కూడా జగన్ నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటికి మంచినీటి పథకం కూడా నీటి మీద రాతలుగానే మిగిలిపోయి చంద్రబాబు మోసాల చిట్టాలో చేరిపోయంది. ఈ విధంగా అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోయే నారా చంద్రబాబునాయుడు...2014లో ముఖ్యమంత్రి పీఠం కోసం ఎన్ని రకాలుగా మోసం చేయవచ్చో అన్ని రకాలూగానూ చేశారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా అధికారంలోకి వచ్చి ప్రజలకిచ్చిన హామీలన్ని తుంగలో తొక్కారు. మళ్లీ ఈసారి కూడా అంతకంటే భారీ హామీలిస్తూ, వైఎస్ జగన్ ఇస్తున్న పథకాలన్నీ అమలు చేస్తానని నమ్మించే కుట్రలకు తెర తీస్తున్నారు చంద్రబాబు. వైఎస్ జగన్ విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్ అయితే..అప నమ్మకానికి, మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని ప్రజలందరికీ తెలుసు. అందుకే వైఎస్ జగన్ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు బ్రహ్మండంగా అమలు చేస్తున్నపుడు నువ్వు వచ్చి కొత్తగా మాకు చేసేదేంటని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఇదీ చదవండి: నారా.. దగ్గుబాటి మధ్య రాజీ కుదిర్చింది రామోజీయేనా? -
Lok Sabha election 2024: అలవిగాని హామీలు
‘ఊరూరా బారు, బీరు. నెలకు 10 లీటర్ల బ్రాందీ. ఫారిన్ విస్కీ సరఫరా’, ‘ఏకంగా చంద్రుడిపైకి ఫ్రీ ట్రిప్పు’, ‘ఒక్కొక్కరి ఖాతాలో ఏటా రూ.కోటి జమ’, ‘బాల్య వివాహాలకు మద్దతు’... ఇవన్నీ ఎన్నికల్లో అభ్యర్థులు గుప్పిస్తున్న చిత్ర విచిత్రమైన హామీలు! గెలుపే లక్ష్యంగా అలవిగాని హామీలు గుప్పించే సంస్కృతి పెరుగుతోంది. కొందరు అభ్యర్థులు వార్తల్లో నిలిచేందుకు చిత్ర విచిత్రమైన వాగ్దానాలు చేస్తున్నారు... బీరు, బంగారం, రూ.10 లక్షలు వనితా రౌత్. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా చిమూర్వాసి. అఖిల భారతీయ మానవతా పార్టీ అభ్యర్థిగా ఈ లోక్సభ ఎన్నికల్లో చంద్రపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. గ‘మ్మత్తయిన’ హామీలతో ఫేమస్ అయ్యారామె. తనను గెలిపిస్తే ప్రతి గ్రామంలో బీర్లతో బార్ ఏర్పాటు చేయిస్తానని, ఎంపీ లాడ్స్ నిధులతో విస్కీ, బీర్లు దిగుమతి చేసుకుని మరీ ఓటర్లకు ఉచితంగా సరఫరా చేస్తానని ప్రకటించారు. ‘‘నిరుపేదలు ఎంతో కష్టించి పనిచేస్తారు. వారు మద్యం సేవించి సేదదీరుతారు. కానీ నాణ్యమైన విస్కీ, బీర్లు తాగే స్థోమత లేక దేశీయ లిక్కరే తాగుతుంటారు. అందుకే నాణ్యమైన లిక్కర్ దిగుమతి చేసుకుని వారికందించాలని అనుకుంటున్నా’’ అంటూ రౌత్ తన హామీలను సమరి్థంచుకుంటున్నారు! 2019 లోక్సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవే హామీలు గుప్పించారామె. 2019 ఎన్నికల్లో తమిళనాడులోని తిరుపూర్ లోక్సభ స్థానం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఎ.ఎం.õÙక్ దావూద్ కూడా ఇలాగే ప్రతి కుటుంబానికీ నెలకు 10 లీటర్ల స్వచ్ఛమైన బ్రాందీ సరఫరా చేస్తానని హామీ ఇచ్చారు! పెళ్లి చేసుకునే ప్రతి జంటకు ఏకంగా 10 సవర్ల బంగారం, ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలిస్తానని, కుటుంబానికి నెలకు ఏకంగా రూ.25,000 ఇస్తాననీ వాగ్ధానం చేశారు! చంద్ర యాత్ర 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సౌత్ మదురై నుంచి ఇండిపెండెంట్గా బరిలో దిగిన శరవణన్ (33) అనే జర్నలిస్టు ఉచితంగా చంద్రుడిపైకి పంపిస్తానని, మినీ హెలికాప్టర్ ఇస్తానని, ఐఫోన్లు పంచిపెడతానని హామీలిచ్చారు. ప్రతి ఓటర్ ఖాతాలో ఏకంగా ఏటా రూ.కోటి జమ చేస్తానన్నారు! ఇంటి పనుల్లో సాయానికి గృహిణులకు ఉచిత రోబోలను అందిస్తానని, ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ పూల్తో కూడిన మూడంతస్తుల భవనం, ప్రతి మహిళకూ వివాహ సమయంలో 100 సవర్ల బంగారం, కుటుంబానికో పడవ, యువతకు వ్యాపారం ప్రారంభించేందుకు రూ.కోటి సాయం చేస్తానని వాగ్ధానం చేశారు. పైగా తన నియోజకవర్గాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచేందుకు 300 అడుగుల ఎత్తులో కృత్రిమ హిమ పర్వతాన్ని ఏర్పాటు చేయిస్తానన్న హామీ నవ్వులు పూయించింది. అయితే, ‘తమిళనాడులో ప్రబలంగా ఉన్న ఉచిత తాయిలాల సంస్కృతి బారిన పడొద్దంటూ ఓటర్లలో అవగాహన కలి్పంచడమే తన లక్ష్యమని ముక్తాయించారాయన. రైతును పెళ్లాడితే.. రైతు కుమారుడిని పెళ్లాడే మహిళకు రూ.2 లక్షల సాయం చేస్తామని 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడు మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఇచి్చన హామీ తెగ వైరలైంది. ‘‘రైతుల అబ్బాయిలను పెళ్లాడేందుకు అమ్మాయిలు ముందుకు రావడం లేదు. అందుకే రైతుల స్వీయ గౌరవాన్ని కాపాడేందుకు ఈ హామీ ఇచ్చాం’’ అన్నారాయన. బాల్య వివాహాలకు రైట్ రైట్ 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీ అభ్యర్థి శోభా చౌహాన్ ఇచ్చిన హామీ చర్చనీయంగా మారింది. ‘‘దెవాసీ సమాజంలో బాల్య వివాహాల సంస్కృతిలో పోలీసుల జోక్యాన్ని నివారిస్తాం. నన్ను గెలిపిస్తే బాల్య వివాహాల్లో పోలీసులు జోక్యం చేసుకోకుండా చూస్తాం’’ అని ప్రకటించారు. మునుగోడును అమెరికా చేస్తా తెలంగాణలో 2022 మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ఇచి్చన హామీ కూడా హైలైటే. తనను గెలిపిస్తే మునుగోడును అమెరికాలా మారుస్తానని, ఇతర పారీ్టలు 60 నెలల్లో చేయలేనంత అభివృద్ధిని ఆరు నెలల్లోనే చేసి చూపిస్తానని హామీ ఇచ్చారాయన. ప్రపంచవ్యాప్తంగానూ... 2012 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ న్యూ గింగ్రిచ్ విఫలయత్నం చేశారు. తనను గెలిపిస్తే 2020 కల్లా టికి చంద్రుడిపై శాశ్వత అమెరికా కాలనీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారాయన! ► అవే ఎన్నికల్లో వెర్మిన్ సుప్రీమ్ అనే ఆరి్టస్ట్ తనను గెలిపిస్తే ప్రతి అమెరికన్కు ఓ గుర్రాన్ని కానుకగా ఇస్తానని ప్రకటించారు. ► జింబాబ్వేలో 2018 ఎన్నికలప్పుడు ప్రజలకు ఐదేళ్లలో 15 లక్షల ఇళ్లు కట్టిస్తామంటూ జాను–పీఎఫ్ పార్టీ హామీనిచి్చంది. అంటే సగటున రోజుకు ఏకంగా 822 ఇళ్లన్నమాట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉచిత కరెంటు.. కేజ్రీవాల్ ఆరు గ్యారంటీలు ఇవే..
న్యూఢిల్లీ: రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు తన ఆరు వాగ్దానాలను ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజల ముందుంచారు. ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా వంటివి వీటిలో ఉన్నాయి. ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో జరిగిన ప్రతిపక్షాల మెగా ర్యాలీలో ఎన్నికల వాగ్దానాలతో కూడిన కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ చదివి వినిపించారు. ఆరు గ్యారంటీలు ఇవే.. అంతరాయం లేని విద్యుత్ ఉచిత కరెంటు విప్లవాత్మక విద్య యూనివర్సల్ హెల్త్కేర్ రైతులకు గిట్టుబాటు ధరలు ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా “ప్రియమైన భారతీయులారా, మీరందరికీ నా శుభాకాంక్షలు. నేను ఓట్లు అడగడం లేదు. ఎన్నికల్లో గెలవడానికి ఎవరినీ ఓడించడం గురించి మాట్లాడడం లేదు. దేశాన్ని నవభారతంగా మార్చడం గురించి మాట్లాడుతున్నాను. మన దేశానికి అన్నీ ఉన్నాయి. నేను జైల్లో ఉన్నాను. దేశం గురించి ఆలోచించడానికి ఇక్కడ నాకు చాలా సమయం దొరికింది. భారతమాత బాధలో ఉంది. పిల్లలకు మంచి చదువులు ఉండడం లేదు. ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు. కరెంటు కోతలు, అధ్వాన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు" అని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. -
విభజన హామీల అమలుకు 17 గెలవాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకిచ్చిన విభజన హామీలు అమలు కావాలంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో 17కు 17 స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలవాలని.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందుకోసం ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ ఎన్నికల కమిటీ (పీఈసీ) భేటీ అనంతరం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, పీఈసీ సభ్యులు షబ్బీర్ అలీ, అంజన్కుమార్ యాదవ్, సంపత్కుమార్, శివసేనారెడ్డిలతో కలసి రేవంత్ విలేకరులతో మాట్లాడారు. పీఈసీ భేటీలో భాగంగా లోక్సభ, రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామన్నారు. కేసీఆర్ అడిగింది లేదు.. మోదీ ఇచ్చింది లేదు.. ‘విభజన హామీల్లో పొందుపర్చిన అంశాలను సాధించుకోవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ గెలవాలి. దీనిపై పదేళ్లు కేసీఆర్ అడిగింది లేదు... మోదీ ఇచ్చింది లేదు’అని రేవంత్ విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ రూ. 7 లక్షల కోట్ల మేర అప్పులు చేస్తే ప్రధాని మోదీ రూ. 100 లక్షల కోట్ల అప్పులు తెచ్చి దేశాన్ని ప్రపంచంలోనే దివాలా తీసిన దేశంగా నిలబెట్టారని ఆరోపించారు. అందువల్ల రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ప్రధానిగా ఉండాల్సిన అవసరముందని రేవంత్ పేర్కొన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ చీకటి చర్చలు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చీకట్లో మోదీతో జరుపుతున్న చర్చలను, బిల్లా–రంగాలు (కేటీఆర్, హరీశ్లను ఉద్దేశించి) మాట్లాడుతున్న మాటలను తెలంగాణ ప్రజలు గమనించి కాంగ్రెస్కు అండగా నిలవాలని రేవంత్ కోరారు. ‘అధికారం నుంచి దింపాల్సింది మోదీనైతే బిల్లా–రంగాలు బీజేపీని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ ఉండటమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే అధికారంలోకి వచ్చేది మోదీనే కదా? ఆ రెండు పార్టీలు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం కావడం లేదనుకుంటున్నారా?’అని ప్రశ్నించారు. కోదండరాంను అలాంటి వాళ్లతో పోలుస్తారా? ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణం చేస్తామంటే రాజకీయ కుట్రతో వాయిదా వేయించే ప్రయత్నం చేశారని రేవంత్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల దొడ్లో చెప్పులు మోసేవాళ్లతో ప్రొఫెసర్ కోదండరాంను పోల్చడంలో అర్థముందా? అని నిలదీశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చచ్చిపోయిందని, ఆ పార్టీని ప్రజలు బొందపెట్టారని వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్కైనా అపాయింట్మెంట్ ఇస్తా.. తనను ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై సీఎం రేవంత్ స్పందించారు. ఎమ్మెల్యేలు ఎవరడిగినా సీఎంగా అపాయింట్మెంట్ ఇస్తానని, అవసరమైతే కేసీఆర్, హరీశ్, కేటీఆర్లు కూడా తనను అపాయింట్మెంట్ అడగొచ్చన్నారు. ఒకవేళ తాను ఆ సమయంలో అందుబాటులో లేకపోతే ఉపముఖ్యమంత్రిని కలవచ్చని చెప్పారు. రాజ్యసభ అభ్యర్థుల ఖరారు బాధ్యత ఖర్గేకు.. రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించే అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కేంద్ర ఎన్నికల కమిటీకి బదిలీ చేస్తూ పీఈసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశామని రేవంత్ చెప్పారు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ రాష్ట్రానికి వచ్చి దరఖాస్తులపై చర్చించి కేంద్ర ఎన్నికల కమిటీకి ఇస్తుందని, ఈ నెల 15–20లోగా సమావేశాలు జరుగుతాయన్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకొనే అవకాశముందని చెప్పారు. కనీవిని ఎరగని రీతిలో ఇంద్రవెల్లి సభ ఫిబ్రవరి 2న సీఎం రేవంత్రెడ్డి పర్యటన టీపీసీసీ నేతల సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి 2న కనీవినీ ఎరగని రీతిలో ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్ అన్నా రు. సీఎం రేవంత్రెడ్డి పాల్గొనే ఈ బహిరంగసభపై మంగళవారం గాం«దీభవన్లో టీపీసీసీ నేతలతో సమావేశం నిర్వహించారు. మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ ఇంద్రవెల్లి స్తూపం వద్ద స్మృతి వనం కడతామని సీఎం చెప్పారన్నారు. రేవంత్రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత ఇంద్రవెల్లి నుంచి ప్రచారం కార్యక్రమం మొదలైందని గుర్తు చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడు తూ ఇంద్రవెల్లిలో సీఎం పలు అభివృద్ధి కార్య క్రమాలు ప్రారంభిస్తారని వెల్లడించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, నేతలు మోత్కుపల్లి నర్సింహులు, హరివర్ధన్రెడ్డి, శ్రీహరిరావు, డీసీసీ అధ్యక్షులు, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. -
మోదీ హామీలపైనే ప్రజలకు భరోసా
న్యూఢిల్లీ: తప్పుడు హామీలతో విపక్షాలు సాధించేదేమీ ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. కానీ ఈ వాస్తవాన్ని అవి ఇప్పటికీ అర్థం చేసుకోవడం లేదన్నారు. బీజేపీ ఇచి్చన, ఇస్తున్న ‘మోదీ హామీలు’ దేశవ్యాప్తంగా ప్రజల్లో మార్మోగుతున్నాయని చెప్పారు. ‘‘వాటిని వాళ్లు పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలే ఇందుకు చక్కని రుజువు’’ అని ప్రధాని వివరించారు. కేంద్ర పథకాలు ప్రజలందరికీ చేరేలా చూసేందుకు చేపట్టిన వికసిత్ సంకల్ప్ యాత్ర లబి్ధదారులతో శనివారం ఆయన ముచ్చటించారు. ఎన్నికల్లో నెగ్గడానికి ముందు ప్రజల హృదయాలను గెలుచుకోవడం చాలా అవసమని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఏ పారీ్టకైనా ప్రజల విజ్ఞతను తక్కువగా అంచనా వేయడం తెలివైన పని కాదని విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని, భావోద్వేగపూరిత బంధాన్ని ఏర్పాటు చేయగలిగాం. ప్రజలు తమదిగా భావిస్తున్న ప్రభుత్వం మాది. మోదీ ప్రతి ఒక్కరికీ సేవకుడు. పేదలను పూజిస్తాడు. వారి క్షేమం కోసం తపిస్తాడు. ప్రతి పేదా, తల్లి, చెల్లి, రైతు, యువతి, యువకుడు నాకు వీఐపీయే’’ వ్యాఖ్యానించారు. ‘‘విపక్షాలను ప్రజలు నమ్మకపోవడానికి అవి ఇస్తున్న తప్పుడు హామీలు, ప్రకటనలే కారణం. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న వాళ్లు ప్రజా క్షేమాన్ని పట్టించుకుని ఉంటే వారికి నేడు ఇంతటి నిరాదరణ ఉండేదే కాదు. ఎన్నికల్లో గెలిచేది ప్రజాక్షేత్రంలోనే తప్ప సోషల్ మీడియాలో కాదు’ అని విపక్షాలకు చురకలు అంటించారు. పక్కా ఇల్లు, తాగునీటి నల్లా, మరుగుదొడ్డి, ఉచిత వైద్యం, రేషన్, గ్యాస్, విద్యుత్, బ్యాంకు ఖాతాల వంటి సదుపాయాలు దేశ ప్రజలందరికీ అందుతున్నాయంటూ హర్షం వెలిబుచ్చారు. పీటీఐ ప్రధాన కార్యాలయం సందర్శన ఢిల్లీలో ఉన్న ప్రముఖ వార్తాసంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని మోదీ శనివారం సందర్శించారు. కొత్తగా ప్రారంభించిన వీడియో సేవలను ఆయన స్వయంగా పరిశీలించారు. 2014లో ప్రధానిగా పగ్గాలు చేపట్టాక ఒక వార్తసంస్థ కార్యాలయానికి మోదీ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా అక్కడి సీనియర్ ఎడిటోరియల్, ఎగ్జిక్యూటివ్ విభాగాల సిబ్బందితో మాట్లాడారు. మీడియాకు ఎదురయ్యే సవాళ్లు, మీడియాలో అవకాశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
ప్రమాణ స్వీకారం రోజునే 6 గ్యారంటీలపై సంతకాలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేతగా టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్రెడ్డిని ఎంపిక చేశామని, ఈ నెల 7న ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని ‘ఆరు గ్యారంటీ’ల అమలుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ప్రకటించిన విధంగా ప్రమాణ స్వీకారోత్సవం రోజునే ఆరు గ్యారెంటీలపై సంతకాలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధానంగా మహిళలు, రైతులు, విద్యార్థులు, ఇళ్లు లేని పేద కుటుంబాలు, నిస్సహాయుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను ప్రకటించడంతో ఆయా వర్గాల్లో భారీగా ఆశలు రేకెత్తాయి. కాగా ఈ హామీల అమలుకు ఏటా కనీసం రూ.88 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని ఓ అంచనా. అయితే పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తే మాత్రం నిధుల అవసరాలు రూ.లక్ష కోట్లకు చేరే అవకాశం ఉందని అంటున్నారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వీటి అమలుకు మరిన్ని రూ.వేల కోట్ల నిధులు అవసరం కానున్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఎన్నికల హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీల అమలుకు అవసరం కానున్న నిధులపై ‘సాక్షి’విశ్లేషణాత్మక కథనం.. మహాలక్ష్మికి రూ.10 వేల కోట్లు! మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 చొప్పున ఆర్థిక సహాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షలకు పైగా నిస్సహాయ పేద మహిళలకు కొత్తగా నెలకు రూ.2500 చొప్పున సహాయం అందించాల్సి ఉండనుందని అంచనా. ఈ లెక్కన ఏటా రూ.6 వేల కోట్ల వ్యయం కానుంది. ♦ ప్రస్తుతం హైదరాబాద్లో 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను రూ.955కు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లుండగా, రోజుకు 1.8 లక్షల నుంచి 2 లక్షల సిలిండర్లను విక్రయిస్తున్నారు. ఈ లెక్కన రూ.500కే గ్యాస్ సిలిండర్ను అందించడానికి ఏటా కనీసం రూ.2,923.65 కోట్ల గ్యాస్ సబ్సి డీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. గ్యాస్ ధర పెరిగిన కొద్దీ ఈ భారం పెరుగుతుంది. ♦ మహిళలకు ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు ల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడానికి సుమారుగా రూ.2,200 కోట్ల వ్యయం కానుంది. కేవలం పల్లె వెలుగు బస్సుల్లో ఈ సదుపాయం కల్పిస్తే రూ.750 కోట్లు కానున్నాయి. రైతు భరోసాకు రూ.29 వేల కోట్లు! రైతు భరోసా పథకం కింద రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 చొప్పున, వ్యవసాయ కూలీలకు రూ.12,000 చొప్పున ఆర్థిక సహాయం, వరి పంటకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతు కూలీలున్నట్టు అంచనా. వీరికి రూ.12 వేలు చొప్పున ఇవ్వడానికి ఏటా రూ.3 వేల కోట్లు అవసరం కానున్నాయి. అలాగే ఎకరానికి రూ.15 వేలు చొప్పున రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకు ఇచ్చేందుకు ఏటా రూ.22,500 కోట్లు, 6 లక్షల మంది కౌలు రైతులకు ఏటా రూ.3,000 కోట్ల సాయం అందించాల్సి ఉంటుంది. ఏటా సుమారు కోటిన్నర టన్నుల ధాన్యం సేకరిస్తుండగా, టన్నుకు రూ.500 చొప్పున రూ.750 కోట్లను ఇవ్వాల్సి ఉండనుంది. ఈ లెక్కన మొత్తం రైతు భరోసాకు ఏటా సుమారు రూ.29 వేల కోట్లు అవసరం అని అంచనా. ఇందిరమ్మ ఇళ్లకు రూ.15 వేల కోట్లు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షల ఆర్థిక సహాయం, ఉద్యమకారు లకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దశల వారీగా ఈ పథకం అమలు చేసే అవకాశం ఉంది. ఏటా ఎన్ని కుటుంబాలకు వర్తింపజేస్తారన్న అంశంపై స్పష్టత వచ్చాకే అందుకు అవసరం కానున్న నిధులపై స్పష్టత రానుంది. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఇళ్లు లేని కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇళ్లులేని పేద కుటుంబాలు దాదాపుగా ఇదే సంఖ్యలో ఉంటాయని అంచనా వేయవచ్చు. ఐదేళ్ల టర్మ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 15 లక్షల కొత్త ఇళ్లను నిర్మించాలని నిర్ణయిస్తే, ఏటా కనీసం 3 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏటా రూ.15 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా. యువ వికాసానికి రూ.10 వేల కోట్లు? విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు విషయంలో.. ఏ స్థాయి విద్య కోసం ఎంత మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు అనే అంశంపై స్పష్టత వస్తేనే ఈ పథకం అమలుకు అవసరం కానున్న నిధులను అంచనా వేయడానికి వీలుంది. ఏటా 2 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేస్తే రూ.10 వేల కోట్ల నిధులు అవసరం కానున్నాయి. గృహజ్యోతికి రూ.3,431.03 కోట్లు.. గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరాకు ఏటా రూ.3,431.03 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సి ఉంటుందని అంచనా. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు అందిస్తున్న సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలను కొనసాగిస్తూ అదనంగా ఈ మేరకు నిధులివ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం గృహ కేటగిరీ విద్యుత్ కనెక్షన్లు 1.20 కోట్లు కాగా, అందులో 1.05 కోట్ల కనెక్షన్లు (87.9 శాతం గృహాలు) నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ను మాత్రమే వినియోగిస్తున్నాయి. చేయూతకు రూ. 21 వేల కోట్లు చేయూత పథకం కింద నెలకు రూ.4వేల పెన్షన్, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అమలు చేస్తామ ని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పథకం కింద మొత్తం 43,68,784 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, కల్లు గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, ఎయిడ్స్, డయాలసిస్ బాధితులు, ఒంటరి మహిళలు ప్రతి నెలా పెన్షన్లు అందుకుంటున్నారు. వీరికి రూ.4 వేల పెన్షన్ చెల్లిస్తే ఏటా సుమారు రూ.20,970 కోట్లు అవసరం అవుతాయి. రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అమలుకు అదనంగా నిధులు అవసరం కానున్నాయి. -
ఇటు పక్కవి హామీలు.. అవి అమలు చేస్తామని చెప్పె ‘బాండ్ పేపర్లు’
ఇటు పక్కవి హామీలు.. అవి అమలు చేస్తామని చెప్పె ‘బాండ్ పేపర్లు’ -
మాటకు కట్టుబడి...
మన తెలుగు రాజు హాలుడు సంస్కృతం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇద్దరు పండితులు వస్తారు నేర్పేందుకు. ఒకడు గుణాఢ్యుడు. రెండు శర్వవర్మ. ‘నేను మీకు సంస్కృతం నేర్పాలంటే 12 సంవత్సరాలు పడుతుంది’ అంటాడు గుణాఢ్యుడు. రాజుగారి అర్జెన్సీ గమనించిన శర్మవర్మ ‘నేను ఆరు నెలల్లో నేర్పుతాను’ అంటాడు. అది అసాధ్యం. కనుకనే గుణాఢ్యుడు ఆగ్రహంతో ‘అదే జరిగితే నాకు తెలిసిన సంస్కృత, ప్రాకృత, దేశ భాషలన్నింటినీ విడిచి పెట్టేస్తాను’ అంటాడు. శర్వవర్మ ఏవో తిప్పలు పడి కొత్త వ్యాకరణం రాసి ఆరు నెలల్లో రాజుగారికి సంస్కృతం వచ్చు అనిపిస్తాడు. ఇందుకు గుణాఢ్యుడు ఆశ్చర్యపోయి, మొత్తానికి సాధించావ్ అనేసి తన దోవన తాను పోతే ఎవరూ ఏమీ అనరు. తల తీసి మొలేయరు. కాని మాటకు విలువ ఇచ్చే కాలం అది. గుణాఢ్యుడు మహా పండితుడు. భాషే జీవంగా జీవించేవాడు. అలాంటివాడు తానిచ్చిన మాటకు విలువనిచ్చి తనకు తెలిసిన అన్ని భాషలను వదిలిపెట్టి, మౌనిగా మారి, అడవులకు వెళ్లిపోతాడు. అక్కడ అతను పైశాచి భాష నేర్చుకుని ‘బృహత్కథ’ రాయడం వేరే విషయం. కాని మాటకు కట్టుబడటం వల్లే కదా ఇన్ని వందల ఏళ్ల తర్వాత గుర్తు చేసుకుంటున్నాము. మనిషి గుంపు జీవనం మొదలెట్టే నాటికి లిపి లేదు. రాతకోతలు లేవు. నోటి మాటే శిలాశాసనం. మాట ఇవ్వడం అంటే ఒప్పందం చేసుకోవడమే. రాజ్యాలు ఏర్పడ్డాక ‘మాటకు కట్టుబడటం’ ఒక విలువగా, యుగ స్వభావంగా స్థాపన చేసేందుకు సత్య హరిశ్చంద్రుడి కథ విశేషంగా వ్యాప్తిలోకి వచ్చింది. హరిశ్చంద్రుడు విశ్వామిత్రునికి ఇచ్చింది కేవలం మాటే. హరిశ్చంద్రుడు పాలకుడు, రాజు. ఇచ్చిన మాట నెరవేర్చకపోతే ఎవరూ ఏమీ చేయరు. కాని మాట తప్పిన అపప్రథను శిరస్సున మోయడం కంటే రాజ్యాన్ని, భార్యను, కుమారుణ్ణి కూడా కోల్పోయేందుకు సిద్ధమవుతాడు. శ్రీరాముడు మరింత ఉదాత్తుడు. తన మాటకు కాదు, తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడి అడవులకు వెళ్లాడు. ‘నువ్వు మాటిస్తే నేనెందుకు వెళ్లాలి నాన్నా’ అనంటే దశరథుడు చేయగలిందేముంది? అందుకే రాముడు దేవుడు. గాంధీ గారు దక్షిణాఫ్రికా వెళుతూ తన తల్లికి ‘మద్యం, మగువ, మాంసం జోలికి వెళ్లను’ అని మాట ఇచ్చారు. అక్కడకు వెళ్లాక మద్యం ఎలాగూ అలవాటు లేదు. మగువకు లోబడలేని నిష్ఠ ఉంది. కాని మాంసం జోలికి వెళ్లకుండా, అక్కడ అదే దొరుకుతుంది కనుక, ఎలా ప్రాణాలు నిలబెట్టుకోవాలో ఆయనకు అర్థం కాలేదు. అయినా సరే, మాట తప్పలేదు– ఆకలికి తాళలేక పచ్చి బియ్యం బొక్కాడు తప్ప. నిజం. అలా ఉండేవారు జనులు, తల్లికి మాట ఇస్తే, గురువు మాట ఇస్తే్త, తమకు తాము మాట ఇచ్చుకుంటే జీవితాంతం కట్టుబడేవారు. ఉత్తరాదిలో ‘ప్రాణ్ జాయ్ పర్ వచన్ నా జాయ్’ అంటారు. మాట పోతే ప్రాణం పోయినట్టే! మరి కల్తీ సరుకు రాకుండా ఉంటుందా? ‘కన్యాశుల్కం’లో కరటక శాస్త్రి తన శిష్యుణ్ణి ఆడవేషం కట్టమని చెప్పి, ఆ వేషంలో లుబ్ధావధాన్లను పెళ్లి చేసుకోమని ‘నువ్వు నెగ్గుకొస్తే మా పిల్లన్నీకిచ్చి ఇల్లరికం వుంచుకుంటాను’ అంటాడు. ‘మాట తప్పితే భూమి తోడ్రా’ అనంటాడు. దానికి శిష్యుడు ‘మీరు యగేస్తే భూవేం చేస్తుందిలెండి?’ అనంటాడు. మాట ఇవ్వడాన్ని పాతకాలపు చాదస్తంగా, మాట తప్పడాన్ని కొత్త జీవన మంత్రంగా పసిగట్టి గురజాడ ‘కన్యాశుల్కం’లో ఆనవాలు వదిలాడు. నిజమే. మనుషులు కాగితాన్ని తప్ప మాటను నమ్మని పరిస్థితి వచ్చింది. ఎక్కడి మాట అక్కడే మర్చిపోవాలి అనే గిరీశాలు మూలకొకడు, మలుపుకొకడు తయారయ్యారు. ‘ఆడిన మాటలు తప్పిన గాడిద కొడకంచు తిట్టగా విని అయ్యో వీడా నాకొక కొడుకని గాడిద ఏడ్చెన్ గదన్నా ఘన సంపన్న’ అనే పద్యం వీరి ఎదుట చదివితే ‘తిట్టుకో తిట్టుకో... అలాగే అలాగే’ అని కాఫీ తాగి లేచ్చక్కా పోతుంటారు. కాని ఎంత అధ్వాన్న రోజుల్లోనైనా వడగడితే జారిపోని విలువలు ఎన్నోకొన్ని మనుషులు మిగుల్చుకునే ఉంటారు. మాట తప్పని స్వభావాన్ని వారు నేటికీ గౌరవిస్తూనే ఉన్నారు. ఈ భూమి, ఈ వనరులు, ఈ సంపద, ఈ గాలి, నీరు... వీటన్నింటికీ తాము సమాన హక్కుదార్లమని తెలిసినా, పోరాడి పొందగలిగే శక్తి ఉన్నా, పాలకులుగా... ఏలికలుగా సింహాసనాల్లో కూర్చున్నవారు తమకు నాలుగు మెతుకులుగా విదిల్చితే పొందాలేమోనన్న స్థితికి వారు నెట్టబడినా, ఇలాంటి స్థితిలో కూడా వారు ఎవరి మాట సత్తుదో, ఎవరి మాటలో సత్తువున్నదో సూక్ష్మంగా గమనిస్తూనే ఉంటారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తమ ఇంగితజ్ఞానం అనే గీటురాయిని బయటకు తీస్తూనే ఉంటారు. నమ్మిన మాటను గెలిపిస్తారు. ఒకవేళ అది నమ్మించిన మాట మాత్రమే అని గ్రహిస్తే సందర్భం కోసం కాచుకుని ఉంటారు. ‘తప్పుడు వెధవ’ అనే తిట్టు ఉంది. అంటే తప్పు చేసినవాడు మాత్రమే కాదు మాట తప్పినవాడు కూడా! ప్రజల నుంచి తీసుకుని తిరిగి ప్రజలకు అందించడం అనే ఒక సరళ సూత్రంలో పాలకుడు వాహిక మాత్రమే. ప్రజలకు మంచి చేస్తాను అనే మాట మాత్రమే అతనికి శిరోధార్యం కావాలి. జనం చెవిలో పువ్వు పెట్టే నాలుగు మాటలు చెప్పి తమ మెడలో విజయహారాలు ధరిద్దామనుకుంటే అది గేమ్లో భాగమే కావచ్చు. కాని అలాంటి గేమ్లో ఠక్కున ఔటవడమే గాక మాటగా కూడా గుర్తురాని స్థితికి దిగజారి పోతారు. మాటలు వెదజల్లకండి. ఇవ్వగలిగిన మాట మాత్రమే ఇవ్వండి. మాట జాగ్రత్త! -
విజయానికి ఏడు హామీలు
రాజస్థాన్లో గత 30 ఏళ్లలో అధికార పార్టీ నెగ్గిన దాఖలా లేదు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభుత్వం మారుతూ వస్తోంది. ఈసారి మాత్రం వరుసగా రెండో విజయంతో చరిత్రను తిరగరాసేందుకు సీఎం అశోక్ గహ్లోత్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ విషయంలో ‘ఏడు హామీ’లపై బాగా ఆశలు పెట్టుకున్నారు. ఆ పథకాలు తనను కచ్చితంగా గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు...! రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పర్వం క్లైమాక్స్కు చేరుతోంది. అధికార కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. పోలింగ్కు మరో మూడు రోజులే ఉంది. గురువారం సాయంత్రంతో ప్రచారానికి కూడా తెర పడనుంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని సీఎం గహ్లోత్ టాప్ గేర్లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ తరఫున అంతా తానై వ్యవహరిస్తున్నారు. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో వీలైనన్ని అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనున్నారు. ముఖ్యంగా మహిళలకు రూ.10 వేల భృతి మొదలుకుని రూ.25 లక్షల వైద్య సాయం దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న, అందించబోయే పథకాలను ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ప్రచార సభలోనూ అవి ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. జీవన్మరణ సమస్య! 72 ఏళ్ల గహ్లోత్కు ఒకరకంగా ఈ అసెంబ్లీ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ను ఈసారి ఆయన పూర్తిగా పక్కన పెట్టారు. కనుక ఫలితాలు ఏ మాత్రం వికటించినా గహ్లోత్ రాజకీయ జీవితానికి తెర పడవచ్చన్న అభిప్రాయముంది. అందుకే కొద్ది రోజులుగా ఆయన దూకుడు పెంచారు. రోజుకు కనీసం నాలుగైదు సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఒక్క రోజు ఏకంగా 800 కిలోమీటర్లు పర్యటిస్తున్నారు! తన ఓబీసీ సామాజిక వర్గ మూలాలను కూడా సమయానుకూలంగా ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ప్రచార సభలోనూ ప్రధాని మోదీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆయన ప్రసంగాల్లో కాంగ్రెస్ పథకాలనే యథాతథంగా కాపీ కొడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. తమ ఏడు హామీలకు పోటీగా బీజేపీ తెరపైకి తెచ్చిన ‘మోదీ హామీ’లను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ, అవన్నీ కాంగ్రెస్ హామీలకు నకళ్లేనని పదేపదే చెబుతున్నారు. ‘‘ఇది బీజేపీకి బాగా మైనస్గా మారుతోంది. ఈసారి కచ్చితంగా గెలుపు కాంగ్రెస్దే. ఓటర్లు ఈ మేరకు నిర్ణయించుకున్నారు కూడా’’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా స్వీయ ప్రచార వీడియోలను కూడా విడుదల చేస్తూ, అవి వీలైనంత మందికి చేరేలా జ్రాగత్తలు తీసుకుంటున్నారు గహ్లోత్. అధిష్టానం అనుగ్రహం కోసం... రాష్ట్రస్థాయిలో గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూనే, అధిష్టానంతో సంబంధాలను కూడా సరిదిద్దుకునే పనిలో పడ్డారు గహ్లోత్. గతేడాది కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాల్సిందిగా సోనియా ఆదేశించినా ఆయన బేఖాతరు చేయడం తెలిసిందే. దీనిపై గాంధీ కుటుంబం గుర్రుగా ఉన్న నేపథ్యంలో, వీలు దొరికినప్పుడల్లా సోనియా, రాహుల్, ప్రియాంకలను ఆయన ఆకాశానికెత్తుతూ వస్తున్నారు. రాష్ట్ర ప్రచార పర్వమంతా రాహుల్, ప్రియాంక కనుసన్నల్లోనే జరుగుతోందని పదేపదే చెప్పుకొస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ రాజస్థాన్లో కాంగ్రెస్ ఏడు హామీలు... 1. కుటుంబ పెద్ద అయిన మహిళకు ఏటా రూ.10,000 భృతి 2. ప్రభుత్వ కాలేజీలో చేరే ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్ లేదా ట్యాబ్ 3. చిరంజీవి ఆరోగ్య బీమా పథకం ద్వారా రూ.25 లక్షల దాకా వైద్య సాయం. ఇందులో భాగంగా రూ.15 లక్షల ప్రమాద బీమా 4. అందరికీ ఉచితంగా ఇంగ్లిష్ మీడియం విద్య 5. రాష్ట్రంలో కోటి కుటుంబాలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ 6. పాత పెన్షన్ పథకానికి చట్టబద్ధత 7. రైతుల నుంచి రూ.2కు కిలో చొప్పున పేడ కొనుగోలు -
2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్ అసెంబ్లీకి ఈ నెల 25న జరగనున్న ఎన్నికలకు బీజేపీ గురువారం మేనిఫోస్టోను విడుదల చేసింది. ఉజ్వల పథకం లబ్ధిదారులకిచ్చే వంటగ్యాస్ సిలిండర్పై రూ.450 చొప్పున సబ్సిడీ, వచ్చే అయిదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పీఎం కిసాన్ యోజన కింద రైతులకిచ్చే ఆర్థిక సాయం పెంపు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ మేరకు మేనిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను బీ జేపీ చీఫ్ జేపీ నడ్డా గురువారం జైపూర్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రశ్నపత్రాల లీకేజీతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా ఈ సందర్భంగా నడ్డా ప్రకటించారు. సంకల్ప పత్రలోని మరికొన్ని హామీలు.. గోధుమలను కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు బోనస్తో కలిపి క్వింటాలుకు రూ.2,700 చొప్పున కొనుగోలు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థిక సాయం ఏడాదికి రూ.6 వేల నుంచి రూ.12 వేలకు పెంపు. ఈస్టర్న్ రాజస్తాన్ కెనాల్ ప్రాజెక్టు(ఈఆర్సీపీ)ను కేంద్రం సాయంతో నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయడం. ఈ ప్రాజెక్టుతో 13 జిల్లాలకు తాగు, సాగునీటి సమస్య తీరుతుంది. మహిళలు, బాలికల కోసం... జిల్లాకో మహిళా పోలీస్ స్టేషన్. ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా డెస్క్..ప్రతి నగరంలో యాంటీ రోమియో స్క్వాడ్ల ఏర్పాటు. లాడో ప్రోత్సాహన్ యోజన కింద పుట్టిన ప్రతి బాలిక పేరిట రూ.2 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్. లక్పతి దీదీ పథకం ద్వారా ఆరు లక్షల మంది గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ. 12వ తరగతి పూర్తి చేసుకున్న ప్రతిభావంతులైన బాలికలకు స్కూటీల పంపిణీ. పేద కుటుంబాల బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య. రాష్ట్రంలో మూడు మహిళా బెటాలియన్ల ఏర్పాటు. పీఎం మాతృ వందన్ పథకం కింద అందించే ఆర్థిక సాయం రూ.5 వేల నుంచి 8 వేలకు పెంపు. యువత కోసం.. వచ్చే అయిదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ పేద కుటుంబాల విద్యార్థులు పుస్తకాలు, దుస్తులు కొనుక్కునేందుకు ఏటా రూ.12 వేలు పంపిణీ. ప్రతి డివిజన్లో రాజస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాజస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటు. ఆరోగ్యరంగంలో.. భామాషా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ద్వారా ఆరోగ్య రంగంపై రూ.40 వేల కోట్ల పెట్టుబడి కొత్తగా 15 వేల మంది వైద్యులు, 20 వేల పారామెడికల్ సిబ్బంది నియామకం. వీటితోపాటు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, జైపూర్ మెట్రో విస్తరణ, పారదర్శక బదిలీ విధానం, పేద కుటుంబాలకు ఉచిత రేషన్, దివ్యాంగులకు రూ.1,500 పింఛను, వృద్ధాప్య పింఛను పెంపు వంటివి ఉన్నాయి. ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 350 బిలియన్ డాలర్లకు పెంచుతామని వాగ్దానం చేసింది. జైపూర్, ఉదయ్పూర్, కోటా, అజీ్మర్, జోథ్పూర్, బికనీర్లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడాన్ని కూడా మేనిఫెస్టో పేర్కొంది. ఓబీసీలకు నిర్ణిత వ్యవధిలో ధ్రువీకరణ పత్రాల జారీ, వారికి రూ.15 వరకు విద్యారుణం. ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు. ఇవి కాకుండా, ఎస్సీ,ఎస్టీలు, గిరిజనులు, వీధి వ్యాపారులు, గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. -
నేల మీదకు రండి!
ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ప్రజలకు ఎన్నెన్నో హామీలతో కూడిన మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నా, వాటిలో ఎక్కడా కూడా భూమి ఎజెండా కావడం లేదు. ఇందుకు కారణాలేవైనా తెలంగాణలో భూమి చుట్టూ తిరగాల్సిన రాజకీయం డబ్బు చుట్టూ తిరుగుతోందని వర్తమాన పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, రాజకీయ పార్టీలు దృష్టి సారించాల్సిన అంశాలపై తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టో–2023 పేరుతో తెలంగాణ సమాఖ్య 15 కీలక అంశాలను తెరపైకి తెచ్చింది. లీఫ్స్ సంస్థ, గ్రామీణ న్యాయపీఠం, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం నిర్వహించిన తెలంగాణ భూమి కారవాన్, భూన్యాయ శిబిరాలు, న్యాయగంట, చర్చా వేదికల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల అభిప్రాయాల ఆధారంగా ఈ డిమాండ్లను పార్టీల ముందుంచింది. మూడే కీలకం.. ఆ ఒకటే రికార్డు–ఒకటే పట్టా–ఒకటే చట్టం నినాదాన్ని ఎన్నికల ఎజెండా చేయాలని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. ఇది సాధ్యమైతే 90 శాతం సమస్యలు పరిష్కారమైనట్లేనని అంటున్నారు. ఒకటే రికార్డు కావాలంటే భూముల సమగ్ర సర్వే జరగాలి. ఒకటే పట్టా కావాలంటే ప్రభుత్వమే టైటిల్ గ్యారంటీ ఇవ్వాలి. ఒకటే చట్టం కావాలంటే రెవెన్యూ కోడ్ అమల్లోకి రావాలి. ఇవి మూడూ జరగాలంటే రాజకీయ నిబద్ధత కావాల్సిందే. వీటితో పాటు లా కమిషన్, సర్వీస్ కమిషన్, స్టేట్ఫైనాన్స్ కమిషన్ తరహాలో భూ కమిషన్ ఏర్పాటు డిమాండ్ కూడా ఉంది. కౌలు–వ్యవసాయ భూముల చట్టం (1950) ప్రకారం అధికారులు, నిపుణులు, ప్రజాప్రతినిధులతో ఈ కమిషన్ ఏర్పాటు తప్పనిసరి. అయితే 1950 నుంచి ఓ దశాబ్దంపాటు అమల్లో ఉన్న ఈ కమిషన్ ఆ తర్వాత క్రమంగా కనుమరుగైంది. భూమికి సంబంధించిన ఇతర డిమాండ్లు ఇవి ♦ ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించి పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించి పట్టాలివ్వాలి. ♦ పోడు సాగు చేస్తున్న అర్హులైన గిరిజనులందరికీ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి హక్కు పత్రాలను అందించాలి. ♦ భూపంపిణీకి ప్రత్యేక పథకం రూపొందించాలి. సీలింగ్ చట్టంతో మిగులు భూమిని భూమిలేని వ్యవసాయ పేద కుటుంబాలకు పునఃపంపిణీ చేయాలి. ♦ భూవివాదాల పరిష్కారానికి జిల్లాకో భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర స్థాయిలో అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుతోపాటు పేదలకు ఉచిత న్యాయ సాయం, పారాలీగల్ పథకాలను అమలు చేయాలి. ♦ ధరణి సమస్యల పరిష్కారం కోసం గ్రామ స్థాయిలో రెవెన్యూ కోర్టులు నిర్వహించాలి. కంప్యూటర్లో ఉన్న భూరికార్డులు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండాలి. రికార్డుల్లో తప్పులను సత్వరమే సవరించేలా సాఫ్ట్వేర్ రూపొందించాలి. కంప్యూటర్లో ఉన్న రికార్డులకు భద్రత కల్పించాలి. ♦ నిషేధిత జాబితా (22ఏ)లో పొరపాటున నమోదైన పట్టా భూములను వెంటనే జాబితా నుంచి తొలగించాలి. ♦ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భూపరిపాలన యంత్రాంగాన్ని పటిష్టపర్చాలి. అవసరాలకు తగినట్టు వారికి తగిన శిక్షణ ఇవ్వడం కోసం భూ అకాడమీని ఏర్పాటు చేయాలి. ♦ భూవిధానం, భూమి వినియోగ విధానం, 2014లో చేసిన భూసేకరణ చట్టం యథాతథంగా అమలు చేయాలి. ♦ కౌలుదారులను సాగుదారులుగా గుర్తించి వారికి పట్టా రైతులుగా అందాల్సిన అన్ని రకాల సాయం అందించాలి. కొత్త కౌలు చట్టం రూపొందించాలి. ‘సర్వే’జనా..! భూముల సమగ్ర సర్వే కూడా రాజకీయ ఎజెండా కావాల్సిందేననేది రైతుహితుల అభిప్రాయం. గుజరాత్తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్లలో భూసర్వే జరిగింది. ఏపీలో జరుగుతున్న సర్వే దక్షిణాదిలో ఉత్తమమైన సర్వేగా గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశంలోనే భూముల సమగ్ర సర్వే చేసిన మొదటి రాష్ట్రంగా గుర్తింపు పొందుతుంది. తెలంగాణలో ఈ సర్వే చేసేందుకు 2016లో రూ.580 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇప్పుడు అది రూ.800 కోట్లకు చేరింది. శాటిలైట్, డ్రోన్, డీజీపీఎస్ (డిజిటల్ జియో పొజిషనింగ్ సిస్టమ్స్)ల ద్వారా గ్రామ సరిహద్దులు, హైస్కేల్ మెజర్మెంట్స్ తీసుకొని యునీక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఎల్పిన్) లేదా ల్యాండ్ పార్సిల్ నంబర్ ఇవ్వడం ద్వారానే భూమి హక్కులకు భద్రత కలగనుంది. ఇక మరో కీలకాంశం అసైన్డ్ భూములకు పట్టా హక్కుల కల్పన. ప్రస్తుతం బీఆర్ఎస్ మేనిఫెస్టోలో, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్లో ఈ అంశం పొందుపర్చారు. భూ బదలాయింపు (పీఓటీ) చట్టాన్ని సవరించడం ద్వారా ఆ భూములు కేటాయించిన 20 ఏళ్ల తర్వాత ఏపీ, కర్ణాటకల్లో, 15 ఏళ్ల తర్వాత తమిళనాడులో పూర్తిస్థాయి యాజమాన్య హక్కులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయి. తెలంగాణలో కూడా 1950 నుంచి పేదలకు అసైన్ చేసిన 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. ఈ భూములపై హక్కులకల్పన రాజకీయ ఎజెండా అయితే పేదల ఆర్థిక ముఖచిత్రంలో ఊహించని మార్పులు రానున్నాయి. -మేకల కళ్యాణ్ చక్రవర్తి -
ఎన్నికలవే.. ఎరలవే!
‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా..’ అనే సినిమా డైలాగ్ తరహాలో ఎలాంటి హామీలిచ్చామన్నది కాదు.. తమకు అనుకూలంగా బ్యాలెట్ బాక్సులు నిండాయా..లేదా? అధికారం చేపడతామా..లేదా?.. ఎన్నికలు ఎక్కడ, ఎప్పుడు జరిగినా రాజకీయ పార్టీల టార్గెట్ ఇదే. నగదుతో పాటు చీరలు, సెల్ఫోన్లు, కుక్కర్ల లాంటి వస్తువుల పంపిణీతో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించడం.. ముఖ్యంగా అధికారంలోకి వస్తే అది చేస్తాం..ఇది చేస్తాం..అంటూ హామీలు గుప్పించడం. ప్రపంచవ్యాప్తంగా పార్టీలది ఇదే బాట. తెలంగాణ అయినా, భారత్లో అయినా, పర్యాటక ప్రేమికుల స్వర్గధామం థాయిలాండ్ అయినా, భూకంపాల పుట్టినిల్లు టర్కీ అయినా.. ఎక్కడైనా ఓటర్ల కోసం తాయిలాలే. మన దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా పార్టీలు ఇస్తున్న హామీల తరహాలోనే.. గతంలో ప్రపంచంలోని పలు దేశాల ఎన్నికల్లోనూ పార్టీలు అనేక రకాల హామీలను గుప్పించి ఓట్లు సంపాదించే ప్రయత్నం చేయడం గమనార్హం. అయితే కొన్ని దేశాల్లో ప్రజాకర్షక హామీలతో పాటు పలు ఆర్థిక, సామాజిక, రక్షణ రంగాలకు సంబంధించిన అంశాలు కూడా అక్కడి ఓటర్లను ప్రభావితం చేయడం ఆసక్తి కలిగించే అంశం. కాగా, ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎన్నికలు జరిగిన టర్కీ, అర్జెంటీనా, పోలండ్, థాయ్లాండ్ దేశాల్లో స్థానిక ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు ఎలాంటి తాయిలాలు ప్రకటించాయో ఓసారి చూద్దాం. పోలండ్లో హక్కుల అంశాలు! 1989లో కమ్యూనిస్టు పాలన ముగిసిన తర్వాత పోలండ్లో మొదటిసారి ఈ ఏడాది అక్టోబర్లో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అధికార లా అండ్ జస్టిస్ పార్టీ (పీఐఎస్) మిత్రపక్షాలు, సెంటర్ రైట్ సివిక్ ప్లాట్ఫామ్ (పీవో)లు హోరాహోరీ తలపడ్డాయి. ఇక్కడి ఎన్నికలు రక్షణ రంగం, వలసలు, యూరోపియన్ యూనియన్ పాత్ర, మహిళలు, స్వలింగ సంపర్కుల హక్కులు, ద్రవ్యోల్బణం లాంటి అంశాలపై జరిగాయి. చిన్నారులు, వృద్ధులకు ఉచితంగా ఔషధాలను ఇస్తామని, 1989 కంటే ముందు కట్టిన అపార్ట్మెంట్లను ఆధునీకరిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలను పెంచుతామని, కనీస వేతనాన్ని 6,450 జ్లోటీలకు పెంచుతామనే హామీలనిచ్చాయి. ఆర్థిక వ్యవస్థ పటిష్టతపై అర్జెంటీనా అర్జెంటీనాలో అధ్యక్షుడితో పాటు 22 ప్రావిన్సుల గవర్నర్లు, 130 డిప్యూటీ గవర్నర్లు, 24 సెనేటర్ స్థానాలకు ఈ ఏడాది అక్టోబర్ 22న ఎన్నికలు జరిగాయి. ఈ దేశంలో బహుళ పార్టీ వ్యవస్థ ఉన్నా.. ది యూనియన్ పోర్లా పాట్రియా (యూపీ), జుంటోస్ పార్ కాంబియో (జేఎక్స్సీ), లా లిబరా్టడ్ అవాంజా (ఎల్ఎల్ఏ) కూటముల మధ్య పోటీ జరిగింది. దేశంలో జరుగుతున్న నేరాలు, డ్రగ్ ట్రాఫికింగ్లను అరికట్టేందుకు భద్రత పెంపు, పన్నుల తగ్గింపు, రాష్ట్రాల పరిధుల తగ్గింపు (మన రాష్ట్రంలో జరిగిన జిల్లాల పునర్విభజన తరహాలో), నిరుద్యోగ బీమా, ప్రభుత్వ కంపెనీల ప్రైవేటీకరణ, సామాజిక అంశాలపై ఖర్చు తగ్గింపు, వాణిజ్య రంగంలో నిబంధనల సరళీకరణ, చైనాతో సంబంధాల కటీఫ్, అమెరికన్ డాలర్తో పోటీ పడేలా ఆర్థిక వ్యవస్థ రూపకల్పన లాంటి అంశాలు ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ప్రచారా్రస్తాలుగా ఉపయోగపడ్డాయి. టర్కీలో ‘టెర్రర్’ తీవ్రవాదంతో కునారిల్లుతోన్న టర్కీలో జరిగిన ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలు ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి సారించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. దేశ ఆర్థిక వ్యవస్థ, ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో సంభవించిన భూకంపాల కేంద్రంగానే ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఇక్కడి ప్రధాన పార్టీలు సిరియా శరణార్ధులను కూడా ఎన్నికల బూచిగా వాడుకున్నారు. రష్యా మధ్యవర్తిత్వంతో సిరియాతో చర్చలు జరుపుతామని ప్రస్తుత అధ్యక్షుడు ఎర్డోగాన్ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. భూకంపాల నుంచి ఉపశమనం పొందేందుకు గాను ఈశాన్య టర్కిలోని ప్రజలకు 20 ఏళ్ల కాలపరిమితితో ఇంటి రుణాలు ఇప్పిస్తామని, రెండేళ్ల తర్వాత ఈ రుణాలు చెల్లించేలా చేస్తామని చెప్పాయి. మొత్తం ఆరున్నర లక్షల ఇళ్లను ప్రభుత్వమే కట్టి ఇస్తుందని, ఇందులో 3.19 లక్షలను ఏడాదిలోగా పూర్తి చేస్తామని పార్టీలు హామీలిచ్చాయి. థాయ్లాండ్లో ఆర్థిక లబ్ధిపై దృష్టి! ప్రపంచ పర్యాటక కేంద్రమైన థాయ్లాండ్లో ఈ ఏడాది మేలో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఇక్కడి ప్రధాన రాజకీయ పార్టీలయిన ప్యూ థాయ్ పార్టీ, మూవ్ ఫార్వార్డ్ పార్టీ, యునైటెడ్ థాయ్ నేషన్ పార్టీ, పలాంగ్ ప్రచారత్ పార్టీ, భుంజయ్థాయ్ పార్టీ, డెమొక్రాట్ పార్టీలు ఓట్ల వేటలో భాగంగా పలు హామీలు అక్కడి ప్రజలకు ఇచ్చాయి. ఎక్కువగా ఆర్థిక లబ్ధి చేకూర్చే కార్యక్రమాలపైనే దృష్టి పెట్టాయి. డిజిటల్ వ్యాలెట్ల ద్వారా 16 ఏళ్లు నిండిన వారికి రూ.10వేల బాత్లను ఇస్తామని, దినసరి కనీస వేతనాలను 337 బాత్ల నుంచి 600 బాత్లకు పెంచుతామని, రుణాలపై మూడేళ్ల మారటోరియం ప్రకటిస్తామని, ప్రతి ఉపాధ్యాయునికి, విద్యార్థి కి టాబ్లెట్ కంప్యూటర్ ఇస్తామని, వృద్ధాప్య భృతి నెలకు 3వేల బాత్లు చేస్తామని, విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని, 1జీబీ ఇంటర్నెట్ ఉచితంగా ఇస్తామని, వ్యవసాయ కుటుంబాలకు 30వేల బాత్లు సాయం చేస్తామని, వరి పండించే రైతాంగానికి రయ్ (అర ఎకరానికి కొంచెం ఎక్కువ)కి 2వేల బాత్ ఇస్తామని ప్రకటించాయి. -మేకల కళ్యాణ్ చక్రవర్తి -
ఆవు పేడ కిలో రెండు రూపాయలకు కొంటాం: రాజస్తాన్ సీఎం
జైపూర్: రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అయిదు గ్యారెంటీలను ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానం అమలు, గోధన పథకం కింద ఆవుపేడను కిలో రెండు రూపాయల చొప్పున కొనుగోలు, కాలేజీ విద్యార్థులకు ల్యాప్టాప్ లేదా టాబ్లెట్ పీసీ పంపిణీ ఇందులో ఉన్నాయి. నవంబర్ 25వ తేదీన అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తమ పార్టీని మళ్లీ గెలిపిస్తే వీటిని నెరవేరుస్తామని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో హామీ ఇచ్చారు. త్వరలోనే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతామని, ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన వారికి రూ.15 లక్షల బీమా కల్పిస్తామని చెప్పారు. పాత పింఛను విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించేలా చట్టం చేస్తామన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చేరే విద్యార్థులకు మొదటి ఏడాదిలోనే ల్యాప్టాప్ లేదా టాబ్ ఇస్తామన్నారు. ఇవికాకుండా, వంటగ్యాస్ సిలిండర్ను రూ.500కే అందజేయడం, రాష్ట్రంలోని 1.05 కోట్ల కుటుంబాల్లోని ఒక్కో మహిళకు ఏడాదికి విడతలుగా రూ.10 వేల చొప్పున అందజేస్తామని ఇప్పటికే ఆ పార్టీ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం గెహ్లోత్ కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ‘దేశంలో ఈడీ వీధి కుక్కల కంటే ఎక్కువగా హడావుడి చేస్తోందని ఒక సీఎం(భూపేష్ బఘేల్) అనాల్సి వచ్చింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది?’ అని వ్యాఖ్యానించారు. అంత మాట అన్నారంటే ఆయన ఎంతగా బాధపడ్డారో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ‘దర్యాప్తు విభాగాలు మీకు రాజకీయ ఆయుధాలుగా మారాయి. మోదీజీ, మీకు అర్థం కావడం లేదు. మీకు కౌంట్డౌన్ మొదలయ్యింది’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతాస్రా ఇంటిపై గురువారం ఈడీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. -
మేనిఫెస్టో అంటే టీడీపీకి టిష్యూ పేపరే!
సాక్షి, అమరావతి: ఎడాపెడా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు మహా నేర్పరి. 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి ఆ తర్వాత ప్రజలను నిలువునా ముంచారు. రైతు రుణాలు రూ.87వేల కోట్లకు పైబడి ఉంటే... దాన్ని ఐదు విడతల్లో ఇస్తానని చెప్పి మూడు విడతలు... అది కూడా తూతూ మంత్రంగానే ఇచ్చారు. నాటి ప్రభుత్వ తీరుతో రైతులపై వడ్డీల భారం పెరిగి వాటిని తీర్చలేక వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ♦ డ్వాక్రా, చేనేత రుణాల మాఫీని పూర్తిగా తుంగలో తొక్కారు. కోటయ్య కమిటీ తన నివేదికలో డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని సిఫారసు చేసినా పట్టించుకోలేదు. రుణాలు మాఫీ చేయకపోవడంతో వాటిపై వడ్డీలు పెరిగిపోయి మహిళలు బ్యాంకుల నుంచి నోటీసులు అందుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంఘాలు ఎన్పీఏలుగా (నిరర్థక ఆస్తులు) మారాయి. క్రెడిట్ రేటింగ్ను కోల్పోయి రుణాలకు అనర్హులయ్యారు. ♦ మద్యం బెల్టు షాపుల రద్దు చేస్తానని ప్రకటించి ఆ పని చేయకపోగా ప్రతి గల్లీకి వాటిని విస్తరించారు. ♦ రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పి అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆ ఊసే ఎత్తలేదు. ♦ పుట్టిన ప్రతి బిడ్డకు మహాలక్ష్మి పథకం కింద రూ.30 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తానని ఇచ్చిన హామీలు బుట్టదాఖలు చేశారు. ♦ ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేస్తానని ప్రకటించినా దాన్ని అమలు చేయకుండా యువత, విద్యార్థులను మోసం చేశారు. పైగా ప్రభుత్వ ఉద్యోగులను 2 లక్షలకుపైగా కుదించి అన్యాయం చేశారు. ♦ ఇంటికో ఉద్యోగం ఇస్తామని లేకపోతే ప్రతి నెలా రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని నీరుగార్చారు. ఎన్నికలకు మూడు నెలలు ఉందనగా కొద్దిమందికి భృతి పేరుతో చేతులు విదిల్చి వారిని మభ్యపెట్టారు. ♦ పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇస్తానని ఇవ్వలేదు. పేదలకు 3 సెంట్ల స్థలంలో ఇల్లు ఇస్తానని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ♦ బీసీలకు వంద అసెంబ్లీ స్థానాలిస్తానని చెప్పి ఇవ్వలేదు. బీసీలకు రూ.10 వేల కోట్ల బడ్జెట్ పెడతానని చెప్పి మోసం చేశారు. కాపులకు ఏటా వెయ్యి కోట్ల చొప్పున రూ.5 వేల కోట్లు ఇస్తానని చివరికి రూ.1500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ♦ ఇంటర్ వరకు విద్యార్థులకు ఉచిత బస్పాస్ ఇస్తానని ఇవ్వలేదు. నిరుద్యోగులకు రూ.50 లక్షల వరకు రుణం ఇస్తానని పట్టించుకోలేదు. ♦ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్ కంప్యూటర్లు ఇస్తామని ఇవ్వలేదు. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 33.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి పట్టించుకోలేదు. ♦ రూ.500 కోట్లతో బ్రాహ్మణుల కోసం నిధి ఏర్పాటు చేస్తానని చెప్పి మోసం చేశారు. ♦ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వాటి గురించి ప్రజలు అడుగుతారని భయంతో ఏకంగా మేనిఫెస్టోను తెలుగుదేశం వెబ్సైట్ నుంచే తొలగించిన చరిత్ర చంద్రబాబుది. -
తాగుబోతు చేత ప్రమాణం
-
పర్యావరణ హామీలపై దృష్టి
వాషింగ్టన్: వర్ధమాన దేశాలకు చేసిన వాగ్దానాలను, పర్యావరణం సహా కీలక అంశాలపై హామీలను నెరవేర్చడం తదితరాలు జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రాథమ్యాలు కానున్నాయి. ఆయన భారత పర్యటనకు సంబంధించి బుధవారం చేసిన ప్రకటనలో వైట్హౌస్ ఈ మేరకు పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జీ20 సదస్సు గొప్పగా విజయవంతం అవుతుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్ ఆశాభావం వెలిబుచ్చారు. బైడెన్ గురువారం భారత్ రానున్నారు. శుక్రవారం ఆయన మోదీతో భేటీ అవుతారు. శని, ఆదివారాల్లో జీ20 భేటీలో పాల్గొంటారు. -
అంతు చూస్తారట!
75 ఏళ్ల ముసలాయన, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు మాట్లాడుతున్న మాటలు వినండి. అధికారం ఇస్తే ఏం చేస్తారో వీళ్ల నోటితో వీళ్లే చెప్పారు. తనకు అధికారం ఇస్తే ఎవరినీ వదలడట.. తనకు గిట్టని వారి అంతు చూస్తాడట.. మట్టుబెడతాడట.. ఉగ్రరూపం చూపిస్తాడట.. ఏకంగా నరకం చూపిస్తాడట.. ఇందుకోసం ఆయనకు అధికారం ఇవ్వాలట! ఇదీ ఈ పెద్దమనిషి నైజం. ఇలాంటి ఆయన కోసం ఆయన దత్తపుత్రుడు పరుగెడుతున్నాడు. ఈ పెద్దమనిషికి ఏనాడైనా ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఉందా? ఫలానా పని చేశానని చెప్పుకోవడానికి ఏమీ లేకే రెచ్చగొట్టి గొడవలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇదేం రాజకీయం? – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమలాపురం: ‘చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఎక్కడా చెప్పడం లేదు. అలా చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకే గొడవలు సృష్టించి ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. యాత్రలు, సభల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. అమలాపురంలో వైఎస్సార్ సున్నా వడ్డీ నాలుగో విడత నిధుల విడుదల సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈ రోజు నిజంగా వీళ్లందరి ఆలోచన ఏ స్థాయిలో ఉందో ప్రజలు గమనించాలని కోరారు. ‘వారు మంచి చేస్తామంటే ప్రజలు నమ్మరని వాళ్లకు తెలుసు. కాబట్టే ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అబద్ధాలు చెబుతున్నారు. ప్రతి రోజూ మోసాలు చేస్తారు. మీటింగులు పెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చివరకు 47 మంది పోలీసులపై దాడి చేశారు. ఇలాంటి రాక్షసులకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలని అనిపించింది. ఎక్కడికక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్న వారి పట్ల మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. శవ రాజకీయాలు చేస్తున్నారు. ♦ మొన్న అంగళ్లులో చంద్రబాబు తానే స్వయంగా రెచ్చగొట్టి గొడవలు చేయించారు. మళ్లీ పుంగనూరులో ఒక రూటుకు అనుమతి తీసుకొని ఆ రూట్లో పోకుండా పుంగనూరుకు వచ్చి వేరే రూట్లో పోవాలని ప్రయత్నించారు. అప్పుడే పోలీసులు మీకు అనుమతి లేదని, అక్కడ అధికార పార్టీవాళ్లు నిరసన కార్యక్రమం చేసుకుంటున్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పారు. ♦ దీంతో చంద్రబాబు వారిని ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. వాళ్ల క్యాడర్ను రెచ్చగొట్టి 47 మంది పోలీసులను గాయపరిచారు. ఒక పోలీసు సోదరుడికి కన్ను కూడా పోగొట్టాడు. కారణం గొడవలు జరగాలి. శవ రాజకీయాలు చేయాలన్నదే ఆలోచన. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వాళ్లదే. వాళ్లు ఏం చెబితే అది రాస్తారు. మైకులు పట్టుకొని దత్తపుత్రుడు రెడీగా ఉన్నాడు కాబట్టి శవ రాజకీయాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే చులకన ♦ ఈ పెద్దమనిషి చంద్రబాబు మనస్తత్వం చూడండి. దళితులను చీల్చి వారికి నరకం చూపించాడు. ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని చెప్పి వారిని నానా ఇబ్బందులకు గురిచేశాడు. బీసీల తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తా, తాట తీస్తా అని బెదిరించాడు. బీసీలకు 143 వాగ్దానాలిచ్చి వెన్నుపోటు పొడిచి మరీ వాళ్లకు నిలువునా దగా చేశాడు. ♦ మైనార్టీలకు, ఎస్టీలకు కనీసం ఒక్కటంటే ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మైనార్టీ ఓటు బ్యాంకుతో చెలగాటం ఆడటాన్ని అదే పనిగా పెట్టుకొన్న విషయం గుర్తుకు తెస్తున్నా. ఎస్టీలకు ఏనాడూ న్యాయం చేయకుండా కనీసం ఒక్క ఎకరా ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఏ రోజు ఇవ్వకుండా తన పెత్తందార్లకు మన్యాన్ని అప్పగించి మోసం చేశాడు. ♦ అక్కచెల్లెమ్మలను సైతం మోసం చేశాడు. కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని అగౌరవ పరిచాడు. ఇటువంటి పెద్ద మనిషి ఈరోజు మైకు పట్టకుని ఊదరగొడుతున్నాడు. నోరు తెరిస్తే అబద్ధాలే ♦ 2014కు ముందు ఈయన మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకోండి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలి అన్నారు. రైతుల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలట. అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలట. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే బాబు రావాలంటూ మోసం చేశాడు. రూ.85,712 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి, చేయకుండా రైతులను నిలువునా మోసం చేశాడు. ♦ రూ.14,207 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. చివరకు చదువుకుంటున్న పిల్లలనూ వదల్లేదు. ఉద్యోగం ఇస్తాను లేదా ఉపాధి కల్పిస్తాను అని నిస్సిగ్గుగా అబద్ధాల వాగ్దానాలు చేశాడు. లేదంటే ఇంటింటికీ రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికీ రూ.2 వేలు అంటే ప్రతి పిల్లాడికీ ఏటా రూ.24 వేలు అలా ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు మోసం చేశాడు. ♦ మాటంటే విలువ లేదు. విశ్వసనీయత లేదు. ఎన్నికలు అయ్యాక ప్రజల్ని గాలికి వదిలేయాలి అనే తలంపుతో పరుగెత్తుతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీళ్లందరూ దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి మాత్రమే అధికారం కావాలి. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడితో ఎండ్ అవుతుంది. నాడు, నేడు అదే బడ్జెట్.. ♦ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే బడ్జెట్, ఇదే రాష్ట్రం. అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. కేవలం ముఖ్యమంత్రి మారాడు. మీ బిడ్డకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు.. కచ్చితంగా వారికి రావాల్సినవి రావాలని ప్రయత్నం చేశాడు. మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు. అప్పట్లో ఇదే చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడని ఆలోచించండి. ♦ మీ బిడ్డ మీ కోసం ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా రూ.2.31 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్లలోకి పంపించాడు. ఈ నాలుగేళ్లలో ఇంతటి సంక్షేమాభివృద్ధిని ఏనాడైనా చూశామా? చంద్రబాబు హయాంలో సామాజిక న్యాయం ఉందా? నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయంగా ఇన్ని పదవులు ఏనాడైనా ఇచ్చారా? ఏనాడైనా మీ బిడ్డల భవిష్యత్ గురించి ఆలోచన చేశాడా? చివరకు పేదింటి పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవాలంటే కూడా వద్దన్న చరిత్ర ఆయనది. వాళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లకు మాత్రం ఇంగ్లిష్ మీడియం కావాలి. ♦ చంద్రబాబు అధికారంలో ఉండగా ఇలా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి.. ఇళ్లు కట్టించడం ఎప్పుడైనా చేశారా? ఇలా చేయలేకపోయిన ఈ 75 ఏళ్ల ముసలాయన వాటిని అడ్డుకోవడంలో మాత్రం ముందుంటారు. దత్తపుత్రులు ఎందుకిలా పరుగెడుతున్నాడంటే ఆయన సీఎం కావడానికి కాదట. ఈ ముసలాయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికట. ఇలాంటి వ్యక్తి సీఎం అయితే మనకు మంచి జరుగుతుందా? ♦ మీకు మంచి చేయడానికి వస్తున్న వలంటీర్లను కూడా వదలకుండా ఎంత దారుణంగా మాట్లాడారు. రాబోయే రోజుల్లో వీళ్ల నీచ రాజకీయాలు, అబద్ధాలు ఇంకా ఎక్కువ అవుతాయి. మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడి దయ, మీ దీవెనలనే. మీకు మంచి జరిగి ఉంటే నాకు మద్దతివ్వండి. అమలాపురంలో మూడు వంతెనలకు రూ.10 కోట్లు అమలాపురంలో మూడు పాత బ్రిడ్జిలు ఉన్నాయి. వాటిని పునర్ నిర్మించాలని మంత్రి విశ్వరూప్ అడిగారు. ఇందుకోసం రూ.10 కోట్లు కేటాయిస్తున్నాను. మా దగ్గర 84 సచివాలయాలున్నాయి. మాది ఇబ్బందికర ప్రాంతం.. వర్షాలు వస్తే ఇబ్బంది పడతాం.. అని విశ్వరూప్ చెప్పారు. అందుకు మంత్రి విశ్వరూప్ను, లేదా అతని కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ను బాగా తిరిగి ఏం పనులు కావాలో చెప్పాలన్నాను. ప్రతి సచివాలయానికి జీజీఎంపీ కింద రూ.40 లక్షలు మంజూరు చేస్తానని చెప్పాను. మీ గ్రామాలను అభివృద్ధి చేయడానికి మీ బిడ్డ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. -
బీఆర్ఎస్కు అధికారం ఇస్తే మహారాష్ట్రలో ప్రతి ఇంటికి నీళ్లు
-
ఏపీ విభజన హామీల అమల్లో కేంద్రం విఫలం: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమల్లో కేంద్రం ఘోరంగా విఫలమైందన్నారు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. ఈ విషయంలో కేంద్రం సవతి ప్రేమను చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాజ్యసభలో అప్రాప్రియేషన్ బిల్లు 2022పై జరిగిన చర్చలో మాట్లాడారు ఎంపీ విజయసాయిరెడ్డి. పోలవరం ప్రాజెక్టు అమలు లోపభూయిష్టంగా ఉందన్నారు. ‘ఏపీ విభజన హామీల అమల్లో కేంద్రం విఫలమైంది. అన్ని అవకాశాలు ఉన్నా కేంద్రం దృష్టి పెట్టడం లేదు. ఆస్తుల పంపకం కోసం సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు అమలు లోపభూయిష్టం. దీనికి యూపీఏ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. 2010-11 రేట్లతో 2022లో ప్రాజెక్ట్ కట్టమంటున్నారు. ఏ కాంట్రాక్టర్ ముందుకొస్తారు, నష్టాలు ఎవరు భరిస్తారు. ఆంధ్రప్రదేశ్పై కేంద్రం సవతి ప్రేమ చూపించడం సరికాదు’ అని ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. పోలవరం పనుల సొమ్ము చెల్లింపుల్లో జాప్యం లేదు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులకు వెచ్చిస్తున్న సొమ్మును కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. 2014 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 15 వేల కోట్ల 970 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ మొత్తంలో ఆమోదయోగ్యమైనవిగా గుర్తించిన బిల్లులకు 13 వేల కోట్ల 226 కోట్ల రూపాయల చెల్లింపు జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల బిల్లులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తనిఖీ చేసి వాటి చెల్లింపుల కోసం సిఫార్సు చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని వివరించారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ ద్వారా నిధులు మంజూరు చేయాలని 2016 సెప్టెంబర్ 30న ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అయితే ఆఫీసు మెమోరాండం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2014 ఏప్రిల్ 1 నుంచి కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ కింద అయిన ఖర్చు మాత్రమే భర్తీ చేయాల్సి ఉందని అన్నారు. ఆ ఖర్చును సమయానుసారం భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఇథనాల్ స్టాకు పెంపు నిరంతర ప్రక్రియ పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం చేయవలసిన ఆవశ్యకత దృష్ట్యా దేశవ్యాప్తంగా ఇథనాల్ నిల్వల సామర్ధ్యం పెంపు అనేది ఒక నిరంతరం ప్రక్రియ అని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. 2020-21లో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) పెట్రోల్లో 10 శాతం ఇథనాల్ మిశ్రమం చేసినట్లు చెప్పారు. ఆయిల్ రిఫైనరీలు, టెర్మినల్స్, సప్లయర్ల వద్ద ఇథనాల్ను నిల్వ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఇథనాల్ నిల్వ చేసేందుకు అవసరమైన ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఏపీ.. ఆపరేషన్ పరివర్తన్ కూడా! -
‘మునుగోడు’ హామీలను వెంటనే అమలు చేయండి.. కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజ లకు ఇచ్చిన హామీలను వెంటనే ఆచరణలో పెట్టాలని మంత్రు లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నేతలను సీఎం కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలు అమల య్యేలా చూడాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు సోమవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోమవారం మధ్యా హ్నం సుమారు మూడు గంటల పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ సమావేశ మయ్యారు. మునుగోడు అభివృద్ధికి సంబంధించిన పలు అంశా లపై దిశానిర్దేశం చేశారు. ‘‘ఎన్నికల సమయంలో నేతలు కేవలం హామీలు ఇస్తారనే అపోహను తొలగించాల్సిన అవసరం ప్రజా ప్రతినిధులపై ఉంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భ ంగా నియోజకవర్గంలో రీజనల్ హాస్పిటల్, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, రోడ్ల నిర్మాణం వంటి అనేక అంశాలపై ప్రజల నుంచి విజ్ఞప్తులు అందాయి. త్వరలో మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఒక తేదీని నిర్ణయించుకుని పంచాయతీరాజ్, రోడ్లు– భవనాలు, నీటి పారుదల, గిరిజన సంక్షేమం తదితర శాఖలకు చెందిన మంత్రులు మునుగోడుకు వెళ్లండి. జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వ హించి, అవసరమైన పనులకు ప్రణాళికలు సిద్ధం చేయండి. చర్ల గూడెం, శివన్నగూడెం రిజర్వాయర్ల పనుల పురోగతిని సమీ క్షించండి..’’ అని సీఎం కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. ఇప్ప టికే నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం కనిపిస్తోందని పేర్కొన్నట్టు సమాచారం. కూసుకుంట్లకు అభినందన మునుగోడు ఉప ఎన్నికలో తనకు టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్కు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించారు. ఆయనతోపాటు మునుగోడులో విజయం కోసం కృషి చేసిన పార్టీ నేతలను అభినందించారు. సీఎంను కలిసినవారిలో మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గొంగిడి సునీత, బొల్లం మల్లయ్యయాదవ్, ఆశన్నగారి జీవన్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, సైదిరెడ్డి, రవీంద్రకుమార్ నాయక్, భాస్కర్రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఎంసీ కోటిరెడ్డి, పార్టీ నేత సోమభరత్ కుమార్, ఉమా మాధవరెడ్డి తదితరులు ఉన్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్పై భారీగా ఫిర్యాదులు? -
బీజేపీ నేతలు ఎన్ని దొంగ ప్రమాణాలు చేసినా ప్రజలు నమ్మరు : మంత్రి జగదీష్ రెడ్డి
-
నన్ను గెలిపిస్తే రూ.20కే పెట్రోల్, ఇంటికో బైక్..
చండీగఢ్: ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు ఎలాంటి హామీలనైనా ప్రకటించేందుకు వెనుకాడరు. వాటి సాధ్యాసాధ్యాల గురించి పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లుగా వాగ్దానాలు చేస్తుంటారు. హర్యానా పంచాయతీ ఎన్నికల్లో సిర్సాఢ్ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న జయకరణ్ లఠ్వాల్ కూడా ఇదే కోవకు చెందుతాడు. తనను గెలిపిస్తే ఏం చేస్తాడో చెబుతూ అతను ఏర్పాటు చేసిన బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్గా మారింది. ఆ హమీలను చూసి కొందరికి మైండ్ బ్లాంక్ అవుతోంది. ప్రధాని, ముఖ్యమంత్రులకు కూడా సాధ్యం కాని ఈ హామీలను చూసి కొందరు నోరెళ్లబెడుతున్నారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే లీటర్ పెట్రోల్ రూ.20కే వచ్చేలా చేస్తానని జయకరణ్ చెబుతున్నాడు. గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక బైక్ ఇస్తాడట. గ్రామస్థులందరికీ జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుందట. మహిళలకు ఉచిత మేకప్ కిట్లు, ప్రతిరోజు మన్ కీ బాత్, ఊర్లో మూడు ఎయిర్ పోర్టులు, మందు తాగే వారికి ఒక బాటిల్ మద్యం, గ్రామం నుంచి ఢిల్లీ వరకు మెట్రోలైన్, ఉచిత వైఫై.. అబ్బో ఇలా చాలా హామీలనే ఇస్తున్నాడు. జయకరణ్ ఇచ్చిన మరో హామీ చూసి కొందరికి గుండె ఆగినంత పని అయింది. తాను సర్పంచ్గా గెలిస్తే సిర్సాఢ్ గ్రామం నుంచి గోహాన్ మండల కేంద్రం వరకు ప్రతి ఐదు నిమిషాలకు ఓ హెలికాప్టర్ ఏర్పాటు చేస్తానని అతను చెప్పాడు. కొందరేమో అది బస్సు అయి ఉంటుందని, పొరపాటున హెలికాప్టర్ అని రాసి ఉంటారని చలోక్తులు విసిరారు. ఇతని హామీల వర్షం చూసి ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా తనకు వెంటనే ఈ గ్రామానికి షిఫ్ట్ అవ్వాలనిపిస్తోందని నవ్వులు పూయించారు. Am shifting to this village 🤣 pic.twitter.com/fsfrjxbdLc — Arun Bothra 🇮🇳 (@arunbothra) October 9, 2022 చదవండి: పార్టీ చీలొద్దని సొంత కుమారుడినే సస్పెండ్ చేసిన మహానేత ములాయం -
ఎన్నికల సంఘం.. విచిత్ర కోరిక
భారత ఎన్నికల సంఘం ఒక పస లేని ప్రతిపాదన చేసి, అభిప్రాయాలు చెప్పండంటూ రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాసింది. అదేమిటంటే.. పార్టీలు ఎన్నికలలో ఇవ్వబోయే హామీలు; ఆ హామీలను అమలుచెయ్యబోయే విధివిధానాలు, వాటికై ఎలా నిధులు సమీకరించబోయేదీ, ప్రణాళిక అమలయ్యాక ఏం లాభం కలిగేదీ వివరిస్తూ కమిషన్కి ముందస్తుగానే అఫిడవిట్ సమర్పించాలట. తద్వారా ప్రజానీకానికి అలవికాని హామీల బాధ తప్పడంతో బాటు, ప్రభుత్వ ఖజానా స్థితిగతుల పట్ల వాస్తవిక దృక్పథంతో ఎవరున్నారో తెలుస్తుందట. ఎన్నికల సంఘానిది విచిత్రమైన కోరిక. ఏ పార్టీ అయినా ఒక అభివృద్ధి కార్యక్రమం గురించో, సంక్షేమ విధానం గురించో చెప్పి, అది ఎందుకు తమ ప్రాధమ్యమో చెప్పగలదు. కానీ వాటికి నిధులెక్కడినుండి వస్తాయో, ఎలా మేనేజ్ చేస్తుందో చెప్పాలంటే సాధ్యమేనా? పోనీ తెలుసుకుని ఎన్నికల సంఘం ఏమి చేస్తుంది? ఏదైనా ప్రతిపాదన తిరస్కరిస్తుందా? తిరస్కరిస్తే ఏ ప్రాతిపదికన ఆ నిర్ణయం తీసుకుంటుంది? అలా జడ్జ్ చేసే రాజ్యాంగపరమైన హక్కు ఆ సంఘానికి ఉందా? పనికిరాని పరిజ్ఞానం సేకరించడం ద్వారా ఎన్నికల సంస్కరణలు సాధ్యమౌతాయా? ఇప్పుడు కావాల్సింది లోపరహితంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ. ఎన్నికల హామీలపై నిర్ణయం తీసుకోగల చైతన్యం ప్రజలకు ఎటూ ఉంది. అట్టే బెంగ పెట్టుకోనక్కర లేదు. – డాక్టర్ డీవీజీ శంకర రావు; మాజీ ఎంపీ, పార్వతీపురం -
ఆప్కు అధికారమిస్తే.. గుజరాతీలకు బంపరాఫర్
అహ్మదాబాద్: పంజాబ్ విజయం ఇచ్చిన స్ఫూర్తితో.. మిగతా రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికల పోటీకి ఫుల్జోష్తో ఆమ్ ఆద్మీ పార్టీ సై అంటోంది. ఈ క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పదే పదే పర్యటిస్తూ వస్తున్నారు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. తాజాగా బీజేపీ కంచుకోటగా భావించే గుజరాత్లో అధికారం కోసం గుజరాతీలపై హామీల జల్లు కురిపించారు ఆయన. గుజరాత్లో గనుక అధికారమిస్తే.. రైతులకు రూ.2 లక్షల దాకా రుణమాఫీ చేస్తామని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. రెండు రోజల గుజరాత్ పర్యటనలో భాగంగా.. ద్వారక జిల్లాలో ఆయన ఇవాళ పర్యటించి ప్రసంగించారు. పగటి పూట 12 గంటలపాటు ఉచిత విద్యుత్తో పాటు కనీస మద్దతు ధరతో పంట కొనుగోలు, పంట నష్టపోతే ఎకరాకు రూ.20వేల పరిహారం ప్రభుత్వం తరపున చెల్లింపు లాంటి హామీలను రైతుల కోసం ప్రకటించారు ఆప్ కన్వీనర్. అంతేకాదు.. ప్రస్తుతం గుజరాత్లో అమలులో ఉన్న భూ సర్వే బిల్లును రద్దు చేసి.. కొత్త బిల్లు తీసుకొస్తామని, నర్మదా డ్యామ్ కమాండ్ ఏరియాను విస్తరించి రాష్ట్రం ప్రతిమూలలా ప్రయోజనాలు కలిగేలా చూస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. గుజరాత్ గత ప్రభుత్వాలన్నీ రైతులను నిర్లక్ష్యం చేశాయని.. సమస్యలను లేవనెత్తేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. ఆప్ వయసు పదేళ్లు. అలాంటి పార్టీ అద్భుతాలు ఎలా చేస్తుందని అడుగుతున్నారు. అది పేదల ఆశీర్వాదంతో ముందుకు వెళ్లడం వల్లే సాధ్యమవుతోందని కేజ్రీవాల్ తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్లను టార్గెట్ చేస్తూ.. ‘ఉచిత విద్యుత్, విద్య కావాలంటే మాకు ఓటేయండి. అవినీతి, గుండాయిజం కావాలనుకుంటే వాళ్లకు ఓటేయండి’ అని ఆయన ప్రసంగించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా పదే పదే పర్యటిస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఎన్నికల ముందస్తు హామీలను కురిపిస్తున్నారు. ఉచిత విద్యుత్(పరిమిత యూనిట్ల వరకు), విద్య, ఆరోగ్య సదుపాయాలతో పాటు లక్షల్లో ఉద్యోగాలు, మహిళలకు అలవెన్స్లు లాంటి వరాలను ప్రకటిస్తూ వస్తున్నారు. किसान हमारा अन्नदाता है, गुजरात में हर सरकार और पार्टी ने किसानों की अनदेखी की है। किसान भाइयों की समस्याओं और मुद्दों पर बात करने के लिए आज मैं गुजरात आया हूँ। https://t.co/pGIDLMszaB — Arvind Kejriwal (@ArvindKejriwal) September 2, 2022 ఇదీ చదవండి: అవినీతిపరుల కోసం ఒక్కటవుతున్నారు.. ప్రధాని మోదీ -
క్యా హువా తేరా వాదా..?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘వచ్చే 25 ఏళ్లకుగాను మీరు ప్రకటించిన లక్ష్యాలు బాగున్నాయి. కానీ గతంలో మీరిచ్చిన హామీల సంగతేంటి?’అని ప్రధాని నరేంద్రమోదీని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు నిలదీశారు. ‘2022 ఆగస్టు 15 నాటికి భారత్ ఎన్నో ఘనతలు సాధిస్తుందని గతంలో చేసిన ప్రమాణాలు ఏమయ్యాయి నరేంద్రమోదీ గారూ!’ అని ట్వీట్ చేశారు. ‘క్యా హువా తేరా వాదా’హ్యాష్ట్యాగ్తో వార్తా పత్రికల క్లిప్పింగ్ల ఫోటోను కేటీఆర్ అప్లోడ్ చేశారు. దాంట్లో మోదీ గతంలో చేసిన ప్రసంగాలను ప్రస్తావించారు. 2022 నాటికి ప్రతి పేదవాడికి ఇంటి నిర్మాణం, రైతుల ఆదాయం రెట్టింపు, భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లుగా మార్చడం, ప్రతి ఇంటికీ కరెంటు సరఫరా, మొదలైన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మీరు గతంలో చేసిన ఈ వాగ్దానాల గురించి దేశం తెలుసుకోవాలి అనుకుంటోందన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడు, వైఫల్యాలను గుర్తుంచుకోకపోతే జవాబుదారీతనం ఎక్కడుంటుందని కేటీఆర్ ప్రశ్నించారు. New goals for 2047 is great. But what about your past promises for 15th August, 2022 Hon’ble PM @narendramodi Ji? Nation wants to Know Where is the accountability if you don’t even acknowledge your own targets & subsequent failures in accomplishing the same?#KyaHuaTeraWada pic.twitter.com/P2YaL6GYs2 — KTR (@KTRTRS) August 16, 2022 -
వీఆర్ఏలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి!
మహబూబాబాద్: నర్సింహులపేట మండలం వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక మండల వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు 2017, 2020, 2022లో నిండు అసెంబ్లీలో వీఆర్ఏలకు పే స్కేల్, అర్హత గల వారికి ప్రమోషన్స్, 55సంవత్సరాలు నిండిన వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి కావొస్తున్నా ఇంకా అమలు చేయలేదు అని అన్నారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరిచి జీవో విడుదల చేయాలని కోరుతూ డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్యా నాయక్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఛైర్మెన్ యన్ శేకర్, జిల్లా ఉపాధ్యక్షడు ఎండీ మన్సూర్ అలీ, కొ వైర్మెన్ దర్మారపు ఉప్పలయ్య, కే.చైతన్య, యస్.సుధాకర్, లలిత, దివ్య, ఇర్ఫాన్, వెంకట నారాయణ, మోహన్, జనార్దన్, అబ్బాస్, రాములు, బిక్షం యకయ్య, మల్లయ్య, మనోజ్, తదితరులు పాల్గొన్నారు. -
‘శివసేన అలాంటి పార్టీ కాదు.. వారిలా హామీలివ్వదు’
ముంబై: ఎన్నికల సమయంలో కొన్ని పార్టీలు ప్రజల(ఓటర్లు)కు ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు ఇస్తాయని బీజేపీని ఉద్దేశించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అటువంటి వాగ్దానాలు చేసే పార్టీ శివసేన కాదని స్పష్టం చేశారు. ఎన్నికల సయయంలో కొంతమంది నాయకులు ప్రజలకు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తారని, అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోతారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలు నిలదీసినప్పుడు ఆ నాయకులు అసలు హామీలే ఇవ్వలేదని జారుకుంటారని ఎద్దేవా చేశారు. శివసేవ అటువంటి పార్టీ కాదని, నెరవేర్చలేని హామీల ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వదని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితులపై ప్రజలు ఆందోళన చెందవల్సిన అవసరం లేదని చెప్పారు. కరోనా పరిస్థితులను ఎదుర్కొనే సామర్థాన్ని కలిగి ఉన్నామని పేర్కొన్నారు. అయితే ప్రజలంతా కరోనా నియంత్రణకు సహకరించాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే విజ్ఞప్తి చేశారు. -
Tamil Nadu: మాట తప్పం..! గుబులు వద్దు..
‘‘అపోహలు వద్దు.. ఆందోళన చెందొద్దు.. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పం.. హామీలన్నీ నెరవేర్చి సంక్షేమ రాజ్యం స్థాపిస్తాం.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా క్షేమమే ధ్యేయంగా జనరంజక పాలన అందించి చరిత్ర సృష్టిస్తాం’’అని ముఖ్యమంత్రి స్టాలిన్ శాసనసభలో స్పష్టం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని, ఎవ్వరూ గుబులు చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షనేత ఎడపాడి పళనిస్వామి అసెంబ్లీలో సంధించిన ప్రశ్నలకు ఈ మేరకు స్టాలిన్ బదులిచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం 2021–22 సంవత్సర సవరణలతో కూడిన ప్రణాళిక ప్రకటన, 2021–22 సంవత్సర వ్యవసాయ ఆర్థిక ప్రణాళికపై చర్చసాగింది. అన్నాడీఎంకే సభ్యుడు ఆర్పీ ఉదయకుమార్ మాట్లాడుతూ, 2011లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఆర్థికమాంద్యాన్ని ఎదుర్కొంటూనే 1.83 కోట్ల రేషన్కార్డుదారులకు ఉచితబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు చక్కబట్టేందుకు రెండు లేదా మూడేళ్ల పడుతుందని చెప్పడాన్ని తప్పుపట్టారు. కాగా ఆర్థిక గణాంకాల పరిస్థితి ఏటికేడు మారిపోతుంటాయని, గతంతో పోల్చిచూడరాదని ఆర్థికమంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్ విమర్శలను తిప్పికొట్టారు. పరస్పర విమర్శలు.. వృద్ధాప్య పింఛన్ను రూ.500 నుంచి రూ.1000కి పెంచామని మళ్లీ ఉదయకుమార్ చెప్పగా, ఈ పెంపు నిజమే, అయితే లబ్ధిదారుల్లో 25 శాతం వరకు తగ్గించి.. వారికి పింఛన్ చెల్లించలేదని ఆర్థికమంత్రి ప్రతిదాడి చేశారు. ఈ సమయంలో ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి కలుగజేసుకుంటూ..జయలలిత అర్హులందరికీ వృద్ధాప్య పింఛన్ అందజేశారు, అదనంగా 60 శాతం మంది లబ్ధిదారులను పింఛన్ పథకం కిందకు తెచ్చారని తెలిపారు. వృద్ధాప్య పింఛన్లు, విద్యార్థులకు ఉచిత ల్యాబ్ట్యాబ్, మధ్యాహ్న భోజన పథకం తదితర సంక్షేమ పథకాల అంశాలపై అ«ధికారపక్ష, విపక్ష నేతల మధ్య వాగ్వాదం చోసుకుంది. రుణాల రద్దులో జాప్యానికి కారణం అదే.. సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తమ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసినందున ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వెనకడుగు వేయబోమని చెప్పారు. గతంలో కొన్ని కోట్ల రూపాయల అవకతవకలు చోటుచేసుకున్నందునే రైతుల పంట రుణాలు, బంగారు నగలపై పొందిన రుణాల రద్దులో జాప్యం ఏర్పడుతోందన్నారు. వాటన్నింటినీ సరిచేసి రుణాలను రద్దు చేస్తామన్నారు. ప్రజలకు ఉచితంగా సెల్ఫోన్ పంపిణీ, ఆవిన్ పాలు లీటరు రూ.25కు అందజేస్తామని ప్రకటించారు. గతంలో మీరిచ్చినవి.. ఇంటింటికీ అమ్మతాగునీరు ఉచిత సరఫరా, తక్కువ ధరకు ఫలసరుకులు, అమ్మబ్యాంకు కార్డు, కో ఆప్టెక్స్లో వస్త్రాల కొనుగోలుపై రూ.500 ఉచితం అంటూ 2011లో ఇచ్చిన హామీని అన్నాడీఎంకే ప్రభుత్వం నెరవేర్చిందా...? చెన్నైలో మోనోరైల్ పథకానికి శంకుస్థాపన చేశారు, నిర్మాణం చేపట్టారా..? కరుణానిధి తీసుకొచ్చిన మెట్రోరైల్ సేవలే నేడూ అందుతున్నాయి అంటూ.. స్టాలిన్ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. ఎడపాడి పళనిస్వామి కలుగజేసుకుంటూ అన్నదాతలకు రెండు ఎకరాల భూమి అని ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చారు, ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు పంపిణీ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కాగా భూమి లేని పేద రైతులకు రెండు ఎకరాల చొప్పున తప్పకుండా పంపిణీ చేస్తామన్నారు. అలాగే ఎన్నికల ప్రచారంలో డీఎంకే ఇచ్చిన అన్ని హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని స్టాలిన్ అన్నారు. ఈ విషయంలో ఎవ్వరూ అనుమాన పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మదురై ఆధీనం సహా ఇటీవల మరణించిన రాజకీయ ప్రముఖులకు సమావేశం ఆరంభంలోనే సంతాపం ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. -
ఎన్టీఆర్ చొరవ, ఫ్యాన్స్ ఫిదా!
సాక్షి, హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్లో బిజీబిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాని కోసం పెద్ద మనసు చేసుకున్నారు. గతం కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న తన ఫ్యాన్ను పలకరించి అతనికి భారీ ఓదార్పునిచ్చారు. దీంతో యంగ్ టైగర్ చూపించిన మానవత్వం, అభిమానంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మస్క్యులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్న తన అభిమాని వెంకన్న అనారోగ్యం గురించి తెలుసుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైపోయిన తన వీరాభిమాని దీనావస్థ గురించి విని చలించిపోయారు. వీడియో కాల్ ద్వారా ఎన్టీఆర్ వెంకన్నను పలకరించారు. దీంతో ఆశ్చర్యపోవడం అతని వంతైంది. ఎన్టీఆర్తో సెల్ఫీ తీసుకోవాలని ఉందనే కోరికను వ్యక్తం చేశాడు. అతని మాటలను ఓపికగా విన్న ఎన్టీఆర్ పరిస్థితులన్నీ చక్కబడిన వెంటనే అతడిని కలవడానికి వస్తానని అప్పుడు తనతో సెల్ఫీ తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాదు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. తరువాత వెంకన్న తల్లితో కూడా మాట్లాడి జూనియర్ ఎన్టీఆర్ ఆందోళన చెందవద్దంటూ ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
హామీని నిలబెట్టుకున్నాం
-
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కేటీఆర్ హామీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి (ట్రెసా–జేఏసీ) జరిపిన చర్చలు సఫలమైనట్లు ఆ సంఘం తెలిపింది. ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సోమేశ్ కుమార్, అడిషనల్ డీజీపీ జితేందర్ రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో పలు దఫాలుగా జరిపిన చర్చల్లో సానుకూల స్పందన లభించిందని పేర్కొంది. ఈ మేరకు అధ్యక్ష, కార్యదర్శులు వంగా రవీందర్రెడ్డి, గౌతమ్కుమార్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం(ఎగ్జిక్యూటీవ్ బ్రాంచ్) అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమోహన్, మధు తదితరులు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దారుణహత్యకు గురైన తహసీల్దార్ విజయారెడ్డి, డ్రైవర్ గురునాథం కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను 15 రోజుల్లో పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. బుధవారం నుంచి ఉద్యోగులందరూ విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు. -
ఎన్నికల్లో హామీలే..హామీలు..
సాక్షి,మహబూబాబాద్:ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో అభ్యర్థులు ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించేందుకు హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు.ఇప్పటికే పార్టీ పెద్దలు ప్రకటించిన హామీలకు తోడుగా అభ్యర్థులు నియోజకవర్గ స్థాయి హామీలను జత చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటించే ముందు స్థానిక నేతలతో సమావేశమై అక్కడి స్థానిక సమస్యలు తెలుసుకొని వాటి పైనే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఏమైనా అడిగితే వాటికి సరైన సమాధానం చేప్పేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా వెనుకబాటుకు గల కారణాలను చెబుతూ తాము గెలిస్తే పరిష్కారమార్గం చూపుతామని హామీ ఇస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర çప్రభుత్వాలు చేపట్టిన పథకాలను టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు చెబుతుండగా, కాంగ్రెస్ అధికార పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారాస్త్రాలుగా మల్చుకుంటున్నారు. విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి మార్గాలపై మాటల యుద్ధం సాగిస్తున్నారు. చేసిన అభివృద్ధితో పాటు మళ్లీ అధికారం కట్టబెడితే మరింత అభివృద్ధి చేసి చూపుతామని అధికార పార్టీ నేతలు సవాల్ విసురుతున్నారు. బయ్యారానికి ఉక్కు పరిశ్రమ దీర్ఘకాలిక సమస్యలపై ఆయా పార్టీల అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా మానుకోట పార్లమెంట్ పరిధిలో నెలకొన్న సమస్యలను అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార అస్త్రాలుగా మల్చుకుంటున్నారు. వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్న బయ్యారం ఉక్కుపరిశ్రమ సాధన మాతోనే సాధ్యమని హామీలు గుప్పిస్తున్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా మాతోనే సాధ్యమని అన్ని పార్టీల నేతలు వరాలు కురిపిస్తున్నారు. ములుగు గిరిజన యూనివర్సిటీకి అధిక నిధులు కావాలంటే అది మా పార్టీనే గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఏజెన్సీ మండలాల్లో నెలకొన్న పోడు భూముల సమస్యలకు పరిష్కారం చూపెడతాం అంటూ హామీలు గుప్పిస్తున్నారు. బీజేపీ విజయసంకల్ప యాత్రలో కేంద్రమంత్రి పోడు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పగా, మానుకోటలో జరిగిన టీఆర్ఎస్ ప్రచార సభలో సీఎం కేసీఆర్ భూ సమస్యలు లేకుండా పరిష్కరిస్తానని చెప్పారు. అన్ని పార్టీలు ఒకేరకమైన హామీలను ఇస్తూ, గెలిస్తే అభివృద్ధి చేసి చూపుతామని నమ్మబలుకుతుండటంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. ప్రతిసారి ఎన్నికల్లో ఏదో సమస్యను తెరపైకి తేవడం, మరచిపోవడం నేతలకు పరిపాటిగానే మారుతోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు హామీలుగానే మిగులుతున్నాయని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సమస్యలు తీరుస్తాం లోక్సభ ఎన్నికలు అయినప్పటికీ అన్ని పార్టీలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని దీర్ఘకాలిక సమస్యలతో పాటు, స్థానికంగా నెలకొన్న సమస్యల పైనా కూడా అభ్యర్థులు ఫోకస్ చేస్తున్నారు. ఇవి పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోకు అదనం. ముఖ్యంగా వివిధ సంఘాల భవనాలు, రోడ్డు, మంచి నీటి పథకాలతో పాటు వ్యక్తిగత పథకాల ప్రస్తావన చేస్తున్నారు. గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి హామీలిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
వైఎస్ జగన్ హామీని స్వాగతిస్తున్న ఆర్టీసీ కార్మికసంఘాలు
-
కులవృత్తికి భరోసా..!
సాక్షి, వరదయ్యపాళెం: నాయీ బ్రాహ్మణులు కులవృత్తిని వదులుకోలేక.. ఇతర ఉపాధి పనులు దొరకక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో ఆదాయం లేక.. సాంకేతికతతో పోటీ పడలేక అష్టకష్టాలు పడుతున్నారు. అరకొరగా వచ్చే ఆదాయంతో అద్దెలు చెల్లించలేకపోతున్నారు. ఆధునిక సాంకేతికతతో సెలూన్లు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థికస్థోమత సరిపోక అవస్థలు పడుతున్నారు. వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి బీసీ డిక్లరేషన్లో నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రకటించిన హామీలు ఆ వర్గాల్లో భరోసా కల్పించాయి. జగనన్నకు రుణపడి ఉంటాం.. జగనన్న మా గురించి ఆలోచించి హామీలు ప్రకటించడం ఆనందంగా ఉంది. బార్బర్ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆపైన కూడా కమర్షియల్ చార్జీలు కాకుండా డొమస్టిక్ చార్జీలు మాత్రమే వసూలు చేస్తామని హామీ ఇవ్వడం క్షురకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం అధిక బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం. -అశోక్, బార్బర్ షాపు, వరదయ్యపాళెం హామీలు చారిత్రాత్మకం.. నాయీ బ్రాహ్మణుల కష్టాలను గుర్తించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉచిత విద్యుత్, కార్పొరేషన్ ఏర్పాటు హామీలు ప్రకటించడం హర్షణీయం. ఇంతవరకు మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకుగానే చూసిన రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చాక మా సంక్షేమాన్ని విస్మరించారు. కానీ వైఎస్ జగన్ మా సంక్షేమం కోసం ప్రకటించిన హామీలు చారిత్రాత్మకం. – చిన్నా, బార్బర్ షాపు, వరదయ్యపాళెం -
రైతే రాజయ్యేలా..
సాక్షి, శ్రీకాళహస్తి : రుణమాఫీ మాయాజాలంతో అంతు చిక్కని మోసం..విత్తన, ఎరువుల పంపిణీలో అవినీతి జాడ్యం..ధీమా ఇవ్వని పంటల బీమా, వాతావరణ బీమా పథకాలు..పంట రుణాల మంజూరులో తిరకాసులు..సంక్షేమ పథకాల లబ్ధిలో పైరవీలు...వెరసి ఐదేళ్ల టీడీపీ పాలనలో దగాపడ్డ అన్నదాతలు. తమను ఆదుకునే నాథుడే లేరా అంటూ ఎదురుచూస్తున్న తరుణంలో ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్రెడ్డి రూపంలో చిరుదివ్వెలా కనిపించిన వెలుగు.. మహాజ్వాలగా మారి అంధకారం నిండుకున్న రైతుల జీవితాల్లో వెలుగులు ప్రసరించ సాగింది. నవరత్నాల పథకాలతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా వరాలు ప్రకటించిన జననేత అన్నదాతలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రకటించిన హామీలపై అన్నదాతల్లో హర్షం వ్యక్తంమవుతోంది. ‘సహాయనిధి’ చాలా సంతోషం 2015లో అతివృష్టి కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయినా ప్రభుత్వం ఆదుకోలేదు. ఈ ఏడాది అనావృష్టి కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు రూ.4 వేల కోట్లు సహాయనిధి ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇవ్వడం హర్షణీయం – కలివేలయ్య, పాపనపల్లి వడ్డీ రాయితీతో ఎంతో మేలు బ్యాంకుల్లో తీసుకునే పంట రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లించి రైతులకు పూర్తిగా రాయి తీ కల్పించడం ఎంతో మేలు. టీడీపీ ప్రభుత్వం విధానాలతో పంట రుణాలపై వడ్డీలు విపరీతంగా పెరిగిపోయాయి. జగన్ ఇచ్చిన హామీ పేద రైతులకు ఎంతో మేలు. – ప్రసాద్నాయుడు,, సూరావారిపల్లి -
అటకెక్కిన అమాత్యుల హామీలు
సాక్షి, మార్టూరు: అధికారం హస్తగతం చేసుకోవడానికి గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అలవికాని హామీలు గుప్పించి గద్దెనెక్కిన సంగతి తెలిసిందే. ఆయనకు ఏమాత్రం తీసిపోకుండా పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు నియోజకవర్గానికి భారీ ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు గత 5 సంవత్సరాలుగా ప్రచార ఆర్భాటాలు చేసిన సంగతి కూడా విదితమే. మార్టూరు మండలంలో మంజూరైనట్లు చెప్పిన ఒక్క పథకం ఆచరణలో ఎక్కడా కనిపించపోవటాన్ని ప్రజలు నిలదీస్తున్నారు. నాగరాజుపల్లి ఫుడ్పార్క్ ఏమైంది ? మండల పరిధిలోని నాగరాజుపల్లి గ్రామ కొండ సమీపంలో సర్వే నెంబరు 575 లో ఫుడ్పార్కుతో పాటు పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్టు నేతలు 2015లో హడావిడిగా ప్రకటించారు. ఇందుకోసం రెవెన్యూ అధికారులు 50 ఎకరాల కొండ పోరంబోకును జిల్లా పారిశ్రామిక అభివృద్ధి కేంద్రానికి అప్పట్లోనే అప్పగించారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందటంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ ఇందుకోసం ఎలాంటి ప్రయత్నాలు చేపట్టకపోగా అధికార పార్టీ నేతలు తలా కొంచెం రెవెన్యూ భూమిని ఆక్రమించే పనుల్లో ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నార్థకంగా మారిన కేంద్రీయ విద్యాలయం మండలంలోని బబ్బేపల్లి గ్రామంలోని కొండ సమీపంలో సర్వే నంబరు 387/11తో 10 ఎకరాల భూమిని సేకరించి 2015వ సంవత్సరంలో కేంద్రీయ విద్యాలయం స్థాపిస్తున్నట్లు అధికార పార్టీ నేతలు అప్పట్లో హడావిడి చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్వగ్రామం బబ్బేపల్లి. కేంద్రీయ విద్యాలయం కార్యరూపం దాలిస్తే తమ పిల్లలకు నాణ్యమైన విద్య అభ్యసించే అవకాశం దొరుకుతుందని ప్రజలు భావించారు. విద్యాలయం కోసం గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి ఆ భూమిని చదును చేస్తున్నట్లు చెప్పి గ్రావెల్ తవ్వి అమ్ముకోవడం గమనార్హం. సంవత్సరాలు గడుస్తున్నా నేతలు చెప్పినట్లు గ్రామంలో కేంద్రీయ విద్యాలయం రాకపోవటంతో స్థానికులు నిరాశ చెందుతున్నారు. అతీగతీ లేని వలపర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజి మార్టూరు తర్వాత మండలంలో పెద్ద గ్రామమైన వలపర్లకు అండర్గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటు చేస్తానని 2017 అక్టోబర్లో ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేశ్ వలపర్ల పర్యటనలో ప్రకటించారు. గ్రామంలో మంచినీటి ట్యాంకు సమీపంలో కొండ దిగువన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మిస్తామని ఏలూరి ప్రకటించారు. ఈ రెండూ నేటికీ కార్యరూపం దాల్చలేదు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, మళ్లీ మీరే రావాలి అంటూ ఫ్లెక్సీల ద్వారా ఆర్భాటం చేస్తున్న శాసనసభ్యుడిని తమకు ఇచ్చిన హామీల మాటేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. శిలాఫలకానికే పరిమితమైన పశువుల హాస్పిటల్ శిలాఫలకానికే పరిమితమైన బొల్లాపల్లి పశువుల హాస్పిటల్ నీరు, పశుగ్రాసం ఎద్దడి ఎదుర్కోవడంతో పాటు పశువుల సంరక్షణ కోసం మండలంలోని బొల్లాపల్లి కొండ సమీపంలో సర్వే నంబరు 525 లో 9.74 ఎకరాల భూమిలో పశువుల వసతి గృహం ప్రారంభిస్తున్నట్లు 22–3–2015 వ తేదిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, శిద్దా రాఘవరావు, శాసన సభ్యుడు ఏలూరి సాంబశివరావు అట్టహాసంగా శంకుస్థాపన కూడా చేశారు. దీంతో వేసవిలో పశుగ్రాసం, నీటికొరత అధిగమించవచ్చని రైతులు, పశుపోషకులు భావించారు. నాటికీ నేటికీ శిలాఫలకం మాత్రమే దర్శనమివ్వటం మినహా ఎలాంటి పురోగతి లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అభివృద్ధి శూన్యం కేంద్రీయ విద్యాలయం గ్రామానికి వస్తుందని సంతోషించాం. విద్యాలయం రాకపోగా కొండ కింద గ్రావెల్ స్థానిక నేతలు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆర్భాటపు పస్రంగాలతో, శిలాఫలకాల ప్రారంభాలతో ఐదేళ్లు సరిపుచ్చారు. అభివృద్ధిని మాత్రం మరిచారు. - దుడ్డు దానయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, బబ్బేపల్లి పశువుల హాస్పిటల్ శిలాఫలకంతో సరి మా గ్రామంలో పశువుల వసతి గృహం నిర్మిస్తారంటే రైతులంతా సంతోషించారు. శిలాఫలకం వేశాక ఇంతవరకు పురోగతి లేదు. ఇక వస్తుందన్న నమ్మకం పోయింది. పశువులకు హాస్పిటిల్ లేకపోవడంతో మేము పడుతున్న ఇబ్బందులు చాలా ఉన్నాయి. - నార్నె సింగారావు, బొల్లాపల్లి -
డ్వాక్రా రుణమాఫీ ఏమైంది?
-
టీడీపీ నేతల ఓట్ల ప్రమాణాలు
-
నవ రత్నాలు
-
వైరా: అభ్యర్థుల లీలలు
ఎక్కడ చూసినా అభ్యర్థుల గెలుపుపైనే చర్చ జరుగుతోంది. ఏ నలుగురు కలిసినా రాజకీయాలే మాట్లాడుకుంటున్నారు. ఓటర్ల ప్రసన్నానికి అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. పది ఓట్లు ఎవరి చేతిలో ఉంటాయో వారిని ఆకట్టుకుంటున్నారు. విందులతో హల్ చల్ సృష్టిస్తున్నారు. మేమున్నాం.. ముందుకు పదండని డబ్బులు ఎరవేస్తున్నారు. తాగినంత మద్యం.. జేబు నిండా డబ్బు పెట్టి ఓటర్ల వేటకు పంపుతున్నారు. దీంతో ఒకే ఓటరును వివిధ అభ్యర్థులకు చెందిన అనుచరులు కలుసుకొని మొహమాటం పెడుతున్నారు. కానీ ఓటర్లు మాత్రం అందరితో సరేనని పంపుతున్నారు. ఇదండీ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల తంతు.. సాక్షి, వైరా: ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించడానికి వారి అవసరాలను ఆసరగా చేసుకుంటున్నారు. తమ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే పింఛన్లతోపాటు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకాలం తమ అవసరాల కోసం అధికారులు, నాయకుల చుట్టూ తిరిగినా పట్టించుకోని వారు.. ఇప్పుడు ఓట్లకోసం నోటికొచ్చిన హామీలను ఇస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఆ పార్టీ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఓ పక్క స్వతంత్ర అభ్యర్థి లావూడ్య రాములు నాయక్ ఎన్నికల అధికారులు కేటాయించిన రైతు నాగలి గుర్తును ఆశించిన స్థాయిలో ఓటర్లకు గుర్తుండిపోయేలా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ప్రజాకూటమి అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ పాలన కంటే నాలుగురెట్లు అభివృద్ధి చేసి చూపుతానని చెబుతున్నారు. తమ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామంటు సీపీఎం నాయకులు ఓట్లు అడుగుతున్నారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రధాన అంశాలు కానున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నందున ఆయా పార్టీల నాయకులు ఎన్నికలను సవాల్గా తీసుకున్నారు. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు రహస్యంగా గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ.. కుల సంఘాల నాయకులతో బేరసారాలాడుతున్నట్లు వినికిడి. ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో డబ్బులు, మద్యం బాటిళ్లు వెదజల్లి ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం. ఇక ఈ శిబిరాల్లో ప్రచారం నిర్వహించే యువకులకు నిత్యం విందులు ఏర్పాటు చేస్తున్నారు. బూత్ల వారిగా విభజించి డబ్బుల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గెలుపుపై అభ్యర్థుల ధీమా.. నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి బాణోత్ మదన్లాల్, స్వతంత్ర అభ్యర్థి లావూడ్య రాములు నాయక్, ప్రజాకూటమి అభ్యర్థి విజయాబాయి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఈ అభ్యర్థుల గెలుపుపై ప్రజల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఎవరికి వారు తమ పార్టీ గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల వారీగా ఓట్లను లెక్కగడుతున్నారు. నియోజకవర్గంలో 1,76, 820 ఓట్లు ఉన్నాయి. అభివృద్ధి పనులే టీఆర్ఎస్కి పట్టం కడతాయని ఆ పార్టీ నాయకులుండగా, ప్రజల్లో ఉన్న సానుభూతితోపాటు టీఆర్ఎస్ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందంటూ స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్ ధైర్యంతో ప్రచారంలో దూసుకెళుతున్నారు. మరోవైపు ప్రజాకూటమి అభ్యర్థి బాణోత్ విజయ ఓటర్లను ఆ«శించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతోందనే విమర్శలు ఉన్నప్పటికీ ప్రచారంలో ప్రత్యుర్థులతోపాటు ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. ప్రచారానికి మరో రెండు రోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రతి గ్రామంలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. -
చంద్రబాబుపై మండిపడ్డ దగ్గుబాటి!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీనియర్ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. బీజేపీని వ్యతిరేకిస్తే ఓట్లు పొందవచ్చని.. అందుకోసమే ప్రత్యేక హోదా అంశాన్ని పట్టుకున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు ఆశిస్తే దీక్షలు చేయడం, ప్రజలను రెచ్చకొట్టడం కాకుండా పోలవరంపై అనుమానాలు నివృత్తి చేసి నిధులు తెచ్చుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదా లేకపోయిన 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పిన ప్రభుత్వం ఇప్పడు మళ్లీ కేంద్రాన్ని ఎందుకు నిధుల గురించి అడుగుతోందని ప్రశ్నించారు. వైజాగ్, చెన్నై కారిడార్కు భూ సేకరణ, వసతులు కల్పించకుండా కేంద్రం నిధులు ఎలా ఇస్తోందని విమర్శించారు. బీజేపీ ఏడు మండలాలను విలీనం చేయకపోతే పోలవరం సాధ్యం కాకపోయేదని ఆయన వ్యాఖ్యానించారు. 10 జాతీయ సంస్థలకు ఒకేసారి 10 వేల కోట్ల రూపాయలు ఇవ్వడం అసాధ్యం అన్నారు. రాజధాని కడతామని ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతిలో చెప్పారని.. ఈ విషయంలో బీజేపీ వైఖరి బాగోలేదని అన్నారు. మోదీ మాటలను ప్రశ్నిస్తున్న టీడీపీకి.. ఎన్నికల సమయంలో వారిచ్చిన రుణ మాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీలు గర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. పరిపాలన అంటే ప్రెస్ మీట్లు, దీక్షలు కావని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టడం వల్ల లాభమేంటని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రోడ్లకు 60వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తామని చెబితే ప్రభుత్వం డీపీఆర్లు ఇవ్వలేదని విమర్శించారు. విభజన బిల్లులో పోర్టు, స్టీల్ ప్లాంట్లు కచ్చితంగా ఇస్తామని చెప్పలేదన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా సంజీవనా అంటూ ప్రశ్నించారని, దాని వల్ల పారిశ్రామిక రాయితీలు రావని అన్నారని మరోసారి గుర్తుచేశారు. ఎన్నికల కోసం చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో చంద్రబాబు పడ్డారని తాను నమ్ముతున్నానని ఆయన తెలిపారు. రాజకీయాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు ఓ ఫోరమ్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ఉపాధి హామీ నిధులతో చంద్రన్న రోడ్లు వేస్తున్నారని ఆరోపించారు. ప్రతి గ్రామంలో కేంద్రం ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. -
కాంగ్రెస్వి ఆపద మొక్కులు
సాక్షి, హైదరాబాద్ : రైతులు అప్పుల పాలు కాకూడదనే ప్రభుత్వం వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందిస్తోందని, ఇది ఎన్నికల్లో ఓట్ల కోసం కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం ఆపద మొక్కులు మొక్కుతున్నారని, రైతులకు రూ.2 లక్షల రుణాలు మాఫీ చేయడం సాధ్యం కాదని స్పష్టంచేశారు. ఇప్పటివరకు తాము చెప్పిన ప్రతీ పనీ చేశామని, రైతుల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో చెప్పని పథకాలు కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుబంధు ద్వారా రెండో విడత పంట పెట్టుబడి సాయాన్ని నవంబర్లో అందజేస్తామని ప్రకటించారు. మంగళవారం ‘రైతుబంధు’ పథకంపై సీఎం ప్రగతిభవన్లో రైతు సమన్వయ సమితి జిల్లా కో–ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం పంపిణీ, రైతులకు జీవిత బీమా పథకం అమలులో రైతు సమస్వయ సమితి కీలకపాత్ర పోషించాలని సీఎం పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణలో రైతులు ఒకప్పుడు ఎంతో గౌరవంగా బతికేవారు. మంచి వ్యవసాయం సాగేది. రైతులే ఇతరులకు దానాలు చేసే స్థితిలో ఉండేవారు. కానీ రానురాను పరిస్థితి మారింది. సమైక్య రాష్ట్రంలో అవలంబించిన విధానాలతో వ్యవసాయ రంగం దెబ్బతింది. రైతులు అన్ని విధాలా నష్టపోయారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రుణమాఫీ చేసుకున్నాం. కరెంటు బాధ పోయింది. నీళ్ల బాధ పోతంది. పెట్టుబడి ఎట్ల అనే రంధి లేదు. ఇక కావాల్సింది గిట్టుబాటు ధర. అందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. దుక్కి దున్నిన దగ్గర్నుంచి పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ప్రతి దశలో రైతులకు ఏం కావాలో ప్రభుత్వం ఆ పని చేస్తుంది. దానికి అనుగుణంగా రైతులను సమన్వయ పరిచే బాధ్యత రైతు సమన్వయ సమితులు చేపట్టాలి. ఇజ్రాయెల్ దేశంలో లాభదాయక వ్యవసాయం సాగుతోంది. అక్కడ ఉత్పత్తి, ఉత్పాదకత ఎక్కువ. అత్యాధునిక పద్ధతులు పాటించి, అత్యధిక దిగుబడులు పొందుతున్నారు. రైతు సమన్వయ సమితుల జిల్లా కో–ఆర్డినేటర్లు ఇజ్రాయిల్ సందర్శించాలి. అక్కడి వ్యవసాయ పద్ధతులు చూసి నేర్చుకుని రావాలి. ప్రభుత్వమే ఖర్చు భరించి ఇజ్రాయిల్ పర్యటన ఏర్పాటు చేస్తుంది’’ అని సీఎం చెప్పారు. కాంగ్రెస్ది అమలు కాని హామీ ఓట్ల కోసం కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని హామీలిస్తోందని, ప్రజలు అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కానీ అది సాధ్యం కాదు. ఇప్పుడు అన్ని విధాలా రాష్ట్రానికి ప్రతి నెలా రూ.10,500 కోట్ల ఆదాయం వస్తుంది. అందులో 2,000 కోట్లు అప్పుల కిస్తీలు కట్టాలి. మరో 6,000 కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, సబ్సిడీలు లాంటి తప్పనిసరి ఖర్చులుంటాయి. మిగిలిన రూ.2,500 కోట్లతోనే ప్రభుత్వం చేసే పనులకు ఖర్చు పెట్టే అవకాశముంది. కాంగ్రెస్ చెప్పినట్లు రుణమాఫీ చేయాలంటే, ఉద్యోగులకు జీతాలివ్వకుండా ఆపేసినా 20 నెలల సమయం పడుతుంది. జీతాలు, అప్పు కిస్తీలు కట్టకుండా అంతకాలం ప్రభుత్వాన్ని నడపడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అందుకే కాంగ్రెస్ ఎలాంటి హామీలిస్తుందో ప్రజలే అర్థం చేసుకోవాలి’’ అని అన్నారు. జూన్ 20లోగా చెక్కులు, బుక్కుల పంపిణీ జూన్ 20 లోగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రికార్డులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి, మార్పు చేర్పులు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. విదేశాల్లో ఉన్న రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు త్వరలోనే ఒక విధానం రూపొందించనున్నట్లు చెప్పారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒకటి చొప్పున క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం ప్రారంభించాలని సీఎం కోరారు. దాతలు విరాళలమిచ్చిన స్థలాల్లో వేదికలు నిర్మించాలని, మిగతా చోట్ల ప్రభుత్వ స్థలాల్లో నిర్మించాలని చెప్పారు. రైతులకు పంట పెట్టుబడి మద్దతు పథకం కింద ఇచ్చిన చెక్కులను కొంతమంది రైతులు తిరిగి ప్రభుత్వానికి ఇస్తున్నారని, ఆ డబ్బులను రైతు సమన్వయ సమితి ఖాతాలో జమ చేయాలని చెప్పారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, వినోద్ కుమార్, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, సిఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, వివిధ జిల్లాల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కో–ఆర్డినేటర్లకు సీఎం చేసిన సూచనలివీ.. రైతులంతా ఒకే రకం పంట వేసి నష్టపోవద్దు. డిమాండ్కు తగినట్లు పంటలు పండించేలా రైతులకు అవగాహన కలిగించాలి. నేల స్వభావం, మార్కెట్లో డిమాండ్ను బట్టి పంటలు పండించాలి. తెలంగాణలో పండించే ప్రతి గింజకు మంచి ధర వచ్చినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఈ విషయాన్ని రైతులకు విడమరిచి చెప్పాలి. ప్రజల డిమాండ్ను తెలుసుకొని దాని ప్రకారం పంటలు పండించాలి. నగరాలు, పట్టణాలకు సమీపంలోని వ్యవసాయ భూముల్లో కూరగాయలు ఎక్కువగా పండించాలి. అన్ని ప్రాంతాల ప్రజలు మన రైతులు పండించిన కూరగాయలే తినాలి. అది అటు రైతులకు, ఇటు వినియోగదారులకు లాభదాయకం, ఆరోగ్యకరం. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. వాతావరణం, నేల స్వభావం, గాలి వేగం, వర్షపాతం, ఉష్ణోగ్రతల ఆధారంగా రాష్ట్రంలోని వ్యవసాయ భూములను క్రాప్ కాలనీలుగా విభజిస్తారు. ఏ కాలనీలో ఏ పంట వేయాలనే విషయంలో వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సూచనలు చేస్తారు. వాటికి అనుగుణంగా పంటలు వేసుకునేలా రైతులకు చైతన్యం కలిగించాలి. మార్కెట్కు క్రమ పద్ధతిలో పంటలు తేవాలి. అందరూ ఒకేసారి తమ ఉత్పత్తులు తేవొద్దు. ఏ గ్రామం రైతులు ఎప్పుడు మార్కెట్కు సరుకులు తేవాలో ముందుగానే నిర్ణయించాలి. ఉత్పాదకత పెంచే నైపుణ్యం రైతులకు కలిగించాలి. జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఇజ్రాయిల్ వెళ్లి వ్యవసాయ విధానాలు అధ్యయనం చేసి రావాలి. అక్కడ తెలుసుకున్న విషయాలు గ్రామాల్లో పర్యటించి రైతులకు చెప్పాలి. సాగునీరు, విద్యుత్, పెట్టుబడి, గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత మూడేళ్లలో తెలంగాణలో మార్పు కనిపిస్తుంది. రైతుల ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది. రైతులకు ఆధునిక సాగు పద్ధతులను వివరించడానికి, పరస్పరం చర్చించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2500 రైతు వేదికలు నిర్మిస్తున్నాం. ఈ వేదికలను రైతులు ఉపయోగించుకునేలా చూడాలి. రాష్ట్రంలో రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా చేస్తున్నాం. సహజ మరణమైనా సరే బీమా అందుతుంది. 15వ ఆగస్టు నుంచి ఎల్ఐసీ బీమా సర్టిఫికెట్లను రైతులకు అందించాలి. మరణించిన రైతు పేరిట ఉన్న భూమి ఎవరి పేరు మీదికి బదిలీ అవుతుందో.. బీమా పాలసీ కూడా ఆ రైతు పేరిట బదిలీ అవుతుంది. అలా బదిలీ చేసే బాధ్యతను రైతు సమన్వయ సమితులు స్వీకరించాలి. గ్రామాల్లో నకిలీ, కల్తీ ఎరువులు, విత్తనాలు విక్రయించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారిని అధికారులకు పట్టివ్వాలి. పోచారం లక్ష్మీపుత్రుడు: కేసీఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి తెలంగాణలో వ్యవసాయానుకూల నిర్ణయాలు జరుగుతున్నాయని, రైతు సంక్షేమానికి అద్భుతమైన పథకాలు అమలవుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీనివాస్రెడ్డి లక్షీపుత్రుడని, అందుకే వ్యవసాయానికి అంతా మంచి జరుగుతోందని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రంలోని రైతులు దేశంలోనే ధనిక రైతులుగా మారుతారని తనకు నమ్మకం ఉందని చెప్పారు. -
చెప్పేదొకటి.. చేసేది మరొకటి
సాక్షి, ఆత్మకూరు : జిల్లాకు వచ్చినప్పుడల్లా సీఎం చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని, అభివృద్ధి మాత్రం జిల్లా కూడా దాటడం లేదని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చెప్పేదొకటి..చేసేది మరొకటిగా మారిందన్నారు. 2014లో జిల్లాకు 35 హామీలు ఇచ్చారని, నాలుగేళ్లయినా ఒక్కటీ నెరవేరలేదన్నారు. జిల్లాకు రూ. 80 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారని, అభివృద్ధి ఎక్కడ జరిగిందో ముఖ్యమంత్రి చూపించాలని సవాల్ విసిరారు. 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని సీఎం చెబుతున్నారని, అలా జరిగివుంటే చదువుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. ఒక్క పర్మినెంట్ ఉద్యోగం అయినా ఇచ్చారా? కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఒక్కరినైనా రెగ్యులర్ చేశారా అని ప్రశ్నించారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు 140 టీఎంసీల నీరు ఇచ్చానని గొప్పలు చెబుతున్నారని, మరి సీమలో రెండో పంట సాగు చేయొద్దని ప్రభుత్వం ఎందుకు చెప్పిందని చక్రపాణిరెడ్డి ప్రశ్నించారు. గిట్టుబాటు ధర లేక అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటుంటే.. రాష్ట్రంలో రైతులు పండగ చేసుకుంటున్నారని సీఎం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శ్రీశైలం నీటిని కోస్తాకు తరలించి..రాయలసీమకు సాగుకు ఇస్తానని చెప్పుకోవడం శోచనీయమన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచింది తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. చంద్రబాబు చేస్తున్న ధర్మ దీక్షలు ..ప్రజలను పక్కదోవ పట్టించడానికేనన్నారు. వైఎస్సార్సీపీ పాదయాత్రలు విజయవంతం చేయండి: ప్రజా సంకల్పయాత్ర 2000 కి.మీ మైలురాయిని ఈనెల 14న దాటనుండడంతో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15న సంఘీభావ పాదయాత్రలను చేపడుతున్నామని, వాటిని ప్రజలు విజయ వంతం చేయాలని శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు. మహానంది మండలం తిమ్మాపురం నుంచి వెలుగోడు మండలం మోతుకూరు వరకు తాము పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు శిల్పా భువనేశ్వర రెడ్డి, చిట్యాల వెంకటరెడ్డి, బాలన్న, ఎలిషా, నాగేశ్వరరెడ్డి, కరిముల్లా, స్వామి, పుల్లారెడ్డి, రాజగోపాల్ పాల్గొన్నారు. -
సిట్టింగులంతా వజ్రాలే
సాక్షి, హైదరాబాద్: పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా వజ్రాల్లాంటివారేనని, సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. హైదరా బాద్లోని కొంపల్లిలో శుక్రవారం జరిగిన పార్టీ ప్లీనరీ ముగింపు ఉపన్యాసంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ‘‘వచ్చే ఎన్నికల్లో 30% మందికి టికెట్లు రావని కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ఊహాజనిత వార్తలు రాయొద్దు. గందరగోళం, అయోమయం సృష్టించాలనే ప్రయత్నంలో ఇలాంటి ప్రచారాలు చేయొద్దు. మా సిట్టింగులంతా డైమండ్లలాగా ఉన్నరు. అందరికీ బ్రహ్మాండంగా టికెట్ ఇస్తం. ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఈ వేదిక ద్వారా చెబుతున్నా. ఎవరైనా బాగా లేకపోతే సెట్ చేస్తాం, సముదాయిస్తాం, బాగుపడేటట్టు చేస్తాం. ఎవరికీ వెన్నుపోటు పొడవం. ఇంతకన్నా గొప్పవారు మాకు ఆకాశం నుంచి రారు. సిట్టింగులందరినీ గెలిపించుకునే ప్రయత్నం చేస్తం. కాకుంటే ఒకటో.. అరో ఉంటే మార్పులుంటయి తప్ప అందరికీ ఇస్తాం’’ అని కేసీఆర్ చెప్పారు. రొటీన్ రాజకీయాలు అనే భ్రమతో మంత్రివర్గంలో మార్పులని, రేపే అని, ఎల్లుండే అని కూడా ఒక పత్రిక రాసిందన్నారు. ఇలాంటి ప్రచారాలు, ఊహాజనితమైన వార్తలు వద్దని కోరారు. కేబినెట్ ఏమీ మారదని, అంతా సుభిక్షంగానే ఉంటుందని అన్నారు. ప్రజలు కేంద్ర బిందువుగా పనిచేస్తామన్నారు. బలహీనవర్గాలకు ఈ మధ్యనే ఇద్దరికి రాజ్యసభ అవకాశం ఇచ్చామని, మరిన్ని అవకాశాలు ఇస్తామని చెప్పారు. ఎన్నికల్లో పోటీచేసి గెలిచి రావడానికి అవకాశం లేని వారికి ఎమ్మెల్సీలు, ఇతర నామినేటెడ్ అవకాశాలు ఇస్తామని పార్టీ అధ్యక్షుడిగా హామీ ఇస్తున్నట్టు తెలిపారు. ‘‘ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, ఈటల రాజేందర్ అనే పక్షపాత దృష్టి లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నాం. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రోడ్లతోపాటు నియోజకవర్గ అభివృద్ధి నిధి విషయంలో సంపూర్ణ అధికారాలు ఇచ్చాం. రాష్ట్రంలో ఆర్థికంగా అద్భుతమైన పెరుగుదల ఉంది. రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల అదనపు రాబడి ఉంది. జాతీయ రాజకీయాల్లో ప్రభావశీల పాత్ర పోషించాలంటూ టీఆర్ఎస్ ప్రతినిధులంతా నాపై పెట్టిన బాధ్యతను నిర్వహిస్తా’’ అని వివరించారు. రైతులకు మే నెల 10న పాస్బుక్కులు, పెట్టుబడి చెక్కులు అందిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ అయిన 2 గంటల్లోగానే మ్యుటేషన్ అయ్యేలా రెవెన్యూ శాఖ చర్యలను తీసుకుంటుందన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పత్రాలు రైతుల ఇంటికే పోస్టులో లేదా కొరియర్లో వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎవరికీ నయా పైసా ఇవ్వాల్సిన అవసరం ఉండదని, అవినీతికి ఆస్కారమే ఉండదని అన్నారు. ‘‘గతంలో గల్లీగల్లీకో పేకాట క్లబ్బు ఉండేది. సంసారాలు కూలిపోయేవి. ఈ క్లబ్బులో కాంగ్రెస్ నేతలకే వాటాలుండేవి. కానీ ఇప్పుడు క్లబ్బుల్లో లేకుండా చేశాం. దేశంలోనే ధనికులైన యాదవులు తెలంగాణలో ఉండేలా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. గొర్రెల పంపిణీతో ఒక్క ఏడాదిలోనే రూ.వెయ్యి కోట్ల సంపదను యాదవులు సృష్టించారు’’ అని పేర్కొన్నారు. -
నంద్యాల ఎన్నికల వేళ హామీలను మరిచిపోయారా
-
శిలాఫలకాలే ఆశాకిరణాలు
అక్షర తూణీరం నాయకులు ఇచ్చిన వాగ్దానాలను ప్రేక్షక శ్రోతలు మర్చిపోరు. నాయకులు సమయానికి తగు మాటలాడి, వేదిక దిగుతూనే మనసులోంచి దులిపేసుకుంటారు. నాటక ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. అది పౌరాణికం, సాంఘికం, జానపదం ఏదైనా కావచ్చు. టిక్కెట్టు లేని అందరూ ఆహ్వానితులే బాపతుకి జనం కొరత ఉండదు. ప్రతి నాటకానికి ఒక ట్రూప్ లీడర్ ఉంటాడు. సామాన్యంగా ఆయన నాటకంలో ముఖ్యపాత్ర పోషిస్తాడు. వేషం ఏదైనా మంచి దుస్తుల్లో కనిపిస్తాడు. చప్పట్ల వాన కురిసే అదునుపదును ఉన్న డైలాగులు ట్రూప్ లీడర్ నోట ఎక్కువగా వస్తాయ్. సీన్కి సీన్కి మధ్య గ్రీన్ రూమ్లో నటీనటులు మాట్లాడుకుంటారు. పరస్పరం అభినందించుకుంటారు. తాను సరిగ్గా అందుకోలేకపోయినాసరే, తప్పు ప్రాంప్టర్దే అన్నట్టు సైడ్వింగ్ని కేకలేస్తారు. ఇప్పుడు ప్రభుత్వ పక్షాన నిత్యం జరుగుతున్న సభల్ని చూస్తుంటే నాటక రంగమే గుర్తొస్తోంది. ఈ రాజకీయ రంగస్థలం మీద ఎందరో ఆసీనులై ఉంటారు. వారంతా సందర్భోచితంగా ట్రూప్ లీడర్ ప్రసంగానికి మితిమీరి స్పందిస్తూ కనిపిస్తారు. నవ్వి నవ్వించడం, చప్పట్లకు సంకేతాలిచ్చి అందర్నీ కరతాళ ధ్వనులకు ఉసిగొల్పడం, ఆశ్చర్యపోవడం, తరచూ ఆవులింతలు ఆపుకోవడం లాంటి చర్యలు వేదిక మీది పెద్దల్లో చూస్తాం. అంతా లీడర్ సహచరులే అయినా, ఆయన మాటలకు విస్తుపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ పనులూ, ఆ పథకాలూ ఎప్పుడూ అనుకొనిగానీ, విని గానీ ఉండరు. ఈ ట్రూప్ లీడర్ ప్రదర్శించే నాటకంలో మిగతా ట్రూప్కి పోర్షన్లు ఉండనే ఉండవు. నాటకంగా చెబుతారు గానీ ఏకపాత్రాభినయంగా నడిచి ముగుస్తుంది. రోడ్లు, కాలువలు, విద్య, వైద్యం, అభివృద్ధి, పారిశుధ్యం, మీరేదైనా చెప్పండి– అన్నీ నంబర్వన్ చేసే బాధ్యత ఆయన తీసుకుంటున్నట్లు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఆ సభకు తెరపడుతుంది. మర్నాడు ఇంకో సభ. అక్కడ మళ్లీ బోలెడు కొత్త ముచ్చట్లు. అనేక భరోసాలు.. ఇలా సభ మీద సభ నడిచిపోతూ ఉంటుంది. నాయకులు ఒక్క సంగతి గుర్తు పెట్టుకోవాలి. వేదికలపై నుంచి మైకుల్లో వారిచ్చిన వాగ్దానాలను ప్రేక్షక శ్రోతలు మర్చిపోరు. నాయకులు సమయానికి తగు మాటలాడి, వేదిక దిగుతూనే మనసులోంచి దులిపేసుకుంటారు. కాలం కదిలిపోతుంది. పవర్లోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయింది. వేసిన ఎసళ్లు ఇంకా వేసినట్టే ఉన్నాయ్. జనం నకనకలాడుతున్నారు. అప్పుడే మళ్లీ ఎన్నికల కథలు మొదలైనాయ్. ట్రూప్ లీడర్కి కొత్త వాగ్దానాలేవీ గుర్తు రావడం లేదు. ఆరోగ్య, ఐశ్వర్య, ఆనందాంధ్రప్రదేశ్ దాకా జనానికి చూపించేశారు. మహా క్యాపిటల్ అమరావతి చుట్టుపక్కల బోలెడన్ని శిలాఫలకాలు ఆశాకిరణాలుగా మెరుస్తున్నాయి. ఇవన్నీ మిద్దెలై, మేడలై, మహా నగరాలై, విశ్వవ్యాప్తమై, ప్రపంచ ప్రసిద్ధం కావాలంటే– చచ్చినట్టు నన్నే గెలిపించాలి. ఇదే మా ఎజెండా! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
చిరంజీవి, బాలకృష్ణ ఎందుకు మాట్లాడరు?
-
మళ్లీ ఉత్తుత్తి హామీలేనా?
ప్రారంభానికి నోచుకోని డిగ్రీ కళాశాల పక్కాభవన నిర్మాణం ప్రకటించి ఏడాది దాటినా మంజూరు కాని నిధులు బుక్కపట్నం చెరువుకు నీటి విడుదల హుళక్కేనా? బుక్కపట్నం : హామీ... భరోసా... పూచీ... పదమేదైనా సామాన్యుడిలో మనోధైర్యం పెంచేందుకు దోహదపడుతుంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరితో ఈ పదాలపై నేడు ప్రజలు విశ్వాసం కోల్పోయారు. పూటకో హామీని ఇస్తూ... దానిని నెరవేర్చకుండా మభ్య పెట్టేందుకు మరెన్నో పొంతన లేని మాటలతో ప్రజలను దగా చేస్తుండడంతో చంద్రబాబు మాటలకు విలువలేకుండా పోతోంది. ఇందులో భాగంగానే పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకూ గతంలో చంద్రబాబు లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. వాటిలో ఏ ఒక్కటీ నెరవేరకపోవడం గమనార్హం. బుధవారం(నేడు) ఆయన బుక్కపట్నం మండలానికి రానున్న నేపథ్యంలో మళ్లీ ఎలాంటి హామీలతో మభ్య పెడతారో అన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలన్నీ నీటిమూటలయ్యాయి. గతంలో ఆయన పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తిరిగి వాటి ఊసే లేకుండా పోయింది. గత ఏడాది సెప్టెంబర్ 30న కొత్తచెరువు మండల కేంద్రంలో నిర్వహించిన ‘రైతు కోసం చంద్రన్న’ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆరు నెలల్లోపు బుక్కపట్నం చెరువును నీటితో నింపుతామని ప్రకటించారు. నేటికీ చుక్క నీరు కూడా వదల్లేక పోయారు. బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలను కలుపుతూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామంటూ హామీనిచ్చిన ముఖ్యమంత్రి చివరకు ఈ ప్రతిపాదనకు సున్నా చేట్టేశారు. బుక్కపట్నం డిగ్రీ కళాశాలకు పక్కా భవనాల నిర్మాణం చేస్తామంటూ విజయవాడలో ఆర్భాటంగా ప్రకటించారు. నేటికీ ఈ హామీకి దిక్కుమొక్కులేకుండా పోయింది. పలుమార్లు విన్నవించుకున్నా... బుక్కపట్నంలో 1984లో భగవాన్ సత్యసాయిబాబా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ కళాశాలను బాలుర ఉన్నత పాఠశాలలోనే ప్రారంభించారు. పక్కా భవనం నిర్మించాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను కళాశాల సిబ్బంది, పుర ప్రజలు పలుమార్లు విన్నవించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రకటనకే పరిమితమైన నిధుల మంజూరు గత ఏడాది డిసెంబర్లో రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్ల సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉన్నత విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆనాటి ఈ సమావేశంలో వారు సీఎం మాట్లాడుతూ.. బుక్కపట్నంలో కళాశాల పక్కా భవనాల నిర్మాణం కోసం తక్షణమే రూ. 50 లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రతికలు సైతం ప్రముఖంగా ప్రచురించాయి. ఆ తర్వాత నిధుల మంజూరు విషయాన్ని ఆయన మరిచిపోయారు. ఇప్పటికీ నిధులు మంజూరు కాకపోవడంతో పనులు మొదలు పెట్టలేకపోయారు. కళాశాల నిర్మాణం కోసం దాతలు ముందుకు వచ్చి ఐదు ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. వారి దాతృత్వం కూడా సీఎం వైఖరితో నిష్ర్పయోజనమైపోయింది. -
నోట్ల రద్దుతో నిర్మాణ రంగంలో ఉపాధి ఉఫ్
-
ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోవాలి
అంతర్వేది (సఖినేటిపల్లి) : దేవాంగులకు రాజకీయ అవకాశాలు కల్పించి, వారి అభ్యున్నతికి పాటుపడతానని నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని దేవాంగ సంక్షేమ సంఘం అడహాక్ కమిటీ రాష్ట్ర సభ్యుడు టి.శ్రీనివాస విశ్వనాథ్ పేర్కొన్నారు. అప్పటి అఖిల భారత దేవాంగ సభలో ఇచ్చిన మాటను చంద్రబాబు తప్పారని విమర్శించారు. శనివారం అంతర్వేదిలో దేవాంగ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తిక వనసమారాధనలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చేనేత జాతీయ వారసత్వ సంపదని, దీని పరిరక్షణకు అమరావతిలో 5 ఎకరాల భూమి కేటాయించి, భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కోనసీమ దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చింతా శంకరమూర్తిని, వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తులను సత్కరించారు. సంఘ అధ్యక్షుడు కె.ప్రసాద్రాజు అధ్యక్షత వహించారు. మోరి చేనేత సొసైటీ అధ్యక్షుడు చింతా వీరభద్రేశ్వరరావు, ఇంద్రజాల కళాకారుడు శ్యాం జాదూగర్, ఉద్యోగ సంఘ గౌరవాధ్యక్షుడు జాన వీరభద్రశర్మ, ప్రధాన కార్యదర్శి పి.ప్రసాదరాజు పాల్గొన్నారు. -
అయామ్ సో హ్యాపీ!
► ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నీ ప్రభుత్వం నిలబెట్టుకుంది: సీఎం కేసీఆర్ ► ప్రజలకు చెప్పినవన్నీ చేసి చూపిద్దాం సాక్షి, హైదరాబాద్: నిర్ణీత గడువు పెట్టుకుని నిబద్ధతతో పని చేస్తే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన చేరువైందని, ఇప్పటివరకు చేసిన పనులే కాదు.. చెప్పినవన్నీ చేసి చూపిద్దామని వ్యాఖ్యానించారు. గడిచిన రెండున్నరేళ్లలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రభుత్వం నిలబెట్టుకుందంటూ సంతృప్తిని వ్యక్తం చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో పోచమ్మ ఆలయం పునఃప్రతిష్ట అనంతరం ముఖ్యమంత్రి సీఎంవో అధికారులు, కొందరు ప్రజాప్రతినిధులతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పని చేయటంలో అధికారులు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారని ప్రశంసించారు. ‘‘అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో విమర్శలు. ఎన్నో అవహేళనలు. ఈ ప్రభుత్వం చెప్పిన పనులేవీ చేయదని, ఉత్తి మాటలతో కాలం గడుపుతుందని కొందరు ఎగతాళి చేశారు. కొత్త జిల్లాలు కానే కావు. కొత్త డివిజన్లు, మండలాలు రావు. ఇంటింటికీ తాగునీరు రానే రాదు. చెరువుల కార్యక్రమం సాగేది కాదు.. ఇలాంటి విమర్శలెన్నో వచ్చాయి. ఇవన్నీ అధిగమించాం. అనుకున్నది చేస్తాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామనే భరోసాను ప్రజలకు కల్పించాం. ఇప్పుడు కొత్త జిల్లాలు కొలువు దీరాయి. కలెక్టరేట్లు, కలెక్టర్లు, ఎస్పీలందరితో కొత్త జిల్లాలు కళకళలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ ఊహించని విధంగా జిల్లా ఆఫీసులు ప్రజల చెంతకు చేరాయి. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు పరిపాలన అత్యంత చేరువైంది’’ అని సీఎం అన్నారు. ‘‘దసరాకు కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయాలని పదేపదే నిర్ణీత గడువు లక్ష్యంగా పని చేయటంతోనే ఇది సాధ్యమైంది. దసరా రోజున చేయాలని ముందునుంచి అనుకోకుంటే ఇప్పట్లో అయ్యేది కాదు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందించే పథకాన్ని సైతం ఇదే నిర్ణీత గడువుతో చేపట్టాం. అందుకే మొదటి దశ విజయవంతంగా పూర్తి చేశాం. అదే స్ఫూర్తితో అన్ని గ్రామాలకు తాగునీటిని అందించి చూపిద్దాం. ఇప్పటివరకు చేసిన పనులే కాదు.. చెప్పినవన్నీ చేసి చూపిద్దాం. అందరం కలిసి పని చేద్దాం. కొత్త సెక్రటేరియట్, కళాభారతి, హుస్సేన్సాగర్ శుద్ధి, విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి.. అన్నింటినీ ఒకదాని వెంట ఒకటి పూర్తి చేద్దాం. అప్పుడే ప్రజల నుంచి ఆశించినంత ఆదరణ వస్తుంది’’ అని సీఎం అధికారులతో తన మనోభావాలను పంచుకున్నారు. -
హామీలను అమలు చేయడం లేదు
నార్కట్పల్లి : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయకుండా ప్రజలను, రైతులను మాటల గారడీతోనే పాలన వెల్లబుచ్చుతున్నారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రైతులు అడగక ముందుకే రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ రుణమాఫీ చేయకుండా విడతలుగా ఏర్పాటు చేసి అదీ కూడా ఇవ్వకుండా రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ నిరుద్యోగుల సమస్య ఈనాటికి పరిష్కారం కాలేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, మూడెకరాల భూమి ఎస్సీలకు ఇస్తామని చెప్పి కేవలం తన జిల్లాకే ఇస్తే రాష్ట్రమంతటా ఇచ్చినట్టా అని ప్రశ్నించారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకువచ్చేందుకు రైతులు, ప్రజలే ముందుకు వస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, ఎంపీటీసీలు ఐతరాజు యాదయ్య, కన్నెబోయిన వెంకటాద్రి, దాసరి కృష్ణ, సర్పంచ్ కొండూరు శంకర్, దేవస్థాన మాజీ చైర్మన్ మేకల రాజిరెడ్డి, నాయకులు జహంగీర్, శ్రీనివాస్రెడ్డి, రవీందర్, శశిధర్రెడ్డి, సైదులు, సత్తిరెడ్డి, సత్తి, మనోహర్, వెంకటచారి, శంకర్, సలీం తదితరులున్నారు. -
ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి
టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు బూర్గుపల్లి ప్రతాప్రెడ్డి గజ్వేల్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు బూర్గుపల్లి ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం గజ్వేల్లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ, డబుల్ బెడ్రూమ్ తదితర పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజల సమస్యలను మరిచి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు సహేతుకంగా లేదని విమర్శించారు. కొన్ని జిల్లాల్లో 5లక్షలు, మరో జిల్లాలో 6లక్షలు, ఇంకో జిల్లాలో 40 లక్షల జనాభా ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ తప్పులను సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గాంధీజీ కలలగన్న గ్రామ స్వరాజ్యం స్థాపనకు ప్రయత్నం జరగాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ గజ్వేల్ మండల శాఖ అధ్యక్షులు బొల్లారం ఎల్లయ్య, నగర పంచాయతీ కౌన్సిలర్ ఆర్కె. శ్రీనివాస్, టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు విరాసత్అలీ, షరీఫ్, నాయకులు మతీన్, హన్మంతరెడ్డి, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
సూర్యాపేట మున్సిపాలిటీ : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్యనాయక్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదే డిమాండ్తో త్వరలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని గిరిజనులు, ఉద్యోగ, విద్యార్థి, మహిళా నాయకులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేయడం, 12 శాతం రిజర్వేషన్, డబుల్ బెడ్రూం ఇళ్లు, రిజర్వేషన్లు..ప్రమోషన్లు తదితర హామీలను అమలు చేయడంలో జాప్యం చేయడం తగదన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట్యానాయక్, జిల్లా అధ్యక్షులు ధరావత్ భిక్షంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ‘నాయకులు’ నిజాలు నిమజ్జనం
ప్రజా వ్యతిరేకత ఉన్నా బేఖాతరు కోర్టులు మెుట్టికాయలేసినా నిస్సిగ్గుగా ముందుకు సాక్షిప్రతినిధి–కాకినాడ: ఊరూ వాడా వినాయకుడి నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. బాణసంచా, డప్పులు, మేళతాళాలతో ఊరేగుతూ వినాయకుడ్ని భక్తజనం నిమజ్జనం చేశారు. తలపెట్టే పనిలో విఘ్నాలు లేకుండా చూడవయ్యా ఓ బొజ్జగణపయ్యా అంటూ తొమ్మిది రోజులు పూజించాక నిమజ్జనంతో ముగింపు పలికారు. వచ్చే ఏడాది ఇంతకు రెట్టింపుగా ఉత్సవాలు చేస్తామని మొక్కుకున్నారు. కానీ జనానికి సేవ చేయాల్సిన వాస్తవ వి‘నాయకులు’ మాత్రం వారి ఆశలను నట్టేట్లో నిమజ్జనం చేసేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఓటు దేవుళ్లుగా కొలిచే నాయకులు అడిగినవే కాకుండా అడగకపోయినా అవిచేస్తాం, ఇవి చేస్తామని గుక్కతిప్పకోకుండా వాగ్థానాలు గుప్పించేశారు. వారి మాటలు నమ్మి జనం ఓటేసి అందలమెక్కించారు. ‘ఓడ దాటే వరకు ఓడ మల్లన్న...దాటేశాక బోడి మల్లన్న’ అన్న చందంగా ప్రజాప్రతినిధులు అందలమెక్కాక వారి కష్టాలు కడతేర్చడం మాట అటుంచి కనీసం వారు మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించేస్తున్నారు. కొందరైతే తమ స్వార్థం కోసం కక్ష సాధించేందుకు వెనుకాడటం లేదు. మరి కొందరు ప్రజాప్రతినిధులు ప్రజాకంఠక పాలన సాగిస్తున్న తీరు జుగుప్స కలిగిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో తూర్పు సెంటిమెంట్గా తునికి ఒక ప్రత్యేక స్థానం, మంచి గుర్తింపు ఉంది. అటువంటి తునిలో అధికారపార్టీ నేతలు చట్టాన్ని తమ చుట్టంగా చేసుకుని పౌర హక్కులను కాలరాస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఓటమితో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన రామకృష్ణుడు ఎమ్మెల్సీ అయి చంద్రబాబు కేబినెట్లో నెంబర్–2గా కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. మూడు దశాబ్థాల రాజకీయ జీవిత గమనంలో అనేక ఎత్తుపల్లాలు చూసిన యనమలను ఆ నియోజకవర్గ ప్రజలు రాముడనుకుని నెత్తిన పెట్టుకున్నారు. స్పీకర్, పీఏసీ చైర్మన్, పలు మంత్రిత్వశాఖలతో ఉన్నత పదవులు అలంకరించిన యనమల సొంత నియోజకవర్గ ప్రజలపై ప్రస్తుతం సర్కార్ కత్తి కట్టినట్టుగా వ్యవహరిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారనే కోపమో మరేదైనా కారణమో తెలియదు కానీ ఆ పార్టీ నేతలు అధికారం చేతిలో ఉందనే అహంతో అక్కడి ప్రజలపై కక్షకట్టేశారు. నియోజకవర్గంలోని తొండంగి మండలం తీర ప్రాంతంలో ఏర్పాటుచేయ తలపెట్టిన దివీస్ రసాయన పరిశ్రమ ప్రజల గుండెలపై కుంపటిగా మారింది. ప్రజా సంక్షేమం కోరే నేతలైతే అటువంటి కుంపటి నుంచి రక్షించాలి. అందునా ఇప్పుడు దివీస్తో నష్టపోయే వారిలో యనమల సొంత సామాజి వర్గీయులే ఎక్కువగా ఉన్నారు. అవసరమైతే వారి కోసం తనకున్న పలుకుబడిని ఉపయోగించి ప్రజలకు మంచి చేసి నియోజకవర్గంలో కోల్పోయిన ప్రాభవాన్ని అందిపుచ్చుకోవాలి. పరిశ్రమలు, దాని ద్వారా వచ్చే ఉపాధి అవకాశాలను ఎవరూ కాదనరు. కానీ అక్కడి ప్రజల బెంగంతా ఆ పరిశ్రమ ద్వారా కలిగే భవిష్యత్ దుష్పరిణామాలపైనే. భూ సేకరణ ప్రక్రియ ప్రారంభమయ్యాక తొండంగి తీర ప్రాంతంలో ప్రజలు స్వేచ్ఛగా తిరగడం, నలుగురు కూర్చుని రచ్చబండపై మాట్లాడుకోవడం ఎప్పుడో మానుకున్నారు. దివీస్ బాధితులకు అండగా నిలిచేందుకు వస్తున్న ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా పోలీసులు కర్కశంగా వ్యవహరించి సుమారు 200 మందిపై కేసులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. అధికారం ఉంది కదా అని పోలీసుల బలప్రయోగంతో ప్రజలు, ఉద్యమకారుల గొంతు నొక్కేసినంత మాత్రాన ఉద్యమం చల్లారిపోతుందనుకోవడం అవివేకమే. ఇందుకు తాజా ఉదాహరణ హైకోర్టు ఇచ్చిన తీర్పు. స్టేలో ఉన్న భూముల్లో భూ సేకరణ ఎలా చేస్తారంటూ న్యాయ స్థానం సర్కార్కు అక్షింతలు వేసిన తరువాత ఏదో పెద్ద మార్పును ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. ఎందుకంటే ఒకపక్క కోట్ల రూపాయల పెట్టుబడులతో సిద్ధంగా ఉన్న బడా కంపెనీ, మరోపక్క బక్కచిక్కిన సామాన్య రైతులు అటువంటప్పుడు చంద్రబాబు సర్కార్ అయినా, యనమల ద్వయమైనా ఎటువైపు మొగ్గుచూపుతారో ప్రజలకు తెలియంది కాదు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు -
సీఎం హామీ నీటి మూటే..!
ఈ ఫొటోలో ఉన్నది గత నెల 28న సీఎం చంద్రబాబు రెయిన్గన్లు ప్రారంభించిన వేరుశనగ పొలం. స్వయానా ఆయనే రెయిన్గన్ ప్రారంభించి ‘పంట పండేంత వరకూ నీటిని సరఫరా చేస్తాం’ అని బాధిత రైతు శివన్నకు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ బుట్టదాఖలైంది. కాగా ఈ పొలం అమడగూరు నుంచి కదిరికి వెళ్లే ప్రధాన ర హదారి పక్కనే ఉండటంతో అటుగా వెళ్లే ప్రయాణికులంతా ఎండిన పొలాన్ని చూస్తూ సీఎం రెయిన్గన్లు ప్రారంభించి పంటే ఎండిపోతుంటే మరి మిగతా రైతుల పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. -
వాగ్దానవర్షం
నగర కన్వెన్షన్ సెంటర్, ఇతర పనులు పూర్తి చేస్తామని సీఎం ప్రకటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన లబ్ధిదారులకు వాంబే గృహాల పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైన పర్యటన సాక్షి, రాజమహేంద్రవరం/ రాజమహేంద్రవరం రూరల్: హామీల బాబు చంద్రబాబు మరోసారి వాగ్దాన వర్షం కురిపించారు. గతేడాది గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం నగరాభివృద్ధి కోసం ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తామని మరో సారి వాగ్దానం చేశారు. నగర కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, అఖండగోదావరి ప్రాజెక్టు, పుష్కర వనం అభివృద్ధి... వీటన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. గోదావరి అంత్యపుష్కరాల ముగింపు సందర్భంగా గురువారం పుష్కరుడికి వీడ్కోలు పలికేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ఆయన నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 4200 ఇళ్లకు, ఆవ చానల్ నుంచి ఎన్హెచ్–16 వరకు రూ.490 లక్షలతో 100 అడుగుల రోడ్డుకు శంకుస్థాపనలు చేశారు. ఇన్నీసుపేట నుంచి ఎస్టీపీ ప్లాంట్ వరకు రూ.683 లక్షలతో ఆర్సీసీ మేజర్ డ్రైనేజీకి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రామకృష్ణ థియేటర్ వెనుక ఆవ రోడ్డులో నిర్మించిన 2,256 వాంబే గృహాలను ప్రారంభించారు. లాంఛన ంగా పది మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. చెరుకూరి కల్యాణ మండపంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆర్యాపురం అర్బన్ బ్యాంకు చైర్మన్ చల్లా శంకరరావు, డైరెక్టర్లు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రబాబు మాట్లాడుతూ.. లబ్ధిదారులు తాము కట్టిన రూ.60,800 మించి ఇంక ఒక్క రూపాయి కూడా కట్టనవసరంలేదన్నారు. సిమెంటు రోడ్లు, నీటి వసతి తదితర మౌలిక వసతులకు రూ. 3 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మధురపూడి విమానాశ్రయాన్ని విస్తరించేందుకు రూ. 240 కోట్లతో భూమిని సమీకరించినట్టు తెలిపారు. గోదావరి అఖండ ప్రాజెక్టును త్వరిత గతిన పూర్తి చేస్తామని, తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయన్నారు. నగరంలో స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్డు కం రైల్వే బ్రిడ్జి నుంచి ఆవ రోడ్డు వరకు ప్లైఓవర్ నిర్మాణానికి, ఆవ, నల్లా చానెల్ ద్వారా వస్తున్న మురుగునీటిని శుద్ధి చేసి టెన్నెల్స్ ద్వారా ధవళేశ్వరం వద్ద గోదావరి దిగువన వదిలేందుకు నిధులు మంజూరు చేయాలని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల కోరగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న సీఎం త్వరలో చేపడతామన్నారు. గృహ లబ్ధిదారురాలు యర్రబల్లి చిన రాజలమ్మ తన కుమార్తె ఝాన్సీ విద్యుత్ షాక్తో రెండు చేతులు కోల్పోయిందని, ఆసరా చూపించాలని వేడుకోవడంతో రూ. లక్ష సహాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. సీఎం పర్యటన గంట ఆలస్యంగా ప్రారంభం కావడంతో హుకుంపేట గ్రామంలో జరగాల్సిన కార్యక్రమం రద్దు అయింది. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల, కిమిడి మృణాలిని, ఎంపీ మురళీమోహన్, నగర మేయర్ పంతం రజనీశేషసాయి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, బొడ్డు బాస్కర రామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు, పులవర్తి నారాయణమూర్తి, మాజీమంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట్ర గృహ నిర్మాణసంస్థ డైరెక్టర్ కందుల కొండయ్యదొర, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, సబ్కలెక్టర్ విజయకృష్ణన్, నగరపాలకసంస్థ కమిషనర్ విజయరామరాజు, గృహనిర్మాణసంస్థ ప్రాజెక్టు డైరెక్టరు డి.సెల్వరాజ్, ప్రజాఆరోగ్యశాఖ ఎస్ఈ ఎం.శ్రీమన్నారాయణ, ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు. -
మాటలే.... చేతల్లేవ్....!
ఆది పుష్కరాల ముగింపులో రాజమహేంద్రవరంపై సీఎం వరాల జల్లు అంత్య పుష్కరాలు ముగుస్తున్నా అమలు ఊసేలేదు పుష్కరుడికి వీడ్కోలు పలికేందుకు నేడు సీఎం చంద్రబాబు రాక ఆశల చిగుళ్లతో బాబు ముందుకు నగర ప్రజలు సాక్షి, రాజమహేంద్రవరం : గతేడాది గోదావరి పుష్కరాల ముగింపు రోజున రాజమహేంద్రవరం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించిన హామీలు ఏడాది తరువాత కూడా వెక్కిరిస్తున్నాయి. ప్రణాళిక దశలోనే ‘అఖండ గోదావరి’ రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తామని అఖండ గోదావరి ప్రాజెక్టును ప్రకటించగా ప్రస్తుతం అది ప్రతిపాదనల దశలోనే ఉంది. ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ రూ.100 కోట్లు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆ పనులు ఎండమావులవుతున్నాయి. తాగునీరేదీ? 10వ డివిజన్ గాయత్రి నగర్లో రూ.40 కోట్ల అంచనాతో మంచినీటి ట్యాంకు, మెయిన్ పంపింగ్ వ్యవస్థ ఏర్పాటుకు నగర కన్వెన్షన్ సెంటర్తోపాటు శంకుస్థాపన చేశారు. ఆ పనులు ఊరిస్తూనే ఉన్నాయి. పేరు మారినా తీరు మారలేదు రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చారు. మెగా సిటీగా, ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు. ఏడాదైనా పేరు గొప్ప ఊరు దిబ్బలాగే నగరం తీరు మారింది. గట్టిగా వర్షం పడితే రోడ్లు గోదావరి కాలువలను తలపిస్తాయి. జనాభా పెరిగినా ఇప్పటికీ బ్రిటిషు కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థే దిక్కు. మెయిన్ రోడ్డు, తాడితోట, శ్యామలా సెంటర్ ప్రాంతాల్లో ఇరుకు రోడ్లతో ట్రాఫిక్ సమస్యలు. శిలాఫలకంలోనే నగర కన్వెన్షన్ సెంటర్... నగర కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి 2015 మే ఒకటో తేదీన రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో శంకుస్థాపన చేశారు. సెంట్రల్ జైలు ఎదుట ఆరు ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్మించడానికి నిర్ణయించారు. ఇందులో ఫుడ్ కోర్టులు, సమావేశ మందిరం, మల్టిప్లెక్స్ థియేటర్ నిర్మిస్తామన్నారు. ఈ ప్రతిపాదనలు ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. ఇదే ప్రాంతంలో ఫైవ్స్టార్ హోటల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇది కూడా హామీలకే పరిమితమైంది. కందుకూరికీ తప్పని హామీ మోసం సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు నిర్మించిన పుర మందిరానికి పూర్వవైభవం తెస్తానని సీఎం ప్రజల సమక్షంలో హామీ ఇచ్చారు. పురమందిరం(టౌన్ హాలు)ను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని ఆ సందర్భంగా చెప్పారు. ఈ మాట చెప్పి ఏడాది కాలం గడుస్తున్నా నేటì కీ అతీ గతీ లేదు. పురమందిరం పూర్తిగా శిథిలమైంది. అలాగే కందుకూరి పేరుతో ఉన్న వీటీ కాలేజీని, గౌతమీ గ్రంథాలయం, దామోదర ఆర్ట్స్ గ్యాలరీని అభివృద్ధి చేస్తామని ప్రకటించి మరిచిపోయారు. గుర్తు చేయాల్సిన తెలుగు తమ్ముళ్లూ గజనీ వేషాలు వేస్తున్నారు. గోదావరి మహా పుష్కర వనానికి మోక్షమెప్పుడు? గోదావరి మహాపుష్కరాలు గుర్తుండేలా లాలా చెరువు సమీపంలో 240 ఎకరాల్లో మహాపుష్కర వనానికి 2015 జూలై 26న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 30 రోజుల్లో దీన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. మహాపుష్కరాల పైలాన్కు కూడా ఆవిష్కరించారు. అంతకు మించి వనంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈ వనంలోనే సైన్సు విద్యార్థులకు ఉపయోగపడేలా బొటానికల్ గార్డెన్, ‘రాశి’ వనం దశ తికగలేదు. -
ఎన్నికల హామీలను విస్మరించిన కేసీఆర్
న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్ ఇల్లెందు : ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ తరఫున ఇచ్చిన హామీలను కేసీఆర్ పూర్తిగా విస్మరించారని న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఆర్.గోవర్ధన్ విమర్శించారు. ఈ నెల 9న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ‘ఆదివాసీ హక్కులకు మరణ శాసనం–రాజ్యాంగ ఉల్లంఘనలు’ అంశంపై శుక్రవారం మార్కెట్ యార్డులో ఏర్పాటైన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆదివాసీ హక్కులకు రక్షణ లేదని, చట్టాలు అమలవడం లేదని; దేశ జనాభాలో 12 శాతంగా ఉన్న వీరికి (ఆదివాసీలకు) రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడవిపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీలకు వంట చెరుకు కొట్టుకునే స్వేచ్ఛ లేకుండా అధికారులు హరిస్తున్నారని విమర్శించారు. హరితహారం, వనం–మనం పేరుతో అడవుల నుంచి ఆదివాసీలను బయటకు పంపే కుట్ర సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీలకు విద్య, వైద్యం, ఆరోగ్యం, కనీస సదుపాయాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘‘గిరిజనులు, గిరిజనేతర పేదల్లో అనేకమందికి పోడు సాగే జీవనాధారం. వారి నుంచి ఆ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోంది. ఈ నేపథ్యంలో, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, మంత్రులు జోగు రామన్న, చందూలాల్.. ఎవరి పక్షాన ఉంటారు? సీఎం కేసీఆర్ పక్షమా..., గిరిజనుల పక్షమా...?’’ అని ప్రశ్నించారు. జీవించే హక్కు రక్షణకు, చట్టాల అమలుకు, మెరుగైన జీవనానికి ఆదివాసీలు ప్రతినబూనాలని కోరారు. ఈ సదస్సులో న్యూడెమోక్రసీ నాయకులు యదళ్లపల్లి సత్యం, ఎట్టి ప్రసాద్, భూక్యా లక్ష్మణ్, ఊక్లా, సనప పొమ్మయ్య, కొమురం సత్యనారాయణ, మదార్, తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు రమణాల లక్ష్మయ్య, రాసుద్దీన్, మోకాళ్ల రమేష్, సాంబ, ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు పేదలే బుద్ధిచెబుతారు
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వరు గుడివాడ టౌన్ : ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో శ్రద్ధ్దచూపని చంద్రబాబునాయుడు అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణాజిల్లా 30వ మహాసభ జరిగింది. వందలసంఖ్యలో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. ఉపాధిహామీ పనుల్లో ప్రభుత్వ సొమ్మును కార్మికులు దోచేస్తున్నారని విమర్శించిన నాయకులు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటున్న ప్రజాప్రతినిధులు ఎవరి సొమ్ము తింటున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన ఎంపి సుజనా చౌదరి రూ.400 కోట్లు బ్యాంకు రుణం ఎగవేస్తే చూస్తూ ఊరుకున్న బాంకు అధికారులు, పేద వ్యవసాయ కూలీల చిన్న చిన్న అప్పులపై జప్తులని విరుచుకుపడడం ఎంతవరకు సబబని అన్నారు. త్వరలోనే చంద్రబాబుకు పేదలు బుద్ధిచెబుతారని హెచ్చరించారు. దోచుకుంటున్న తెలుగుతమ్ముళ్లు రైతులు కూలీల నుంచి చంద్రబాబు బలవంతంగా లాక్కున్న భూములను త్వరలోనే పోరాటాల ద్వారా తిరిగి తీసుకుంటామని వెంకటేశ్వర్లు అన్నారు. అందుకే వ్యవసాయ కార్మిక సంఘ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా బందరు పోర్టుకు 5000 ఎకరాలు సరిపోతున్నాయని చెప్పి ఇప్పుడు 1,20,000 ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారని చెప్పారు. జన్మభూమి కమిటీలు, ఇంకుడు గుంతలు, నీరు–చెట్టు, వనం–మనం, చంద్రన్న కానుకలు, ఉచిత ఇసుక వంటి పథకాలు ప్రవేశపెట్టి తెలుగు తమ్ముళ్ల జేబులు నింపుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, జిల్లా కార్యదర్శి కోట కల్యాణ్, జిల్లా అధ్యక్షుడు ఎం.ప్రభాకర్, జిల్లా మాజీ అధ్యక్షుడు సీహెచ్.రవి, ఉపాధి మేట్ల సంఘ జిల్లా అధ్యక్షురాలు ప్రమీల, డివిజన్ కార్యదర్శి ఎం.రాజేష్, తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ఆత్మకూర్(ఎస్) : హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిపెస్టోలో ఇచ్చిన ఒక్కహామీని నేటికీ నెరవేర్చలేక పోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కిందిస్థాయికి తీసుకుపోవాలన్నారు. 2019లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందన్నారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లో జరిగే మోదీ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి, జీడి భిక్షం,తోట ప్రభాకర్, మర్ల చంద్రారెడ్డి, సకినాల శ్రీనివాస్, వివిధ గ్రామాల అధ్యక్షకార్యదర్శులు,నాయకులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన
లెనిన్ సెంటర్లో మున్సిపల్ కార్మికుల ధర్నా గాంధీనగర్ : సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఎఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. హామీ ఇచ్చి ఏడాది.. రంగనాయకులు మాట్లాడుతూ పర్మినెంట్ ఉద్యోగులు, కార్మికులకు సమ్మె కాలంలో ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసిందని గుర్తు చేశారు. జీపీఎఫ్ అకౌంట్లు నెలరోజుల్లో ప్రారంభిస్తామని హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా అతీగతీ లేదని ఎద్దేవా చేశారు. సమ్మెకాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘వెట్టిచాకిరీ చేయిస్తున్నారు’.. నాలుగేళ్లగా కార్మికులకు యూనిఫాం, చెప్పులు, కొబ్బరినూనె, సబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో పాటు కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్ అయిన కార్మికులకు బెనిఫిట్స్ సకాలంలో చెల్లిస్తామన్న హామీ అమలు చేయాలని కోరారు. ధర్నాలో యూనియన్ నగర అధ్యక్షుడు జెక్కి జేమ్స్, కె లక్ష్మి, నారాయణమ్మ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు . -
‘హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం’
కొత్తూరు : హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీడీపీ జిల్లా ఇన్చార్జి గరికపాటి రాంమోహన్ ఆరోపించారు. ఆదివారం కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్లో పార్టీ జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్టు కోసం చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నామన్నారు. త్వరలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, రైతు రుణమాఫీపై నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింలు, ఆయా నియోజకవర్గ ఇన్చార్జీలు వెంకటేష్, శ్రీనివాస్, ఆంజనేయులు; నాయకులు నాగేశ్వర్రెడ్డి, అచ్యుత రామారావు, రాజేంద్రప్రసాద్గౌడ్, గంజిపేట రాములు, శ్రీనివాసులు, బాలప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వం
అర్వపల్లి : టీఆర్ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుర్ర శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. బుధవారం ఆయన మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వస్తాయని కల్లబొల్లి మాయమాటలతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఏఒక్క హామీ నెరవేర్చడం లేదన్నారు. విద్యావలంటీర్ల వ్యవస్థను తీసుకవచ్చి రేషనలైజేషన్ పేరుతో కొత్త జిల్లాలను లింక్పెడుతూ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని చెప్పారు. సమావేశంలో శ్రీనివాస్గౌడ్, దాసరి సోమయ్య, కోటమర్తి శ్రీనివాస్, మెరుగు వెంకన్న, వీరేష్ పాల్గొన్నారు. -
వాగ్దానాల అమలులో సర్కారు వైఫల్యం
రాజధాని పేరుతో కాలయాపన సర్కారు తీరుపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సారథి విమర్శ రేపు పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశం నిర్వహించ నున్నట్లు వెల్లడి పుట్రేల (విస్సన్నపేట) : ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి తెలిపారు. హామీలను మరిచి రాజధాని పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. మండలంలోని పుట్రేల గ్రామంలో మారెమ్మ గుడి వద్ద నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఈ నెల 14న విజయవాడలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు. రైతులకు చేయాల్సిన రుణమాఫీ రూ.87 వేలు కోట్లు ఉండగా మొదటి విడతగా రూ.6 వేలు కోట్లు మించి మాఫీ చేసింది లేదన్నారు. రెండో విడత మాఫీ సొమ్ము చాలా మందికి ఇప్పటివరకు ఖాతాల్లో జమ కాలేదన్నారు. పత్రికల్లో మాత్రం రూ.26 వేల కోట్లు రుణమాఫీ చేసినట్లు ప్రకటనలు చేసుకుంటున్నారన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద రూ.2 వేలు ఇస్తామన్నారని, ఇంతవరకు రాష్ట్రంలో ఒక్కరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. డ్వాక్రా మహిళా గ్రూపులకు రుణమాఫీలోను అదే తీరు అవలంబించారన్నారు. పబ్లిసిటీ తప్ప చేసిందేమీ లేదు : ఎమ్మెల్యే రక్షణనిధి రాష్ట్ర ప్రభుత్వం గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకుంటోందని, ఎన్నికల వాగ్దానాల అమలు పూర్తిస్థాయిలో చేయలేదని తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి విమర్శించారు. పట్టిసీమ నీళ్లతో ఎకరానికి 50 బస్తాలు పండించామంటున్నారని, గతంలో తిరువూరు నియోజకవర్గంలో సాగర్ మూడో జోన్ కింద ఎకరానికి 60 బస్తాలు పండించిన సంగతేమిటని ప్రశ్నించారు. అన్నపూర్ణగా పేరొందిన జిల్లాలో పంటలు ఎండిపోయి జిల్లేడు చెట్లు మొలుస్తున్నాయన్నారు. ఎన్టీఆర్ సుజలధార ఏ గ్రామంలోనైనా అమలవుతోందా అని ప్రశ్నించారు. ఒక్క కాలనీ ఇళ్లయినా మంజూరు చేశారా అని నిలదీశారు. జన్మభూమి కమిటీల పేరుతో అనేక చోట్ల పింఛన్లు రాకుండా చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పలువురు టీడీపీలోకి వెళ్లగానే అభివృద్ధిని చూసి వెళ్లామని ప్రకటనలు చేస్తున్నారని, మొన్నటిదాకా లేని అభివృద్ధి ఇప్పుడొచ్చిందా అని ప్రశ్నించారు. సాక్షి చానల్ ప్రసారాలను నిలుపుదల చేయటం అప్రజాస్వామికమని, మీడియా స్వేచ్ఛను హరించటం సరికాదని స్పష్టం చేశారు. ఖాలీ పోస్టుల భర్తీ ఎప్పుడు? : ఉదయభాను రాష్ట్రంలో లక్షా 30 వేల పోస్టులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉండగా ఒక్క పోస్టూ భర్తీ చేయకపోగా నిరుద్యోగ భృతి చెల్లించటంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సామినేని ఉదయభాను అన్నారు. ప్రాజెక్టుల పేరుతో టెండర్లు వేసిన తర్వాత దానికి రెండింతలు పెంచి జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, రానున్న రోజుల్లో బాబు సర్కారుకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా రాణి, పార్టీ నేతలు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, నరెడ్ల వీరారెడ్డి, సిరసాని ప్రకాష్, భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, నెక్కళపు కుటుంబరావు, దారావతు శ్రీను, రమేష్, సర్పంచ్ పెద్దిబోయిన కేశవులు తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగబద్ధం కాని హామీలేల?
కొత్త కోణం ఏపీలో టీడీపీ రజకులను ఎస్సీలలో చేరుస్తామని వాగ్దానం చేసింది. రాజ్యాంగపరంగా అది నేడు సాధ్యమేనా? అంటే, ఇప్పట్లో అది నెరవేరే పరిస్థితి లేదు. రజకులు తమ కుల వృత్తి మీద ఆధారపడి బతికే పరిస్థితి లేదు. వారికి విద్య, ఉపాధి అవకాశాలను, తగు శిక్షణను ఇచ్చి నూతన జీవన విధానంలోకి నడిపించే ప్రయత్నం అత్యావశ్యకం. వారిపై దాడులను, అత్యాచారాలను అరికట్టి, రక్షణ కల్పించాలి. అంతేగానీ రాజ్యాంగపరంగా సమంజసం కాని వాగ్దానంతో వారిని ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూడటం రాజకీయ వంచన. ‘‘షెడ్యూల్డ్ కులాలుగా నిర్ధారించడానికి అంటరానితనంతో కూడిన సామా జిక, ఆర్థిక, విద్యాపరమైన వెనుకబాటుతనమే ప్రాతిపదిక అవుతున్నది. వీరందరూ తరతరాలుగా అంటరానివారుగా జీవించడం వల్లనే వీరిని షెడ్యూల్డ్ కులాలుగా నిర్ణయించి, ఒక కేటగిరి కింద పేర్కొనడం జరిగింది’’ అని సుప్రీం కోర్టు 2004లో ఒక కేసు సందర్భంగా ఇచ్చిన తీర్పు పేర్కొంది. ఇదే అంశాన్ని 2002, ఆగస్టు 19న కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నెపోలియన్ లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొన్ని కులాలను ఎస్సీలలో, కొన్ని తెగలను ఎస్టీలలో చేర్చాలని ప్రతిపాదనలు వచ్చాయని, ప్రభుత్వం వాటిని పరిశీలి స్తున్నదని ఆ సందర్భంగా మంత్రి తెలిపారు. అయితే, ఏ కులాలనైనా ఎస్సీలలో చేర్చాలంటే సాంప్రదాయకంగా, తరతరాలుగా అనుభవిస్తున్న అంటరానితనం వల్ల సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో అత్యంత వెనుక బాటుతనాన్ని ఎదుర్కొనడమే ప్రాతిపదిక కాగలదని నెపోలియన్ ప్రకటిం చారు. ఆదిమ సామాజిక, ఆర్థిక, జీవన విధానం, తమదైన ప్రత్యేక సంస్కృతి, భౌగోళికంగా ఆ ప్రాంతాలు గ్రామాలకు దూరంగా ఉండడం, ఇతర సామాజిక వర్గాలతో కలిసి ఉండే స్వభావం లేకపోవడం లాంటి విషయాల వల్ల వెనుకబాటుతనానికి గురై ఉండటమే ఎవరినైనా ఎస్టీలలో చేర్చడానికి ప్రాతిపదిక కాగలదని ఆయన స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ రెండూ కొన్ని కులాలను ఎస్సీలలో, మరికొన్ని తెగలను ఎస్టీలలో చేరుస్తామని ప్రకటించాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కూడా రెండు తెగలను ఎస్టీలలో చేరుస్తామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. ఆ విషయాన్ని పరిశీలించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కమిషన్ కూడా వేసింది. ప్రస్తుత అసెంబ్లీ సమా వేశాల మొదటి రోజున ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగాల్లో గవర్నర్ రజకులను ఎస్సీలలో చేర్చే విషయాన్ని ప్రస్తావించి, ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. అయితే ఏపీలోని టీడీపీ ప్రభుత్వం అంటున్నట్టు రజకులను ఎస్సీలలో చేర్చడం సాధ్యమేనా? అందుకు అసెంబ్లీ తీర్మానం చెల్లుతుందా? లేకుంటే, రజకులను మభ్యపెడుతున్నారా? అనే వాటిని పరిశీలించాలి. రజకులనే కాదు మరే కులాన్నయినా కొత్తగా ఎస్సీల్లోకి చేర్చడానికి ప్రాతిపదిక ఏమిటో మొదటే చెప్పుకున్నాం. దానికి అనుగుణం గానే మార్పులు, చేర్పులు సాధ్యం. షెడ్యూల్డ్ కులాల గుర్తింపునకు ప్రాతిపదిక 1935 నాటి భారత ప్రభుత్వ చట్టంలో మొట్టమొదటిసారిగా షెడ్యూల్డ్ కులాలనే ప్రస్తావన వచ్చింది. 1936లో దీనికి సంబంధించిన ప్రత్యేక ఉత్తర్వు లను ప్రకటించారు. 1935 భారతప్రభుత్వ చట్టంలోని 1, 5, 6 షెడ్యూళ్లలోని అంశాల ఆధారంగా షెడ్యూల్డ్ కులాల జాబితా రూపొందినట్టు ఆ ఉత్తర్వు లలో పేర్కొన్నారు. క్రైస్తవ మతంలోగానీ, బౌద్ధ మతంలోగానీ, మరేవిధమైన ఆదిమ జాతి మతంలోగానీ ఉన్నవారిని షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించడానికి వీల్లేదని అందులో స్పష్టంగా చెప్పారు. 1936లో షెడ్యూల్డ్ కులాలుగా ప్రకటించిన కులాలన్నిటినీ అప్పటికే అణగారిన వర్గాలు(డిప్రెస్డ్ క్లాసెస్)గా గుర్తిస్తున్నారు. మింటో-మార్లె నివేదిక, మాంటెగ్-చెమ్స్ఫర్డ్ నివేదిక, సైమన్ కమిషన్ సిఫార్సులలో అంటరాని కులాల హక్కులకు సంబంధించిన డిమాండ్లను పొందుపరచారు. అదేసమయంలో 1930-31 మధ్య లండన్లో మొదటి, రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. వాటిలో అంబేడ్కర్ లేవనెత్తిన అంశాలపై ఆధారపడి అంటరాని కులాలు ఎదుర్కొంటున్న వివక్షను నిర్మూలించడానికి 1935 భారత ప్రభుత్వ చట్టంలో కొన్ని రక్షణలను పొందుపర్చారు. గాంధీ-అంబేడ్కర్ల మధ్య కుదిరిన పూనా ఒడంబడికపై ఆధారపడి రాజకీయ, విద్య, ఉద్యోగపరమైన రిజర్వేషన్లను కల్పించారు. వాటిని అమలు చేయడానికి అంటరాని కులాలను గుర్తించి, షెడ్యూల్డ్ కులాల జాబితాను రూపొందించారు. ఆ తర్వాత 1950లో, 1975లో ఈ జాబితా లను ప్రకటించారు. 1911లోనే ఈ ప్రక్రియ మొదలైనప్పటికీ, 1931 జనాభా లెక్కల్లో దీనికి ఒక నిర్దిష్టమైన విధానాన్ని ప్రతిపాదించారు. అందుకు తొమ్మిది అంశాలను పరిగణనలోనికి తీసుకున్నారు. ఏది అంటరాని కులమని నిర్ణ యించేందుకు వాటినే ప్రాథమిక ఆధారాలుగా నిర్ధారించారు. అవి: 1. ఈ కులానికి బ్రాహ్మణ పురోహితులు విధులు (పూజాది కార్య క్రమాలు) నిర్వహిస్తున్నారా? లేదా? 2. హిందువులకు సేవలందించే మంగలి, దర్జీ, నీళ్ళు మోసే వాళ్ళు ఈ కులానికి కూడా పనులు చేస్తారా? లేదా? 3. ఈ కులం వలన మైల పడిపోతామనే భావన ఇతర హిందూ కులాల్లో ఉందా? లేదా? 4. ఈ కులం ప్రజల నుంచి ఇతర హిందూ కులాలు నీటిని స్వీకరిస్తాయా? లేదా? 5. ఒకే రకమైన విద్యార్హతలు ఉన్నప్పటికీ హిందువుతో సమానంగా ఈ కులానికి చెందిన వ్యక్తిని గౌరవిస్తారా? లేదా? 6. హిందువులు పూజలు నిర్వహించే దేవాలయాల్లోకి ఈ కులాలకు ప్రవేశం ఉందా? లేదా? 7. ఇతర కులస్తులు ఉపయోగించే బాటలు, బావులు, కాలు వలు, పాఠశాలల్లోకి వీళ్ళను అనుమతిస్తారా? లేదా? 8. వెనుకబాటు తనానికి, పేదరికానికి, నిరక్షరాస్యతకు కులం కారణమౌతుందా? లేదా? 9. ఆ కులం నిర్వహిస్తున్న వృత్తి కూడా వారి జీవన గమనానికి ప్రతిబంధకంగా ఉందా? లేదా? పై తొమ్మది అంశాలలోనూ ప్రతికూలతలను ఎదుర్కొంటున్న వారిని అంటరానితనం అనుభవిస్తున్న కులంగా భావించి షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని నిర్ణయించారు. వాటి ఆధారంగానే ఇంత వరకు షెడ్యూల్డ్ కులాలను గుర్తిస్తున్నారు. ఓటు బ్యాంకు క్రీడలో గుజ్జర్ పావులు అయితే ఇటీవల ఓట్ల కోసం వివిధ పార్టీలు చరిత్రను, చట్టాలను, రాజ్యాంగాన్ని మరిచి పలువురిని ఎస్సీ లేదా ఎస్టీలలో చేరుస్తామని వాగ్దానాలు చేస్తూ పోతున్నాయి. అంటరాని కులాలతోపాటూ, కొన్ని ఇతర వెనుకబడిన కులాలు కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బాగా వెనుకబడిపోయాయనేది కాదనలేని వాస్తవం. కొన్ని ఆధిపత్య కులాలు మాత్రమే ఆర్థిక, సామాజిక రంగాలపై తరతరాలుగా గుత్తాధిపత్యం సాధించి, రాజకీయాధికారాన్ని హస్తగతం చేసుకోవడం వల్ల చాలా కులాలు అన్ని రంగాల్లో వివక్షకు గురవుతున్నాయి. అందువల్లనే ఆయా కులాలు తమ సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం అనివార్యంగా సంఘటితం అవుతు న్నాయి. ఎన్నో డిమాండ్లను ప్రభుత్వాల ముందు పెడుతున్నాయి. ఆ డిమాండ్లలో తమను ఎస్సీ, ఎస్టీ జాబితాల్లో చేర్చాలనేది కూడా ఉంటోంది. ఏ కులమైనా తమ ప్రగతి కోసం ఎలాంటి డిమాండ్లనైనా రూపొందించు కోవచ్చు. కానీ రాజకీయ పార్టీలు రాజ్యాంగపరమైన మౌలికాంశాలను విస్మరించి ఎన్నికల ప్రణాళికలలో చేస్తున్న వాగ్దానాలతోనే సమస్యలు తలెత్తుతున్నాయి. అలాంటి వాగ్దానాలు కొన్ని సార్లు హింసాత్మక ఘటనలకు సైతం దారితీస్తున్నాయి. ఉదాహరణకు, రాజస్థాన్ను కుదిపేసిన గుజ్జర్ల రిజర్వేషన్ల ఆందోళనలో దాదాపు 26 మంది మరణించారు. లెక్కకు మించిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయ్యాయి. తమను ఎస్టీలలో చేర్చాలని డిమాండ్ చేస్తున్న గుజ్జర్లను ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఏళ్ళ తరబడి ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందుకు మినహాయింపు కావు. ప్రభుత్వాలు నియమించిన కమిటీలు ఈ డిమాండు సరైనది కాదని తేల్చి చెప్పాయి. గుజ్జర్ల ఎస్టీ హోదా డిమాండ్ పరిశీలనకు నియమించిన జస్టిస్ జస్రాజ్ చోప్రా కమిటీ నివేదిక(2007) ఆ డిమాండ్ను స్పష్టంగా తిరస్కరించింది. గుజ్జర్ల సామాజిక, ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించింది. నాటి ముఖ్యమంత్రి వసుంధరారాజే సింథియా ఈ నివేదికను కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు. 2013 ఎన్నికల ప్రణాళికలో ఆ రాష్ట్ర బీజేపీ గుజ్జర్లకు ఎస్టీ హోదా కల్పిస్తామనే వాగ్దానాన్ని వీడి, 5 శాతం రిజర్వేషన్లకు హామీ ఇచ్చింది. 2007నాటి జస్టిస్ జస్రాజ్ చోప్రా కమిటీ నివేదికను అమలు చేయడానికి మాత్రం ఏ ప్రభుత్వమూ ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఇదీ ప్రభుత్వాలు ఆడే రాజకీయ క్రీడ. రజకులతోనూ అదే ఆట! ఏపీలోని అధికార పార్టీ టీడీపీ రజకులను ఎస్సీలలో చేరుస్తామని తమ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. చరిత్ర క్రమాన్ని, వర్తమాన పరిస్థితులను పరిశీలించి ఆ వాగ్దానాన్ని అమలు చేయడం రాజ్యాంగపరంగా చెల్లుతుందా? లేదా? అనే దృష్టి నుంచి చూస్తే.... అది ఇప్పట్లో నెరవేరే పరిస్థితి కనిపించదు. అయినా ఈ డిమాండ్పై పదే పదే రాజకీయ పార్టీలు మాట్లాడుతుండడం వల్ల అటువంటివే మరికొన్ని డిమాండ్లు ముందుకు వస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి ఆచరణ సాధ్యంకాని డిమాండ్లను పరిష్కరిస్తామనే తప్పుడు హామీలతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడటాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలకు నిజంగానే వెనుకబడిన ప్రజల మీద ప్రేమ ఉన్నట్లయితే, తమ బడ్జెట్లలో సంపన్న వర్గాలకు, కాంట్రాక్టర్లకు, పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న రాయితీలలో ఐదు శాతం ఖర్చు పెట్టినా రజకులు దారిద్య్రం నుంచి బయటపడతారు. కానీ రజకులకు మేలు జరిగే ప్రయత్నాలు కానీ, వారిని పేదరికంలోంచి బయటపడేసే కృషి కానీ చేయకుండా ప్రభుత్వాలు వారిని మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నాయి. గ్రామాల్లో వచ్చిన మార్పులు, జీవితాల్లోకి వచ్చి చేరిన ఆధునికత కారణంగా రజకులు నేడు కుల వృత్తి మీద ఆధారపడి బతికే పరిస్థితి లేదు. వారికి విద్య, ఉపాధి అవకాశాలను, తగు శిక్షణను ఇచ్చి నూతన జీవన విధానంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి. వారిపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టడానికి తగు రక్షణలు కల్పించాలి. అంతే గానీ రాజ్యాంగపరంగా, చట్టపరంగా సమంజసం కాని వాగ్దానంతో వారిని ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూడడం రాజకీయ వంచన తప్ప మరొకటి కాదు. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 -
నేను చనిపోయినట్టు రాశారు: మహిళా ఎంపీ
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం వికీపీడియాపై లోక్ సభలో దుమారం రేగింది. వికీపీడియా చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ బీజేపీ మహిళా ఎంపీ అంజుబాల ఆరోపించారు. తాను మరణించినట్లుగా రాసిన వికీ పీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో అంజుబాలకు ప్రభుత్వం న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చింది. ఇది తీవ్రమైన చర్య అని, ఈ పరిస్థితి మరెవ్వరికీ కలగకుండా చూస్తామని వాగ్దానం చేసింది. అంజుబాల ఈ విషయాన్ని జీరో అవర్ లో ప్రస్తావించారు. గతవారం తాను ఓ మహిళా సమావేశంలో పాల్గొన్న సమయంలో ముంబై నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చిందని, అప్పుడే తనకు అసలు విషయం తెలిసిందని అన్నారు. మార్చి 3న తాను మరణించినట్లు వికీపీడియాలో పేర్కొంటూ వచ్చిన ఆ ఫోన్ కాల్ ను తన కార్యదర్శి రిసీవ్ చేసుకున్నారని చెప్పారు. అంజుబాల మార్చి 3న చనిపోయినట్లుగా వికీపీడియాలో ఉందని కాల్ చేసిన వ్యక్తి చెప్పడంతో విస్తుపోయానన్నారు. ఇటువంటి చర్యలు తన వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తాయని, చవకబారు అనుకరణలను చేస్తున్న వికీపీడియాపై చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. ఇటువంటి నేరాలపై ఎఫ్ఐఆర్ కూడ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సభ్యుల ఆందోళనలు, నినాదాలమధ్య విషయాన్నిస్పీకర్ సుమిత్రా మహాజన్ దృష్టికి తీసుకొచ్చారు. ఇది కచ్చితంగా ఓ తీవ్రమైన చర్య అని, ఈ విషయంలో తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని న్యాయశాఖామంత్రి డీవీ సదానంద గౌడ హామీ ఇచ్చారు. -
'హామీలు అమలు చేయనివాడు మగాడే కాదు'
విజయవాడ: కేరళలో ఒక మనిషి హామీ ఇస్తే అమలు చేసి తీరాల్సిందే. లేకపోతే మనిషిగానే కాదు అసలు మగాడిగానే భావించరని ఏపీ సీఎం చంద్రబాబు నుద్దేశించి జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనిరాజా ఘాటుగా విమర్శించారు. ఆదాయం కోసం ప్రజలను తాగుబోతులుగా మారుస్తున్నారని ఆమె మండిపడ్డారు. నగరంలోని హనుమంతరాయ గ్రంథాలయంలో శుక్రవారం మద్యపాన నిషేదంపై జరిగిన సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సుకు దేశంలోని 27 మహిళా సంఘాలు హాజరయ్యాయి. ఈ సదస్సులో పాల్గొన్న సీపీఎం మహిళా నాయకురాలు బృందాకారత్ మాట్లాడుతూ..జన్మభూమిని మద్యం భూమిగా చంద్రబాబు నాయుడు మార్చేశారని విమర్శించారు. ఆదాయం కోసం మద్యాన్ని వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు. -
బడ్జెట్లో వరంగల్కు 300కోట్లు
-
'చంద్రబాబు కాకమ్మ కబుర్లు ఆపండి'
-
'చంద్రబాబు కాకమ్మ కబుర్లు ఆపండి'
రాజమండ్రి: మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. ఆయన శనివారం చంద్రబాబుకు మళ్లీ లేఖాస్త్రం సంధించారు. 'ముఖ్యమంత్రి గారు పిచ్చి పిచ్చిగా మామీద దాడి చేయిస్తే తోక ముడిచి పారిపోతామనుకుంటున్నారేమో..బంతిని ఎంత గట్టిగా కొడితే అంత ఎత్తుకు లేస్తుంది. అలాగే మా జాతి తిరగబడడానికి భయపడదు. తప్పుడు పాలన మార్చుకోండి. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు. పిల్లనిచ్చిన మామగారిని చెప్పులతో కొట్టిస్తే పదవి వదిలి వెళ్లిపోయారు... అలాగే ఎదురు దాడులు చేయిస్తే పారిపోతామనుకుంటున్నారేమో ఈ కాపు కులం పారిపోయే జాతి కాదు. ఇచ్చిన హామీలు తెచ్చుకునే వరకు నిద్రపోము. మా జాతి ఎవరి రక్తమో ఎక్కించుకోలేదు. ఆ అవసరం కూడా లేదు. అందుచేతనే పౌరుషంగా తిరగబడతారు. మీ నుండి మీ నాయకుల వరకు తరచు సభలు సమావేశాలలో కాపులను బీసీల్లో చేరుస్తాము అని కొంగ జపాలు చేస్తున్నారు. జపాలు ఆపి హామీలు ఆచరణలో పెట్టే ఆలోచన చేయండి. రాత్రులు అమ్మకు ఇల్లు కట్టిస్తాం ఉదయం మరచిపోతాం అనే సామెత గుర్తు తెచ్చుకోండి. అయ్యా మీ కాకమ్మ కబుర్లు మాని కార్యాచరణ చెయ్యమని డిమాండ్ చేస్తున్నాము' అంటూ ఘాటుగా లేఖ రాశారు. -
టీఆర్ఎస్ అహంకారానికి నిదర్శనం
-
సర్కారు సరైన దారిలోనే వెళ్తోంది
దాని పనితీరును సమీక్షించడం లేదు: ఆరెస్సెస్ సంఘ్-బీజేపీ భేటీకి హాజరైన మోదీ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిబద్ధత, అకింత భావంతో సరైన దారిలోనే వెళ్తోందని ఆరెస్సెస్ పేర్కొంది. తాము రిమోట్ కంట్రోల్లా పనిచేస్తున్నామన్న ఆరోపణలను తోసిపుచ్చింది. ఆరెస్సెస్, బీజేపీ, ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి నేతలతో ఢిల్లీలో సాగిన మూడు రోజుల సమన్వయ భేటీ శుక్రవారం ముగిసింది. భేటీ వివరాలను ఆరెస్సెస్ సంయుక్త కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే విలేకర్లకు తెలిపారు. ‘మేం ప్రభుత్వ పనితీరును సమీక్షించడం లేదు. స్వయం సేవకులైన మంత్రులతో కొంత సమాచారం పంచుకుంటున్నాం. ఆ హక్కు మాకుంది. మేం వారికి ఆదేశాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం వచ్చి 14 నెలలే అయింది. ఇంకా చాలా సమయం ఉంది. ఇంకా పురోగతి సాధించాలి. దేశ చరిత్రలో తొలిసారి ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను, ప్రభుత్వంపై వారి విశ్వాసాన్ని పెంచింది’ అని అన్నారు. సంఘ్ నేతలకు మంత్రులు తమ పనితీరు చెబుతూ.. అధికార రహస్యాలు వెల్లడించబోమన్న హామీని ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ‘మాది చట్టవిరుద్ధ సంస్థ కాదు. మేం కూడా ఈ దేశ పౌరులమే. మంత్రులను అడిగే హక్కు మాకుంది. రిమోట్ కంట్రోల్తో నడుస్తున్న కాంగ్రెస్కు మాగురించి మాట్లాడే నైతిక హక్కు లేదు’ అని వ్యాఖ్యానించారు. అయోధ్య రామమందిర అంశం సుప్రీం కోర్టులో ఉంది కనుక, ప్రభుత్వం అనుకున్న విధంగా రామమందిర నిర్మాణం జరిగే వరకు వేచిచూస్తామని పేర్కొన్నారు. సమన్వయ భేటీలో దేశ భద్రత, ఉగ్రవాదం, పల్లెల నుంచి పట్టణాలకు వలసలు తదితరాలపై చర్చించామని, ఆయా అంశాల్లో చేపట్టాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చామని పేర్కొన్నారు. ముగింపు సమావేశంలో మోదీ సంఘ్-బీజేపీ సమన్వయ సమావేశాలకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ భేటీకి మంత్రులు వెళ్లడాన్ని విపక్షాలు విమర్శిస్తున్నా ప్రధాని హాజరవడం చర్చానీయాంశమైంది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. భేటీలో రెండు గంటలు పాల్గొని, పావుగంట ప్రసంగించిన మోదీ.. సుపరిపాలన, పారదర్శతకు తీసుకున్న చర్యలను వివరించారు. తాను స్వయంసేవక్ కావడం గర్వకారణంగా ఉందని, సమాజంలో చిట్టచివరికి వ్యక్తి కూడా అభివృద్ధి ఫలాలు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. సమావేశాల్లో మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్నాథ్, వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. నిర్దిష్ట గడువులో గంగానది శుద్ధి జరగకపోవడంపై బీజేపీ, ఆరెస్సెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరెస్సెస్ చేతుల్లో మోదీ సర్కారు: సీపీఎం ఈ భేటీలో కేంద్ర మంత్రులు తాము సాధించిన ప్రగతి గురించి చెప్పడం ప్రజాస్వామ్యాన్ని కించపరచడమేనని సీపీఎం మండిపడింది. మోదీ ప్రభుత్వం ఆరెస్సెస్ ప్రత్యక్ష నియంత్రణలో ఉందని ఈ వ్యవహారం స్పష్టం చేస్తోందని, దేశాన్ని హిందూ దేశం చేయాలన్న సంఘ్ శక్తుల యత్నానికి మోదీ చట్టబద్ధత కల్పిస్తున్నారని ఓ ప్రకటనలో విమర్శించింది. -
'కేసీఆర్ హామీల విలువ రూ.10 లక్షల కోట్లు'
కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ గత 14 నెలల కాలంలో ఇచ్చిన హామీల విలువ రూ.10 లక్షల కోట్లు దాటిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులకు మినహా రైతులు, సామాన్యులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేశానంటూ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని ధారాదత్తం చేసిన కేసీఆర్... అదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లకు ఎందుకు బిల్లులు చెల్లించడం లేదని ప్రశ్నించారు. కరీంనగర్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావుతో కలసి రమణ మాట్లాడారు. గత ఏడాది కరవుతో రైతులు ఇబ్బంది పడ్డా పట్టించుకోలేదని, కనీసం కేంద్రానికి నివేదిక పంపలేదని అన్నారు. కేంద్రం వద్దకు వెళ్లి సాయం కోరితే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వలేదని, వాళ్లు నివేదిక ఇవ్వకుండా తాము ఎలా జోక్యం చేసుకోగలమని అన్నారని తెలిపారు. ఈ ఏడాది కూడా మళ్లీ వర్షాల్లేక వేసిన పంటలు మొలకెత్తే పరిస్థితులు లేకుండా పోయాయన్నారు. రెతుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని, ఇప్పటికే వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నాని, అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. -
ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు
సందర్భం (తెలగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి మాజీ పార్లమెంటు సభ్యు లు ఎమ్. నారాయణరెడ్డి రాస్తున్న బహిరంగ లేఖల పరంపరలో ఇది రెండవది. గత ఏడాది ఏప్రిల్లో విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర సమి తి ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు చేసిన వాగ్దానాలను, బడ్టెట్పై వాటి ప్రభావాన్ని విశ్లేషిస్తూ ఆయన రాసిన రెండవ లేఖ సంక్షిప్త పాఠాన్ని అందిస్తున్నాం.) చంద్రశేఖరరావు గారూ! తెలంగాణలోని పది జిల్లాలు కాక, ఇంకా పద్నాలుగు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని మీరు ప్రకటించారు. ఇంత వరకు ఒక్క జిల్లానూ ఏర్పాటు చేయలేదు. కాబట్టి మందుగా జిల్లాల సంఖ్య ఎంత ఉండటం అభిలషణీయమో నిర్ధారించడా నికి ఎంపీ కేశవరావు లేదా ప్రొఫెసర్ కోదండరాం లేదా గౌతం పింగ్లే వంటి అనుభవజ్ఞుల నేతృత్వంలో ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పరచాలి. ఇక ఒక్కొక్క జిల్లాకు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ అది కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాల పరిధిలోని విషయం! రెసిడెన్షియల్, గురుకుల విద్యాసంస్థల్లో కేజీ టు పీజీ ఉచిత విద్య అనే వాగ్దానమూ చాలా అస్పష్టమైనదే. పైగా రెసి డెన్షియల్ స్కూళ్లకే వర్తించే ది. పైగా, మీ ప్రణాళిక అత్యంత జనా దరణ పొందిన ‘ఫీజుల రీయింబర్స్మెంట్’ను విస్మరించింది. ఆ పథకంలోని పలు లోటుపాట్ల వల్ల ఇంజనీరింగ్ తదితర వృత్తి కళాశాలలు, ప్రత్యేకించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పుట్టకొక్కుల్లా పుట్టుకొచ్చాయి. సుప్రీంకోర్టు ఆదే శానుసారం అలాంటి 170కి పైగా కళాశాలలు మూతపడ్డ సంగతి తెలిసిందే. కానీ మచ్చలేని కళాశాలల విషయంలో సకాలంలో అందించాలే గానీ ఫీజుల రీయింబర్స్మెంట్ అత్యంత ఉపయోగకరమైనదని గుర్తించాలి. మీ పార్టీ ప్రణాళికలో పేర్కొన్నట్టు ప్రతి అసెంబ్లీ నియో జకవర్గంలో 1 లక్ష ఎకరాలకు సాగునీరు అందించడం కొంత హాస్యాస్పదమే. 100 నియోజకవర్గాలకే లెక్కవేసినా కోటి ఎక రాలు! ఇక మీరు చేస్తామన్న నదుల అనుసంధానాన్ని కేంద్రమే ప్రస్తుతం చేపట్టలేకపోతోంది. కాకపోతే చెరువుల పునరుద్ధ రణకు చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ మంచి ప్రతిపాదన. అది విజయవంతం కావాలంటే కచ్చితమైన తనిఖీ అవశ్యం. ప్రపం చ బ్యాంకు సహాయంతో ఆ పనిని అత్యంత సమర్థవంతంగా చేసిన కర్ణాటక ఆదర్శ నమూనా కాగలదు. పది థర్మల్ స్టేషన్ల ఏర్పాటు కూడా ఆచరణాత్మకమైనది కాదు. అందుకు బొగ్గను కేటాయించాల్సింది కేంద్రం. స్థాని కంగా లభించే బొగ్గు మరీ నాసిరకం. నాణ్యమైన బొగ్గును ఆస్ట్రే లియా నుంచి దిగుమతి చేసుకోవాలి. శంకరంపల్లి గ్యాస్ ఆధా రిత విద్యుత్ కేంద్రం చాలా కాలం క్రితమే పూర్తయినా, కేంద్రం నుంచి గ్యాస్ కేటాయింపులు లేక ఇంకా ఉత్పత్తి మొదలు కాలేదు. తక్షణమే అది ఉత్పత్తి ప్రారంభించేలా చేయడం అవసరం. అభిలషణీయ సంఖ్యలో థర్మల్ కేంద్రాల ఏర్పాటు ను దీర్ఘకాలిక ప్రణాళికల్లో చేర్చవచ్చు. లక్ష రూపాయలలోపు పంట రుణాల మాఫీ మొదలైనవి ఆచరణ సాధ్యమైనవే. కానీ 24 జిల్లాలే లేనప్పుడు 24 సూపర్ స్పెషాలిటీ ఆసు పత్రుల ఏర్పాటు గురించి ఎలా ఆలోచించగలం? వైద్య రంగంలో ప్రస్తుతం అరాచకం రాజ్యమేలుతోంది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయి. ఇటీవలే నిజామాబాద్లో ఏర్పాటు చేసిన టీచింగ్ హాస్పిటల్ కూడా అలాంటి అధ్వాన స్థితిలోనే ఉంది. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు అందించాలనే అంశం అత్యంత ప్రాధాన్యంగలది. అమరుల సంఖ్యను మీ ప్రభుత్వం 470గా చూపి, అందుకు రూ. 47 కోట్లు కేటాయించింది. కానీ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ అంచనా ప్రకారం వారి సంఖ్య 631! ఇంత సెంటిమెం టల్ అంశంలో సైతం ఇలాంటి వివాదం కొనసాగడం ఏమిటో అంతుబట్టదు. ఈ జాప్యం ఎందుకో చెప్పాల్సింది మీరే. అమ రవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలంటే అతి స్వల్పం, అవి ఎందుకూ సరిపోవు. కాబట్టి ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పన ఇవ్వాలి. బతుకమ్మను ప్రభుత్వ పండుగ చేయాలనేది మంచి ప్రతి పాదనే. కానీ, అందుకోసం ఒక స్వయంప్రతిపత్తిగల సంస్థను ఏర్పాటు చేయాలి. అది సంప్రదాయక తెలంగాణ సంస్కృతిని, కుటుంబ విలువలను పెంపొందింపజేసేదిగా ఉండాలి. ఇక అంతర్జాతీయ స్థాయి అమరవీరుల స్వారక చిహ్నాన్ని ఢిల్లీలోని ‘ఇండియా గేట్’ నమూనాలో నిర్మించి, అమరుల పేర్లన్నిటినీ లిఖించి, భావి తరాలకు ఉత్తేజాన్నిచ్చేదిగా చేయాలి. రూ. 50 వేల కోట్లతో ఎస్సీల అభివృద్ధికి ఐదేళ్ల ప్రణాళిక అన్నారు. దానికీ, గత ప్రభుత్వం ప్రకటించిన సబ్-ప్లాన్కూ తేడా ఏమిటో మీరే చెప్పాలి. ప్రాతినిధ్య సంస్థల్లో బీసీలకు 33% కోటా వగైరాలు ఇప్పటికే ఏదో ఒక రూపంలో ఉన్నవే. ఇక హైదరాబాద్లో కల్లు దుకాణాలపై నిషేధం ఎత్తివేతకు సంబంధించి... సమంజసమైన కారణాలతోనే విధించిన నిషే ధాన్ని ఎలా ఎత్తేస్తారని విజ్ఞులైన పౌరులంతా అడుగుతున్నారు. ‘లిక్కర్ కుబేరుల’ ఒత్తిడికి తలొగ్గి ‘చీప్ లిక్కర్’ను ప్రవేశ పెట్టడం ఓ ప్రహసనం! ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను సుప్రీం కోర్టు ఇప్ప టికే రాజ్యాంగవిరుద్ధంగా పేర్కొంది. అదే వాగ్దానాన్ని చేయ డం తప్పుదోవ పట్టించేదే. ప్రభుత్వోద్యోగులకు టి-ఇంక్రిమెం ట్, కేంద్ర స్కేళ్లు, ఉద్యోగ అనుకూల ప్రభుత్వం, మూడేళ్ల పాటు బదిలీల నిలుపుదల, ఆంధ్రా ఉద్యోగాలను వారి ప్రాం తానికి పంపేయడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి వాగ్దానాల అమలు ప్రభావం ఎలా ఉంటుందనే అం చనాగానీ, వార్షిక బడ్జెట్పై ఎంత భారమనే అంచనాగానీ మీకు లేవు. పైగా విచక్షణాయుతమైన ఏ ప్రభుత్వమూ మూడేళ్లపాటు బదిలీల నిలుపుదల వాగ్దానం చేయదు. అవన్నీ కొన్ని వర్గాలను సంతృప్తిపరచడానికి ఉద్దేశించినవే. ఆర్టీసీ కార్మికులకు వారు ఆశించినదానికంటే ఎక్కువగానే జీతాల పెంపుదల ముదావహం. కానీ అందుకు అంత జాప్యం, వారు సమ్మె చేయాల్సి రావడంలోని మర్మమేమిటో చెప్పాలి. 2009 ఎన్నికల్లో తమరు చవి చూసిన చేదు అనుభవం తదుపరి కూడా ఎన్నికల్లో ‘ధనం శక్తి’ని నిర్మూలించడం మీ ప్రణాళికలో లేకపోవడం ఆశ్చర్యకరం. మొత్తంగా చూస్తే మీ పార్టీ ప్రణాళికలోని చాలా అంశాలు ఆచరణసాధ్యమైనవి కావని, అస్పష్టమైనవని అనిపిస్తుంది. చాలా అంశాలకు కాలపరిమితే లేదు. ప్రణాళికలోని కొన్ని వాగ్దానాలు ఓటర్లను ఆకట్టుకోవాలనే అతి తాపత్రయంతో చేసి నవి. ఈ లోపాలన్నీ ఉన్నా తెలంగాణ ప్రజలు మీకు ‘పూర్తి మెజారిటీ’ని కట్టబెట్టి, మీపట్ల, మీ పార్టీపట్ల అపార నమ్మకాన్ని ప్రదర్శించారు. కాబట్టి అత్యంత సమర్థవంతంగా, నిజాయి తీగా, పొదుపుగా పరిపాలన సాగించడానికి ప్రయత్నించండి. - ఎం. నారాయణరెడ్డి (వ్యాసకర్త మాజీ పార్లమెంటు సభ్యులు) మొబైల్: 7702941017 -
సీఎం హామీలు నీటి మూటలు..!
నరసన్నపేట: నరసన్నపేట నియోజవర్గ అభివృద్ధికి అన్నివిధాలా కృషిచేస్తామంటూ సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు నీటిమూటలుగానే మారాయి. ఆయన ఈ ప్రాం తంలో పర్యటించి నాలుగు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చలేదు. దీంతో వాటి అమలుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో నరసన్నపేటను అభివృద్ధి చేసుకుందామంటూ ఫిబ్రవరి 14 న నరసన్నపేటలో నిర్వహించిన సభలో సీఎం ప్రకటిం చారు. ఎమ్మెల్యే తెలియజేసిన సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతే... ఇప్పటివరకు హామీలన్నీ ప్రతిపాదనల దశల్లోనే ఉన్నాయి. అభివృద్ధి పనులకు ఒక్క రూపాయి కూడా మంజూరుకాలేదు. సారవకోట మండలంలో బొంతు వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి 1400 ఎకరాలకు సాగునీరు అందిస్తామని, దీనికి అవసరమైన రూ.175 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆ రోజు ప్రకటించారు. ఇది ఆచరణకు నోచుకోలేదు. పోలాకి మండలం సుసరాం, డీఎల్ పురం, అంప్లాంల మధ్య ఉన్న తంపర భూములను ముంపునుంచి రక్షించేందుకు శాశ్వత పరిష్కా రం చూపుతామన్నారు. దీనికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇది అక్కడితో ఆగిపోయింది. జలుమూరు, సారవకోట మండలాల్లో 40 గ్రామాలకు తాగు నీరు అందించేందుకు శ్రీముఖలింగం వద్ద భారీ తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేసి తాగునీటి కష్టాలు తీరుస్తామని హమీ ఇచ్చారు. దీనికి అవసరమైన రూ.15 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఆచరణ శూన్యమే. నరసన్నపేట ప్రభుత్వాస్పత్రికి భవనాలు నిర్మిస్తామని, రోగులకు ఇబ్బందుల లేకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. రూ.8 కోట్ల నాబార్డు నిధులను మంజూరు చేశారు. రాజుల చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, రోడ్లు, మురికి కాల్వలను నిర్మిస్తామని సభాముఖంగా ప్రకటించారు. పనుల్లో పురోగతి లేదు. పాత జాతీయ రహదారి నుంచి వాత్సల్య ఆస్పత్రి మీదుగా శ్రీరాంనగర్ దాని పరిసర వీధులను కలుపుతూ పక్కాగా రోడ్డు నిర్మిస్తామని హమీ నిచ్చారు. ఇందిరా నగర్లో స్వర్గీయ కింజరాపు ఎర్రంన్నాయుడు పేరన పార్కు అభివృద్ధి చేస్తామన్నారు. పనులు ఆ స్థాయిలో కనిపించడంలేదు. ఇంకా ప్రతిపాదనలు దశ దాటలేదు. దీంతో సీఎం హామీలకు ఆచరణకు పొందనలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఉత్తుత్తి హామీలతో ప్రజలను మోసం చేయకుండా చేస్తామన్నదే చెప్పాలని కోరుతున్నారు. ఉత్తుత్తి హామీలు వద్దు... నరసన్నపేటలో అభివృద్ధి పనులు చేస్తామ ని సీఎం చంద్రబాబునాయుడే స్వయం గా హామీ ఇచ్చారు. నాలుగు నెలలు అవుతుం ది. పైసా మంజూరు కాలేదు. పనులకు అతీగతీలేదు. సీఎం హామీ అమలుకు ఇన్నిరోజులా..?. ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. పార్కు అన్నారు.. రింగు రోడ్డు అన్నారు.. కనీసం సీసీ రోడ్లు కూడా వేయడంలేదు. ఉత్తుత్తి హామీలు ఇవ్వకుండా ఆచరణ సాధ్యమైన ప్రకటనలు చేస్తే మంచిది. లేకుంటే ప్రజా విశ్వాసం కోల్పోవడం ఖాయం. -కోరాడ చంద్ర భూషణగుప్త, మాజీ ఉప సర్పంచ్ -
ఇక హామీలొద్దు..
ఎన్నికలకు ముందు లెక్కలేనన్ని హామీలు అధికార పీఠం ఎక్కాక అవి అమలైంటే ఒట్టు ఈ మారైనా చేసే పనులే చెప్పాలని జనం వినతి నేడు జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక సాక్షి ప్రతినిధి, కడప : కడప జిల్లా సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తా. ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతాం, ఇక్కడి పండ్ల తోటల్ని దృష్టిలో ఉంచుకొని మెగా ఫుడ్పార్క్ ఏర్పాటు చేస్తాం. టెర్మినల్ మార్కెట్, రాజంపేటలో హార్టికల్చర్ యూనివర్శిటీ నెలకొల్పుతాం. చేనేతల కోసం మైలవరంలో టెక్స్టైల్స్ పార్క్, ప్రొద్దుటూరులో అఫెరల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. ఒంటిమిట్టను ఫిలిగ్రిం సర్క్యూట్లో చేరుస్తూ అభివృద్ధి చేస్తాం. ఇందుకు రూ.50 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. కడప-చెన్నై రహదారిని నాలుగు లైన్లుగా విస్తరిస్తాం. నిరుపయోగంగా ఉన్న ఏపిఐఐసీ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పుతాం. - ఇవన్నీ జిల్లా ప్రజలకు సీఎం ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనవి ఏడాది పూర్తి చేసుకోనున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలుపుకోవడంలో చతికిలపడింది. ఉచిత హామీలు తప్ప అభివృద్ధి జాడ కనిపించడం లేదు. సీమ నడిబొడ్డున ఉన్న కడపను అన్ని విధాలా ఆదుకుంటామని, తమకు జిల్లా పట్ల ఎలాంటి వివక్ష లేదని పైకి చెబుతున్నా, ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పారిశ్రామిక ప్రగతికి అవసరమైన వనరులు అందుబాటులో ఉన్నా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. పెపైచ్చు వైఎస్సార్ జిల్లా అంటేనే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని, పరిశ్రమలు స్థాపించేం దుకు ముందుకు రావడం లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రే ప్రకటించారు. సీఎం ప్రకటన చూస్తుంటే ఆయన జిల్లాకు మేలు చేస్తున్నట్లు ఏ విధంగా భావించాల్సి ఉంటుందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే జిల్లాలో అంతటి భయానక వాతావరణం ఉంటే ఆయన పాలన చేస్తున్నారా.. లేక గాలికొదిలేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆదివారం నాటి పర్యటనలోనైనా ఆరోపణలకు తావు లేకుండా నిర్మాణాత్మకంగా హామీలు ఇచ్చి ఆచరణలో చూపెట్టాలని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. నేటి పర్యటనలో సీఎం విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం ఖాజీపేటలో నిర్వహించే జన్మభూమి-మాఊరుకార్యక్రమంలో పాల్గొననున్నారు. టీడీపీ నేతల్లో హైరానా... ముఖ్యమంత్రి పర్యటన టీడీపీ నేతల్లో హైరానా సృష్టిస్తోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్వ్రీంద్రారెడ్డి ఉన్నట్లుండి చక్రం తిప్పడంతో టీడీపీ మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పుట్టా సుధాకర్ అతలాకుతలమౌతున్నారు. జన్మభూమి కార్యక్రమానికి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు ఎవ్వరు హాజరు కాకుండా ఈ పాటికే ఆయన సఫలీకృతుడైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామం దేశం శ్రేణులకు మింగుడు పడని వ్యవహారమైంది. ఇదిలా ఉండలా టీడీపీ శ్రేణులను పెద్ద ఎత్తున తరలించి సత్తా చాటుకోవాలనే తపన పుట్టా సుధాకర్లో మెండుగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం ముఖ్యమంత్రి నిర్వహించే జన్మభూమి ఎలా సాగుతుందోనన్న ఉత్కంఠ అటు అధికారులు, ఇటు టీడీపీ శ్రేణుల్లో ఉత్పన్నమౌతోంది. మొత్తానికి ఈమారు టీడీపీ శ్రేణులకు ముఖ్యమంత్రి పర్యటన ముచ్చెమటలు పట్టిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
'నక్కజిత్తుల బాబుని నమ్మే పరిస్థితి లేదు'
-
'ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చాం'
-
'ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తున్నా'
-
ప్రజలను వంచిస్తున్న టీడీపీ
ఆనందపేట(గుంటూరు): టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచన చేస్తోందని కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు ఆరోపించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయనందు కు నిరసనగా కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ‘టీడీపీ ప్రజావంచన దినం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పార్టీ కార్యాలయం నుంచి హిందూ కళాశాల సెంటర్లోని రాజీవ్గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజీవ్గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకో నిర్వహించడంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మ్యానిఫెస్టో పత్రాలను కాంగ్రెస్పార్టీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మక్కెన మాట్లాడుతూ రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా రైతులను, మహిళలను వంచన చేస్తున్నారని విమర్శించారు. బాబు వస్తే జాబు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిరుద్యోగ యువతను మోసం చేశారన్నారు. కాంగ్రెస్పార్టీ నగర అధ్యక్షుడు షేక్ మస్తాన్వలి మాట్లాడుతూ చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిధులను పట్టిసీమకు తరలించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ వహీద్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వ్యతిరేక ప్రభుత్వమన్నారు. మాజీ శాసనసభ్యుడు యర్రం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాల్సిందేనన్నారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు చదలవాడ జయరాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సవరం రోహిత్, దొంత సురేష్, కరీముల్లా, ముత్యాలు, ఈరి రాజశేఖర్, బిట్రగుంట మల్లిక, మొగలి శివప్రసాద్, ఉస్మాన్, రెహమాన్, షేక్ హనీఫ్, ఎర్రబాబు, పవన్తేజ, చిలకా రమేష్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
వాగ్దానాలతో మభ్యపెట్టిన బాబు
మంగళగిరి: ‘నేడు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూ డబ్బుల్లేవని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్రం విడిపోయినప్పుడు పరిస్థితి తెలియకుండానే నోటికొచ్చిన వాగ్దానం చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందారా..’ అని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) ప్రశ్నించారు. పట్టణంలోని ఆయన కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తొమ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్షనాయకుడిగా ప్రపంచానికి పాఠాలు చెప్పాననే చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థికపరిస్థితి గురించి తెలియకుండానే వాగ్దానాలు ఇచ్చారంటే ప్రజలు నమ్మేపరిస్థితి లేద న్నారు. తొలి రుణమాఫీ పూర్తికాకుండా నే రెండవ విడత రుణమాఫీ అంటూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ల పేరులతో రైతులను ముంచిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. సింగపూర్ ప్రధాని మృతికి అసెంబ్లీ సంతాపం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో లేని సంప్రదాయాన్ని అసెంబ్లీలో ప్రేవేశపెట్టడం చూస్తుంటే సింగపూర్ రాజకీయ నాయకులకు చంద్రబాబుకు వున్న రహస్య సంబధాలు బయటపడ్డాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో రాజధాని వీధులకు, రోడ్లకు సింగపూర్, జపాన్ నాయకులు పెడతారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. -
అబద్ధాలతో కాలయాపన
డోన్టౌన్: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక అబద్ధాలతో ముఖ్యంత్రి చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. డోన్లోని ఆయన స్వగృహంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఆ మాటకు కట్టుబడి ఉండలేక కట్టుకథలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళలను మరింత దారుణంగా మోసం చేసిన ఘనతను చంద్రబాబు మూటగట్టుకున్నారని ఆరోపించారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నేడు ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారన్నారు. ఇక నిరుద్యోగ భృతి 1.75 లక్షల ఇళ్లకు ఇవ్వాల్సి ఉందని, అయితే ఆ ప్రస్తావనే ముఖ్యమంత్రి తీసుకరావడం లేదని విమర్శించారు. రైతుల పై వడ్డీ భారం మోపడమే కాకుండా, ఇన్పుట్ సబ్సిడీని కూడా వర్తింపజేయకుండా వ్యవస్థనే నిర్వీర్యం చేశారని ఆరోపించారు. జీవో నంబర్ ఎంస్ 13ను ను రాద్ధాంతం చేసిన టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అదే జీవోను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయ, ఇతర అవసరాల నిమిత్తం కేంద్రం 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే, దాన్ని కూడా తప్పుబట్టి నిధులు లేనట్లు ప్రజల ముందు డ్రామా ఆడటం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇక పట్టిసీమ ప్రాజెక్టు ఎత్తిపోతల నిర్మాణం.. అవినీతికి నిలయంగా మారడం ఖాయమన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వివాదం ముదిరి రైతుల ఆందోళన ఉద్ధృతంగా మారకముందే ప్రభుత్వం తీరు మార్చుకోవాలని సూచించారు. స్వతంత్ర రాజకీయాలే మాకు తెలుసు..: రావుబహుదూర్ శేషారెడ్డి స్వతంత్రంగానే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ఆ నాడు డోన్, వెల్దుర్తి, బేతంచెర్ల, ప్యాపిలి మండలాలు మాత్రమే నియోజకవర్గంగా ఉండేదన్నారు. ఇటీవల అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తనకు కానీ, తన కుటుంబానికి ఎక్కడా కూడా టీడీపీ సభ్యత్వం లేదన్నారు. తాను వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో కాంగ్రెస్లో చేరానని, నేడు జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానన్నారు. తనను ఎన్నికల ముందు మూడేళ్ల క్రితమే అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారన్నారు. ప్రజల ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానన్నారు. 1978లో కాంగ్రెస్ పార్టీలో పెద్దమనిషిగా ప్రస్తుత ఉపముఖ్యమంతి కేఈ క్రిష్ణమూర్తి, తదుపరి 1985లో విబేధాలు తలెత్తడంతో తెలుగునాడు పార్టీ పెట్టడం, ఆ తరువాత ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ కోసం విబేధాలు పొడచూపిన వాస్తవాలు ప్రజలకు తెలుసన్నారు. వాటిని కాదని నిజాయితీ గల రాజకీయాల పై విమర్శించడం పెద్ద మనుషుల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. డోన్ పట్టణంలో నత్తనడకన నడుస్తున్న ఫ్లై ఓవర్ పనులను పురోగతిలో తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నానన్నారు. ఇక పక్షపాత ధోరణితో ఎంపిక చేసిన జన్మభూమి కమిటీలపై కోర్టులో తేల్చుకుంటామని చెప్పారు. అనంతరం ప్యాపిలి మండలంలో బూర్గుల గ్రామంలో గడ్డి వామి దగ్ధమై నష్టపోయిన రైతు ఓబులేసుకు రూ. 5వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు,మాజీ ఎంపీపీ రామక్రిష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు వలసలరామక్రిష్ణ,వ్యక్తిగత సహాయకులు అంకిరెడ్డి,మాజీ సర్పంచ్ మల్లెంపల్లె రామచంద్రుడు,కోట్రాయి వెంకటేశ్వర్రెడ్డి, బోరెడ్డి శ్రీరామిరెడ్డి, మెట్టుపల్లె వెంకటేశ్వర్రెడ్డి, మల్లికార్జునరెడ్డి,గార్లదిన్నె రామసుబ్బయ్య, ఎస్టీ సెల్ జిల్లాకార్యదర్శి శివ, తిరుపతయ్య, మైనార్టీ నాయకులు రఫి, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు
-
చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు: హరీష్ రావు
హైదరాబాద్: గతంలో సీఎంలు అంతా హైదరాబాద్ లో ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రజల మధ్యనే ఉంటున్నారని ఆ రాష్ట్ర మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ...ప్రజల సంక్షేమానికి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోకుండా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. విభజన సిద్థాంతాన్ని చంద్రబాబు గౌరవించడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లో ఎరుకలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కేసీఆర్ త్వరలో కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పర్యటిస్తారని ఆయన వెల్లడించారు. -
జన్మమెత్తితిరా!
సాక్షి, కర్నూలు: హమీలతో హడావుడి చేయడం.. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించడం.. ఆ తర్వాత మరో కొత్త రాగం అందుకోవడం చంద్రబాబుకే చెల్లు. తొలి సంతకం సాక్షిగా ఆయన రుణమాఫీ రైతుల ఆశలపై నీళ్లు చల్లిన ముఖ్యమంత్రి.. ఇప్పటికీ ఆ పంథా వీడకపోవడం గమనార్హం. ‘జన్మభూమి-మాఊరు’ పేరిట ప్రజలకు దగ్గరయ్యేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టగా.. ఆ సందర్భంగా తీసుకున్న దరఖాస్తులను కూడా బుట్టదాఖలు చేయడం విమర్శలకు తావిస్తోంది. దాదాపు నెలన్నర రోజులు దాటినా వీటి గురించి పట్టించుకోకపోవడం ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తోంది. సర్కారు నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడం.. జిల్లా అధికారులు స్పందించకపోవడంతో జన్మభూమి దరఖాస్తులు నెలన్నర రోజులుగా దుమ్ముపట్టిపోయాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కార్యక్రమమే జన్మభూమి-మా ఊరు. ఆ నమ్మకంతోనే ప్రజలు తమ సమస్యలపై భారీగా వినతులు అందించారు. పాలనలో జవాబుదారీతనం పెంచేందుకంటూ దరఖాస్తులను ఆన్లైన్ చేయించి.. పరిష్కారమైన తర్వాత ఆ వివరాలు అందులో పొందుపర్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఆన్లైన్ చేసేలోపే పుణ్యకాలం గడిచిపోయింది. గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో జిల్లాలోని 889 గ్రామాల్లోనూ, 219 పట్టణ ప్రాంత వార్డులోనూ గ్రామసభలు నిర్వహించారు. మొత్తం 1,108 సభల్లో ఏకంగా 3,27,053 వినతులు అందగా.. 50 రోజులు దాటిపోయినా వీటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అధిక శాతం దరఖాస్తులు హౌసింగ్ శాఖకే జన్మభూమి గ్రామసభల్లో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞాపన పత్రాల్లో హౌసింగ్ శాఖకు సంబంధించినవే అత్యధికంగా ఉన్నాయి. ఈ శాఖకు 92,144 అర్జీలు అందగా.. 61,738 దరఖాస్తులతో రెవెన్యూ శాఖ ఆ తర్వాత స్థానంలో నిలిచింది. ఇక రేషన్కార్డుల కోసం 60,269, పింఛన్ల కోసం 47,836, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 4,241, ఆర్డబ్ల్యూఎస్ శాఖకు 2,839 దరఖాస్తులు అందజేశారు. ఇవే కాకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి, పురపాలకశాఖకు సంబంధించి మరిన్ని అర్జీలు ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తుల వివరాలు ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఇప్పటి దాకా ఆన్లైన్ మాత్రమే చేయగలిగారు. గ్రామీణ ప్రాంతాల నుంచి అందిన 2,04,884 దరఖాస్తుల్లో 2,01,654 మాత్రమే ఆన్లైన్లో నమోదు చేశారు. పట్టణ ప్రాంతాల్లో 1,22,169 దరఖాస్తులకు గాను ఇప్పటి వరకు 1,18,440 అర్జీలు అప్లోడ్ చేశారు. సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కారంలో భాగంగా దరఖాస్తుదారుల నుంచి వివరాల సేకరణ, సంబంధిత సమాచారం వారికి తిరిగి తెలియజేసేందుకు వీలుగా ఆధార్ నెంబరు, ఫోన్ నంబర్లు సైతం అప్లోడ్ చేశారు. అయితే ఎప్పటికి పరిష్కారం చూపుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. అన్నింటినీ పరిష్కరిస్తాం జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో అందిన దరఖాస్తులు అన్నింటినీ పరిష్కరిస్తాం. గ్రామసభల్లో దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేశాం. ప్రభుత్వం తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. రేషన్కార్డులు, పింఛన్లకు సంబంధించి సమస్యల్ని నెల రోజుల్లోపు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం. రెవెన్యూ, హౌసింగ్లకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారానికి కాస్త సమయం పట్టొచ్చు. - సీహెచ్ విజయమోహన్, జిల్లా కలెక్టర్ హమీల, చంద్రబాబు, బుట్టదాఖలు, -
ఏమీ అడగమంటేనే అతిథులుగా..!
కోటి ఆశలతో కోరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన ప్రజలకే కాదు.. ప్రభుత్వ ఉద్యోగులకూ అడుగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ‘ఆ హామీల’ గురించి అడగబోమని ఓ హామీ ఇస్తేనే ఏ కార్యక్రమానికైనా వస్తామంటున్నారు మంత్రులు. ఇటీవల కొన్ని ఉగ్యోగ సంఘాలకూ ఇదే అనుభవం ఎదురైంది. మంత్రులకు సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రయత్నించాయి. సన్మానం చేస్తాం.. అతిథులుగా రండి అంటూ మంత్రులను కోరాయి. అయితే.. ‘ఆ హామీలు, ఇతర అంశాలు’ అడగబోమని హామీ ఇస్తేనే అతిథులుగా వస్తామంటూ వారికి సమాధానాలొచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వంలో ‘నంబర్ 2’గా ఉన్న ఓ మంత్రిని కొన్ని రోజుల క్రితం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిశారు. మా శాఖ బాగోగులు చూసే మంత్రిగా మిమ్మల్ని సన్మానిస్తామని చెప్పారు. ఆయన వెంటనే ఒప్పుకోలేదు. తర్వాత చెప్తానని అన్నారు. ఆయన్ని సన్మానించి పీఆర్సీ అమలు తదితర హామీలు పొందాలని సంఘం నేతలు ఆశించారు. అయితే, మంత్రి పేషీ నుంచి వచ్చిన సమాధానంతో వారు కంగుతిన్నారు. పీఆర్సీ, టీఏ, డీఏ సహా ఇతర ఏ అంశాలనూ ప్రస్తావించబోమని హామీ ఇస్తేనే మంత్రిగారు కార్యక్రమానికి వస్తారన్నది దాని సారాంశం. మీరు అడగాలనుకున్న విషయాలేవీ మంత్రికి తెలియవని, దేనిపైనా నిర్ణయం తీసుకునే, హామీ ఇచ్చే అవకాశం ఆయనకు లేని కారణంగానే ఈ షరతు పెడుతున్నామని అధికారులు ఫోనులో చెప్పారు. కీలకాంశాలు కేవలం సీఎంతోనో, లేదా కీలకంగా వ్యవహరిస్తున్న ‘ఆ నలుగురి’ తో మాత్రమే చర్చించాల్సి ఉంటుందని అన్నారు. దీంతో అవాక్కయిన ఉద్యోగ సంఘం నేతలు సన్మానంపై డైలమాలో పడ్డారు. -
బాబుది నోరుకాదు..
⇒ ప్రభుత్వానికి పోయే కాలమొచ్చింది ⇒ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు ⇒ వైఎస్సార్ హయాంలోనే అందరికీ మంచి ⇒ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు నెల్లూరు (సెంట్రల్): అధికారంలోకి రావడం కోసం ఎన్నికల ముందు అడ్డమైన వాగ్దానాలు చేసి, ఇప్పుడు విదేశాల బాటపట్టిన సీఎం చంద్రబాబుది నోరా..తాటిమట్టా..అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజమెత్తారు. నెల్లూరులోని బాలాజీనగర్లో ఆదివారం జరిగిన సీపీఎం 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి చంద్రబాబు వెనుకాడరని పేర్కొన్నారు. జనానికి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన రైతులు, డ్వాక్రా మహిళలను కన్నీరు పెట్టిస్తున్నారన్నారు. టీడీపీకి పోయే కాలం దగ్గరకు వచ్చే ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలలకే ప్రజలకు అన్యాయం చేస్తోందన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే..రాబోయే ఆ పార్టీ పాలన తీరు ఎలా ఉంటుందోనని భయమేస్తోందన్నారు. కనీసం పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేకపోవడం చంద్రబాబు దుర్మార్గ పాలనకు నిదర్శనమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పేదలకు ఎంత ఇసుక అవసరమైనా ఉచితంగా వచ్చేదన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేదన్నారు. అప్పట్లో ప్రజలందరికీ ఎంతో మంచి జరిగిందన్నారు. ప్రధానంగా రైతు లు సంతోషంగా గడిపారన్నారు. ఇప్పుడు చంద్రబాబు మాత్రం వాగ్దానాలను విస్మరించి, యువరైతులు సైతం ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు తెస్తున్నారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన ఆయన ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్నారన్నారు. అంగన్వాడీలు కూడా తెలుగుదేశంవాడీలుగా ఉండాలని ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ, బీజేపీ రెండూ రెండేనని విమర్శించారు. ఇటీవల విదేశీ పర్యటనలంటూ చంద్రబాబు జపాన్ వెళ్లారని, అక్కడి పాలకులు తమ ప్రజలకే ఏమిచేయలేక చేతులెత్తేస్తే బాబు వారిని ఆశ్రయించడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో కొన్ని ఊర్లకు బస్సు వెళ్లే దిక్కే లేకపోతే విమానాశ్రయం పెడతామని బాబు దాబులు పోతున్నారని మండిపడ్డారు. ప్రతి ఊర్లో మద్యం షాపు పెట్టి మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. చివరకు నీళ్లతో కూడా వ్యాపారం చేస్తూ టీడీపీ నేతల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారన్నారు. ఇటీవల వైజాగ్లో విజయోత్సవ సభ ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదన్నారు. పవన్ కల్యాణ్ ఎక్కడ? ఎన్నికల ముందు టీడీపీ గెలిపించడంటూ మైకులు పగిలేలా మాట్లాడిన సినీనటుడు పవన్కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని మధు ప్రశ్నించారు. ఓట్ల కోసం ఆవేశంగా మాట్లాడిన పవన్కల్యాణ్ ఇప్పుడు వాగ్దానాల అమలు మాట ఎత్తకపోవడం తగదన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు ఓ వ్యాపారం టీడీపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఓ వ్యాపారంగా మారిందని మధు విమర్శించారు. తమ పార్టీలో సభ్యత్వం తీసుకుంటే నారాయణ విద్యాసంస్థలు, కేసినేని ట్రావెల్స్లో డిస్కౌంట్లు ఇస్తామని ఆఫర్లు ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని ఎంపిక కమిటీతో పాటు పలు కమిటీల్లో వ్యాపారులను సభ్యులుగా చేసి టీడీపీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటోందన్నారు. ప్రభుత్వ తీరు మారకపోతే వామపక్షాలన్నీ ఏకమై ప్రజాఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు జక్కా వెంకయ్య, జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, ీమూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, శ్రీరాములు, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
‘గజినీ’ బాబు
* ఎన్నికల వాగ్దానాలు మరిచిపోయారు * డిసెంబర్ 5న మహాధర్నాకు తరలిరావాలి * వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి గుమ్మలక్ష్మీపురం,కురుపాం: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రజలకు మాయమాటలు చెప్పి అమలు సాధ్యం కాని వాగ్దానాలిచ్చి, గెలుపొందిన అనంతరం వాగ్దానాలు మరిచి పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గజినీ బాబులా ప్రజలను దగాచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. గుమ్మలక్ష్మీపురం,కురుపాంలలో శుక్రవారం జరిగిన ఆయా మండలాల విస్తృతస్థాయి సమావేశాల్లో వీరభద్రస్వామి మాట్లాడారు. గుమ్మలక్ష్మీపురంలోని బీఎస్ఆర్ కళింగ వైశ్య కల్యాణమండపంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హజరైన కోలగట్ల మాట్లాడుతూ ఎన్ని అబద్ధాలు చెప్పినా అమాయక ప్రజలు నమ్ముతారన్న కుటిల బుద్ధితో ఎన్నికల్లో చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు చేశారని, ఇచ్చిన హమీలు నెరవేర్చుతారని నమ్మి ఓటువేసిన ప్రజలకు రోజుకో కమిటీల పేరిట,కొత్త వాగ్దానాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో సాలూరు,కురుపాం ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణిలు డిమాండ్ చేయగా, గిరిజన యూనివర్సిటీ మంజూరుకు హమీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పి పక్కజిల్లాకు కేటాయించారని విమర్శించారు. ఈ ఆరునెలల్లో చంద్రబాబు పాలన చూసిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూస్తున్నారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి, సంక్షేమ పథకాలు మావేనంటూ బాబు గంతులేస్తున్నారని ఆరోపించారు. ఆర్థికంగా బలపడడానికి, ఆస్తులు కూడబెట్టుకోడానికి చ ంద్రబా బు నాయుడు ఏడాదిలో నాలుగు పంటలు పండే భూములను రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటున్నారన్నారు. ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న అధికార పార్టీ ఆగడాలపై ప్రజల తరఫున ఉద్యమించేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ముందుకురావాలని కోరారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 5వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో చేపట్టబోయే మహాధర్నా కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు,నాయకులు,అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు చేపడుతోందని ఆరోపించారు. గిరిజన ప్రాంతానికి పెద్దదిక్కుగా ఉండాల్సిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఓటువేసి గెలిపించిన ప్రజలు,కార్యకర్తలను కాదని సొంతలాభాల కోసం గిరిజనుల మనోభావాలను దెబ్బతీశారని, అటువంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి వైఎస్సార్సీపీని బలోపేతం చేసేందుకు 18 కమిటీలను ఏర్పాటు చేసి, నాయకత్వ లక్షణాలపై వారికిశిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో కురుపాం నియోజకవర్గం సమన్వయ కర్త శత్రుచర్ల చంద్రశేఖరరాజు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్ రాజు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు శ్రీరాములు నాయుడు,సింగుబాబు,సీహెచ్ వెంకటరమణ, కుంబురుక దీనమయ్య, గోరిశెట్టి గిరిబాబు, నిమ్మక సింహాచలం,శేఖర్,పి.మహేష్, తోయక గోపాల్ రెల్ల,దుడ్డుఖల్లు,చెముడుగూడ,తాడికొండ ఎంపీటీసీలు బి.లక్ష్మి, ఎన్.నీలావతి,గంగాసీ, భాస్కరరావు, రెల్ల ఉప సర్పంచ్ కె.నాగేశ్వరరావు, అడ్డాకుల చిన్నారావు,తోయక మాధవరావు తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీకి భయపడేది లేదు .. కురుపాం: మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన అధికార పార్టీకి భయపడేది లేదని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే అదే ప్రజల అండతో ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేస్తామని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయక్త శత్రుచర్ల చంద్రశేఖరరాజు అధ్యక్షతన కురుపాంలో జరిగిన సమావేశంలో కోలగట్ల మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజల అండతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు, మహిళలు, రైతులు మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నైజాన్ని గుర్తించారన్నారు. గిరిజన యూనివర్సిటీ జిల్లాకు వచ్చేవరకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. అనంతరం కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ఆర్ పాద యాత్ర చేసి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకొని మంచి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని అవన్నీ అమలు చేసి నేటికీ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. పెనుమత్స సాంబశివరాజు, విజయనగరం పార్లమెంటరీ పరీశీలికులు బెల్లాన చంద్రశేఖర్, కురుపాం నియోజకవర్గం సమన్వయకర్త చంద్రశేఖరరాజు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు సింగుబాబు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు పీరుబండి జైహింద్ కుమార్, విజయనగరం మాజీ ఏఎసీ చైర్మన్ శ్రీరాములు నాయుడు, పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడులు కార్యక్రమంలో మాట్లాడారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్చైర్మన్ చనమల్లు వెంకటరమణ, కురుపాం మండలాధ్యక్షురాలు ఆనిమి ఇందిరాకుమారి, జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి పద్మావతి, వైస్ ఎంపీపీ వి.కృష్ణ, ఎంపీటీసీ సభ్యులు , నాయుకులు ఆకుల శ్రీధర్, శెట్టినాగేశ్వరరావు, శత్రుచర్ల పరీక్షిత్రాజు, ఆనిమి కైలాసరావు, ఎస్సీసెల్ అధ్యక్షుడు వెంకటరావు, జి.వి.శ్రీనివాసరావుతోపాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు,పాల్గొన్నారు. -
ఇది దగాకోరు ప్రభుత్వం
సమస్యలపై వివిధ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగిన రోడ్డు దిగ్బంధం, ధర్నాల కారణంగా గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు రెండు వైపులా బారులు తీరాయి. అనంతరం పోలీసులు ట్రాఫిక్ పునరుద్ధరించారు. అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో దళిత, గిరిజనుల సంక్షేమ కోసం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రజలను టీడీపీ ప్రభుత్వం దగాచేసిందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బీ కేశవరెడ్డి ఆరోపించారు. కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికసంఘం, ఏపీ గిరిజన, దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ దళిత, గిరిజనుల సబ్ ప్లాన్ నిధులను జనాభా దామాషా ప్రకారం ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనేరు రంగారావు భూ కమిటీని ప్రభుత్వం వెంటనే ఆమోదించి, సిఫారస్సులను పక్కగా అమలు చేయాలన్నారు. దళిత, గిరిజనుల సాగులో ఉన్న భూమలకు పట్టాలు మంజూరు చేయాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి కూలీకి 200 రోజులు పని కల్పించి, రోజు వేతనం రూ. 300 చెల్లించాలన్నారు. 100 యూనిట్ల వరకు విద్యుత్ ఉచిత సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇన్చార్జ్ డీఆర్ఓ చక్రపాణికి వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రఘవయ్య, ఏపీ గిరిజన సమాఖ్య సహాయ కార్యదర్శి ఎస్. నాగరాజు నాయక్, నాయకులు మల్లికార్జున, వెంకటేష్, తదితరలు పాల్గొన్నారు. -
అన్నీ అబద్ధాలే...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన వాగ్దానాలన్నీ అబద్ధాలేనని తేలిపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసమే ఆయన పాట్లు పడ్డారనీ తేటతెల్లమవుతోంది. రుణ మాఫీ పేరిట రైతులు, మహిళలను మోసగించిన బాబు ,అధికారం చేపట్టాక కూడా అదే దారిలో పయనిస్తున్నట్టు అర్థమవుతోంది. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ‘ఎన్టీఆర్ సుజల’ పథకం గ్రామీణుల దరి చేరలేక మరో మాఫీ హామీగా మారింది. గ్రామాల్లో టార్చిలైటు వేసిన వెతికినా ఎల్ఈడీ బల్బుల పంపిణీ కార్యక్రమం జాడ కూడా కానరావడం లేదు. గాంధీ జయంతి రోజు నుంచి 24 గంటలూ నిరంతర విద్యుత్ సరఫరా ఎక్కడ జరుగుతుందో ప్రభుత్వానికే అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎల్ఈడీ లైట్లు వెలిగేదెప్పుడు? ఎల్ఈడీ బల్బుల కోసం గ్రామీణ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు పంపిణీ చేసేది అధికారులు ప్రకటించకపోవటంతో గ్రామీణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇప్పటి వరకు చిలకలూరిపేట, వినుకొండ పట్టణాల్లో మాత్రమే పంపిణీ చేశారు. ఎన్టీఆర్ సుజలకు ఆటంకాలెన్నో... ఆర్భాటంగా రూ.2లకే 20 లీటర్ల నీరందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో ఎన్నో ప్రతిబంధకాలను సృష్టిస్తోంది. ఎన్టీఆర్ సుజల ద్వారా శుద్ధమైన తాగునీటిని ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తీరా ప్లాంట్లు ఏర్పాటుకు దాతలు రూ.2లక్షలు భరించాలని చెప్పటంతో ఎవ్వరూ ముందుకు రావడం లేదు. శావల్యాపురం తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు...అభివృద్ధి కార్యక్రమాలు పట్టణాలకే పరిమితమవుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. అందుకు నిదర్శనంగా ఎన్టీఆర్ సు జల, ఎల్ఈడీ లైట్ల పంపిణీ కార్యక్రమాలే నిదర్శనం. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తామని మాటిచ్చి, ఆ తరువాత నగరాలు, పట్టణాలకు తొలి ప్రాధాన్యమని చేసిన ప్రకటన సర్వత్రా విమర్శలకు దారితీసింది. శావల్యాపురం మండల పరిధిలో 15 పంచాయతీలు ఉండగా, సుమారు 30 వేల మంది ప్రజలు జీవిస్తున్నారు. అధిక గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు లభించక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 2 వ తేదీ నుంచి జిల్లాలో ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించింది. రూ.2 లకే 20 లీటర్ల శుద్ధజలాన్ని ప్రజలకు అందించనున్నట్టు తెలిపింది. ఎన్టీఆర్ సుజల పథకం గ్రామాల్లో ప్రారంభిస్తే తాగునీటి ఇక్కట్లు తొలగుతాయని ప్రజలు ఆశపడ్డారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఈ ప్లాంట్లు ఏర్పాటు కాలేదు. లోవోల్టేజ్, హైవోల్టేజ్తోపాటు టప్పున రాలిపోయే లైట్ల ఫిలమెంట్లు జేబులకు చిల్లు చేస్తుంటే విద్యుత్ బిల్లులు మోత కూడా సామాన్యునికి భారంగా మారింది. ఇలాంటి సమస్యలను నివారించడంతో పాటు విద్యుత్ పొదుపులో భాగంగా ప్రభుత్వం ఎల్ఈడీ ైలైట్ల పంపిణీని చేపడతామని ప్రకటించింది. గత నెల 25వ తేదీ నుంచి నియోజకవర్గ కేంద్రమైన వినుకొండ పట్టణంలో మాత్రమే రెండు కేంద్రాలు ఏర్పాటు చేసి లైట్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో గ్రామీణ విద్యుత్ వినియోగదారులు నిరుత్సాహానికి గురవుతున్నారు. సాక్షాత్తూ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కారుమంచి గ్రామంలో జన్మభూమి కార్యక్రమానికి హాజరుకాగా, ఎల్ఈడీలైట్ల పంపిణీ ఎప్పుడు చేస్తారంటూ ప్రజలు ప్రశ్నించారు. ఎన్టీఆర్ సుజల పథకం, ఎల్ఈడీ లైట్ల పంపిణీ కార్యక్రమం మండల స్థాయిలో ప్రారంభం కాకపోవటంతో గ్రామాలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఈడీ బల్బుల కోసం గ్రామీణ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్కో బల్బు రూ.10లకే ఇవ్వనున్నట్టు తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. తక్కువ విద్యుత్ ఖర్చు అవుతుందని, 5 ఏళ్లపాటు పనిచేస్తాయని చెప్పటంతో వీటి పట్ల మక్కువ కనబరుస్తున్నారు. పలు గ్రామాల ప్రజలు, నాయకులు విద్యుత్ అధికారులను ఎల్ఈడీ లైట్ల గురించి అడుగుతున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు పంపిణీ చేసేది అధికారులు ప్రకటించకపోవటంతో గ్రామీణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇలా అన్ని విషయాల్లో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై చిన్నచూపు చూస్తోందని అంటున్నారు. -
జీతాల్లేవ్..!
కర్నూలు(అగ్రికల్చర్): ‘‘బాబు వస్తే.. జాబు గ్యారంటీ.. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తాం.’’ అంటూ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు హామీల వర్షం కురిపించారు. ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి కల్పిస్తామని భరోసా కూడా ఇచ్చారు. అయితే అధికారంలో వచ్చిన తరువాత సీన్ రివర్స్ అయింది. ఉద్యోగాలు ఇవ్వడం దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఈ ఉద్యోగం మాకొద్దు బాబోయ్ అనేటట్లు చేస్తున్నారు. వేతనం అందక జిల్లాలో ఇటీవలే వ్యవసాయ శాఖకు చెందిన జూనియర్ అసిస్టెంట్ మురళీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీతాల్లేక కర్నూలు సర్వజన వైద్యశాలలో అవుట్ సోర్సింగ్పై సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మనోహర్ గుండెపోటుతో మరణించాడు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అవుట్ సోర్సింగ్పై 160 మంది వివిధ విభాగాల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. వీరికి తొమ్మిది నెలలుగా జీతాలు లేవు. దీంతో వారు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ ఏడాది జనవరి నెలలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేసే 96 మంది పంచాయతీ సెక్రటరీలను రెగ్యులర్ చేశారు. రెగ్యులర్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు వారికి వేతనాలు అందలేదు. రెగ్యులర్ అయ్యామనే సంతోషం వారిలో కరువైంది. సాంఘిక సంక్షేమ శాఖలో అవుట్ సోర్సింగ్పై 110 మంది అటెండర్లు, వాచ్మెన్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఫిబ్రవరి నెల నుంచి జీతాలు లేవు. బీసీ సంక్షేమ శాఖలో 94 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఇదే పరిస్థితి ఎదురైంది. జూన్ నుంచి వేతనాలు లేకపోవడంతో వారు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోంది. జూనియర్ కళాశాలల్లో దాదాపు 300 మంది కాంట్రాక్టు పద్ధతిపై లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. వీరికి జూన్ నుంచి పైసా ఇవ్వలేదు. వీరు ఇంటి బాడుగలు చెల్లించలేక ఇబ్బందులు పడతున్నారు. కర్నూలు నగరపాలక సంస్థకు సంబంధించిన పార్కుల్లో అవుట్ సోర్సింగ్పై పనిచేస్తున్న 30 మంది మూడు నెలలుగా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. కర్నూలు మండలంలోని స్టాంటన్పురం, మునగాలపాడు, మామిదాలపాడు పంచాయతీలను కొన్ని నెలల క్రితం కర్నూలు నగరపాలక సంస్థలో విలీనం చేశారు. ఈ గ్రామాల్లో 40 మంది అవుట్ సోర్సింగ్పై పనిచేస్తున్నారు. వీరికి ఆరు నెలలుగా వేతనాలు లేవు. రెవెన్యూ శాఖలో 13 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు చెప్పనలవి కాదు. వీరికి జూన్ నుంచి జీతాలు లేవు. ఐకేపీలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న యానిమేటర్లకు 15 నెలలుగా జీతాల్లేవు. అవుట సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించకుండా అలసత్వం వహిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో ప్రతినెలా క్రమం తప్పకుండా జీతాలు ఇవ్వాలని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. -
ఆ హామీ ఏమైంది?
-
వరాలే వరాలు
పన్యాల జగన్నాథ దాసు ఎన్నికల రుతువులో ఓటరే దేవుడు. అతడిని ప్రసన్నం చేసుకుంటేనే ఓట్లు కురిసేది. అందు కే పార్టీలన్నీ ఓటర్లపై వరాల వర్షం కురిపి స్తుంటాయి. సుప్రీంకోర్టు చొరవతో ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాల పుణ్యమా ఇకపై మేనిఫెస్టోలో ప్రకటించే ఉచిత హామీల హేతుబద్ధతను, వాటి అమ లుకు అవసరమైన ఆర్థిక వనరుల లభ్యత తదితరాలను పార్టీలు విధిగా వివరించాల్సిం దే. అయినా సరే, శతకోటి దరిద్రాలకు అనం తకోటి ఉపాయాలు. ఎన్నికల ప్రవర్తన నియ మావళి రాకముందే పార్టీలు జాగ్రత్త పడ్డాయి. యూపీఏ సర్కారు సబ్సిడీ సిలిండర్ల పరిమితిని ఏడాదికి 9 నుంచి 12కు పెంచింది. ఉద్యోగులను ఆకట్టుకునేందుకు ఏడో వేతన సంఘాన్ని ప్రకటించింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ రాష్ర్ట ప్రభుత్వాలు ఓటర్లపై విసిరిన వరాల వలలు ఇవీ... ఉత్తరప్రదేశ్ అభివృద్ధి పథకాల్లో ముస్లింలకు 20 శాతం రిజర్వేషన్, పదో తరగతి పాసైన ముస్లిం బాలికలకు రూ.20 వేల నగదు వంటి పథకాలను యూపీ సర్కారు ప్రకటించింది. 1.71 లక్షల మంది విద్యా వాలంటీర్లను క్రమబద్ధీకరించింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని 30 వేల మంది ఇమామ్లకు రూ.2,500 స్టైపండ్, మారుమూల ప్రాంతాల్లోని బాలికలకు రూ.25 వేల చెల్లింపు పథకాలను మవత ప్రభుత్వం ప్రారంభించింది. మధ్యప్రదేశ్ అధికార బీజేపీ బీపీఎల్ కుటుంబాలకు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను ప్రకటించింది గ్రామీణ బాలికలకు రూ.220 కోట్లతో ఉచిత సైకిళ్ల పంపిణీ పథకాన్ని ప్రకటించింది వరద పరిహారాన్ని రూ.6 వేల నుంచి ఏకంగా రూ.70 వేలకు పెంచింది బీపీఎల్ కుటుంబాలు, రైతులకు చెందిన రూ.1,700 కోట్ల విద్యుత్ బకాయిలు రద్దు చేసింది సీనియర్ సిటిజన్లకు తీర్థయాత్రల కోసం రూ.70 కోట్లు ప్రకటించింది ముఖ్యమంత్రి అన్నపూర్ణ యోజన కింద బీపీఎల్ కుటుంబాలకు రూ.3కు కిలో గోధుమలు, రూ.4.50కు కిలో బియ్యం చొప్పున 20 కిలోల తిండి గింజలిస్తామని ప్రకటించింది ‘లాడ్లీ లక్ష్మి యోజన’ కింద ఆడపిల్లలు గల పేద కుటుంబాలకు పథకం ప్రకటించింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన కుటుంబాలకు రూ.30 వేల కోట్ల విలువ చేసే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లను ప్రకటించింది. ఛత్తీస్గఢ్ అధికార బీజేపీ మెడికల్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా లక్ష లాప్టాప్లు, గ్రామీణ బాలికలకు ఉచిత సైకిళ్ల పథకం ప్రకటించింది బీపీఎల్ కుటుంబాలకు కిలో రూపాయి బియ్యం, ఇతర కుటుంబాలకు కిలో రూ.7.50కు గోధుమలు, కిలో రూ.9.30కి బియ్యం ప్రకటించింది గిరిజనులకు కిలో రూ.5కు శనగపప్పు రైతులకు ఏటా 7,500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించింది. 60 ఏళ్లు పైబడ్డ జర్నలిస్టులకు నెలకు రూ.5 వేల పింఛను పథకాన్ని ప్రకటించింది. రాజస్థాన్ బీపీఎల్ కుటుంబాలకు రూపాయికి కిలో గోధుమలు, ఇళ్ల నిర్మాణానికి రూ.1,400 కోట్లను అధికార కాంగ్రెస్ ప్రకటించింది ప్రభుత్వాసుపత్రులు, వైద్య కేంద్రాల్లో ఉచిత ఆరోగ్య సేవలు, పరీక్షలు, మందులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత డయాలసిస్ సౌకర్యాన్ని ప్రకటించింది ప్రతి ఒక్కరికీ ఉచిత సీఎఫ్ఎల్ బల్బులు, 10, 12 తరగతుల్లో మంచి మార్కులు సాధించిన 50 వేల మందికి ఉచిత లాప్టాప్లు, 8వ తరగతిలో ర్యాంకులు సాధించిన 3.5లక్షల విద్యార్థులకు టాబ్లెట్ పీసీలను, బాలికలకు ఉచిత సైకిళ్లను ప్రకటించింది. 12వ తరగతిలో 60 శాతం మార్కులు సాధించిన మైనారిటీ వర్గాల బాలికలకు గేర్లు లేని స్కూటర్ల పంపిణీ పథకాలు ప్రకటించింది ఉచితంగా చీరలు, దుప్పట్లు పంపిణీకి రూ.600 కోట్లు కేటాయించింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ సర్కారు ఏకంగా 895 అనధికారిక కాలనీలను 2012 సెప్టెంబర్ నాటికే క్రమబద్ధీకరించింది. మరో 1,200 పైగా అనధికారిక కాలనీల క్రమబద్ధీకర ణకు రంగం సిద్ధం చేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.5 లక్షల రుణాలు, 3.50 లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. జర్నలిస్టుల సంక్షేమాని కి రూ.5 కోట్లు ప్రకటిం చింది. అయినా ఓటమి పాలైంది. తమిళ పార్టీల తీరే వేరు... ఓటర్లకు ‘ఉచిత’ తాయిలాలను ఎర వేయడంలో తమిళనాడు పార్టీల తీరే వేరు. బియ్యం మొదలుకుని బంగారం దాకా ఎడాపెడా ‘ఉచిత’ కానుకలు కురిపిం చడం వాటికి పరిపాటి. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, ఏఐఏడీఎంకే ‘ఉచిత’ వరాల ప్రకటనలో పోటీపడ్డాయి. కరుణానిధి నేతృత్వంలోని అప్పటి డీఎంకే సర్కారు కలర్ టీవీలు సహా పలు ‘ఉచిత’ పథకాలు ప్రకటించింది. వాటి వల్ల ప్రజలపై రూ.15 వేల తలసరి రుణభారం పడుతుం దంటూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత విమర్శించారు. ఆమె మాత్రం అంత కంటే ఉదారంగా ‘ఉచిత’ కానుకలు ప్రకటించారు. పేద యువతుల పెళ్లిళ్లకు మంగళ సూత్రాల కోసం 4 గ్రాముల బంగారం, రూ.25 వేల నగదు, ప్రతి మహిళకు ఫ్యాను, మిక్సీ, గ్రైండర్, బీపీఎల్ కుటుంబాలకు కిలో రూపాయి చొప్పున ప్రతి నెలా 20 కిలోల బియ్యం ప్రకటించారు. కారుచౌకగా అల్పాహారం, భోజనం అందించేందుకు ‘అమ్మ క్యాం టీన్’ పథకం ప్రకటించారు. తమిళనాడు 2013-14 వార్షిక బడ్జెట్ రూ.1.41 లక్షల కోట్లయితే, అందులో సబ్సిడీ భారమే దాదాపు రూ.33 వేల కోట్లు! -
కిరణ్ ప్రసంగం వినలేక జనం అసహనం
-
ఊహించనంత తక్కువ ధరకు విమాన టికెట్లు ఇస్తాం
-
విజయశాంతిచేరిక డౌటే!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీఆర్ఎస్ బహిష్కృత ఎంపీ విజయశాంతి అధికార కాంగ్రెస్లో చేరే విషయం కొలిక్కి రావడం లేదు. కాంగ్రెస్ పెద్దల నుంచి ఆశించిన మేర హామీలు రాకపోవడం వల్ల చేరికపై జాప్యం జరుగుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్లో చేరాలా? వద్దా?, చేరితే ఎప్పుడు? అనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్లో చేరికపై స్పష్టత లేకపోవడంతో విజయశాంతి దారెటు అనే విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మెదక్ ఎంపీ విజయశాంతి గత ఆగస్టు ఎనిమిదిన భేటీ అయ్యారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీని కూడా కలిశారు. దీంతో కాంగ్రెస్లో విజయశాంతి చేరిక లాంఛనమేనంటూ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే సోనియాతో భేటీ జరిగి నెల రోజులు దాటినా ఆ పార్టీలో చేరికపై ఇంకా స్పష్టత రావడం లేదు. మరోవైపు కాంగ్రెస్ జిల్లా నేతలు విజయశాంతిని తీసుకోకూడదంటూ తన వాణిని బలంగా వినిపిస్తున్నారు. 2009 ఎన్నికల్లో టీఆర్ ఎస్ పక్షాన ఎంపీగా ఎన్నికైన విజయశాంతి రెండు నెలల క్రితమే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో మెదక్ లోక్సభ టికెట్ ఇవ్వాలనే షరతు మీద కాంగ్రెస్లో చేరేందుకు విజయశాంతి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. అయితే వచ్చే ఎన్నికల్లో మెదక్ ఎంపీ టికెట్ కేటాయింపుపై ఇప్పటివరకు స్పష్టమైన హామీ దక్కలేదని ప్రచారం జరుగుతోంది. రాజ్యసభకు పంపే అంశంపైనా పార్టీ అధిష్టానం స్పష్టత ఇవ్వడం లేదని.. దీంతో ఓ వైపు పార్టీతో సన్నిహితంగా ఉంటూనే, మరోవైపు కాంగ్రెస్లో చేరడంపై విజయశాంతి మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. జిల్లా నేతల విముఖత ఎంపీ విజయశాంతి కాంగ్రెస్లో చేరికపై ఆ పార్టీకి చెందిన జిల్లా నేతలు విముఖత చూపుతున్నారు. ఇప్పటివరకు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలెవరితోనూ విజయశాంతి తన చేరికపై మనోగతాన్ని వెల్లడించలేదు. మరోవైపు అధికారంగా పార్టీలో చేరకుండానే మూడు రోజుల క్రితం ములుగు మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ జెండాను విజయశాంతి ఆవిష్కరించడంతో ఆ పార్టీ శ్రేణులు అయోమయానికి లోనయ్యారు. పార్టీ కోసం ఎంతో కాలంగా పనిచేస్తున్న వారిని వదిలి అధిష్టానం ఇతరులకు టికెట్ కేటాయిస్తుందని అనుకోవడం లేదని మెదక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఓ కీలక నేత వ్యాఖ్యానించారు. గతంలో విజయశాంతిపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన చాగన్ల నరేంద్రనాథ్ బీసీ కోటాలో మరోమారు తనకు పోటీ చేసే అవకాశం దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో విజయశాంతి చేరికపై ఆమె సన్నిహిత వర్గాలు ఆచీతూచి స్పందిస్తున్నాయి. ‘కాంగ్రెస్లో చేరే విషయంలో ఎంపీ తొందర పడడం లేదని, పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తర్వాతే అధికారికంగా చేరుతారు’ అని ఎంపీ సన్నిహిత అనుచరుడు ‘సాక్షి’కి వెల్లడించారు.