
దేశంలో బంగారం ధరలు (Gold Prices) అంతే లేకుండా దూసుకెళ్తున్నాయి. నేడు (April 17) మరింత భగ్గుమన్నాయి. వరుసగా రెండో రోజూ భారీగా పెరిగాయి. పసిడి ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.
నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 89,200 వద్ద, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 97,310 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.1050, రూ.1140 చొప్పున ఎగిశాయి.
దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.97,460 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.89,350 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.1140, రూ.1050 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.
👉ఇది చదివారా? ప్రత్యేక బ్యాంక్ స్కీమ్ నిలిపివేత
చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 89,200 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 97,310 వద్దకు చేరాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.1050, రూ.1140 చొప్పున పెరిగాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.
వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. క్రితం రోజుతో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,10,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 1,00,000 వద్దకు కొనసాగుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)