వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి యత్నం | BJYM Activists Tried To Attack YSRCP Office In Tadepalli | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి యత్నం

Published Sun, Sep 22 2024 12:52 PM | Last Updated on Sun, Sep 22 2024 7:10 PM

BJYM Activists Tried To Attack YSRCP Office In Tadepalli

వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తలు దాడికి యత్నించారు.

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తలు దాడికి యత్నించారు. రాళ్లు, రంగు డబ్బాలు విసిరిన బీజేవైఎం కార్యకర్తలు.. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులపై దాడికి యత్నించారు. సెక్యూరిటీ సిబ్బంది గదిని బీజేవైఎం కార్యకర్తలు ధ్వంసం చేశారు.

కాగా, చంద్రబాబు సర్కార్‌ వంద రోజుల వైఫల్యాలు, విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మకాలపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని కప్పి పుచ్చేందుకు కూటమి నేతలు డైవర్షన్ రాజకీయాలకు తెర తీస్తున్నారు.

 

ఇదీ చదవండి: ‘ఏపీలో రౌడీ రాజ్యం.. పరాకాష్టకు కూటమి అరాచకాలు’
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement