ప్రధాన వార్తలు

విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు.. ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు
గాంధీనగర్: ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. విమానం ప్రమాదం నుంచి రమేష్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే సీటు 11ఏ ప్రయాణికుడు ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు నడుచుకుంటూ వస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. విమానం కూలిన తర్వాత ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు వచ్చినట్లు అహ్మదాబాద్ పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. ఈ సందర్భంగా మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్ విమాన ప్రమాదంపై మీడియాతో మాట్లాడినట్లు సమాచారం. ‘అంతా క్షణాల్లో జరిగిపోయింది. నా సోదరుడు ఏమయ్యాడో తెలియదు. టేకాఫ్ అయిన 30 క్షణాల్లోనే విమానం పేలిపోయింది.’ అని అన్నారు. (రమేష్ విశ్వకుమార్ కుమార్ ఎయిరిండియా విమానం టికెట్)సదరు ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ ధృవీకరించారు. ‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ చెప్పారని ఏఎన్ఐ నివేదించింది. 11ఏ సీటులో ఒక ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు గుర్తించారు. సదరు ప్రయాణికుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అయితే,మరణాల సంఖ్య గురించి స్పష్టత ఇవ్వలేదు. కానీ నివాస ప్రాంతంలో విమానం కూలిపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది’అని మాలిక్ అన్నారు.Miracle amidst tragedy!!!Ramesh Vishwashkumar, seated on 11A, is the sole survivor of the Air India crash in Ahmedabad. He jumped out and walked away injured. He’s currently undergoing treatment at the hospital.#AhmedabadPlaneCrash #Ahmedabad pic.twitter.com/pWIHUD7kG5— Shivangi Thakur (@thakur_shivangi) June 12, 2025

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 241 మంది మృతి
👉అహ్మదాబాద్ చేరుకున్న డీజీసీఏ దర్యాప్తు బృందంవిమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన డీజీసీఏఏఏఐజీ డీజీ నేతృత్వంలో దర్యాప్తువిమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని మృతిఅధికారికంగా ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం2016-2021 వరకు గుజరాత్ సీఎంగా పనిచేసిన విజయ్ రూపాని👉మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ఎక్స్గ్రేషియామృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియాక్షతగాత్రుల వైద్య పరీక్షలన్నీ భరిస్తాం: చంద్రశేఖరన్బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని పునర్నిర్మిస్తాం 👉ఎయిరిండియా ప్రమాదంలో మృత్యుంజయుడుఒక ప్రయాణికుడు బతికే ఉన్నాడని ప్రకటించిన సీపీ11A సీటులో ఉన్న వ్యక్తి బతికాడంటున్న పోలీసులుఆలస్యంగా గుర్తించిన పోలీసులురమేష్ విశ్వాస్ కుమార్గా గుర్తింపు 👉ఎయిరిండియా నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా?మెయింటెనెన్స్ లోపంతో ప్రమాదం జరిగిందనే అనుమానంవిమానానికి పలుమార్లు సాంకేతిక లోపంగత డిసెంబర్లో ఇదే విమానంలో పొగలుఏడాదిలో రెండుసార్లు సాంకేతిక సమస్యలుజూన్, డిసెంబర్లో తప్పిన ప్రమాదాలు👉విమానంలో ఉన్న 241 మంది దుర్మరణం..!229 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు మృతి10 మంది విమాన సిబ్బంది మృతి👉విమాన ప్రమాదంపై విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనవిమాన ప్రమాదంలో చాలా మంది చనిపోయారుమృతుల సంఖ్య ఇప్పుడే చెప్పలేం: విదేశాంగ శాఖమృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ👉అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతిఎయిర్ ఇండియా AI-171 విమానం కూలిపోయిన విషయం తెలిసి నేను షాక్ అయ్యా..ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నా..మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడ్ని కోరుతున్నా..👉విమాన ప్రమాదంపై స్పందించిన భారత్లోని యూకే హైకమిషన్బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన యూకే హైకమిషన్స్థానిక అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం: యూకే హైకమిషన్👉అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి సీఎం భూపేంద్ర పటేల్క్షతగాత్రులను పరామర్శించిన సీఎం భూపేంద్ర పటేల్బాధిత కుటుంబాలను ఆదుకుంటాంజరిగిన ఘటన దురదృష్టకరంచాలా మందికి రక్తం అవసరం.. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశాంరక్తదానం చేయడానికి దాతలు రావాలి: భూపేంద్ర పటేల్రక్తదాన కేంద్రాలు:1. U. N. Mehta Institute of Cardiology and Research Centre Room no 110, 1st floor, A block Contact no-9316732524 2. IHBT Department, Civil Hospital 2nd floor, 1200 bed Civil Hospital, Contact no-9428265409 3. IKDRC Blood Centre 1st floor, IKDRC Hospital, Manjushree mill road, Baliya limdi Contact no-07922687500 Ext no-4226 4. GCRI Blood Centre 1st floor, Gujarat cancer & Research institute Contact no-07922688026👉అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని మోదీవిమాన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది.. బాధించిందిఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటనబాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన ప్రధాని👉విమాన ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతిబాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి వీలైనంత వేగంగా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరిన రేవంత్👉విమానయాన శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటుఫోన్ నంబర్లు: 011 24610843, 9650391859ఎయిరిండియా హెల్ప్లైన్ నంబర్ 1800 5691 444👉బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిన విమానంబీజే మెడికల్ కాలేజీలోని 20 మంది వైద్య విద్యార్థులు మృతివిమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది సహా 242 మంది👉విమాన ప్రయాణికుల సమాచారం కోసం హెల్ప్లైన్ ఏర్పాటుహెల్ప్లైన్ నంబర్ 1800 5691 444ప్రమాదంపై ఎయిరిండియా ఛైర్మన్ చంద్రశేఖరన్ దిగ్భ్రాంతిమృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన చంద్రశేఖరన్బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: చంద్రశేఖరన్ 👉విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులువిమానంలో ఏడుగురు పోర్చుగ్రీస్ దేశస్థులు, ఒక కెనడా దేశస్థుడువిమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలుఅహ్మదాబాద్ ఆసుప్రతికి చేరిన 40 మృతదేహాలు👉విమాన ప్రమాదంపై డీజీసీఏ ప్రకటనవిమానంలో 242 మంది ప్రయాణికులుఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందిఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వచ్చిందిఏటీసీ నుంచి చేసిన కాల్స్కు స్పందన రాలేదుఅహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలిందిఎయిర్ పోర్ట్పరిసరాల్లోనే విమాన ప్రమాదం👉కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ప్రధాని మోదీ ఫోన్విమాన ప్రమాదంపై ఆరా తీసిన ప్రధానిఎప్పటి కప్పుడు పరిస్థితి తనకు తెలియజేయాలన్న మోదీ👉విమానంలో 52 మంది బ్రిటన్ దేశస్థులుసాయంత్రం 5 గంటల వరకు ఎయిర్పోర్ట్ మూసివేతవిమానం కూలిపోయే ముందు ఏటీసీకి ఎమర్జెన్సీ సమాచారం ఇచ్చిన పైలట్లుపౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ👉విమాన ప్రమాదంలో 100 మందికిపైగా మృతి?కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని?విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందిపైలట్ సుమిత్ సబర్వాల్ ఆధ్వర్యంలో బయలేర్దిన విమానంవిమానానికి ఫస్ట్ ఆఫీసర్గా ఉన్న పైలట్ కైవ్ కుందర్న్యూఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్లో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిరిండియా విమానం ఎయిర్పోర్ట్ సమీపంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది. ఘటనా స్థలానికి అంబులెన్స్లు, ఫైర్ ఇంజిన్లు చేరుకుంటున్నాయి. సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గురువారం మధ్యాహ్నాం మధ్యాహ్నం 1:39 గంటలకు బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయ్యిందని.. టేకాఫ్ కాసేపటికే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై కూలిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విమానం లండన్ వెళ్తుండగా.. అందులో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలిలో మంటలు ఎగిసిపడుతున్నాయి.Ahemdabad Plan crash around 242 passengers are traveling 💔 reason :- technical fault #Planecrash #Ahmedabad #Airindia #crash pic.twitter.com/5iUENTIPxd— Manan Trivedi (@itsurbunny7) June 12, 2025828 అడుగుల ఎత్తులో విమానం క్రాష్ అయ్యింది. విమానం కూలిన మేఘాని ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఫైరింజన్లు మంటలు ఆర్పే ప్రయత్నాల్లో ఉన్నాయి. పలువురిని అంబులెన్సులలో ఆస్పత్రికి తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షత గాత్రులను సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు.గుజరాత్ సీఎంతో మాట్లాడిన అమిత్ షాఅహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు. విమాన ప్రమాదం గురించి తెలియగానే గుజరాత్ ముఖ్యమంత్రి, హోం మంత్రి, అహ్మదాబాద్ పోలీసు కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.విమానంలో 242 మంది: డీజీసీఏఅహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్రమాద సమయంలో విమానంలో ఉన్నారు.

‘మే డే.. మే డే’ అంటూ ఏటీసీకి సంకేతం!
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో బ్లాక్ బాక్స్ ఏం చెబుతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం. అసలు ప్రమాదం ఏ పరిస్థితుల్లో జరిగిందనేది బ్లాక్ బాక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. తాజా విమాన ప్రమాదంలో అందులో ఉన్న 242 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది దుర్మరణం పాలైనట్లు సమాచారం. అయితే విమాన ప్రమాదాలు జరిగే సమయంలో ఆ ప్రమాదానికి గ కారణాలు విప్పే బ్లాక్ బాక్స్.. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత పదిలంగానే ఉండటంతో దీని గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే విమానం ప్రమాదానికి గురి కావడానికి కొన్ని నిమిషాల ముందు ‘మేడే మేడే అంటూ ఏటీసీకి వాయిస్ సంకేతాలు వెళ్లాయి. విమానం ప్రమాదానికి గురౌతుందన్నప్పుడు, ప్రయాణికులు ప్రమాదంలో ఉన్నప్పుడు మేడే మేడే అని సిగ్నల్స్ ఇస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. కాకపోతే ప్రమాదం జరగడానికి ఎంత సేపో పట్టలేదు. విమానం పూర్తిగా డేంజర్ జోన్లోకి వెళ్లిపోవడంతో కుప్పకూలిపోయింది. మే డే కాల్' అంటే ఏంటి?ఏదైనా విమాన ప్రమాదం బారిన పడే అవకాశం ఉన్నప్పుడు ఇలా పైలట్ దగ్గరలోని ఏటీసీకి ఈ 'మేడే కాల్' ద్వారా సిగ్నల్ ఇస్తారు. ప్రధానంగా విమాన ప్రయాణీకుల ప్రాణాలు ఇబ్బందుల్లో పడినప్పుడు లేదా అత్యవసరంగా ఇంజిన్ పనిచేయకపోయినప్పుడు, మంటల్లో చిక్కుకున్న సమయంలో కానీ, గాలిలో ఏదైనా పక్షిలాంటితది ఢీకొన్న సమయంలో, హైజాక్ సమయంలో ఈ మేడే కాల్ ను ఏటీసీకి అందిస్తారు. ఇలాంటి ప్రమాద సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీకి పైలట్ సమాచారం తక్షణమే అందించాలి. ఇలాంటి ప్రమాద సమయంలో 'మేడే.. మేడే.. మేడే' అని మూడుసార్లు ఏటీసీకి సిగ్నల్ పంపించాల్సి ఉంటుంది. దీని అర్థం ఇది జోక్ కాదు నిజంగానే ఇబ్బందులో ఉన్నామని ఇచ్చే సంకేతం. మేడే సంకేతం ఇచ్చిన వెంటనే ఏటీసీ స్పందిస్తుంది అత్యవసరం వచ్చిందని పరిగణిస్తూ రన్ వేను క్లియర్ చేసి.. అంబులెన్స్, అగ్నిమాపకదళాలని వెంటనే సిద్ధం చేస్తారు.

టాటా గ్రూపునకు మాయని మచ్చ..
టాటా గ్రూప్ కు చెందిన ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలి వందల కొద్దీ ప్రాణాలను బలిగొంది. సహాయక చర్యలు కొనసాగుతుండగానే, ఈ సంఘటన టాటా గ్రూప్ ప్రతిష్టాత్మక ఎయిరిండియా పునరుద్ధరణపై నీడలు కమ్మేసింది. అలాగే వందల ఏళ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూపునకు మాయని మచ్చగా మిగిలిపోనుంది.బాధిత కుటుంబాలకు రూ .1 కోటి నష్టపరిహారంప్రమాదం తర్వాత, టాటా గ్రూప్ ప్రతి బాధిత కుటుంబానికి రూ .1 కోటి నష్టపరిహారాన్ని ప్రకటించింది. ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని పునర్నిర్మిస్తామని వాగ్దానం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా ఉండడం, ఎయిర్ ఇండియా భద్రతా ప్రోటోకాల్స్ను సమీక్షించడంలో టాటా గ్రూప్ నిబద్ధతను చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నొక్కి చెప్పారు.టాటా గ్రూప్.. వందల ఏళ్ల చరిత్రటాటా గ్రూపును 1868లో జంషెడ్జీ టాటా స్థాపించారు. ఉక్కు, ఆటోమొబైల్స్ నుండి టెలికమ్యూనికేషన్స్, విమానయానం వరకు వివిధ పరిశ్రమలను విస్తరించి భారతదేశపు అతిపెద్ద సమ్మేళనంగా టాటా గ్రూప్ అభివృద్ధి చెందింది. దశాబ్దాలుగా టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వంటి ఐకానిక్ వ్యాపారాలను టాటా గ్రూప్ నిర్మించింది.జేఆర్డీ టాటా స్థాపించిన ఎయిర్ ఇండియాఎయిర్ ఇండియాను 1932లో జేఆర్డీ టాటానే టాటా ఎయిర్ లైన్స్ పేరుతో స్థాపించారు. ఇది భారతదేశ విమానయాన పరిశ్రమకు నాంది పలికింది. 1953లో భారత ప్రభుత్వం ఈ విమానయాన సంస్థను జాతీయం చేసింది. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఈ సంస్థ నిర్వహణ వ్యయాలు, పెరుగుతున్న పోటీ ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయింది.దాదాపు 69 ఏళ్ల తర్వాత 2022 జనవరిలో టాటా గ్రూప్ తన ప్రపంచ ఖ్యాతిని పునరుద్ధరించే లక్ష్యంతో 2.2 బిలియన్ డాలర్ల ఒప్పందంలో ఎయిరిండియాను తిరిగి పొందింది. అప్పటి నుండి టాటా అనేక ప్రధాన మార్పులను అమలు చేసింది.ఫ్లీట్ విస్తరణ..నవీకరణలు - ఎయిర్ ఇండియా 2023లో ఎయిర్బస్, బోయింగ్ నుండి 470 విమానాలకు రికార్డు స్థాయి ఆర్డర్లను ఇచ్చింది. తరువాత 2024 డిసెంబర్ లో అదనంగా 100 జెట్లను ఆర్డర్ చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ను ఆధునీకరించడానికి 400 మిలియన్ డాలర్ల రెట్రోఫిట్ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది.మెగా విలీనం - 2024 నవంబర్లో టాటా ఎయిర్ ఇండియాను విస్తారా, ఎయిర్ ఇండియా ఎస్ప్రెస్తో విలీనం చేసింది. ఇది 30 శాతం దేశీయ మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద విమానయాన సమూహాన్ని ఏర్పాటు చేసింది.ఆపరేషనల్ పునరుద్ధరణ - టాటా Vihaan.AI ప్రవేశపెట్టింది. ఇది ఫ్లీట్ ఆధునీకరణ, టెక్నాలజీ అప్ గ్రేడ్ లు, కస్టమర్ సర్వీస్ మెరుగుదలలపై దృష్టి సారించే పంచవర్ష పరివర్తన ప్రణాళిక.మార్గ విస్తరణ - ఎయిర్ ఇండియా ఇప్పుడు 191 విమానాలను నడుపుతోంది. 43 దేశీయ, 41 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. వీటిలో ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు నాన్ స్టాప్ సర్వీసులు ఉన్నాయి.

భారత దేశ చరిత్రలో అతిపెద్ద విమానం ప్రమాదం!
భారత్లో ఇవాళ(జూన్ 12, 2020) ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ నిమిషాల వ్యవధిలో కుప్పకూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మృతిచెందారు. 230 ప్రయాణికుల్లో ఒకరు మినహా అంతా దుర్మరణం చెందారు. ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు. అయితే ఒక ప్రయాణికుడు మృత్యుంజయుడై వచ్చాడు. ప్రమాదం జరిగిన ఐదారు గంటల తర్వాత ప్రమాదగురైన వ్యక్తి ,నడుచుకుంటూ బయటకొచ్చాడు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ సీపీ ప్రకటించారు. ఇదిలా ఉంచితే. భారత దేశ చరిత్రలో ఇంతకు ముందు విమాన ప్రమాదాలు చాలానే జరిగాయి. అందులో అత్యంత ప్రాణ నష్టం కలిగించిన ప్రమాదం ఎప్పుడు జరిగిందో తెలుసా?ఆగష్టు 7, 2020 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 1344 (కోజికోడ్, కేరళ)వివరాలు: దుబాయ్ నుండి కోజికోడ్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ IX-1344, ఒక బోయింగ్ 737-800, భారీ వర్షంలో ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి, రెండు భాగాలుగా చీలి, ఒక లోయలో పడింది. టేబుల్టాప్ రన్వే తో పాటు ప్రతికూల వర్షాకాల పరిస్థితులు.ప్రాణనష్టం: 21 మంది మరణించారు, ఇద్దరు పైలట్లతో సహా, విమానంలోని 190 మందిలో (184 ప్రయాణీకులు ఉన్నారుమే 22, 2010ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 812 (మంగళూరు, కర్ణాటక) వివరాలు: దుబాయ్ నుండి మంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ IX-812, ఒక బోయింగ్ 737-800, ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి, ఒక లోయలో పడి మంటల్లో చిక్కుకుంది. ప్రాణనష్టం: విమానంలోని 166 మందిలో 158 మంది (160 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, 8 మంది బతికారు.• కారణం: పైలట్ తప్పిదం, ప్రధానంగా కెప్టెన్ హెచ్చరికలు ఉన్నప్పటికీ ల్యాండింగ్ను రద్దు చేయడంలో విఫలమవడం, జులై 17, 2000జూలై 17, 2000: అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 (పాట్నా, బిహార్)• వివరాలు: కోల్కతా నుండి ఢిల్లీకి పాట్నా మీదుగా వెళ్తున్న అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 పాట్నా విమానాశ్రయం సమీపంలో ఒక రెసిడెన్షియల్ ప్రాంతంలో ల్యాండింగ్ ప్రయత్నంలో కుప్పకూలింది. పైలట్ తప్పిదం మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం నియంత్రణ కోల్పోయింది.• ప్రాణనష్టం: విమానంలోని 58 మందిలో 55 మంది (52 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, అలాగే భూమిపై 5 మంది మరణించారు.• కారణం: పరిశోధనల్లో పైలట్ తప్పిదం, పేలవమైన దృశ్యమానతలో గో-అరౌండ్ ప్రయత్నంలో తప్పు నిర్వహణను సూచించాయి.నవంబర్ 12, 1996సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్, కజకిస్తాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాలు గాల్లో ఉండగానే హర్యానా ఛాక్రి దాద్రి వద్ద ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లోని 349 మంది దుర్మరణం పాలయ్యారు. భారత దేశంలో ఇప్పటిదాకా జరిగిన అతిపెద్ద విమానం ప్రమాదం ఇదే. ఏప్రిల్ 26, 1993ఔరంగబాద్లో ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఘటనలో 55 మంది మరణించగా.. 66 మంది గాయపడ్డారు.ఆగష్టు 16, 1991ఇంఫాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 69 మంది మృతి చెందారుఫిబ్రవరి 14, 1990ఇండియన్ ఎయిన్స్ విమానం బెంగళూరు ఎయిర్పోర్టులో దిగుతుండగా.. క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రమాదంలో 92 మంది మరణించారు. అక్టోబర్ 19, 1988ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రమాదంలో 133 మంది మరణించారు.జూన్ 21, 1982ఎయిర్ ఇండియా విమానం బాంబేలో ప్రతికూల వాతావరణంతో కుప్పకూలింది. 17 మంది మరణించగా.. 94 మంది ప్రాణాలతో బయటపడ్డారు.జనవరి 1, 1978ఎయిర్ ఇండియా విమానం ముంబై బాంద్రా తీరంలో కూలి 213 మంది మరణించారు. అక్టోబర్ 12, 1976ముంబైలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘోరంలో 95 మంది దుర్మరణం పాలయ్యారు.మే 31, 1973ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రమాదానికి గురైంది. 48 మంది మరణించగా.. 17 మందికి గాయాలయ్యాయిజూన్ 14, 1972లో.. జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రమాదానికి గురైంది. 82 మంది మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు జులై 28, 1963లో.. యునైటెడ్ అరబ్ ఎయిర్లైన్స్ విమానం ముంబై ఎయిర్టుపోర్టులో ప్రమాదానికి గురై 63 మంది మరణించారుజులై 7, 1962లో అలియాలియా విమానం ముంబై నార్త్ఈస్ట్లో ప్రమాదానికి గురైంది. 94 మంది మరణించారు.మే 25, 1958లో.. అన్ అవ్రో యార్క్ విమానంలో మంటలు చెలరేగి గురుగావ్లో కుప్పకూలింది. విమానంలోని ఐదుగురు మరణించారు.ఇదీ చదవండి: అహ్మదాబాద్ ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం వీడియో

సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్.. ఇప్పుడు ఫుడ్డెలివరీ బాయ్..
మనం రోజూ ఎంతో మంది చిరు ఉద్యోగులను చూస్తుంటాం. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ సిబ్బందిగా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి వారిని కొంత మంది చిన్నచూపు చూస్తారు. కానీ వారి నేపథ్యాలు తెలిస్తే పశ్చాత్తాపడక తప్పదు. అలాంటి వారిలో ఒకరే పద్మనాభన్.బెంగళూరుకు చెందిన నితిన్ కుమార్ ఫుడ్ కోసం స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ అతని ఇంటి ముంగిటకు వచ్చినప్పుడు, తాను ఆహారాన్ని మాత్రమే ఆశించగా అతన్ని లోతుగా కదిలించే కథ పరిచయమైంది. కేవలం బతడం కోసమే కాకుండా ఒకప్పుడు తాను నడుపుతున్న వ్యాపారాన్ని పునరుద్ధరించుకునేందుకు ఫుడ్ డెలివరీలు చేస్తున్న పద్మనాభన్ అనే ఎంట్రప్రెన్యూర్ పరిచయమయ్యారు. ఆయన కథనే నితిన్ కుమార్ ‘ఎక్స్’లో షేర్ చేశారు."ఇదితో నా స్విగ్గీ డెలివరీ పార్టనర్ ఇది నాకు అప్పగించారు" అంటూ పోస్ట్ను ప్రారంభించిన నితిన్ కుమార్ దానికి ఓ రెజ్యుమ్ మొదటి పేజీ చిత్రాన్ని జతచేశారు. ‘డెలివర్డ్ విత్ కర్, బట్ విత్ కోడ్’ అని రెజ్యుమ్పై క్యాప్షన్ ఉంది. డెలివరీ పార్ట్నర్ పద్మనాభన్దే ఆ రెజ్యుమ్. అందులో "19+ సంవత్సరాల అనుభవం ఉన్న ఫుల్-స్టాక్ డెవలపర్" అని ఆయన వృత్తిపరమైన సమాచారం ఉంది.పద్మనాభన్ ఒకప్పుడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని నడిపారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉండేవారు. కానీ ఆయనిప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం చేస్తున్నారు. అయితే తాను ఈ పని చేస్తున్నది "మనుగడ కోసం మాత్రమే కాదు, (తన వ్యాపారాన్ని) మొదటి నుండి నిర్మించడానికి" ఆయన రెజ్యూమ్ హైలైట్ చేస్తోంది.👉ఇదీ చదవండి: అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..డెలివరీ బాయ్కు బదులుగా మరేదైనా మంచి ఉద్యోగం ఇప్పించమంటావా అని అడిగితే.. ‘వద్దు, నా వ్యాపారాన్ని తిరిగి ట్రాక్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను‘ అంటూ పద్మనాభన్ బదులిచ్చాడని నితిన్ కుమార్ పేర్కొన్నారు. కాగా పద్మనాభన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన 2018లో తమిళనాడులో తన సంస్థను స్థాపించాడు. టెక్కీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో డిగ్రీ చేశారు.

హాస్టల్పై కూలిన విమానం.. 20 మంది మెడికల్ స్టూడెంట్స్ మృతి!
గాంధీనగర్: గుజరాత్ అహ్మదాబాద్లోని ఘోర విషాదం చోటు చేసుకుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం 110 మంది ప్రయాణికులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం.ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరని ఎయిరిండియా విమానం మేఘాని నగర్లోని బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ (BJ Medical College Hostel) భవనంపై విమానం కూలింది. ఈ విమాన ప్రమాదంలో 20మంది వైద్య విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. భోజనం సమయం కావడంతో హాస్టల్లోనే పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల మరణాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. Air India plane crashed directly on the BJ Medical College UG hostel mess in Meghani Nagar, Ahmedabad.#AirIndiaflight#ahmedabad#gujarat pic.twitter.com/mBAC7Psoys— RajawardhanReddy.Mule (@RajawardhanRed2) June 12, 2025 ⚡ As per initial reports the Air India plane crashed directly on the BJ Medical College UG hostel mess in Meghani Nagar, Ahmedabad. More details awaited pic.twitter.com/duJTCL1YTn— OSINT Updates (@OsintUpdates) June 12, 2025 #WATCH | Air India plane crash: "My son had gone to the hostel during lunch break, and the plane crashed there. My son is safe, and I have spoken to him. He jumped from the second floor, so he suffered some injuries,” says Ramila, who reached the civil hospital in Ahmedabad,… pic.twitter.com/MgMtvXBSou— ANI (@ANI) June 12, 2025

చరిత్ర సృష్టించిన ప్యాట్ కమ్మిన్స్.. తొలి కెప్టెన్గా వరల్డ్ రికార్డు
లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో కమ్మిన్స్ తన అద్బుత బౌలింగ్తో ప్రోటీస్ జట్టు పతనాన్ని శాసించాడు. కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి మొత్తం ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి బౌలింగ్ దాటికి సౌతాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్లో కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్లో నిప్పులు చెరిగిన కమ్మిన్స్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కమ్మిన్స్ సాధించిన రికార్డులు ఇవే..👉అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) టోర్నమెంట్ ఫైనల్లో ఐదు వికెట్లు తీసిన తొలి కెప్టెన్గా కమ్మిన్స్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఏ కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.👉ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో కమ్మిన్స్ 78 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(77) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో బుమ్రాను కమ్మిన్స్ అధిగమించాడు.2023-25 ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:78* - పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా)77 - జస్ప్రీత్ బుమ్రా (భారత్)74 - మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)66 - నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా)63 - రవిచంద్రన్ అశ్విన్ (భారత్)👉లార్డ్స్ మైదానంలో ఒక టెస్టు ఇన్నింగ్స్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్గా కమ్మిన్స్ (28 పరుగులకు 6 వికెట్లు) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బాబ్ విల్లీస్ పేరిట ఉండేది. 1982లో భారత్పై 101 పరుగులిచ్చి విల్లీస్ 6 వికెట్లు పడగొట్టాడు. తాజా ప్రదర్శతో విల్లీస్ ఆల్టైమ్ రికార్డును కమ్మిన్స్ బ్రేక్ చేశాడు.లార్డ్స్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్లు1. పాట్ కమిన్స్ - 2025లో దక్షిణాఫ్రికాపై 28 పరుగులిచ్చి 6 వికెట్లు2. బాబ్ విల్లీస్ - 1982లో భారత్పై 101 పరుగులిచ్చి 6 వికెట్లు3. డేనియల్ వెట్టోరి - 2008లో పరుగులిచ్చి 5 వికెట్లు👉ఈ మ్యాచ్లో కమ్మిన్స్ 300 టెస్టు వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు.

కుప్పకూలిన ఎయిరిండియా విమానం.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిరిండియా (Air India) విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదంలో వంద మందికి పైగా మృతి చెంది ఉంటారని తెలుస్తోంది. కుప్పకూలిన వెంటనే విమానం పేలిపోగా.. దట్టంగా పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్ 787-7 డ్రీమ్ లైనర్ విమానం బయల్దేరింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే.. 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానిక గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే.. అదీ ఎయిర్పోర్ట్ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు డీజీసీఏ ప్రకటించింది. ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. Terrifying final moments of Air India Flight AI 171 crashing into a residential area in Ahmedabad today. Clearly catastrophic loss of lift. Details awaited. pic.twitter.com/TbgCjPLXXc— Shiv Aroor (@ShivAroor) June 12, 2025

ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
గాంధీ నగర్: గుజరాత్ రాష్ట్రం అహ్మాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ పెను విషాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్టు కేంద్ర మంత్రి, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ అధికారికంగా ప్రకటించారు. (విమాన ప్రమాదానికి ముందు మాజీ సీఎం విజయ్ రూపానీని సెల్ఫీ తీసిన తోటి ప్రయాణికురాలు)ప్రమాదంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాద బాధితుల్లో విజయ్ రూపానీ ఉన్నారు. ‘మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన కుటుంబాన్ని కలవడానికి (లండన్) వెళ్తున్నారు. ఈ సంఘటనలో ఆయన కూడా బాధితుడే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఇది బిజెపికి పెద్ద నష్టం’అంటూ సీఆర్ పాటిల్ విచారం వ్యక్తం చేశారు. VIDEO | Ahmedabad Plane Crash: Union Minister and Gujarat BJP president, CR Patil (@CRPaatil) confirms former Gujarat CM Vijay Rupani's demise. Speaking to reporters, he says, "Our leader and former Chief Minister, Vijay Rupani, was going (to London) to meet his family. He is… pic.twitter.com/5c1VIk8KIb— Press Trust of India (@PTI_News) June 12, 2025 పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అహ్మదాబాద్లో కూలిన ఎయిరిండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు తేలింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో విజయ్ రూపానీ 12వ ప్రయాణికుడు. జెడ్ క్లాస్లో రూపానీ టికెట్ బుక్ చేసుకున్నారనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి మధ్యాహ్నం 1:10 గంటలకు సర్వీస్ ఉంది. ఆ విమానం టేకాఫ్ అయిన రెండు నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగే సమయంలో విమానంలో సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారు. విమానంలో 242 మంది: డీజీసీఏఅహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్రమాద సమయంలో విమానంలో ఉన్నారు.Ahmedabad Plane Crash: Video captured exact moment Air India's AI -171 passenger aircraft crashed near Meghnaninagar area earlier today.(Disclaimer: PTI can not verify the authenticity of the video)(Source: Third party) pic.twitter.com/qAK8aP6wGH— Press Trust of India (@PTI_News) June 12, 2025విమానంలో 169 మంది భారతీయులు, 53 మంత్రి బ్రిటన్, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు ఎయిరిండియా ఎక్స్ వేదికగా వెల్లడించింది.ప్రమాదానికి గురైన విమానం వైడ్బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300మంది ప్రయాణించవచ్చు. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉండడంతో ప్రమాదం స్థాయి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.
డిజిటల్ సాధికారత కలకు ఎస్టీపీఐ రెక్కలు
బంగ్లాదేశ్ కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్.. అధికారిక ప్రకటన
ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
‘చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు’
టాటా గ్రూపునకు మాయని మచ్చ..
రేపటి వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం వాయిదా
విమాన ప్రమాదం వల్లే మంత్రి రాలేకపోయారు: దిల్ రాజు
అడవే ఆధారం.. బతుకు భారం..
చరిత్ర సృష్టించిన ప్యాట్ కమ్మిన్స్.. తొలి కెప్టెన్గా వరల్డ్ రికార్డు
ఎయిరిండియా విమాన ప్రమాద మృతులకు ఎక్స్గ్రేషియా.. ప్రకటించిన టాటా గ్రూప్
కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?
నువ్వు నాకు వద్దు.. చచ్చిపో!
బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. రేటు ఎంతంటే?
అక్కడ 11 ఏళ్ల తర్వాత 'దేవర'.. సతీమణితో మంచు మనోజ్ సందడి (ఫోటోలు)
‘రేవంత్ పార్టీని వీడాలనుకుంటున్నారు’
రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే పూరన్కు బంపరాఫర్.. కెప్టెన్గా ఎంపిక
ప్రపంచం మన మాట వినట్లేదేం?
కేవలం నకిలీ కరెన్సీ, నకిలీ సర్టిఫికెట్స్లాంటి కేసుల కోసమే ఏర్పాటు చేశారట... ఏదో నకిలీ కేసు పెట్టి వదిలేయమంటున్నార్సార్!
అలాగే ట్రంప్, మస్క్ ఎప్పుడు కొట్టుకుంటారో కూడా కాస్త చెబుతారా!
‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’
టీమిండియావైపు దూసుకొస్తున్న నయా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం
ఏడు జన్మలోనూ నువ్వే తోడుగా.. హనీమూన్ కపుల్ కేసులో షాకింగ్ ట్విస్ట్
ఒక్క లాడెన్కే కాదు! ప్రపంచంలో ఉన్న ప్రతి టెర్రరిస్టుకు ఇక్కడ మాత్రమే సేఫ్!
కొమ్మినేనిపై కేసు.. పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం
సమ్మర్ జ్ఞాపకాలు.. మర్చిపోలేకపోతున్న బన్నీ భార్య (ఫొటోలు)
మీరిచ్చిన గూగుల్ మ్యాప్లో లోకేషన్ ఇదే చూపిస్తుంది సార్!
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలలో పురోగతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 241 మంది మృతి
ఇంట్లో బోర్ కొడుతోంది.. ఉండలేకపోతున్నా..!
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
డిజిటల్ సాధికారత కలకు ఎస్టీపీఐ రెక్కలు
బంగ్లాదేశ్ కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్.. అధికారిక ప్రకటన
ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
‘చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు’
టాటా గ్రూపునకు మాయని మచ్చ..
రేపటి వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం వాయిదా
విమాన ప్రమాదం వల్లే మంత్రి రాలేకపోయారు: దిల్ రాజు
అడవే ఆధారం.. బతుకు భారం..
చరిత్ర సృష్టించిన ప్యాట్ కమ్మిన్స్.. తొలి కెప్టెన్గా వరల్డ్ రికార్డు
ఎయిరిండియా విమాన ప్రమాద మృతులకు ఎక్స్గ్రేషియా.. ప్రకటించిన టాటా గ్రూప్
కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?
నువ్వు నాకు వద్దు.. చచ్చిపో!
బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. రేటు ఎంతంటే?
‘రేవంత్ పార్టీని వీడాలనుకుంటున్నారు’
రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే పూరన్కు బంపరాఫర్.. కెప్టెన్గా ఎంపిక
ప్రపంచం మన మాట వినట్లేదేం?
కేవలం నకిలీ కరెన్సీ, నకిలీ సర్టిఫికెట్స్లాంటి కేసుల కోసమే ఏర్పాటు చేశారట... ఏదో నకిలీ కేసు పెట్టి వదిలేయమంటున్నార్సార్!
అలాగే ట్రంప్, మస్క్ ఎప్పుడు కొట్టుకుంటారో కూడా కాస్త చెబుతారా!
‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’
టీమిండియావైపు దూసుకొస్తున్న నయా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం
ఏడు జన్మలోనూ నువ్వే తోడుగా.. హనీమూన్ కపుల్ కేసులో షాకింగ్ ట్విస్ట్
ఒక్క లాడెన్కే కాదు! ప్రపంచంలో ఉన్న ప్రతి టెర్రరిస్టుకు ఇక్కడ మాత్రమే సేఫ్!
కొమ్మినేనిపై కేసు.. పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం
మీరిచ్చిన గూగుల్ మ్యాప్లో లోకేషన్ ఇదే చూపిస్తుంది సార్!
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలలో పురోగతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 241 మంది మృతి
ఇంట్లో బోర్ కొడుతోంది.. ఉండలేకపోతున్నా..!
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
సాక్షి కార్టూన్ 11-06-2025
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
సినిమా

Akhil-Zainab Reception: తమ్ముడి రిసెప్షన్.. అన్నావదినలదే హవా!
అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఇంట వరుస శుభాకార్యాలు జరిగాయి. గతేడాది చివర్లో నాగచైతన్య- శోభిత (Sobhita Dhulipala) పెళ్లి జరగ్గా ఇటీవల (జూన్ 6, 2025న) అఖిల్ వివాహం జరిగింది. బిజినెస్మెన్ జుల్ఫీ రవ్జీ కూతురు జైనబ్ను అఖిల్ (Akhil Akkineni) వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. ఈ వివాహ వేడుకను నాగార్జున సింపుల్గా ఇంట్లోనే జరిపించాడు. అయితే రిసెప్షన్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో గ్రాండ్గా జరిగింది. కొత్త జంటను ఆశీర్వదించేందుకు మహేశ్బాబు, రామ్చరణ్, సూర్య, యశ్, నిఖిల్, అల్లరి నరేశ్, సుకుమార్, బుచ్చిబాబు, తమన్.. ఇలా ఎంతోమంది వచ్చారు.రిసెప్షన్లో హైలైట్..ఈ ఫోటోలను అన్నపూర్ణ స్టూడియో అధికారిక ఎక్స్ (ట్విటర్) హ్యాండిల్లో రిలీజ్ చేశారు. తాజాగా నాగచైతన్య- శోభితల స్పెషల్ ఫోటోను వదిలారు. తమ్ముడి పెళ్లిలో చై సూటుబూటేసుకుని హుందాగా కనిపించగా శోభిత ఎరుపు చీరతో ఆకట్టుకుంది. ఈ చీరకు మ్యాచింగ్గా బంగారు వర్ణం బ్లౌజ్ను ధరించడంతో మరింత ట్రెండీగా కనిపించింది. అటు బరాత్లో చై.. డీజే దగ్గర సందడి చేస్తూ కనిపించాడు. చై సంబరం చూసిన నెటిజన్లు.. తమ్ముడి పెళ్లంటే ఆమాత్రం జోష్ ఉండాలిగా.. అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) My Demigod Marriage Vibes 🔥King Akhil Chay 🤯Energy Levels 💥#AkhilWedding #AkhilAkkineni pic.twitter.com/EEIhmEyWy5— King Srinu (@KingSrinu0120) June 6, 2025 చదవండి: ఇది నా జీవితంలో ఓ మైలురాయి.. సింగర్ సునీత ఎమోషనల్

నా గుండె పగిలింది.. మంచు విష్ణు కీలక నిర్ణయం
గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 మందికి పైగా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక టాలీవుడ్ హీరో మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ.. కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. ఇండోర్లో ఈవెంట్.. మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో రేపు(జూన్ 13) ఇండోర్లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. దానికి సంబంధించిన పనులు కూడా చకచక జరిగిపోతున్నాయి. భారీ ఎత్తున జరిగే ఈ ఈవెంట్లోనే ట్రైలర్ని కూడా విడుదల చేయాలనుకున్నారు. కానీ హఠాత్తుగా జరిగిన విమాన ప్రమాదం కారణంగా ఈవెంట్ని క్యాన్సిల్ చేశారు.నా గుండె పగిలింది.. విమాన ప్రమాదంపై మంచు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ప్రమాదం గురించి తెలియగానే నా గుండె పగిలిపోయింది. చాలా బాధగా ఉంది. కన్నప్ప ట్రైలర్ రిలీజ్ని ఒకరోజు వాయిదా వేస్తున్నాం. అలాగే ఇండోర్లో రేపు జరగాల్సిన ప్రీరిలీజ్ ఈవెంట్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’అని మంచు విష్ణు ట్వీట్ చేశాడు.

కీర్తి సురేశ్ కామెడీ ఎంటర్టైనర్.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'రివాల్వర్ రీటా'. ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా రూపొందిస్తోన్న ఈ చిత్రానికి జేకే చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించారు మేకర్స్. ప్రత్యేకంగా అనౌన్స్మెంట్ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ డేట్ ప్రకటించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న రివాల్వర్ రీటా వినాయక చవితి సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ కీర్తి సురేశ్ పోస్ట్ర్ను షేర్ చేశారు. తాజాగా విడుదలైన వీడియో చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రెడిన్ కింగ్స్లీ, మైమ్గోపీ, సెండ్రాయిన్, స్టంట్ మాస్టర్ సూపర్సుబ్బరాయన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థ కలిసి నిర్మిస్తున్నారు.ఇక బాలనటిగా రంగప్రవేశం చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ కీర్తి సురేశ్. మహానటిగా ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్రవేసుకుంది. కోలీవుడ్లో ఇదు ఎన్న మాయం చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్పుల్ హీరోయిన్గా పేరు తె చ్చుకుంది. హీరోయిన్గా తానేంటో నిరూపించుకున్న కీర్తి సురేశ్ టాలీవుడ్లో దివంగత నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన తెలుగు చిత్రం మహానటి పాత్రకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్నారు. అలా ఒక్కో అడుగేస్తూ ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. వరుణ్ ధావన్కు జంటగా బేబీజాన్ చిత్రంలో నటించారు. Rita is ready to roll babyyy 💥#RevolverRita from 27th August 🔥Tamil: 🔗https://t.co/hOuJQ0zOUkTelugu: 🔗https://t.co/pGTzJcx1Qz@Jagadishbliss @Sudhans2017 @realradikaa @dirchandru @PassionStudios_ @TheRoute @RSeanRoldan @dineshkrishnanb @Cinemainmygenes @dhilipaction… pic.twitter.com/TToEIXOLtg— Keerthy Suresh (@KeerthyOfficial) June 11, 2025

బొమ్మలా నిల్చున్న జైనబ్.. తమన్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) పెళ్లి సింపుల్గా, రిసెప్షన్ ఘనంగా జరిగింది. ప్రియురాలు జైనబ్ రవ్జీని అఖిల్ హిందూసాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. జూన్ 6న వెడ్డింగ్, 8న రిసెప్షన్ వేడుకలు జరిపారు. రిసెప్షన్లో ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.వీడియో 1జైనబ్ బొమ్మలా నిల్చుని ఉంటే ఓ యువకుడు తనకు చకచకా పెళ్లిచీర కట్టేశాడు. ఇది చూసిన జనాలు అయ్యో, జైనబ్కు చీర కట్టుకోవడం రాదా? అని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా సులువుగా ఆమెకు చీర కట్టేసిన యువకుడి నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు.వీడియో 2అఖిల్- జైనబ్ రిసెప్షన్కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా హాజరయ్యాడు. తన ఫ్రెండ్స్ గ్యాంగ్తో స్టేజీ ఎక్కిన తమన్.. ఫ్రెండ్కు ఊహించలేని బహుమతిచ్చాడు. క్రికెట్ బ్యాట్ను కానుకగా ఇచ్చాడు. దీంతో పెళ్లికూతురు సహా అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. అభిమానులు సైతం ఇదేం గిఫ్ట్రా నాయనా.. అని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి సినిమాల్లో తడబడుతున్న అయ్యగారు (అఖిల్) క్రికెట్లో మాత్రం నెం.1. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) టోర్నీలో తెలుగు వారియర్స్ జట్టు కెప్టెన్గా ఉన్నారు. తమన్ ఈ జట్టులోనే ఆడుతున్నాడు. Bro wait .! 🙄 pic.twitter.com/3InivJmTjc— 🕴🏼 (@kaali02) June 11, 2025 Thaman gifted a cricket bat to #AkhilAkkineni at his reception! pic.twitter.com/Mu914iRI2a— Movies4u Official (@Movies4u_Officl) June 11, 2025 చదవండి: ఆ హీరోయిన్ను సీక్రెట్గా ఫాలో అవుతున్నా.. ఆమె చాలా స్పీడు
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

ఇంగ్లండ్తో తొలి టెస్టు.. భారత తుది జట్టు ఇదే! జడేజాకు నో ఛాన్స్?
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభానికి కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది.ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో శుభారంభం చేయాలని శుబ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలో తొలి టెస్టు కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఎంచుకున్నాడు. బంగర్ తన ఎంపిక చేసిన తుది జట్టులో ఓపెనర్లగా యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్కు అవకాశమిచ్చాడు.రోహిత్ శర్మ స్ధానంలో ఓపెనర్గా రాహుల్ సరైనోడని స్టార్ స్పోర్ట్స్ చర్చాకార్యక్రమంలో బంగర్ అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా ఫస్ట్ డౌన్లో ఆన్క్యాప్డ్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్కు అతడు ఛాన్స్ ఇచ్చాడు. ఇక నాలుగో స్ధానంలో కెప్టెన్ శుబ్మన్ గిల్ బ్యాటింగ్కు రావాలని సంజయ్ సూచించాడు.ఇక ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్కు ఐదో స్ధానంలో ఈ భారత మాజీ క్రికెటర్ చోటు ఇచ్చాడు. ఈ జట్టులో వికెట్ కీపర్గా రిషబ్ పంత్, ఆల్రౌండర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డిలకు స్ధానం దక్కింది. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్.. ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, సిరాజ్ను బంగర్ ఎంపిక చేశాడు.అయితే ఈ మాజీ బ్యాటింగ్ కోచ్ ఎంపిక చేసిన జట్టులో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కకపోవడం గమనార్హం. జడేజాతో పాటు యువ సంచలనం సాయిసుదర్శన్ను కూడా అతడు పరిగణలోకి తీసుకోలేదు.ఇంగ్లండ్తో తొలి టెస్టుకు బంగర్ ఎంచుకున్న భారత తుది జట్టుయశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్మన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్,జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, సిరాజ్చదవండి: Wtc Final 2025: నిలకడగా ఆడుతున్న బావుమా, బెడింగ్హామ్

WTC Final 2025: నిప్పులు చెరుగుతున్న ప్రోటీస్ పేసర్లు.. కష్టాల్లో ఆసీస్
ఆలౌట్ దిశగా ఆస్ట్రేలియా.. ప్యాట్ కమ్మిన్స్ రూపంలో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన కమ్మిన్స్.. ఎంగిడీ బౌలింగ్లో బౌల్డయ్యాడు. 27 ఓవర్లకు ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. ఆసీస్ ప్రస్తుతం 152 పరుగుల ఆధిక్యంలో కొసాగుతోంది. ఆసీస్ ఆరో వికెట్ డౌన్..ట్రావిస్ హెడ్ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన హెడ్.. ముల్డర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.నిప్పులు చెరుగుతున్న ప్రోటీస్ పేసర్లు.. కష్టాల్లో ఆసీస్రెండో ఇన్నింగ్స్లో సైతం సౌతాఫ్రికా పేసర్లు నిప్పులు చెరుగుతున్నారు. ప్రోటీస్ బౌలర్ల దాటికి ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కడుతున్నారు. వెబ్స్టెర్ రూపంలో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన వెబ్స్టెర్ ఎంగిడీ బౌలింగ్లో ఔటయ్యాడు. 23 ఓవర్లకు ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది.ఆసీస్ నాలుగో వికెట్ డౌన్..స్టీవ్ స్మిత్ రూపంలో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన స్మిత్.. లుంగీ ఎంగిడీ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు.ఆసీస్ మూడో వికెట్ డౌన్మార్నస్ లబుషేన్ రూపంలో ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన లబుషేన్.. జానెసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 18. 4 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 48/3ఆసీస్ రెండో వికెట్ డౌన్కామెరూన్ గ్రీన్(0) రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్లో గ్రీన్ స్లిప్లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 12 ఓవర్లకు ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్(4), లబుషేన్(16) ఉన్నారు.ఆసీస్ తొలి వికెట్ డౌన్ఉస్మాన్ ఖవాజా రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ఖవాజా.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి గ్రీన్ వచ్చాడు.నిలకడగా ఆడుతున్న ఆసీస్ ఓపెనర్లు..ఆస్ట్రేలియా తమ సెకెండ్ ఇన్నింగ్స్లో నిలకడగా ఆడుతోంది. 9 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్(15), ఖవాజా(4) ఉన్నారు. ఆసీస్ ప్రస్తుతం 98 పరుగుల ఆధిక్యం కొనసాగుతోంది.138 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్లార్డ్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు సైతం చేతులేత్తేశారు. ఆసీస్ బౌలర్ల దాటికి సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 138 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 6 వికెట్లు పడగొట్టి ప్రోటీస్ పతానాన్ని శాసించాడు. అతడితో పాటు స్టార్క్ రెండు వికెట్లు, హాజిల్వుడ్ వికెట్ సాధించారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో బెడింగ్హామ్(45) టాప్ స్కోరర్గా నిలిచాడు.కమ్మిన్స్ ఆన్ ఫైర్.. సౌతాఫ్రికా ఏడో వికెట్ డౌన్లంచ్ బ్రేక్ అనంతరం ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ నిప్పులు చేరుగుతున్నాడు. 52వ ఓవర్ వేసిన కమ్మిన్స్.. మూడో బంతికి వెర్రియిన్ను పెవిలియన్కు పంపగా.. ఆఖరి బంతికి జానెసన్ను ఔట్ చేశాడు. 52 ఓవర్లకు సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది.లంచ్ బ్రేక్కు దక్షిణాఫ్రికా స్కోరంతంటే?ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇంకా 91 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో బెడింగ్హామ్(39),వీర్రెయిన్(9) ఉన్నారు.సౌతాఫ్రికా ఐదో వికెట్ డౌన్.. కెప్టెన్ బావుమా ఔట్టెంబా బావుమా రూపంలో సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన బావుమా.. కమ్మిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు.నిలకడగా ఆడుతున్న బావుమా, బెడింగ్హామ్35 ఓవర్లకు సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. బెడింగ్హామ్(17 బ్యాటింగ్), బావుమా(36 బ్యాటింగ్) నిలకడగా ఆడుతున్నారు.27 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 66/427 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. క్రీజులో బావుమా(17), బెడింగ్హమ్(17) ఉన్నారు.లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఆసీస్ బౌలింగ్ ఎటాక్ను మిచెల్ స్టార్క్ ప్రారంభించాడు. క్రీజులో ప్రస్తుతం ప్రోటీస్ కెప్టెన్ టెంబా బావుమా(3), బెడింగ్హామ్(8) ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 22 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు బ్యాటింగ్కు చేసిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 56.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. బ్యూ వెబ్స్టర్ (92 బంతుల్లో 72; 11 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (112 బంతుల్లో 66; 10 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ 5 వికెట్లు పడగొట్టగా... మార్కో యాన్సెన్ 3 వికెట్లు తీశాడు.

శుభ్మన్ గిల్ ఓవరాక్షన్.. సచిన్, కోహ్లి కూడా ఎప్పుడూ అలా చేయలేదు..!
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియా నయా కెప్టెన్ శుభ్మన్ గిల్పై విమర్శలు వస్తున్నాయి. గిల్ ఓ ఫోటో షూట్లో తనను స్పాన్సర్ చేస్తున్న ఎంఆర్ఎఫ్ కంపెనీ బ్యాట్తో దర్శనమిచ్చాడు. ఇందులో తప్పేముంది అని అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి.ఎంఆర్ఎఫ్ కంపెనీ క్రికెట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చే ఆటగాళ్లకు స్పాన్సర్ చేస్తూ వస్తుంది. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, ప్రస్తుతం శుభ్మన్ గిల్ లాంటి స్టార్ ఆటగాళ్లకు ఈ కంపెనీ స్పాన్సర్గా వ్యవహరిస్తూ వచ్చింది. వీరంతా ఎంఆర్ఎఫ్ స్టిక్కర్లు ముద్రించిన బ్యాట్లను వినియోగిస్తారు.తమతో ఒప్పందంలో ఉన్న ఆటగాళ్లకు ఎంఆర్ఎఫ్ ఛాంపియన్, జీనియస్, మాస్టర్ లాంటి బిరుదులు ఇచ్చింది. వీటిని ఆటగాళ్ల బ్యాట్లపై కంపెనీ స్టిక్కర్తో పాటు ముద్రిస్తుంది. జీనియస్ అన్న పదాన్ని ఎంఆర్ఎఫ్ చాలాకాలం పాటు వాడింది. సచిన్, లారా, డివిలియర్స్, విరాట్ ఎంఆర్ఎఫ్ జీనియస్ అనే స్టిక్కర్లు ఉన్న బ్యాట్లు అధికంగా వాడారు.ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్కు ముందు గిల్తో ఒప్పందం చేసుకున్న ఎంఆర్ఎఫ్.. అతనికి కూడా జీనియస్ అన్న బిరుదును కొనసాగించింది. ఇక్కడి వరకు అంతా బాగుంది.గిల్ ఇటీవల టీమిండియా కొత్త కిట్ ఆవిష్కరణ సందర్భంగా ఎంఆర్ఎఫ్ లోగో ఉన్న బ్యాట్తో ఫోటో షూట్కు అటెండ్ అయ్యాడు. బీసీసీఐ అధికారికంగా విడుదల చేసిన ఈ ఫోటోల్లో కొందరు నెటిజన్లు గిల్ బ్యాట్పై ఎంఆర్ఎఫ్ జీనియస్ స్టిక్కర్తో పాటు ప్రిన్స్ అని ముద్రించడాన్ని గమనించారు.ఇదే గిల్పై విమర్శలకు దారి తీసింది. క్రికెట్లో ఎంతో సాధించిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి కూడా తమ బ్యాట్లపై తమ బిరుదులైన గాడ్, కింగ్ అన్న పదాలను ఎప్పుడూ ముద్రించుకోలేదు. గిల్ ఏవరో కొందరు ప్రిన్స్ అనగానే, ఆ పదాన్ని తన బ్యాట్పై ముద్రించుకున్నాడని విమర్శిస్తున్నారు. 🚨The Overhyped "Prince" of Indian Cricket🚨Shubman Gill is so self-obsessed. Who even called you the Prince? A so-called 'Prince of ICT with a poor SENA record, a below 35 Test average, and zero overseas centuries across all formats after 5 years in his international career. pic.twitter.com/SKxiUKT0pa— Niik (@Niiki099) June 11, 2025వాస్తవానికి ప్రిన్స్ అన్న బిరుదు మొదట లారా ఉండిందన్న విషయాన్ని 90 దశకంలోని అభిమానలు గుర్తు చేస్తున్నారు. గిల్ ప్రిన్స్ అన్న బిరుదుకు అర్హుడు కాదని అతని వ్యతిరేకులు కామెంట్లు చేస్తున్నారు. గిల్ ఏం సాధించాడని అతనికి ప్రిన్స్ అన్న బిరుదు అని ప్రశ్నిస్తున్నారు. గిల్కు టెస్ట్ల్లో 35 కంటే తక్కువ సగటు ఉందని గుర్తుకు చేస్తున్నారు. SENA దేశాల్లో అతనికి చెత్త రికార్డు ఉందని ప్రస్తావిస్తున్నారు. ఐదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో విదేశాల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదని అని గుర్తు చేస్తున్నారు. ఆటగాళ్లకు బిరుదులను విశ్లేషకులు, దిగ్గజాలు ఇస్తారు. సోషల్మీడియాలో సొంత డబ్బాను బట్టి బిరుదులు రావంటూ మండిపడుతున్నారు. Sachin Tendulkar never played with a bat that had "God" written over it and Virat Kohli never played with a bat that had "King" written over it. You get tags with your performances and the tags are given by the greats of the game and not from the social media.— Cricket🏏 Lover // ICT Fan Account (@CricCrazyV) June 11, 2025గిల్ తన సొంతంగా బ్యాట్పై ప్రిన్స్ అన్న పదం ముద్రించుకున్నాడో లేక ఎంఆర్ఎఫ్ కంపెనీనే ఆ పదాన్ని ముద్రించిందో తెలియలేదు. కాగా, గిల్ ఇంగ్లండ్ పర్యటనకు ముందే టీమిండియా టెస్ట్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ ఆకస్మిక రిటైర్మెంట్తో గిల్కు ఈ అదృష్టం వరించింది.

WTC Final 2025: చరిత్ర సృష్టించిన స్టార్క్.. షమీ రికార్డును చెరిపేశాడు
ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ పేరిట ఉన్న ఓ ఆల్టైమ్ రికార్డును చెరిపేశాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న 2023-2025 డబ్ల్యూటీసీ ఫైనల్లో 2 వికెట్లు తీయడంతో ఐసీసీ ఫైనల్స్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరించాడు. స్టార్క్ ఇప్పటివరకు 5 ఐసీసీ ఫైనల్స్ ఇన్నింగ్స్ల్లో 11 వికెట్లు తీశాడు. 2015 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో రెండు వికెట్లు తీసిన స్టార్క్.. 2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగు, 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో మూడు, ప్రస్తుతం జరుగుతున్న 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండు వికెట్లు తీశాడు.గతంలో ఈ రికార్డు షమీ పేరిట ఉండేది. షమీ ఐసీసీ ఫైనల్స్లో 6 ఇన్నింగ్స్ల్లో 10 వికెట్లు తీశాడు. ఐసీసీ ఫైనల్స్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో స్టార్క్, షమీ తర్వాతి స్థానాల్లో ట్రెంట్ బౌల్ట్ (5 ఇన్నింగ్స్ల్లో 8 వికెట్లు), రవీంద్ర జడేజా (10 ఇన్నింగ్స్ల్లో 8), కైల్ జేమీసన్ (3 ఇన్నింగ్స్ల్లో 8) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ జరుగుతుంది. నిన్న (జూన్ 11) మొదలైన ఈ టైటిల్ పోరులో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రబాడ (5/51), జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) చెలరేగడంతో ఆసీస్ రెండు సెషన్లలోపే 212 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్స్టర్ (72) అర్ద సెంచరీలతో ఆదుకోవడంతో ఆసీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ఆసీస్ బ్యాటర్లలో అలెక్స్ క్యారీ (23), లబూషేన్ (17), ట్రవిస్ హెడ్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. గ్రీన్ (4), కమిన్స్ (1), స్టార్క్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ లియోన్ డకౌట్లయ్యారు.ఆసీస్ను తక్కువ స్కోర్కే పరిమితం చేసిన ఆనందం సౌతాఫ్రికాకు ఎంతో సేపు నిలబడలేదు. తొలి ఓవర్నే వికెట్ (మార్క్రమ్) కోల్పోయిన ఆ జట్టు మరో 20 ఓవర్ల వ్యవధిలో కేవలం 30 పరుగులు మాత్రమే చేసి మొత్తం నాలుగు వికెట్లు చేజార్చుకుంది. స్టార్క్ (2/10), హాజిల్వుడ్ (1/10), కమిన్స్ (1/14) నిప్పులు చెరిగే బంతులతో సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఒక్కో పరుగు చేసేందుకు సౌతాఫ్రికా బ్యాటర్లు నానా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం క్రీజ్లో ఉన్న బవుమా అయితే ఖాతా తెరిచేందుకు ఏకంగా 31 బంతులు తీసుకున్నాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో మార్క్రమ్ డకౌట్ కాగా.. రికెల్టన్ 16, ముల్దర్ 6, స్టబ్స్ 2 పరుగులకు ఔటయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా స్కోర్ 43/4గా ఉంది. బవుమాతో (3) పాటు బెడింగ్హమ్ (8) క్రీజ్లో ఉన్నాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు సౌతాఫ్రికా ఇంకా 169 పరుగులు వెనుకపడి ఉంది.
బిజినెస్

కొత్త వ్యాక్సిన్ తయారీకి భారత్ బయోటెక్, జీఎస్కే భాగస్వామ్యం
వ్యాక్సిన్ ఆవిష్కరణలో గ్లోబల్ లీడర్గా ఉన్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) జీఎస్కే పీఎల్సీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలను ప్రభావితం చేస్తున్న తీవ్రమైన బ్యాక్టీరియల్ డయేరియా అయిన షిగెల్లోసిస్ను పరిష్కరించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని ఇరు సంస్థలు తెలిపాయి.డయేరియా వ్యాధికి కారణం అవుతున్న షిగెల్లా అనే బ్యాక్టీరియా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది. దాని తీవ్రత, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎమ్ఆర్-మందులను తట్టుకునే స్వభావం)పై ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే షిగెల్లాను కట్టడి చేసేందుకు ఇప్పటివరకు లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ లేదు. క్లినికల్ ట్రయల్స్, రెగ్యులేటరీ అనుమతుల ద్వారా ఈ బ్యాక్టీరియాకు విరుగుడుగా ‘ఆల్ట్సాన్ఫ్లెక్స్ 1-2-3’ను అభివృద్ధి చేయడానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్), జీఎస్కే పీఎల్సీ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.వ్యాక్సిన్ అభివృద్ధికి జీఎంఎంఏ టెక్నాలజీజనరలైజ్డ్ మాడ్యూల్స్ ఫర్ మెంబ్రేన్ యాంటిజెన్స్ (జీఎంఎంఏ) టెక్నాలజీని ఈ వ్యాక్సిన్ కోసం ఉపయోగిస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి బ్యాక్టీరియా బాహ్య పొరలను ఉపయోగించే వినూత్న విధానం. ఈ చౌకైన తయారీ ప్రక్రియ ద్వారా టీకాను మరింత తక్కువ ధరల్లో అందించవచ్చని తెలిపింది.క్లినికల్ ట్రయల్స్..యూరప్లో మొదటి దశ ట్రయల్స్ అనుకూలంగా వచ్చాయని భారత్ బయోటెక్ తెలిపింది. ఆఫ్రికాలో రెండో దశ ట్రయల్స్లో 9 నెలల చిన్నారులపై ఎలాంటి భద్రతా సమస్యలు కనిపించలేదని పేర్కొంది. వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి లక్ష్యాలను చేరుకున్నట్లు 2024 నుంచి మధ్యంతర ఫలితాలు ధ్రువీకరిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఫేజ్ 3 ట్రయల్స్ జరుగుతున్నట్లు చెప్పింది. త్వరలో ఈ వ్యాక్సిన్ను వినియోగదారులకు అందిస్తామని ధీమా వ్యక్తం చేసింది.ఇదీ చదవండి: ‘ఏటా రూ.50 లక్షలు సరిపోతుందా?’ అంటూ పోస్ట్రోటావైరస్, టైఫాయిడ్, పోలియో, కలరా, సాల్మొనెల్లా వంటి డయేరియా వ్యాధి వ్యాక్సిన్లలో కంపెనీ నాయకత్వాన్ని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా వివరించారు. యాంటీమైక్రోబయల్ నిరోధకతను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పేద జనాభాకు సరసమైన ధరలకు వ్యాక్సిన్ అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ తయారీకి జీఎస్కేతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ప్రపంచ ఆరోగ్యంపట్ల సంస్థ నిబద్ధతను హైలైట్ చేస్తుందని చెప్పారు.

అమెరికా బడ్జెట్ లోటుకు 5 నిమిషాల్లో పరిష్కారం ఇదే..!
అమెరికా బడ్జెట్ లోటుతో సతమతమవుతోంది. ఏటా వసూళ్లు చేసే ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తోంది. యూఎస్ జాతీయ రుణం జూన్ 2025 నాటికి 33.8 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంక్షోభం మధ్య దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ విప్లవాత్మక ఆలోచనను పంచుకున్నారు. అందుకు ప్రముఖుల మద్దతు లభిస్తుంది. యూఎస్ ఆర్థిక లోపాలను సరిచేసేందుకు సీఎన్బీసీ ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్ పరిష్కారాన్ని ప్రతిపాదించారు.‘నేను అమెరికా ఆర్థిక లోటును ఐదు నిమిషాల్లో ముగించగలను. జీడీపీలో 3 శాతం కంటే ఎక్కువ లోటు ఉంటే కాంగ్రెస్ సిట్టింగ్ సభ్యులందరూ తిరిగి ఎన్నిక కావడానికి అనర్హులని చట్టం చేస్తే సరిపోతుంది’ అని వారెన్ బఫెట్ అన్నారు. ఈ క్లిప్ వైరల్ కావడంతో వాషింగ్టన్లో తీవ్ర చర్చ మొదలైంది. ఉటా సెనేటర్ మైక్ లీ ఈ వీడియోను ఎక్స్లో తిరిగి పోస్ట్ చేశారు. ‘మీరు ఈ ఆలోచనలకు మద్దతు ఇస్తారా?’ అని టెస్లా సీఈఓ ఎలాన్మస్క్ను అడిగారు. దాంతో మస్క్ 100 శాతం మద్దతు తెలుపుతానని, ఇదే మార్గమని చెప్పారు.ఇదీ చదవండి: ‘ఏటా రూ.50 లక్షలు సరిపోతుందా?’ అంటూ పోస్ట్ఆర్థికవేత్త పీటర్ షిఫ్ స్పందిస్తూ..‘వారెన్ బఫెట్ ఆలోచనలు బ్రూటల్.. కానీ బ్రిలియంట్. ద్రవ్యోల్బణం 3% దాటినప్పుడల్లా కాంగ్రెస్లోని ప్రతి సభ్యుడిని తొలగించడానికి నేను రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తున్నాను. ఒక దేశం మొత్తం ద్రవ్యోల్బణం ముసుగులో బాధపడటం కంటే రాజకీయ నాయకులను అనర్హులుగా ప్రకటించడం మంచిది’ అని తెలిపారు.

‘ఏటా రూ.50 లక్షలు సరిపోతుందా?’ అంటూ పోస్ట్
ప్రముఖ కంపెనీ, సరిపడే అనుభవం, నైపుణ్యాలు ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు జీతాలు రూ.లక్షల్లో ఉంటాయని తెలిసిందే కదా. అయితే పెరుగుతున్న జీవనశైలి, ఖర్చులకుతోడు బెంగళూరు వంటి లివింగ్ కాస్ట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ జీతం ఏమాత్రం సరిపోదని కొందరు అభిప్రాయపడుతున్నారు.అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగంలో బెంగళూరులో నివసిస్తున్నవారికి సంవత్సరానికి రూ.50 లక్షలు (ఎల్పీఏ) సరిపోతుందా.. అని సామాజిక మాధ్యమాల వేదికగా టెకీలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కొందరికి రూ.50 లక్షలు ఇస్తున్నా దాని విలువ సగానికి తగ్గి రూ.25 లక్షలకు సమానమైందా? అంటూ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ధ్రువీకరించాలని కోరుతున్నారు. అవికాస్తా వైరల్గా మారుతున్నాయి.ఇదీ చదవండి: ‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’సౌరవ్ దత్తా అనే టెకీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ..‘బెంగళూరు ఐటీ పరిశ్రమలో చాలా మంది రూ.50 ఎల్పీఏ సంపాదిస్తున్నారని విన్నాను. వారు పెరిగిన సీటీసీ లేదా రూ.50 ఎల్పీఏ రూ.25 ఎల్పీఏతో సమానమని చెబుతున్నారు. కొంతమంది టెక్కీలు ధ్రువీకరించగలరా?’ అని కోరారు. అందుకు ప్రతిస్పందనగా నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. రూ.50 ఎల్పీఏ కూడా నగరంలోని హై కాస్ట్ టెక్ వాతావరణంలో సరిపోదని కొందరు పేర్కొన్నారు. ‘రూ.50 ఎల్పీఏ ప్రస్తుతం రూ.10 ఎల్పీఏతోనే సమానం. చాలా మంది రూ.1 కోటి కంటే ఎక్కువే సంపాదిస్తున్నారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. బెంగళూరులో రూ.1 కోటి కంటే ఎక్కువ సంపాదించకపోతే సమయం వృథా అని మరొకరు కామెంట్ చేశారు. సామాన్లు ప్యాక్ చేసుకుని వెళ్లిపోవడమే బెటర్ అని సూచించారు.

పసిడి మళ్లీ పైపైకి.. తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే పసిడి ధరలు ఈ రోజు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో గురువారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.91,000 (22 క్యారెట్స్), రూ.99,280 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.800, రూ.880 పెరిగింది.చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.800, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.880 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.91,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.99,280 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.800 పెరిగి రూ.91,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.880 పెరిగి రూ.99,430 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా గురువారం వెండి ధర(Silver Prices)లు తగ్గాయి. కేజీ వెండి రేటు నిన్నటితో పోలిస్తే రూ.100 క్షీణించింది. దాంతో కేజీ సిల్వర్ ధర రూ.1,18,900గా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ

To day recipes :మోకాళ్ల నొప్పులకు బెస్ట్ ఇది, మరి జీర్ణశక్తికి!
మన పెద్దల నాటి వంటకం ఇది. ఇపుడంటే చాలామంది మర్చిపోయారు కానీ, మన అమ్మమ్మలు తాతల కాలంలో బాగా ప్రాచుర్యం సంపాదించుకున్నదే. అదే నల్లేరు పచ్చడి. నల్లేరును సాధారణంగా కూరగాయల పాదులపై వాడేవారు. ఉడతలు, తొండలు పూత , పిందెలను కొరికి పాడు చేయకుండా దీన్ని పాదులపై ఉంచేవారు. అయితే నల్లేరు పచ్చడిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నల్లేరు ప్రధానంగా పచ్చడి తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయనీ, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతారు. మరి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా ఈ రోజు నల్లేరు కాడల పచ్చడి, పోషకాలు అందించే వామ్ము ఆకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా.నల్లేరు పచ్చడి కావలసిన పదార్థాలు:నల్లేరు కాడలు (మరీ ఫ్రెష్గా కాకుండా, కాస్త వడిలితే దురదలు రావు) మిర్చి, ఉల్లిపాయలు, టమోటా, పసుపు, కారం, నూనె, చింతపండు, ఉప్పు, తాలింపు కోసం ఆవాలు, శెనగపప్పు, మెంతులు, కరివేపాకు. తయారీ: ముందుగా నల్లేరు కాడలనును శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కడిగేటపుడు చేతులకు గ్లౌజులు వాడటం మంచిది. లేదంటే చేతులు దురదలొస్తాయి. ఎండుమిర్చి, ఉల్లిపాయ, టమోటా(ఇవి ఆప్షనల్) కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇపుడు ఒక పాన్ లో నూనె వేసి, మిర్చి, ఆవాలు, శెనగపప్పు, మెంతులు, కరివేపాకు వేసి వేయించాలి. తాలింపు వేగిన తర్వాత, నల్లేరు ముక్కలు, ఉల్లిపాయలు, టమోటా ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. చిటికెడు పసుపు, కారం, రవ్వంత చింతపండు ఉప్పు వేసి మరికొద్దిసేపు మగ్గించాలి. చల్లారిన తరువాత మెత్తగా రోటిలో (మిక్సీ అయినా పరవాలేదు) దంచుకోవాలి. రుచిచూసుకొని, చివరగా ఇంగువ, ఎండుమిర్చితో పోపు వేసుకుంటే కమ్మని నల్లేరు పచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో గానీ, రాగి సంగటిలో గానీ కాస్తంత నెయ్యివేసుకుని తింటే ఆహా అనాల్సిందే. రొట్టె, లేదా చపాతీతో గానీ తినవచ్చు. ఇదీ చదవండి: Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే.. వామ్ము ఆకు ఇడ్లీ పచ్చడికావలసిన పదార్థాలు: వామ్ము ఆకులు, పచ్చి మిరపకాయలు,పుట్నాల పప్పు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా, ఉప్పు, చింతపండు, కొత్తిమీర పోపుదినుసులు,తయారీ: ముందుగా ప్యాన్ పెట్టుకుని, చింతపండు, పోపు దినుసులు వేసి వేగిన తరువాత పుట్నాల పప్పువేసి , ఆతరువాత శుభ్రవంగా కడిగిపెట్టుకున్న వామ్ము ఆకులువేయాలి. దీంతోపాటు శుభ్రం చేసుకున్న చింతపండు కూడా వేయాలి. నిమిషంలో వామ్ము ఆకులు మగ్గిపోతాయి. దీన్ని చల్లారిన తరువాత పచ్చి వెల్లుల్లి, చిటికెడు పసుపు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పోపు గింజలువేసి, కొంచెం చిటపటలాడనిచ్చి వాము ఆకుల పచ్చడిని వేసుకోవాలి. ఆపైన శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తమీర జల్లుకుంటే...నోరూరించే వామ్మాకు పచ్చడి రెడీ! ఇది జీర్ణ శక్తికి చాలామంచిది.

వసివాడుతున్న బాల్యం..
అభంశుభం తెలియని చిన్నారులు ఆడుతూ పాడుతూ గంతులేయాల్సిన వయసులో కుటుంబ బాధ్యతలు మోస్తున్నారు. బడికి పోవాల్సిన బాలలు బండెడు చాకిరీలో మగ్గిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బడి ముఖం చూడని బాలలు 20 కోట్ల పైనే అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇంకా లెక్కల్లోకి రాని వారెందరో..మన దేశంలోనే ప్రతి ముగ్గురిలో ఒకరు బడి ముఖం చూడని వారున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు పిల్ల లను పనిలో పెట్టేలా ప్రోత్సహిస్తుండడంతో..వ్యాపార వర్గాల వారు కూడా తక్కువ వేతనంతో ఎక్కువ పనిని బాలలతో చేయిస్తున్నారు. కొందరు బాలలైతే ప్రమాదకర పరిస్థితుల్లో కూడా పనులు చేస్తూ బాల్యాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. నేడు ప్రపంచ బాల కార్మిక నిర్మూలన దినం సందర్భంగా.. బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారుల వెతలపై ప్రత్యేక కథనం.. విజయనగరం గంటస్తంభం: చిన్న వయస్సులోనే పనులు చేస్తున్న బాల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కనీసం ప్రాథమిక విద్య కూడా పొందకుండానే కార్మికులుగా మారుతున్నారు. వారిలో పోషకార లోపం కారణంగా శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండడం లేదు. అనేక మానసిక, శారీరక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. యాజమాన్యాలు బాల కార్మికులతో ఎక్కువ పనిచేయిస్తూ, తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. కొంతమంది బాలలు వారి సామర్థ్యానికి మించి పనులు చేయాల్సి వస్తోంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రమాదకర పరిస్ధితుల్లో సైతం బాలలు పనిచేస్తున్నారు. బాలకార్మికులు భౌతిక, లైంగిక దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని అనేక నివేదికలు వివరిస్తున్నాయి.భవిష్యత్ అంధకారం.. బాల కార్మికులుగా కొనసాగిన వారు భవిష్యత్లో ఉ న్నతమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. వారికి సరైన విద్య లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. పోటీతత్వం నిండిన సమాజంలో అన్నిరకాలుగా వెననుకబడిపోతున్నారు. పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారు. ఏటా బాలకార్మిక వ్యతిరేక దినం ఏటా జూన్ 12న దాదాపు 100 దేశాల్లో బాల కార్మికుల వ్యతిరేక దినం నిర్వహిస్తారు. బాలకారి్మక వ్యవస్థకు వ్యతిరేకంగా అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుకత ఆధ్వర్యంలో ఈ దినాన్ని నిర్వహిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం పిల్లలు ఏదో ఒక పనిలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాలు, పట్టణల్లో పనులు ఎక్కువగా లభిస్తున్నందున చిన్నారుల వలసలు కొనసాగుతున్నాయి. అలా మారడానికి కారణం అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం వంటి కారణాలతో బడి ఈడు పిల్లలు చదువుకు దూరమవుతున్నారు.బాలలను పనిలో పెడితే...కఠిన చర్యలుబాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాధ్యత అందరిపై ఉంది. చిన్నారులను పనిలో పెట్టినా, వారితో పనులు చేయించినా చట్టారీత్యా నేరం. బాల కార్మికులు ఎక్కడ కనిపించినా 1098, 100, 112 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నాం. విజయనగరం జిల్లాలో అన్ని శాఖల వారీగా 2020–24 సంవత్సరాల మధ్య మొత్తం 576 పిల్లలను రక్షించాం. ఈ ఏడాది జూన్ 1తేదీ నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్ జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, కూడళ్లు, ఇటుక బట్టీలు, మోకానిక్ షెడ్లు, వస్త్ర దుకాణాలు తదితర ప్రాంతాల్లో ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ప్రతి బుధవారం బాలకారి్మకుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. ఈనెల 31 వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుంది. చిన్నారులను పనులకు పంపిస్తే జరిగే అనర్థాలు, చట్టాలపై గ్రామాల్లోనూ అవగాహన కల్పిస్తున్నాం. ఎస్డీవీ ప్రసాదరావు, జిల్లా కార్మికశాఖ ఉప కమిషనర్ (చదవండి: ఆటో డ్రైవర్ స్టోరీ..! చిన్న ఐడియాతో నెలకు ఏకంగా రూ. 5 లక్షలు పైనే..)

ఏ సమయంలో ఏ దేవుణ్ణి పూజించాలి?
సూర్య భగవానుని 4.30 నుంచి ఆరులోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతీ. ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుని, దుర్గను పూజించిన మంచి ఫలం కలుగుతుంది. మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయస్వామిని పూజించిన హనుమ కృపకు మరింత పాత్రులగుదురు. రాహువును సాయంత్రం మూడుగంటలకు పూజించిన మంచి ఫలితం కలుగుతుంది. సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన వేళ. రాత్రి ఆరు నుంచి తొమ్మిదివరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణా కటాక్షాలు లభిస్తాయి. తెల్లవారు జామున మూడు గంటలకు శ్రీమహావిష్ణువును పూజిస్తే వైకుంఠవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది.చదవండి: Murudeshwar Temple Facts: కోరిక కోర్కెలు తీర్చే పరమ పావన క్షేత్రంబౌద్ధవాణి : ఆ గౌరవం అనుభవానికే..! ఒక అడవిలో ఏనుగు, కోతి, తిత్తిరి పిట్ట స్నేహంగా జీవిస్తున్నాయి. ప్రతిరోజూ మూడూ ఒకచోట చేరి సాధక బాధలు చెప్పుకునేవి. తాము గడించిన అనుభవాలు పంచుకునేవి. ఒకరోజున వాటికి ఒక ఆలోచన వచ్చింది. మన ముగ్గురిలో జ్ఞానులు ఎవరు? పెద్ద ఎవరు? పెద్దవారు ఎవరైతే వారికి మిగిలిన ఇద్దరూ నమస్కరించాలి. గౌరవించాలి’’ అని అనుకున్నాయి. అప్పుడు ఏనుగు– ‘‘మీ ఇద్దరికంటే నేనే పెద్దను. గౌరవనీయుడను. ఎందుకంటే ఇదిగో ఈ మర్రిచెట్టు ఇప్పుడు మహావృక్షంగా ఉంది. కానీ ఈ చెట్టు చిన్న మొక్కగా ఉన్నప్పుడే నాకు తెలుసు. నేను ఆ మొక్క మీదినుండి నడిచి΄ోయేవాణ్ణి. అప్పుడు దాని చివరి కొమ్మలు నా పొట్టకు తాకుతూ ఉండేవి’’ అని చెప్పింది. ఆ మాటలు విన్న కోతి– ‘‘ఓ! మిత్రమా! అలాగా! ఐతే విను. ఈ చెట్టు చిన్న మొక్కగా ఉన్నప్పటినుంచే నాకు తెలుసు. నేను కూర్చొని దీని చిగుర్లు తినేదాన్ని. కాబట్టి నేనే పెద్దను. నన్నే గౌరవించాలి’’ అంది. ఆ రెండింటి మాటలు విన్న తిత్తిరి పిట్ట నవ్వుతూ– ‘‘మిత్రులారా! ఈ చెట్టుకు తల్లి వృక్షం నదీతీరం ఆవల గట్టున ఉంది. దాని కాయలు తిని, ఇటుగా వచ్చి ఇక్కడ రెట్ట వేశాను. అందులోని విత్తనమే ఈ చెట్టుగా మొలిచింది’’అంది. మిగిలిన రెండూ ఆశ్చర్యపడి– ‘‘మిత్రమా! మా ఇద్దరికీ ఈ ఒక్క చెట్టే తెలుసు. నీకు ఈ చెట్టు, దాని ముందరి తరం చెట్టూ తెలుసు. తరతరాల అనుభవం నీది. కాబట్టి నీవే గౌరవనీయుడవు’’అని తిత్తిరికి నమస్కరించాయి. బుద్ధుడీ కథ చెప్పి– ‘‘భిక్షువులారా! పెద్దల్ని మనం అందుకే గౌరవించాలి. మనం వారికి ఇచ్చే గౌరవం వారి వయస్సుకే కాదు, అనుభవానికి’’ అని చెప్పాడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్

ఉత్త డబ్బారాయుడు : ఇలాంటి భర్తతో జీవితాంతం ఎలా?
నాకు గత ఏడాది పెళ్లయింది. నా భర్త ప్రభుత్వ ఉద్యోగి. పెళ్ళి అయిన మొదటి రోజు నుంచి నేను గమనించిందేమిటంటే... ఆయన తన గురించి తాను విపరీతంగా గొప్పలు చెప్పకుంటారు. మిగిలిన వాళ్ళని మనుషులుగా కూడా చూడరు. నాఒక్క దానితోనే ఇలా ఉంటాడనుకున్నాను. కానీ బయట అందరితో ఇలాగే ఉంటాడని తెలిసింది. ఎక్కడికి వెళ్ళినా అందరూ తనని స్పెషల్గా చూడాలనుకుంటాడు. ఆయన చుట్టాల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో ఆయన్ని ‘డబ్బారాయుడు’ అంటారట. ఆఫీస్లో కూడా అందరితో ఇలా మాట్లాడు తున్నాడని తెలిసి ఆయనకి వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా ఆయన ప్రవర్తన మార లేదు. కిందపడ్డా తనదే పై చేయి అంటాడు. ఈ మధ్య నా కజిన్ పెళ్ళికి వెళ్తే అక్కడ తనకంటే ఆపెళ్ళి కొడుకుకి ఎక్కువ మర్యాదలు చేస్తున్నారని అలిగి వచ్చేశాడు. ఎవరైనా చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు. ఆయనని ఎలా అర్థం చేసుకోవాలో తెలీట్లేదు. ఇలాంటి వ్యక్తితో నేను జీవితాంతం ఉండగలనా అనిపిస్తోంది! – అలేఖ్య, చిత్తూరుమీరు చెప్పిన విషయాలు చదివిన తరువాత మీ భర్తకి ఉన్న పర్సనాలిటీ సమస్య వల్ల మీరు తీవ్రమైన ఒత్తిడి, అసౌకర్యానికి గురవుతున్నారని అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు గురించి ఆందోళన సహజమే. మీ భర్త తనని గొప్పగా ప్రదర్శించుకోవడం, ఇతరుల్ని చిన్నచూపు చూడడం, విమర్శలను ఒప్పుకోకపోవడం, అందరిపై తానే మెరుగ్గా ఉండాలని కోరుకోవడం, తాను చాల గొప్పవాడిననే భావన, ఇతరుల భావాల పట్ల ఎంపతీ లేకపోవడం) ఇవన్నీ ‘నార్సిసిస్టిక్‘ వ్యక్తిత్వ లక్షణాలుగా పేర్కొనవచ్చు. తమ తప్పులకి అవతలి వాళ్ళని బాధ్యులుగా చేసి గిల్టీగా ఫీల్ అయ్యేలా చేసే ‘గ్యాస్ లైటింగ్’ అనే పద్ధతిని వీళ్ళు ఎక్కువగా వాడతారు. ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్ ఈ పర్సనాలిటీ సమస్య జన్యుపరమైన కారణాలు, పెంపక లోపాలు, బాల్యంలో వారు పెరిగిన పరిస్థితుల వలన రావచ్చు. స్త్రీల కంటే పురుషుల్లో ఎక్కువగా ఈ సమస్యను చూస్తాము. వాళ్ళకు తాము ఏదైనా సమస్యతో ఉన్నామనే ఎరుక ఉండదు. అందువల్ల వీరికి చికిత్స చేయడం కూడా చాలా కష్టం. వారిలో మారాలనే ఆలోచన ఎంతో కొంత ఉంటే సైకోథెరపీ ద్వారా కొంతమార్పు తీసుకురావచ్చు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరసీ’ ద్వారా తన ఆలోచనల్ని, ప్రవర్తనల్ని మార్చుకోవచ్చు. కానీ ఇది కాస్త సమయంతో కూడుకున్న వ్యవహారం. మీరు ఇద్దరూ కలిసి కౌన్సెలింగ్ తీసుకుంటే సహజంగానే మీ బంధాన్ని మెరుగుపర్చుకోవచ్చు. కానీ దానికి కూడా అతను సహకరించాల్సిన అవసరం ఉంది.‘నార్సిజం’కు ప్రత్యేకంగా మందులు లేవు. కానీ వీరిలో డిప్రెషన్, ఆందోళన లేదా కోపం లాంటి సమస్యలు ఉంటే వాటికి మానసిక వైద్యులు మందులు సూచిస్తారు. అయితే వీరితో జీవితాంతం కలిసి ఉండవచ్చా అనే ప్రశ్న చాలా సంక్లిష్టమైనది. కొంత కష్టమే అయినా మీరు అతన్ని అతనిలా అంగీకరించగలిగితే కలిసి ఉండొచ్చు. కానీ కొన్నిహద్దులు ఏర్పాటు చేసుకోవాలి. మీ ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తిస్తే మీరు అతనికి ఆ విషయాన్ని చెప్పగలగాలి. మీరు మానసికంగా దృఢంగా ఉండాలి. చివరిగా మీకు నాదొక సలహా. పొగడ్తకి లొంగని మనిషి లోకంలో లేరు. అలాంటిది మీ భర్తకు పొగడ్తే ఆహారం, నీరు అన్నీ! అప్పుడప్పుడూ మీరే అతన్ని పొగిడితే అతనూ సంతోషంగా ఉంటాడు. మీరూ కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు. మీ లాంటి ‘సైలెంట్ సఫరర్స్’ లోకంలో చాలామందే ఉన్నారు. విడిపోవడం చాలా సులభం, కానీ కలిసి ఉండాలంటే మీవైపునుండి కొంత సర్దుబాటు, ఓర్పు, త్యాగం అవసరం. గట్టి ప్రయత్నంతో చాలా సమస్యలు సర్దుకుంటాయి. ప్రయత్నిస్తే పోయేది ఏం లేదు. ఆల్ ది బెస్ట్!-డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడమీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీకsakshifamily3@gmail.com
ఫొటోలు
అంతర్జాతీయం

లూటీ.. విధ్వంసం.. కర్ఫ్యూ
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో సరైన పత్రాలులేని వలసదారుల అరెస్ట్లతో మొదలైన ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. మంగళవారం రాత్రి ఆందోళనకారులు వేల సంఖ్యలో పాల్గొని తమ ఉద్యమాన్ని మరింత ఉధృతంచేశారు. అయితే దీనిని అదునుగా చూసుకుని కొందరు దుండగులు ముసుగులు ధరించి లాస్ఏంజెలెస్ డౌన్టౌన్లో లూటీలకు తెరలేపారు. యాపిల్ ఐఫోన్ స్టోర్సహా పలు దుకాణాలపై దాడులు చేసి లూటీలు చేశారు. విలువైన వస్తువులను అందినకాడిని దోచుకెళ్లారు. ఉద్యమంవేళ యథేచ్ఛగా లూటీలు, విధ్వంసం జరగడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దుకాణ సముదాయాల నుంచి పారిపోతున్న ముసుగు ధరించిన దుండగులను అరెస్ట్చేశారు. పలువురు ఆందోళనకారులను సైతం అరెస్ట్ చేసినట్లు వార్తలొచ్చాయి. దుకాణాలను యువకులు లూటీలు చేస్తున్న వీడియోలు ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్గా మారాయి. గత నాలుగు రోజుల్లో మొత్తంగా 23 పెద్ద వ్యాపార సముదాయాలు లూటీకి గురయ్యాయని లాస్ ఏంజెలెస్ నగర మహిళా మేయర్ కరెన్ బాస్ చెప్పారు. నగరంలో తాత్కాలిక కర్ఫ్యూస్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటలదాకా పాక్షిక కర్ఫ్యూను విధిస్తున్నట్లు మేయర్ కరెన్ ప్రకటించారు. ప్రతిరోజూ ఇదే సమయానికి కర్ఫ్యూను అమలుచేయనున్నారు. ఇలా కొద్దిరోజులపాటు పాక్షిక కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. లూటీలు, విధ్వంసానికి పాల్పడిన వారికి గుర్తిస్తూ పోలీసులు అరెస్ట్లపర్వాన్ని మొదలెట్టారు. అడ్డొచ్చిన వారిపైకి రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. డౌన్టౌన్ జిల్లాలోని ఆర్ట్స్ డిస్ట్రిక్, చైనా టౌన్, స్కిడ్ రో, ఫ్యాషన్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో కర్ఫ్యూను అమలుచేశారు. కర్ఫ్యూ మొదలయ్యాక కనీసం 200 మందిని పోలీసులు అరెస్ట్చేశారని మేయర్ ప్రకటించారు. లాస్ఏంజెలెస్ 2,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించగా అత్యధిక లూటీలు, విధ్వంసం జరిగిన 2.5 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే రాత్రి కర్ఫ్యూను అమలుచేస్తామని నగర పోలీస్ చీఫ్ జిమ్ మెక్డోనెల్ చెప్పారు. నగరంలో మరింత ఉద్రిక్తంగా మారడానికి ట్రంప్ ‘నేషనల్ గార్డ్’ తరలింపు’ నిర్ణయమే కారణమని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆరోపించారు. సైనికఛత్రంలోకి నగరాన్ని ఇరికించి సమస్యను జటిలంచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై ట్రంప్ స్పందించారు. ‘‘ఆందోళనకారులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. దేశానికి శత్రువుల్లా తయారయ్యారు. అల్లరిమూకల అరాచకత్వం ఇక ఎంతమాత్రం సాగనివ్వను. అవసరమైతే తిరుగుబాటు అణచివేత చట్టం,1807ను తీసుకొచ్చి యావత్ సైన్యాన్ని రాష్ట్రంలోకి దింపుతా. లాస్ ఏంజెలెస్లో ఇలాగే అల్లర్లు, ఆందోళనలు కొనసాగితే సిటీని రాష్ట్ర పాలన పరిధి నుంచి తప్పించి కేంద్రప్రభుత్వ అధీనంలోకి తీసుకొస్తా’’ అని శ్వేతసౌధంలో ట్రంప్ హెచ్చరించారు.కోర్టులో గవర్నర్కు చుక్కెదురున్యూయార్క్ గవర్నర్ అనుమతిలేకుండా అసా ధారణ అధికారాలతో లాస్ ఏంజెలెస్లోకి నేషనల్ గార్డ్, మెరైన్లను పంపుతూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం నిలుపుదలచేయాలన్న న్యూయార్క్ అటార్నీ అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. ఈ అంశాన్ని గురువారం మరోసారి పరిశీలిస్తామని శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా కోర్టు జడ్జి చార్లెస్ బ్రేయర్ చెప్పారు. మరోవైపు భద్రతా బలగాల మోహరింపు మున్ముందు మరింత ఎక్కువగా ఉంటుందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. ఇప్పటికే నేషనల్గార్డ్, మెరైన్లను రప్పించినందుకు ఏకంగా రూ.1,146 కోట్లు ఖర్చయిందని ఆయన వెల్లడించారు. అక్రమవలసదారుల కోసం గాలింపు, అరెస్ట్ విధుల్లో ఉన్న ఫెడరల్ ఏజెంట్లు, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారుల రక్షణ, కేంద్రప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను మాత్రమే నేషనల్ గార్డ్లకు అప్పగించడంతో వాళ్లు ఆందోళనకారులను అరెస్ట్చేయట్లేదు. అరెస్ట్చేసే అధికారం వీళ్లకు లేదు. దీంతో నిరసనకారులు రెచ్చిపోతున్నారు. ఈ సందర్భంగానే ముసుగు ధరించిన ఆగంతకులు లూటీలు చేయగలిగారు.ఇతర నగరాల్లో ఆందోళనలుకర్ఫ్యూతో లాస్ ఏంజెలెస్లో ఉద్రిక్తత రాత్రివేళ కాస్తంత తగ్గుముఖం పట్టినా ఇతర నగరాల్లో మాత్రం ఉధృతంగా కొనసాగుతోంది. శాన్ ఫ్రాన్సిస్కో మొదలు సియాటెల్, న్యూయార్క్, షికాగో, డెన్వర్, శాంటా అనా, ఆస్టిన్, డాలస్, బోస్టన్, వాషింగ్టన్ డీసీదాకా చాలా ప్రధాన నగరాల్లో వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి చేరి ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు కొనసా గిస్తున్నారు. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు తక్కువ ప్రాణహాని ఉండే ఉపకరణాలనే వాడుతున్నారు. భాష్పవాయు గోళాలు, పెప్పర్ స్ప్రే, టేజర్, లాఠీలు, జల ఫిరంగులు, చెవులు చిల్లులు పడే శబ్దాలు వెదజల్లే పరికరాలు, రబ్బర్బుల్లెట్లు బీన్–బ్యాంగ్ రౌండ్లను ప్రయోగిస్తున్నారు.టిక్టాక్ స్టార్పై బహిష్కరణ వేటు16.24 కోట్ల మంది టిక్టాక్ ఫాలోవర్లు ఉన్న ప్రఖ్యాత ఇన్ఫ్లుయెన్సర్ ఖబీ లేబ్ను సైతం అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు దేశం నుంచి వెళ్లగొట్టారు. వీసా గడువు ముగిశాక సైతం అమెరికా ఉంటున్నందుకు ఆయనపై బహిష్కరణ వేటు వేశారు. దీంతో ఆయనే స్వయంగా అమెరికాను వీడారని వార్తలొ చ్చాయి. సెనెగల్– ఇటాలియన్ మూలాలున్న ఇతను చేసే టిక్టాక్ వీడియో లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇతను యూనిసెఫ్ గుడ్విల్ అంబాసి డర్గా ఉన్నారు. మరోవైపు టెక్సాస్ రాష్ట్రంలోనూ నేషనల్ గార్డ్లను రప్పించామని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ చెప్పారు.

OP Sindoor: పాక్ కవర్ డ్రైవ్ .. భలే బెడిసి కొట్టిందిగా!
ఆపరేషన్ సిందూర్ ఓ విఫల ప్రయత్నమని.. పైగా తాము జరిపిన ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్తో భారత్కు భారీగా నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ నెల రోజులుగా ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఫేక్ ఫొటోలతో, అసత్య ప్రచారాలతో ప్రపంచ దేశాల దృష్టిలో నవ్వులపాలు అవుతూ వస్తోంది. తాజాగా మరోసారి అదే రిపీట్ అయ్యింది.అబ్బే.. భారత సైన్యం అసలు తమ ఎయిర్బేస్లపై దాడులే జరపలేదని పాక్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ దాడులను కవరింగ్ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు బయటపడింది. ఆపరేషన్ సిందూర్లో మురిద్, జాకోబాబాద్, భోళరిలో మిలిటరీ స్థావరాలను భారత్ నాశనం చేసింది. అయితే ధ్వంసమైన ఈ ఎయిర్బేస్లను టార్పలిన్(tarpaulin)లతో కప్పి దాచేసే ప్రయత్నం చేసింది పాక్. ఇండియా టుడే జరిపిన శాటిలైట్ చిత్రాల విశ్లేషణలో అవి పైకప్పు కాదని, టార్ఫలిన్లు అని తేలింది. అదీ వాటి పైకప్పు ఆకుపచ్చ, గోధుమ రంగులో మ్యాచ్ అయ్యేలా చూసుకుంది పాక్ ఆర్మీ. అయినప్పటికీ శాటిలైట్ చిత్రాల ద్వారా విషయం బయటపడింది. 'ది ఇంటెల్ ల్యాబ్'కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. దాడి తర్వాత దెబ్బతిన్నవాటిని పునరుద్ధరించకుండానే.. కేవలం టార్పలిన్తో కవర్ చేశారని సోషల్మీడియాలో ఆయనొక పోస్ట్ చేశారు. ఇదంతా చూస్తున్న కొందరు బాలీవుడ్ అభిమానులు.. పర్దే మేన్ రహ్నే దో, పర్దా న ఉటావో అంటూ పాట పాడుతూనే.. పర్దా తొస్తే అసలు విషయం బయటపడుతుందంటూ పాక్ను ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు.. పాకిస్థాన్ ఆర్థికాభివృద్ధిని పణంగా పెట్టి.. ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిపెట్టింది. దేశ రక్షణ బడ్జెట్ను 20 శాతం పెంచింది. ఏకంగా 9 బిలియన్ డాలర్లకు కేటాయించింది. షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ డిమాండ్లను సంతృప్తిపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ బడ్జెట్లో పెంచిన నిధులతో ఆపరేషన్ సిందూర్లో దెబ్బతిన్న టెర్రర్ క్యాంప్లను మళ్లీ పునరుద్ధరించనుందని తెలుస్తోంది.Nearly a month after India’s strikes in Pakistan, a review by India Today shows craters now concealed & hangars patched with tarpaulin, the visual indicators of damage remain, masked but not restored Read here - https://t.co/r8blLp5Kk1 pic.twitter.com/VzlJGQ6DcA— Damien Symon (@detresfa_) June 11, 2025

ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన ఎలాన్ మస్క్.. యూటర్న్ ఇలా..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులను ప్రపంచమంతా చూసింది. వీరిద్దరి వ్యవహార శైలితో ఏమి జరుగుతుందోనని అమెరికన్లు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇప్పుడు దీనికి భిన్నమైన సంగతి ఆసక్తికరంగా మారింది. బిలియనీర్ ఎలాన్ మస్క్ తాజాగా తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో సోషల్ మీడియా చేసిన పోస్ట్లలో కొన్నింటిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘గత వారం అధ్యక్షుడు @realDonaldTrump గురించి నేను చేసిన కొన్ని పోస్ట్ల విషయంలో చింతిస్తున్నాను. అవి చాలా దుమారం రేపాయి’ అని మస్క్ ‘ఎక్స్’లో రాశారు. I regret some of my posts about President @realDonaldTrump last week. They went too far.— Elon Musk (@elonmusk) June 11, 2025ట్రంప్ పరిపాలనా విభాగం తీసుకువచ్చిన కీలక వ్యయ బిల్లును మస్క్ తీవ్రంగా విమర్శించిన తరువాత వీరిద్దిరి మధ్య వైరం మరింత ముదిరింది. దేశీయ ఎజెండాకు మద్దతునిచ్చే వ్యయ బిల్లుకు సహకరించే రిపబ్లికన్ చట్టసభ సభ్యులపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలని మస్క్ పిలుపునివ్వడం అధ్యక్షుడు ట్రంప్కు ఆగ్రహం కలిగించింది. ట్రంప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బడ్జెట్ బిల్లుకు ఓటు వేసే రిపబ్లికన్లపై చర్యకు ప్రయత్నిస్తే, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని తన మాజీ సలహాదారు ఎలాన్ మస్క్ను హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: ‘కొండ మీంచి తోసేస్తా’.. సోనమ్ ‘ప్లాన్ బీ’

కెన్యాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి
దోహా: ఖతార్లో నివసిస్తున్న ఐదుగురు భారతీయులు కెన్యాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను దోహాలోని భారత రాయబార కార్యాలయం మంగళవారం వెల్లడించింది.విహారయాత్రలో భాగంగా 28 మంది ప్రవాసభారతీయుల బృందం ఖతార్ నుంచి కెన్యాకు వెళ్లింది. కెన్యాలోని నయాందారూ కౌంటీలో ఒల్ జొరోరోక్–నకూరూ రోడ్డులో వీళ్లు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. విషయం తెల్సుకున్న నైరోబీలోని భారత హైకమిషన్ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లారు.మృతదేహాల తరలింపు, క్షతగాత్రులకు సహాయక కార్యక్రమాల్లో అధికారులు నిమగ్నమయ్యారని దోహాలోని ఇండియన్ ఎంబసీ తెలిపింది. రోడ్డుపై అదుపు తప్పిన పర్యాటకుల బస్సు పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని ది గల్ప్ టైమ్స్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. చనిపోయిన ఆరుగురి వివరాలు ఇలా ఉన్నాయి. మృతుల్లో ఐదుగురు కేరళకు చెందిన వారుగా గుర్తించారు.మావెలిక్కరకు చెందిన గీతా షోజి ఐజాక్ (58), జస్నా కుట్టిక్కట్టుచలిల్ (29), రూహి మెహ్రీ ముహమ్మద్ (18 నెలలు), ఒట్టప్పలంకు చెందిన రియా ఆన్ (41), టైరా రోడ్రిగ్స్ (8)లు గుర్తించారు. రియా భర్త జోయెల్ మరియు ఆమె పెద్ద కుమారుడు రవిస్ (14) గాయాలతో న్యాండరువాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక, ఈ ప్రమాదంలో గాయపడిన ప్రవాసభారతీయులను దగ్గర్లోని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. ⚠️ A tragic road accident occurred in central Kenya, where a bus carrying tourists rolled over, resulting in six fatalities and 27 injuries.Location — The accident took place at Gichaka, along the Ol Jororok-Nakuru road in Nyandarua County.Cause — The exact cause of the bus… pic.twitter.com/QsNRk7o5cq— Sir Adam ™ (@AdamMaina_) June 10, 2025
జాతీయం

లక్షల్లో సంపాదన.. ఇస్మార్ట్ ఆటోవాలాకు బిగ్ షాక్
ఆటో నడపకుండానే.. కత్తిలాంటి ఐడియాతో నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడంటూ ఓ ఆటోవాలా గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. నిజనిర్ధారణలోనూ.. అది వాస్తవమేనని తెలిసేసరికి వహ్ అనుకున్నారంతా. ప్రముఖులు సైతం బ్రిలియంట్ అంటూ మెచ్చుకున్నారు. అయితే ఆ ప్రచారమే ఇప్పుడు అతని పాలిట శాపంగా మారింది. లింక్డిన్లో వెన్యూమోంక్ కో ఫౌండర్ రాహుల్ రుపానీ ఆ ఆటోడ్రైవర్ కథనాన్ని షేర్ చేశారు. బంద్రాకుర్లా కాంప్లెక్స్లోని యూఎస్ కన్సులేట్ బయట ఆటోను పార్క్ చేసి.. వచ్చిపోయే సందర్శకుల సామాన్లను క్లాక్ రూమ్ తరహాలో ఆటోలో భద్రపరిచి సంపాదన చేస్తున్నాడతను. అలా ఒక్కో కస్టమర్ దగ్గరి నుంచి రూ.1000 చొప్పున.. నెలకు రూ.ఐదు లక్షల నుంచి 8 లక్షల దాకా సంపాదిస్తున్నాడంటూ ఆయన స్టోరీ షేర్ చేశారు. హర్ష్ గోయెంకాలాంటి ప్రముఖులు సైతం ఆ ఆటోవాలా బుర్రకు ఫిదా అయిపోయారు.అయితే అతని కథనాలకు ముంబై పోలీసులు స్పందించారు. ఆ ఆటో డ్రైవర్ లాగే మరో 12 మంది అక్కడే అదే పనిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. తక్షణమే ఆ జాగా ఖాళీ చేయాలంటూ అందరికీ సమన్లు జారీ చేశారు. ‘‘యూఎస్ కన్సులేట్ బయట భద్రతా కారణాల దృష్ట్యా పార్కింగ్ నిషేధిస్తున్నాం. ఆటో డ్రైవర్లు కేవలం ప్యాసింజర్లను అక్కడ దించి వెళ్లిపోవాలే తప్ప ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు రావడంతో ముంబై పోలీసులు మళ్లీ స్పందించారు. ‘‘ఆ ఆటో డ్రైవర్కు లైసెన్స్ ఇచ్చింది ఆటో నడుపుకోవడానికి. అంతేగానీ లాకర్ సేవలు అందించడానికి కాదు. అతను మాత్రమే కాదు.. అతనిలా మరికొందరు డ్రైవర్లు అదే పనిలో ఉన్నారని మా విచారణలో తేలింది. కేవలం డ్రైవర్లకు మాత్రమే కాదు.. సమీపంలోని దుకాణాదారులకు కూడా లాకర్ సర్వీసులు నడిపించేందుకు అనుమతులు లేవు. ఒకవేళ ఎవరైనా అలా నడిపిస్తే కఠిన చర్యలు తప్పవు’’ అని ముంబై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పాపం.. బ్రిలియంట్ ఐడియాతో వైట్ కాలర్ జీతగాళ్లకు కూడా దక్కని సంపాదనతో బిజినెస్ చేస్తున్నాడని పొగిడేలోపే ఆ ఆటో డ్రైవర్కు బిగ్ షాక్ తగిలింది.

హాస్టల్పై కూలిన విమానం.. 20 మంది మెడికల్ స్టూడెంట్స్ మృతి!
గాంధీనగర్: గుజరాత్ అహ్మదాబాద్లోని ఘోర విషాదం చోటు చేసుకుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం 110 మంది ప్రయాణికులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం.ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరని ఎయిరిండియా విమానం మేఘాని నగర్లోని బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ (BJ Medical College Hostel) భవనంపై విమానం కూలింది. ఈ విమాన ప్రమాదంలో 20మంది వైద్య విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. భోజనం సమయం కావడంతో హాస్టల్లోనే పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల మరణాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. Air India plane crashed directly on the BJ Medical College UG hostel mess in Meghani Nagar, Ahmedabad.#AirIndiaflight#ahmedabad#gujarat pic.twitter.com/mBAC7Psoys— RajawardhanReddy.Mule (@RajawardhanRed2) June 12, 2025 ⚡ As per initial reports the Air India plane crashed directly on the BJ Medical College UG hostel mess in Meghani Nagar, Ahmedabad. More details awaited pic.twitter.com/duJTCL1YTn— OSINT Updates (@OsintUpdates) June 12, 2025 #WATCH | Air India plane crash: "My son had gone to the hostel during lunch break, and the plane crashed there. My son is safe, and I have spoken to him. He jumped from the second floor, so he suffered some injuries,” says Ramila, who reached the civil hospital in Ahmedabad,… pic.twitter.com/MgMtvXBSou— ANI (@ANI) June 12, 2025

కుప్పకూలిన ఎయిరిండియా విమానం.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిరిండియా (Air India) విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదంలో వంద మందికి పైగా మృతి చెంది ఉంటారని తెలుస్తోంది. కుప్పకూలిన వెంటనే విమానం పేలిపోగా.. దట్టంగా పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్ 787-7 డ్రీమ్ లైనర్ విమానం బయల్దేరింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే.. 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానిక గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే.. అదీ ఎయిర్పోర్ట్ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు డీజీసీఏ ప్రకటించింది. ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. Terrifying final moments of Air India Flight AI 171 crashing into a residential area in Ahmedabad today. Clearly catastrophic loss of lift. Details awaited. pic.twitter.com/TbgCjPLXXc— Shiv Aroor (@ShivAroor) June 12, 2025

ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
గాంధీ నగర్: గుజరాత్ రాష్ట్రం అహ్మాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ పెను విషాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్టు కేంద్ర మంత్రి, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ అధికారికంగా ప్రకటించారు. (విమాన ప్రమాదానికి ముందు మాజీ సీఎం విజయ్ రూపానీని సెల్ఫీ తీసిన తోటి ప్రయాణికురాలు)ప్రమాదంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాద బాధితుల్లో విజయ్ రూపానీ ఉన్నారు. ‘మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన కుటుంబాన్ని కలవడానికి (లండన్) వెళ్తున్నారు. ఈ సంఘటనలో ఆయన కూడా బాధితుడే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఇది బిజెపికి పెద్ద నష్టం’అంటూ సీఆర్ పాటిల్ విచారం వ్యక్తం చేశారు. VIDEO | Ahmedabad Plane Crash: Union Minister and Gujarat BJP president, CR Patil (@CRPaatil) confirms former Gujarat CM Vijay Rupani's demise. Speaking to reporters, he says, "Our leader and former Chief Minister, Vijay Rupani, was going (to London) to meet his family. He is… pic.twitter.com/5c1VIk8KIb— Press Trust of India (@PTI_News) June 12, 2025 పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అహ్మదాబాద్లో కూలిన ఎయిరిండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు తేలింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో విజయ్ రూపానీ 12వ ప్రయాణికుడు. జెడ్ క్లాస్లో రూపానీ టికెట్ బుక్ చేసుకున్నారనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి మధ్యాహ్నం 1:10 గంటలకు సర్వీస్ ఉంది. ఆ విమానం టేకాఫ్ అయిన రెండు నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగే సమయంలో విమానంలో సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారు. విమానంలో 242 మంది: డీజీసీఏఅహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్రమాద సమయంలో విమానంలో ఉన్నారు.Ahmedabad Plane Crash: Video captured exact moment Air India's AI -171 passenger aircraft crashed near Meghnaninagar area earlier today.(Disclaimer: PTI can not verify the authenticity of the video)(Source: Third party) pic.twitter.com/qAK8aP6wGH— Press Trust of India (@PTI_News) June 12, 2025విమానంలో 169 మంది భారతీయులు, 53 మంత్రి బ్రిటన్, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు ఎయిరిండియా ఎక్స్ వేదికగా వెల్లడించింది.ప్రమాదానికి గురైన విమానం వైడ్బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300మంది ప్రయాణించవచ్చు. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉండడంతో ప్రమాదం స్థాయి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్ఆర్ఐ

న్యూయార్క్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవతరణ వేడుకలతో పాటు బాలోత్సవ్ ను నిర్వహించారు. బెత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ ఉత్సవాలకు న్యూయార్క్ మెట్రో ప్రాంతంలో నివసించే తెలుగు ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గసభ్యులు మంచి ఏర్పాట్లు చేయటంలో వేడుకలు చాలా ఉత్సాహంగా జరిగాయి. అభివృద్ది పథంలో పయనిస్తున్న తెలంగాణ మరింత ఎదగాలని సమావేశంలో మాట్లాడిన పలువురు ఎన్ఆర్ఐలు ఆకాంక్షించారు. సింగర్స్ సృష్టి చిల్ల, వందేమాతరం తరంగ్ తమ ఆటపాటలతో ఉత్సవాలకు మరింత ఊపును తెచ్చారు. బాలోత్సవ్లో భాగంగా ప్రవాసుల పిల్లలు తమ స్కిల్స్, టాలెంట్ షోతో ఆకట్టుకోవటంతో పాటు ఆడిపాడి అల్లరి చేశారు. నృత్యాలు, పాటలు, మ్యాజిక్ షో, మిమిక్రీ ఇలా పలు రకాల పోటీలు ఉత్సవాలకు ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు నైటా తరపున బహుమతులు అందించారు.కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, నైటా వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, సెక్రటరీ హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ నరోత్తం రెడ్డి బీసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, లక్ష్మణ్ రెడ్డి అనుగు, అడ్వైజరీ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.చదవండి: న్యూజిలాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

Dallas: తెలుగు విద్యార్థులకు అండగా బీఆర్ఎస్
డల్లాస్: అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు అండగా ఉంటామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. టెక్సాస్ స్టేట్లోని డల్లాస్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో(Telangana Formation Day) పాల్గొని ప్రసంగించారాయన. డల్లాస్ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్(KTR) మాట్లాడుతూ..‘అసాధ్యం అనుకున్న రాష్ట్ర సాధనను ఢిల్లీ మెడలు వంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ సాకారం చేశారు. మూడేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. 2001లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కలగన్నాడు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహనీయుల స్పూర్తితో సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించాడు. తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ నెరవేర్చారు. జూన్ 2.. 60 ఏండ్ల కల నిజమైన రోజు! దశాబ్దాల ఆశయాలు.. ఆశలు.. ఆకాంక్షలు.. కలలు ఫలించిన రోజు!అసాధ్యాలను సుసాధ్యం చేయడమే తెలంగాణ స్టైల్. అసంభవం అనుకున్న ఎన్నో కార్యాలను సంభవం చేసి చూపించింది తెలంగాణ, దేశానికి దిక్సూచిగా మారింది. దశాబ్దాలుగా స్థిరపడ్డ పెద్ద పెద్ద రాష్ట్రాలను… pic.twitter.com/LkVA8BXOZL— BRS Party (@BRSparty) June 2, 2025.. నిన్నటి వరకు తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాలే ఉన్నాయి అనుకున్నాను.. కానీ నాకు నిన్ననే అర్థం అయింది మనకి రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయని.. అది టెక్సాస్లో ఉంది. అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్(BRS Legal Cell) ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: అదే స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగించాలి: కేసీఆర్

న్యూజిల్యాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరం లో “న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ “ ఆధ్వర్యం లో జై తెలంగాణ నినాదాలతో “తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుక”లను ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర సాధనలో ఆత్మార్పణం చేసిన అమరవీరులకు నివాళి అర్పించి, అమరవీరుల తల్లులకి మరియు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది.అసోసియేషన్ అధ్యక్షులు “కోడూరి చంద్రశేఖర్” అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా “Dr.మోహన్ కుమార్ సేథి” ముఖ్య అతిధి గా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసారుఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత దేశానికి సుదూరాన ఉన్నప్పటికీ న్యూజిలాండ్ నేల మీద తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నెలకొల్పి భావి తరాలకి అందించడానికి సహృద్భహ వాతావరణాన్ని కల్పించి సహకరిస్తున్న న్యూజీలాండ్ ప్రభుత్వానికి , దేశ వాసులైన మౌరి సమాజానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు అలాగే ఈ మధ్య నూతనంగా ఆక్లాండ్ నగరం లో ఇండియన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని నెలకొల్పి కాన్సులేట్ సేవలని అందిస్తున్నందుకు నిండు సభలో ప్రత్యేక తీర్మానం ద్వారా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ చేశారు. తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు సభలో కాన్సులేట్ జనరల్ తో పాటు అసోసియేషన్ కి విశేష సేవలు అందించిన గత కార్యవర్గ సభ్యులని సన్మానించి మెమెంటోస్ అందించడం జరిగిందిప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల గారు సభకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపిన ఈ కార్యక్రమం లో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు “పట్లోళ్ల నరేందర్ రెడ్డి,మేకల ప్రసన్న కుమార్ తో పాటు ప్రవాస భారతీయ ప్రముఖులైన శివ కిలారి,సత్యనారాయణ తట్టల, రాజేంద్ర ధరణికోట, ప్రదీప్ మేడసాని, రోహిత్ తమ్మినేని, లెజెండరీ మార్టుగేజ్ ప్రతినిధులు, దయానంద్ కటకం,జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్ల,విజేత యాచమనేని, శైలజ బాలకుల్ల, మధు ఎర్ర, శశికాంత్ గున్నల, లింగం గుండెల్లి, కావ్యా మాశెట్టి, వర్ష పట్లోళ్ల, స్వాతి గుడిమెళ్ళ,కిరణ్మయి పద్మ,విశ్వనాథ్ అవిటి,సందీప్ నాగుల,పవనకుమార్ చారుకొండ,సలీం మహమ్మద్,హరీష్ గోపాల్,మనోహర్ కన్నం,కిరణ్ కుమార్ కొమ్ముల,రమేష్ రెడ్డి రామిండ్ల,శ్రీరామ్ విజయ్,శ్రీనివాస్ గాజుల,ప్రమోద్ ఇరుగు,అనిల్ మెరుగు,రమేష్ ఆడెపు,రవి కుమార్ వట్టం,విజయకుమార్ రెడ్డి చింతిరెడ్డి తదితరుల తో పాటు పెద్దఎత్తున తెలంగాణ ప్రజానీకం హాజరయ్యారు.

అబుదాబిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అబుదాబి :తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అబు ధాబిలోని ఇండియా ఎంబసీ వేదికగా ఎంతో వైభవంగా నిర్వహించబడింది. తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ - అబుధాబి ఆధ్వర్యంలో జయప్రదంగా సాగిన ఈ వేడుక తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ వేడుకకు ప్రేం చంద్, కాన్సులర్(కౌన్సిలర్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు, గౌరవ అతిథులుగా కుమారి ఆయుషి సుతారియా, సెకండ్ సెక్రటరీ (పాలిటికల్) పాల్గొన్నారు. వీరి సమక్షంలో దీపప్రజ్వలన కార్యక్రమం నిర్వహించబడింది.తెలంగాణ పిల్లలు భారత మరియు యుఏఈ జాతీయ గీతాలు, తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి దేశభక్తిని ప్రతిబింబించారు. అనంతరం తెలంగాణ బాలికలు మరియు మహిళలు శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా వేడుకకు కొత్త అందాన్ని తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సహకారంతో, ధరావత్ రాజ్కుమార్ నేతృత్వంలో వచ్చిన ప్రతినిధి బృందం పేరిణి శివ తాండవం, గుస్సాడి నృత్యం, పోతరాజు, మరియు ఇతర సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. ఈ కళారూపాలు, వేడుకలో తెలంగాణ సాంస్కృతిక సంపదను మధురంగా ప్రతిబింబించాయి.ప్రత్యేకంగా, తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు - పావని, అర్చనా, లక్ష్మి తమ కృషితో తెలంగాణ కళా సంపదను ప్రతిబింబించే చిత్ర ప్రదర్శన వేడుకలకు మరింత ఆకర్షణ గా నిలిచింది. ఎంబసీ ప్రాంగణం తెలంగాణను తలపించేలా అలంకరించబడింది. తెలంగాణ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఇంతే కాదు, డప్పు కళాకారుల దరువు వేడుక లో మరింత ఉత్తేజం నింపింది. డప్పు కళాకారులు, పోతరాజు కళాకారులు, గుస్సాడీ కళాకారులు మరియు పేరిణి శివ తాండవం కళాకారులు కలిసి చేసిన జుగల్ బంది ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. ఈ సందర్భంగా తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్, ఎంబసీ అధికారులను ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సంబరాలలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల సంఘాల నాయకులను మరియు ఇతర సాంఘిక సేవ సంఘం నాయకులను శాలువా కప్పి మరియు మొమెంటో ప్రధానం చేసి సత్కరించారు. అలాగే కార్యక్రమం లో పాల్గొన్న కళాకారులందరికి జ్ఞాపికలు ఇచ్చి సన్మానించారు.. ఈ వేడుక అబూదాబి లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు చిరస్థాయిగా నిలిచిపోవలసిన జ్ఞాపకంగా మారింది అని అసోసియేషన్ కార్య నిర్వాహకుడు రాజా శ్రీనివాస రావు తెలియ జేశారు.వేడుకల తదనంతరం కార్యక్రమానికి వచ్చిన అతిదులందరికి, కార్య క్రమ నిర్వాహకులు తెలంగాణ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ, మరియు భారత రాయబార కార్యాలయం అందించిన సహాయంతో ఈ వేడుక మరింత వైభవంగా జరిగింది. వేదికను అందుబాటులోకి తీసుకువచ్చిన ఎంబసీ అధికారులకు తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్

మీ బ్యాంకు ఖాతాతో మనీ లాండరింగ్ జరిగింది
సాక్షి, హైదరాబాద్: బెంగళూరుకు చెందిన వృద్ధ దంపతులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేరుతో ‘డిజిటల్ అరెస్టు’చేసిన సైబర్ నేరగాళ్లు రూ.4.79 కోట్లు స్వాహా చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన అక్కడి సైబర్ ఎకనమిక్ అండ్ నార్కోటిక్స్ (సీఈఎన్) పోలీసులు, ఈ నేరంలో హైదరాబాద్కు చెందిన ఇద్దరి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడకు వచ్చిన ప్రత్యేక బృందం బుధవారం వారిని అరెస్టు చేసి తీసుకువెళ్లింది. బెంగళూరుకు చెందిన మంజునాథ్కు గత మార్చిలో బ్యాంకు ప్రతినిధుల పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. మంజునాథ్ పేరు, ఆధార్ నంబర్తో తెరిచిన బ్యాంకు ఖాతాతో మనీ లాండరింగ్ జరిగినట్లు అవతలి వ్యక్తి చెప్పారు. దీనికి సంబంధించి ఈడీ అధికారులు సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, ఆ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసినట్లు చెప్పాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఈడీ అధికారి అవతారం ఎత్తిన మరో సైబర్ నేరగాడు మంజునాథ్ను ఫోన్ చేశాడు. సదరు మనీలాండరింగ్ వ్యవçహారాన్ని తమతో పాటు సీబీఐ అధికారులూ దర్యాప్తు చేస్తు న్నట్లు చెప్పాడు. ఆ బ్యాంకు ఖాతా, నేరంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంజునాథ్ లబోదిబోమన్నాడు. ఆ కేసులో నిందితు లను ఇప్పటికే అరెస్టు చేశామని.. మీరు అనుమాని తులు కావడంతో మీతో పాటు మీ భార్యను డిజి టల్ అరెస్టు చేస్తున్నామని నేరగాడు చెప్పా డు. నిర్దోషిత్వం నిరూపించుకోవడం కోసం తమ అధికా రిక ఖాతాల్లోకి నిర్ణీత మొత్తం బదిలీ చేయా ల్సి ఉంటుందని చెప్పాడు. వెరిఫికేషన్ పక్రియ పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తా మని నమ్మించారు. ఇలా మంజునాథ్, ఆయన భార్య నుంచి రెండున్నర నెలల్లో రూ.4.97 కోట్లు స్వాహా చేశారు. కొన్ని రోజులు ఎదురు చూసినా తన నగదు తిరిగి రాకపోవడంతో పాటు నేర గాళ్లు వాడిన ఫోన్లు పని చేయకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి, బెంగళూరు సౌత్ ఈస్ట్ డివిజన్ సీఈఎన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు ఆ నగదులో కొంత హైదరాబాద్కు చెందిన నారాయణ్ సింగ్ చౌదరి, ఈశ్వర్ సింగ్ పేర్లతో ఉన్న ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. వీరు తరచూ శ్రీలంక వెళ్లి కొలంబోలోని క్యాసినోల్లో జల్సాలు చేస్తున్నట్లు తేల్చారు. కిరాణా దుకాణాలు నిర్వహిస్తున్న వీరు.. తమ పేర్లతో తెరిచిన కరెంట్ ఖాతాలను సూత్రధారులకు ఇచ్చి సహకరిస్తున్నట్లు దర్యాప్తు అ«ధికారులు చెప్తున్నారు.

హనీమూన్ హత్య కేసు: కట్టలు తెంచుకున్న కోపం.. చెంప పగిలింది
ఇష్టం లేని వివాహం చేశారని.. ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీ పక్కా స్కెచ్తో ప్రాణం తీసింది సోనమ్. ఒకవేళ కిరాయి హంతకుల చేతిలో గనుక మిస్ అయితే తానే అతన్ని లోయలోకి తోసేసి ప్రాణం తీసేద్దామని అనకుందట!. ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం, అలాగే ట్రాన్సిట్ వారెంట్ మీద నలుగురు నిందితులను మంగళవారం రాత్రి మద్యప్రదేశ్ పోలీసులు మేఘాలయాకు తరలించారు. అయితే.. ఆ టైంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండోర్ దేవీ అహల్య ఎయిర్పోర్ట్ నుంచి నిందితులను విమానంలో షిల్లాంగ్కు తరలించారు. ఆ సమయంలో ఓ పెద్దాయన బయట లగేజీతో ఎదురు చూస్తున్నాడు. ఏమైందో ఏమోగానీ.. వాళ్లు దగ్గరికి రాగానే హంతకుల్లో ఒకడి చెంప చెల్లుమనిపించాడు. నలుగురికి ముసుగులు వేసి ఉండడంతో ఎవరి చెంప పగిలిందనే దానిపై స్పష్టత కొరవడింది. అయితే అధికారులు ఆ పెద్దాయనను ఏమనకుండా.. నిందితులను వేగంగా లోపలికి తీసుకెళ్లారు. Indore, Madhya Pradesh: At the Indore Airport, a passenger slapped one of the four accused in the Raja Raghuvanshi murder case, who were being escorted by Shillong Police and Indore Crime Branch for a flight to Shillong on transit remand pic.twitter.com/evB5ppJ2I8— IANS (@ians_india) June 10, 2025మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన రాజా రఘువంశీకి సోనమ్కు మే 11వ తేదీన వివాహం జరిగింది. మే 20వ తేదీన ఆ జంట హనీమూన్ కోసం మేఘాలయా వెళ్లింది. మూడు రోజుల తర్వాత బస నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే మేఘాలయా హనీమూన్ జంట మిస్సింగ్ కేసు తొలుత పెద్దగా వార్తల్లో నిలవలేదు. కానీ, ఎప్పుడైతే నవ వధువు సోనమ్ తన భర్తను ప్రియుడు, కిరాయి హంతకుల సాయంతో హత్య చేయించిందని తెలిసిందో .. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. రాజ్సింగ్ కుష్వాహా ఆమె ప్రియుడు కాగా, ఆకాశ్రాజ్పుత్, విశాల్ సింగ్ చౌహాన, ఆనంద్లు సుపారీ హంతకులుగా ఈ హత్యలోభాగం అయ్యారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ప్రియురాలి కోసం సొంతింటికే కన్నం..
ఖిలా వరంగల్: చేసిన అప్పులు తీర్చేందుకు, ప్రియురాలితో కలిసి జల్సాలు చేసేందుకు ఏకంగా తన సొంత ఇంటికే కన్నం వేసిన ఓ ప్రబుద్ధుడు.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అతని నుంచి 11.116 తులాల బంగారం, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ ఏసీపీ నందిరామ్నాయక్.. ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సై శ్రీకాంత్, సురేష్లతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు.ప్రియురాలి కోసం సొంతింటికే కన్నం..ఖిలా వరంగల్ పడమర కోటకు చెందిన గుర్రపు రామకృష్ణ ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య సవితా రాణి, ఒక కుమార్తె శ్రీనిధి, కుమారుడు గుర్రపు జయంత్ ఉన్నారు. జయంత్ హనుమకొండలోని ఓ కళాశాలలో బీబీఏ ఫైనలియర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో అతడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో కలిసి జల్సాలు చేసేందుకు చేతిలో చిల్లి గవ్వలేదు. ఇంటికే కన్నం వేయాలని నిర్ణయించుకున్నాడు. సమయం కోసం చూస్తున్న అతను రామకృష్ణ.. తన తమ్ముడి (జయంత్కు బాబాయి) మనుమరాలు పుట్టినరోజు వేడుకల నిమిత్తం ఆదివారం ఉదయాన్నే హైదరాబాద్కు భార్య, కుమార్తెతో కలిసి వెళ్లారు. కానీ, జయంత్ ఇక్కడే ఉన్నాడు. అదేరోజు రాత్రి రామకృష్ణ ఇంటికి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉండగా.. అందులోని ఆరున్నర తులాల పెద్ద హారం, ఐదున్నర తులాల చిన్నహారం, రెండు తులాల రెండు బంగారు గొలుసులు, రెండు తులాల నెక్లెస్, మొత్తం 16 తులాల ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని గ్రహించి మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా బేగం ఆదేశాలతో వరంగల్ ఏసీపీ నందిరామ్నాయక్ కేసును చాలెంజ్గా తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు శ్రీకాంత్, సురేష్ దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం ఉదయం 9గంటల సమయంలో ఫోర్ట్రోడ్డు జంక్షన్లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా..గుర్రపు జయంత్ పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద 11.16 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.అప్పులు తీర్చి.. మిగతా డబ్బులతో జల్సా..జయంత్ బీబీఏ ఫైనలియర్ చదువుతూనే హైదరాబాద్లో ‘స్టార్ట్స్ ఓన్ వీల్స్’ పేరుతో ఒక ఫుడ్ కోర్ట్ నిర్వహిస్తున్నాడు. వ్యాపారం కలిసిరాక అప్పులపాలయ్యాడు. జయంత్కు కాలేజీలో ఓ గర్్లఫ్రెండ్ ఉంది. చేసిన అప్పులు తీరాలన్నా.. గర్్లఫ్రెండ్తో జల్సాలు చేయాలన్నా డబ్బు కావాలనుకున్న జయంత్.. తన కుటుంబ సభ్యులు ఆదివారం హైదరాబాద్కు వెళ్లగానే ఇంట్లోని బంగారం ఆభరణాలు దొంగిలించాడు. ఆభరణాల్లో కొంత బంగారం కరిగించి అమ్ముదామని వెళ్తుండగా పోలీసులకు చిక్కాడు. అతడినుంచి 5.645 తులాల బంగారు హారం, 5.471 తులాల కరిగించిన బంగారం.. మొత్తం 11.116 తులాల బంగారం, బైక్, ఒక మొబైల్ ఫోన్ స్వా«ధీనం పర్చుకున్నారు. 24గంటల్లో కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు శ్రీకాంత్, సురేష్, సిబ్బంది ప్రవీణ్రెడ్డి, వాజీద్ పాషా, నరేందర్, హోంగార్డ్ రఫీలను ఏసీపీ నందిరామ్నాయక్ అభినందించారు.

అత్త సెల్ఫోన్ అమ్మేసి, ఆపై..
మేడ్చల్−మల్కాజిగిరి జిల్లా: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఘట్కేసర్లో బుజ్జి అనే మహిళ నివాసముంటోంది. బుజ్జికి బాబురావు అనే అల్లుడు ఉన్నాడు. ఈ క్రమంలో అత్త వద్ద ఉన్న మొబైల్ను బాబు రావు తీసుకున్నాడు. డబ్బుల కోసమో మరే ఇతర కారణమో తెలియదు కానీ అత్త మొబైల్ను బాబు రావు అమ్మేశాడు. ఆ తరువాత మొబైల్ ఇవ్వాలని కోరగా.. అమ్మేసినట్లు చెప్పాడు బాబురావు. దీంతో మొబైల్ అమ్మడంపై అల్లుడిని నిలదీసింది అత్త బుజ్జి. మొబైల్ను అమ్మాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నించింది. ఈ విషయంపై అల్లుడు బాబురావు, అత్త బుజ్జి మధ్య గొడవ తలెత్తింది. ఈ విషయాన్ని బాబురావు సీరియస్గా తీసుకున్నాడు. మొబైల్ ఫోన్ కోసం అవమానించారంటూ కోపంతో రగిలిపోయాడు. క్షణికావేశంలో అత్త బుజ్జి గొంతు నులిమాడు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన బుజ్జు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. బుజ్జి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన ఘట్కేసర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్ కోసం అత్తను చంపేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.