sastipurti
-
'షష్టి పూర్తి' ట్రైలర్.. మంచి ప్రయత్నం
'షష్టి పూర్తి' సినిమా ట్రైలర్ తాజాగా వచ్చేసింది. మంచి కంటెంట్తోనే ఈ సినిమాను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 'లేడీస్ టైలర్' సినిమాతో మెప్పించిన రాజేంద్రప్రసాద్, అర్చన సుమారు 38 ఏళ్ల తర్వాత మరోసారి వారిద్దరూ కలిసి 'షష్టి పూర్తి' మూవీలో నటించారు. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీని పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. మంచి లవ్ ట్రాక్తో పాటు కుటుంబ విలువలకు పెద్ద పీఠ వేసినట్లు ట్రైలర్లో చూస్తే అర్థం అవుతుంది. రాజేంద్ర ప్రసాద్, అర్చన జంటతో పాటు రూపేష్, ఆకాంక్షా సింగ్ యంగ్ జంటగా మెప్పించనున్నారు. మే 30న ఈ చిత్రం విడుదల కానుంది. -
షష్టి పూర్తి!
తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రోడక్షన్స్ షష్టి పూర్తి (60 ఏళ్లు) ప్రయాణం పూర్తి చేసుకుంది. పద్మభూషణ్, దివంగత నిర్మాత డా. డి. రామానాయుడు 1964లో స్థాపించిన సురేష్ ప్రోడక్షన్స్ భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా పేరు పొందడంతో పాటు ప్రేక్షకుల మన్ననలను పొందింది. ప్రకాశం జిల్లా కారంచేడులో రైతు కుటుంబంలో పుట్టారు రామానాయుడు. రైసు మిల్లు వ్యాపారం చేస్తున్న సమయంలో ఆయన మద్రాసు వెళ్లారు. అక్కడ కొందరు సినీ ప్రముఖుల పరిచయం ఆయన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. భాగస్వామ్యంతో ‘అనురాగం’ చిత్రం నిర్మించారు రామానాయుడు.ఆ చిత్రం విజయవంతం అయింది. ఆ తర్వాత తన పెద్ద కుమారుడు సురేష్బాబు పేరుతో సురేష్ ప్రోడక్షన్స్ స్థాపించి, ఎన్టీఆర్తో ‘రాముడు–భీముడు’ (1964) సినిమా నిర్మించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అప్పట్నుంచి పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తూ వస్తోంది సురేష్ ప్రోడక్షన్స్. శతాధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో స్థానం సంపాదించుకున్నారు. అలాగే అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చుకుని, చరిత్ర సృష్టించారు రామానాయుడు.2015 ఫిబ్రవరి 18న ఈ మూవీ మొఘల్ తుది శ్వాస విడిచారు. అప్పటికే తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను నిర్వర్తిస్తున్న సురేష్బాబు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రెండో కుమారుడు వెంకటేశ్ హీరోగా కొనసాగుతున్నారు. మనవడు రానా నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. రానా సోదరుడు అభిరామ్ కూడా హీరో (‘అహింస’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు)గా చేసిన విషయం తెలిసిందే. ఇక సురేష్ ప్రోడక్షన్స్ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రయాణంలో భాగమైన అందరికీ నిర్మాణ సంస్థ కృతజ్ఞతలు తెలియజేసింది. -
ఆగస్టులో చిరంజీవి షష్టిపూర్తి వారోత్సవాలు
సేవా కార్యక్రమాలు చేపట్టిన అభిమానులకు బంగారు పతకాలు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలుగు వారికి సన్మానాలు కల్తీపై ప్రజా ఉద్యమాలు ఏలూరు (పశ్చిమగోదావరి జిల్లా) : మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15 నుంచి 22 వరకు వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు తెలిపారు. ఆదివారం ఏలూరులో నిర్వహించిన చిరంజీవి యువత 3వ రాష్ట్ర సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నేత్రదానం, కిడ్నీ దానం, అవయవ దానం వంటి సేవా కార్యక్రమాలతోపాటు, అత్యధిక సార్లు రక్తదానం చేసిన చిరంజీవి అభిమానులకు బంగారు పతకాలు అందిస్తామని చెప్పారు. ఈ మేరకు రామ్చరణ్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సుమారు వెయ్యి మంది అభిమానుల జాబితా సిద్ధం చేశారని తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియంలో నిర్వహించే చిరంజీవి జన్మదిన వేడుకల సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన సైనా నెహ్వాల్ (బ్యాడ్మింటన్), సానియా మీర్జా (టెన్నిస్), అంబటి తిరుపతి రాయుడు (క్రికెట్) వంటి తారలను, సాధారణ స్థాయి నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు(ఆర్ఎస్ఆర్)ను ఘనంగా సన్మానించడానికి చిరంజీవి నిర్ణయం తీసుకున్నారన్నారు. చిరంజీవి షష్టిపూర్తి రోజునుంచి ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ సరుకులపై ఉద్యమం ప్రారంభిస్తారన్నారు. ఎక్కడ కల్తీ జరిగినట్టు తమ దృష్టికి వచ్చినా అభిమానులుగా తామే దాడులు నిర్వహిస్తామని, కల్తీ వ్యాపారులపై సంబంధిత అధికారులకు సమాచారం అందించి ప్రజా ఉద్యమంగా మలుచుతామని వివరించారు. చిరంజీవి కుటుంబంలో ఏమైనా స్పర్థలున్నా ఆయన అభిమానుల్లో ఎటువంటి మార్పు రాలేదని, ఇప్పటికీ చిరంజీవి కుటుంబ అభిమానులంతా ఒకే కుటుంబంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సమావేశంలో చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసాదరెడ్డి, ప్రధాన కార్యదర్శి కటకం రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి పెన్మెత్స సుబ్బరాజు పాల్గొన్నారు.