Top Stories
ప్రధాన వార్తలు

‘శ్రీకృష్ణదేవరాయలు లాగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి వైఎస్ జగన్’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. పండుగ సందర్భంగా పార్టీ నేతలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.ఉగాది వేడుకల సందర్భంగా ప్రముఖ అవధాని నారాయణ మూర్తి పంచాంగ శ్రవణం చెప్పారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మళ్ళీ విజయ దుందుభి మోగిస్తారు. ఓడితే చాలా మంది భయపడతారు. కానీ, వైఎస్ జగన్ అలా బయటపడలేదు. మిథున రాశి వారికి ఈ ఏడాది మంచి జరుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి. ఆవేశంలో ప్రజలు చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. శ్రీ కృష్ణదేవరాయలులాగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి వైఎస్ జగన్. సాంఘికంగా ఔన్నత్యాన్ని పొందుతారు. ముఖ్యమంత్రి కుర్చీలో మళ్ళీ తిరిగి వైఎస్ జగన్ కూర్చుంటారు’ అని చెప్పుకొచ్చారు.ఇక, ఉగాది వేడుకల్లో పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జాతి పునర్నిర్మాణంలో... 'ఆర్ఎస్ఎస్'@100
దేశమాత సేవలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నూరు వసంతాలను పూర్తిచేసుకుంటున్న తరుణంలో, ఈ మైలు రాయిని సంఘ్ ఏ విధంగా పరిగణిస్తుందో అనే విషయంలో ఒక స్పష్టమైన జిజ్ఞాస ఉంటుంది. ఇలాంటి సందర్భాలు... ఉత్సవాల కోసం కావని, ఆత్మపరిశీలన చేసుకుని, లక్ష్యసాధనకు పునరంకితం కావడానికి వీటిని అవకాశంగా తీసుకోవాలన్నది సంఘ్ స్థాపించినప్పటి నుండి సుస్పష్టమైన విషయం. అదే సమయంలో, ఈ మహోద్యమానికి మార్గదర్శకులైన మహనీయ సద్గురువులు, నిస్వార్థంగా ఈ మార్గంలోకి ప్రవేశించిన స్వయంసేవకులు, వారి కుటుంబాల స్వచ్ఛంద సహకారాన్ని స్మరించుకునేందుకు ఇదొక అవకాశం. ప్రత్యేకించి, సంఘ్ స్థాపకులైన డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ జయంతి సుదినమే హిందూ కాలదర్శినిలో మొదటి రోజైన వర్ష ప్రతిపద కూడా అయిన తరుణంలో... ఈ నూరు సంవత్సరాల ప్రయాణాన్ని పునర్దర్శనం చేసుకునేందుకు, సమరసతతో కూడిన సమైక్య భారతావని దిశగా సంకల్పం చేసుకునేందుకు ఇంతకు మించిన అనువైన సందర్భం మరేముంటుంది? దేశం కోసం జీవించేలా...డాక్టర్ హెడ్గేవార్లో భారతదేశం పట్ల అహంకార రహితమైన ప్రేమ, అఖండమైన అంకితభావం చిన్నతనం నుంచే కనపడింది. కోల్కతాలో తన వైద్య విద్యను పూర్తిచేసేనాటికే, సాయుధ విప్లవం నుంచి సత్యాగ్రహం వరకూ భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తిని కలిగించేందుకు చేపట్టిన అన్ని రకాల ప్రయత్నాలతోనూ ఆయనకు అనుభవం ఉంది. అదే సమయంలో దైనందిన జీవితంలో దేశభక్తి లేకపోవడం, సంకుచిత ప్రాంతీయ విభేదాలకు దారితీసేలా ఉమ్మడి జాతీయ వ్యక్తిత్వం పతనం కావడం, సామాజిక జీవితంలో క్రమశిక్షణరాహిత్యం వల్ల భారతదేశంలో బయటివారి దురాక్రమణ సంభవించి వీరి స్థానం సులభతరమైందని ఆయన గ్రహించారు. ఎడతెగని దురాక్రమణలతో మన ఘనచరిత్రకు సంబంధించిన సామాజిక జ్ఞాపకాలను ప్రజలు మరచిపోయారని ఆయనకు అనుభ వానికి వచ్చింది. ఫలితంగా మన సంస్కృతి, జ్ఞాన సంబంధమైన సంప్రదాయం పట్ల నైరాశ్యభావం, ఆత్మన్యూనతాభావం చోటు చేసు కున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరో కొద్దిమంది నాయకుల నేతృత్వంలో జరిగే రాజకీయ కార్యకలాపాలు మన ప్రాచీన దేశపు సమస్య లను పరిష్కరించలేవన్న నిశ్చయానికి వచ్చారు. అందుకే, దేశం కోసం జీవించేలా ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు నిరంతర ప్రయత్నా లతో కూడిన ఒక పద్ధతిని రూపొందించాలని నిర్ణయించారు. రాజ కీయ పోరాటానికి అతీతంగా దార్శనిక దృష్టికోణంతో ఆయన చేసిన ఆలోచన ఫలితమే శాఖా పద్ధతి ఆధారంగా వినూత్నమైన పద్ధతిలో నడిచే సంఘం ఆవిర్భావం.ఈ ఉద్యమం, సిద్ధాంతాల క్రమబద్ధమైన పురోగతి ఒక అద్భు తానికి ఎంతమాత్రం తక్కువ కాదు. హెడ్గేవార్ ఈ భావజాలాన్ని సిద్ధాంతంగా రూపొందించలేదు, కానీ ఆయన ఒక కార్యాచరణ ప్రణాళికను విత్తన రూపంగా ఇచ్చారు, అది ఈ ప్రయాణంలో చోదక శక్తిగా నిలిచింది. ఆయన జీవితకాలంలో, భారతదేశంలోని అన్ని ప్రాంతాలకూ సంఘ కార్యం విస్తరించింది.శాఖోపశాఖలుగా ‘శాఖ’మనం స్వాతంత్య్రాన్ని పొందినప్పుడు, అదే సమయంలో భారతమాతను మతం ఆధారంగా విచ్ఛిన్నం చేసినప్పుడు, పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ జనాభాను రక్షించి వారికి గౌరవ, మర్యాద లతో కూడిన పునరావాసాన్ని కల్పించడంలో సంఘ్ స్వయంసేవ కులు తమ అంకితభావాన్ని కనబరిచారు. సమాజం కోసం బాధ్యత, కర్తవ్యభావాలతో ముడిపడిన స్వయంసేవక్ అనే భావన విద్య, కార్మిక రంగం, రాజకీయరంగాల వంటి చోట తన శక్తిని ప్రదర్శించడం మొదలుపెట్టింది. రెండవ సర్సంఘ్చాలక్ అయిన శ్రీ గురూజీ (మాధవ సదాశివ గోల్వాల్కర్) మార్గదర్శక శక్తిగా ఉన్న ఈ దశలో ప్రతి విషయం జాతీయ సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని పునర్వ్యవస్థీ కరించబడాలి! దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు రాజ్యాంగంపై క్రూర దాడి జరిగిన కాలంలో ప్రజాస్వామ్య పునరు ద్ధరణకు జరిగిన శాంతియుతపోరులో సంఘ్ స్వయంసేవకులు కీలక పాత్ర పోషించారు. రామజన్మభూమి విముక్తి వంటి ఉద్యమాలు సాంస్కృతిక విమోచనం కోసం భారతదేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలను అనుసంధానించాయి. జాతీయ భద్రత నుంచి సరిహద్దుల నిర్వహణ వరకు, పాలనా భాగస్వామ్య వ్యవస్థ నుంచి గ్రామీణాభి వృద్ధి వరకు, సంఘ్ స్వయంసేవకులు స్పృశించని అంశం లేదు. ప్రతి విషయాన్నీ రాజకీయ దృష్టికోణంతో చూసే ధోరణి ఉన్నప్పటికీ, సంఘ్ ఇప్పటికీ సమాజపు సాంస్కృతిక జాగరణపైన, సరైన ఆలోచనలు గల వ్యక్తులు – సంస్థలతో బలమైన అనుసంధాన వ్యవస్థను సృష్టించడంపైన దృష్టి పెట్టింది. సామాజిక పరివర్తనలో మహిళల భాగస్వామ్యం, కుటుంబ వ్యవస్థ పవిత్రతను పునరుద్ధరించడంపై గత కొన్ని సంవత్సరాలుగా సంఘ్ దృష్టి సారించింది. లోక మాత అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది వేడుకల సందర్భంగా సంఘ్ పిలుపుతో దేశమంతటా 27 లక్షల మందికి పైగా వ్యక్తులతో సుమారు 10 వేల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మన దేశ నాయకుల విషయంలో మనమంతా కలిసి ఎలా వేడుక చేసుకుంటున్నామో ఇది సూచిస్తుంది. సంఘ్ తన నూరవ సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు బ్లాక్, గ్రామ స్థాయి వరకూ జాతి నిర్మాణం కోసం వ్యక్తి నిర్మాణ కార్యాన్ని కీలకంగా చేపట్టాలని సంఘ్ నిర్ణయించింది. గత ఏడాది కాలంలో పటిష్ఠమైన ప్రణాళికతో మరో పది వేల శాఖలను జోడించేలా కార్యాచరణ చేయడమన్నది అంకితభావానికి, అంగీకారానికి చిహ్నం. అయితే, ప్రతి గ్రామానికి, బస్తీకి చేరుకోవడ మనే లక్ష్యం ఇంకా ఒక అసంపూర్ణంగా ఉంది. దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాబోయే సంవత్సరాలలో పరివర్తనకు ఉద్దేశించిన పంచ్ పరివర్తన్ అనే ఐదంశాల కార్యక్రమం ప్రధానంగా కొనసాగుతుంది. శాఖ నెట్వర్క్ను విస్తరించే క్రమంలో పౌరవిధులు, పర్యా వరణహితమైన జీవనశైలి, సామాజిక సమరసతా వర్తన, కుటుంబ విలువలు, స్వీయత్వ స్పృహపై ఆధారపడిన దైహికమార్పుపై దృష్టిని ఉంచింది. తద్వారా ప్రతి ఒక్కరూ ‘పరం వైభవం నేతు మేతత్ స్వరాష్ట్రం’ – మన దేశాన్ని మహావైభవ స్థితికి తీసుకువెళ్లే బృహత్ ప్రయోజనం కోసం తమ వంతు కృషి చేస్తారు.గత వంద సంవత్సరాలలో, సంఘ్ ఒక జాతీయ పునర్నిర్మాణ ఉద్యమంగా ప్రయాణించింది. ఎవ్వరినైనా వ్యతిరేకించడం పట్ల సంఘ్కి నమ్మకం లేదు. అలాగే, ఈ రోజున సంఘ్ పనిని వ్యతిరే కిస్తున్నవారు కూడా సంఘ్లో భాగమవుతారనే విశ్వాసాన్ని కలిగి ఉంది. ప్రపంచం పర్యావరణ మార్పుల నుంచి హింసాత్మక ఘర్షణల వరకు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో సత్వర పరిష్కా రాలను అందించే సామర్థ్యాన్ని భారతదేశపు ప్రాచీన, అనుభవ ఆధారిత జ్ఞానం కలిగివుంది. ఈ అతి పెద్దయిన, అనివార్యమైన కార్యం ఎప్పుడు సాధ్యమవుతుందంటే, భారతమాత పుత్రులందరూ తమ పాత్రను అర్థం చేసుకుని, ఇతరులు సైతం అనుసరించేలా ప్రేరేపించే దేశీయ నమూనాను నిర్మించడంలో తమ వంతు కృషి చేసినప్పుడే! ఇందుకోసం సజ్జన శక్తి నాయకత్వంలో సమరసతతో కూడిన సంఘటిత భారతీయ సమాజంలో ఆదర్శవంతులమై నిలిచే సంకల్పంతో ఏకమవుదాం!దత్తాత్రేయ హోసబాళె వ్యాసకర్త ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ్ (జాతీయ ప్రధాన కార్యదర్శి)

ప్రేమను పంచే శుభదినం ఈద్
ఈదుల్ ఫిత్ర్ లేక రంజాన్ పర్వదినం ప్రపంచంలోని ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైన, ఆనందకరమైన వేడుక. అత్యంత ఉత్సాహంగా, ఆనందంగా వారు ఈవేడుకను జరుపుకుంటారు. ఈ పర్వదినాన్ని ‘ఈద్’ అని కూడా పిలుస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ను అనుసరించి రంజాన్ నెల ముగిసిన మరునాడు దీన్ని జరుపుకుంటారు.రంజాన్, ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదవ నెల. ఇది ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంలో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెలలో ముస్లింలు ప్రత్యేకంగా ఉపవాసం (సియామ్) పాటిస్తారు, అంటే ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు భోజనం, పానీయాలు, ఇతర శరీర సంబంధిత అవసరాలన్నీ త్యజిస్తారు. ఉపవాసం ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒక శుద్ధి ప్రక్రియగా భావించ బడుతుంది, ఇది స్వీయ నియంత్రణ, ప్రేమ, దయ, జాలి, క్షమ, సహనం, పరోపకారం, త్యాగం లాంటి అనేక సుగుణాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. ఈ సందర్భంగా వారు వారి దైనందిన సేవాకార్యక్రమాలను మరింత విస్తరించుకొని, నైతికంగా, ఆధ్యాత్మికంగా తమ వ్యక్తిత్వాలను నిర్మించుకొని దేవుని కృపా కటాక్షాలు పొందడానికి ప్రయత్నిస్తారు. ఈదుల్ ఫిత్ర్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని, సమాజంలో పేదరికాన్ని తొలగించే ప్రయత్నం కూడా ఎంతోకొంత జరుగుతుంది. దాతృత్వం, సామాజిక సేవలకుప్రాధాన్యం ఇవ్వడం ఈ పండుగ ప్రధాన లక్ష్యం. ప్రతి ఒక్కరూ తమ తోటి సోదరులకు సహకరిస్తూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోడానికి ప్రయత్నిస్తారు. సదఖ, ఫిత్రా, జకాత్ ల ద్వారా అర్హులైన అవసరార్థులకు ఆర్థిక సహాయం అందిస్తారు.ఈదుల్ ఫిత్ర్ పర్వదినం సమస్త మానవాళి, సర్వ సృష్టిరాశి సుఖ సంతోషాలను కాంక్షించే రోజు. ఆనందం, శాంతి, సంతోషం, సమానత్వం, క్షమ, దయ, జాలి, పరోపకారం, సామాజిక బాధ్యతలను ప్రతిబింబించే ప్రత్యేకమైన రోజు. ఇది కేవలం ఒక ఆథ్యాత్మిక క్రతువు కాదు. సమాజంలో ప్రేమ, సహకారం, పరస్పర మైత్రి, బాధ్యత, ఆనందాలను పంచుకునే వేడుక. రంజాన్ నెల రోజుల శిక్షణ ద్వారానూ, ఈద్ పండుగ ద్వారానూ సమాజం ఆధ్యాత్మికతను, మానవతా విలువలను పునరుద్ధరించుకుంటుంది.పండగ తర్వాత కూడా...ఈద్ తో రోజాలకు వీడ్కోలు పలికినప్పటికీ, నెలరోజులపాటు అది ఇచ్చినటువంటి తర్ఫీదు అనంతర కాలంలోనూ తొణికిస లాడాలి. పవిత్ర రంజాన్ లో పొందిన దైవభీతి శిక్షణ, దయాగుణం, సహనం, సోదరభావం, పరస్పర సహకార, సామరస్య భావన, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలు పంచుకునే గుణం, పరమత సహనం, సర్వ మానవ సమానత్వం లాంటి అనేక సదాచార సుగుణాలకు సంబంధించిన తర్ఫీదు ప్రభావం మిగతా పదకొండు నెలలకూ విస్తరించి, తద్వారా భావి జీవితమంతా మానవీయ విలువలే ప్రతిబింబించాలి. సమస్త మానవాళికీ సన్మార్గభాగ్యం ప్రాప్తమై, ఎలాంటి వివక్ష, అసమానతలులేని, దైవభీతి, మానవీయ విలువల పునాదులపై ఓ సుందర సమ సమాజం, సత్సమాజ నిర్మాణం జరగాలి. ఇహపర లోకాల్లో అందరూ సాఫల్యం పొందాలి. ఇదే రంజాన్ ధ్యేయం.ఈ రోజు ముస్లింలు ఉదయాన్నే నిద్రలేచి పరిశుభ్రతను పొందుతారు. ఈద్ నమాజ్ /ప్రార్థన ఆచరించి కుటుంబంతో, స్నేహితులతో కలిసి పండుగను జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ ఈ రోజున వారి వారిస్థోమత మేరకు కొత్త దుస్తులు ధరించి, పలు రకాల తీపి వంటకాలు ముఖ్యంగా సేమియా/షీర్ ఖుర్మా తీసుకుంటారు. ఈదుల్ ఫిత్ర్ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక, మానవీయ సుగుణాలను పునరుధ్ధరించే మహత్తరమైన రోజు. ఈ పండుగ రోజున ముస్లిం సమాజం జకాతుల్ ఫిత్ర్ అనే దానం కూడా ఇస్తారు. పేదసాదలను గుర్తించి వారికి ఫిత్రా దానాలు చెల్లించడం ద్వారా తమ దాతృత్వాన్ని చాటుకోవడం కాకుండా తమ బాధ్యతను నెరవేర్చామని భావిస్తారు.రంజాన్ నెల ముగియగానే, షవ్వాల్ నెల మొదటి రోజు ముస్లిం సోదరులు ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినం జరుపుకుంటారు. ‘ఫిత్ర్’ అంటే దానం, పవిత్రత లేదా శుద్ధి అని కూడా అంటారు. ఇది ఉపవాసం,ప్రార్థనల ధార్మిక విధిని పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దైవానికి కృతజ్ఞతలు తెలుపుకునే అపురూప సందర్భం.– మదీహా అర్జుమంద్

చక్రవర్తులందరూ పన్నులను వడ్డించినవారే!
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ క్రూరుడూ, హిందూ వ్యతిరేకీ కాబట్టి, మహారాష్ట్రలో ఉన్న అతని సమాధిని తవ్వి తీసిపారెయ్యాలని డిమాండ్ చేస్తూ, నాగపూర్లో, వారం కిందట, కొన్ని హిందూ సంస్థలు సభలూ, నిరసన ప్రదర్శనలూ జరిపాయి. ఔరంగజేబు సమాధిని తీసెయ్యనక్కరలేదనీ, అతను అంతిమంగా మరాఠా ప్రజల చేతుల్లో ఓడిపోయాడు గనక, అతని సమాధి, మరాఠా ప్రజల వీరత్వానికి గుర్తుగా ఉంటుందని చీలిన శివసేనలోని ఒక పక్షం వాదన. తీసేస్తే తీసెయ్యండి, కానీ మహారాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టండి– అని కూడా ఒక విమర్శ. ఇటీవల వచ్చిన, హిందీ సినిమా ‘ఛావా’లో చూపించినట్టు... ఔరంగజేబు క్రూరుడు కాదనీ, ఎన్నో మంచిపనులు కూడా చేశాడనీ, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఒక ముస్లిం సభ్యుడు అన్నాడు. వివాదం పెరిగి పెద్దదై, నాగపూర్లో చిన్న స్థాయి మతకలహాల వంటివి జరిగి షాపులూ, ఇళ్ళూ, వాహనాలూ ధ్వంసం అయ్యాయి. 50మందికి గాయాలయ్యాయట! ఇంగ్లీషూ, హిందీ టీవీ చానళ్ళలో ఈ వివాదంపై చర్చలు చూపించారు. ఇదే సమయంలో ఛత్రపతి శివాజీ ఎంత గొప్ప ప్రజానుకూల చక్రవర్తో వాదించిన వారున్నారు. ఔరంగ జేబ్ సైన్యంలో కీలకమైన పదవుల్లో హిందూ సైనికాధి కారులున్నారని వాళ్ళ జాబితా ఇచ్చిన వారున్నారు. అలాగే, శివాజీ సైన్యంలో కూడా, అతనికి ఎంతో నమ్మకస్తులైన ముస్లిం ఉన్నత సైనికాధికారులున్నారని వాళ్ళ పేర్లు చెప్పారు. ఈ చర్చల్లో ముస్లిం చక్రవర్తుల్ని ప్రజా వ్యతిరేకులుగానూ, హిందూ చక్రవర్తుల్ని ప్రజలకు అనుకూలురుగానూ వాదించు కోవడమే ఎక్కువగా కనిపించింది. పత్రికల్లోగానీ, టీవీ డిబేట్లలో గానీ, అసలు ప్రపంచ చరిత్రలో చక్రవర్తులనేవారు, వాళ్ళు ఏ మతస్థులైనా, పాలకవర్గ ప్రతినిధులనీ, పాలకవర్గం ఎప్పుడూ ప్రజలకు అనుకూలంగా ఉండజాలదనీ వివరించే వర్గ సిద్ధాంత దృష్టితో ఒక్క మాటంటే ఒక్క మాట చెప్పిన వారు లేరు. ఆ దృష్టికోణాన్ని పట్టించుకోకపోతే, సత్యానికి కళ్ళు మూసినట్టవుతుంది. చక్రవర్తులంటే, అనేక చిన్నా పెద్దా భూభాగాల మీద పరిపాలన చేసే వాళ్ళు గదా? ఉదాహరణకి, ఔరంగజేబ్ (1618–1707) అయినా, శివాజీ (1630–1680) అయినా, చక్రవర్తులుగా విశాలమైన భూభాగాలను వారి కాలంలో పాలించారు. వారు ఎవరితో కలిసి ఎవరిని ఓడించారో, ఎన్నెన్ని ప్రాంతాలను ఆక్రమించారో, ‘ఆ ముట్టడికైన ఖర్చులూ, మతలబులూ, కైఫియతులూ’ ఇక్కడ చెప్పు కోలేము. అదంతా రకరకాల చరిత్ర పుస్తకాలలో దొరుకుతుంది. వారి ప్రభుత్వాలలో కూడా ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, సైనిక శాఖ, ఇతర అనేక రకాల శాఖలూ ఉన్నాయి. ఏకాలంలో అయినా, ఏ ప్రభుత్వమైనా పరిపాలన చెయ్యాలంటే, తప్పనిసరిగా కావలిసినవి పన్నులే. చరిత్రనించీ, మార్క్స్ గ్రహించి చెప్పినది ఇదే: ‘అధికార గణానికీ, సైన్యానికీ, మత గురువులకూ, కోర్టులకూ, క్లుప్తంగా చెప్పాలంటే, మొత్తం కార్యనిర్వాహక అధికార యంత్రాంగపు మనుగడకీ ఆధారం... రాజ్యానికి అందే పన్నులే! పన్నులు అంటే, ప్రభుత్వపు యంత్రాంగపు ఆర్థిక పునాది తప్ప, మరేమీ కాదు’. అయితే, పన్నులు ఏ పేర్లతో వచ్చినా, ఏ రూపంలో చెల్లించినా, వాటి మూలం ఎక్కడుంది? ఏ కాలం గురించి మనం మాట్లాడుతున్నామో, ఆ కాలానికి చెందిన శ్రామిక జనాల శ్రమలోనే ఉంది! అదెలాగో చూద్దాం. ఔరంగజేబు ప్రభుత్వమైనా, శివాజీ ప్రభుత్వమైనా ఆ కాలంలో రకరకాల పద్ధతుల్లో పన్నులు వసూలు చేసేవి. వసూళ్ళకు ఒక యంత్రాంగం ఉండడం తప్పనిసరి. మనం మాట్లాడుకుంటున్న ఇద్దరు చక్రవర్తులూ పన్నులు ఎవరి దగ్గర్నించి ప్రధానంగా వసూలు చేశారు? వ్యవసాయ రంగం నించీ. అలాగే, ఆనాటి పరిమితుల్లో ఉండిన పరిశ్రమలనించీ, సరుకులతో వ్యాపారం జరిపే వర్తకుల నించీ! అసలు, ఒక రాజ్యంలో ఉండే భూములు ఎవరి అధీనంలో ఉంటాయి? వ్యవసాయ రంగంలో పనిచేసేది ఎవరు? పంటలు పండించేది ఎవరు? (1) జమీందారులనీ, మిరాసీదారులనీ, రకరకాల పేర్లతో ఉండే పెద్ద భూస్వాములు. వీళ్ళసలు ఒళ్ళు వంచరు. అంతా కౌలు రైతులు ఇచ్చే కౌలు మీదే ఆధారపడతారు. ఏ శ్రమా చెయ్యకుండా, కౌలు రైతులనించి గుంజిన కౌలులో నించే, చక్రవర్తికి శిస్తుగానీ, కప్పం గానీ, రకరకాల పన్నులు గానీ కడతారు. (2) సొంత శ్రమల మీదే, ప్రధానంగా ఇంటిల్లిపాదీ, కష్టపడి జీవించే ‘స్వతంత్ర రైతులు’. వీళ్ళు కట్టే శిస్తులు గానీ, పన్నులు గానీ అన్నీ వీళ్ళ సొంత శ్రమ వల్లనే కడతారు. (3) సొంత శ్రమ మీదే కాక, కొంత ఇతరుల శ్రమల మీద కూడా ఆధార పడి జీవించే రైతులు వీళ్ళు. వీళ్ళు కట్టే పన్నులు కూడా, వీరి సొంత శ్రమలో నించీ కొంతా, ఇతరుల నించీ వచ్చిన అదనపు శ్రమ నించీ కొంతా. (4) వ్యవసాయ శ్రామికులు. వీళ్ళు లేకుండా వ్యవసాయంలో ఏ దశలోనూ, ఏ పనీ జరగదు. వీళ్ళని పనిలో పెట్టుకునే వారు, వారు పేద రైతులైనా, కొంత మెరుగైన స్థితిలో ఉన్న వారైనా, కౌలు రైతులైనా, ఈ కూలీల శ్రమ మీద ఆధారపడే వారే! వీళ్ళకి ‘కూలి’ అనేది డబ్బు రూపంలో ఇచ్చినా, ధాన్యం రూపంలో ఇచ్చినా, వాళ్ళకి అందేది వాళ్ళ శ్రమ శక్తి విలువే. మొత్తం శ్రమ విలువ కాదు. శ్రమ శక్తి విలువ అంటే, మర్నాడు వచ్చి పని చెయ్యడానికి శ్రామికులకి కావలిసిన జీవితావసరాలకు తగ్గ జీతం అన్నమాట. శ్రమ విలువ అంటే, తాము జీతం రూపంలో తీసుకునే విలువా, యజమాని లాభంగా మిగుల్చు కునే అదనపు విలువా కూడా కలిసినదే. వ్యవసాయ రంగం నించీ వచ్చే పన్నులు ఎక్కువ భాగం ఈ అదనపు విలువలో నించీ తీసి ఇచ్చేవే!ఆ కాలపు రెవెన్యూ చరిత్ర ప్రకారం, ఈ ఇద్దరు చక్రవర్తులకీ ప్రధానమైన ఆదాయం వ్యవసాయ రంగం నించే వచ్చేది. వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. ‘శిస్తు’ అనీ, ‘చౌత్’ అనీ, ‘జప్త్’ అనీ, ‘సర్దేశ్ ముఖీ’ అనీ, ఇంకేవో పేర్లు. అవన్నీ మనకి అనవసరం. భూమి వైశాల్యాన్ని బట్టో, సారాన్ని బట్టో, వచ్చిన పంట మొత్తాన్ని బట్టో కొంత భాగం పన్ను కట్టాలి. వీటిని చెల్లించే వారిని రైతులనీ, జమీందారులనీ, మిరాశీ దారులనీ, కౌల్దారులనీ... ఏ పేరుతో మనకి చెప్పినా, అసలు సంగతి కాయకష్టం చేసే రైతుల శ్రమని దోచడమే! ఈ ఆర్థిక సత్యాన్ని పట్టించుకోకుండా, ఈ చక్రవర్తి గొప్పా, ఆ చక్రవర్తి గొప్పా అనే తగువు అర్థం లేనిది. వ్యక్తిగత స్వభావాల్లో కొన్ని తేడాల వల్ల, కొందరు చక్రవర్తులు కొంత గంభీరంగానూ, కొందరు కొంత సాత్వికంగానూ, కొందరు కటువు గానూ, మరికొందరు కర్కశంగానూ, క్రూరంగానూ ఉంటారు. ‘ఏ రాయి అయితేనేమీ పళ్ళూడగొట్టుకోవడానికి?’ అనే నానుడిలో ఉన్న గొప్ప సత్యాన్ని అర్థం చేసుకుంటే... చక్రవర్తులందరూ శ్రమ దోపిడీదారులే! మనం మాట్లాడుకునే చక్రవర్తుల కాలంలో చిన్న స్థాయిలో అయినా రకరకాల పరిశ్రమలు ఉండేవి. వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడిగానీ, ఇతరత్రా గానీ సరుకులు తయారయ్యేవి. ఉప్పూ, దూదీ, దారం, నేతా, నూనెలూ, చర్మంతో తయారు చేసే వస్తువులూ, నివాసాల సామగ్రీ... ఇలా ఎన్నో రకాల పరిశ్రమలూ, వర్తకాలూ ఉండేవి. పరిశ్రమల యజమానులైనా, వర్తకులైనా, కట్టే పన్నులు, వాళ్ళ దగ్గిర పనిచేసే శ్రామికులు ఇచ్చే అదనపు విలువలోనించే తీసి కడతారు. అంటే, మళ్ళీ శ్రమ దోపిడీ ద్వారానే! ఈ విషయాలు ప్రజలు గమనంలో ఉంచుకుంటే మత ఘర్షణలు తలెత్తవు. ప్రజల అనైక్యత నుంచి ఎన్నికల ప్రయో జనం పొందాలని రాజకీయ పార్టీలు ప్రయత్నించడం గమనార్హం.బి.ఆర్. బాపూజీ వ్యాసకర్త హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవిశ్రాంత ఆచార్యులు

ఒప్పందానికి రాకపోతే అమెరికా ‘బాంబు’ రుచి చూపిస్తాం: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తమ న్యూక్లియర్ డీల్(అణు ఒప్పందం) కు ఇరాన్ అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ తమతో అణు ఒప్పందానికి దూరంగా ఉంటే మాత్రం అమెరికా బాంబు రుచి చూపిస్తామని ట్రంప్ ఘాటుగా స్పందిచారు. ఓ టెలివిజన్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల క్రితం మీకు చేతనైంది చేసుకోండి అంటూ ట్రంప్ కు వీడియో సందేశాన్ని పంపిన ఇరాన్ కు మరోసారి అల్టిమేటం జారీ చేశారు. తాను నాలుగేళ్ల క్రితం ఏదైతే చేశానో దాన్ని ఇరాన్ మళ్లీ రుచి చూడాల్సి వస్తుందన్నారు.మీ ఇష్టమొచ్చింది చేసుకోండి.. ఇరాన్ఇరాన్తో అణు ఒప్పందం చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెబుతూనే ఆ దేశం చర్చలకు రావాలని కొన్ని రోజుల క్రితం ఆహ్వానించారు ట్రంప్. అందుకు సుమారు రెండు నెలల డెడ్లైన్ విధిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై ఇరాన్ అధ్యక్షుడు స్పందిస్తూ.. ట్రంప్తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధం లేమని, ఆయనకు ఇష్టమొచ్చింది చేసుకోవచ్చు’అని పేర్కొన్నారు. అయితే అణు ఒప్పందం అనేది కేవలం అమెరికాతో సరిపోదనేది ఇరాన్ వాదన.2018లో ఇరాన్ తో ఒప్పందం రద్దుట్రంప్ తన మొదటి 2017-21 పదవీకాలంలో అంతక్రితం ఒమామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని కాస్తా రద్దు చేశారు. 2018 ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు ట్రంప్.కేవలం అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన ఒప్పందం కాదు కాబట్టి దాన్ని ట్రంప్ రద్దు చేశారు. వియన్నాలో 2015 జూలై 14న కుదిరిన ఆ ఒప్పందంపై భద్రతామండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల(అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్)తో పాటు జర్మనీ, యూరప్ యూనియన్(ఈయూ)లు, ఇటు ఇరాన్ సంతకాలు చేయడంతో అమెరికా వైదొలిగింది.ఆ సమయంలో కారాలూ మిరియాలూ నూరిన రిపబ్లికన్లు తాము అధికారంలోకొస్తే ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయెల్ సైతం ఒప్పందాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించింది. ట్రంప్ ఏక పక్షంగా ఒప్పందం నుంచి వైదొలగినప్పుడు తమతో ఎందుకు చర్చించలేదని భాగస్వామ్య పక్షాలు ప్రశ్నించాయి. తాము మాత్రం ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. మరి ఇప్పుడు ట్రంప్ చేస్తున్న హెచ్చరికలకు ఏమాత్రం బెదరని ఇరాన్.. ఎలా స్పందిస్తుందో అనే దానిపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఇరాన్ దిగి వచ్చి.. అమెరికాతో అణుఒప్పందాన్ని చేసుకుటుందా.. లేక ‘సైనిక చర్యలకు సిద్ధంగా ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే.

IPL 2025: బోణీ కొట్టిన రాజస్తాన్ రాయల్స్..
CSK vs RR live updates and highlights: ఐపీఎల్-2025లో భాగంగా గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడతున్నాయి.బోణీ కొట్టిన రాజస్తాన్ రాయల్స్..ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ బోణీ కొట్టింది. గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 పరుగుల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(63) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రవీంద్ర జడేజా(32) పర్వాలేదన్పించాడు.రాజస్తాన్ బౌలర్లలో వనిందు హసరంగా నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఆర్చర్, సందీప్ శర్మ ఓ వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో నితీష్ రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 81) టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ రియాన్ పరాగ్(37), శాంసన్(20) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఖాలీల్ అహ్మద్, పతిరాన, నూర్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు సాధించగా.. జడేజా, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు.సీఎస్కే ఐదో వికెట్ డౌన్.. గైక్వాడ్ ఔట్రుతురాజ్ గైక్వాడ్(63) రూపంలో సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. హసరంగా బౌలింగ్లో గైక్వాడ్ ఔటయ్యాడు. 16 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 129/5సీఎస్కే నాలుగో వికెట్ డౌన్.. శంకర్ ఔట్92 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన విజయ్ శంకర్.. హసరంగా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే నాలుగు వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(8), గైక్వాడ్(55) ఉన్నారు.సీఎస్కే మూడో వికెట్ డౌన్..ఇంపాక్ట్ ప్లేయర్ శివమ్ దూబే రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది.18 పరుగులు చేసిన దూబే.. హసరంగా బౌలింగ్లో ఔటయ్యాడు.సీఎస్కే రెండో వికెట్ డౌన్..రాహుల్ త్రిపాఠి రూపంలో సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన త్రిపాఠి.. హసరంగా బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. క్రీజులో దూబే(8), గైక్వాడ్ ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న రుతురాజ్..6 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(20), రాహుల్ త్రిపాఠి(21) ఉన్నారు.సీఎస్కే తొలి వికెట్ డౌన్.. రవీంద్ర ఔట్183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. సూపర్ ఫామ్లో ఉన్న రచిన్ రవీంద్ర.. ఆర్చర్ బౌలింగ్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి రుతురాజ్ గైక్వాడ్ వచ్చాడు.నితీష్ రాణా సూపర్ హాఫ్ సెంచరీ.. సీఎస్కే టార్గెట్ ఎంతంటే?గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో నితీష్ రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 81) టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ రియాన్ పరాగ్(37), శాంసన్(20) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఖాలీల్ అహ్మద్, పతిరాన, నూర్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు సాధించగా.. జడేజా, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు.రాజస్తాన్ ఆరో వికెట్ డౌన్..రియాన్ పరాగ్ రూపంలో రాజస్తాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన పరాగ్.. పతిరాన బౌలింగ్లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్.. జురెల్ ఔట్ధ్రువ్ జురెల్ రూపంలో రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన జురెల్.. నూర్ అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు.రాజస్తాన్ మూడో వికెట్ డౌన్..నితీష్ రాణా రూపంలో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 81).. అశ్విన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 129/3రాజస్తాన్ రెండో వికెట్ డౌన్.. శాంసన్ ఔట్సంజూ శాంసన్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన శాంసన్.. నూర్ ఆహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ పరాగ్ వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్.. రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(61), రియాన్ పరాగ్(1) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న రాణా..5 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(44), సంజూ శాంసన్(15) ఉన్నారు.రాయల్స్ తొలి వికెట్ డౌన్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 4 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో అశ్విన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఐపీఎల్-2025లో భాగంగా గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో సీఎస్కే రెండు మార్పులతో బరిలోకి దిగింది. సామ్ కుర్రాన్, దీపక్ హుడా స్ధానాల్లో ఓవర్టన్, విజయ్ శంకర్ వచ్చారు. రాయల్స్ మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పు చేయలేదు.తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్: రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణరాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ

పీ-4 ప్రారంభోత్సవం అట్టర్ ప్లాప్.. చంద్రబాబుకు కట్టలు తెంచుకున్న ఆగ్రహం
సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబు నిర్వహించిన పీ-4 లాంఛింగ్ సభ అట్టర్ ప్లాపయ్యింది. ప్రారంభ సభకు టీడీపీ నాయకులు బస్సుల్లో జనాల్ని రప్పించారు. అయినా సరే మీటింగ్ జరుగుతుండగా జనం మధ్యలోనే వెళ్లిపోయారు.సమావేశం మధ్యలోనే జనం వెళ్లిపోవడంతో చంద్రబాబుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బడుగు బలహీన వర్గాలను అవమానిస్తూ మాట్లాడారు. ఇలాంటి బడుగుల,బలహీనుల ఆలోచనలు పూట వరకే. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు. సగం మంది వెళ్లిపోయారు. వాళ్ల ఆలోచన వచ్చాం. మీటింగ్ అయ్యింది. మా పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. నేను మిమ్మల్ని తప్పుపట్టడం లేదు మన ఆలోచనా విధానాన్ని తప్పుబడుతున్నా. మార్గదర్శకులకు ఓపిక ఉంది ... కానీ బంగారు కుటుంబాలకు ఓపిక లేదు’అని వ్యాఖ్యానించారు. అయితే, సీఎం వ్యాఖ్యల పట్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది మామూలు పథకం కాదు: సీఎం రేవంత్
సూర్యాపేట జిల్లా: శ్రీమంతుడు తినే సన్నబియ్యం పేదవాడు తినాలన్న ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హుజూర్ నగర్ సభలో సన్నబియ్యం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం.. అనంతరం మాట్లాడారు. ఈ సన్న బియ్యం పథకం మామూలు పథకం కాదన్నారు. సాయుధ రైతాంగం, ఇందిరా గాంధీ రోటీ కప్డా ఔర్ మకాన్ తర్వాత అంతటి గొప్ప పథకం సన్నబియ్యం పథకమన్నారు. ఉగాది నాడు పథకాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. సీఎం రేవంత్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..‘నల్లగొండ ప్రాంతం చైతన్యానికి మారుపేరు. 25 లక్షల ఎకరాల భూములను ఇందిరా గాంధీ పేదలకు పంచిపెట్టింది ఇప్పటికీ ఇళ్లలో దేవుడు ఫోటో పక్కన ఇందిరా గాంధీ ఫోటో పెట్టుకుంటున్నారు. రూ. 1.90 కే బియ్యం పథకం తీసుకొచ్చారు. 1957 లోనే నెహ్రూ హయాంలో పీడీఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. గత ప్రభుత్వం 21 వేల కోట్ల ధాన్యాన్ని మిల్లర్లకి కట్టబెట్టారు. మిల్లర్లు పీడీఎస్ బియ్యం రిసైక్లింగ్ చేస్తున్నారు. 10 వేల కోట్ల రూపాయల దొడ్డుబియ్యం మిల్లర్లు, దళారుల చేతుల్లోకి వెళ్తోంది. ప్రతీ ఒక్కరికీ ఆరు కిలోల సన్నబియ్యంఅందుకే సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టి ప్రతీ ఒక్కరికీ ఆరు కిలోలు ఇవ్వాలని ఆలోచన చేశాం. దేశంలోనే తొలిసారి సన్నబియ్యం ఇస్తున్నాం. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి పదేళ్లు సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేదు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని బెదిరించిండు. ఆయన ఫాంహౌస్ లో వెయ్యి ఎకరాల్లో వరి వేశాడు. ఆ ధాన్యాన్ని 4500 రూపాయలకు క్వింటాల్ చొప్పున కావేరి సీడ్స్ కొనుగోలు చేసింది. సన్నధాన్యం పండిస్తే క్వింటాల్ కి ఐదు వందలు బోనస్ ఇస్తున్నాం. అత్యధికంగా సన్నధాన్యం పండించేది నల్లగొండ రైతులే. అత్యధికంగా రైతు రుణమాఫీ పొందింది నల్లగొండ రైతులేఈ పథకం రద్దు చేసే ధైర్యం ఏ సీఎం చేయడుసన్నబియ్యం పథకం రద్దు చేసే ధైర్యం భవిష్యత్తులో ఏ సీఎం చేయడు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పదేళ్లు కేసీఆర్ పట్టించుకోలేదు. సంవత్సరానికి కిలోమీటర్ చొప్పున తవ్వినా టన్నెల్ పూర్తయి 3.30 లక్షల ఎకరాలకు నీరు అందేది. నల్లగొండ జిల్లా ప్రజలపై కోపంతోనే టన్నెల్ ను పూర్తి చేయలేదు. ఉత్తమ్ నాయకత్వంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం మూడేళ్లలో కుప్పకూలింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో ఎనిమిదో వింత కాదు. ప్రపంచంలో ఏకైక వింత. మూడేళ్లలో లక్ష కోట్లు మింగినందుకు మిమ్మల్ని ఉరేసినా తప్పులేదు. కాళేశ్వరం కుప్పకూలిపోయినా 1.56 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించాం. మా ఆలోచనలో లోపం లేదు. ప్రజా సేవ చేయడానికే నేను వచ్చా . 2006 లో జెడ్పీటీసీ గా రాజకీయం మొదలుపెట్టి ఈనాడు సీఎంగా ఉన్నా. శకునం పలికే బల్లి కుడితిలో పడినట్లు అయింది బీఆర్ఎస్ పరిస్థితి. నాకు కేసీఆర్ కు నందికి పందికి ఉన్న పోలిక ఉందినాకు కేసీఆర్తో పోలిక ఏంటి?నాతో నీకు పోలిక ఏంటి కేసీఆర్. పదేళ్లలో కేసీఆర్ 16 వేల కోట్ల రుణమాఫీ చేస్తే అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 20 వేల కోట్ల రుణమాఫీ చేశాం . కేసీఆర్ ఎగ్గొట్టిన 7625 కోట్లను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వేశాం త్వరలోనే రైతు భరోసా పూర్తిస్థాయిలో ఇస్తాం. రైతు భరోసా కింద ఏడాదికి 20 వేల కోట్లి పంపిణీ చేస్తాం. ఇవ్వాల్టికి రుణమాఫీ, రైతు భరోసా మొత్తం 33 వేల కోట్లు రైతులకు చెల్లించాంపదేళ్లలో తెలంగాణను నంబర్ వన్ చేస్తారైతుల గుండెళ్లో ఇందిర, సోనియా పేరు శాశ్వతంగా ఉండేలా చేశాం. గతంలో క్వింటాల్ కు పది కిలోల ధాన్యం తరుగు తీసేవారు. ఈనాడు ఆ పరిస్థితి లేదు. హుజూర్ నగర్ కు అగ్రికల్చర్ కాలేజ్ ఇస్తాం. మిర్యాలగూడ, దేవరకొండ కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేస్తాం. కాళ్లల్లో కట్టెబెట్టి పడేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. వాళ్ల కళ్లలో కారం కొట్టేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. పదేళ్లలో దేశంలో తెలంగాణను నంబర్ వన్ గా ఉండేలా చూస్తా’ అని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.

రూ.8000 కోట్లకు కంపెనీ అమ్మేసి.. ఫిజిక్స్ చదువుతున్నాడు
కేవలం 33 సంవత్సరాల వయసులోనే.. 'వినయ్ హిరేమత్' (Vinay Hiremath).. లూమ్ కంపెనీ స్థాపించి, దానిని అట్లాసియన్ (Atlassian)కు సుమారు 975 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 8092.5 కోట్లు)కు విక్రయించారు. ఆ తరువాత ''నేను ధనవంతుడిని.. నా జీవితాన్ని ఏమి చేయాలో తెలియడం లేదు'' అనే శీర్షికతో తన భావాలను పంచుకున్నారు. ఇప్పుడు అతడే రోజుకు 5 నుంచి 8 గంటలు ఫిజిక్స్ (భౌతికశాస్త్రం) చదువుతూ.. ఇంటర్న్షిప్ల కోసం చూస్తున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.వినయ్ హిరేమత్ ఇప్పుడు మరొక స్టార్టప్ను ప్రారంభించడానికి బదులుగా, భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో తన సమయాన్ని పూర్తిగా గడుపుతున్నారు. పాడ్కాస్ట్ హోస్ట్ సామ్ పార్ ప్రకారం.. హిరేమత్ రోజుకు 5-8 గంటలు భౌతిక శాస్త్రాన్ని చదువుతున్నాడు, అంతే కాకుండా 18 ఏళ్ల వయస్సు గల డిస్కార్డ్ గ్రూపులలో తిరుగుతున్నాడు. మెకానికల్ ఇంజనీర్గా ఇంటర్న్ కావాలని చూస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.లూమ్ను విక్రయించిన తర్వాత అక్కడే ఉండాలా?, వద్దా?.. అనే దానితో హిరేమత్ కొంత సతమతమయ్యాడు. ఆ సమయంలోనే నేను ఆ కంపెనీలో పనిచేయడం సరైంది కాదని అనుకున్నాను. అయితే 60 మిలియన్ డాలర్ల (రూ. 500 కోట్ల కంటే ఎక్కువ) ప్యాకేజీని వదులుకోవడం కష్టంగానే అనిపించిందని గత మార్చిలోనే పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే ఒకరోజు సంపాదన ఎంతో తెలుసా?లూమ్ను విడిచిపెట్టిన కొన్ని రోజులకే.. హిరేమత్ పెట్టుబడిదారులను, రోబోటిక్స్ నిపుణులను కలిసి, రోబోటిక్స్ కంపెనీని ప్రారంభించాలని భావించాడు. కానీ అది సాధ్యం కాదని తొందరగానే గ్రహించాను. నేను నిజంగా కోరుకునేది ఎలాన్ మస్క్ మాదిరిగా కనిపించడమేనని నాకు అర్థమైంది. కానీ అది చాలా భయంకరంగా ఉంది. క్రిప్టోకరెన్సీ ప్రాజెక్ట్పై మస్క్, వివేక్ రామస్వామితో కలిసి నాలుగు వారాలు పనిచేసాను. ఆ అనుభవాలు వ్యాపార ఆవశ్యకతపై అవగాహనను మరింత పటిష్టం చేశాయి.ప్రస్తుతం.. హిరేమత్ మరొక స్టార్టప్ను ప్రారంభించడం కంటే నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాను ఎలక్ట్రికల్ ఇంజనీర్గా ఇంటర్న్ చేయాలనుకుంటున్నాను. దీంతో నేను ఏమి చేయాలో నాకు నిజంగా తెలియదని అన్నాడు. ఇప్పుడు ఏదైనా స్టార్టప్ స్టార్ట్ చేయడానికంటే.. చదువుకోవాలి అని నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది.The co-founder of Loom sold his biz for ~$1B, made $50-70M personally, then walked away from an extra $60MHe has “no income right now” and is “looking for internships”...@vhmth has a wild post-exit story. we talked about it on Moneywise:-Turned down $60M in retention… pic.twitter.com/uTdS5blabz— Sam Parr (@thesamparr) March 25, 2025

ఇప్పుడేంటి.. ? కారుతో ఢీకొట్టాను.. ఎవరైనా చచ్చిపోయారా?
నోయిడా: కారును ర్యాష్ డ్రైవ్ చేయడమే కాదు.. ఫుట్ పాత్ పైకి ఎక్కించేశాడు లాంబోర్కిని కారును డ్రైవ్ చేస్తున్న డ్రైవర్. అదే సమయంలో ఫుట్ పాత్ పై ఇద్దరు కార్మికులు పని చేస్తున్నారు. తలకు హెల్మెట్ పెట్టుకుని ఆరంజ్ జాకెట్లు తొడక్కుని పనిలో ఉన్నారు. ఇంతలో ఓ కారు అమాంతం ఫుట్ పాత్ పైకి వచ్చేసింది. దీంతో కొద్ది పాటి గాయాలతో తప్పించుకున్నారు ఇద్దరు కార్మికులు. తలకు హెల్మెట్ ఉండటం వల్ల కూడా పెద్ద ప్రమాదం తప్పింది.అయితే కారు డ్రైవర్ ను పట్టుకుని నిలదీశాడు ఆ కార్మికుల్లో ఒకరు. రోడ్డుపై ఫుట్ పాత్ పై స్టంట్స్ ఏమైనా చేస్తున్నావా అంటూ ప్రశ్నించాడు. అయితే దానికి ఆ డ్రైవర్ నుంచి ఎటకారంతో కూడిన సమాధానం వచ్చింది. ఎంతమంది చచ్చిపోయారేంటి అంటూ బదులిచ్చాడు. దానికి ఆ కార్మికులకు కోపం చిర్రెత్తు కొచ్చింది. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఆ డ్రైవర్ పై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడేంటి.. నేను కారును ఫుట్ పాత్ పైకి ఎక్కించా.. ఎంతమంది చచ్చిపోయారంటూ హిందీలో మళ్లీ ప్రశ్నించాడు.దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడకు వచ్చిన వారు.. ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు కారును కూడా సీజ్ చేశారు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. నోయిడాలోని సెక్టార్ 94లో నిర్మాణంలో ఉన్న ఒక కాంప్లెక్స్ పక్కన ఉన్న ఫుట్పాత్ వద్ద ఇది జరిగింది. అయితే ఈ ఇద్దరు కార్మికుల్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించామని, ఎటువంటి ప్రమాదం లేదని పోలీసులు తెలిపారు.A #Lamborghini, a fat bank account, and ZERO Humanity This #Noida brat mows down two labourers and casually asks—“Koi mar gaya idhar?” pic.twitter.com/TaUgdB769z— Smriti Sharma (@SmritiSharma_) March 30, 2025
చరిత్ర సృష్టించిన స్టార్క్.. ప్రపంచంలోనే తొలి బౌలర్గా
ఒప్పందానికి రాకపోతే అమెరికా ‘బాంబు’ రుచి చూపిస్తాం: ట్రంప్
పొలిమేర హీరోయిన్ మరో థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
వెలుగులోకి ఎమ్మెల్యే పరిటాల సునీత దాష్టీకం
ప్రముఖ ఆలయంలో పుష్ప విలన్ ప్రత్యేక పూజలు.. మూవీ ప్రమోషన్స్ కూడా!
రక్షణ శాఖలోకి 2978 ఫోర్స్ గూర్ఖా కార్లు!
అదే మా కొంపముంచింది.. లేదంటే విజయం మాదే: ఎస్ఆర్హెచ్ కెప్టెన్
ఇది మామూలు పథకం కాదు: సీఎం రేవంత్
పీ-4 ప్రారంభోత్సవం అట్టర్ ప్లాప్.. చంద్రబాబుకు కట్టలు తెంచుకున్న ఆగ్రహం
ఇప్పుడేంటి.. ? కారుతో ఢీకొట్టాను.. ఎవరైనా చచ్చిపోయారా?
ఇప్పటిదాకా ఆరు అక్రమ కేసులు.. దేనికైనా రెడీ: కాకాణి
IPL 2025: బోణీ కొట్టిన రాజస్తాన్ రాయల్స్..
ఇప్పుడేంటి.. ? కారుతో ఢీకొట్టాను.. ఎవరైనా చచ్చిపోయారా?
ఒప్పందానికి రాకపోతే అమెరికా ‘బాంబు’ రుచి చూపిస్తాం: ట్రంప్
పొలిమేర హీరోయిన్ మరో థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
అదే మా కొంపముంచింది.. లేదంటే విజయం మాదే: ఎస్ఆర్హెచ్ కెప్టెన్
ఇది మామూలు పథకం కాదు: సీఎం రేవంత్
మెల్బోర్న్లో బాలీవుడ్ సింగర్ కన్సర్ట్.. ఐదు లక్షల డాలర్ల నష్టమా?
రక్షణ శాఖలోకి 2978 ఫోర్స్ గూర్ఖా కార్లు!
పీ-4 ప్రారంభోత్సవం అట్టర్ ప్లాప్.. చంద్రబాబుకు కట్టలు తెంచుకున్న ఆగ్రహం
చరిత్ర సృష్టించిన స్టార్క్.. ప్రపంచంలోనే తొలి బౌలర్గా
ఒప్పందానికి రాకపోతే అమెరికా ‘బాంబు’ రుచి చూపిస్తాం: ట్రంప్
పొలిమేర హీరోయిన్ మరో థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
వెలుగులోకి ఎమ్మెల్యే పరిటాల సునీత దాష్టీకం
ప్రముఖ ఆలయంలో పుష్ప విలన్ ప్రత్యేక పూజలు.. మూవీ ప్రమోషన్స్ కూడా!
రక్షణ శాఖలోకి 2978 ఫోర్స్ గూర్ఖా కార్లు!
అదే మా కొంపముంచింది.. లేదంటే విజయం మాదే: ఎస్ఆర్హెచ్ కెప్టెన్
ఇది మామూలు పథకం కాదు: సీఎం రేవంత్
పీ-4 ప్రారంభోత్సవం అట్టర్ ప్లాప్.. చంద్రబాబుకు కట్టలు తెంచుకున్న ఆగ్రహం
ఇప్పుడేంటి.. ? కారుతో ఢీకొట్టాను.. ఎవరైనా చచ్చిపోయారా?
ఇప్పటిదాకా ఆరు అక్రమ కేసులు.. దేనికైనా రెడీ: కాకాణి
IPL 2025: బోణీ కొట్టిన రాజస్తాన్ రాయల్స్..
ఇప్పుడేంటి.. ? కారుతో ఢీకొట్టాను.. ఎవరైనా చచ్చిపోయారా?
ఒప్పందానికి రాకపోతే అమెరికా ‘బాంబు’ రుచి చూపిస్తాం: ట్రంప్
పొలిమేర హీరోయిన్ మరో థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
అదే మా కొంపముంచింది.. లేదంటే విజయం మాదే: ఎస్ఆర్హెచ్ కెప్టెన్
ఇది మామూలు పథకం కాదు: సీఎం రేవంత్
మెల్బోర్న్లో బాలీవుడ్ సింగర్ కన్సర్ట్.. ఐదు లక్షల డాలర్ల నష్టమా?
రక్షణ శాఖలోకి 2978 ఫోర్స్ గూర్ఖా కార్లు!
పీ-4 ప్రారంభోత్సవం అట్టర్ ప్లాప్.. చంద్రబాబుకు కట్టలు తెంచుకున్న ఆగ్రహం
సినిమా

సమంత నిర్మాతగా తొలి మూవీ.. టీజర్ రిలీజ్
స్టార్ హీరోయిన్ సమంత.. సినిమాల్లో నటించి చాలా రోజులైపోయింది. చివరగా 'ఖుషి'లో కనిపించింది. తర్వాత ఒకటి రెండు వెబ్ సిరీసులు చేసిందంతే. మరోవైపు నిర్మాణ సంస్థ స్థాపించింది. ఇప్పుడు అందులో నిర్మించిన సినిమాని ఇప్పుడు విడుదలకు సిద్ధం చేసేసింది కూడా.(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్)పలువురు చిన్న నటీనటులతో తీసిన ఈ సినిమాకు శుభం టైటిల్ ఫిక్స్ చేశారు. కొన్నిరోజుల క్రితం దీని గురించి బయటపెట్టగా.. ఇప్పుడు ఉగాది సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. చూస్తుంటే ఇది ఫన్నీగా ఉంది. హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయనిపిస్తోంది. మీరు కూడా టీజర్ పై ఓ లుక్కేయండి. (ఇదీ చదవండి: పూరీ-సేతుపతి అఫీషియల్.. రెండు విషయాల్లో క్లారిటీ)

జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్.. ఇంతకీ ముద్దుపెట్టిన ఆమె ఎవరు?
బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామర్ విషయానికొస్తే హీరోయిన్లలో ఓ మెట్టు ముందు వరుసలో ఉంటుంది. గతేడాది దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో కనిపించనుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను ఇటీవల చెర్రీ బర్త్ డే సందర్భంగా రివీల్ చేశారు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఫ్యాషన్ షో మెరిసింది. తన ర్యాంప్వాక్తో అభిమానులను కట్టిపడేసింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ర్యాంప్ వాక్లో అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ బ్యూటీ ఈ షోకు హాజరైన ఓ పెద్దావిడను ఆలింగనం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో జాన్వీ కపూర్కు అప్యాయంగా ముద్దు పెట్టిన ఆమె ఎవరు? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు.అయియతే అక్కడ ఉన్నది శ్లోకా మెహతా తల్లిదండ్రులు మోనా, రస్సెల్ మెహతా. కాగా.. రస్సెల్ మెహతా భారతదేశంలోని వజ్రాల తయారీదారులలో ఒకటైన రోజీ బ్లూ ఇండియాను కలిగి ఉన్న వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఆయన కుమార్తె శ్లోకా మెహతా ప్రముఖ బిలియనీర్ ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలకు పెద్ద కోడలు కావడంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)

ఉగాది బుట్టబొమ్మలు.. సితార ఇలా మృణాల్ అలా
లంగాఓణీలో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న సితారఇంట్లో ఉగాది సెలబ్రేట్ చేసుకున్న అనసూయగిబిలీ ట్రెండ్ ప్రయత్నించిన యాంకర్ శ్రీముఖికామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ప్రగ్యా జైస్వాల్పద్ధతిగా కనిపించి షాకిచ్చిన కేతిక శర్మతిరుపతి దర్శనం చేసుకున్న హీరోయిన్ ఈషా రెబ్బలాక్మే ఫ్యాషన్ వీక్ లో రచ్చ లేపిన జాన్వీ కపూర్ View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by RegenaCassandrra (@reginaacassandraa) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja)

ఇక్కడ తెలివిగా మిస్.. అక్కడ దెబ్బ పడింది!
చాలామంది హీరోయిన్లతో పోలిస్తే రష్మికది ఇంకా చిన్న వయసే. కానీ సినిమాల విషయంలో పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తోంది. అందుకే ఇప్పడు పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. యానిమల్, పుష్ప 2, ఛావా.. ఇలా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన రష్మిక జోరుకి 'సికిందర్'తో ఇప్పుడు బ్రేకులు పడ్డాయని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: 'పెద్ది' సర్ ప్రైజ్.. ఉగాదికి కాదు శ్రీరామనవమికి)అసలు విషయానికొస్తే ఈద్ సందర్భంగా సికందర్ మూవీ తాజాగా థియేటర్లలో రిలీజైంది. సల్మాన్ ఖాన్ హీరో కాగా రష్మిక హీరోయిన్. తొలి ఆట నుంచే దీనికి నెగిటివ్ టాక్ వచ్చేసింది. విడుదలకు ముందే పైరసీ అవడం మరో మైనస్. సోషల్ మీడియా ట్రెండ్ చూస్తుంటే సినిమా గట్టెక్కడం కష్టమే అనిపిస్తుంది.మరోవైపు తెలుగులో రాబిన్ హుడ్ మూవీ తాజాగా రిలీజైంది. దీనికి కూడా మొదటి ఆట నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. సోమవారం వస్తే అసలు ఫలితం తేలుతుంది. తొలుత ఈ మూవీలో రష్మికనే హీరోయిన్. కానీ కొన్ని కారణాలతో ఈమె తప్పుకోవడంతో శ్రీలీలకు ఛాన్స్ వచ్చింది. కాకపోతే హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో రష్మిక ఇక్కడ తప్పించుకుంది గానీ బాలీవుడ్ లో సికిందర్ దెబ్బకు దొరికేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్)
న్యూస్ పాడ్కాస్ట్

ఆంధ్రప్రదేశ్లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్లాండ్, మయన్మార్లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్కుమార్ అరెస్ట్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్

ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం పేరిట సిండికేట్ లూటీ... సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు...

25 ఏళ్లపాటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టొద్దు... చెన్నైలో జేఏసీ తొలి సమావేశంలో తీర్మానం

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్యోగాలు మాయం... దాదాపు 2 లక్షల మేర తగ్గిపోయిన ఉద్యోగుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్లో హజ్ యాత్రికులకు కూటమి సర్కార్ ద్రోహం... ఏపీ హజ్ కమిటీ ఇచ్చిన లేఖ ఆధారంగా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ను రద్దు చేసిన కేంద్రం
క్రీడలు

వైజాగ్లో అనికేత్ వర్మ విధ్వంసం.. వీడియో వైరల్
ఐపీఎల్-2025లో వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు అనికేత్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కిషన్, అభిషేక్ శర్మ, హెడ్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట అనికేత్.. తన విరోచిత బ్యాటింగ్తో ఎస్ఆర్హెచ్ టీమ్ను ఆదుకున్నాడు.టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ కేవలం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అనికేత్.. ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా అక్షర్ పటేల్ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ను అనికేత్ ఊతికారేశాడు. తన విధ్వసంకర బ్యాటింగ్తో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అనికేత్ కేవలం 34 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.హాఫ్ సెంచరీ తర్వాత కూడా తన దూకుడును వర్మ కొనసాగించాడు. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో సిక్సర్ బాదిన అనికేత్.. ఆ తర్వాత బంతికి భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఓవరాల్గా 41 బంతులు ఎదుర్కొన్న వర్మ.. 5 ఫోర్లు, 6 సిక్స్లతో 74 పరుగులు చేశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగుల ఫైటింగ్ స్కోర్ చేయగల్గింది. అతడితో క్లాసెన్(32) పరుగులతో రాణించాడు.ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. కాగా అద్భుత ఇన్నింగ్స ఆడిన అనికేత్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎస్ఆర్హెచ్కు మరో సరికొత్త హిట్టర్ దొరికాడని పోస్టులు పెడుతున్నారు. ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.30 లక్షల బేస్ ప్రైస్కు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది.చదవండి: IPL 2025: అభిషేక్ శర్మ రనౌట్.. తప్పు ఎవరిది? వీడియో వైరల్

అభిషేక్ శర్మ రనౌట్.. తప్పు ఎవరిది? వీడియో వైరల్
ఐపీఎల్-2025లో వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మను దురదృష్టం వెంటాడింది. తోటి బ్యాటర్ ట్రావిస్ హెడ్తో సమన్వయ లోపం వల్ల అభిషేక్ రనౌటయ్యాడు. తొలి రెండు మ్యాచ్ల్లో నిరాశపరిచిన అభిషేక్.. ఈ మ్యాచ్లో కూడా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితం కావాల్సి వచ్చింది. అభిషేక్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.అసలేం జరిగిందంటే?ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఆఖరి బంతిని ట్రావిస్ హెడ్ కవర్స్ దిశగా ఆడాడు. హెడ్ షాట్ ఆడిన వెంటనే క్విక్ సింగిల్ కోసం నాన్స్టైకర్ ఎండ్ వైపు పరిగెత్తాడు. కానీ నాన్ స్టైక్ ఎండ్లో అభిషేక్ మాత్రం పరుగుకు సిద్దంగా లేడు. అతడు హెడ్ను ఆపడానికి చేయి పైకెత్తాడు. కానీ హెడ్ మాత్రం అభిషేక్ను గమనించకుండా బంతిని చూస్తూ పరుగు కోసం ముందుకు వచ్చాడు. దీంతో అభిషేక్ కాస్త ఆలస్యంగా పరిగెత్తడం ప్రారంభించాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న ఢిల్లీ ఫీల్డర్ విప్రజ్ నిగమ్ అద్భుతమైన త్రోతో స్టంప్స్ను గిరాటేశాడు. ఫలితంగా అభిషేక్ శర్మ రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఐదేసిన స్టార్క్..ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్.. 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అనికేత్ వర్మ(74) టాప్ స్కోరర్గా నిలవగా.. క్లాసెన్(32), హెడ్(22) పరుగులతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. SRH ನ ಮೊದಲ ವಿಕೆಟ್ ಪತನ 👏ರನ್ ಔಟ್ ಮೂಲಕ Abhishek Sharma ತಮ್ಮ ವಿಕೆಟ್ ಕೈಚೆಲ್ಲಿದ್ದಾರೆ 👀📺 ವೀಕ್ಷಿಸಿ | TATA IPL 2025 | #DCvSRH | LIVE NOW | ನಿಮ್ಮ JioHotstar & Star Sports ಕನ್ನಡದಲ್ಲಿ.#IPLOnJioStar #IPL2025 #TATAIPL pic.twitter.com/tKwl18nYPF— Star Sports Kannada (@StarSportsKan) March 30, 2025చదవండి: IPL 2025: హార్దిక్ పాండ్యాకు మరో షాక్

IPL 2025: ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి..
SRH Vs Delhi Capitals Match Updates: ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి.. ఐపీఎల్-2025లో ఎస్ఆర్హెచ్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం పాలైంది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. జాక్ ఫ్రెజర్ మెక్గర్క్(38), అభిషేక్ పోరెల్(34) రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జీషన్ అన్సారీ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. మిగితా బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ డౌన్.. కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రాహుల్.. జీషన్ అన్సారీ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి ట్రిస్టన్ స్టబ్స్ వచ్చాడు.ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ డౌన్..ఢిల్లీ క్యాపిటల్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. జీషన్ అన్సారీ బౌలింగ్లో తొలి బంతికి ఫాఫ్ డుప్లెసిస్(50) ఔట్ కాగా.. ఆఖరి బంతికి జాక్ ఫ్రేజర్ మెక్గర్క్(38) ఔటయ్యాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ రెండు వికెట్లు నష్టానికి 96 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ..164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. క్రీజులో జేక్ ఫ్రెజర్ మెక్గర్క్(8), ఫాఫ్ డుప్లెసిస్(29) ఉన్నారు.163 పరుగులకు ఎస్ఆర్హెచ్ ఆలౌట్ఐపీఎల్-2025లో భాగంగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తడబడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్.. 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అనికేత్ వర్మ(74) టాప్ స్కోరర్గా నిలవగా.. క్లాసెన్(32), హెడ్(22) పరుగులతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధించారు.ఎస్ఆర్హెచ్ ఎనిమిదో వికెట్ డౌన్.. అనికేత్ ఔట్అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అనికేత్ వర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 74).. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.ఏడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ఎస్ఆర్హెచ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 12 ఓవర్లో అభినవ్ మనోహర్(4) ఔట్ కాగా.. ఆ తర్వాత 14 ఓవర్లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఔటయ్యాడు. ఈ ఇద్దరు కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో అనికేత్ వర్మ(50) ఉన్నాడు. వియాన్ ముల్డర్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు.ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన క్లాసెన్.. మొహిత్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజులో అనికేత్ వర్మ(47) ఉన్నాడు.అనికేత్ ఆన్ ఫైర్.. ఎస్ఆర్హెచ్ యువ సంచలనం అనికేత్ వర్మ మరోసారి దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 40 పరుగులు చేసి ఆజేయంగా ఉన్నాడు. అతడితో పాటు హెన్రిచ్ క్లాసెన్(24) ఉన్నాడు. 9 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ డౌన్..ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి క్లాసెన్ వచ్చాడు.29 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో ఎస్ఆర్హెచ్వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తడబడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ కేవలం 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 4 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ మూడు వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది. క్రీజులో హెడ్(22), అనికేత్(5) ఉన్నారు.ఐపీఎల్-25 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో విశాఖ వేదికగా డా. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ కు మొగ్గుచూపాడు.ఇక ఇరుజట్ల మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ అత్యంత హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇరు జట్లలో భయంకరమైన హిట్టర్లు ఉన్నారు. విశాఖ పిచ్పై పరుగుల వరద పారిన చరిత్ర ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. తొలి మ్యాచ్లో పోలిస్తే ఢిల్లీ ఈ మ్యాచ్లో మరింత బలపడనుంది. పితృత్వ సెలవుపై ఉండిన ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టులో చేరాడు.ఈ సీజన్లో ఢిల్లీ తమ తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై సంచలన విజయం సాధించి జోష్ మీద ఉంది. సన్రైజర్స్ తమ తొలి మ్యాచ్లో రాయల్స్పై అద్భుత విజయం సాధించి, ఆతర్వాతి మ్యాచ్లో లక్నో చేతిలో పరాభవం ఎదుర్కొంది. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 24 మ్యాచ్ల్లో తలపడగా.. సన్రైజర్స్ 13, ఢిల్లీ 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి.ఎస్ఆర్ హెచ్ తుది జట్టుప్యాట్ కమిన్స్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహ్మద్ షమీఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టుఅక్షర్ పటేల్(కెప్టెన్), జేక్ ప్రేజర్, డుప్లిసెస్, అభిషేక్ పార్కెల్, కేఎల్ రాహుల్, ట్రిస్టాన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేష్ కుమార్

IPL 2025: అత్యంత దయనీయంగా సీఎస్కే బ్యాటింగ్.. ఆ ఇద్దరికి ప్రత్యామ్నాయాలు కూడా లేరు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చాలా బలహీనంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓపెనర్ రచిన్ రవీంద్ర ఒక్కడే రాణించాడు. తొలి మ్యాచ్లో రచిన్ సత్తా చాటడంతో సీఎస్కే ముంబైను ఓడించింది. ఆ మ్యాచ్లో రుతురాజ్ కూడా రాణించినా.. ఆర్సీబీతో మ్యాచ్లో డకౌటయ్యాడు. సీఎస్కే తరఫున రెండు మ్యాచ్ల్లో ఓపెనర్గా దిగిన రాహుల్ త్రిపాఠి దారుణంగా విఫలమయ్యాడు. దీపక్ హుడా పరిస్థితి కూడా అలాగే ఉంది. రాజస్థాన్ రాయల్స్తో నేడు జరుగబోయే మ్యాచ్లో త్రిపాఠి, హుడాలకు ప్రత్యామ్నాయాలను వెతుక్కోకపోతే సీఎస్కే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. వీరిద్దరిని ఇలాగే కొనసాగిస్తే రాయల్స్ చేతిలో కూడా పరాభవం (ఆర్సీబీ చేతిలో ఓడింది) తప్పకపోవచ్చు.ఆల్రౌండర్ సామ్ కర్రన్ కూడా తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. అతనిపై కూడా సీఎస్కే మేనేజ్మెంట్ దృష్టి సారించాలి. సామ్ బౌలర్గా కూడా విఫలమయ్యాడు. మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సైతం ఈ సీజన్లో అంతంతమాత్రంగానే ఉన్నాడు. బౌలర్గా పూర్తిగా విఫలమైన జడ్డూ బ్యాటింగ్లో మమ అనిపించాడు. గత సీజన్లో సీఎస్కే తరఫున మెరుపులు మెరిపించిన శివమ్ దూబే ఈ సీజన్లో పూర్తిగా తేలిపోయాడు. దూబే కూడా రెండు మ్యాచ్ల్లో నిరాశపరిచాడు. అశ్విన్ లాంటి బౌలింగ్ ఆల్రౌండర్ నుంచి బ్యాటింగ్లో మెరుపులు ఆశించడం అత్యాశే అవుతుంది.తొలి మ్యాచ్లో రెండు బంతులు ఎదుర్కొని ఖాతా ఓపెన్ చేయని ధోని.. ఆర్సీబీతో మ్యాచ్లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి బ్యాట్ ఝులిపించాడు. ధోని ఇదే తరహా హిట్టింగ్ను మున్ముందు కూడా కొనసాగిస్తే సీఎస్కే మేలవుతుంది. ఇక మిగిలింది బౌలర్లు. వారి విభాగం వరకు వారు పర్వాలేదనిపించారు. నూర్ అహ్మద్ అద్భుతంగా రాణిస్తూ లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. ఖలీల్ అహ్మద్ కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఆడే అవకాశం దక్కని పతిరణ.. ఆర్సీబీతో మ్యాచ్లో 2 వికెట్లతో రాణించాడు. సీనియర్ స్పిన్ ద్వయం అశ్విన్, జడ్డూ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నారు. వీరిద్దరు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు వికెట్లు కూడా తీయలేకపోతున్నారు. సీఎస్కే మేనేజ్మెంట్ వీరిద్దరి ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి పెట్టాలి.బెంచ్ కూడా బలహీనమేఈ సీజన్లో సీఎస్కే జట్టు ఎంపిక అస్సలు బాగోలేదు. ఆ జట్టు బెంచ్ కూడా చాలా బలహీనంగా ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడాలను తప్పిస్తే.. ఆ జట్టులో ప్రత్యామ్నాయ ఆటగాళ్లు కూడా లేరు. ప్రస్తుతం విజయ్ శంకర్ ఒక్కడే వీరికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. విదేశీ బ్యాటర్ డెవాన్ కాన్వేను తుది జట్టులోకి తెద్దామనుకుంటే నలుగురు ఆటగాళ్ల నియమం అడ్డొస్తుంది. మిగిలిన ఆటగాళ్లలో షేక్ రషీద్, ఆండ్రీ సిద్దార్థ్, వన్ష్ బేడి మాత్రమే స్పెషలిస్ట్ బ్యాటర్లు. ఈ లెక్కన చూస్తే.. వరుసగా విఫలమవుతున్నా త్రిపాఠి, హుడాలలో ఒకరిని ఖచ్చితంగా తుది జట్టులో ఆడించాల్సిన పరిస్థితి ఉంది. సీఎస్కేలా బ్యాటింగ్ వనరుల కొరత ఈ సీజన్లో ఏ ఫ్రాంచైజీకి లేదు. ఈ జట్టుతో సీఎస్కే ఆరోసారి టైటిల్ గెలవాలనుకోవడం అత్యాశే అవుతుంది.సీఎస్కే పూర్తి జట్టు..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని (వికెట్కీపర్), రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కర్రన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్, కమలేష్ నాగర్కోటి, విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, షేక్ రషీద్, శ్రేయస్ గోపాల్, డెవాన్ కాన్వే, ముఖేష్ చౌదరి, అన్షుల్ కాంబోజ్, నాథన్ ఎల్లిస్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, ఆండ్రీ సిద్దార్థ్ సి, వంశ్ బేడి
బిజినెస్

స్పెషల్ ఆఫర్: 16 రూపాయలకే స్మార్ట్ఫోన్!
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ 'లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్' తన 16వ వార్షికోత్సవాన్ని పురుస్కరిచుకుని ఒక్క రోజు (మార్చి 30) స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే స్మార్ట్ఫోన్స్, స్మార్ట్వాచెస్, ఇయర్ బడ్స్, పవర్ బ్యాంక్ వంటి వాటిమీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. అయితే మొదటి 100 మంది కస్టమర్లకు.. కేవలం 16 రూపాయలకే స్మార్ట్ఫోన్ (లావా అగ్ని 3), స్మార్ట్వాచ్ (లావా ప్రోవాచ్ V1) అందిస్తుంది.కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ ఈ రోజు (మార్చి 30) మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే సాయంత్రం 7:00 గంటలకు ప్రోవాచ్ వీ1 సేల్ జరుగుతుంది. దీనిని కొనుగోలు చేయడానికి ప్రోవాచ్ అనే కూపన్ కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది.లావా అగ్ని 3ఇండియన్ మార్కెట్లో లావా అగ్ని 3 స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ. 19999. ఇది 6.78 ఇంచెస్ డిస్ప్లే, క్వర్డ్ స్క్రీన్ పొందుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ 500 mAh బ్యాటరీ పొందుతుంది. ఇది 66 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఈ ఛార్జర్ కావాలనుకుంటే.. కస్టమర్లు కొంత ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే 16 రూపాయలకు ఎవరైనా సొంతం చేసుకుంటే.. వారికి ఈ ఛార్జర్ లభిస్తుందా? లేదా అనేది వెల్లడికాలేదు.లావా ప్రోవాచ్ వీ1ఈ ఏడాది ప్రారంభంలో 2,399 రూపాయల ధర వద్ద లాంచ్ అయిన లావా ప్రోవాచ్ వీ1.. ఈ రోజు ఆఫర్ కింద 16 రూపాయలకు లభిస్తుంది. ఈ వాచ్ 1.85 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే కలిగి.. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ పొందుతుంది. ఇది జీపీఎస్ న్యావిగేషన్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది.

ఇళ్లకు కూల్ రూఫ్ వేసుకుంటే సరి..
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఇంటి లోపల వేడి, ఉక్కపోత పెరిగిపోతోంది. దీంతో బయటే కాదు ఇంట్లోనూ ఉండలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇళ్లంతా చల్లగా ఉంటే ఆ హాయి వేరే కదూ.. అయితే పైకప్పులో కూల్ రూఫ్ టైల్స్, పెయింటింగ్స్ వేసుకుంటే సరి. సూర్యరశ్మిని గ్రహించి, ఇంట్లోకి వేడిని రాకుండా నిరోధించే శక్తి ఉండటం వీటి ప్రత్యేకత. పట్టణీకరణ, కాంక్రీట్ జంగిల్ కారణంగా నగరాలలో అర్బన్ హీట్ ఐల్యాండ్ (యూహెచ్ఐ) ప్రభావం ఏర్పడుతుంది. దీంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. –సాక్షి, సిటీబ్యూరోవేసవి కాలంలో వేడి గాలులతో 32 కోట్ల మంది భారతీయులు అధిక ప్రమాదకర పరిస్థితులకు గురవుతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చెట్ల పెంపకం, వేడి, కాలుష్యాన్ని తగ్గించే ఆచరణీయ పద్ధతులు ఉన్నప్పటికీ ప్రపంచ నగరాలు కూల్ రూఫ్, గ్రీన్ బిల్డింగ్ వంటి వినూత్న పరిష్కార మార్గాల వైపు దృష్టి సారిస్తున్నాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా, టొరంటో వంటి అంతర్జాతీయ నగరాలు కూల్ రూఫ్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ గణనీయమైన పర్యావరణ ప్రయోజనాలను పొందుతున్నాయి. ఇదే తరహాలో గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోనూ ‘కూల్ రూఫ్ పాలసీ’ని అమలులోకి తీసుకొచ్చింది. కూల్ ఉంటేనే ఓసీ.. మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర నివాస, వాణిజ్య భవనాలకు కూల్ రూఫ్ తప్పనిసరి. 600 గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలోని నివాస భవనాలకు కూల్ రూఫ్ ఉండాల్సిందే. అంతకంటే చిన్న ఇళ్లు స్వచ్ఛందంగా స్వీకరించవచ్చు. ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతి ప్రక్రియలో కూల్ రూఫ్ విధానాన్ని మిళితం చేసింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) జారీ చేసేందుకు సంబంధిత అధికారులు కూల్ రూఫ్లను నిర్ధారించుకున్నాకే ఓసీ జారీ చేస్తారు. కూల్ రూఫ్ పాలసీ అమలుతో ఐదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏటా సుమారు 12 కోట్ల యూనిట్ల విద్యుత్ ఆదా అవుతోందని ప్రభుత్వం అంచనా వేసింది.ఎంత ఖర్చవుతుందంటే.. కూల్ రూఫ్ టైల్స్ను జిర్కోనియం సిలికేట్, జింక్ ఆక్సైడ్ల నానోమీటర్ల పరిమాణంలో ఉండే చిన్న కణాల మిశ్రమాలను అల్యూమీనియం సిలికెట్ కణాలతో కూడిన ప్రత్యేక గ్లేజ్తో తయారు చేస్తారు. వీటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద కాలుస్తారు. దీంతో వీటికి సూర్యరశ్మిని గ్రహించి, ఇంట్లోకి వేడిని చేరనివ్వదు. కూల్ రూఫ్ ఏర్పాటుకు రకాన్ని బట్టి చ.అ.కు రూ.120–1,000 వరకు ఖర్చు అవుతుంది. ప్రత్యేకమైన పెయింటింగ్లు లేదా నిర్ధిష్ట సిరామిక్ టైల్స్తో తయారైన కూల్ రూఫ్లు ఉన్నాయి. ఏసీ వినియోగం తక్కువ.. సంప్రదాయ పైకప్పుతో పోలిస్తే కూల్ రూఫ్లు తక్కువ సౌరశక్తిని గ్రహిస్తాయి. ఇవి సూర్యరశ్మిని తక్కువగా గ్రహించి, ఇంట్లోకి వేడిని వెళ్లనివ్వదు. దీంతో ఇంట్లో ఏసీ, కూలర్ల వినియోగం తక్కువగా ఉంటుంది. సంప్రదాయ పైకప్పులతో పోలిస్తే కూల్ రూఫ్ పైకప్పు ఉన్న ఇంటిలోపల గది ఉష్ణోగ్రతలు 5–9 డిగ్రీలు తక్కువగా ఉంటాయి.

ఇండియన్ రైల్వే ఒకరోజు సంపాదన ఎంతో తెలుసా?
రోజుకు లక్షలమందిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేస్తున్న ఇండియన్ రైల్వే గురించి దాదాపు అందరికీ తెలిసిందే. లెక్కకు మించిన ట్రైన్స్ దేశంలోని ప్రధాన భూభాగాలను కలుపుతూ ముందుకు సాగిపోతాయి. అయితే ఇంత పెద్ద నెట్వర్క్ కలిగిన భారతీయ రైల్వే రోజుకు ఎంత సంపాదిస్తుందో.. బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.భారతీయ రైల్వే తమ సేవలను అప్డేట్ చేయడానికి మాత్రమే కాకుండా.. ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం.. రవాణా కోసం ప్రత్యేక కారిడార్ల నిర్మాణం చేపట్టడం వంటివి చేస్తోంది.ఇండియన్ రైల్వే రోజుకు ఎంత ఆదాయం గడిస్తుంది అన్న ప్రశ్నకు.. రూ. 400 కోట్లు అని సమాధానం వస్తోంది. అంటే భారతీయ రైల్వే నెలకు రూ. 12వేల కోట్లు సంపాదిస్తున్నమాట. రైల్వేలు కేవలం ప్రజా రవాణాకు మాత్రమే కాకుండా.. సరుకు రవాణా చేయడానికి కూడా విరివిగా ఉపయోగపడుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం సరుకును పంపించాలనుకునే కస్టమర్లు ట్రైన్ల ద్వారానే సరుకు రవాణా చేస్తారు.ఇదీ చదవండి: పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రంసరుకు రవాణా రైళ్ల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు, ప్యాసింజర్ రైళ్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా రైల్వేలకు చాలా ముఖ్యమైనది. రైల్వేలు ప్రతిరోజూ వేలాది ప్యాసింజర్ రైళ్లను నడుపుతున్నాయి. రైల్వేలు స్క్రాప్ అమ్మకాలు వంటి ఇతర వనరుల నుంచి కూడా ఆదాయాన్ని సంపాదిస్తాయి. పీఐబీ డేటా ప్రకారం, 22-23 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేలు సరుకు రవాణా ద్వారా రూ.1,60,158 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది.భారతీయ రైల్వేలు ప్రపంచంలోని టాప్ 5 అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి. ఇండియన్ రైల్వే 7,308 కంటే ఎక్కువ స్టేషన్లను కలిగి.. రోజుకు 20 మిలియన్లకు పైగా ప్రయాణికులను తరలిస్తోంది. ప్రకటనలు, ప్లాట్ఫామ్ టికెట్స్ ద్వారా కూడా ఇండియన్ రైల్వే డబ్బు సంపాదిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది.

రెండున్నరేళ్లలోనే 20 లక్షల క్రెడిట్ కార్డులు..
న్యూఢిల్లీ: సుమారు రెండున్నరేళ్ల స్వల్ప వ్యవధిలోనే 20 లక్షల పైచిలుకు టాటా న్యూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి. కొత్తగా జారీ అయిన కార్డుల్లో ఇవి సుమారు 13 శాతం వాటా దక్కించుకున్నట్లు టాటా న్యూ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించాయి.వివిధ ఉత్పత్తులు, సేవల కొనుగోళ్ల ద్వారా వచ్చే రివార్డు పాయింట్లన్నీ సమగ్రంగా అనుసంధానమవుతాయని పేర్కొన్నాయి. ఈ క్రెడిట్ కార్డుతో 10% వరకు ఆదా, ట్రావెల్.. ఫ్యాషన్ మొదలైన వాటి షాపింగ్లో ప్రత్యేక ప్రాధాన్యత తదితర ప్రయోజనాలను పొందవచ్చని టాటా డిజిటల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (ఫైనాన్షియల్ సర్వీసెస్) గౌరవ్ హజ్రతి తెలిపారు.
ఫ్యామిలీ

వృథాని జీరో చేసేలా..ది బెస్ట్గా రీయూజ్ చేద్దాం ఇలా.!
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ... మార్చి నెల 30వ తేదీని జీరో వేస్ట్ డే గా గుర్తిస్తూ 2022, డిసెంబర్ 14వ తేదీన ఒక తీర్మానాన్ని చేసింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అప్పటి నుంచి మార్చి నెల 30వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్’గా గుర్తిస్తూ ప్రపంచాన్ని చైతన్యవంతం చేస్తోంది. ఈ ఏడాది ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్ రంగాల వృథా మీద దృష్టి పెట్టింది. పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న వాయు, నీటి కాలుష్యాలతోపాటు వస్త్రాల అవశేషాలు కూడా ప్రధానమైనవి. క్లాత్తో డ్రస్ కుట్టిన తర్వాత వచ్చే మిగులు నదులు, కాలువల్లోకి చేరి నీటిలో, నీటి అడుగుల మట్టిలో నిలిచి΄ోతోంది. కొంతకాలానికి ఆ వస్త్రానికి అద్దిన రసాయన రంగులు నేలలో, నీటలో ఇంకుతాయి. ఇలా వేస్ట్ క్లాత్ కారణంగా కెమికల్ పొల్యూషన్ నీటిని, మట్టిని కూడా కలుషితం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దుస్తుల తయారీ విపరీతంగా పెరిగిపోయింది. 2000 సంవత్సరంలో ఉత్పత్పి 2015నాటికి రెండింతలైంది. ఏడాదికి 92 మిలియన్ టన్నుల టెక్స్టైల్ వేస్ట్ లెక్క తేలుతోంది. ఇది కాలువలు, నదుల్లోకి వెళ్తోంది. దీనిని అరికట్టడం కోసమే యూఎన్ఓ (యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్) ఈ ఏడాది ఫ్యాషన్ ఇండస్ట్రీ వేస్ట్ మీద దృష్టి పెట్టింది. ఫ్యాషన్, టెక్స్టైల్ రంగాలను జీరో వేస్ట్ దిశగా నడిపించడానికి మార్గాలను అన్వేషించాలంటోంది యూఎన్ఓ. హైదరాబాద్లో ఫ్యాషన్ ఇండస్ట్రీ నిర్వహిస్తున్న సుదీప కందుల ట్రిపుల్ ఆర్ (రీ యూజ్, రీ సైకిల్, రీ పెయిర్) అనే యూఎన్ఓ థీమ్ను రెండు దశాబ్దాలుగా అమలు చేస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది!సుదీప కందుల... ఆలన బొటీక్ పేరుతో చిన్న పిల్లల దుస్తుల డిజైనింగ ప్రారంభించి మూడు దశాబ్దాలవుతోంది. ఫ్యాషన్ ఇండస్ట్రీలో బొటీక్ కల్చర్ మొదలైన తొలినాళ్ల నుంచి బొటీక్ నడుపుతున్నారామె. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని భావించే సుదీప, ఆమె ఉద్యోగులు పాలిథిన్ కవర్ల వినియోగాన్ని తగ్గించడానికి మార్కెట్కెళ్లేటప్పుడు క్లాత్ బ్యాగ్ను వెంట తీసుకువెళ్తారు. బొటీక్లో ఉత్పన్నమయ్యే వేస్ట్ క్లాత్ను పునర్వినియోగంలోకి తీసుకురావడానికి అనేక మార్గాలనెంచుకున్నారు సుదీప. చిన్న ముక్కలతో నవజాత శిశువులకు, ఏడాది లోపు పిల్లలు ధరించడానికి వీలుగా కుట్టించి ఆర్ఫనేజ్కు ఇచ్చారు. అలా కుదరని వాటిని నగరంలోని ఒక ఎన్జీవోకి ఇస్తుంటారు. ఆ ఎన్జీవోలో అల్పాదాయ వర్గాల మహిళలకు ఆ క్లాత్తో చిన్న చిన్న పోట్లీ బ్యాగ్లు, పర్సులు తయారు చేసుకుంటారు. అలా కూడా పనికి రాని సన్నగా పొడవుగా రిబ్బన్ ముక్కల్లాంటి క్లాత్ని ఒక స్కూల్కి ఇస్తే వాళ్లు పిల్లల చేత డోర్మ్యాట్ మేకింగ్ వంటి క్రాఫ్ట్ ప్రాక్టీస్కి ఉపయోగిస్తున్నారు. ఇక ఎందుకూ పనికిరావనిపించే ముక్కలను ఒక కవర్లో జమ చేసి ఆ బొటీక్లో పని చేసే వాళ్లు దిండులో స్టఫింగ్గా నింపుకుంటారు. వ్యర్థాన్ని అర్థవంతంగా మారుస్తున్న సుదీప తన బొటీక్లో చిన్న ముక్క కూడా నేలపాలు కాకుండా ప్రయత్నం చేస్తున్నారు.ఉత్పత్తి– కొనుగోలు పెరిగాయిమనం కొంతకాలం వాడి ఇక పనికిరావని పారేస్తున్న వస్తువులు నిజానికి పనికిరానివి కాదు, వాటిని మరొక రకంగా మలుచుకుని ఉపయోగించుకోవడం మనకు చేతకాక΄ోవడమే. రీ యూజ్ చేయడం నేర్చుకోవాలి. నాచురల్ ఫైబర్తో వస్త్రాలు తయారుచేసినన్ని రోజులు వస్త్ర పరిశ్రమ, అనుబంధ పరిశ్రమల వ్యర్థాల గురించి మాట్లాడాల్సిన అవసరం రాలేదు. మ్యాన్మేడ్ ఫైబర్ ప్రవేశించిన తర్వాత ఎదురవుతున్న సమస్యలివన్నీ. నిజానికి వ్యర్థాల ఉత్పత్తి మనదేశంలోకంటే యూఎస్, యూరప్దేశాల్లో చాలా ఎక్కువ. అవసరానికి మించి ఉత్పత్తి చేయడం, అవసరానికి మించి కొనడం రెండూ పెరిగాయి.షాపింగ్ వ్యసనంఈ తరానికి షాపింగ్ ఒక వ్యసనంగా మారింది. యూఎస్, యూరప్ల నుంచి వాడిన దుస్తులు మూడవ ప్రపంచదేశాలకు డంప్ అవుతున్నాయి. అరేబియా షిప్పుల్లో గుజరాత్ తీరం నుంచి దేశంలోకి వస్తుంటాయవి. మన దగ్గర తయారయ్యే పాలియెస్టర్ వస్త్రాలకు తోడు ఆయాఖండాల నుంచి వచ్చిపడుతున్న దుస్తులు కూడా కలిసి డంప్ పెరిగిపోతోంది. పాలియెస్టర్ వస్త్రాలను ఫైబర్గా మార్చి కొత్త దుస్తులు తయారు చేసే క్రమంలో విడుదలయ్యే వ్యర్థాలు సముద్రాల్లోకి చేరి మైక్రోప్లాస్టిక్గా మారి తిరిగి మన మీదనే దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే పారేస్తున్న దుస్తులతో కాలువలు నిండిపోతున్నాయి.– డాక్టర్ దొంతి నరసింహారెడ్డి, పర్యావరణ నిపుణులు జీరో వేస్ట్తో ద బెస్ట్ప్లాస్టిక్, ఆహార వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ పరికరాల వేస్ట్తో ఏటా ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్ల టన్నుల చెత్త జమవుతోంది. ఇది పెరుగుతూ భూగ్రహాన్ని ముంచేసినా ఆశ్చర్యం లేదు. ఈ ప్రమాదాన్ని మన దేశంలో ముందుగా గ్రహించి అప్రమత్తమైన పప్రాంతం ఢిల్లీ, మాల్వీయ నగర్లోని నవజీవన్ విహార్ రెసిడెన్షియల్ సొసైటీ. రీయూజ్, రీసైకిల్ను ఫాలో అవుతూ జీరో వేస్ట్తో పర్యావరణప్రియమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది.దాదాపు ఏడేళ్ల కిందట... ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మాల్వీయనగర్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఒక వర్క్షాప్ నిర్వహించింది. అందులో పాల్గొన్న నవజీవన్ విహార్ రెసిడెన్షియల్ సొసైటీ సభ్యులు ఆ వర్క్షాప్లో చెప్పినవి, చూపించినవి తమ కాలనీలో అమలు చేయడం మొదలుపెట్టారు. అక్కడ 250 ఇళ్లున్నాయి. ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్తను ఎలా వేరుచేయాలో వివరించి, కొన్నాళ్లపాటు పర్యవేక్షించారు సొసైటీ సెక్రటరీ, కంటివైద్యులు డాక్టర్ రూబీ మఖీజా. తతిమా సభ్యుల సహాయసహకారాలతో తడిచెత్తతో కాలనీలోనే కంపోస్ట్ తయారుచేయడం మొదలుపెట్టారు. ఆ ఎరువుతో కిచెన్, బాల్కనీ, రూఫ్ గార్డెన్స్ను ప్రోత్సహించారు. ఒక షెడ్డు లాంటిదీ ఏర్పాటు చేశారు.. ఇళ్లల్లో పాతపుస్తకాలు, దుస్తులు, ఆటబొమ్మలు, ఉపయోగంలో లేని వస్తువుల కోసం. ఆ కాలనీలో ఎవరికైనా ఏ వస్తువైనా అవసరం ఉంటే ముందు ఈ షెడ్డుకొచ్చి చూసి, అందులో తమకు కావలసింది లేకపోతేనే కొత్తది కొనుక్కోవాలి. అలా కాలనీ వాసులు తీసుకున్నవి పోనూ మిగిలినవి స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారు అవసరమైన వాళ్లకు పంచేందుకు! ఈ కాలనీలో ప్లాస్టిక్ బ్యాన్. గుడ్డ సంచులనే వాడుతారు. నీటి వృథా, ఆదానూ సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. పిల్లలకు పర్యావరణం పట్ల అవగాహన కలిగించడానికి వారానికోసారి క్యాంప్ పెడతారు. అందులో పిల్లలను ఆడిస్తూ, పాడిస్తూ వాళ్లు ఎలక్ట్రానిక్ పరికరాలకు బానిసలు కాకుండా జాగ్రత్తపడుతున్నారు. వీళ్లో బ్రాడ్కాస్ట్ సిస్టమ్నూ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజూ కాలనీలో జరిగే పర్యావరణపరిరక్షణ కార్యక్రమాలను వీడియోలుగా తీసి వాటిని సాయంకాలం ప్రసారం చేస్తారు. ఈ ప్రయత్నాలతో జీరో వేస్ట్లో దేశానికే స్ఫూర్తిగా నిలిచింది నవజీవన్ విహార్. (చదవండి: 'తోలుబొమ్మలాట'ను సజీవంగా ఉండేలా చేసిందామె..! ఏకంగా రాజధానిలో..)

ఎండ నుంచి చర్మానికి రక్షణగా...
అందంగా కనబడాలని అందరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుతం భానుడు భగభగలతో చర్మానికి రక్షణ లేకుండా పోతోంది. గడప దాటిన వెంటనే వేడి, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితులు. వివిధ పనులపై బయటకు వెళ్లే వారు ఈ సమయంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంపై తప్పనిసరిగా దృష్టిపెట్టాల్సిన పరిస్థితి. ప్రధానంగా ముఖం, చేతులు సూర్య కిరణాలు నేరుగా తగిలే ఇతర ప్రదేశాల్లో చర్మం నిర్జీవంగా మారిపోతోంది. దీంతో చర్మ కాంతి తగ్గిపోతుంది. ఈ పరిస్థితులను అధిగమించాలంటే కొన్ని చిట్కాలు పాటించక తప్పదంటున్నారు సౌందర్య నిపుణులు. వేసవిలో చర్మానికి చెమటలు పట్టడం, జిడ్డుగా మారడం, పొడిబారిపోవడం, నల్లని మచ్చలు రావడం, ముఖంపై మొటిమలు, ఇలా ఇబ్బంది పెట్టే సమస్యలెన్నో ఉత్పన్నమవుతాయి. వీటన్నింటి నుంచి విముక్తి పొందడానికి చాలామంది వారికి తెలిసిన వివిధ రకాల చిట్కాలు పాటిస్తున్నారు. అయితే చర్మ సౌందర్యం దెబ్బతినడానికి మృత కణాలు కూడా ఒక కారణం. అయితే వీటి వల్ల చర్మం నిగారింపు కోల్పోతుంది. చెమట గ్రంథుల్ని మూసివేడయం వల్ల మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడతాయి. వీటి నుంచి అధిగమించాలంటే ఈ చిక్కాలు పాటించాల్సిందే.. సన్ స్క్రీన్తో మేలు.. సూర్యకిరణాల నుంచి విడుదలయ్యే అధిక యూవీ ఎక్స్పోజర్ చర్మానికి హాని కలిగిస్తుంది. ఫలితంగా చర్మం ముడతలు పడటం, వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో సూర్యకిరణాలు తాకే ప్రదేశాల్లో సన్ స్క్రీన్ అప్లై చేయడం మంచిది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు, సిట్రస్ యాసిడ్, యాంటీ బ్యాక్టీరియల్ మొటిమలు, మచ్చలను నియంత్రించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ముఖం మృదువుగా చేస్తుంది.పళ్లు , పళ్ల రసాలు తీసుకోవడం మంచిది.. వేసవి తాపానికి శరీరం తేమ కోల్పోతుంది. ఫలితంగా చర్మం ఎరగ్రా కందిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పళ్లు, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి అవసరమైన విటమిన్లతో పాటు, శరీరానికి అవసరమైన నీటి స్థాయిలను పునరుద్ధరిస్తాయి. చర్మం కాంతిమంతంగా మెరుస్తుంది. నిమ్మ, జామ, స్ట్రాబెర్రీ, దానిమ్మ, వాటర్ మెలాన్, బ్లూబెర్రీ, కివీ, యాపిల్ వంటి పండ్లు తీసుకోవడం మంచిది. జామపండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ ఎండ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.మేకప్ తక్కువగా వేసుకోవాలి.. సూర్య కిరణాల నుంచి వెలువడే యూవీ ఎక్స్పోజర్ చర్మానికి హానికలిగిస్తుంది. దీనిని నుంచి రక్షణ కోసం ఎస్పీఎఫ్ 50 ఉన్న యూవీ స్పెక్ట్రమ్ సన్ బ్లాక్, సన్ స్క్రీన్ ఉపయోగించాలి. కాలంతో సంబంధం లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే సన్్రస్కీన్ లోషన్ రాసుకోవాలి. వేసవిలో ఇది మరింత అవసరం. ఇంటికి చేరుకున్న తర్వాత చల్లటి నీటితో ముఖం కడగడం, స్నానం చేయడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఎండ తీవ్రతకు చర్మం పొడిబారిపోకుండా తేమగా ఉండటానికి నిపుణుల సూచనల మేరకు మాయిశ్చరైజర్లు అప్లై చేసుకోవాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండలో తిరగకుండా ఉండేందుకు ప్రయతి్నంచాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు రావాల్సి వస్తే ఎండ నుంచి ఉపశమనం కోసం బ్లాక్ గాగుల్స్, ఎండ తగలకుండా స్కార్్ఫ్స, గొడుగు వెంట తీసుకెళ్లడం మంచిది. వేసుకునే దుస్తులు కాటన్ మెటీరియల్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి. లూజుగా ఉన్న కాటన్ బట్టలు ధరించాలి. – ఆలపాటి శిరీష, కాస్మటాలజిస్టు, సికారా క్లినిక్స్, బంజారాహిల్స్

6 రుచులు... 6 ఆరోగ్య లాభాలు
ఉగాది పచ్చడిని సేవించే ఆచారం శాలివాహన శకారంభం నుంచి మొదలైనట్లుగా చరిత్రకారులు చెబుతారు. సంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడిని కొత్త మట్టికుండలోతయారు చేస్తారు. ఉగాది పచ్చడిలో వేపపూత, మామిడి పిందెలు, చింతపండు, ఉప్పు, మిరియాల పొడి, బెల్లం, అరటిపండు ముక్కలు ఉపయోగిస్తారు. వీటి వల్ల ఉగాది పచ్చడి ఆరురుచుల సమ్మేళనంగా తయారవుతుంది. ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలు, వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం....బెల్లం, అరటి పండ్లు– తీపిబెల్లం తీపిగా ఉంటుంది. ఎండ వేడిమి వల్ల కలిగే అలసటను పోగొట్టి, తక్షణ శక్తినిస్తుంది. బెల్లాన్ని అరటిపండుతో కలిపి తీసుకోవడం శ్రేష్ఠమని ఆయుర్వేదం చెబుతోంది. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలను అరటిపండు నిరోధిస్తుంది.చింతపండు– పులుపుఉగాది పచ్చడి తయారీకి పాత చింతపండు ఉపయోగించడం మంచిది. పాత చింతపండు ఉష్ణాన్ని, వాత దోషాలను తగ్గిస్తుంది. బడలికను పోగొడుతుంది. జఠరశక్తిని పెంచుతుంది. మూత్రవిసర్జన సజావుగా సాగేందుకు దోహదపడుతుంది. వేసవిలో చింతపండు రసం తీసుకోవడం వల్ల ఉష్ణదోషాలు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది.ఉప్పురుచులకు రారాజులాంటిది ఉప్పు. ఉప్పులేని పప్పులు, కూరలు, పచ్చళ్లు రుచించవు. ఆహారంలో అనునిత్యం ఉపయోగించే ఉప్పు త్రిదోషాలను– అంటే, వాత పిత్త కఫ దోషాలు మూడింటినీ పోగొడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే, ఉప్పును మోతాదులోనే వాడాలి.మామిడి పిందెలు– వగరుమామిడి కాయలు ముదిరితే పులుపుగా ఉంటాయి గాని, పిందెలు వగరుగా ఉంటాయి. మామిడి పిందెల వగరుదనం లేకుంటే, ఉగాది పచ్చడికి పరిపూర్ణత రాదు. మామిడి పిందెలలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. మామిడి పిందెలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని త్రిదోషాలను హరించి, శక్తిని కలిగిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.వేపపూలు– చేదువసంతారంభంలో వేపపూలను తినే ఆచారం దాదాపు అన్నిప్రాంతాల్లోనూ ఉంది. దీనిని ‘నింబకుసుమ భక్షణం’ అంటారు. షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిలో వేపపూలను ఉపయోగించడం మన తెలుగువాళ్లకే చెల్లింది. వేపపూలు కఫదోషాన్ని, క్రిమిదోషాలను పోగొడతాయి. జీర్ణకోశ సమస్యలను నివారిస్తాయి.మిరియాల పొడి–కారంమిరియాలను నేరుగాను, పొడిగాను వంటకాల్లో తరచుగా వినియోగిస్తూనే ఉంటాం. మిరియాలు రుచికి కారంగా ఉన్నా, శరీరానికి చాలా మేలు చేస్తాయి. మిరియాలు కఫదోషాన్ని, విష దోషాలను హరిస్తాయి. చర్మవ్యాధులను అరికట్టడమే కాకుండా, జీర్ణశక్తిని, శరీరంలోని జీవక్రియలను పెంచుతాయి. అందుకే సంప్రదాయ ఆయుర్వేద ఔషధాల్లో మిరియాలను విరివిగా ఉపయోగిస్తారు.

కొత్త తరానికి చెబుదాం
తెలుగువారి తొలి పండగ వచ్చేస్తోంది. నూతనోత్సాహంతో ఉగాదిని ఆహ్వానించడానికి సిద్ధమవుతున్న వేళ... కొత్త తరానికి పండగల అర్థం తెలుస్తోందా? అంటే... ‘పెద్దవాళ్లు చెబితేనే తెలుస్తుంది’ అంటున్నారు ప్రముఖ రచయితలు రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్. ఉగాది ప్రత్యేకంగా ఇంకా ఈ ఇద్దరూ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం.పండగలు జరుపుకోవడం ఎవరూ మానేయలేదు. పిండివంటలు చేసుకోవడానికైనా పండగలు చేసుకుంటున్నాం. పండగ పూట తల స్నానం చేసి, ఉగాది పచ్చడి తిన్న తర్వాతే మిగతా పనులు చేయాలని పిల్లలకు పెద్దలు చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త తరానికి పాత తరంవాళ్లు చెబుతుండాలి. ఎందుకంటే పండగలన్నీ ముందు తరంవాళ్లు చేసుకుంటూ వచ్చారు కాబట్టి చెప్పడం వారి బాధ్యత. కొత్త తరాన్ని పాజిటివ్గా స్వాగతించాలి. వారూ వెల్కమింగ్గానే ఉంటారు. మన తానులో పెరిగిన ముక్కలు వేరేలా ఎలా ఉంటారు? కొత్త తరానికి పద్ధతులన్నీ కొత్తే. పోనీ ఇవాళ్టి పాత తరం అనుకున్నవారికి ఎవరు చెప్పారు? వారి ముందు తరంవారు చెబితేనే కదా వీరికి తెలిసింది. ఇది రిలే పందెంలాంటిది. ఒక తరానికి ఒక తరానికి సక్రమంగా విషయాలను అందజేయాల్సిన బాధ్యత ముందు తరానికి ఉంటుంది. యువతని నిందించడం సరికాదు: ప్రపంచాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. మంచి కోణంలో... దుర్గార్మపు కోణంలో... ఎప్పుడూ మొదటి కోణంలో చూస్తే మంచిది. అది కాదనుకుని యువత పెడదారి పట్టిందని, ఏదేదో జరిగిపోతోందని యువతరాన్ని నిందించడం సరికాదు. ఏదీ వక్రీకరించిన కోణంలో చూడొద్దు. ఫారిన్ కల్చర్ అంటున్నాం... విదేశాలు వెళ్లి చూస్తే ఇక్కడికన్నా ఎక్కువ అక్కడ పండగలు బాగా జరుపుకుంటున్నారు. అన్నమాచార్యుల కీర్తనలు కూడా పాడుతున్నారు. ఇక్కడితో పోల్చితే అమెరికా ఫాస్ట్ ఫార్వార్డ్ అనుకోవాలి కదా. కానీ అక్కడ మన సంప్రదాయాలు బతికే ఉన్నాయి. ఇక ఎప్ప టికీ ఇండియా రామని తెలిసిన కుటుంబాలు కూడా తమ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు... మన సంప్రదాయాల గురించి చెబుతున్నారు. పిల్లలూ నేర్చుకుంటున్నారు. యువతరం బాధ్యతగా ఉంటోంది: సారవంతమైన నేల అది (యువతరాన్ని ఉద్దేశించి). బీజం వేయడం అనేది మన చేతుల్లో ఉంది. ముందు తరం బాధ్యతగా ఉండి, తర్వాతి తరానికి దగ్గరుండి అన్నీ నేర్పించి, అన్నీ ఆచరించేలా చేయాలి. వీళ్లు పాటిస్తూ వాళ్లు పాటించేలా చేయాలి. పొద్దున్నే వీళ్లు స్నానం చేయకుండా... పిల్లలను స్నానం చేసి, పూజలు చేయమంటే ఎందుకు చేస్తారు? నువ్వు చేయడంలేదు కదా? అంటారు. ఒకవేళ మాటల రూపంలో చెప్పకపోయినా... ముందు తరం ఆచారాలు పాటిస్తుంటే వీళ్లు చూసి, నేర్చుకుంటారు... అనుసరించడానికి ఇష్టపడతారు. బోధించే విధానం సక్రమంగా ఉండాలి. ఫైనల్గా చెప్పేదేంటంటే... మనం అనుకున్నంతగా యువతరం ఏమీ దిగజారిపోలేదు. చెప్పాలంటే మనకన్నా ఇంకా బాధ్యతగా ఉంటూ, పాతా కొత్తా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్నారు. ఈ కాలపు పిల్లలు ఇంటికీ, బయటికీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తెలిసినవాళ్లు. వాళ్లలో ఏదైనా లోపం ఉందీ అంటే... చెప్పేవాళ్లదే కానీ వాళ్లది కాదు. సో... ఏ పండగని ఎందుకు జరుపుకోవాలో విడమర్చి యువతరానికి చెప్పాల్సిన బాధ్యత ముందు తరానిదే. సంవత్సరాది ఎందుకు జరుపుకుంటున్నాం? ఉగాది పచ్చడి విశిష్టత వంటివి చెప్పి, పండగ అర్థం తెలియజేయాలి.పండగ‘రుచి’చూపాలి– అనంత శ్రీరామ్పండగలు జరుపుకునే తీరు మారింది. పెళ్లిళ్లల్లో ఎప్పుడైతే మనకు లేని రిసెప్షన్ అని మొదలుపెట్టామో అలానే పండగలు జరుపుకునే తీరులోనూ మార్పు వచ్చింది. ఉగాది గురించి చెప్పాలంటే... మా ఊరులో ఐదు రోజులు ఉగాది జాతర జరుగుతుంది. మాది వెస్ట్ గోదావరి, యలమంచిలి మండలం, దొడ్డిపట్ల గ్రామం. జాతర సందర్భంగా ఊరేగింపులు అవీ చేస్తుంటారు. ఇప్పుడూ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు జాతరలో భాగంగా మేజిక్ షోస్ అంటూ వెస్ట్రన్ కల్చర్ మిక్స్ అయిపోయింది. ఉగాది అంటే కవి సమ్మేళనాలు విరివిగా జరిగేవి. ఇప్పుడలా లేదు. ఎవరైనా విద్యావంతులు లేదా శాంతి సమాఖ్యలు వాళ్లు ఏదో టౌన్ హాలులో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసినా ఓ ఇరవై ముప్పైమంది ఉంటున్నారు... అంతే. ఉగాది ప్రత్యేకం అమ్మవారి జాతర: ఇక మా ఊరి ఉగాది గురించి చెప్పాలంటే... మాణిక్యాలమ్మ మా గ్రామ దేవత. ఉగాది సమయంలో మాకు ఆ అమ్మవారి జాతర ఉంటుంది. ఉగాది ప్రత్యేకం అంటే ఆ జాతరే. ఐదు రోజులు ఘనంగా చేస్తారు. ఐదో రోజు అయితే అమ్మవారిని బాగా అలంకరించి, ఊరేగించి, తెప్పోత్సవం చేస్తారు. నేను ప్రతి ఏడాది దాదాపు మిస్ కాకుండా వెళతాను. ఈసారి కుదరదు. ఆరు రుచులను సమానంగా ఆస్వాదించాలి: ఉగాది పచ్చడిలోని షడ్రుచుల గురించి చెప్పాలంటే... నేను ‘ఒక్కడున్నాడు’ సినిమాలో ‘ఇవ్వాళ నా పిలుపు... ఇవ్వాలి నీకు గెలుపు... సంవత్సరం వరకు ఓ లోకమా...’ అని పాట రాశాను. అది పల్లవి. పాట మొదటి చరణంలో రుచుల గురించి రాశాను. ‘కొంచెం తీపి... కొంచెం పులుపు పంచే ఆ ఉల్లాసమూ... కొంచెం ఉప్పు... కొంచెం కారం పెంచే ఆ ఆవేశమూ... చేదూ వగరూ చేసే మేలూ... సమానంగా ఆస్వాదించమని ఇవ్వాళ నా పిలుపు’ అని రాశాను. ఆరు విభిన్నమైన రుచులను సమానంగా ఆస్వాదిస్తేనే జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలమని చెప్పడమే ఆ పాట ఉద్దేశం. అంటే... జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ సమానంగా స్వీకరించగలగాలి.ఆ బాధ్యత పెద్దవాళ్లదే: ఇక నేటి తరం గురించి చెప్పాలంటే... ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలతో హాలోవెన్ అంటూ రకరకాల వేషాలు వేయిస్తున్నారు. వేలంటైన్స్ డే అనీ ఇంకా వేరే ఎక్కడెక్కడనుంచో తెచ్చిపెట్టుకున్న పండగలను జరుపుతున్నారు. అయితే పిల్లలకు మన పండగల గురించి చెప్పాలి. వేరే సంబరాలు ఎలా ఉన్నా కూడా మన పండగలకు ఎక్కువప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా పాత తరం ఆచరిస్తే కొత్త తరానికి అర్థం అవుతుంది. వాళ్లు మన సంస్కృతీ సంప్రదాయాలను ముందుకు తీసుకెళతారు. మా గ్రామంలో ఉగాది అంటే... ఇంట్లో పిల్లలకు వేప పూత, మామిడికాయలు, చెరుకు గడలు తెమ్మని టాస్కులు ఇచ్చేవారు. అవి తెచ్చే క్రమంలో మాకు పండగలు అర్థమయ్యేవి. అలా మా ముందు తరంవాళ్లు మాకు నేర్పించారు. కొత్త తరానికి మనం అలా నేర్పిస్తే వాళ్లు పాటిస్తారు. ముందు తరాలకు సంస్కృతీ సంప్రదాయాలను నేర్పించే బాధ్యత పెద్దవాళ్లదే.– డి.జి. భవాని
ఫొటోలు


మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటున్న నటి ‘అనన్య నాగళ్ల’ (ఫొటోలు)


ఉగాది స్పెషల్ లుక్లో మహేశ్బాబు గారాలపట్టి సితార (ఫోటోలు)


తిరుమలలో ఉగాది వేడుకలు (ఫొటోలు)


#MEGA157 చిరంజీవి,అనిల్ రావిపూడి కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)


శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు..భక్తజనసంద్రం (ఫొటోలు)


లక్మీ ఫ్యాషన్ వీక్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)


చిరంజీవిని కలిసిన 'కోర్ట్' మూవీ టీమ్ (ఫొటోలు)


తిరుపతి : గుడి సంబరం..అంగరంగ వైభవంగా (ఫొటోలు)


విశ్వావసు నామ ఉగాది వేడుక సంబరాల్లో యువత (ఫొటోలు)


హీరో రామ్చరణ్ 40వ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
International

శరణార్థులకు, నిరాశ్రయులకు జారీ చేసే గ్రీన్ కార్డులకు ఫుల్స్టాప్!
గత జో బైడెన్ ప్రభుత్వం చూపించిన ఉదారవాద విధానాలను స ద్వినియోగం చేసుకుని ఇప్పటికే శరణార్థి/నిరాశ్రయుల హోదా సంపాదించిన విదేశీయులకు అందజేసే గ్రీన్కార్డుల జారీ ప్రక్రియ హఠాత్తుగా ఆగిపోయింది. తాత్కాలికంగా ఈ గ్రీన్కార్డుల జారీ ప్రక్రియను నిలిపేసినట్లు అమెరికా పౌరసత్వం, శరణార్థి సేవల విభాగం తాజాగా ధ్రువీకరించింది. దీంతో అక్రమ మార్గా ల్లో అమెరికాలోకి వచ్చి ఎలాగోలా శరణార్థి హో దా పొందిన వారికి ఇక కొత్త కష్టాలు మొదలయ్యే అవకాశముంది. శరణార్థి/నిరాశ్రయుల హోదా పొందటంతో ఏవైనా అవకతవకలు జరిగాయా లేదంటే వీళ్లంతా నిజంగానే సొంతదేశాల్లో హింస, పీడనకు గురయ్యారా? అనేది తేలాల్సి ఉంది. ఇందుకోసం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సంబంధిత పాత రికార్డులను తవ్వితీయనుందని తెలుస్తోంది. గ్రీన్కార్డు హోదా కోసం దరఖాస్తు చేసుకున్న వారి పూర్వాపరాలను సమీక్షించాకే వారికి గ్రీన్కార్డు కట్టబెట్టడంపై ముందుకెళ్లాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. దీంతో లక్షలాది మంది శరణార్థులు/నిరాశ్రయుల గ్రీన్కార్డు కలలపై ఒక్కసారిగా నీలినీడలు కమ్ముకున్నాయి. భారతీయుల్లో 466 శాతం ఎక్కువ రెండేళ్ల క్రితం అంటే 2023 ఏడాదిలో ఏకంగా 51,000 మందికిపైగా భారతీయులు అమెరికాకు చేరుకుని శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంతో పోలిస్తే ఒకేఏడాదిలో ఇంతమంది భారతీయులు శరణార్థులుగా అగ్రరాజ్యం చెంతకు చేరడం ఇదే తొలిసారి. 2018 ఏడాదిలో కేవలం 8,000 మంది భారతీయులు ఈ తరహా దరఖాస్తు చేసుకోగా 2023 ఏడాదికి వచ్చేసరికి ఏకంగా 466 శాతం అధికంగా 51,000 మంది అప్లై చేశారని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం విడుదలచేసిన గణాంకాల్లో వెల్లడైంది. అక్రమ మార్గాల్లో మెక్సికో, కెనడా సరిహద్దుల గుండా అమెరికా భూభాగంలోకి అడుగుపెడుతూ అమెరికా బోర్డర్ సెక్యూరిటీ పోలీసులకు చిక్కిన వేలాది మంది భారతీయులు శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకు అమెరికా ఇమిగ్రేషన్ సిస్టమ్ అనుమతిస్తోంది. శరణార్థి హోదా.. సుదీర్ఘ ప్రక్రియ బోర్డర్ వద్ద చిక్కిన వాళ్లకు వెంటనే శరణార్థి హోదా ఇవ్వరు. వాళ్లు చెప్పే వివరాలను అధికారులు నమోదుచేసుకుని దరఖాస్తు ప్రక్రియను మొదలుపెడతారు. వైద్య పరీక్షలతోపాటు ముఖాముఖి ఇంటర్వ్యూలు చేస్తారు. సంబంధిత శరణార్థి అధికారులు ఈ బాధ్యతలను నెరవేరుస్తారు. ఈ సందర్భంగా తాము స్వదేశాన్ని ఎందుకు వీడాల్సి వచ్చింది?. స్వదేశంలో తాము పడిన కష్టాలు, ఎదురైన సమస్యలు, సొంత సమాజంలో అణచివేతకు గురవడానికి కారణాలను వివరించాల్సి ఉంటుంది. వీళ్లు చెప్పే మాటలు, వివరాలను అధికారులు/ఇమిగ్రేషన్ న్యాయమూర్తులు నమ్మితే శరణార్థి హోదా వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. కార్యనిర్వాహక ఉత్తర్వుతో అడ్డుకున్న ట్రంప్ ఎలాగోలా శరణార్థి హోదా పొందిన వారికి అమెరికాలో తాత్కాలికంగా నివసించేందుకు అవకాశం చిక్కుతోంది. ఈ అవకాశం లేకుండా చేసేందుకు రెండోదఫా అధికారంలోకి వచ్చిన ట్రంప్ వెంటనే రెండు కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీచేశారు. శరణార్థులుగా వచ్చే వారిని లోపలికి రానివ్వడం ఆపేశారు. అరెస్టయి శరణార్థి శిబిరాల్లో ఉంటున్న వారు శరణార్థి హోదా దరఖాస్తు చేయకుండా నిలువరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా–మెక్సికో సరిహద్దు వద్ద ఈ రెండు విధానాలను ట్రంప్ కఠినంగా అమలుచేస్తున్నారు. ఈ ఉత్తర్వులను ఇప్పటికే కొందరు కోర్టుల్లో సవాల్చేశారు. కొందరిని స్వదేశాలకు తిరిగి పంపడాన్ని ఇటీవల ఒక ఫెడరల్ జడ్జి తన ఉత్తర్వులతో అడ్డుకోవడం తెల్సిందే. హోదా సవరణపై ట్రంప్ సర్కార్ తీవ్ర అభ్యంతరం శరణార్థి హోదాతో చాన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్న వాళ్లు ఇక శాశ్వత స్థిర నివాసం కోసం గ్రీన్కార్డుకి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలనను ట్రంప్ సర్కార్ తాజాగా ఆపేసింది. హడావుడిగా వీళ్లకు గ్రీన్కార్డు ఇచ్చేయకుండా అసలు ఈ శరణార్థుల గతచరిత్ర స్వదేశంలో ఎలాంటిది?. భవిష్యత్తులో వీళ్లు అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదముందా?.. ఇలా పలు అంశాల తుది నిర్దారణకు సంబంధించి ‘స్క్రీనింగ్’విధానాలను అవలంబించాలని, అందుకోసమే అప్లికేషన్ల పరిశీలనను ఆపేశామని యూఎస్ సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐసీ) అధికారులు స్పష్టంచేశారు. మెక్సికోలో గతంలో డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్న వ్యక్తులు/కుటుంబాలు అమెరికాలో శరణార్థులుగా ఉంటే అలాంటి వారి జాబితాను ఈ గ్రీన్కార్డు దరఖాస్తుల్లో వెతుకుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్

మయన్మార్ వెన్ను విరిగింది
బ్యాంకాక్: భూకంపం మయన్మార్ వెన్ను విరిచింది. అంచనాలకు కూడా అందనంతటి నష్టాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రమైన మాండలేతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాల శిథిలాలే. బాధితుల హాహాకారాలు, వారి సంబం«దీకుల ఆక్రందనలే. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో విరుచుకుపడ్డ భూకంపానికి బలైన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. శిథిలాల నుంచి ఇప్పటికే 1,600కు పైగా మృతదేహాలను వెలికితీశారు. 3,500 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య 10 వేలు దాటవచ్చని చెబుతున్నారు. కొన్నేళ్లుగా అంతర్యుద్ధంతో కునారిల్లుతున్న ఆ దేశానికి ఇది పులిమీద పుట్రలా పరిణమించింది. అత్యవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు కనీస స్థాయి మౌలిక వనరులు కూడా లేక సైనిక సర్కారు చేతులెత్తేస్తోంది. శిథిలాల నుంచి మృతులు, క్షతగాత్రుల వెలికితీతకు అవసరమైనన్ని భారీ క్రేన్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి! దాంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఫలితంగా శిథిలాల కింద చిక్కిన వారిలో అత్యధికులు మృత్యువాత పడే దుస్థితి నెలకొంది. నిస్సహాయ స్థితిలో ఉన్న మయన్మార్కు భారత్ తక్షణం ఆపన్నహస్తం అందించింది. ఇతర దేశాల నుంచి కూడా మయన్మార్కు సాయం అందుతోంది. మరోవైపు శనివారం మధ్యాహ్నం నేపిడా సమీపంలో మూడు గంటల తేడాతో రెండుసార్లు భూమి కంపించింది. 4.3, 4.7 తీవ్రతతో వచ్చిన ఆ భూకంపాల తాలూకు నష్టం వివరాలు వెంటనే తెలియరాలేదు. గత 24 గంటల్లో మయన్మార్లో 14కు పైగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కుప్పకూలిన కంట్రోల్ టవర్ భూకంప ధాటికి నేపిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో కంట్రోల్ టవర్ కుప్పకూలి శిథిలాల దిబ్బగా మారింది. విమాన సేవలు ఆగిపోవడంతో భారత్ తదితర దేశాల నుంచి వస్తున్న సహాయక విమానాలు యాంగూన్లో దిగుతున్నాయి. థాయ్లాండ్లో... థాయ్లాండ్లో భూకంపం తాలూకు విధ్వంస తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. రాజధాని బ్యాంకాక్తో పాటు పలు నగరాల్లో భవనాలు, ఆస్పత్రులు, ఆలయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నగరంలో కనీసం 2,000 పైచిలుకు భవనాలు తీవ్రంగా పగుళ్లిచ్చినట్టు గవర్నర్ తెలిపారు. 334 అణుబాంబుల శక్తి! మయన్మార్ భూకంపం ఏకంగా శక్తిమంతమైన 334 అణుబాంబుల పేలుడుకు సమానమైన శక్తిని విడుదల చేసినట్టు జియాలజిస్టులు తేల్చారు! మాండలే, పరిసర ప్రాంతాలకు ముప్పు ఇంకా తొలగలేదని వారు హెచ్చరించారు. అక్కడ ఒకట్రెండు నెలల పాటు ప్రకంపనలు కొనసాగే ఆస్కారముందని వివరించారు.రోడ్డుపైనే ప్రసవం శుక్రవారం మధ్యాహ్న వేళ. భూకంపం దెబ్బకు బ్యాంకాక్ అతలాకుతలమైంది. జనమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లూ, భవనాలు వీడుతున్నారు. ఉన్నపళంగా రోడ్లపైకి పరుగులు తీస్తున్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిని అధికారులు హుటాహుటిన ఖాళీ చేయించి రోగులను ఫైర్ సేఫ్టీ మార్గం గుండా బయటికి తరలిస్తున్నారు. ఆ క్రమంలో ఓ నిండు గర్భిణికి నడిరోడ్డు మీదే పురిటి నొప్పులు మొదలయ్యాయి. చుట్టూ గందరగోళం మధ్యే వైద్య సిబ్బంది సమక్షంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కూడా. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.15 మంది సజీవం! భూకంపం ధాటికి బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భవనం శుక్రవారం కుప్పకూలడం తెలిసిందే. పదుల సంఖ్యలో నిర్మాణ కారి్మకులు, సిబ్బంది శిథిలాల కింద చిక్కుబడ్డట్టు చెబుతున్నారు. ఆచూకీ తెలియకుండా పోయిన 100 మందిలో అత్యధికులు ఆ శిథిలాల కిందే ఉన్నట్టు భావిస్తున్నారు. దాంతో వారి బంధువులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. వారిలో కనీసం 15 మంది ప్రాణాలతో ఉన్నట్టు సహాయక సిబ్బంది గుర్తించారు. శిథిలాల అడుగుభాగం నుంచి వారి మూలుగులు, సాయం కోసం చేస్తున్న ఆర్తనాదాలు తమకు లీలగా వినిపిస్తున్నాయని సిబ్బంది చెప్పారు.

Myanmar: భూ ప్రకంపనల వైరల్ వీడియోలు
నేపిడా/బ్యాంకాక్: మయన్మార్(Myanmar)ను భూకంపం కుదిపేసింది. వందలాది భవనాలు నేల మట్టమయ్యాయి. మరణాల సంఖ్య లెక్కకు అందనంతగా ఉంది. ఇక నిరాశ్రయులైనవారి సంఖ్య చెప్పలేనంతగా ఉంది. ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Dashcam footage of the powerful 7.7 magnitude earthquake in Myanmar Mandalay city#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/jzuRilDMsr— Culture War Report (@CultureWar2020) March 29, 2025మయన్మార్, థాయిలాండ్లలో సంభవించిన భూకంపానికి సంబంధించిన ఈ వీడియోలో ఆకాశహర్మ్యాలు ఊగడాన్ని చూడవచ్చు. రోడ్లపై వాహనాలు కదలడాన్ని కూడా చూడవచ్చు. ఈ వీడియో వణుకుపుట్టించేదిగా ఉంది.High-rise condo in Thailand with a pool on the 37th floor#Myanmar #Burma #Thailand pic.twitter.com/9tHDxZ7B4M— Culture War Report (@CultureWar2020) March 29, 2025ఈ వీడియోలో ఆకాశహర్మ్యంలో నిర్మించిన స్విమ్మింగ్ ఫూల్లో అలలు ఏర్పడి, అవి ఎగసిపడటాన్ని చూడవచ్చు. దీనిని చూస్తే చాలు.. భూకంప తీవ్రతను అంచనా వేయవచ్చు.🧵 Extreme shaking going on in Myanmar during the 7.7 Earthquake#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/4jGeCgZJXc— Culture War Report (@CultureWar2020) March 29, 2025ఈ వీడియోలో ఇంటిలో ఏర్పడిన భూకంప ప్రభావాన్ని చూడవచ్చు. చిన్న చెట్టును ఊపినప్పుడు అది ఎలా ఊగిపోతుందో ఆ విధంగా ఈ ఇల్లు భూకంప తీవ్రతకు ఊగిపోయింది.People trapped on the 78th floor Skywalk at Mahanakhon Building, Bangkok, during the 7.7 earthquake#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/j7WQYai24w— Culture War Report (@CultureWar2020) March 29, 2025స్కై వాక్ చేయడానికి 78వ అంతస్తుకు చేరుకున్న జనం భవనం కంపించడంతో ఎంతగా భయపడ్డారో ఈ వీడియోలో చూడవచ్చు. అక్కడున్న వస్తువులు జారిపోతుండటాన్ని గమనించవచ్చు.🧵 Mother Nature is Mind blowing The Earth was torn open today in Myittha, Mandalay Region, following the powerful 7.7 earthquake in Myanmar#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/tORlQD019c— Culture War Report (@CultureWar2020) March 29, 2025ఈ వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. భూమి పూర్తిగా చీలిపోయి, చాలా లోతైన పగుళ్లు ఏర్పడటాన్ని చూడవచ్చు.Narrowly escape! In #Bangkok, Thailand, a worker was cleaning the exterior walls while the building shook violently due to the #Myanmar earthquake, nearly hit by the falling glasses.#Myanmarquake #earthquakemyanmar pic.twitter.com/mDSB8MgiX4— Shanghai Daily (@shanghaidaily) March 29, 2025ఈ వీడియోలో భూకంపం తర్వాత ఆకాశహర్మ్యం పైకప్పుపై నుంచి నీరు జలపాతంలా పడటం కనిపిస్తుంది. భూకంపం సంభవించిన సమయంలో భవనాన్ని శుభ్రం చేస్తున్న వ్యక్తి ఎంతో భయపడుతూ కనిపిస్తున్నాడు.Devastating 7.7 Earthquake causes water to rise up from the ground in Myanmar pic.twitter.com/VFfT8qMLmU— TaraBull (@TaraBull808) March 29, 2025ఈ వీడియోలో భూమికి పగుళ్లు ఏర్పడిన దరిమిలా భూమి నుండి పంపు ద్వారా నీరు దానికదే ఉబికి రావడాన్ని గమనించవచ్చు.Nurses at a maternity center in Ruili, southwest China's Yunnan Province, did all they could to protect newborns when a deadly earthquake struck Myanmar, sending strong tremors across the border into Yunnan. #quake #heroes #China pic.twitter.com/KKhkxiDrKm— China Xinhua News (@XHNews) March 29, 2025ఈ వీడియో నైరుతి చైనాలోని ఒక ఆస్పత్రికి సంబంధించినది. భూకంపం సమయంలో నవజాత శిశువులను రక్షించడానికి నర్సులు పడుతున్న పాట్లను గమనించవచ్చు.ఇది కూడా చదవండి: ‘ప్రయాగ్రాజ్’కు పోటీగా నాసిక్ కుంభమేళా

విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు
వాషింగ్టన్: అమెరికాలో విదేశీ విద్యార్థులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో బాంబు వేసింది. వందల మంది విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ రాత్రికి రాత్రే వీసా రద్దు మెయిల్స్ పంపినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వీసాలు రద్దయిన విద్యార్థులు తక్షణమే దేశాన్ని వీడాలని లేదంటే బలవంతంగా తరలిస్తామని ఆ మెయిల్స్లో హెచ్చరించింది. వీసాలు రద్దైన వాళ్లలో కొందరు భారతీయ విద్యార్థులు కూడా ఉన్నట్లు సమాచారం. యూనివర్సిటీలలో జరిగిన వివిధ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ మెయిల్స్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ‘బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా’ నుంచి విదేశీ విద్యార్థులకు ఈమెయిల్స్ వెళ్తున్నాయి. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్ పంపింది. కేవలం ఆందోళనల్లో పాల్గొన్నవారికే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన విద్యార్థులకు.. ఆఖరికి ఆ పోస్టులకు లైకులు కొట్టినవాళ్లకు కూడా ఈ హెచ్చరికలు పంపించింది.‘‘యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్, అమెరికా జాతీయచట్టంలోని సెక్షన్ 221(జీ) ప్రకారం.. మీ వీసా రద్దయింది. ఈ మేరకు స్టూడెంట్ ఎక్చ్సేంజ్ విజిటర్ ప్రోగ్రామ్కు బాధ్యత వహించే అధికారులకు సమాచారం వెళ్లింది. మీ వీసా రద్దు అంశం గురించి సంబంధిత కళాశాల యాజమాన్యానికి వారు తెలియజేయవచ్చు’’హెచ్చరిక సందేశాలు వచ్చినవారు.. తమ స్వదేశాలకు వెళ్లేందుకు సీబీపీ హోమ్ యాప్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ చర్యతో.. ఆన్లైన్లో యాక్టివ్గా ఉండటం వల్ల కలిగే పరిణామాలు, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిమితులపై ఆందోళన రేకెత్తుతోంది.
National

పొట్టలో మర్చిపోయిన కత్తెరను 17 ఏళ్ల తర్వాత తీశారు!
లక్నో: సిజేరియన్ సమయంలో మహిళ పొట్టలోనే కత్తెరను మర్చిపోయి కుట్లేశాడో వైద్యుడు. 2008లో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 17 ఏళ్ల పాటు కడుపు నొప్పితో ఎంతో బాధపడింది ఆ మహిళ. చివరికి ఎక్స్ రేతో పొట్టలో కత్తెర ఉన్న విషయం తెల్సి ఆపరేషన్తో వెలుపలికి తీశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. సంధ్యా పాండే అనే మహిళకు 2008 ఫిబ్రవరి 28వ తేదీన లక్నోలోని ‘షీ మెడికల్ కేర్’ఆస్పత్రిలో సిజేరియన్తో కాన్పు చేశారు. ఆ సర్జరీ జరిగినప్పటి నుంచి పొట్టలో విపరీతమైన బాధతో ఇబ్బంది పడుతున్నారు. ఎందరో డాక్ట ర్ల వద్దకు వెళ్లారు. అయినా ఉపశమనం దొరకలేదు. ఇటీవల సంధ్యా పాండే వైద్య పరీక్షల కోసం లక్నోలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఎక్స్ రే కూడా తీశారు. ఆమె పొట్టలో కత్తెర ఉన్నట్లు ఎక్స్ రే రిపోర్టుతో తెలిసింది. దీంతో ఆమె కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ ఆస్పత్రిలో చేరారు. మార్చి 26వ తేదీన ఆపరేషన్ చేసి వైద్యులు కడుపులో ఉన్న కత్తెరను బయటకు తీశారు. ఎంతో సంక్లిష్టమైన ఆపరేషన్ ద్వారా కత్తెరను బయట కు తీశామని, కోలుకున్నాక సంధ్యా పాండేను డిశ్చార్జి చేశామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సంధ్య భర్త అరవింద్ కుమార్ పాండే ఫిర్యాదు మేరకు సిజేరియన్ చేసిన డాక్టర్ పుష్పా జైశ్వాల్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

పిల్లలు ఆరుబయట ఆడాలంటే మాస్క్ ధరించాల్సిరావడం దారుణం
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో చిన్నారులు ఆడుకోవాలంటే మాస్క్ ధరించాల్సిన దుస్థితి దాపురించొద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ ఆవేదన వ్యక్తంచేశారు. కాలుష్య ఉద్గారాల ఉధృతికి అడ్డుకట్టవేయాలని, కాలుష్యం కట్టడి కోసం తగు ‘స్వచ్ఛ’సాంకేతికతలపై పెట్టుబడులు పెరగాలని ఆయన అభిలíÙంచారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మొదలైన వాతావరణ జాతీయ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘దేశ రాజధాని గత కొంతకాలంగా కాలుష్య రాజధానిలా తయారైంది. కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. పిల్లలు ఆరుబయట ఆడుకోవాలంటే మాస్క్ ధరించాల్సిన దారుణ పరిస్థితులు రావడం శోచనీయం. ఇంత తక్కువ వయసులో కాలుష్యమయ గాలి పీల్చడం వల్ల ఎన్నో శ్వాససంబంధ వ్యాధులు చుట్టుముడతాయి. కాలుష్య ఉద్గారాల వెల్లువకు అడ్డుకట్టపడాల్సిందే. ఇందుకోసం మనందరం సమైక్యంగా నిలబడి తక్షణ కార్యాచరణతో రంగంలోకి దిగాలి. ఆర్థికాభివృద్ధికి, పర్యావరణహిత విధానానికి సమతూకం సాధించాలి. శుద్ధ సాంకేతికతల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు విధాన నిర్ణయాలు తీసుకోవాలి. పర్యావరణానికి హాని కల్గించని టెక్నాలజీలపై దృష్టిసారించాలి. తక్కువ ఉద్గారాలను వెదజల్లే రవాణా విధానాలను అవలంభించాలి. అలాంటప్పుడు మనం పీల్చే గాలి గరళంగా మారకుండా ఉంటుంది. నీటి కాలుష్యం సైతం మరో తీవ్ర సమస్యగా తయారైంది. శుద్ధికి నోచుకోని వ్యర్థాలు నేరుగా నదీజలాల్లో కలిసిపోతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు నదీజలాల్లో కలవకుండా అడ్డుకోవాలి. మురుగునీటిని శుద్ధిచేశాకే నదీజలాల్లోకి వదలాలి. నదీతీరాల్లోని స్థానిక ప్రజానీకం సైతం వ్యర్థాలను నేరుగా నదుల్లో పడేయకుండా తమ వంతు బాధ్యతగా మెలగాలి’’అని జడ్జి అన్నారు. కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఛైర్పర్సన్, అటార్నీ జనరల్, తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

‘తెలంగాణ రైజింగ్’కు ఆ దేశాలు వద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ‘భారత్ సమ్మిట్’(తెలంగాణ రైజింగ్)కు కొన్ని దేశాల వారిని పిలవొద్దని కేంద్రం ఆంక్షలు విధించింది. అరబ్దేశాలు, ఆ దేశాలకు సహకరిస్తున్న మరికొన్ని దేశాల వారిని పిలవకుండా రైజింగ్ జరుపుకోమని సూచనలు చేసింది. ఆయా దేశాల ప్రతినిధులు భారత్కు వస్తే సంకేతాలు మరోలా బయటకు వెళతాయనే ఆలోచనతోనే తాము వద్దు అంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్కు.. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేంద్రం సూచించిన వివిధ దేశాల పేర్లు తొలగించి, కొత్త పేర్లతో మరో లేఖ ఇవ్వడానికి రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది. మీ ఆలోచన మంచిదే.. కానీ వాళ్లు వద్దు ‘రాబోయే 25 సంవత్సరాల్లో తెలంగాణను సమున్నతంగా నిలిపేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిలవండి. ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ పేరుతో నిర్వహించబోయే ‘భారత్ సమ్మిట్’కు పలు దేశాల వారిని పిలవాలని అనుకుంటున్నాం. దీనికి మీ మద్దతు, అనుమతి అవసరం’అంటూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ను సీఎం రేవంత్ కోరారు. ఈ నెల 13న ఢిల్లీలో జైశంకర్ను కలసి అందుకు సంబంధించిన లేఖను అందచేశారు.ఆ లేఖలో పలు దేశాల పేర్లు పొందుపరిచారు. కాగా, ‘తెలంగాణ రైజింగ్ పేరుతో మీరు నిర్వహించ తలపెట్టిన భారత్ సమ్మిట్ అభినందనీయం. మీఆలోచన మంచిదే.. అయితే, వీటిలో ఉన్న అరబ్ దేశాలు, అరబ్ దేశాలకు సహకరిస్తున్న కొన్ని దేశాల పేర్లు తొలగించండి. వాళ్లు భారత దేశానికి రావడం మాకు ఇష్టం లేదు. వాళ్లు ఇక్కడకు వచ్చి ఏదైనా మాట్లాడితే, భారత్తో స్నేహపూర్వకంగా ఉన్న దేశాలకు తప్పుడు సంకేతాలు అందుతాయి. కాబట్టి, ఆయా దేశాల పేర్లు తొలగించి మీరు ఏ కార్యక్రమమైనా పెట్టుకోండి, మాకేమీ ఇబ్బంది లేదు’అంటూ సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి జైశంకర్ బదులిచ్చారు. ఆ దేశాల పేర్లు తొలగించకపోతే కష్టమే? ఇదిలా ఉండగా రష్యా, ఉక్రెయిన్ల మధ్య, అలాగే ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య, మయన్మార్లో అంతర్గతంగా కొంతకాలంగా యుద్ధాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దేశాలకు కొన్ని దేశాలు మద్దతు తెలుపుతుండగా, కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో యుద్ధాలు జరిగే దేశాలు, వాటికి సహకరిస్తున్న దేశాల వారిని భారత్కు పిలవడం మనకు నష్టమని కేంద్రం భావిస్తోంది. వారిని మినహాయించి ఎవరు వచ్చినా తమకేమీ ఇబ్బంది లేదని కేంద్రం చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ గొప్పతనం చాటిచెప్పాలని, అందుకే ఆయా దేశాల వారిని ఇక్కడకు ఆహ్వానిస్తున్నట్లు సీఎం రేవంత్ చెబుతున్నారు. సీఎం ఆలోచన మంచిదే అయినప్పటికీ కేంద్రానికి మాత్రం కొన్ని దేశాల వాళ్లు ఈ తరుణంలో ఇక్కడకు రావడం ఇష్టం లేదని, ఆ దేశాల పేర్లు తొలగించి కొత్తగా పేర్లు ఇస్తే అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని విశ్వసనీయ సమాచారం. లేనిపక్షంలో తెలంగాణలో భారత్ సమ్మిట్ జరగడం కష్టమేనని కేంద్ర సర్వీసుల్లోని అధికారులు అంటున్నారు.

ఆపరేషన్ బ్రహ్మ.. మయన్మార్కు భారత్ ఆపన్నహస్తం
న్యూఢిల్లీ: భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు అంతర్జాతీయ సాయం వెల్లువెత్తుతోంది. ఈ విషయంలో తక్షణం స్పందించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. బాధిత దేశానికి యుద్ధ ప్రాతిపదికన సహాయక సామగ్రి తదితరాలు అందజేసేందుకు ఆపరేషన్ బ్రహ్మ పేరిట హుటాహుటిన రంగంలోకి దిగింది. టెంట్లు, స్లీపింగ్ బ్యాగు లు, బ్లాంకెట్లు, ఆహార పదార్థాలు, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్లైట్లు, జెనరేటర్ సెట్లు, అత్యవసర ఔషధాల వంటివాటితో కూడిన 15 టన్నుల సహాయక సామగ్రిని శనివారం తెల్లవారుజామున మూడింటికే సైనిక విమానాల్లో మయన్మార్కు పంపింది. ఉదయం 8 గంటలకల్లా వాటిని స్థానికంగా బాధిత ప్రాంతాలకు పంపే కార్యక్రమం మొదలైపోయింది. అంతేగాక 118 మంది వైద్య తదితర సిబ్బందితో కూడిన పూర్తిస్థాయి ఫీల్డ్ ఆస్పత్రిని కూడా వాయుమార్గాన శనివారం రాత్రికల్లా మయన్మార్కు తరలించింది! వాళ్లంతా ఇప్పటికే మాండలే ప్రాంతంలో రంగంలోకి దిగా రు. గాయపడ్డ వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. మరో రెండు వాయుసేన విమానాల్లో మరింత సామగ్రిని పంపుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేగాక మరో 40 టన్నుల సామగ్రిని ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్ సావిత్రి నౌకల్లో యాంగూన్కు తరలిస్తున్నట్టు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. కమాండెంట్ పి.కె.తివారీ నేతృత్వంలో 80 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ అన్వేషక, విపత్తు సహాయక బృందాలు శనివారం సాయంత్రానికే బాధిత ప్రాంతాలకు చేరుకుని రంగంలోకి కూడా దిగాయని చెప్పారు. ‘‘రెస్క్యూ డాగ్స్ కూడా వెంట వెళ్లాయి. వాయు మార్గాన ఆరు అంబులెన్సులను తరలిస్తున్నాం’’ అని ఎక్స్లో పోస్టు చేశారు. చైనా, రష్యా, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి కూడా సహాయక సామగ్రి మయన్మార్ చేరుతోంది. ఆ దేశంతో భారత్ 1,643 కి.మీ. పొడవైన సరిహద్దును పంచుకుంటుంది. అందుకే ‘బ్రహ్మ’ ‘‘బ్రహ్మ సృష్టికర్త. తీవ్ర విధ్వంసం బారిన పడ్డ మయన్మార్లో వీలైనంత త్వరగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ జరగాలన్నది భారత్ ఆకాంక్ష. అందుకే ఈ సహాయక ఆపరేషన్కు బ్రహ్మ అని పేరు పెట్టాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీర్ జైస్వాల్ మీడియాకు వివరించారు. మరింత సాయం పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు చెప్పారు. గతేడాది యాగీ తుపానుతో అతలాకుతలమైనప్పుడు కూడా మయన్మార్కు భారత్ ఇలాగే తక్షణం ఆపన్నహస్తం అందించిందని గుర్తు చేశారు. సహాయక సామగ్రి బాధిత ప్రాంతాలకు తక్షణం చేరేలా చర్యలు తీసుకుంటున్నట్టు మయన్మార్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మయన్మార్ సైనిక పాలకుడు జనరల్ మిన్ ఆంగ్ లయాంగ్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. అన్నివిధాలా దన్నుగా నిలుస్తామని మరోసారి హామీ ఇచ్చారు.
NRI

టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి ఎంపికయ్యారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి నాయకత్వంలో 2025-2026 కాలానికి ఈ ఎంపిక జరిగిందని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. TTA వ్యవస్థాపకుడు, సలహా మండలి, TTA అధ్యక్షుడు, కార్యనిర్వాహక కమిటీ, డైరెక్టర్ల బోర్డు, స్టాండింగ్ కమిటీలు (SCలు) ప్రాంతీయ ఉపాధ్యక్షులు (RVP) ల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అలాగే పదవీ విరమణ చేస్తున్న RVP సత్య ఎన్ రెడ్డి గగ్గెనపల్లి అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.జయప్రకాష్ ఎంజపురి (జే)కు వివిధ సంస్థలలో సమాజ సేవలో 16 సంవత్సరాలకు పైగా అనుభవముందని ప్రపంచ మారథానర్ టీటీఏ వెల్లడించింది. న్యూయార్క్లోని తెలుగు సాహిత్య మరియు సాంస్కృతిక సంఘం (TLCA) 51వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆరు ప్రపంచ మేజర్ మారథాన్లను పూర్తి చేసిన మొదటి తెలుగు సంతతి వ్యక్తి, 48వ భారతీయుడు నిలిచారు. ఈ రోజు వరకు, జే ప్రపంచవ్యాప్తంగా 18 మారథాన్లను పూర్తి చేశాడు. క్రీడలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, 2022లో న్యూజెర్సీలో జరిగిన TTA మెగా కన్వెన్షన్లో "లైఫ్టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్" అవార్డుతో అందుకున్నారు. సెప్టెంబర్ 2023లో, అతను ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం , ప్రపంచంలోనే 4వ ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించారు. అలాగే గత ఏడాది జూన్లో పెరూలోని పురాతన పర్వత శిఖరం సల్కాంటే పాస్ను జయించాడు. ఈ ఏడాది సెప్టెంబరులో జే తన తదుపరి గొప్ప సాహసయాత్రకు సిద్ధమవుతున్నాడనీ, గొప్ప సాహస యాత్రీకుడుగా ఆయన అద్భుత విజయాలు,ఎంతోమందికి ఔత్సాహికులకు పరిమితులను దాటి ముందుకు సాగడానికి ప్రేరేపిస్తున్నాడని కమిటీ ప్రశంసించింది. NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిన్యూయార్క్ బృందంలో కొత్త సభ్యులున్యూయార్క్ బృందంలో సహోదర్ పెద్దిరెడ్డి (కోశాధికారి), ఉషా రెడ్డి మన్నెం (మ్యాట్రిమోనియల్ డైరెక్టర్), రంజిత్ క్యాతం (BOD), శ్రీనివాస్ గూడూరు (లిటరరీ & సావనీర్ డైరెక్టర్) ఉన్నారు. మల్లిక్ రెడ్డి, రామ కుమారి వనమా, సత్య న్ రెడ్డి గగ్గెనపల్లి, సునీల్ రెడ్డి గడ్డం, వాణి సింగిరికొండ, హరి చరణ్ బొబ్బిలి, సౌమ్య శ్రీ చిత్తారి, విజేందర్ బాసా, భరత్ వుమ్మన్నగారి మౌనిక బోడిగం. టీటీఏ కోర్ టీమ్ సభ్యులుగా పని చేస్తారు-TTA వ్యవస్థాపకుడు: డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి -సలహా సంఘం:-అధ్యక్షుడు: డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు-సహాధ్యక్షులు: డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల -సభ్యులు: భరత్ రెడ్డి మాదాడి శ్రీని అనుగు-TTA అధ్యక్షుడు: నవీన్ రెడ్డి మల్లిపెద్ది

న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాట అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఉమెన్స్ డే వేడకలను అంగరంగ వైభవంగా నిర్వహించి.. వనితలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మాట ఉమెన్ కమిటీ మరోసారి రుజువు చేసింది. ప్రముఖ సినీ నటి, ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. సింగర్ దామిని భట్ల, దీప్తి నాగ్ తో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అంకితా కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మాట కార్యవర్గాన్ని అభినందించారు. అంకితా జాదవ్ నటించిన ఆల్బమ్ సాంగ్స్ ను ఈ వేదికగా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో మహిళామణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనువిందు చేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు మహిళల సంతోషాల మధ్య ఆహ్లదంగా సాగాయి. యువతులు, మహిళల ఆట, పాటలతో.. సంబరాల సంతోషాలు అంబరాన్నంటాయి. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికత ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు ఆకట్టుకున్నారు. శాస్త్రీయ నృత్యం, మోడ్రన్ డ్యాన్స్ రెండింటిలో తమకు సాటి లేదని నిరూపించారు.MS మాట కాంపిటీషన్, ఫ్యాషన్ షో, బ్యూటీ పాజెంట్ వంటి అద్భుతమైన ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి. ఈ ప్రదర్శనల్లో మగువలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తి ఏమిటో నిరూపించారు. అందాల ముద్దుగుమ్మలు హొయలు పోతూ ర్యాంప్పై క్యాట్ వాక్ చేశారు. అందాల పోటీలకు నటి అంకితా జాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. MS మాట కాంపిటీషన్ 2025 విజేతకు కిరీటాన్ని బహూకరించారు. పోటీల్లో పాల్గొన్న మగువలకు బెస్ట్ స్మైల్, బెస్ట్ వాక్ వంటి పలు విభాగాల్లో అవార్డులు అందించారు. ఫోటో బూత్, ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్, ఫన్ ఫీల్డ్ గేమ్స్, రాఫెల్ టికెట్స్ వంటి కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.వేదికపై మగువలు, చిచ్చర పిడుగులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్యాన్స్లు, డిజె మ్యూజిక్ కార్యక్రమాలు హోరెత్తించాయి. సంప్రదాయ ఫ్యాషన్ షో, గేమ్స్ తో పాటు ఇతర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్స్ బూత్ ఏర్పాటు చేశారు. మహిళలు షాపింగ్ స్టాల్స్ దగ్గర సందడి చేశారు. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పసందైనా విందుభోజనం అందించారు. ఆహా ఏమి రుచి… తినరా మైమరచి.. అనే మాటను నిజం చేస్తూ ఎంతో రుచికరమైన భోజనాలు అందించారు. స్వీట్స్ నుంచి ఐస్ క్రీమ్ వరకు పలు వైరటీలతో రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశారు. మాట మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాట నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సత్కరించారు. సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి మాట అధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు హితవు పలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మాట పలువురిని అవార్డుతో సత్కరించింది. అలాగే సభా వేదికపై పలువురిని సన్మానించి, సత్కరించారు. మాట కార్యక్రమాలు అండగా ఉంటూ, సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరినీ నిర్వహకులు ప్రశంసించారు. ఈ సంబరాలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరినీ మాట ఉమెన్ కమిటీ ప్రత్యేకంగా అభినందించింది. ఈ వేడుకకు విచ్చేసిన స్త్రీమూర్తులకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. విందు - వినోదాలతో మాట - అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సహంగా సాగాయి. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ వెయ్యి మందికి పైగా మహిళలు ముందుకొచ్చి ఉమెన్స్ డే వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. సంబరమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా ఈ వేడుకను కనువిందుగా నిర్వహించారు. వేలాదిగా ఆదర్శ వనితలు ఒక చోటు చేరి, అటపాటలతో, కేరింతలతో హోరేత్తించడం.. మాట విజయానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్పర్సన్గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
క్రైమ్

‘హమ్మయ్యా!’ ఆ ఆరుగురు దొరికారు
అంబేద్కర్ కోనసీమ జిల్లా, సాక్షి: ఆరుగురు విద్యార్థుల మిస్సింగ్ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది. ఐదురోజుల తర్వాత.. శనివారం ఆ పిల్లల ఆచూకీ శనివారం లభ్యమైంది. తల్లిదండ్రులు మందలించారనే వాళ్లు అలా వెళ్లిపోయినట్లు సమాచారం.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండల కేంద్రమైన ఆలమూరు శివారు కండ్రిగ (యానాదుల) పేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈ నెల 24వ తేదీన స్కూల్కు వెళ్లి తిరిగి రాలేదు. బడి, ఇల్లు తప్ప ఏం తెలియని చిన్నారులు అలా కనిపించకుండా పోయేసరికి అంతా ఆందోళన చెందారు. చుట్టుపక్కల గాలించి.. బంధువులను ఆరా తీసి చివరకు స్థానిక పోలీసులను అశ్రయించారు.ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. వాళ్లంతా బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాలలోనే చదువుతున్నారు. స్థానికుల సాయంతో పోలీసులు చుట్టుపక్కల గాలించారు. వాళ్ల ఫొటోలను మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. డ్రోన్ సాయంతో పరిసర ప్రాంతాల్లో అన్వేషించారు. నాలుగు రోజులైనా ఆచూకీ తెలియరాకపోవడంతో అంతా కంగారుపడ్డారు.చివరకు పి.గన్నవరం మండలం పెదమాల లంకలో మొక్కజొన్న రైతులకు విద్యార్థులు కనిపించారు. అయితే వాళ్లు ఆకలితో ఉండడంతో భోజనం పెట్టి పంపించి వేశారు. ఈ క్రమంలో సిద్ధాంతం వద్ద ఉన్న లంకలో బాలబాలికను గుర్తించిన పోలీసులు చివరకు ఆలమూరుకు తరలించారు. తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది.

వీడు మనిద్దరికి పుట్టిన బిడ్డేనా?
అన్నానగర్: భార్యపై అనుమానం పెనుభూతమైంది. తామిద్దరూ నల్లగా ఉన్నా.. బిడ్డ మాత్రం మంచి రంగుతో జన్మించడంపై సందేహించాడు. బిడ్డ ఎదిగే కొద్దీ అనుమానం కూడా అదే తీరులో బలపడింది. చివరకు ఆ రెండున్నరేళ్ల చిన్నారిని గొంతు నులిమి హతమార్చాడు. ఊయల తాడు బిగుసుకుని మరణించిందని బుకాయించాడు. అయితే పోస్టుమార్టం నివేదికలో గొంతు నులమడం వల్లే చనిపోయిందని తేలడంతో ఆ కసాయి కటకటాలపాలయ్యాడు. వివరాలు..చెన్నై మన్నడి లింగుచెట్టి వీధికి చెందిన అక్రమ్ జావిద్ (33) పత్తి దుకాణంలో పని చేసేవాడు. అతని భార్య నిలోఫర్. వీరికి పెళ్లయి నాలుగేళ్లైంది. వీరికి రెండున్నరేళ్ల వయసున్న కుమార్తె పాహిమా ఉంది. గత 26వ తేదీ రాత్రి నీలోఫర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ ఉపవాసం విరమించేందుకు సమీపంలోని మసీదుకు వెళ్లింది. కుమార్తెతో ఇంట్లోనే జావిద్ ఉండిపోయాడు. ఇఫ్తార్ అనంతరం ఇంటికి తిరిగొచ్చిన నీలోఫర్కు పాహిమా మెడ తొట్టి తాడుతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుందని అక్రమ్ జావిద్ తెలిపారు. వెంటనే చిన్నారిని స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం మేరకు నార్త్ కోస్ట్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయకాంత్ కేసు నమోదు చేసి చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జావిద్ను ప్రశ్నిస్తే ఊయల తాడు మెడకు బిగుసుకుపోవడం వల్లే చనిపోయిందని చెప్పుకొచ్చాడు. అయితే శుక్రవారం అందిన పోస్టుమార్టం నివేదికలో చిన్నారిని గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడైంది. దీంతో తమదైన శైలిలో విచారణ చేసేసరికి తానే బిడ్డను గొంతు నులిమి హతమార్చినట్టు జావిత్ అంగీకరించాడు. తాను, తన భార్య నల్లగా ఉన్నప్పటికీ పుట్టిన బిడ్డ మాత్రం మంచి రంగుతో ఉండడంతో తన భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు వాంగ్మూలమిచ్చాడు.

ప్రియురాలికి పురుగుల మందు తాగించి పరారైన ప్రియుడు..!
జంగారెడ్డిగూడెం(ఏలూరు): మండలంలోని పేరంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనికి సంబంధించి ఎస్సై షేక్ జబీర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరంపేటకు చెందిన హేమదుర్గా అనంత ప్రసన్నకు, కొయ్యలగూడెం మండలం యర్రంపేటకు చెందిన దార్ల రాంప్రసాద్తో 2014లో వివాహమైంది. వీరికి 11 సంవత్సరాల కుమార్తె ఉంది. కొయ్యలగూడెం మండలం గంగన్నగూడెంకు చెందిన మోదుగ పెద్దసాయి.. ప్రసన్నను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో పొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేవాడు. ఫిబ్రవరి 7న ప్రసన్న ఇంటికి వెళ్లి మనిద్దరం చనిపోదాం! అంటూ పురుగుల మందు తాగించాడు. కుటుంబ సభ్యులు ఆమెను కొయ్యలగూడెం ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అక్కడ చికిత్స పొందిన తరువాత తండ్రి ఈశ్వరాచారి కుమార్తె ప్రసన్ననను జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు తీసుకొచ్చాడు. 15 రోజుల తరువాత పెద్దసాయి పేరంపేటకు వచ్చి గొడవ పడ్డాడు. మార్చి 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రసన్న ఇంటికి వచ్చిన సాయి చనిపోదాం.. అని నమ్మించి ప్రసన్నతో కలుపుమందు తాగించాడు. మందు ప్రభావాన్ని తట్టుకోలేక ప్రసన్న కేకలు వేయగా, ఆమె తల్లి పరుగున అక్కడికి వచ్చింది. ఆమెను చూసిన సాయి అక్కడినుంచి పారిపోయాడు. ప్రసన్నను వెంటనే జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 27న చనిపోయింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.మృతదేహంతో ధర్నాకొయ్యలగూడెం: ప్రసన్న కుటుంబానికి న్యాయం చేయాలంటూ గంగన్నగూడెంలో బంధువులు ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెం నుంచి గంగన్నగూడెంకు ప్రసన్న మృతదేహాన్ని అంబులెన్స్లో తరలిస్తుండగా, పోలీసులు అంబులెన్స్ డ్రైవర్కు ఫోన్ చేసి మధ్యలోనే ఆపించారు. దీంతో మృతదేహాన్ని మోటార్సైకిళ్లపై గంగన్నగూడెం తీసుకువెళ్లి ధర్నా చేశారు. ప్రసన్న మృతికి గంగన్నగూడెం గ్రామానికి చెందిన సాయి కారణమని అతని ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నా చేశారు. ఆ సమయంలో యువకుడితో సహా అతని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బయటే ఉండి ఆందోళన చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వారితో చర్చించి మృతదేహాన్ని తరలించేలా ఒప్పించారు.

హర్షవర్దిని ఎందుకమ్మా ఇలా చేశావు..!
రాప్తాడు రూరల్: మార్కుల ఒత్తిళ్లు ఓ ఇంటర్ విద్యార్థిని బలిగొన్నాయి. వివరాలు.. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లికాలనీ పంచాయతీ పరిధిలోని జీఎం కాలనీకి చెందిన లక్ష్మన్న కళ్యాణదుర్గంలో సెరికల్చర్ శాఖలో పని చేస్తున్నారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె హర్షవర్దిని (17) నగర శివారులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఇటీవల పబ్లిక్ పరీక్షలు రాసింది. అయితే పరీక్షలు తాను సక్రమంగా రాయలేదని, ఆశించిన స్థాయిలో మార్కులు రావేమోననే అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారి నుంచి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఇంటికి చేరుకుని బోరున విలపించారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వీడియోలు


ఏపీ పోలీసులకు హైకోర్టు మొట్టికాయలు


మా ఎంపీటీసీలను కాపాడుకోవటం మా బాధ్యత: గోపిరెడ్డి


Ugadi Special: క్యూట్ కపుల్.. క్యూటెస్ట్ ఇంటర్వ్యూ


ఎర్రపుస్తకం తెల్లమొహం వేసింది..!


శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర్ స్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చిన ముస్లింలు


ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ కు గుర్తింపు ఉండాలి


Ding Dong 2.O: మామూలుగా ఉండదు


Magazine Story: చంద్రబాబు కొట్టేసిన టిడిపికి 30 ఏళ్లు


తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు


విదేశీ విద్యార్ధులపై అమెరికా మరో బాంబు