ప్రధాన వార్తలు

జైలు నుంచి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని విడుదల
గుంటూరు: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలయ్యారు. గుంటూరు జైలు నుంచి సోమవారం సాయంత్రం( జూన్ 16) ఆయన విడుదలయ్యారు. సాక్షి ఛానెల్ డిబేట్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అక్రమ కేసు బనాయించిన గుంటూరు తుళ్లూరు పోలీసులు.. కొమ్మినేనిని అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టుపై శుక్రవారం(జూన్ 13) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలంటూ బెయిల్ మంజూరు చేసింది. కాగా, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమమంటూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ పీకే మిశ్రా, జస్టిన్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం గత శుక్రవారం విచారణ జరిపింది. ‘‘టీవీ డిబేట్లో నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా?. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేమూ నవ్వుతుంటాం. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం?. ఆయన్ని వెంటనే విడుదల చేయండి’ అని సృష్టం చేసిన ద్విసభ్య ధర్మాసనం.. బెయిల్ను మంజూరు చేసింది.

జనగణన నోటిఫికేషన్ జారీ.. లెక్కల ప్రక్రియ ఇదే..
న్యూఢిల్లీ: దేశంలోని జనాభాను లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. దీనిలో భాగంగా ఈరోజు(జూన్ 16) జన గణనపై కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది(2026) అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనగణన చేపడతారు. 2027 మార్చి 1 నుంచి మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టబోతున్నారు. ప్రతీ రాష్ట్రంలోనూ రెండు దశల్లో జనాభా గణన చేపడతారు. ఆదివారం జనగణన కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. తదనంతరం జనాభా లెక్కలను గణించే తేదీలను ఖరారు చేశారు. జనగణనతో పాటు కులగణన చేయాలని ఇదివరకే కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.భారతదేశంలో జనాభా గణన 12 ఏళ్ల తరువాత జరుగుతోంది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో జరుగుతున్న జనగనణ పలు కీలక అంశాలను వెల్లడించనుంది. 1948 జనాభా గణన చట్టం ప్రకారం దీనిని నిర్వహించనున్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్, జనాభా గణన కమిషనర్ కార్యాలయం జనగణన ప్రక్రియను చేపట్టనుంది.జనాభా గణన రెండు ప్రధాన దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో గృహ జాబితా, గృహ గణన (2026) ఉంటుంది. దీనిలో జనాభాకు అందుబాటులో ఉన్న సౌకర్యాలతో పాటు శాశ్వత లేదా తాత్కాలిక గృహాల డేటాను సేకరిస్తారు. ఈ దశ సమగ్ర చిరునామా రిజిస్టర్ను రూపొందించేందుకు సహాయపడుతుంది. రెండవ దశలో వ్యక్తులకు సంబంధించిన వివరణాత్మక సమాచారం సేకరిస్తారు. అంటే పేరు, వయస్సు, లింగం, మతం, కులం, విద్య, వృత్తి, వలస మొదలైనవి నమోదు చేస్తారు.దేశంలో తొలిసారిగా జనాభా గణన డిజిటల్గా ఉండనుంది. ఇందుకోసం 16 భాషలలో కూడిన మొబైల్ యాప్లను వినియోగించనున్నారు. పౌరులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీయ గణనను కూడా ఎంచుకోవచ్చు. 2027 జనాభా గణనలో ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే కాకుండా ఓబీసీలు సహా అన్ని కుల సమూహాలను కవర్ చేసేలా కులగణన కూడా ఉండనుంది. ప్రభుత్వ విధాన రూపకల్పన, సంక్షేమ పథకాలు, నియోజకవర్గాల పునర్విభజన, వ్యాపార ప్రణాళికలకు జనగణన ఎంతగానో ఉపయోగపడనుంది.ఇది కూడా చదవండి: అమెరికా అతలాకుతలం.. వాతావరణ మార్పుతో వరద బీభత్సం

విశ్వాస్ కుమార్ రమేష్ నిజంగా మృత్యుంజయుడే.. మరో వీడియోలో
గాంధీ నగర్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్కు చెందిన మరో వీడియో వైరల్గా మారింది. తాజాగా, వెలుగులోకి వచ్చిన వీడియోలో బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ బిల్డింగ్ను ఎయిరిండియా విమానం ఢీకొట్టడంతో అగ్నికిలలు ఎగిసిపడున్నాయి. ఆ ప్రాంతాన్ని పొగ కమ్మేసింది. ఏదో అద్భుతం జరిగినట్లుగా అగ్నికోళం బద్దలైనప్పుడు మంటలు ఏ విధంగా ఎగిసిపడతాయో.. ఆ విధంగా మంటలు ఎగిసిపడుతున్నా 11ఏ సీటులో కూర్చున్న రమేష్, బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ నుండి బయటకు వస్తూ కనిపిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి అతన్ని గమనించి, అతని చెయ్యి పట్టుకుని ప్రమాదం స్థలం నుంచి దూరంగా తీసుకెళ్లాడు.ఏప్రిల్ 12న అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ బిల్డింగ్ను ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ ఢీకొట్టింది. ఈపెను విషాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242మందిలో మృత్యుంజయుడు ఒక్కడే సురక్షితంగా బయటపడ్డాడు.తాజా సమాచారం మేరకు ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది, మెడికల్ కాలేజీ క్యాంపస్ బాధితులతో కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది.ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడతో మృతదేహాల్ని గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. బాధితుల కుటుంబ సభ్యుల డీఎన్ఏల ఆధారంగా మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. Unbelievable! New video of lone survivor, Viswashkumar Ramesh has emerged, showing him walking out from the crash site.He is seen wearing a white t-shirt and holding his phone in left hand.#AirIndia #AhmedabadPlaneCrash pic.twitter.com/xV83t2yjGX— Ishani K (@IshaniKrishnaa) June 16, 2025

Air India: ఇంక ముందుకు వెళ్లడం మంచిది కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది!. మార్గం మధ్యలో ఈ విషయాన్ని పసిగట్టిన పైలట్.. వెంటనే అప్రమత్తం అయ్యారు. విమానాన్ని గమ్యస్థానానికి తీసుకురాకుండానే వెనక్కి తీసుకెళ్లి హాంకాంగ్లోనే ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఢిల్లీకి చెందిన ఎయిరిండియా విమానం ఏఐ 315 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ప్రయాణికులతో(ఎంత మంది అనేది తెలియాల్సి ఉంది) ఈ ఉదయం హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది. అయితే 90 నిమిషాల ప్రయాణం తర్వాత.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. 🇮🇳🇭🇰🛫🛬🇭🇰Air India 315 requested to stay closer to Hong Kong citing technical reasons before deciding to return to HKIA."We don't want to continue further". 🔊 via https://t.co/E8ftHE3i9y📽️ via @flightradar24 https://t.co/XJjqSO9Lll pic.twitter.com/qWq3iXuVRW— Aaron Busch (@tripperhead) June 16, 2025ఇంకా ముందుకు వెళ్లడం కుదరదు అని చెబుతూ.. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. చివరకు అక్కడే(హాంకాంగ్ ఎయిర్పోర్టులో) ల్యాండ్ చేశారు. విమానంలో హాంకాంగ్ నుంచి ఢిల్లీకి సుమారు 6గంటల ప్రయాణం పడుతుంది. పైలట్ మాటలకు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. 🇮🇳 🇭🇰 🛫 🛬 🇭🇰 Air India 315 from Hong Kong to Delhi diverted back to Hong Kong after takeoff on Monday.The plane departed 3hrs and 26 minutes delayed, then returned to Hong Kong roughly an hour after takeoff. The flight was on a 7 year old Boeing 787-8 Dreamliner. pic.twitter.com/kTNvlcfMFV— Aaron Busch (@tripperhead) June 16, 2025ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టెక్నికల్ టీం సమస్యను గుర్తించే పనిలో ఉంది. ఈ ఘటనపైగానీ, విమానాన్ని రీషెడ్యూల్ చేయడంపైనగానీ ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం భారత్లో ఎయిరిండియాతో పాటు ఇండిగో విమానయాన సంస్థ బోయింగ్ 787 విమానాలను ఉపయోగిస్తోంది. 2025 గణాంకాల ప్రకారం.. ఎయిరిండియా 33 డ్రీమ్లైనర్ విమానాల్ని ఉపయోగిస్తోంది. అయితే జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా విమానయాన సంస్థ వరుస ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. ఆ కంపెనీ బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. అలాగే బాంబు బూచీ నేపథ్యంలోనే పలు విమానాల రాకపోకల్లో అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యాలతో.. అన్ని బోయింగ్ విమానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయించింది.

లైకులు, వ్యూస్ కోసం ఇంత దిగజారాలా?
ఒకవైపు.. ఘోర ప్రమాదంలో అయినవాళ్లను కోల్పోయి పుట్టెడు దుఖంలో బాధిత కుటుంబాలు రోదిస్తున్నాయి. డీఎన్ఏ పరీక్షలు పూర్తి కాకపోవడంతో మృతదేహాల కోసం బీజే మెడికల్ కాలేజీ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్నాయి. ఈలోపు.. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారు. మృతుల గురించి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.కొమ్మి వ్యాస్.. తన భార్య, ముగ్గురు పిల్లలతో లండన్లో స్థిరపడేందుకు ఎయిరిండియా విమానం ఎక్కడిన డాక్టర్. అయితే అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదంలో ఆ కుటుంబం మొత్తం దుర్మరణం పాలైంది. ఇప్పుడు.. ఆ ఫ్యామిలీని బద్నాం చేస్తూ కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమానం ఎక్కిన తర్వాత ఫ్యామిలీ ఫొటోను వ్యాస్ తన కుటుంబానికి చెందిన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. అయితే ఆ ఫొటోను ఏఐ వీడియోగా కొందరు వైరల్ చేస్తున్నారు. మరికొందరు.. ఒక అడుగు ముందుకు వేసి వ్యాస్ కూతురు మిరాయ ఫొటోను, ఓ వీడియోను తెరపైకి తీసుకొచ్చారు. ‘‘మా కుటుంబాన్ని కోల్పోయామన్న బాధలో మేముంటే.. కొందరు విలువలు మరిచి ప్రవర్తిస్తున్నారు. ఎడిట్ చేసిన వీడియోను వైరల్ చేస్తున్నారు. మా పాప మిరాయ్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. డీఎన్ఏ టెస్టులో ఏ మృతదేహం అనేది దృవీకరణ కాలేదు. కానీ.. ఈలోపే మిరాయ్ అంత్యక్రియలంటూ భావోద్వేగం పేరిట ఓ వీడియోను పోస్ట్ చేసి కొందరు వ్యూస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాగేనా చేసేది?’’ అంటూ వ్యాస్ కుల్దీప్ భట్ ఆవేదన-అసహనం వ్యక్తం చేశారు. వ్యాస్ కుటుంబం మాత్రమే కాదు.. బాధిత కుటుంబాలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి కంటెంట్ను ఖండిస్తోంది. సంబంధం లేని వీడియోలు, కంటెంట్ను తెర మీదకు తీసుకొచ్చి షేర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ప్రమాదం జరిగిన నాటి నుంచే ఇలాంటి కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడెక్కడివో వీడియోలను తెచ్చి.. ఎయిరిండియా విమానంలోవి అంటూ పోస్టులు పెడుతున్నారు. మా వాళ్లకు ఏమాత్రం సంబంధం లేని పోస్టులు ఇన్స్టాగ్రామ్, ఎక్స్(ట్విటర్)లలో కనిపిస్తున్నాయి. వీటి ఆధారంగా మీడియా సంస్థలు కూడా వార్తలు ప్రచురిస్తున్నాయి. అసలేం చేస్తున్నారు?. ఇలాంటి విషాద సమయంలోనూ కనీస నైతిక విలువలు పాటించరా?’’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విమాన ప్రమాదంపైనా జోకులు, మీమ్స్ వేస్తున్న పరిస్థితి. ఈ తరుణంలో.. ప్రభుత్వాలైన స్పందించి అలాంటి కంటెంట్ను కట్టడి చేయాలని కోరుతున్నారు మరికొందరు.

మారుమూల గ్రామాల్లోని యువతకు టెక్ శిక్షణ.. నెక్స్ట్ వేవ్ & ఎన్ఎస్డిసి కృషితో కొత్త అధ్యాయం
ఉత్తరప్రదేశ్ బాగ్పత్ జిల్లాలోని ఛప్రాలి అనే గ్రామంలో యువతకు కొత్త భవిష్యత్తు చూపిస్తూ ఒక పెనుమార్చు తెచ్చే విద్యా కార్యక్రమం మొదలైంది. నెక్స్ట్ వేవ్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) కలసి గ్రామీణ ఉత్తరప్రదేశ్లో టెక్ స్కిల్స్ నేర్పే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ అఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంట్రప్రైన్యూర్షిప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో గ్రామీణ మహిళా యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని చప్పాలిలోని చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌదరి గారు ప్రారంభించారు. అక్కడే “ఫ్యూచర్ స్కిల్ ల్యాబ్” పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కిల్ ఇండియా సెంటర్లో ఆధునిక టెక్నాలజీలపై ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు. అక్కడి యువతలో మార్చు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అక్కడ జాయిన్ అయిన విద్యార్థుల్లో చాలా మంది కంప్యూటర్ ఎప్పుడూ వాడలేదు. మొదటి రోజు ల్యాప్ టాప్ ఆన్ చేయడం, కీబోర్డ్ ఎలా వాడాలో నేర్పించారు. ఇప్పుడు చూస్తే వారు వెబ్ యాప్స్ రూపొందించడం మొదలు పెట్టి టెక్ రంగంలో కెరీర్ దిశగా అడుగులు వేస్తున్నారు.ఇక్కడ గమనించాల్సిన ఒక గొప్ప విషయం ఈ విద్యార్థుల పరిస్థితులు. వీళ్లంతా రైతు కుటుంబాల నుంచి వచ్చారు. ఉదయం 4 గంటలకే లేచి ఇంటి పనులు, పొలంలో పనులు పూర్తి చేసి, 5నుంచి 10 కిలోమీటర్లు నడిచి స్కిల్ సెంటర్కు వస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్లాసులు అటెండ్ అవుతారు. తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లి వంట పనులు, ఇల్లు చూసుకోవాలి. అయినా 4.0 టెక్నాలజీస్ ను పట్టుదలతో నేర్చుకుంటున్నారు.ఒకప్పుడు బిడియంగా ఉంటూ ఎవరితోనైనా మాట్లాడాలంటే ఇబ్బంది పడే స్వాతి ఖోకర్ ఇప్పుడు కెరీర్ వైపు ధైర్యంగా ముందుకు అడుగులేస్తోంది. తండ్రిని కోల్పోయిన తర్వాత కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. ప్రస్తుతం కోడింగ్ నేర్చుకుంటూ, తాను మాత్రమే కాదు, తన వయసు అమ్మాయిలందరికీ ఆదర్శంగా మారింది.నెక్స్ట్ వేవ్ సీఈవో రాహుల్ అత్తులూరి మాట్లాడుతూ, “లక్షలాది మంది విద్యార్థులకు టెక్నాలజీ స్కిల్స్ నేర్పించడమే మా లక్ష్యం. వాళ్లు చక్కగా స్కిల్స్ నేర్చుకుని, మంచి కెరీర్ నిర్మించుకోవాలి. తమ కుటుంబాలు, దేశానికి ఉపయోగపడేలా ఎదగాలి. ఈ రోజు టెక్నాలజీలకే కాదు, రేపటి భవిష్యత్తుకి కూడా సిద్ధంగా ఉండేలా మేము తయారుచేస్తున్నాం” అన్నారు.మొదట్లో వాళ్ళ పిల్లలు నేర్చుకోగలరా అని ఈ ప్రోగ్రాం పట్ల సందేహంగా ఉన్నతల్లిదండ్రులే ఇప్పుడు పెద్ద ఎత్తులో మద్దతు ఇస్తున్నారు. తమ పిల్లలు కోడ్ రాయటం, వెబ్ యాప్లు రూపొందించటం, నేర్చుకున్న విషయాల గురించి ధైర్యంగా మాట్లాడటం చూసి వాళ్ల నమ్మకాలే మారిపోయాయి. ఈ స్కిల్ సెంటర్ పై చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే తదుపరి బ్యాచ్లో చేర్చుకోమని 25 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయం ప్రిన్సిపాల్ డా. ప్రతీత్ దహియాకు ఇది ఒక పెద్ద లక్ష్యానికి మొదటి అడుగులాగా కనిపిస్తోంది. “ఈ కళాశాల భారత రత్న చౌదరి చరణ్ సింగ్ గారి పేరు మీద ఉంది,” అని చెప్పారు. “ఆయన ఎప్పుడూ దేశం అభివృద్ధి బాటలో సాగాలంటే అది గ్రామాల నుంచి జరగాలి” అని చెప్పేవారు. గ్రామీణ పిల్లలకు టెక్నాలజీ స్కిల్స్ ఉండాలన్నది ఆయన కల. ఇప్పుడు ఆ కల నిజమవుతుండడం ఆనందంగా ఉంది.”గ్రామీణ భారతంలో పాత పద్ధతుల విద్యపై ఆదరణ తగ్గుతూ, స్కిల్స్తో కూడిన ప్రాక్టికల్ లెర్నింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఆ మార్పునే ఈ ప్రోగ్రామ్ ప్రతిబింబిస్తోంది. నెక్స్ట్ వేవ్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ విద్యార్థులకు కోడింగ్ మాత్రమే కాకుండా, కమ్యూనికేషన్, టీం వర్క్, సమస్యల పరిష్కారం, ప్రాజెక్ట్ ప్రాక్టీస్ ఇలా ఇండస్ట్రీ కి అవసరమైన అనేక నైపుణ్యాలు నేర్పిస్తోంది. భాష సమస్యను ఎదుర్కొంటున్న విద్యార్థులకు మెంటర్లు ఏఐ టూల్స్ ద్వారా వర్ణాక్యులర్ సపోర్ట్ ఇవ్వడమూ ఓ పెద్ద ముందడుగు.కేవలం 6 నెలల్లోనే ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాలు పొందడం వల్ల, గ్రామీణ యువతలో ఎంత వేగంగా టాలెంట్ వెలికి తీయవచ్చో స్పష్టమవుతోంది. మొదట్లో కేవలం 30 మంది విద్యార్థులతో ప్రారంభమైన ప్రోగ్రాం, ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలనంతా తాకుతోంది. NSDC, స్థానిక నేతల మద్దతుతో నగరాల్లో మాత్రమే ఉండే అవకాశాల్ని గ్రామీణ యువతకు అందించేందుకు నెక్స్ట్ వేవ్ వేగంగా ముందుకెళ్తోంది. అవకాశం దరిచేరదు అనిపించిన గ్రామాల్లో ఇప్పుడు కొత్త ఉద్యమం మొదలైంది. ఈ కార్యక్రమం కేవలం శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, విద్యార్థులలో, కుటుంబాల్లో, గ్రామీణ భారత్ భవిష్యత్తు నిర్మాణం చేయగలదు అన్న విశ్వాసాన్ని మళ్లీ చేకూర్చడం దీని అసలైన లక్ష్యం.NxtWave Institute of Advanced Technologiesకపిల్ కావురి హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, తెలంగాణ, 500032

ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ
కేటీఆర్ ఏసీబీ విచారణ అప్డేట్స్.. ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణఫార్ములా ఈ కారు రేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణహెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగంపై ఏసీబీ అధికారుల ప్రశ్నలుఏడుగంటల పాటు సాగిన విచారణఎఫ్ఈవో కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్కు ఏసీబీ ప్రశ్నలుకేబినెట్ ఆమోదం లేకుండా నిధులు ఎందుకు మళ్లించారని విచారణ కేటీఆర్ స్టేట్మెంట్ణు రికార్డ్ చేసిన ఏసీబీ అధికారులుఅవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని కేటీఆర్కు సూచన కేటీఆర్ ఏసీబీ విచారణపై కవిత ఆసక్తిర వ్యాఖ్యలు కేటీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్దతుఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది.ఏసీబీ విచారణపై కవిత స్పందించారు‘ఏ పార్టీలోనైనా లోపాలు ఉన్నప్పుడు అధినేతకు చెప్పుకోవడం సహజంచెప్పుకున్నంత మాత్రానా దాన్నేదో భూతద్దంలో చూపించాల్సి అవసరం లేదుమా పార్టీలో లోపాలు సవరించుకుంటాంమా మీద ఎవరైనా దాడి చేస్తే ఊరుకోంప్రధాన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ఏసీబీ విచారణలు అంటూ హడావిడిమా కార్యకర్తలను, నేతలను ఇళ్లకు రాకుండా అడ్డుకోవడం దారుణం కేటీఆర్ను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు. గంటలకు పైగా కేటీఆర్పై ప్రశ్నం వర్షం. కేటీఆర్ విచారణ ప్రారంభం..ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మొదలైన కేటీఆర్ విచారణ.కేటీఆర్ను ప్రశ్నిస్తున్న ఐఓ ఆఫీసర్ మాజీద్ ఖాన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతూ రాజ్, డైరెక్టర్ తరుణ్ జోషి.ఏసీబీ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం పరిసరాల్లో భారీగా మొహరించిన బీఆర్ఎస్ శ్రేణులు.ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కొనసాగుతున్న విచారణ..IAS అరవింద్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీ..FEOతో ఒప్పందాలు నగదు, బదిలీ అంశాలపై ప్రశ్నిస్తున్న ఏసీబీ..క్యాబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు.ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణం ఏంటి?బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపై ప్రశ్నిస్తున్న ఏసీబీ..ఇప్పటికే సేకరించిన పత్రాలు ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీ..Feo కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నిస్తున్న ఏసీబీ. కేటీఆర్తో నలుగురి బృందం.. కేటీఆర్తో ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న నలుగురు బృందం...న్యాయవాది రామచందర్ రావు, మహేందర్ రెడ్డి, తిరుపతి, మరో న్యాయవాది.10.30 గంటలకు మొదలు కానున్న కేటీఆర్ ఏసీబీ విచారణ..ఏసీబీ ఆఫీస్కు కేటీఆర్ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్కేటీఆర్ వెంట అడ్వొకేట్ రామచందర్రావుఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ను విచారించనున్న ఏసీబీతెలంగాణ భవన్ నుంచి ఏసీబీ ఆఫీస్కు బయల్దేరిన కేటీఆర్కాసేపట్లో ఏసీబీ ఆఫీస్కు కేటీఆర్ఈ-రేస్ కేసులో విచారణకు హాజరు కానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ఎఫ్ఈవో కంపెనీకి రూ. 54.88 కోట్లు బదిలీ చేయడంపై విచారణఇప్పటికే ఏసీబీ అధికారుల లోతైన దర్యాప్తుఅక్రమ కేసులకు భయపడం: కేటీఆర్అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారుఆరు నెలల నుంచి విచారణ జరుపుతున్నారు.. ఏం తేల్చారు?అవసరమైతే అరెస్టు కూడా చేస్తారు కావొచ్చుచట్టాలు, కోర్టులపై మాకు గౌరవం ఉందిమూడు సార్లు కాదు.. 30 సార్లు పిలిచినా విచారణకు వస్తాఅక్రమ కేసులకు భయపడంఅరెస్ట్ చేసినా వెనక్కి తగ్గంజైలు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాంలై డిటెక్టర్కు కూడా నేను సిద్ధం కాంగ్రెస్, బీజేపీవి దొంగాటలుడైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ కేసులురైతు బంధును.. ఎలక్షన్ బంధుగా మార్చేశారు420 గ్యారెంటీలు, హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటాం లక్షలాది మంది కేసీఆర్ సైనికులను అడ్డుకోలేరుతెలంగాణభవన్ చేరుకున్న కేటీఆర్కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు.తెలంగాణభవన్ వద్ద భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలుతెలంగాణ భవన్కు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు.కేసీఆర్తో కేటీఆర్ భేటీ..నందిని నగర్ నివాసంలో కేసీఆర్తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు..తాజా పరిస్థితులపై చర్చ..మరికాసేపట్లో తెలంగాణ భవన్ కు రానున్న కేటీఆర్, హరీష్ రావు.. కాసేపట్లో తెలంగాణ భవన్కు కేటీఆర్.. కోకాపేటలో తన నివాసం నుండి తెలంగాణ భవన్కు బయలుదేరిన కేటీఆర్..మరికాసేపట్లో తెలంగాణ భవన్కు చేరుకోనున్న కేటీఆర్..10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్..బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల ఆంక్షలు..భారీగా మోహరించి పోలీసులు..ఏసీబీ ఆఫీస్ ముందు 400 మంది పోలీసు బందోబస్తు..ఏసీబీ కార్యాలయం ఎవరిని అనుమతించని పోలీసులు👉తెలంగాణలో ఫార్ములా-ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు రానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.👉మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. కాంగ్రెస్ పార్టీ విచారణలు, కమిషన్ల వలన, రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేదేలేదు. మీ ఆరు గ్యారెంటీల అమలు మోసాన్ని ఎండబెట్టడంలో ఇవేవీ మమ్మల్ని ఆపలేవు. ఎన్ని కుట్రలు చేసినా భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో, డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు చేసిన దగాను ఎండగడుతూనే ఉంటాం. ఎన్ని కుట్రలైనా చేసుకో రేవంత్ రెడ్డికి సవాల్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.I will never be deterred by your enquiries, commissions and political vendettaWe @BRSparty will continue to expose the Hollowness of #420 promises, Deceptive declarations and never to be trusted Six Guarantees Bring it on Revanth 👍 pic.twitter.com/yFUOXmoeoP— KTR (@KTRBRS) June 16, 2025👉ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ జనవరి 9వ తేదీన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. నాడు దాదాపు ఆరున్నర గంటల పాటు కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించారు. తన లాయర్ రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.

ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముందు సంచలన విషయాన్ని బయటపెట్టిన కరుణ్ నాయర్
ఇంగ్లండ్తో తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు (జూన్ 20) టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. మెయిల్ స్పోర్ట్ అనే ప్రముఖ మేగజైన్తో మాట్లాడుతూ.. ఓ బాంబు లాంటి వార్త చెప్పాడు.కరుణ్ మాటల్లో.. నాకు ఇప్పటికీ గుర్తుంది. రెండేళ్ల క్రితం టీమిండియాలో స్థానం కోసం పరితపిస్తున్న రోజులవి. ఆ సమయంలో ఓ అగ్రశ్రేణి భారత క్రికెటర్ నాకు ఫోన్ చేసి రిటైర్మెంట్ ప్రకటించమని సలహా ఇచ్చాడు. ప్రైవేట్ టీ20 లీగ్ల్లో చాలా డబ్బు వస్తుందని చెప్పడమే అతని ఉద్దేశం. అలా చేసి ఉండటం చాలా సులభం. కానీ నేను భారత క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చే ఏ విషయంలోనూ రాజీ పడదలచుకోలేదు. ఆ రోజు నేను డబ్బు గురించి ఆలోచించి ఉంటే ఈ రోజు ఇక్కడ (ఇంగ్లండ్లో) ఉండే వాడిని కాదు.టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలన్న ధృడమైన లక్ష్యంతో ఆ రోజు ఆ ప్రముఖ క్రికెటర్ సలహాను పెడచెవిన పెట్టిన కరుణ్.. రెండేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు టీమిండియాలో చోటు సాధించాడు. 2023లో కర్ణాటక నుండి విదర్భకు మారడం (దేశవాలీ క్రికెట్లో) కరుణ్ అదృష్టాన్ని మార్చేసింది.గత రెండు దేశవాలీ సీజన్లలో 1500కు పైగా పరుగులు సాధించిన కరుణ్ (విదర్భ).. టీమిండియా తలుపులు తట్టాడు. గత రంజీ సీజన్లో అసాధారణ ప్రదర్శన (53.93 సగటున 863) కనబర్చి విదర్భ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మధ్యలో ఇంగ్లండ్ కౌంట్లీలోనూ ఆడిన కరుణ్ అక్కడ కూడా సత్తా చాటాడు. రెండు సీజన్లలో నార్తప్టంన్షైర్ తరఫున 56.61 సగటున 736 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది.నాయర్ తాజాగా ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో కూడా డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. విరాట్ కోహ్లి టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానానికి కరుణ్ సరైన అర్హుడని కొందరు భావిస్తున్నారు. 2018లో టీమిండియా తరఫున చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన కరుణ్.. దాదాపు ఏడేళ్ల తర్వాత 33 ఏళ్ల వయసులో రీఎంట్రీ ఇవ్వడం ఆసక్తికర పరిణామం. కరుణ్ తన చిన్నపాటి టెస్ట్ కెరీర్లోనే ట్రిపుల్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. కరుణ్ చేసిన ఆ ట్రిపుల్ సెంచరీ ఇంగ్లండ్పైనే కావడం విశేషం.ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టు..శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్

ఇరాన్కు ‘అణు’ సాయం.. నాలుక మడతేసిన పాక్
ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట తమపై ఇజ్రాయెల్ అణ్వాయుధాలు ఉపయోగిస్తే.. మద్దతుగా పాకిస్తాన్ అణు దాడులకు దిగుతుందని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) కమాండర్ జనరల్ మొహ్సెన్ రెజాయ్ స్వయంగా ఈ ప్రకటన చేయడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ ప్రకటనపై ఇప్పుడు పాక్ యూటర్న్ తీసుకుంది.ఇజ్రాయెల్ తమపై అణుబాంబును ప్రయోగిస్తే.. పాకిస్థాన్ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ జనరల్, ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ మొహ్సెన్ రెజాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రభుత్వం నడిపించే ఓ టీవీ చానెల్తో ఆయన మాట్లాడుతూ. ‘‘ఇజ్రాయెల్ మాపై అణు దాడి చేస్తే.. ఇస్లామాబాద్(పాక్) కూడా టెల్అవీవ్పై అణుబాంబును ప్రయోగిస్తుందది. ఈ మేరకు పాక్ నుంచి స్పష్టమైన హామీ లభించింది’’ అని మొహసిన్ వెల్లడించారు.అంతేకాదు.. తుర్కియే, సౌదీ, పాకిస్థాన్ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటుచేయాలని మొహసిన్ అన్నారు. కానీ, ఆయా దేశాలు ఇరాన్ యూనిఫామ్ వేసుకోవడానికి సిద్ధంగా లేవన్నారు. వీటిల్లో ఒక్క దేశమైనా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయన్నారు. అబ్బే.. అలా అనలేదుఇరాన్ ఇచ్చిన ప్రకటనను పాక్ ఖండిచింది. తాము అలాంటి కమిట్మెంట్ ఏదీ ఇవ్వలేదని పాకిస్తాన్ రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయినప్పటికీ ఇరాన్కు తమ విస్తృత మద్దతు ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్ని పాక్ ఇదివరకే ఖండించింది. యూదు దేశం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్కు తాము మద్దుగా నిలుస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ జూన్ 14వ తేదీన పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రకటించారు. ఇరాన్, యెమెన్, పాలస్తీనాలకు ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికైనా ఇస్లాం దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆ దేశాలకు పట్టిన గతే రేపు మనకూ పడుతుంది. ఓఐసీ(Organisation of Islamic Cooperation) దేశాలు ఇజ్రాయెల్ దాడులపై వ్యూహరచన కోసం ఓ సమావేశం నిర్వహించాల్సి ఉంది’’ అని ఖ్వాజా చేసిన వ్యాఖ్యలను తుర్కియే టుడే ప్రముఖంగా ప్రచుచురించింది. భగ్గుమన్న పశ్చిమాసియాఇరాన్ నుంచి ప్రపంచ దేశాలకు అణు ముప్పు పొంచి ఉందని, ఇప్పటికే కీలక పరీక్షలు నిర్వహించిందని చెబుతూ ఆపరేషన్ రైజింగ్ లయన్(Operation Rising Lion) పేరిట ఇజ్రాయెల్ దాడులకు దిగింది. అయితే ఇరాన్ ఆ ఆరోపణలను ఖండిస్తోంది. ప్రతిగా.. ఇజ్రాయెల్పైనా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ ఉద్రిక్తతలతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ప్రపంచంలో ప్రస్తుతం అణ్వాయుధాలున్న దేశాల్లో ఇజ్రాయెల్, పాకిస్థాన్ స్థానం దక్కించుకొన్నాయి. ఈ జాబితాలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, భారత్, ఉత్తర కొరియా కూడా ఉన్నాయి.

కేటీఆర్ ఏసీబీ విచారణపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్దతుగా నిలిచారు.ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఏసీబీ విచారణపై కవిత స్పందించారు. కేటీఆర్ను ఏసీబీ విచారణపై కవిత మీడియాతో మాట్లాడారు. ‘ఏ పార్టీలోనైనా లోపాలు ఉన్నప్పుడు అధినేతకు చెప్పుకోవడం సహజం. చెప్పుకున్నంత మాత్రానా దాన్నేదో భూతద్దంలో చూపించాల్సి అవసరం లేదు. మా పార్టీలో లోపాలు సవరించుకుంటాం. మా మీద ఎవరైనా దాడి చేస్తే ఊరుకోం. ప్రధాన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ఏసీబీ విచారణలు అంటూ హడావిడి. మా కార్యకర్తలను, నేతలను ఇళ్లకు రాకుండా అడ్డుకోవడం దారుణం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమేరైతు భరోసా ఇచ్చింది. అది కూడా 60 శాతం మంది రైతులకే ఇచ్చింది. మిగిలిన 40 శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. నిరుడు యాసంగిలో ఇచ్చినట్టు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకే భరోసా ఇస్తారా. రైతులందరికీ ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకి ఎన్నో హామీలిచ్చి అందరినీ మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రైతు భరోసా సహా అన్ని హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసింది.పింఛన్లు పెంచలేదు.. మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు.. ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ ఎగవేసింది. హామీల అమలు పై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు లకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోంది. మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ను విచారించింది. ఇప్పుడు కేటీఆర్ను ఏసీబీ విచారిస్తోంది. మేం వేధింపులకు భయపడే వాళ్ళం కాదు.. కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం తెలంగాణ భవన్ తాళం వేయడం దుర్మార్గం. మా కార్యకర్తలు, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణం. మా పార్టీ లోపాలను సవరించుకుంటాం.. మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటాం’ అని వాఖ్యానించారు.
జైలు నుంచి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని విడుదల
శ్రీలీల బర్త్ డే సెలబ్రేషన్స్.. బ్లాక్ శారీలో ఈషా వావ్!
విశ్వాస్ కుమార్ రమేష్ నిజంగా మృత్యుంజయుడే.. మరో వీడియోలో
‘రేవంత్ నీ ఉడత ఊపులకు భయపడను’: కేటీఆర్
బిగ్బాస్ నుంచి మరో హీరో.. పోస్టర్ లాంచ్
చేతులు కాలినంక ఆకులు పట్టిన చందంగా ఉంది: హరీష్రావు
'అతడేమి తప్పు చేశాడని ఇంగ్లండ్ టూర్కు ఎంపిక చేయలేదు'
కూతురి పెళ్లి.. డ్యాన్స్ ఇరగదీసిన డైరెక్టర్ మురగదాస్
బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్.. పదే పదే కుదరదు
అమెరికాలో ఎమ్మెస్ టాపర్గా తెలుగమ్మాయి
విమానం కూలిపోలేదు కావాలనే కూల్చేశారు!!
డ్యాన్స్ మాస్టర్ కోసం వెళ్లిన రోజా, మీనా, రంభ, దేవయాని (ఫోటోలు)
అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!
‘స్కై లవ్స్ హర్’.. ఇక కనిపించదు.. ఎయిర్ హోస్టెస్ విషాదాంతం
రామ్ చరణ్-ఉపాసన వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ (ఫొటోలు)
నేనే రెండు కోట్లిస్తా.. నా తండ్రిని ప్రాణాలతో తెస్తారా?
ఏపీలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి.. ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
కానీ.. ప్రపంచంలో ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నా చూస్తూ ఎంజాయ్ చేస్తాం అంతేగా సార్!
బీజేపీలోకి స్వప్న?
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.64% పెంపు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా సౌతాఫ్రికా..
'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్కు అర్చకుల సూచన
విజయవాడలో వెడ్డింగ్ రిసెప్షన్లో చరణ్ దంపతులు (ఫొటోలు)
వచ్చే ఎన్నికల్లో నేను.. నా కోడలు పోటీచేస్తాం
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ధనలాభం
తక్కువ మార్కులకే మంచి ర్యాంకులు
అమెరికా వ్యాప్తంగా ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు
వివాదంలో డీఎస్పీ సతీమణి.. పార్టీ ఇలా కూడా చేసుకుంటారా?
జైలు నుంచి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని విడుదల
శ్రీలీల బర్త్ డే సెలబ్రేషన్స్.. బ్లాక్ శారీలో ఈషా వావ్!
విశ్వాస్ కుమార్ రమేష్ నిజంగా మృత్యుంజయుడే.. మరో వీడియోలో
‘రేవంత్ నీ ఉడత ఊపులకు భయపడను’: కేటీఆర్
బిగ్బాస్ నుంచి మరో హీరో.. పోస్టర్ లాంచ్
చేతులు కాలినంక ఆకులు పట్టిన చందంగా ఉంది: హరీష్రావు
'అతడేమి తప్పు చేశాడని ఇంగ్లండ్ టూర్కు ఎంపిక చేయలేదు'
కూతురి పెళ్లి.. డ్యాన్స్ ఇరగదీసిన డైరెక్టర్ మురగదాస్
బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్.. పదే పదే కుదరదు
అమెరికాలో ఎమ్మెస్ టాపర్గా తెలుగమ్మాయి
విమానం కూలిపోలేదు కావాలనే కూల్చేశారు!!
అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!
‘స్కై లవ్స్ హర్’.. ఇక కనిపించదు.. ఎయిర్ హోస్టెస్ విషాదాంతం
నేనే రెండు కోట్లిస్తా.. నా తండ్రిని ప్రాణాలతో తెస్తారా?
కానీ.. ప్రపంచంలో ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నా చూస్తూ ఎంజాయ్ చేస్తాం అంతేగా సార్!
బీజేపీలోకి స్వప్న?
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.64% పెంపు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా సౌతాఫ్రికా..
'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్కు అర్చకుల సూచన
వచ్చే ఎన్నికల్లో నేను.. నా కోడలు పోటీచేస్తాం
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ధనలాభం
తక్కువ మార్కులకే మంచి ర్యాంకులు
అమెరికా వ్యాప్తంగా ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు
‘తండ్రి’కి వందనం
వివాదంలో డీఎస్పీ సతీమణి.. పార్టీ ఇలా కూడా చేసుకుంటారా?
బతికుండగానే శ్మశానవాటికకు..
WTC ఛాంపియన్ దక్షిణాఫ్రికాకు ప్రైజ్మనీ ఎన్ని కోట్లంటే?
చరిత్ర సృష్టించిన టెంబా బావుమా.. తొలి కెప్టెన్గా
సినిమా

'ది రాజా సాబ్పై నెగెటివ్ క్యాంపెయిన్'.. నిర్మాత ఎస్కేఎన్ షాకింగ్ కామెంట్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ది రాజా సాబ్'. రొమాంటిక్ హారర్ మూవీగా వస్తోన్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసింది. మన రాజా సాబ్ టీజర్ విడుదలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కామెడీతో పాటు హారర్ థ్రిల్లింగ్గా ఉండడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారు.అయితే ఇవాళ నిర్వహించిన టీజర్ ఈవెంట్కు నిర్మాత ఎస్కేఎన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాస్ టీజర్తో పాటు సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాకు ఓ నిర్మాత నెగెటివ్ క్యాంపెయిన్ చేశారని ఆరోపించారు. ఈ సినిమా మొదలైనప్పుడు నెగెటివ్ చేసినా నిర్మాత.. టీజర్ చూశాక రేపటి నుంచి పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు. మారుతి ఎప్పుడూ అలాంటి క్యాంపెయిన్స్ను నమ్మలేదు. తన బెస్ట్ ఇస్తానని చెప్పాడు. డిసెంబర్ 5న పాన్ ఇండియా షేక్ అవుతుంది' ఎస్కేఎన్ కామెంట్స్ చేశారు. ఇవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంతకీ ఎవరా? నిర్మాత టాలీవుడ్లో చర్చ మొదలైంది.(ఇది చదవండి: 'ది రాజాసాబ్'.. భయపెట్టడమే కాదు... (టీజర్))ఈ రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధికుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.

'రాజాసాబ్'లో మారిపోయిన తాత.. ప్రభాస్ కాదా?
ప్రభాస్ 'రాజాసాబ్' టీజర్ వచ్చింది. ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్గా ఉండటంతో అభిమానులు ఫుల్ హ్యాపీ అయిపోతున్నారు. అదే టైంలో వాళ్లకు చిన్న సందేహం కూడా వచ్చింది. అదే తాత గెటప్. ఎందుకంటే చాన్నాళ్ల క్రితం ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్.. ముసలి గెటప్లో కనిపించాడు. ఇప్పుడు టీజర్లో మాత్రం స్టోరీ అంతా వేరేలా ఉంది. దీంతో ఫ్యాన్స్ రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు.టీజర్ బట్టి చూస్తే.. ఓ పెద్ద మహల్. దానికి యజమాని అయిన ఓ వ్యక్తి.. తరతరాలుగా ఆ మహల్తోపాటు ఆస్తిని అనుభవించాలని అనుకుంటాడు. దీంతో చనిపోయిన తర్వాత దెయ్యంగా మారి అక్కడే ఉండిపోతాడు. ఓ సందర్భంలో హీరోహీరోయిన్లు అక్కడికి వస్తారు. తర్వాత జరిగిన పరిణామాలే సినిమా స్టోరీ అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)టీజర్ మొత్తంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ని తాతగా చూపించారు. కానీ గతంలో ప్రభాస్ని ముసలి గెటప్లో చూపించారు. దీంతో ఫ్యాన్స్ పలు థియరీలు అనుకుంటున్నారు. ఆత్మ రూపంలో ఉండే తాత.. క్లైమాక్స్లో ప్రభాస్ శరీరంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ప్రభాస్.. తాతలా మారిపోయి విలన్స్ని చితక్కొట్టేస్తాడు అని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమేంటి? అనేది సినిమా వస్తే తప్పితే క్లారిటీ రాదు.ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించగా.. మారుతి దర్శకుడు. పీపుల్స్ మీడియా సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఇంకొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది పూర్తి చేసుకుని ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్లలోకి సినిమాని తీసుకురాబోతున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్.. ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు: మారుతి)

ఈ ఏడాదిలోనే జాన్వీ పెళ్లి.. జ్యోతిషుడి కామెంట్స్
సినిమా సెలబ్రిటీలు ప్రేమ, పెళ్లి అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. దీని గురించి ఏ చిన్న రూమర్ వినిపించినా సరే అభిమానులు ఎగ్జైట్ అవుతుంటారు. కొన్నిసార్లు కొందరు జ్యోతిషులు.. పలువురు నటీనటుల భవిష్యత్ గురించి అంచనా వేసి చెబుతుంటారు. కొన్నిసార్లు ఇది నిజమైతే, కొన్నిసార్లు ఇది జరగదు. గతంలో వేణుస్వామి ఎంత రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు బాలీవుడ్లోనూ సుశీల్ కుమార్ అనే జ్యోతిషుడు.. హీరోయిన్ జాన్వీ కపూర్ పెళ్లి గురించి కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)సిద్ధార్థ్ కన్నన్ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన సదరు జ్యోతిషుడు.. జాన్వీ కపూర్ కెరీర్ 2026లో మంచి స్థాయికి వెళ్తుందని చెప్పారు. అలానే ఈ ఏడాదిలోనే జాన్వీ పెళ్లి చేసుకుంటుందని, ఒకవేళ లేదంటే మాత్రం 33 ఏళ్లకు ఆమెకు వివాహం జరుగుతుందని అంచనా వేశాడు. ఓవైపు ఆమె వైవాహిక జీవితం సాఫీగా ఉంటుందని చెబుతూన.. గ్రహాగతుల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.ఏదేమైనా ఇప్పుడు జ్యోతిషుడు సుశీల్ కుమార్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్కి బాయ్ ఫ్రెండ్ ఉన్నమాట నిజమే. గతంలో ఇతడితోనే పలుమార్లు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. గతంలో ఓసారి మాట్లాడుతూ.. తాను పెళ్లి చేసుకుని తిరుపతిలోనే సెటిల్ కావాలనుకుంటున్నానని జాన్వీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో రామ్ చరణ్ 'పెద్ది', బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ తదితర క్రేజీ మూవీస్ ఉన్నాయి. ఇలాంటి టైంలో పెళ్లి చేసుకుంటుందా అంటే కచ్చితంగా లేదని చెప్పొచ్చు. మరి సదరు జ్యోతిషుడు ఏ అంచనాతో చెప్పాడో ఏమో?(ఇదీ చదవండి: 'ది రాజాసాబ్' టీజర్ రిలీజ్.. భయపెట్టడమే కాదు)

'ది రాజాసాబ్'.. భయపెట్టడమే కాదు... (టీజర్)
ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'ది రాజాసాబ్' (The RajaSaab) టీజర్ వచ్చేసింది. రొమాంటిక్ హారర్ కాన్సెప్ట్తో దర్శకుడు మారుతి తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి వరుస హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్ను చూస్తే వారి అంచనాలకు మించే ఈ చిత్రం ఉండొచ్చని చెప్పవచ్చు. సంగీతం తమన్ అందించారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఇది విడుదల కానుంది.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

వన్డే వరల్డ్కప్ ఫిక్చర్స్ విడుదల.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?
మహిళల వన్డే వరల్డ్కప్ ఫిక్చర్స్ను ఐసీసీ ఇవాళ (జూన్ 16) విడుదల చేసింది. ఈ మెగా టోర్నీ ఈ ఏడాది సెప్టెంబర్ 30-నవంబర్ 2 మధ్యలో భారత్, శ్రీలంక వేదికగా జరుగనుంది. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరుగనుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్, శ్రీలంక ఆడే మ్యాచ్లకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. భారత్-శ్రీలంక మ్యాచ్ మాత్రం భారత్లోనే జరుగనుంది.టోర్నీ ఆరంభ మ్యాచ్లో (సెప్టెంబర్ 30) టీమిండియా శ్రీలంకతో బెంగళూరు వేదికగా తలపడనుంది. అక్టోబర్ 29న తొలి సెమీఫైనల్ (గౌహతి లేదా కొలొంబో (పాక్ క్వాలిఫై అయితే)), 30న రెండో సెమీఫైనల్ (బెంగళూరు) జరుగనున్నాయి. నవంబర్ 2న ఫైనల్ (బెంగళూరు లేదా కొలొంబో) జరుగుతుంది. మహిళల వన్డే వరల్డ్కప్ 12 ఏళ్ల తర్వాత భారత్లో జరుగుతుంది.భారత్లోని చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), ఏసీఏ స్టేడియం (గౌహతి), హోల్కర్ స్టేడియం (ఇండోర్), ఏసీఏ-వీడిసీఏ స్టేడియంలో (విశాఖపట్నం) మ్యాచ్లు జరుగుతాయి. శ్రీలంకలో ప్రేమదాస స్టేడియంలో (కొలంబో) మ్యాచ్లు జరుగుతాయి.ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్) పాల్గొంటాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. 2022లో న్యూజిలాండ్లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ను ఓడించి ఏడోసారి ఛాంపియన్గా అవతరించింది. ఈ టోర్నీలో అత్యంత విజయంవంతమైన జట్టు ఆస్ట్రేలియానే.పాకిస్తాన్ మ్యాచ్లు కొలొంబోలో ఎందుకు..?ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్లు కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగనున్నాయి. పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ భారత్లో పర్యటించదు. ఆ టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా ఆ దేశంలో అడుగుపెట్టలేదు.భారత్ ఆడాల్సిన మ్యాచ్లు హైబ్రిడ్ పద్దతి ప్రకారం దుబాయ్లో జరిగాయి. వరల్డ్కప్ మ్యాచ్ల కోసం పాకిస్తాన్ కూడా భారత్లో ఆడదని అప్పుడే ఒప్పందం చేసుకున్నారు.🚨 SCHEDULE OF WOMEN's ODI WORLD CUP 2025 🚨 pic.twitter.com/n1nB6iYi14— Johns. (@CricCrazyJohns) June 16, 2025భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?ఈ మెగా టోర్నీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలొంబోలో జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రూప్ దశతో భారత్ మొత్తం ఆరు మ్యాచ్లు ఆడనుంది. దాని షెడ్యూల్ కింది విధంగా ఉంది.మంగళవారం, సెప్టెంబర్ 30—భారత్ vs శ్రీలంక—బెంగళూరు—మధ్యాహ్నం 3ఆదివారం, అక్టోబర్ 5—భారత్ vs పాకిస్తాన్—కొలంబో—మధ్యాహ్నం 3గురువారం, అక్టోబర్ 9—భారత్ vs దక్షిణాఫ్రికా—వైజాగ్—మధ్యాహ్నం 3ఆదివారం, అక్టోబర్ 19—భారత్ vs ఇంగ్లాండ్—ఇండోర్—మధ్యాహ్నం 3గురువారం, అక్టోబర్ 23—భారత్ vs న్యూజిలాండ్—గౌహతి—మధ్యాహ్నం 3ఆదివారం, అక్టోబర్ 26—భారత్ vs బంగ్లాదేశ్—బెంగళూరు—మధ్యాహ్నం 3

ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత జట్టు ఇదే! యువ సంచలనానికి నో ఛాన్స్?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో తొలి టెస్టు కోసం టీమిండియా భారత ప్లేయింగ్ ఎలెవన్ను భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్గుప్తా ఎంచుకున్నాడు.తన ప్లేయింగ్ ఎలెవన్లో దాస్గుప్తా ముగ్గురు ఫ్రంట్లైన్ పేసర్లు,ఇద్దరు స్పిన్నర్లకు ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్తో టెస్టు అరంగేట్రం చేసేందుకు సిద్దంగా ఉన్న యువ ఆటగాడు సాయిసుదర్శన్కు మాత్రం దాస్ గుప్తా తన ఎంచుకున్న జట్టులో చోటు ఇవ్వలేదు.అతడి స్ధానంలో వెటరన్ ఆటగాడు కరుణ్ నాయర్ వైపు ఈ మాజీ క్రికెటర్ మొగ్గు చూపాడు. సాయిసుదర్శన్ మంచి ఫామ్లో ఉన్నప్పటికి, అనుభవాన్ని పరిగణలోకి తీసకుని కరుణ్కు అవకాశమివ్వాలని దీప్ దాస్ గుప్తా సూచించాడు. కాగా నాయర్ దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచి ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.ఇక దీప్దాస్ గుప్తా ఎంపిక చేసిన జట్టులో స్పిన్నర్లగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లకు చోటు దక్కింది. అదేవిధంగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా శార్ధూల్ ఠాకూర్ బదులుగా నితీష్ కుమార్ రెడ్డిని దాస్గుప్త ఎంచుకున్నాడు. పేస్ బౌలింగ్ విభాగంలో బుమ్రా, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణలకు అవకాశమిచ్చాడు.ఇంగ్లండ్తో తొలి టెస్టుకు దాస్ గుప్తా ఎంపిక చేసిన భారత ప్లేయింగ్ ఎలెవన్యశస్వీ జైశ్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుబ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణచదవండి: ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముందు సంచలన విషయాన్ని బయటపెట్టిన కరుణ్ నాయర్

ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముందు సంచలన విషయాన్ని బయటపెట్టిన కరుణ్ నాయర్
ఇంగ్లండ్తో తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు (జూన్ 20) టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. మెయిల్ స్పోర్ట్ అనే ప్రముఖ మేగజైన్తో మాట్లాడుతూ.. ఓ బాంబు లాంటి వార్త చెప్పాడు.కరుణ్ మాటల్లో.. నాకు ఇప్పటికీ గుర్తుంది. రెండేళ్ల క్రితం టీమిండియాలో స్థానం కోసం పరితపిస్తున్న రోజులవి. ఆ సమయంలో ఓ అగ్రశ్రేణి భారత క్రికెటర్ నాకు ఫోన్ చేసి రిటైర్మెంట్ ప్రకటించమని సలహా ఇచ్చాడు. ప్రైవేట్ టీ20 లీగ్ల్లో చాలా డబ్బు వస్తుందని చెప్పడమే అతని ఉద్దేశం. అలా చేసి ఉండటం చాలా సులభం. కానీ నేను భారత క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చే ఏ విషయంలోనూ రాజీ పడదలచుకోలేదు. ఆ రోజు నేను డబ్బు గురించి ఆలోచించి ఉంటే ఈ రోజు ఇక్కడ (ఇంగ్లండ్లో) ఉండే వాడిని కాదు.టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలన్న ధృడమైన లక్ష్యంతో ఆ రోజు ఆ ప్రముఖ క్రికెటర్ సలహాను పెడచెవిన పెట్టిన కరుణ్.. రెండేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు టీమిండియాలో చోటు సాధించాడు. 2023లో కర్ణాటక నుండి విదర్భకు మారడం (దేశవాలీ క్రికెట్లో) కరుణ్ అదృష్టాన్ని మార్చేసింది.గత రెండు దేశవాలీ సీజన్లలో 1500కు పైగా పరుగులు సాధించిన కరుణ్ (విదర్భ).. టీమిండియా తలుపులు తట్టాడు. గత రంజీ సీజన్లో అసాధారణ ప్రదర్శన (53.93 సగటున 863) కనబర్చి విదర్భ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మధ్యలో ఇంగ్లండ్ కౌంట్లీలోనూ ఆడిన కరుణ్ అక్కడ కూడా సత్తా చాటాడు. రెండు సీజన్లలో నార్తప్టంన్షైర్ తరఫున 56.61 సగటున 736 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది.నాయర్ తాజాగా ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో కూడా డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. విరాట్ కోహ్లి టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానానికి కరుణ్ సరైన అర్హుడని కొందరు భావిస్తున్నారు. 2018లో టీమిండియా తరఫున చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన కరుణ్.. దాదాపు ఏడేళ్ల తర్వాత 33 ఏళ్ల వయసులో రీఎంట్రీ ఇవ్వడం ఆసక్తికర పరిణామం. కరుణ్ తన చిన్నపాటి టెస్ట్ కెరీర్లోనే ట్రిపుల్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. కరుణ్ చేసిన ఆ ట్రిపుల్ సెంచరీ ఇంగ్లండ్పైనే కావడం విశేషం.ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టు..శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్

ఇంగ్లండ్ గడ్డపై సునామీ శతకంతో విరుచుకుపడిన శార్దూల్ ఠాకూర్
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ సునామీ శతకంతో విరుచుకుపడ్డాడు. బెకింగ్హమ్ వేదికగా భారత సీనియర్ జట్టుతో జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో కేవలం 68 బంతుల్లోనే అజేయమైన 122 పరుగులు చేశాడు (భారత-ఏ జట్టుకు ఆడుతూ). ఈ మ్యాచ్లో శార్దూల్ తొలుత బంతితోనూ మెరిశాడు (4 వికెట్లు తీశాడు). కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, కరుణ్ నాయర్ వంటి స్టార్లతో నిండిన భారత సీనియర్ల బ్యాటింగ్ లైనప్ను ముప్పుతిప్పలు పెట్టాడు.తాజా ప్రదర్శనతో శార్దూల్ ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముందు భారత సెలెక్టర్లకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీతో మెరిసిన మరో ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి పోటీగా మారాడు. శార్దూల్ తాజా ప్రదర్శన నేపథ్యంలో జూన్ 20 నుంచి ఇంగ్లండ్తో ప్రారంభం కాబోయే తొలి టెస్ట్లో ఎవరికి అవకాశం ఇవ్వాలో అర్దంకాక సెలెక్టర్లు తలలు పట్టుకున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు భారత్, భారత్-ఏ జట్ల మధ్య నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. తొలి టెస్ట్కు ముందు భారత ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మ్యాచ్ను మూడు రోజుల్లోనే ముగించారు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత సీనియర్ జట్టు 459 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్, కేఎల్ రాహల్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత-ఏ మూడో రోజు ఆటను రద్దు చేసే సమయానికి భారీ స్కోర్ చేసింది. 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శార్దూల్.. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ వంటి హేమాహేమీ పేసర్లున్న భారత బౌలింగ్ లైనప్కు చుక్కలు చూపించాడు.అంతకుముందు రెండో రోజు ఆటలో మరో భారత-ఏ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా కేవలం 76 బంతుల్లో 101 పరుగులు చేసి భారత సెలెక్టర్లకు సవాలు విసిరాడు. ఈ మ్యాచ్లో సర్ఫరాజ్, శార్దూల్ అద్భుతమైన ప్రదర్శనలతో సత్తా చాటడంతో ఇదివరకే భారత సీనియర్ జట్టులో చోటు ఖాయమనున్న కరుణ్ నాయర్, నితీశ్ కుమార్లకు భయం పట్టుకుంది. ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో సర్ఫరాజ్ స్థానంపై అనుమానం ఉన్నప్పటికీ.. తాజా ప్రదర్శనతో శార్దూల్కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయమని తెలుస్తుంది. అంతకుముందు కరుణ్ నాయర్ ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీతో మెరిశాడు కాబట్టి అతని చోటుపై ఎలాంటి అనుమానం లేదు. ఇంగ్లండ్తో తొలి టెస్ట్ లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టు..శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
బిజినెస్

కోతల రాయుళ్లకు వాతలు తప్పవు!
ఐటీఆర్ 1, ఐటీఆర్ 4లలో కొన్ని మార్పులు చేశారు. ఈ మార్పులన్నీ మీరు ఐటీఆర్ దాఖలు చేసే 2024–25 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తాయి. ఈ మార్పుల ప్రకారం క్లెయిం చేసే ప్రతి డిడక్షన్కి సంబంధించిన పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలి. ఇన్నాళ్లు డిడక్షన్ ఎంతో రాసిస్తే వదిలేసేవారు. ఇక నుంచి పూర్తి వివరాలు ఇవ్వాల్సిందే. దీని ప్రకారం ఒక్కొక్క డిడక్షన్, దానికి సంబంధించిన కాగితాలు/వివరాలు ఏమిటో తెలుసుకుందాం. మీ దగ్గర పూర్తి వివరాలు లేనిదే ఫారం నింపలేరు. ఇంటి అద్దె అలవెన్సు.. బేసిక్ జీతం. ఇంటి అద్దె అలవెన్సు ఎంత చేతికి వచ్చింది. మీరు అద్దె ఎంత చెల్లించారు. అద్దె ఎవరికి ఇచ్చారు. ఎలా ఇచ్చారు. అంటే నగదా..? బ్యాంకు ద్వారానా..? రశీదులు మొదలైనవి.80 సీ.. ఇంతకుముందే తెలుసుకున్నాము. ఈ సెక్షన్ క్రింద ఎన్నో అంశాలున్నాయి. ముఖ్యంగా పాలసీ నెంబరు చెప్పాలి. అలాగే మిగతా ఇన్వెస్ట్మెంట్లకు, డాక్యుమెంటు ఐడెంటిఫికేషన్ నెంబరు రాయాలి. మిగతా వాటి గురించి ఇక్కడ ప్రస్తావించలేదు కానీ క్లెయిం చేసే ముందు కాగితాలు సిద్ధంగా పెట్టుకోవాలి. చెల్లింపు తేదీలు, అది ఏ సంవత్సరానికి సంబంధించినదో చాలా ముఖ్యం. ఈ సెక్షన్లో డిడక్షన్లు చెల్లింపు జరిగిన సంవత్సరంలోనే బెనిఫిట్ ఇస్తారు.80 డీ.. ఇది మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించినది. ఇన్సూరెన్స్ కంపెనీ పేరు, పాలసీ నెంబరు వివరాలు ఇవ్వాలి. 80 ఈ... ఇది విద్యా రుణానికి సంబంధించినది. ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు..? లోన్ అకౌంటు నెంబరు.., మంజూరు తేది .. ఎంత రుణం తీసుకున్నారు.. ఇంకా ఎంత రుణం చెల్లించాలి .. ఇలా వివరాలన్నీ తెలియపరచాలి. 80 ఈఈ... ఇంటి కోసం రుణం తీసుకుంటే కొన్ని షరతులకు లోబడి రూ.50,000 డిడక్షన్ ఇస్తారు. ఈ రుణానికి సంబంధించి బ్యాంకు, లోన్ అకౌంటు నెంబరు, మంజూరు లెటర్ తేదీ, ఎంత రుణం తీసుకున్నారు..? ఇంకా ఎంత రుణం మిగిలి ఉంది. ఇవన్నీ వివరాలు చెప్పాలి. 80 ఈఈబీ... ఇది ఎలక్ట్రిక్ వెహికల్ లోన్కి సంబంధించినది. బ్యాంకు పేరు ఏమిటి..? లోన్ అకౌంటు నెంబరు, లోన్ ఎంత, వెహికల్ రిజి్రస్టేషన్ నెంబరు, లోన్ మొత్తం ఎంత..? మొదలైన వివరాలు ఇవ్వాలి.80 డీడీబీ... ఇది కొన్ని నిర్దేశిత జబ్బుల ట్రీట్మెంట్కి సంబంధించినది. ఆ నిర్దేశిత జాబితాలోంచి ఏ జబ్బు వచ్చింది? దానికైన ఖర్చు.., హాస్పిటల్కి చెల్లించిన మొత్తం ఎంత? తదితర పూర్తి వివరాలు తెలిపాలి. ఈ మార్పులతో అన్ని విషయాలు సేకరిస్తున్నారన్నమాట. ఒకప్పుడు మన మీద అభిమానం, నమ్మకం, మంచి విశ్వాసంతో మొత్తాన్ని తెలియజేయమనేవారు. దీనిని ఆసరా తీసుకుని అన్ని సెక్షన్ల ప్రకారం అర్హత ఉన్నంత క్లెయిమ్ల కోసం జనాలు ఎగబడుతున్నారు. అద్దె ఇంట్లో లేకుండా అద్దె క్లెయిమ్ చేసే ఉద్యోగస్తులు ఎందరో ఉన్నారు. భార్యభర్తలు ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరూ విడిగా వారి వారి అస్సెస్మెంట్లలో హెచ్ఆర్ఏ క్లెయింలు చేసే ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్స్’ ఎంతోమంది ఉన్నారు. ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట.. తులం ఎంతంటే..ఒక్క హెచ్ఆర్ఏ విషయంలోనే డిపార్ట్మెంట్ వారు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే కొంప కొల్లేరు అయిపోతుంది. అలాగే దొంగ స్కూల్ ఫీజుల రశీదులు .. పిల్లలు లేని వారు కూడా దొంగ రశీదులు పెడుతున్నారు. జీవిత బీమా చెల్లించకపోయినా ప్రీమియంలు చెల్లించినట్లు రాయడం, లేని చెల్లింపులు, లేని ఇన్వెస్ట్మెంట్లు, లేని అంగవైకల్యం దొంగ పత్రాలు సృష్టించి తద్వారా క్లెయిమ్లు పొందడం లాంటివి చేసేవారున్నారు. డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉందని తిట్టి, ప్రచారం చేసి డిపార్ట్మెంట్ వారి మీద అపవాదాలు వేసి, పిడివాదన చేసి, వాదనలు, ప్రతివాదనలు చేసి, పన్నుభారం తగ్గించుకునే కోతరాయుళ్లకి వాతలు తప్పవు.కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్యట్యాక్సేషన్ నిపుణులు

బంగారం ధరల్లో స్వల్ప ఊరట.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) సోమవారం కాస్తా ఊరటనిచ్చింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.93,050 (22 క్యారెట్స్), రూ.1,01,510 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. క్రితం రోజు ముగింపు ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.150, రూ.170 తగ్గింది.చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.150, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.170 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.93,050 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.1,01,510 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.150 దిగి రూ.93,200కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.170 తగ్గి రూ.1,01,660 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు సోమవారం తగ్గినట్లుగానే వెండి ధరలు(Silver Price) కూడా వినియోగదారులకు కొంత ఊరట కల్పించాయి. క్రితం ముగింపు ధరలతో పోలిస్తే కేజీ వెండి ధరపై రూ.100 తగ్గింది. దాంతో కేజీ వెండి రేటు రూ.1,19,900 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

హోర్ముజ్ జలసంధి మూసివేత..?
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్ ఆధ్వర్యంలోని హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన చెక్ పాయింట్లలో ఒకటిగా నిలుస్తుంది. అయితే యుద్ధం నేపథ్యంలో దీని గుండా చేసే చమురు సరఫరాను నిలిపేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఈ జలసంధి ప్రపంచంలోని ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు 20% రవాణాను సులభతరం చేస్తుంది.ఇరాన్-గల్ఫ్ దేశాల మధ్య ఉన్న ఈ హోర్ముజ్ జలసంధి 33 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలుపుతుంది. చమురు ఉత్పత్తి చేసే దేశాలకు ప్రధానంగా సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ, ఇరాక్, కువైట్లకు ఒక ముఖ్యమైన సప్లై కారిడార్గా పనిచేస్తుంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఈ జలసంధి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సైనిక సంఘర్షణలు, ఆర్థిక ఆంక్షలకు గురవుతుంది. దీని గుండా చమురు ట్యాంకర్లు స్వేచ్ఛగా ప్రయాణించడానికి ఏదైనా అంతరాయం ఏర్పడితే తీవ్రమైన సరఫరా గొలుసు అవరోధాలకు దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు ప్రపంచ ముడి చమురు ధరలను పెంచుతుందని చెబుతున్నారు.ముడిచమురు ధరలపై కీలక ప్రభావంసరఫరా అంతరాయాలుఅమెరికా, ఇతర గల్ఫ్ దేశాలతో ఇరాన్కు ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో హోర్ముజ్ జలసంధి గుండా చమురు సరఫరాను నిలిపేస్తామని హెచ్చరించింది. ఈ ప్రాంతంలో ఆంక్షల వల్ల ప్రపంచ క్రూడ్ ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇది చమురు ధరలు పెరగడానికి, ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడటానికి దారితీస్తుంది.మార్కెట్ ఒడిదొడుకులుఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇటీవలి సైనిక ఉద్రిక్తతలు ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ 10% పైగా పెరగడానికి దారితీశాయి. ఇది దీర్ఘకాలిక సంక్షోభంతో కూడిన మార్కెట్ భయాలను ప్రతిబింబిస్తుంది. పశ్చిమాసియాలో అస్థిరతపై పెట్టుబడిదారులు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.పరిశ్రమలపై ప్రభావం..పెరుగుతున్న ముడి చమురు ధరలు పరిశ్రమలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా పెయింట్స్, కెమికల్స్ పరిశ్రమలు క్రూడ్ ఆయిల్ డెరివేటివ్స్పై ఆధారపడతాయి. టైర్లు, రబ్బరు తయారీ సంస్థలు పెట్రోలియం ఆధారిత ఉత్పత్తులతో ప్రభావితమవుతాయి. ఏవియేషన్, షిప్పింగ్ పరిశ్రమ పెరిగిన ఇంధన ఖర్చులతో రవాణా వ్యయాన్ని పెంచే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ప్రత్యామ్నాయ పెట్టుబడులకు డిమాండ్రష్యాకు అవకాశం..హోర్ముజ్ జలసంధి దిగ్బంధం చేస్తారనే భయాలతో రష్యన్ క్రూడాయిల్కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా, యూరప్ ఆంక్షల తరువాత ఇప్పటికే రష్యన్ చమురు రాయితీతో లభిస్తుంది. దాంతో భారతదేశం, చైనా వంటి దేశాలు కొనుగోళ్లను పెంచాయి. ఈ పరిస్థితి ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తుంది. ఇరాన్ ఇలాగే హోర్ముజ్ జలసంధి గుండా సరఫరాను నిలిపేస్తామని ఇరాన్ భయాలు సృష్టిస్తే గల్ఫేతర చమురు సరఫరాదారులకు ప్రయోజనం చేకూరుతుందనే వాదనలున్నాయి.ఇరాన్ బెదిరింపుల వెనుక కారణాలుఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడులకు సమర్థంగా సమాధానం చెబుతామని ఇరాన్ ప్రతిస్పందించింది. అందులో భాగంగా హోర్ముజ్ జలసంధిని నిలిపేయడం దాని వ్యూహాత్మక ఎంపికల్లో ఒకటి. ఈ జలసంధి ముఖ్యమైన చమురు రవాణా మార్గం. ఇది ప్రపంచ ముడి చమురులో 20% రవాణాకు తోడ్పడుతుంది. దీనికి విఘాతం కలిగిస్తే చమురు ధరలు పెరుగుతాయి. పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇరాన్ చారిత్రాత్మకంగా హోర్ముజ్ను మూసివేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ బేరసారాలు సాగించింది. కానీ ఎన్నడూ దాన్ని నిలిపేయలేదు.పూర్తి మూసివేత సాధ్యం అవుతుందా..?ఇరాన్ కూడా తన చమురును ఎక్కువగా హోర్ముజ్ జలసంధి ద్వారానే ఎగుమతి చేస్తుంది. దీన్ని అడ్డుకోవడం వల్ల సొంత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. యూఎస్ నేవీ ఐదో ఫ్లీట్ యూకే, ఫ్రెంచ్ మిత్రదేశాలతో కలిసి ఆ జలమార్గంలో గస్తీ నిర్వహిస్తుంది. దీన్ని పూర్తిగా నిలిపేస్తే పాశ్చాత్య దేశాల సైనిక జోక్యం పెరుగుతుందనే వాదనలున్నాయి.

ఆటుపోట్ల మధ్య స్టాక్ మార్కెట్లు.. స్థిరంగా సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:52 సమయానికి నిఫ్టీ(Nifty) 13 పాయింట్లు లాభపడి 24,729కు చేరింది. సెన్సెక్స్(Sensex) 47 ప్లాయింట్లు పెరిగి 81,164 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.32 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.08 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.13 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.3 శాతం దిగజారింది.అనూహ్యంగా ఆర్బీఐ రెపో రేటును 0.5 శాతం తగ్గించడంతో తొలుత జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో డీలా పడ్డాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ భయాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ఈ వారం సైతం మార్కెట్లపై ప్రభావం పడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.మధ్యప్రాచ్యంలో ఆందోళనలు తలెత్తడంతో ఇప్పటికే ముడిచమురు ధరలు బలపడ్డాయి. వారాంతాన బ్రెంట్ చమురు బ్యారల్ 78 డాలర్లను తాకగా.. పసిడికి డిమాండ్ పెరిగింది. విదేశీ మార్కెట్లో ఔన్స్ బంగారం 3450 డాలర్లను దాటేసింది. 3,500 డాలర్ల చరిత్రాత్మక గరిష్టంవైపు పరుగు తీస్తోంది. దీంతో ప్రధానంగా విదేశీ అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని అంచనా వేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ

Dr Asima Chatterjee: సైన్స్ కాంగ్రెస్ తొలి అధ్యక్షురాలు
భారతీయ విశ్వవిద్యాలయాల నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా అందుకున్న మహిళ, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్గా వ్యవహరించిన స్త్రీమూర్తి, మహిళా శాస్త్రవేత్తగా రాజ్యసభ సభ్యులు కావడం వంటి ప్రత్యేకతలు అసీమా చటర్జీ (Dr Asima Chatterjee) (1917– 2006) సొంతం. ప్రకృతి ఉత్పత్తులైన అల్కలాయిడ్స్, కామెరిన్స్, టెర్పనాయిడ్స్ విషయంలోఆమె కృషి విశేషమైనది. భారతీయ ఔషధ మొక్కలకు సంబంధించి వి.విశ్వాస్ గ్రంథానికి చాలా రకాలుగా అదనపు సమాచారాన్ని జోడించి ‘ట్రీటైస్ ఆన్ మెడిసినల్ ప్లాంట్స్’ను ఆరు భాగాల గ్రంథంగా వెలువరించారు.అసీమా చటర్జీ 1917 సెప్టెంబరు 23న బెంగాల్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1944లో పి.కె. బోస్ సారథ్యంలో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి తొలి భారతీయ మహిళగా డీఎస్సీ పొందారు. వృక్ష ఉత్పత్తులకు సంబంధించి, సేంద్రియ రసాయనాలపై అధ్యయ నమే ఆవిడ పరిశోధన. ఆ సిద్ధాంత గ్రంథాన్ని నోబెల్ బహుమతి గ్రహీత ఎ.ఆర్. టాడ్ పరీక్షించి గొప్పగా అభినందించారు. ఆమె భర్త వరదానంద చటర్జీ భౌతిక రసాయనశాస్త్రంలో దిట్ట.1947లో ఆమె అమెరికా వెళ్లి నాలుగేళ్లలో ముగ్గురు వేరు వేరు విశ్వవిద్యాలయాల ఆచార్యుల దగ్గర పరిశోధన చేశారు. ఇందులో నోబెల్ బహుమతి గ్రహీత పాల్ కారర్ ఒకరు. 1950లో భారతదేశానికి తిరిగి వచ్చి కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉద్యోగ జీవితాన్ని కొనసాగించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ ఈ విజ్ఞాన శాస్త్ర మహా సభలకు ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా, 1975లో ప్రధాన అధ్యక్షులుగా వ్యవహరించారు. భారతీయ ఔషధ మొక్కలు, ఆయుర్వేదానికి సంబంధించి సాల్ట్ లేక్ (కలకత్తా)లో, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రీజనల్ రీసర్చి ఇన్స్టిట్యూట్ రావడానికి కృషి చేశారు. మూర్ఛవ్యాధికి విరుగుడుగా ఆయుష్ –56, అలాగే మలేరియాను నిర్మూలించేందుకు ఔషధాలను తయారు చేశారు. అసీమా పొందిన ఎన్నో గౌరవాలు, పురస్కారాలలో 1975లో లభించిన పద్మ విభూషణ్ ఒకటి.ప్రజావళిలో శాస్త్రీయ అభినివేశం లేకపోతే ఫలితం శూన్యమని ఆమె నమ్మే వారు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి పట్టణాల వద్దే ఆగిపోతే మంచిది కాదనీ, గ్రామ సీమలలోనూ అది వ్యాప్తి కావాలనీ అనేవారు. రాజ్యసభ సభ్యురాలిగా 1982 నుంచి 8 ఏళ్ల పాటు సేవలు అందించారు. విజ్ఞానమాతకు ఆభరణంగా భాసి ల్లిన అసీమా చటర్జీ 2006 నవంబర్ 22న తన 89వ యేట కన్ను మూశారు.– డా.నాగసూరి వేణుగోపాల్ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి

మాన్సూన్లో మోటార్ రైడ్స్..!
వర్షాలు మబ్బుల్లోంచి కురిసే మధుర గీతాల్లా వినిపిస్తున్న ఈ మాన్సూన్ సీజన్కు నగర యువత నుంచి ప్రత్యేక స్వాగతం లభిస్తోంది. సాధారణంగా జూన్ రెండో వారం నుంచి మొదలయ్యే ఈ సీజన్, ఈసారి కాస్త ముందస్తుగానే ప్రారంభమైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి తక్కువ ఉష్ణోగ్రతలతో, ఎక్కువ మోస్తరు వర్షపాతం నమోదవుతుందనే ఊహతో యువతలో ప్రకృతిని ఆస్వాదించే ఆసక్తి భారీగానే పెరిగింది. నగరవాసులు ముఖ్యంగా యువత ఈ చల్లని మబ్బులు, మత్తెక్కించే వర్షపు వాసన, హత్తుకునే పచ్చటి ప్రకృతి దృశ్యాలు అన్నింటినీ ఆస్వాదించేందుకు గ్రూప్ రైడ్స్, ఔటింగ్స్, నేచర్ ట్రిప్లతో సందడి చేస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో ప్రతి చినుకూ శీర్షికే..!! రీల్స్, స్టోరీస్, వ్లాగ్స్..ఇవన్నీ మాన్సూన్ థీమ్తో నిండిపోతున్నాయి. వర్షపు నీటిలో కళ్లకు తక్కువ కనిపించే పొగమంచు, డ్రోన్లతో తీసిన పచ్చటి దృశ్యాలు వీరిని ఆహ్లాదపరిచేలా ఉంటున్నాయి. మాన్సూన్ కేవలం వర్షపు చినుకుల సంగతి మాత్రమే కాదు.. ఇది ఒక మూడ్, ఒక ఉల్లాసం, రిలాక్సేషన్. పని ఒత్తిడి నుంచి కొన్ని గంటలు బయటపడేందుకు ఇదో సువర్ణావకాశం. హైదరాబాద్ యువత దీన్ని అందుకుంటోంది. ప్రకృతిని హత్తుకునేలా, జీవితాన్ని మరొక కోణంలో చూసేలా మాన్సూన్ సీజన్ మనల్ని ప్రేరేపిస్తోంది. హైదరాబాద్ శివార్లలోని అనంతగిరి హిల్స్, సంఘీ టెంపుల్ పరిసర ప్రాంతాలు, శామీర్పేట్ లేక్ వంటి ప్రాంతాలు డ్రైవ్ డెస్టినేషన్లుగా మారాయి. వారం చివరి రోజుల్లో ఈ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య రెండింతలు పెరిగింది. శివార్లలో ఇప్పుడిప్పుడే మొలకలొస్తున్న పొలాలు, మబ్బుల్లో నలుగుచేసే కిరణాలు, మోస్తరు జల్లుల్లో సాగే డ్రైవ్లు.. ఇవన్నీ యువత హృదయాలను తాకుతున్నాయి. వీకెండ్స్లో అయితే ఇంకొంచెం దూరమైనప్పటికీ నాగార్జున సాగర్, లక్నవరం వంటి ప్రాంతాలకు సైతం షార్ట్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు. వనాలవైపు పయనం.. సిటీ రైడింగ్కి అలసిన వారు మృగవాని పార్కులకు, అనుమతి ఉన్న శివార్ల అడవులకు, ఫారెస్ట్ ట్రెయిల్స్కు వెళ్లే ట్రెండ్ బాగా పెరిగింది. నగరం నుంచి మంచిర్యాల కవ్వల సర్వాయ్ ఫారెస్ట్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, భాన్సువాడ గ్రీన్ కవర్ వంటి ప్రాంతాలు ఈ లిస్ట్లో చేరిపోతున్నాయి. ఇవన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్న ప్రదేశాలుగా పేరుగాంచుతున్నాయి. ఇక్కడ వన్యప్రాణులను పరిశీలిస్తూ, వాన జల్లుల్లో నడకలు వేసేలా యూత్ ట్రెక్కింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. నగరంలో మాన్సూన్ మ్యాజిక్.. నగరం వదిలి వెళ్లలేని వారు కూడా తక్కువ సమయంలో ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, కేబీఆర్ పార్క్, దుమ్ముగూడ చెరువు వంటి ప్రదేశాలకు వెళుతున్నారు. ప్రత్యేకించి ప్రకృతి ప్రేమికులు, యువత, విద్యార్థులు, ఫొటోగ్రాఫర్స్ ఈ వర్షపు సీజన్ను కలర్ఫుల్గా మార్చేస్తున్నారు. ఇక నెక్లెస్ రోడ్డుపై సైక్లింగ్, బంజారాహిల్స్ కెఫేలో రేయిన్ వ్యూ టేబుల్స్, టెర్రస్ కాఫీ డేట్లు, రోడ్డు పక్కన స్వీట్కార్న్ బండ్లు, షావర్మ స్టాల్స్.. ఇవన్నీ మాన్సూన్ ఎక్స్పీరియన్స్. ఈ వర్షాల సీజన్కి సోషల్ మీడియా జనరేషన్ తమదైన హ్యాష్ట్యాగ్లు తయారుచేస్తోంది. హ్యాష్ రేయిన్రైడ్, హ్యాష్ మాన్సూన్మూడ్, హ్యాష్ చినుకులు క్రానికల్స్ లాంటి క్యాప్షన్లతో యువత సోషల్ మీడియాను మాన్సూన్ డైరీగా మార్చేస్తోంది. మాన్సూన్ ఏక కాలంలో రిలీఫ్, రొమాన్స్, రిఫ్రెష్మెంట్ తీసుకురావడమే కాదు, జీవితం కొంత నెమ్మదిగా, ప్రశాంతంగా సాగేలా చేస్తుంది. (చదవండి: 62 ఏళ్ల వయసులో నలుగురికీ స్ఫూర్తిగా..! ఏకంగా 136 సార్లు..)

సగమైన సముద్రం
తుంగభద్ర నది ప్రవహిస్తోంది. దూరంగా మంత్రాలయ రాఘవేంద్ర స్వామి అష్టోత్తరం వీనుల విందుగా వినిపిస్తూ ఉంది. నది ఒడ్డున కూర్చుని ఉన్న గురువుతో శిష్యుడు ‘‘స్వార్థం అంటే ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘స్వార్థం అంటే తన గురించి మాత్రమే శ్రద్ధ వహించడం. ఇతరులను పట్టించుకోకుండా తన ప్రయోజనం, ఆనందం లేదా సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించడం’’ అని బదులిచ్చాడు గురువు. ‘‘దాని పర్యవసానాలు ఏమిటి?’’ అని మళ్ళీ ప్రశ్నించాడు శిష్యుడు. ‘‘స్వార్థం ఎంత పనైనా చేయిస్తుంది. దానికి అంతమనేది లేదు. నీకు అర్థమయ్యే రీతిలో ఒక ΄కతకథ చెబుతాను విను.‘‘ఒక పెద్ద సామ్రాజ్యంలోని రాజ్యాలలో వర్షాలు లేక తీవ్రమైన కరువు ఏర్పడింది. ఏమి చేయాలో తెలియని చక్రవర్తి ఆస్థాన పండితులను పిలిచి చర్చించాడు. తపస్సు చేసి దైవానుగ్రహం పొందటమే శరణ్యమని వారు సలహా ఇచ్చారు. రాజ్యాల శ్రేయస్సు కోసం అడవులకెళ్ళి ఘోర తపస్సు ప్రారంభించాడు. చక్రవర్తి తపస్సుకి దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. ఇదీ చదవండి: Today recipes : బ్రెడ్తో ఇన్ని వెరైటీలు ఎపుడైనా ట్రై చేశారా?తన సామ్రాజ్యంలో మంచివానలు కురవాలని, నీటికరువు ఉండకూడదని కోరాడు చక్రవర్తి. ఎందుకైనా మంచిదని తన సామ్రాజ్యానికి ఆనుకుని ఉన్న సముద్రాన్ని కూడా మంచినీళ్ళుగా మార్చివేయమని అడిగాడు. ‘‘ఆలోచించే అడుగుతున్నావా?’’ అని దేవుడు రాజును ప్రశ్నించాడు.‘‘వృథాగా ఉన్న సముద్రం నీళ్ళు మంచినీళ్ళుగా మారితే మా సామ్రాజ్యంలోని ప్రజలు తరతరాలు నీటి ఎద్దడి లేకుండా సుఖపడతారు కదా. చరిత్రలో నా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది కదా’’ అని దేవుణ్ణి ఒప్పించాడు.చదవండి: ‘మై లవ్..’గర్ల్ఫ్రెండ్ కోసం ఒంటరిగా కుమిలి కుమిలి : వైరల్ వీడియో‘‘సరే, నీ ఇష్టం’’ అని చక్రవర్తి కోరినట్లే చేశాడు దేవుడు. వెంటనే మంచి వర్షాలు కురిశాయి. పరమానంద భరితుడయ్యాడు చక్రవర్తి. కొన్నాళ్ళు గడిచాయి. ఉప్పునీళ్ళ సముద్రం మంచి నీళ్ళుగా మారాక పరిస్థితి ఎలా ఉందో చూద్దామని చక్రవర్తి సముద్రం దగ్గరకు వెళ్ళాడు. సముద్రం సగమై ఉంది. ఆశ్చర్యపోయాడు. అలలు సైతం నీరసంగా పడి లేస్తున్నాయి. చక్రవర్తి గుండె తరుక్కుపోయింది. కారణమేమిటని తన సిబ్బందిని అడిగాడు. ఏ రాజ్యానికి ఆ రాజ్యం రాజులు అవసరం ఉన్నా లేకున్నా సముద్రం నీళ్ళని తమ రాజ్యాల వైపుకు మళ్ళించుకున్నారని చెప్పారు. ‘సముద్రాన్ని కూడా సగం చేసింది కదా మనిషి స్వార్థం’ అని తల పట్టుకున్నాడు చక్రవర్తి. ఇంకొన్నాళ్ళు గడిస్తే సముద్రం పూర్తిగా మాయమై పర్యావరణ సమస్య వస్తుందని గుర్తించాడు. వెంటనే తపస్సు ప్రారంభించడంతో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చేసిన తప్పునకు క్షమాపణలు కోరి సముద్రాన్ని ఉప్పునీళ్ళగా మార్చమని ప్రాధేయపడ్డాడు’’ అని స్వార్థం గురించి వివరించాడు గురువు. స్వార్థం మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తుందని అర్థం చేసుకున్నాడు శిష్యుడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు

62 ఏళ్ల వయసులో నలుగురికీ స్ఫూర్తిగా..! ఏకంగా 136 సార్లు..
సమాజం మనకు ఏమి ఇచ్చింది అని ఆలోచించేవారే ఎక్కువ మంది ఉంటారు. కానీ సమాజానికి నేను ఏమిచ్చాను అని ఆలోచించే వారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఒక్కడే యోగేష్ రాజ్ శ్రీవాస్తవ. పదో, ఇరవైయ్యో కాదు.. ఏకంగా 136 సార్లు రక్తదానం చేసి పరోక్షంగా అనేక మంది ప్రణాలను కాపాడారు. 62 సంవత్సరాల వయసులో కూడా ప్రతి ఆరు నెలలకూ ఓసారి ఇప్పటికీ రక్తదానం చేస్తూనే ఉన్నారు. కేవలం రక్తదానమే కాదు తాను మృతి చెందిన అనంతరం తన శరీరంలో పనికొచ్చే అన్ని అవయవాలు ఇండియన్ ఆర్మీకి దానం చేశారు. నగరంలోని డీడీ కాలనీలో నివాసం ఉండే యోగేష్ రాజ్ శ్రీవాస్తవ 1983లో వివేకవరి్ధని కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో అక్టోబర్ 2, మహాత్మాగాంధీ, లాల్బహదూర్ శాస్త్రీ జయంతి సందర్భంగా ఎన్ఎస్ఎస్ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మొదటి సారి రక్తదానం చేశారు. ఇక అప్పటి నుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూనే ఉన్నారు. 60 సంవత్సరాలు దాటిన తరువాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇప్పటికీ తన రక్తాన్ని దానం చేస్తున్నారు. రెడ్క్రాస్ సొసైటీకి, నగరంలో ఏ ఆస్పత్రి నుండి ఫోన్ వచ్చినా వెళ్లి రక్తదానం చేస్తుంటాడు. యోగేష్ది ఓ నెగెటివ్ కావడంతో రక్తదానం చేసిన ప్రతిసారీ మీరు ఒకరి ప్రాణాలు కాపాడారు అని వైద్యులు అంటుంటే అందులో కలిగే ఆనందం ఎక్కడా దొరకదని ఆయన అంటున్నారు. ఈయన రక్తదానం చెయ్యడమే కాకుండా రక్తదానంపై అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం నిపుతుంటారు. ప్రముఖుల నుంచి అభినందనలు.. ఇన్నిసార్లు రక్తదానం చేసిన యోగేష్ను ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, సీని ప్రముఖులు అభినందించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు తీసుకున్నారు. ఒక వేదికపై ప్రముఖ హీరో రాంచరణ్ మేము సినిమాల్లో హీరోలమైతే యోగేష్ రాజ్ శ్రీవాస్తవ్ నిజ జీవితంలో హీరో అని అందరిముందూ పొగడడం ఎంతో ఆనందం కలిగించిందని ఆయన తెలిపారు. పలు అవార్డులు, రికార్డులు.. యోగేష్కు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 16వ ఫిలిప్స్ గాడ్ఫ్రే బ్రేవరీ అవార్డు, క్యాలిఫోర్నియా యూనివర్సిటీ వారు ఫిలాసఫీ ఆఫ్ హ్యూమానిటీ డాక్టరేట్, 17 బంగారు, వెండి, 14 మెరిట్ సర్టిఫికెట్స్, రాజీవ్గాంధీ సమైక్యతా అవార్డు, లయన్ ఇంటర్నేషనల్ అవార్డు, స్వేచ్ఛా భారత్ పురస్కార్తో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. (చదవండి: Plane Crash Victims : ఆ భయం నుంచి బయటపడటం అంత ఈజీ కాదట..!)
ఫొటోలు
అంతర్జాతీయం

దుబాయ్: 67 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం..
దుబాయ్: అరబ్ దేశం దుబాయ్లో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ‘టైగర్ టవర్’గా పేరొందిన 67 అంతస్తుల ‘మెరీనా పినాకిల్’ భవనంలో అర్ధరాత్రి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సహాయక బృందాలు.. 3,820 మంది నివాసితులను సురక్షితంగా బయటకు తరలించాయి. ఇక, ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు.వివరాల ప్రకారం.. దుబాయ్లో ‘మెరీనా పినాకిల్’ భవనంలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. దాదాపు 6 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. అగ్ని ప్రమాదం నేపథ్యంలో సహాయక బృందాలు 764 ఫ్లాట్ల నుంచి 3,820 మంది నివాసితులను సురక్షితంగా బయటకు తరలించాయి.A massive fire broke out at the 67-story Marina Pinnacle (also known as Tiger Tower) in Dubai Marina on June 13, 2025, starting around PM. Dubai Civil Defense teams evacuated 3,820 residents from 764 apartments, with no reported injuries or casualties. The fire, which began… pic.twitter.com/OOsWDHj6pu— EternalChaos (@EternalChaos158) June 14, 2025 ఇక, అగ్ని ప్రమాదం కారణంగా ప్రమాదస్థలిలో అంబులెన్సులు, వైద్యసిబ్బందిని మోహరించారు. ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు. మెరీనా పినాకిల్లో మంటలు చెలరేగడం ఇదే మొదటిసారి కాదు. 2015లోనూ 47వ అంతస్తులో మంటలు చెలరేగి.. 48వ అంతస్తుకు వ్యాపించాయి. సహాయక సిబ్బంది మంటలార్పారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడయాలో వైరల్గా మారాయి. 🚨 BREAKING: Scenes from Dubai, As Projectile from Yemen hits a Marina Pinnacle Tower or Tiger Tower in Dubai Marina. This is a first inclident during the ongoing Iran Israel war in UAE pic.twitter.com/eVxPrJ6Wyu— True Pulse Global (@truepulseglobal) June 14, 2025

ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం.. శాటిలైట్ చిత్రాలలో..
టెహ్రాన్: ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం వాటిల్లింది. దీనిని ఉపగ్రహ ఛాయా చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ ఉపగ్రహ చిత్రాలను మాక్సర్ విడుదల చేసింది. ఇరాన్ ప్రపంచ హెచ్చరికలను ధిక్కరించి, అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని ఇజ్రాయెల్ చాలా కాలంగా ఆరోపిస్తోంది.ఇరాన్లో భారీస్థాయిలో అణు బాంబులను ఉత్పత్తి చేయగల యురేనియం నిల్వలు ఉన్నాయని ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే ఇరాన్ మాత్రం తన అణు కార్యక్రమం పౌర ప్రయోజనాల కోసమేనని చెబుతోంది. తాజాగా విడుదలైన హై-రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు ఇరాన్లోని ముఖ్య అణు కేంద్రానికి వాటిల్లిన నష్టాన్ని చూపిస్తున్నాయి. అలాగే దీనికి ముందున్న స్థితిని కూడా సరిపోల్చాయి. యూఎన్ అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ ఆపరేషన్లో నటాంజ్, ఫోర్డోలోని ఇరాన్ భూగర్భ యురేనియం కేంద్రాలు, ఇస్ఫహాన్లోని యురేనియం తరలింపు కేంద్రంపై దాడులు జరిగాయి.ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన యూఎస్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ (ఐఎస్ఐఎస్)నివేదిక ప్రకారం అణు కేంద్రంలో విద్యుత్ సరఫరాకు విస్తృతమైన నష్టం వాటిల్లింది. టెహ్రాన్కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న నటాంజ్లోని అణు కేంద్రంలో సమృద్ధిగా యురేనియం నిల్వలు ఉన్నాయి. అలాగే ఫోర్డోలోని అణు కేంద్రం టెహ్రాన్కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి స్వల్పంగా నష్టం వాటిల్లిందని ఇరాన్ పేర్కొంది.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ తమ పోరాటం 46 ఏళ్లుగా సాగుతున్న నియంతృత్వంపై జరుగుతున్న దాడి అని అన్నారు. ఇరాన్ విముక్తి దినం దగ్గర పడిందని, అది జరిగినప్పుడు, ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహం మరోసారి వర్ధిల్లుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఇరాన్ పాలనను ఇజ్రాయెల్ అనుమతించబోదన్నారు. ఇరాన్ తనదగ్గరున్న ఆయుధాలను, అణ్వాయుధాలను ఉగ్రవాదులను అందించాలని యోచిస్తోందని నెతన్యాహు ఆరోపించారు. అదేగనుక జరిగితే అణు ఉగ్రవాదానికి తెరలేస్తుందని, అప్పుడు అది యూరప్ నగరాలకు, చివరికి అమెరికాకు ముప్పు తెచ్చిపెడుతుందని ఆయన హెచ్చరించారు.ఇది కూడా చదవండి: Air India crash: విమానంలో ‘11ఏ’ సురక్షితమా? రమేష్ని అదే కాపాడిందా?

సోదాలు, అరెస్టులకు తాత్కాలిక విరామం
వాషింగ్టన్: అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరి మార్చుకున్నారు. వలసదారులందరినీ ఇప్పటికిప్పుడు ఉన్నపళంగా బయటకు తరిమేస్తే తలెత్తే ఇబ్బందుమిటో అనుభవంలోకి వస్తున్నాయి. కార్మిక శక్తి ఒక్కసారిగా తగ్గిపోతే పరిశ్రమలు నష్టాల్లోకి జారుకొనే ప్రమాదం పొంచి ఉంది. అందుకే సోదాలు, అరెస్టులు తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. వ్యవసాయ క్షేత్రాలు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లలో సోదాలు నిలిపివేయాలని ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ)కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మాంసం ప్యాకింగ్ ప్లాంట్లతోపాటు చేపల పెంపకం కేంద్రాల్లోనూ సోదాలు నిలిపివేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు గురువారం రాత్రి ఐసీఈ అధికారులకు అధికారికంగా ఈ–మెయిల్ పంపించినట్లు సమాచారం. ముగ్గురు ప్రభుత్వ అధికారులు ఈ విషయం ధ్రువీకరించారు. వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లలో మానవ అక్రమ రవాణా, మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం వస్తే సోదాలు కొనసాగించవచ్చని, అరెస్టులు చేయొచ్చని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

అమెరికాలో చట్టసభ్యులపై కాల్పులు
బ్లెయిన్/బ్రూక్లిన్: అమెరికాలో ఘోరం జరిగింది. ఇద్దరు మిన్నెసోటా రాష్ట్ర చట్టసభల సభ్యులపై ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన రాష్ట్ర ప్రతినిధుల సభ సభ్యురాలు, మాజీ స్పీకర్ మెలిసా హార్ట్మన్, ఆమె భర్త మార్క్ కాల్పులకు బలి కాగా రాష్ట్ర సెనేట్ సభ్యుడు, డెమొక్రటిక్–ఫార్మర్–లేబర్(డీఎఫ్ఎల్) పార్టీ నేత జాన్ హాఫ్మన్ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. మిన్నెసోటా రాష్ట్రంలోని బ్రూక్లిన్ పార్క్, ఛాంప్లిన్ పట్టణాల్లో ఈ దారుణాలు జరిగాయి. తొలుత సెనేటర్పై... దుండగుడు పోలీస్ స్క్వాడ్ తరహా ఎస్యూవీ వాహనంలో పోలీసు యూనిఫాంలో ఘాతుకాలకు పాల్పడ్డాడు. ముందుగా శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో ఛాంప్లిన్ పట్టణంలోని సెనేటర్ జాన్ ఇంటికి వెళ్లాడు. పోలీసు వాహనం, పోలీస్ అధికారి యూనిఫాం చూసి జాన్ తలుపు తీశారు. వెంటనే దుండగుడు లోనికి చొరబడ్డాడు. జాన్ దంపతులపై పలుమార్లు కాల్పులు జరిపి వచ్చిన కార్లోనే పారిపోయాడు. రక్తమోడుతున్న జాన్ దంపతులను పోలీసులు వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. పలు సర్జరీల తర్వాత కాస్త కోలుకున్నా వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం తెల్లవారుజామున 3.35 గంటలకు దుండగుడు బ్రూక్లిన్ పార్క్ పట్టణంలో హార్ట్మన్ ఇంటికెళ్లాడు. అతన్ని పోలీసుగా భ్రమించి లోపలికి రానిచ్చిన హార్ట్మన్ దంపతులపై కాల్పులు జరిపాడు. దాంతో వాళ్లు అక్కడిక్కడే మరణించారు. అదే సమయానికి సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు హార్ట్మన్ ఇంటివైపు వచ్చారు. ఇంట్లోంచి బయటికొస్తున్న దుండగుడు వారిపై కాల్పులకు దిగాడు. తర్వాత ఇంటి వెనుక తలుపు గుంఒడా పారిపోయాడు. ఇంటి ముందు నిలిపి ఉంచిన అతని కార్లో పలువురు చట్టసభస భ్యుల పేర్లతో కూడిన చీటీ పోలీసులకు దొరికింది. అబార్షన్ చేసే వైద్యులు, వాటిని సమ రి్థంచే లాయర్లు, పలు రాష్ట్రాల చట్టసభల సభ్యులు... ఇలా 70 మంది పేర్లు అందులో ఉన్నాయి. తూటాలున్న బ్యాగు కూడా దొరికింది. దుండగున్ని ప్రిటోరియన్ గార్డ్ సెక్యూరిటీ సంస్థలో సెక్యూరిటీ పెట్రోల్స్ విభాగం డైరెక్టర్ వాన్స్ బోల్టర్ (57)గా అనుమానిస్తున్నారు. అతనికోసం వేట మొదలెట్టారు. ఇవి రాజకీయ ప్రేరేపిత హత్యలేనని మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఆరోపించారు. దుండగున్ని వెంటనే పట్టుకుంటామని చెప్పారు.‘నో కింగ్స్’ కరపత్రాలూ.. దుండగుని కారులో ‘నో కింగ్స్’ కరపత్రాలు కూడా కనిపించాయి. అక్రమ వలసదారుల అరెస్టులను నిరసిస్తూ మొదలైన ఉద్యమంలో భాగంగా అమెరికావ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ‘నో కింగ్ పేరిట ర్యాలీలు జరుగుతుండటం తెల్సిందే. కాల్పుల ఘటన నేపథ్యంలో మిన్నెసోటాలో ర్యాలీలను విరమించుకున్నారు.
జాతీయం

‘స్మార్ట్ సిటీ’ చీటింగ్: 70 వేలమంది నుంచి రూ. 2,700 కోట్లు సేకరించి..
జైపూర్: రాజస్థాన్లో ‘స్మార్ట్ సిటీ’ పేరిట భారీ మోసం చోటుచేసుకుంది. సుభాష్ బిజ్రానీ, రణవీర్ బిజ్రానీ అనే సోదరులు వారి భాగస్వాములతో కలసి, సుమారు 70,000 మంది నుంచి రూ. 2,676 కోట్లను సేకరించి, మోసానికి పాల్పడ్డారు. సికార్ జిల్లాకు చెందిన వీరు ‘నెక్సా ఎవర్గ్రీన్’ అనే కంపెనీని స్థాపించారు. ‘ధోలేరా స్మార్ట్ సిటీ’లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి, వేలమందిని మోసం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.తొలుత వీరు ‘ధోలేరా స్మార్ట్ సిటీ’ పేరుతో ప్రాజక్టు చిత్రాలను రూపొందించి, పెట్టుబడిదారులను ఆకట్టుకున్నారు. ఈ పథకంలోని ప్రతీ స్థాయిలో మంచి ఆదాయం, కమిషన్లు, ఇతర బహుమతులను ఉంటాయని నమ్మబలికారు. వినియోగదారులు తమ పెట్టుబడుల విషయంలో కొన్ని స్థాయిలు దాటిన తరువాత వారికి ల్యాప్టాప్లు, బైక్లు, కార్లు తదితర రివార్డులు అందిస్తామని తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రత్యేక ఐడీ ఇచ్చి, ఈ పథకంలో మరింతమందిని చేర్చుకోగలిగితే, అదనపు కమిషన్లు కూడా ఇస్తామని సుభాష్ బిజ్రానీ, రణవీర్ బిజ్రానీలు హామీ ఇచ్చారు.ఈ ప్రాజెక్టు కోసం రణ్వీర్ బిజారాణి 2014లో ధోలేరాలో భూమిని కొనుగోలు చేశాడు. తరువాత అతని సోదరుడు సుభాష్ బిజ్రానీ ఈ పథకంలో రూ. 30 లక్షల పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత వారిద్దరూ ‘నెక్సా ఎవర్గ్రీన్’ను స్థాపించి, దానిని 2021లో అహ్మదాబాద్లో రిజిస్టర్ చేయించారు. తమ కంపెనీ ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘ధోలేరా స్మార్ట్ సిటీ' ప్రాజెక్టు చేపట్టిందని అందరికీ చెప్పారు. దీనిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చబోతున్నామని వివరించారు. ఈ నేపధ్యంలో 70 వేల మందికి పైగా జనం వీరి పెట్టుబడి పథకాలలో చేరగా, సుమారు రూ.2,676 కోట్లు ఈ సోదరుల ఖాతాలో జమ అయ్యాయి.ఈ మొత్తంతో వారు రాజస్థాన్లో లగ్జరీ కార్లు, గనులు, హోటళ్ళు, అహ్మదాబాద్లో ఫ్లాట్లు, గోవాలో 25 రిసార్ట్లను కొనుగోలు చేశారు. వారు రూ.250 కోట్ల నగదు ఖర్చు చేసి, మిగిలిన మొత్తాన్ని 27 షెల్ కంపెనీలకు బదిలీ చేశారు. ఇంతలో వీరు మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చిన దరిమిలా, ఈ ఇద్దరు సోదరులు తమ కార్యాలయాలన్నింటినీ మూసివేసి పరారయ్యారు. దీనిపై రాజస్థాన్లోని జోధ్పూర్లోని పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ‘నెక్సా ఎవర్గ్రీన్’కు చెందిన మనీలాండరింగ్పై దర్యాప్తు చేపట్టిన, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జైపూర్, సికార్, జున్జును, అహ్మదాబాద్లోని 25 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. కాగా ధోలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అనేది కేంద్రం, గుజరాత్ సంయుక్తంగా చేపడుతున్న ప్రాజెక్ట్. ఇది భారతదేశంలోని మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు. దీనిలో అంతర్జాతీయ విమానాశ్రయం, బహుళజాతి కంపెనీల కార్యాలయాలను నిర్మిస్తున్నారు. దీనిని 2042 నాటికి పూర్తిచేయాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇది కూడా చదవండి: Air India plane crash: భార్య చెప్పిందని.. ప్రమాదం నుంచి తప్పించుకున్న వైద్యుడు

‘శ్రీహరి కోట’కు బాంబు బెదిరింపు.. ముమ్మర తనిఖీలు
శ్రీహరి కోట: ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం ‘షార్’కు ఈరోజు (సోమవారం) ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. తమిళానాడు కంమాండ్ కంట్రోల్కు ఈ బెదిరింపు ఫోను కాల్ అందింది. ఈ నేపధ్యంలో అంతరిక్ష కేంద్రంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు.ఇటీవల భారత్ , పాక్ మధ్య దాడులు జరిగిన సమయంలో దేశంలోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే పోర్టులు ఎయిర్ పోర్టులపై కూడా దాడులు జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో ఆయా ప్రాంతాల్లో భద్రతను మరింతగా పెంచారు. ఇదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రం ‘షార్’ వద్ద భద్రతా దళాలును మొహరించారు. ఇది కూడా చదవండి: పాక్ ముస్లిం లీగ్.. జైరామ్ రమేష్ ఒక్కటే: బీజేపీ ఘాటు విమర్శ

Air India plane crash: భార్య చెప్పిందని.. ప్రమాదం నుంచి తప్పించుకున్న వైద్యుడు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న గుజరాత్కు చెందిన ఒక వైద్యుడు తన భార్య, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెబుతున్నాడు. ఇంటిలోనివారి మాట కాదని, ఒకవేళ అతను ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో ప్రయాణించి ఉంటే, ఇప్పుడు మన మధ్య ఉండేవాడు కాదు.ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది మృతిచెందారు. గుజరాత్కు చెందిన డాక్టర్ ఉమాంగ్ పటేల్ తన భార్య, కుమారులతో పాటు మే 24న గుజరాత్లోని మహిసాగర్కు వచ్చారు. భారతదేశంలో తన కుటుంబాన్ని ఉంచి, జూన్ 12న బ్రిటన్లోని నార్తాంప్టన్కు తిరిగి వెళ్లాలని ఆయన అనుకున్నారు.‘నేను జూన్ 12న ఒక్కడినే లండన్ వెళ్లవలసి ఉంది. అయితే జూన్ 9న నాకు తీవ్ర జ్వరం వచ్చింది. మరుసటి రోజు ఉదయానికి జ్వరం మరింతగా పెరిగింది. నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన నా భార్య.. జూన్ 12న బుక్ చేసుకున్న విమానం టికెట్ను రద్దు చేసుకుని, ఆరోగ్యం కుదుటపడేవరకూ ఇక్కడే ఉండమని కోరింది. దీంతో నేను విమానం టిక్కెట్ రద్దు చేసుకున్నాను. తరువాత జూన్ 15కి తిరిగి టికెట్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడు విమాన ప్రమాద వార్త వినగానే దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆ దేవుడే నన్ను కాపాడాడు. విమాన ప్రమాదంలో మరణించినవారికి భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని డాక్టర్ ఉమాంగ్ పటేల్ అన్నారు. ఆయన గత ఐదేళ్లుగా నార్తాంప్టన్లో నివాసం ఉంటున్నారు.ఇది కూడా చదవండి: పాక్ ముస్లిం లీగ్.. జైరామ్ రమేష్ ఒక్కటే: బీజేపీ ఘాటు విమర్శ

వాడితో తిరగడం మానుకో బిడ్డా.. ఇంతలోనే..
సాక్షి, రాయచూరు: ప్రేమించిన పాపానికి అమ్మాయిని ఆరు నెలల క్రితం హత్య చేసి పాతిపెట్టాడో కిరాతకుడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లాలో చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిన కారణంగానే హత్య చేసినట్టు ప్రియుడు పోలీసులు విచారణలో ఒప్పుకున్నాడు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గదగ్ తాలూకా నారాయణపుర గ్రామంలో మధుశ్రీ (21) అనే యువతిని సతీష్ హిరేమఠ (22) అనే యువకుడు ప్రేమించాడు. ప్రేమ పేరుతో షికార్లకు తీసుకెళ్లాడు. ఐదేళ్ల నుంచి ఈ ప్రేమాయణం సాగుతోంది. ఇది నచ్చని అమ్మాయి తల్లిదండ్రులు హిరేమఠతో తిరగడం మానుకోవాలని ఆమెను హెచ్చరించి గదగ్లోని బంధువుల ఇంట్లో ఉంచారు. గత ఏడాది డిసెంబర్ 16న గదగ్ నుంచి మధుశ్రీ వెళ్లిపోయింది. ఈ ఏడాది జనవరి 12న బెటగేరి పోలీస్ స్టేషన్లో కనబడుట లేదనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సతీష్ హిరేమఠ్పై అనుమానంతో పోలీసుల విచారణ జరిపారు.పెళ్లి చేసుకోమనడంతో..ఇద్దరూ బైక్లో వెళ్తున్నట్లు గదగ్లో కొన్ని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టిగా విచారించగా నిందితుడు నిజం కక్కాడు. పెళ్లి చేసుకోవాలని మధుశ్రీ ఒత్తిడి చేసింది.. తనకు పెళ్లి ఇష్టం లేదని, అందుకే ఊరి బయటకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపి, వాగులో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు తెలిపాడు. అనంతరం, గదగ్ యస్ఐ మారుతి, పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి చూడగా యువతి అస్తిపంజరం కనిపించింది. ప్రేమోన్మాది చేతిలో బలయ్యావా తల్లీ అని తల్లిదండ్రులు విలపించారు.
ఎన్ఆర్ఐ

‘వీసా’ భయాలతో భారతీయ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వరుస నిర్ణయాలతో విదేశీ విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉన్నవాళ్లను సొంత దేశాలకు పంపించేయడం.. కొత్త వాళ్లను అమెరికాలో అడుగుపెట్టనివ్వకుండా కఠిన ఆంక్షల దిశగా అడుగులేస్తున్నారాయన. ఈ క్రమంలో వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ విద్యార్థులు(Indian Students) అప్రమత్తం అయ్యారు. కొందరు తాము చేసిన పోస్టులు తొలగిస్తుండగా.. మరికొందరు ఏకంగా సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేస్తున్నారు. విదేశీ విద్యార్థులకు వీసాలు(American Visas) మంజూరు చేయడానికి ముందు వారి సోషల్ మీడియా ఖాతాలను తనిఖీలు చేసే పనిలో అమెరికా అధికార యంత్రాంగం ఉంది. ఇందుకోసం అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగిస్తోంది. పాలస్తీనా మద్దతుదారుల దగ్గరి నుంచి.. యూఎస్ క్యాంపస్లలో జరిగిన వివిధ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను ఈ సాంకేతికత ఉపయోగించే బయటకు పంపించేసింది. ఈ క్రమంలో.. అతిగా ఉన్న పోస్టులు చూస్తే చిక్కుల్లో పడతామనే భావనతో అలాంటి వాటిని భారతీయ విద్యార్థులు డిలీట్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఎక్స్, లింక్డిన, టిక్టాక్ ఇలా ఇతర ఫ్లాట్ఫారమ్లన్నింటిని జల్లెడ పడుతున్నారు. వాటిల్లో తమ యాక్టివిటీ( పోస్టులు చేయడంతో పాటు లైకులు, షేర్లు, కామెంట్లు.. వగైరా)ని తొలగిస్తున్నారు. కొందరైతే ఏకంగా అకౌంట్నే తొలగిస్తున్నట్లు సమాచారం.అభిప్రాయాల దగ్గరి నుంచి పొలిటికల్ జోక్స్ దాకా వేటిని తమ టైం లైన్లో ఉంచడం లేదు. అమెరికా అధికారులు వాటిని చూస్తే వీసాలు రిజెక్ట్ అవుతాయని భయపడుతున్నారు. అయితే ఇలా హఠాత్తుగా అకౌంట్లనూ తొలగించడమూ మంచిది కాదనే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

టీఏడీ కార్య నిర్వహక బోర్డు ఎన్నిక
కోపెన్హాగన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(Telangana Association of Denmark)(టీఏడీ) 2025–2027 సంవత్సరానికి గాను కొత్తగా కార్యనిర్వాహక బోర్డును ఎన్నుకుంది. ఈ సందర్భంగా బోర్డు సభ్యులకు టీఏడీ అభినందనలు తెలియజేసింది. 2025–2027 కాలానికి ఎన్నికైన కార్యనిర్వాహక బోర్డు సభ్యుల జాబితాను, వారి హోదాను టీఏడీ అధికారికంగా ప్రకటించింది. టీఏడీలోని సభ్యులు అంకితభావంతో బాధ్యతాయుతంగా సమాజానికి సేవ చేయడానికి, బోర్డుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపిక అయ్యారని టీఏడీ తెలిపింది. త్వరలో నిర్వహించబోయే ప్రమాణ స్వీకారోత్సవంలో ఈ సభ్యులు అధికారికంగా తమ బాధ్యతలు చేపట్టనున్నారు. బోర్డుకు ఎంపికైన సభ్యులు, వారి హోదాలు ఇలా ఉన్నాయి.1. ఉపేందర్ గిలకథుల (అధ్యక్షులు) 2. సురేందర్ కేసాని (ఉపాధ్యక్షులు) 3. విజయ్ మోహన్ గోపి (కార్యదర్శి)4. ఈశ్వర్ ఎమ్మడి (కోశాధికారి), 5. పవన్ కుమార్ పబ్బా (టెక్నికల్ మేనేజర్) 6. సతీష్ సామ (విదేశీ వ్యవహారాల మేనేజర్), 7. రాజ్ కుమార్ కలువల (అసెట్ మేనేజర్), 8. రమేష్ వనపర్తి (పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్)9. సులక్షణ చౌదరి కోర్వా (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 10. సాయ గౌడ్ పడాల (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 11. సాయికృష్ణా రెడ్డి మిల్కా (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు),12. మహేష్ ఆలేటి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 13. దయానంద్ గౌడ్ పడాల (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 14. వాసుదేవ్ గౌడ్ బిక్కి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 15. అఖిల్ కర్నాటి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 16. గోకుల్ దేసు (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 17. రాజేశ్వర్ నీరడి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 18. శరణ్ యాల్కా ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు)

NRI News : వెన్నుపోటు దినం యూకేలో ఎన్ఆర్ఐల నిరసన
జూన్ 4 వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా వైస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో UK లోని ఈస్ట్ లండన్ మరియు లెస్టర్ నుంచి నిరసన తెలియజేసారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అనేక సంక్షేమ పథకాలనుతుంగలోకి వైనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మలిరెడ్డి కిషోర్ రెడ్డి , చల్లా మధుసూదన్ యాదవ్ , ప్రణయ్ గడిమే ఆనంద్ అక్కిదాసు, రామిరెడ్డి జయచంద్రా రెడ్డి , చలపతి గుర్రం,యశ్వంత్ గరికపాటి,సాయి ప్రదీప్ పాల్గన్నారు.ఒకరికి ముగ్గురు చొప్పున( చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పురందరేశ్వరి ) చెప్పిన అబద్దాన్ని పదే పదే చెప్పి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేపట్టిన ఏపీ సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆర్థిక విద్వంసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!

బాబు పాలన చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది : ఎన్ఆర్ఐలు
సిడ్నీ: ఏపీలో కొనసాగుతున్న రాక్షస పాలనతో ప్రజలు పడుతున్న బాధలను చూస్తుంటే తమ కడుపు తరుక్కుపోతుందని ఆస్ట్రేలియా ఎన్నారైలు తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాలను చూసి చలించిపోతున్నామన్న ఎన్ఆర్ఐలు.. మరో నాలుగేళ్లు ఈ రాక్షస పాలనలో బాధలు పడడం వారి దురదృష్టమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ రాజకీయాలతో కూటమి నేతలు కాలయాపన చేస్తున్నారని ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ కూడా సాధించలేదని వారు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి , హరి ఎడనపర్తి, దూడల లోక కిరణ్ రెడ్డి, కృష్ణ చైతన్య కామరాజు, బుర్ర ముక్కు రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
క్రైమ్

విద్యుదాఘాతానికి నలుగురు బలి
కోరుట్ల: రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. హైదరాబాద్లో ఇద్దరు, జగిత్యాల జిల్లాలో ఇద్దరు మరణించగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. కోరుట్ల–మెట్పల్లి జాతీయ రహదారి వెంట ఉన్న బాలాజీ కళా ఆర్ట్స్లో గణపతి విగ్రహాలు తయారు చేస్తారు. షెడ్లో తయారు చేసిన ఓ గణపతి విగ్రహానికి రంగులు వేసేందుకు మరో షెడ్కు తరలించడానికి ఆదివారం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో క్రేన్తో ఏర్పాట్లు చేసుకున్నారు. యజమాని అల్వాల వినోద్, ఆయన తమ్ముడు అల్వాల నితిన్ 8 మంది వర్కర్లతో కలిసి విగ్రహాన్ని ట్రాలీపై జాతీయ రహదారిపైకి తెచ్చారు. విగ్రహం దాదాపు 12 ఫీట్ల ఎత్తు ఉండటంతో కిరీటం భాగం పైన ఉన్న 33 కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. విగ్రహం తడిగా ఉండటంతో విగ్రహాన్ని పట్టుకుని ఉన్న పది మంది విద్యుత్ షాక్కు గురయ్యారు. కరెంట్ తీగల్లో మంటలు చెలరేగి విగ్రహం కిరీటం కాలిపోయింది. ఏడుగురు షాక్తో విగ్రహానికి అతుక్కుపోయారు. మరో ముగ్గురు కింద పడిపోయారు. గమనించిన చుట్టుపక్కల వారు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతోపాటు వారు కరెంటు తీగలను పక్కకు తప్పించారు. బాధితులను కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి.. అక్కడి నుంచి జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో యజమాని అల్వాల వినోద్ (32), వర్కర్ వెల్లుట్ల సాయికుమార్ (23) మృతిచెందారు. ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు. ప్రమాద స్థలాన్ని ఎస్పీ అశోక్కుమార్ సందర్శించారు. నిద్రలోనే తెల్లారిన బతుకులు నాగోలు: నిద్రిస్తున్న వారిపై విద్యుత్ తీగలు తెగిపడిపోవ డంతో ఇద్దరు సజీవ దహనమైన ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్లోని సాగర్ రింగ్ రోడ్డు చౌరస్తా సమీపంలోని బాబాయ్ హోటల్ సమీపంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద ఫుట్పాత్పై ఇద్దరు గుర్తు తెలియ ని యాచకులు నిద్రిస్తున్నారు. వారితోపాటు ఓ శునకం కూడా ఉంది. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహ నం విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో 11 కేవీ హైటెన్షన్ వైరు తెగి నిద్రిస్తున్న వారిపై పడింది.ఇద్దరు యాచకులతోపాటు పక్కనే ఉన్న శునకం సజీవ దహనమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్ధితి పరిశీ లించారు. 11కేవీ విద్యుత్ తీగ వారిపై పడిపోవడంతో మంటల్లో కాలిపోయి వారి బట్టలు, దుప్పట్లు వారి శరీరాలకు అంటుకున్నాయి. గుర్తించలేని విధంగా మృతదేహాలున్నాయి. మృతులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఫాదర్స్డే రోజున నాన్న లేడాయే...
నెహ్రూసెంటర్: భర్త మరణం భార్యకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వివాహ వార్షికోత్సవం తర్వాత రోజే విద్యుత్ ప్రమాదరూపంలో మృత్యువాత పడడంతో ఆ కుటుంబ విషాదంలో మునిగిపోయింది. మరోచోట కరెంట్ షాక్తో వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ఆయా ఘటనలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. డోర్నకల్ మండలంలో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న క్రాంతికుమార్ (32) ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తూ శనివారం విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్కు తీసుకురాగా అప్పటికే మృతిచెందాడు. క్రాంతికుమార్ మృతితో భార్య, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు.సంతోషం.. మరునాడే విషాదంమృతుడు క్రాంతికుమార్ దంపతులు శుక్రవారం పెళ్లిరోజు వేడుకలను సంబురంగా జరుపుకున్నారు. భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన కాంత్రి మరుసటి రోజే మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. తమను సంతోషంగా చూసుకుంటాడనుకున్న భర్త మృతితో భార్య రోదనలు మిన్నంటాయి.ఫాదర్స్డే రోజున నాన్న లేడాయే...క్రాంతికుమార్కు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నేడు అందరూ ఫాదర్స్ డే జరుపుకుంటుండగా చిన్నారులకు మాత్రం కన్నతండ్రి దూరమైన పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆ చిన్నారులు తమ తండ్రి చనిపోయిన విషయాన్ని సైతం తెలుసుకునే వయస్సులో లేకపోవడం కలిచివేస్తుంది.ఇనుగుర్తిలో ఘటన...జిల్లాలో ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. డోర్నకల్లో జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇనుగుర్తి శివారు వీరారెడ్డిపల్లిలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అదే గ్రామానికి చెందిన బూర్గుల అంబేడ్కర్కు తీవ్ర గాయాలయ్యాయి. జీజీహెచ్కు తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్లో ఆస్పత్రికి తరలించారు.

ఆస్తినంతా ప్రియురాలికి ఇచ్చాడు
కర్ణాటక: వారం రోజుల క్రితం జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలో నిద్రిస్తున్న భర్తపై పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో భార్య కారణాలను వెల్లడించింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన కూలికార్మికుడు రంగస్వామి (47) నిద్రపోతుండగా భార్య కవిత (44) పెట్రోలు పోసి తగలబెట్టడంతో చనిపోయాడు.పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారించారు. తమకు పెళ్లి జరిగి 22 ఏళ్లు అయ్యిందని, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారని, తమకు ఆస్తి, డబ్బు, నగలు అన్నీ ఉన్నాయని, కుటుంబంతో బాగానే ఉన్నామని తెలిపింది.అయితే భర్త కూలి పని చేసే చోట మరో మహిళ మంజులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. ఇంట్లో ఉన్న నగలు మంజులకు అందజేశాడు. ఆస్తిని విక్రయించి ఆమెకు ముట్టజెప్పాడని తెలిపింది. రోజూ తాగి వచ్చి అందంగా లేవని నన్ను దూషించేవాడని, దీంతో హత్య చేశానని చెప్పింది. కాగా తండ్రి మరణించి, తల్లి జైలుకెళ్లి ముగ్గురు పిల్లలు బోరుమని విలపించారు.

ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
సనత్నగర్(హైదరాబాద్): ఎర్రగడ్డ జనప్రియా అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి ఓ మహిళ దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..ఏలూరు జిల్లా అడ్డగిద్దల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రాజు, కొక్కిణి శ్రావణి (30) దంపతులు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు నడుస్తుండడంతో మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో గత ఆరు నెలల క్రితం శ్రావణిని ఎర్రగడ్డ జనప్రియా అపార్ట్మెంట్స్లో ఉండే తల్లిదండ్రులు శ్రీనివాస్, దుర్గాలు తమ వద్దకు తీసుకువచ్చారు. గత ఆరు నెలలుగా తల్లిదండ్రులతో కలిసి ఉంటూ స్థానికంగా హౌస్ కీపింగ్ పనులు చేస్తుంది. మూడు రోజుల క్రితం వీరు ఊరిలో ఉన్న అల్లుడు రాజు వద్దకు వెళ్లి తమ కూతురు కాపురం నిలబెట్టాలనే ఉద్దేశంతో ఒప్పించి అతనిని కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. అయితే భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరగడంతో మనస్తాపం చెందిన శ్రావణి శనివారం ఉదయం 8.30 గంటలకు జనప్రియా అపార్ట్మెంట్స్ ఐదో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల వల్లనే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.