Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Air India plane crash: One passenger survived the crash, police confirms1
విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు.. ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు

గాంధీనగర్‌: ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. విమానం ప్రమాదం నుంచి రమేష్‌ విశ్వాస్‌ కుమార్‌ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే సీటు 11ఏ ప్రయాణికుడు ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు నడుచుకుంటూ వస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. విమానం కూలిన తర్వాత ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు వచ్చినట్లు అహ్మదాబాద్‌ పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. ఈ సందర్భంగా మృత్యుంజయుడు రమేష్‌ విశ్వాస్‌ కుమార్‌ విమాన ప్రమాదంపై మీడియాతో మాట్లాడినట్లు సమాచారం. ‘అంతా క్షణాల్లో జరిగిపోయింది. నా సోదరుడు ఏమయ్యాడో తెలియదు. టేకాఫ్‌ అయిన 30 క్షణాల్లోనే విమానం పేలిపోయింది.’ అని అన్నారు. (రమేష్‌ విశ్వకుమార్‌ కుమార్‌ ఎయిరిండియా విమానం టికెట్‌)సదరు ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ ధృవీకరించారు. ‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ చెప్పారని ఏఎన్‌ఐ నివేదించింది. 11ఏ సీటులో ఒక ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు గుర్తించారు. సదరు ప్రయాణికుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అయితే,మరణాల సంఖ్య గురించి స్పష్టత ఇవ్వలేదు. కానీ నివాస ప్రాంతంలో విమానం కూలిపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది’అని మాలిక్ అన్నారు.Miracle amidst tragedy!!!Ramesh Vishwashkumar, seated on 11A, is the sole survivor of the Air India crash in Ahmedabad. He jumped out and walked away injured. He’s currently undergoing treatment at the hospital.#AhmedabadPlaneCrash #Ahmedabad pic.twitter.com/pWIHUD7kG5— Shivangi Thakur (@thakur_shivangi) June 12, 2025

Ahmedabad Air India Plane Crash Updates2
అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. 241 మంది మృతి

👉అహ్మదాబాద్‌ చేరుకున్న డీజీసీఏ దర్యాప్తు బృందంవిమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన డీజీసీఏఏఏఐజీ డీజీ నేతృత్వంలో దర్యాప్తువిమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపాని మృతిఅధికారికంగా ప్రకటించిన గుజరాత్‌ ప్రభుత్వం2016-2021 వరకు గుజరాత్‌ సీఎంగా పనిచేసిన విజయ్‌ రూపాని👉మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్‌ ఎక్స్‌గ్రేషియామృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియాక్షతగాత్రుల వైద్య పరీక్షలన్నీ భరిస్తాం: చంద్రశేఖరన్‌బీజే మెడికల్‌ కాలేజీ భవనాన్ని పునర్నిర్మిస్తాం 👉ఎయిరిండియా ప్రమాదంలో మృత్యుంజయుడుఒక ప్రయాణికుడు బతికే ఉన్నాడని ప్రకటించిన సీపీ11A సీటులో ఉన్న వ్యక్తి బతికాడంటున్న పోలీసులుఆలస్యంగా గుర్తించిన పోలీసులురమేష్‌ విశ్వాస్‌ కుమార్‌గా గుర్తింపు 👉ఎయిరిండియా నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా?మెయింటెనెన్స్‌ లోపంతో ప్రమాదం జరిగిందనే అనుమానంవిమానానికి పలుమార్లు సాంకేతిక లోపంగత డిసెంబర్‌లో ఇదే విమానంలో పొగలుఏడాదిలో రెండుసార్లు సాంకేతిక సమస్యలుజూన్‌, డిసెంబర్‌లో తప్పిన ప్రమాదాలు👉విమానంలో ఉన్న 241 మంది దుర్మరణం..!229 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు మృతి10 మంది విమాన సిబ్బంది మృతి👉విమాన ప్రమాదంపై విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనవిమాన ప్రమాదంలో చాలా మంది చనిపోయారుమృతుల సంఖ్య ఇప్పుడే చెప్పలేం: విదేశాంగ శాఖమృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ👉అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతిఎయిర్ ఇండియా AI-171 విమానం కూలిపోయిన విషయం తెలిసి నేను షాక్ అయ్యా..ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నా..మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడ్ని కోరుతున్నా..👉విమాన ప్రమాదంపై స్పందించిన భారత్‌లోని యూకే హైకమిషన్‌బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన యూకే హైకమిషన్‌స్థానిక అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం: యూకే హైకమిషన్‌👉అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రికి సీఎం భూపేంద్ర పటేల్‌క్షతగాత్రులను పరామర్శించిన సీఎం భూపేంద్ర పటేల్‌బాధిత కుటుంబాలను ఆదుకుంటాంజరిగిన ఘటన దురదృష్టకరంచాలా మందికి రక్తం అవసరం.. గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేశాంరక్తదానం చేయడానికి దాతలు రావాలి: భూపేంద్ర పటేల్‌రక్తదాన కేంద్రాలు:1. U. N. Mehta Institute of Cardiology and Research Centre Room no 110, 1st floor, A block Contact no-9316732524 2. IHBT Department, Civil Hospital 2nd floor, 1200 bed Civil Hospital, Contact no-9428265409 3. IKDRC Blood Centre 1st floor, IKDRC Hospital, Manjushree mill road, Baliya limdi Contact no-07922687500 Ext no-4226 4. GCRI Blood Centre 1st floor, Gujarat cancer & Research institute Contact no-07922688026👉అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని మోదీవిమాన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది.. బాధించిందిఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటనబాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన ప్రధాని👉విమాన ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతిబాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి వీలైనంత వేగంగా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరిన రేవంత్‌👉విమానయాన శాఖ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుఫోన్‌ నంబర్లు: 011 24610843, 9650391859ఎయిరిండియా హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1800 5691 444👉బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్‌పై కూలిన విమానంబీజే మెడికల్‌ కాలేజీలోని 20 మంది వైద్య విద్యార్థులు మృతివిమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది సహా 242 మంది👉విమాన ప్రయాణికుల సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటుహెల్ప్‌లైన్‌ నంబర్‌ 1800 5691 444ప్రమాదంపై ఎయిరిండియా ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ దిగ్భ్రాంతిమృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన చంద్రశేఖరన్‌బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: చంద్రశేఖరన్‌ 👉విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులువిమానంలో ఏడుగురు పోర్చుగ్రీస్‌ దేశస్థులు, ఒక కెనడా దేశస్థుడువిమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలుఅహ్మదాబాద్‌ ఆసుప్రతికి చేరిన 40 మృతదేహాలు👉విమాన ప్రమాదంపై డీజీసీఏ ప్రకటనవిమానంలో 242 మంది ప్రయాణికులుఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్‌ సిబ్బందిఏటీసీకి ఎమర్జెన్సీ కాల్‌ వచ్చిందిఏటీసీ నుంచి చేసిన కాల్స్‌కు స్పందన రాలేదుఅహ్మదాబాద్‌ నుంచి టేకాఫ్‌ అయిన వెంటనే విమానం కూలిందిఎయిర్‌ పోర్ట్‌పరిసరాల్లోనే విమాన ప్రమాదం👉కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ప్రధాని మోదీ ఫోన్‌విమాన ప్రమాదంపై ఆరా తీసిన ప్రధానిఎప్పటి కప్పుడు పరిస్థితి తనకు తెలియజేయాలన్న మోదీ👉విమానంలో 52 మంది బ్రిటన్‌ దేశస్థులుసాయంత్రం 5 గంటల వరకు ఎయిర్‌పోర్ట్‌ మూసివేతవిమానం కూలిపోయే ముందు ఏటీసీకి ఎమర్జెన్సీ సమాచారం ఇచ్చిన పైలట్లుపౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ👉విమాన ప్రమాదంలో 100 మందికిపైగా మృతి?కూలిన విమానంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపాని?విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందిపైలట్‌ సుమిత్‌ సబర్వాల్‌ ఆధ్వర్యంలో బయలేర్దిన విమానంవిమానానికి ఫస్ట్‌ ఆఫీసర్‌గా ఉన్న పైలట్‌ కైవ్ కుందర్‌న్యూఢిల్లీ: గుజరాత్‌ అహ్మదాబాద్‌లో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిరిండియా విమానం ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది. ఘటనా స్థలానికి అంబులెన్స్‌లు, ఫైర్‌ ఇంజిన్లు చేరుకుంటున్నాయి. సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. గురువారం మధ్యాహ్నాం మధ్యాహ్నం 1:39 గంటలకు బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం టేకాఫ్‌ అయ్యిందని.. టేకాఫ్‌ కాసేపటికే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై కూలిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విమానం లండన్‌ వెళ్తుండగా.. అందులో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలిలో మంటలు ఎగిసిపడుతున్నాయి.Ahemdabad Plan crash around 242 passengers are traveling 💔 reason :- technical fault #Planecrash #Ahmedabad #Airindia #crash pic.twitter.com/5iUENTIPxd— Manan Trivedi (@itsurbunny7) June 12, 2025828 అడుగుల ఎత్తులో విమానం క్రాష్‌ అయ్యింది. విమానం కూలిన మేఘాని ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఫైరింజన్లు మంటలు ఆర్పే ప్రయత్నాల్లో ఉన్నాయి. పలువురిని అంబులెన్సులలో ఆస్పత్రికి తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షత గాత్రులను సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు.గుజరాత్ సీఎంతో మాట్లాడిన అమిత్ షాఅహ్మ‌దాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్ర‌మాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంట‌నే స్పందించారు. విమాన ప్రమాదం గురించి తెలియ‌గానే గుజరాత్ ముఖ్యమంత్రి, హోం మంత్రి, అహ్మ‌దాబాద్ పోలీసు కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. స‌హాయ‌క చ‌ర్య‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం త‌ర‌పున పూర్తి సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.విమానంలో 242 మంది: డీజీసీఏఅహ్మదాబాద్‌లో ప్ర‌మాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్ల‌డించింది. వీరిలో ఇద్ద‌రు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో ఉన్నారు.

May Day Call: Air India Pilot Issued Before Ahmedabad Crash3
‘మే డే.. మే డే’ అంటూ ఏటీసీకి సంకేతం!

అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనలో బ్లాక్‌ బాక్స్‌ ఏం చెబుతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం. అసలు ప్రమాదం ఏ పరిస్థితుల్లో జరిగిందనేది బ్లాక్‌ బాక్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు. తాజా విమాన ప్రమాదంలో అందులో ఉన్న 242 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది దుర్మరణం పాలైనట్లు సమాచారం. అయితే విమాన ప్రమాదాలు జరిగే సమయంలో ఆ ప్రమాదానికి గ కారణాలు విప్పే బ్లాక్‌ బాక్స్‌.. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం తర్వాత పదిలంగానే ఉండటంతో దీని గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే విమానం ప్రమాదానికి గురి కావడానికి కొన్ని నిమిషాల ముందు ‘మేడే మేడే అంటూ ఏటీసీకి వాయిస్‌ సంకేతాలు వెళ్లాయి. విమానం ప్రమాదానికి గురౌతుందన్నప్పుడు, ప్రయాణికులు ప్రమాదంలో ఉన్నప్పుడు మేడే మేడే అని సిగ్నల్స్‌ ఇస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. కాకపోతే ప్రమాదం జరగడానికి ఎంత సేపో పట్టలేదు. విమానం పూర్తిగా డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిపోవడంతో కుప్పకూలిపోయింది. మే డే కాల్' అంటే ఏంటి?ఏదైనా విమాన ప్రమాదం బారిన పడే అవకాశం ఉన్నప్పుడు ఇలా పైలట్‌ దగ్గరలోని ఏటీసీకి ఈ 'మేడే కాల్' ద్వారా సిగ్నల్‌ ఇస్తారు. ప్రధానంగా విమాన ప్రయాణీకుల ప్రాణాలు ఇబ్బందుల్లో పడినప్పుడు లేదా అత్యవసరంగా ఇంజిన్ పనిచేయకపోయినప్పుడు, మంటల్లో చిక్కుకున్న సమయంలో కానీ, గాలిలో ఏదైనా పక్షిలాంటితది ఢీకొన్న సమయంలో, హైజాక్‌ సమయంలో ఈ మేడే కాల్‌ ను ఏటీసీకి అందిస్తారు. ఇలాంటి ప్రమాద సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీకి పైలట్ సమాచారం తక్షణమే అందించాలి. ఇలాంటి ప్రమాద సమయంలో 'మేడే.. మేడే.. మేడే' అని మూడుసార్లు ఏటీసీకి సిగ్నల్ పంపించాల్సి ఉంటుంది. దీని అర్థం ఇది జోక్ కాదు నిజంగానే ఇబ్బందులో ఉన్నామని ఇచ్చే సంకేతం. మేడే సంకేతం ఇచ్చిన వెంటనే ఏటీసీ స్పందిస్తుంది అత్యవసరం వచ్చిందని పరిగణిస్తూ రన్ వేను క్లియర్ చేసి.. అంబులెన్స్, అగ్నిమాపకదళాలని వెంటనే సిద్ధం చేస్తారు.

Air India Plane Crash A Crisis for Tata Group4
టాటా గ్రూపునకు మాయని మచ్చ..

టాటా గ్రూప్ కు చెందిన ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలి వందల కొద్దీ ప్రాణాలను బలిగొంది. సహాయక చర్యలు కొనసాగుతుండగానే, ఈ సంఘటన టాటా గ్రూప్‌ ప్రతిష్టాత్మక ఎయిరిండియా పునరుద్ధరణపై నీడలు కమ్మేసింది. అలాగే వందల ఏళ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూపునకు మాయని మచ్చగా మిగిలిపోనుంది.బాధిత కుటుంబాలకు రూ .1 కోటి నష్టపరిహారంప్రమాదం తర్వాత, టాటా గ్రూప్ ప్రతి బాధిత కుటుంబానికి రూ .1 కోటి నష్టపరిహారాన్ని ప్రకటించింది. ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్‌ భవనాన్ని పునర్నిర్మిస్తామని వాగ్దానం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా ఉండడం, ఎయిర్ ఇండియా భద్రతా ప్రోటోకాల్స్‌ను సమీక్షించడంలో టాటా గ్రూప్‌ నిబద్ధతను చైర్మన్‌ ఎన్ చంద్రశేఖరన్ నొక్కి చెప్పారు.టాటా గ్రూప్.. వందల ఏళ్ల చరిత్రటాటా గ్రూపును 1868లో జంషెడ్జీ టాటా స్థాపించారు. ఉక్కు, ఆటోమొబైల్స్ నుండి టెలికమ్యూనికేషన్స్, విమానయానం వరకు వివిధ పరిశ్రమలను విస్తరించి భారతదేశపు అతిపెద్ద సమ్మేళనంగా టాటా గ్రూప్‌ అభివృద్ధి చెందింది. దశాబ్దాలుగా టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వంటి ఐకానిక్ వ్యాపారాలను టాటా గ్రూప్‌ నిర్మించింది.జేఆర్‌డీ టాటా స్థాపించిన ఎయిర్ ఇండియాఎయిర్ ఇండియాను 1932లో జేఆర్‌డీ టాటానే టాటా ఎయిర్ లైన్స్ పేరుతో స్థాపించారు. ఇది భారతదేశ విమానయాన పరిశ్రమకు నాంది పలికింది. 1953లో భారత ప్రభుత్వం ఈ విమానయాన సంస్థను జాతీయం చేసింది. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఈ సంస్థ నిర్వహణ వ్యయాలు, పెరుగుతున్న పోటీ ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయింది.దాదాపు 69 ఏళ్ల తర్వాత 2022 జనవరిలో టాటా గ్రూప్ తన ప్రపంచ ఖ్యాతిని పునరుద్ధరించే లక్ష్యంతో 2.2 బిలియన్ డాలర్ల ఒప్పందంలో ఎయిరిండియాను తిరిగి పొందింది. అప్పటి నుండి టాటా అనేక ప్రధాన మార్పులను అమలు చేసింది.ఫ్లీట్ విస్తరణ..నవీకరణలు - ఎయిర్ ఇండియా 2023లో ఎయిర్‌బస్, బోయింగ్ నుండి 470 విమానాలకు రికార్డు స్థాయి ఆర్డర్లను ఇచ్చింది. తరువాత 2024 డిసెంబర్ లో అదనంగా 100 జెట్లను ఆర్డర్ చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ను ఆధునీకరించడానికి 400 మిలియన్‌ డాలర్ల రెట్రోఫిట్ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది.మెగా విలీనం - 2024 నవంబర్‌లో టాటా ఎయిర్ ఇండియాను విస్తారా, ఎయిర్ ఇండియా ఎస్‌ప్రెస్‌తో విలీనం చేసింది. ఇది 30 శాతం దేశీయ మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద విమానయాన సమూహాన్ని ఏర్పాటు చేసింది.ఆపరేషనల్ పునరుద్ధరణ - టాటా Vihaan.AI ప్రవేశపెట్టింది. ఇది ఫ్లీట్ ఆధునీకరణ, టెక్నాలజీ అప్ గ్రేడ్ లు, కస్టమర్ సర్వీస్ మెరుగుదలలపై దృష్టి సారించే పంచవర్ష పరివర్తన ప్రణాళిక.మార్గ విస్తరణ - ఎయిర్ ఇండియా ఇప్పుడు 191 విమానాలను నడుపుతోంది. 43 దేశీయ, 41 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. వీటిలో ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు నాన్ స్టాప్ సర్వీసులు ఉన్నాయి.

Ahmedabad Plane Crash: these Are Indias Biggest Plane Tragedies5
భారత దేశ చరిత్రలో అతిపెద్ద విమానం ప్రమాదం!

భారత్‌లో ఇవాళ(జూన్‌ 12, 2020) ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్‌ అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌ నిమిషాల వ్యవధిలో కుప్పకూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మృతిచెందారు. 230 ప్రయాణికుల్లో ఒకరు మినహా అంతా దుర్మరణం చెందారు. ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు. అయితే ఒక ప్రయాణికుడు మృత్యుంజయుడై వచ్చాడు. ప్రమాదం జరిగిన ఐదారు గంటల తర్వాత ప్రమాదగురైన వ్యక్తి ,నడుచుకుంటూ బయటకొచ్చాడు. ఈ విషయాన్ని అహ్మదాబాద్‌ సీపీ ప్రకటించారు. ఇదిలా ఉంచితే. భారత దేశ చరిత్రలో ఇంతకు ముందు విమాన ప్రమాదాలు చాలానే జరిగాయి. అందులో అత్యంత ప్రాణ నష్టం కలిగించిన ప్రమాదం ఎప్పుడు జరిగిందో తెలుసా?ఆగష్టు 7, 2020 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 1344 (కోజికోడ్, కేరళ)వివరాలు: దుబాయ్ నుండి కోజికోడ్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX-1344, ఒక బోయింగ్ 737-800, భారీ వర్షంలో ల్యాండింగ్ సమయంలో రన్‌వే దాటి, రెండు భాగాలుగా చీలి, ఒక లోయలో పడింది. టేబుల్‌టాప్ రన్‌వే తో పాటు ప్రతికూల వర్షాకాల పరిస్థితులు.ప్రాణనష్టం: 21 మంది మరణించారు, ఇద్దరు పైలట్లతో సహా, విమానంలోని 190 మందిలో (184 ప్రయాణీకులు ఉన్నారుమే 22, 2010ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 812 (మంగళూరు, కర్ణాటక) వివరాలు: దుబాయ్ నుండి మంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX-812, ఒక బోయింగ్ 737-800, ల్యాండింగ్ సమయంలో రన్‌వే దాటి, ఒక లోయలో పడి మంటల్లో చిక్కుకుంది. ప్రాణనష్టం: విమానంలోని 166 మందిలో 158 మంది (160 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, 8 మంది బతికారు.• కారణం: పైలట్ తప్పిదం, ప్రధానంగా కెప్టెన్ హెచ్చరికలు ఉన్నప్పటికీ ల్యాండింగ్‌ను రద్దు చేయడంలో విఫలమవడం, జులై 17, 2000జూలై 17, 2000: అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 (పాట్నా, బిహార్)• వివరాలు: కోల్‌కతా నుండి ఢిల్లీకి పాట్నా మీదుగా వెళ్తున్న అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 పాట్నా విమానాశ్రయం సమీపంలో ఒక రెసిడెన్షియల్ ప్రాంతంలో ల్యాండింగ్ ప్రయత్నంలో కుప్పకూలింది. పైలట్ తప్పిదం మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం నియంత్రణ కోల్పోయింది.• ప్రాణనష్టం: విమానంలోని 58 మందిలో 55 మంది (52 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, అలాగే భూమిపై 5 మంది మరణించారు.• కారణం: పరిశోధనల్లో పైలట్ తప్పిదం, పేలవమైన దృశ్యమానతలో గో-అరౌండ్ ప్రయత్నంలో తప్పు నిర్వహణను సూచించాయి.నవంబర్‌ 12, 1996సౌదీ అరేబియన్‌ ఎయిర్‌లైన్స్‌, కజకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు గాల్లో ఉండగానే హర్యానా ఛాక్రి దాద్రి వద్ద ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లోని 349 మంది దుర్మరణం పాలయ్యారు. భారత దేశంలో ఇప్పటిదాకా జరిగిన అతిపెద్ద విమానం ప్రమాదం ఇదే. ఏప్రిల్‌ 26, 1993ఔరంగబాద్‌లో ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఘటనలో 55 మంది మరణించగా.. 66 మంది గాయపడ్డారు.ఆగష్టు 16, 1991ఇంఫాల్‌లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 69 మంది మృతి చెందారుఫిబ్రవరి 14, 1990ఇండియన్‌ ఎయిన్స్ విమానం బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగుతుండగా.. క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. ప్రమాదంలో 92 మంది మరణించారు. అక్టోబర్‌ 19, 1988ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. ప్రమాదంలో 133 మంది మరణించారు.జూన్‌ 21, 1982ఎయిర్‌ ఇండియా విమానం బాంబేలో ప్రతికూల వాతావరణంతో కుప్పకూలింది. 17 మంది మరణించగా.. 94 మంది ప్రాణాలతో బయటపడ్డారు.జనవరి 1, 1978ఎయిర్‌ ఇండియా విమానం ముంబై బాంద్రా తీరంలో కూలి 213 మంది మరణించారు. అక్టోబర్‌ 12, 1976ముంబైలో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘోరంలో 95 మంది దుర్మరణం పాలయ్యారు.మే 31, 1973ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రమాదానికి గురైంది. 48 మంది మరణించగా.. 17 మందికి గాయాలయ్యాయిజూన్‌ 14, 1972లో.. జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రమాదానికి గురైంది. 82 మంది మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు జులై 28, 1963లో.. యునైటెడ్‌ అరబ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ముంబై ఎయిర్టుపోర్టులో ప్రమాదానికి గురై 63 మంది మరణించారుజులై 7, 1962లో అలియాలియా విమానం ముంబై నార్త్‌ఈస్ట్‌లో ప్రమాదానికి గురైంది. 94 మంది మరణించారు.మే 25, 1958లో.. అన్‌ అవ్రో యార్క్‌ విమానంలో మంటలు చెలరేగి గురుగావ్‌లో కుప్పకూలింది. విమానంలోని ఐదుగురు మరణించారు.ఇదీ చదవండి: అహ్మదాబాద్‌ ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం వీడియో

Software company owner 19 years in tech now delivering for Swiggy6
సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఓనర్‌.. ఇప్పుడు ఫుడ్‌డెలివరీ బాయ్‌..

మనం రోజూ ఎంతో మంది చిరు ఉద్యోగులను చూస్తుంటాం. ముఖ్యంగా ఫుడ్‌ డెలివరీ సిబ్బందిగా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి వారిని కొంత మంది చిన్నచూపు చూస్తారు. కానీ వారి నేపథ్యాలు తెలిస్తే పశ్చాత్తాపడక తప్పదు. అలాంటి వారిలో ఒకరే పద్మనాభన్‌.బెంగళూరుకు చెందిన నితిన్‌ కుమార్‌ ఫుడ్‌ కోసం స్విగ్గీలో ఆర్డర్‌ పెట్టారు. ఆర్డర్ అతని ఇంటి ముంగిటకు వచ్చినప్పుడు, తాను ఆహారాన్ని మాత్రమే ఆశించగా అతన్ని లోతుగా కదిలించే కథ పరిచయమైంది. కేవలం బతడం కోసమే కాకుండా ఒకప్పుడు తాను నడుపుతున్న వ్యాపారాన్ని పునరుద్ధరించుకునేందుకు ఫుడ్‌ డెలివరీలు చేస్తున్న పద్మనాభన్ అనే ఎంట్రప్రెన్యూర్‌ పరిచయమయ్యారు. ఆయన కథనే నితిన్ కుమార్ ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు."ఇదితో నా స్విగ్గీ డెలివరీ పార్టనర్ ఇది నాకు అప్పగించారు" అంటూ పోస్ట్‌ను ప్రారంభించిన నితిన్ కుమార్ దానికి ఓ రెజ్యుమ్‌ మొదటి పేజీ చిత్రాన్ని జతచేశారు. ‘డెలివర్డ్‌ విత్‌ కర్‌, బట్‌ విత్‌ కోడ్‌’ అని రెజ్యుమ్‌పై క్యాప్షన్‌ ఉంది. డెలివరీ పార్ట్‌నర్‌ పద్మనాభన్‌దే ఆ రెజ్యుమ్‌. అందులో "19+ సంవత్సరాల అనుభవం ఉన్న ఫుల్-స్టాక్ డెవలపర్" అని ఆయన వృత్తిపరమైన సమాచారం ఉంది.పద్మనాభన్ ఒకప్పుడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని నడిపారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉండేవారు. కానీ ఆయనిప్పుడు ఫుడ్‌ డెలివరీ ఉద్యోగం చేస్తున్నారు. అయితే తాను ఈ పని చేస్తున్నది "మనుగడ కోసం మాత్రమే కాదు, (తన వ్యాపారాన్ని) మొదటి నుండి నిర్మించడానికి" ఆయన రెజ్యూమ్ హైలైట్ చేస్తోంది.👉ఇదీ చదవండి: అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్‌ డెలివరీ ఉద్యోగం..డెలివరీ బాయ్‌కు బదులుగా మరేదైనా మంచి ఉద్యోగం ఇప్పించమంటావా అని అడిగితే.. ‘వద్దు, నా వ్యాపారాన్ని తిరిగి ట్రాక్‌లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను‘ అంటూ పద్మనాభన్‌ బదులిచ్చాడని నితిన్‌ కుమార్‌ పేర్కొన్నారు. కాగా పద్మనాభన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన 2018లో తమిళనాడులో తన సంస్థను స్థాపించాడు. టెక్కీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో డిగ్రీ చేశారు.

Air India Flight AI171 crashes into BJ Medical College hostel in Ahmedabad7
హాస్టల్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికల్‌ స్టూడెంట్స్‌ మృతి!

గాంధీనగర్‌: గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని ఘోర విషాదం చోటు చేసుకుంది. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి గురువారం లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం 110 మంది ప్రయాణికులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం.ఎయిర్‌ పోర్టు నుంచి బయల్దేరని ఎయిరిండియా విమానం మేఘాని నగర్‌లోని బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్‌ (BJ Medical College Hostel) భవనంపై విమానం కూలింది. ఈ విమాన ప్రమాదంలో 20మంది వైద్య విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. భోజనం సమయం కావడంతో హాస్టల్‌లోనే పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల మరణాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. Air India plane crashed directly on the BJ Medical College UG hostel mess in Meghani Nagar, Ahmedabad.#AirIndiaflight#ahmedabad#gujarat pic.twitter.com/mBAC7Psoys— RajawardhanReddy.Mule (@RajawardhanRed2) June 12, 2025 ⚡ As per initial reports the Air India plane crashed directly on the BJ Medical College UG hostel mess in Meghani Nagar, Ahmedabad. More details awaited pic.twitter.com/duJTCL1YTn— OSINT Updates (@OsintUpdates) June 12, 2025 #WATCH | Air India plane crash: "My son had gone to the hostel during lunch break, and the plane crashed there. My son is safe, and I have spoken to him. He jumped from the second floor, so he suffered some injuries,” says Ramila, who reached the civil hospital in Ahmedabad,… pic.twitter.com/MgMtvXBSou— ANI (@ANI) June 12, 2025

WTC Final 2025: Pat Cummins scripts world record8
చరిత్ర సృష్టించిన ప్యాట్ కమ్మిన్స్.. తొలి కెప్టెన్‌గా వరల్డ్‌ రికార్డు

లార్డ్స్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్ట్‌ ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ ఆసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కమ్మిన్స్ తన అద్బుత బౌలింగ్‌తో ప్రోటీస్ జట్టు పతనాన్ని శాసించాడు. కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి మొత్తం ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి బౌలింగ్ దాటికి సౌతాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్‌లో నిప్పులు చెరిగిన కమ్మిన్స్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కమ్మిన్స్‌ సాధించిన రికార్డులు ఇవే..👉అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) టోర్నమెంట్ ఫైనల్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా కమ్మిన్స్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఏ కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.👉ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో కమ్మిన్స్ 78 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(77) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బుమ్రాను కమ్మిన్స్ అధిగమించాడు.2023-25 ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:78* - పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా)77 - జస్ప్రీత్ బుమ్రా (భారత్‌)74 - మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)66 - నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా)63 - రవిచంద్రన్ అశ్విన్ (భారత్‌)👉లార్డ్స్ మైదానంలో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌గా కమ్మిన్స్ (28 పరుగులకు 6 వికెట్లు) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బాబ్ విల్లీస్ పేరిట ఉండేది. 1982లో భారత్‌పై 101 పరుగులిచ్చి విల్లీస్ 6 వికెట్లు పడగొట్టాడు. తాజా ప్రదర్శతో విల్లీస్ ఆల్‌టైమ్ రికార్డును కమ్మిన్స్ బ్రేక్ చేశాడు.లార్డ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌లు1. పాట్ కమిన్స్ - 2025లో దక్షిణాఫ్రికాపై 28 పరుగులిచ్చి 6 వికెట్లు2. బాబ్ విల్లీస్ - 1982లో భారత్‌పై 101 పరుగులిచ్చి 6 వికెట్లు3. డేనియల్ వెట్టోరి - 2008లో పరుగులిచ్చి 5 వికెట్లు👉ఈ మ్యాచ్‌లో కమ్మిన్స్‌ 300 టెస్టు వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు.

Ahmedabad Air India Plane Crash Video Viral9
కుప్పకూలిన ఎయిరిండియా విమానం.. వీడియో వైరల్‌

న్యూఢిల్లీ: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఎయిరిండియా (Air India) విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదంలో వంద మందికి పైగా మృతి చెంది ఉంటారని తెలుస్తోంది. కుప్పకూలిన వెంటనే విమానం పేలిపోగా.. దట్టంగా పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్‌ 787-7 డ్రీమ్‌ లైనర్‌ విమానం బయల్దేరింది. అయితే ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయిన కాసేపటికే.. 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానిక గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ అయిన కొన్ని నిమిషాల్లోనే.. అదీ ఎయిర్‌పోర్ట్‌ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు డీజీసీఏ ప్రకటించింది. ఈ ప్రమాద దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. Terrifying final moments of Air India Flight AI 171 crashing into a residential area in Ahmedabad today. Clearly catastrophic loss of lift. Details awaited. pic.twitter.com/TbgCjPLXXc— Shiv Aroor (@ShivAroor) June 12, 2025

Ex Gujarat CM Vijay Rupani on Air India flight that crashed in Ahmedabad?10
ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజ‌రాత్ మాజీ సీఎం విజ‌య్ రూపానీ మృతి

గాంధీ నగర్‌: గుజరాత్‌ రాష్ట్రం అహ్మాబాద్ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మాబాద్‌ నుంచి లండన్‌ వెళుతున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ పెను విషాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్టు కేంద్ర మంత్రి, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ అధికారికంగా ప్రకటించారు. (విమాన ప్రమాదానికి ముందు మాజీ సీఎం విజయ్‌ రూపానీని సెల్ఫీ తీసిన తోటి ప్రయాణికురాలు)ప్రమాదంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాద బాధితుల్లో విజయ్‌ రూపానీ ఉన్నారు. ‘మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన కుటుంబాన్ని కలవడానికి (లండన్) వెళ్తున్నారు. ఈ సంఘటనలో ఆయన కూడా బాధితుడే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఇది బిజెపికి పెద్ద నష్టం’అంటూ సీఆర్‌ పాటిల్‌ విచారం వ్యక్తం చేశారు. VIDEO | Ahmedabad Plane Crash: Union Minister and Gujarat BJP president, CR Patil (@CRPaatil) confirms former Gujarat CM Vijay Rupani's demise. Speaking to reporters, he says, "Our leader and former Chief Minister, Vijay Rupani, was going (to London) to meet his family. He is… pic.twitter.com/5c1VIk8KIb— Press Trust of India (@PTI_News) June 12, 2025 పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ ఉన్నట్లు తేలింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో విజయ్‌ రూపానీ 12వ ప్రయాణికుడు. జెడ్‌ క్లాస్‌లో రూపానీ టికెట్‌ బుక్‌ చేసుకున్నారనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి మధ్యాహ్నం 1:10 గంటలకు సర్వీస్‌ ఉంది. ఆ విమానం టేకాఫ్‌ అయిన రెండు నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగే సమయంలో విమానంలో సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారు. విమానంలో 242 మంది: డీజీసీఏఅహ్మదాబాద్‌లో ప్ర‌మాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్ల‌డించింది. వీరిలో ఇద్ద‌రు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో ఉన్నారు.Ahmedabad Plane Crash: Video captured exact moment Air India's AI -171 passenger aircraft crashed near Meghnaninagar area earlier today.(Disclaimer: PTI can not verify the authenticity of the video)(Source: Third party) pic.twitter.com/qAK8aP6wGH— Press Trust of India (@PTI_News) June 12, 2025విమానంలో 169 మంది భారతీయులు, 53 మంత్రి బ్రిటన్‌, ఏడుగురు పోర్చుగీస్‌ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు ఎయిరిండియా ఎక్స్‌ వేదికగా వెల్లడించింది.ప్రమాదానికి గురైన విమానం వైడ్‌బాడీ బోయింగ్‌ 787 డ్రీమ్‌ లైనర్‌. దీనిలో 300మంది ప్రయాణించవచ్చు. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉండడంతో ప్రమాదం స్థాయి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement