tealngana govt
-
కాసుల కక్కుర్తితో HCU విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు
తెలంగాణ భవన్,సాక్షి: హెచ్సీయూ భూముల కోసం న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్థులను.. పెయిడ్ బ్యాచ్ అని మంత్రులు మాట్లాడడం సిగ్గుచేటు’అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్రెడ్డి ఆరోపించారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై జరిగిన లాఠీ ఛార్జీపై జగదీష్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హెచ్సీయూ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల జరిపిన లాఠీఛార్జ్ను బీఆర్ఎస్ ఖండిస్తోంది. 1969లో విద్యార్థుల పోరాట ఫలితం వల్లనే HCUను సాధించుకున్నాం. ఉద్యమ ఫలితంగా సాధించిన HCUను కాపాడుకునేందుకు విద్యార్థులు పోరాటం చేస్తున్నారు.న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్థులను.. పెయిడ్ బ్యాచ్ అని మంత్రులు మాట్లాడడం సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో పెయిడ్ బ్యాచ్ ముఖ్యమంత్రి,మంత్రులు. బ్లాక్ దందా వల్ల వచ్చిన పైసలతో పదవులు తెచ్చుకున్నారు. సమాజ శ్రేయసు కొరకు విద్యార్థులు పాటుపడుతారు. విద్యార్థులకు మద్దతుగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్తి చిదంబరం, నటుడు ప్రకాష్ రాజ్ పేమెంట్ బ్యాచ్ నా. కేసీఆర్ హరితహారం చేస్తే , కాంగ్రెస్ హరితసంహారం చేస్తుంది.కేసీఆర్ వనసంరక్షణ చేస్తే రేవంత్ రెడ్డి హరిత భక్షణ చేస్తున్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే హెచ్సీయూలో జరుగుతున్న పనులు ఆపొచ్చు. పోలీసులను బయటకు పంపొచ్చు. కాంగ్రెస్, బీజేపీలు నాటకం ఆడుతున్నాయి. వైస్ ఛాన్సలర్ పర్మిషన్ లేకుండా పోలీసులు ఎలా లోపటికి వెళ్తారు. డ్రోన్ కెమెరా ఎగరేస్తే 500 రూపాయలతో ఫైన్ వేయొచ్చు అని మాట్లాడిన రేవంత్ రెడ్డి. ఇవ్వాళ హెచ్సీయూ విద్యార్థులు డ్రోన్ ఎగరేశారని వారిని అరెస్ట్ చేసి కేసులు పెట్టారు.హెచ్సీయూ భూముల అమ్మక వ్యవహారం చీకటి దందాలో భాగమే.హెచ్సీయూ భూములను గురువు కోసం (చంద్రబాబు నాయుడు) అప్పనంగా రేవంత్ రెడ్డి చీకటి దందాకు తెరలేపారు. సేవ్ హెచ్సీయూ అని యూనివర్సిటీ విద్యార్థులకు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే 5 లక్షల మంది మద్దతు పలికారు. వారందరూ పెయిడ్ బ్యాచ్చేనా. హెచ్సీయూ భూములను అమ్మిన మూటల కోసమే రాహుల్ గాంధీ మౌనంగా ఉంటున్నారు.యూనివర్సిటీనీ గౌరవించే మా హయంలో రోడ్లు వెయ్యలేదు. కమిషన్ల కొరకు కక్కుర్తి పడి రైతుల జీవితాలతో , విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆరోపణలు గుప్పించారు. -
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్
సాక్షి,హైదరాబాద్: అర్హత ఆధారంగా ఎంతమందికైనా రేషన్కార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త రేషన్ కార్డ్లలో చిప్ ఉంటుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. కొత్త రేషన్ కార్డులో క్యూ ఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని, చిప్ ఉండదని స్పష్టం చేశారు.ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ లబ్ధి దారులకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంపై ఉత్తమ్ కుమార్రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘ ఏప్రిల్ 30న తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుంది. హుజూర్ నగర నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తున్నాం. తెలంగాణలో 85శాతం జనాభాకు సన్నబియ్యం అందబోతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవడానికి వీలుగా డ్రా సిస్టం అందుబాటులోకి తెస్తున్నాం. ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా అర్హతను ఆధారంగా ఇస్తున్నాం.కొత్తగా ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారుల లిస్ట్లో ఉంటే చాలు ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం ఇస్తాం. తెలంగాణ ఏర్పాటు నాటికి 89లక్షల 73వేల 708 కార్డులు ఉంటే.. గత పదేళ్ళలో 49వేల 479 కొత్త కార్డులు ఇచ్చారు. 90లక్షల రేషన్ కార్డులు. 2.85 కోట్ల లబ్దిదారులు ప్రస్తుతం ఉన్నారు.రూ.10665 కోట్ల నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఖర్చు చేస్తున్నాయి. త్వరలోనే బియ్యంతో పాటు పప్పు, ఉప్పులాంటి వస్తువులు ఇస్తాం. ఉగాది రోజు సీఎం రేవంత్రెడ్డి సన్న బియ్యం కార్యక్రమం ప్రారంభిస్తారు. కొత్త రేషన్ కార్డులో క్యూ ఆర్ కోడ్ మాత్రమే ఉంటుంది. చిప్ ఉండదు. రేషన్ కార్డుపై ప్రధాని ఫోటోపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 30లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వం చేయనుంది’అని అన్నారు. -
అదంతా దుష్ప్రచారం.. నా మీద ప్రజలకు కోపమా?
సాక్షి,హైదరాబాద్: నా మీద వ్యతిరేకత వచ్చిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. అభివృద్ది చేసినందుకే నాపై ప్రజలు కోపంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో కొలువుల పండగ కార్యక్రమం నిర్వహించింది. పంచాయితీరాజ్, గ్రామీణభివృద్ధి శాఖలో కార్యుణ నియామకాల్ని చేపట్టింది. ఎంపికైన 922 మందికి కారుణ్య నియామక పత్రాలు అందించింది.ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. గత పాలకులు పదేళ్లుగా ఈ నియామకాలు చేపట్టలేదు. కానీ తమ ప్రభుత్వం కారుణ్య నియామకాల్ని చేపట్టింది. నామీద వ్యతిరేకత వచ్చిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు నాపై కోపంగా ఎందుకు ఉంటారు? మహిళలకు ఉచిత బస్సు కల్పించినందుకా? నాపై కోపం..? ఉద్యోగాలు ఇచ్చినందుకా నాపై కోపం? రుణమాఫీ చేసినందుకా నాపై కోపం? 59వేల మంది ఉద్యోగాలు ఇచ్చినందుకా? నాపై కోపం అని ప్రశ్నించారు. అనంతరం, తెలిపారు. అనంతరం,బిల్డ్ నౌ పోర్టల్ను ఆవిష్కరించారు. -
‘భగీరథ’కు మరో రూ.1,350 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్కు మరో రూ.1,350 కోట్ల రుణమిచ్చేందుకు యునైటెట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకరించింది. గురువారం సచివాలయంలో పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్తో సమావేశమైన బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ బజాజ్.. వివిధ జిల్లాల్లో జరుగుతున్న భగీరథ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై చర్చించారు. మిషన్ భగీరథకు సాయమందించేందుకు దేశంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలు ముందుకు రావడం శుభ పరిణామమని స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్ అన్నారు. నాబార్డ్, హడ్కో వంటి సంస్థలు సహా 13 వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.28,938 కోట్ల పనులకు రుణ ఒప్పందం కుదిరిందన్నారు.